-
రాష్ట్రంలో వైఎస్సార్సీపీదే అధికారం
రాయచోటి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ రెండోమారు అధికారంలోకి వస్తుందని రాజంపేట వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి పెద్దిరెఢ్డి మిథున్ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డిలు ఽధీమా వ్యక్తం చేశారు. బుధవారం రాయచోటి మండలం, యండపల్లె గ్రామంలో బోయనపల్లెలోని స్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్ పోలు సుబ్బారెఢ్డి నివాసంలో వారు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా, అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఐదేళ్లపాటు పాలన అందించిన జగన్ సంక్షేమ పాలనకు ఎక్కడ చూసినా జనం జేజేలు పలుకుతున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాల హృదయాలలో సీఎం జగన్ ఉన్నారన్నారు. ఎన్నికల హామీల అమలులో సీఎం జగన్ దేశంలోనే ఆదర్శంగా నిలిచారన్నారు. జగనన్న విడుదల చేసిన మేనిఫెస్టోను అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదన్నారు. ప్రజలకు మరింత సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందాలంటే మరోమారు జగన్ను సీఎంను చేయాలని వారు కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని మిథున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు బసిరెడ్డి సిద్దారెడ్డి, మండల బీసీ నాయకుడు పల్లపు రమేష్, సింగిల్ విండో అధ్యక్షుడు బసిరెడ్డి సుబ్బారెడ్డి, జేసీఎస్ కన్వీనర్ అమరనాథరెడ్డి, దివాన్, కౌన్సిలర్లు కసిరెడ్డి వెంకటనరసింహారెఢ్డి, చంద్రశేఖర్, మాధవరం రమేష్ రెఢ్డి, సైకం రమేష్ రెడ్డి, యర్ర బయన్న, హరినాథ రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఆనందరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, నల్లబయన్న, అమర తదితరులు పాల్గొన్నారు. జగన్ సంక్షేమ పాలన కు అండగా ప్రజలు నిలవాలి ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిలు -
ఊటుకూరును భక్త కన్నప్ప జన్మస్థలంగా గుర్తించాలి
రాజంపేట రూరల్ : ఊటుకూరును భక్త కన్నప్ప జన్మ స్థలంగా గుర్తించాలని వైఎస్సార్సీపీ నాయకులు నాగా పృథ్వీపతిరెడ్డి, ఆర్ శ్రీనివాసరాజు, సుబ్బరాజు శ్రీకాళహస్తి దేవస్థానం ఈఓ ఎస్వీ నాగేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ ఎన్.ఈశ్వరయ్యలకు బుధవారం వినతి పత్రం అందజేశారు. మండలంలోని ఊటుకూరులో శివాలయాన్ని ఈవో సందర్శించారు. ముందుగా నాగలింగేశ్వర స్వామికి పూజలు చేశారు. తదనంతరం పట్టు వస్త్రాలు, పూల హారం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఊటుకూరును భక్త కన్నప్ప జన్మస్థలంగా ప్రభుత్వం గుర్తించి శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో ఏటా ఉత్సవాలు నిర్వహించాలని కోరారు. ఊటుకూరులో భక్త కన్నప్ప దేవాలయం నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం ఈఈ నూకా రత్నమ్మ, డిప్యూటీ ఈఓ ఏకాంబరం, ఏఈలు మల్లికార్జునప్రసాద్, క్రిష్ణ కుమార్, వేణుగోపాల్, ఏఈఓ ఏకే ధనపాల్, తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఈఓకు భక్తుల వినతి -
సీఎం బహిరంగ సభను జయప్రదం చేయండి
