రామప్పలో అర్చకుల సమావేశం | Sakshi
Sakshi News home page

రామప్పలో అర్చకుల సమావేశం

Published Tue, May 7 2024 6:55 AM

రామప్పలో అర్చకుల సమావేశం

వెంకటాపురం(ఎం): దేవాదాయ ఽశాఖ సహాయ కమిషనర్‌ ఆదేశాల మేరకు మండల పరిధిలోని రామప్ప దేవాలయంలో సోమవారం జిల్లాకు చెందిన ధూపదీప ఆలయాల అర్చకులు సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఆలయాలను రిజిస్ట్రేషన్‌ చేపించాలని, దేవాలయాల పేరిట భూములు ఉంటే వాటి వివరాలను ఎండోమెంట్‌ శాఖలో నమోదు చేయించాలని డివిజనల్‌ ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌కుమార్‌, రామప్ప ఈఓ బిల్లా శ్రీనివాస్‌ అర్చకులకు సూచించారు. దేవాలయాల పేరు మీద బ్యాంకు ఖాతాలు తెరవాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు ముడుంబా రఘునాథచార్యులు, హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌, ఆలయ సిబ్బంది మార్క సంతోష్‌, అవినాష్‌రెడ్డి, దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement