పథకాలను ప్రజలకు వివరించాలి | Sakshi
Sakshi News home page

పథకాలను ప్రజలకు వివరించాలి

Published Tue, May 7 2024 6:30 AM

పథకాలను ప్రజలకు వివరించాలి

పర్వతగిరి: కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలకు వివరించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌.నాగరాజు అన్నారు. ఈమేరకు మండల కేంద్రంలో సోమవారం గ్రామశాఖ అధ్యక్షులు, బూత్‌ ఇన్‌చార్జ్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. ప్రతీ కార్యకర్త కష్టపడి వరంగల్‌ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించేందుకు పని చేయాలన్నారు. అనంతరం మండల పరిధి వివిధ గ్రామాల నుంచి బీఆర్‌ఎస్‌ నుంచి సుమారు 50 మంది కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్‌రావు, మండల అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్‌నాయక్‌ తదితరులు ఉన్నారు. అనంతరం మండల కేంద్రంలో సోమవారం ఉపాధి హామీ కూలీల పని ప్రదేశానికి వెళ్లి ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌.నాగరాజు

Advertisement
Advertisement