రాజంపేట టౌన్: రాజంపేట పట్టణంలో గురువారం జరిగే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బహిరంగ సభను జయప్రదం చేయాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమరనాథ్రెడ్డి తెలిపారు. స్థానిక జీఎంసీ కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన మండల స్థాయి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆకేపాటి మాట్లాడారు. సీఎం ప్రవేశ పెట్టిన పథకాల వల్ల ప్రతి ఇంటికి లబ్ధి చేకూరిందని, అందువల్ల ప్రతి ఒక్కరు సీఎం రాజంపేటకు వస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు నాయకులు, కార్యకర్తలు రక్షక భటుల్లా సీఎం సభను జయప్రదం చేసేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకేపాటి మురళీరెడ్డి, నార్త్ అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్, వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ జెనుగు కృష్ణారావుయాదవ్, శ్రీశైలం ఆలయ బోర్డు మెంబర్ బొల్లినేని రామ్మోహన్నాయుడు, జేసీఎస్ కన్వీనర్ వడ్డే రమణ, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ దండు గోపి, వక్ఫ్బోర్డు మాజీ డైరెక్టర్ జాహీద్అలీ తదితరులు పాల్గొన్నారు. ఏపీ పాలిసెట్లో జిల్లాలో 84.69 శాతం ఉత్తీర్ణత రాయచోటి టౌన్: రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్ సి. నాగరాణి బుధవారం విడుదల చేసిన ఏపీ పాలిసెట్ ఫలితాల్లో అన్నమయ్య జిల్లాలో 84.69 శాతం ఉత్తీర్ణులైనట్లు రాయచోటి పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ శివశంకర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 4371 మంది పరీక్షలు రాయగా వారిలో 3701 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఉత్తీర్ణత శాతం 84.69 శాతంగా నమోదైందన్నారు. ఉత్తీర్ణులైన వారిలో బాలురు 2076 మంది ఉండగా, బాలికలు 1626 మంది ఉన్నారని తెలిపారు. కళాశాలలో చేరేందుకు కౌన్సెలింగ్ ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. హజ్ యాత్రికుల వ్యాక్సినేషన్ పరిశీలన రాయచోటి అర్బన్: జిల్లా కేంద్రమైన రాయచోటిలో హజ్యాత్రికులకు కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డీపీఎంఓ రియాజ్ బేగ్ డీఎన్ఎంఓ విష్ణువర్దన్రెడ్డితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీఎంఓ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈనెల 8,9 తేదీలలో నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం హాజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక టీకాల బృందాన్ని రాయచోటి ప్రాంతీయ వైద్యశాలలో నాలుగు బృందాలతో నిర్వహిస్తున్నామన్నారు. నాలుగు బృందాల పనితీరును డాక్టర్ సునీత పర్యవేక్షిస్తారన్నారు. రాయచోటి శిబిరంలో 120 మంది హజ్యాత్రికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి టీకాలు వేస్తున్నారన్నారు. రెండో శిబిరం మదనపల్లెలోని జిల్లా ప్రధాన వైద్యశాలలో డీఈఐసీ కేంద్రంలో డాక్టర్ శ్రీధర్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారని చెప్పారు. -
రాజంపేట మండలంలో రూ. 4.83 కోట్లు నష్టం
– 483 ఎకరాల్లో నేలకొరిగిన అరటి రాజంపేట రూరల్ : బుధవారం వేకువజామున వీచిన ఈదురుగాలులకు మండల పరిధిలోని ఆకేపాడు, మందపల్లి, హస్తవరం, పెద్దకారంపల్లి, మిట్టమీదపల్లి, పులపుత్తూరు, కూచివారిపల్లి, వరదయ్యగారిపల్లి, ఊటుకూ రు, రైతు భరోసా కేంద్రాల పరిధిలో 195 మంది రైతులకు చెందిన 483 ఎకరాలలో అరటిపంట నేలకొరిగింది. ఆకేపాడు ఆర్బీకే పరిదిలో 102 మంది రైతులకు గాను 252 ఎకరాలలో, మందపల్లి ఆర్బీకే పరిధిలో 14 మంది రైతులకు చెందిన 52 ఎకరాలలో, హస్తవరం ఆర్బీకే పరిధిలో 12 మంది రైతులకు చెందిన 36 ఎకరాలలో, పెద్దకారంపల్లి ఆర్బీకే పరిధిలో 17 మంది రైతులకు గాను 38 ఎకరాలలో, మిట్టమీదపల్లి ఆర్బీకే పరిధిలో 24 మంది రైతులకు గాను 42 ఎకరాలలో, పులపుత్తూరు ఆర్బీకే పరిధిలో 2 మంది రైతులకు గాను 10 ఎకరాలలో, కూచివారిపల్లి ఆర్బీకే పరిధిలో 10 మంది రైతులకు గాను 20 ఎకరాలలో, వరదయ్యగారిపల్లి ఆర్బీకే పరిధిలో 5 మంది రైతులకు గాను 21 ఎకరాలలో, ఊటుకూరు ఆర్బీకే పరిధిలో నలుగురు రైతులకు చెందిన 12 ఎకరాలలో అరటి పంట నేలకొరిగింది. దాదాపు రూ. 4.83 కోట్లు నష్టం వాటిల్లినట్లు ఉద్యాన అధికారి జె.సురేష్ బాబు తెలిపారు. -
వేలంపాటల నిలిపివేత
మదనపల్లె : టమాటా మార్కెట్లో బుధవారం వేలంపాటలు నిలిచిపోయాయి. మదనపల్లె లారీ అసోసియేషన్ సభ్యులు టమాటా లోడింగ్కు వచ్చిన ఇతర ప్రాంతాల లారీలను మార్కెట్ లోపలకు రాకుండా అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. దీంతో వ్యాపారులు వేలంపాటల్లో పాల్గొనలేదు. ఉదయం 8.30 గంటలకు ప్రారంభం కావాల్సిన వేలం పాటలు మధ్యాహ్నం.2.45 గంటల వరకు ప్రారంభం కాలేదు. వేలం పూర్తి చేస్తే స్వగ్రామాలకు వెళ్లేందుకు వేచిచూస్తున్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలు, పంట దిగుబడులు లేక నష్టాల్లో కూరుకుపోయిన తమను ఇబ్బందులకు గురిచేయడమేంటని ఆగ్రహించి టమాటాలు రోడ్డుపై పారవేసి నిరసన తెలిపారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... మదనపల్లె టమాటా మార్కెట్లో యూనియన్, అసోసియేషన్ల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్ల ఆధిపత్యంలోనే నడుస్తూ, రైతులను నిలువునా దోపిడీకి గురిచేస్తున్నారని వాపోయారు. ఇతర ప్రాంతాల లారీలు రాకూడదని ,చెప్పేందుకు వారికి ఏం సంబంధం ఉందని నిలదీశారు. మార్కెట్ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్న లారీ అసోసియేషన్ నాయకులు, మండీ యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరారు.మార్కెట్కమిటీ సెక్రటరీ అభిలాష్ వివరణ ఇస్తూ... లారీ అసోసియేషన్ సభ్యులు, మండీ యజమానులతో చర్చలు జరిపి ఎట్టకేలకు సమస్య పరిష్కారానికి కృషి చేశామన్నారు. కొనుగోళ్లు నిలిపివేసిన వ్యాపారులు -
అభివృద్ధికి కేరాఫ్
రాజంపేట నియోజకవర్గ ప్రజల హృదయాల్లో అభివృద్ధితో చెరగని ముద్ర వేసుకున్నారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇప్పుడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజంపేట అభివృద్ధికి మరింత తోడ్పాటును అందించారు. రాజంపేటతో రాజన్నకు చెపేయలేని అనుబంధం పెనవేసుకుని ఉందనేందుకు ఇక్కడి వారిలో ఉన్న అంతులేని అభిమానం నిదర్శనంగా నిలుస్తోంది. ఆ అభిమానం నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కొనసాగుతోంది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాజంపేట నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నడుం బిగించారు. ఈ క్రమంలోనే రాజంపేట–రాయచోటి మార్గంలో రూ.20కోట్లతో ఆర్ఓబీ, రూ.7కోట్లతో చెయ్యేరు నదిపై బాలరాచపల్లె వద్ద హైలెవెల్ వంతెన, రాజంపేట పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్చేందుకు రూ.100 కోట్ల నిధులు విడుదల చేశారు. రూ.30 కోట్లతో అన్నమయ్య జలాశయం నుంచి పట్టణానికి రూ.30 కోట్లపైగా భారీ మంచి నీటి పథకం ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఇప్పుడు కళ్లెదుట కనిపిస్తున్నాయి. ఒంటిమిట్ట, నందలూరు, తాళ్లపాక, అత్తిరాల చరిత్రాత్మక ప్రదేశాలను పర్యాటకపరంగా అభివృద్ధి చేశారు. 108 అడుగుల అన్నమయ్య విగ్రహం ఏర్పాటు చేశారు. రూ.500 కోట్ల నిధులు ఇచ్చి సోమశిల ముంపుబాధితుల కన్నీళ్లు తుడిచారు. నేడు తనయుడు సీఎం వైఎస్ జగన్ పాలనలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అన్నమయ్య డ్యాం పునర్ నిర్మాణానికి రూ.635 కోట్ల వ్యయం కేటాయింపులు జరిగాయి. నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో రూ.21కోట్ల వ్యయంతో కార్పొరేట్ తరహాలో వందపడకల ఆసుపత్రి నిర్మాణం జరిగింది. దక్షిణాదిలో అతిపెద్దవైష్ణవ ఆలయం అయిన నందలూరు సౌమ్యనాథాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలోకి విలీనం చేశారు. పింఛా డ్యాం పునర్నిర్మాణానికి రూ.80కోట్లతో పనులు పూర్తి కావచ్చాయి. ఇప్పటికే లెఫ్ట్కెనాల్ పూర్తిచేశారు. నియోజకవర్గంలో 75 ఆర్బీకేలకు రూ.13.01 కోటి వ్యయం చేశారు. రాజంపేటలో అగ్రిటెస్టింగ్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 74 సచివాలయాలు రూ.29 కోట్లు వ్యయం చేసి, 1241 మంది వలంటీర్లతో ప్రజల ముంగిటకే సేవలందించారు. విద్యావ్యవస్థ విషయంలో 425 ప్రభుత్వ పాఠశాలలు ఆధునీకరణకు రూ.రూ.52,26,8000 కోట్లు వ్యయం చేశారు. అంగన్వాడీల వ్యవస్థకు సంబంధించి 374 అంగన్వాడీలు, 153 మినీ అంగన్వాడీలకు రూ.258 సొంత భవనాలను నిర్మించారు. నేడు రాజంపేటలో ఎన్నికల ప్రచార సభకు సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజంపేటకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రానున్నారు. ఈ సందర్భంగా రైల్వేకోడూరు రోడ్డులో ఎన్నికల ప్రచార సభ ఉంటుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. పథకం లబ్ధిదారులు లబ్ధి(కోట్లలో) అమ్మఒడి 35659 1419021696 వసతి దీవెనె 18308 215584107 విద్యాదీవెన 19991 540479491 రైతు భరోసా 33004 1601496050 సున్నా వడ్డీ 8606 23181040 క్రాప్ ఇన్స్రూ 1178 118097091 ఇన్ఫుట్ సబ్సిడీ 5631 44615717 మత్స్యకార భరోసా 1 40000 వైఎస్సార్ సున్నావడ్డీ 51581 257025658 వైఎస్సార్ పెన్షన్ కానుక 44950 4143762000 వైఎస్సార్ చేయూత 15326 720634500 వైఎస్సార్ ఆసరా 38446 1084022142 వైఎస్సార్ బీమా 686 103735000 కాపునేస్తం 2401 79335000 వైఎస్సార్ నేతన్న నేస్తం 2324 188544000 జగనన్న చేదోడు 2077 44560000 వైఎస్సార్ వాహనమిత్ర 2190 56130000 వైఎస్సార్ ఆరోగ్య ఆసరా 7760 54063375 కళ్యాణమస్తు తోఫా 76 5825000 హౌసింగ్ 8026 832681509 జగనన్నతోడు 7181 3441089 నాన్ డీబీటీ జగనన్నతోడు (లోన్స్) 11572 215459068 జగనన్న గోరుముద్ద 19430 192493010 వైఎస్సార్ సంపూర్ణ పోషణ 6056 113428880 జగనన్న విద్యాకానుక 19609 139263118 ఇళ్ల స్థలాలు 12350 1554250000 ట్యాబ్స్ 2584 156388987 పీడీఎస్ రైస్ 81835 1787603740 -
వైఎస్సార్ కుటుంబానికి కిరణ్ వెన్నుపోటు
గుర్రంకొండ: రాజకీయాల్లో నిలువ నీడనిచ్చిన వైఎస్సార్ కుటుంబానికి వెన్నుపొడిచింది కిరణ్కుమార్రెడ్డేనని రాష్ట్రమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. బుధవారం అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లెలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక దర్గాసమీపంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాజకీయంగా కిరణ్కుమార్రెడ్డికి నీడినిచ్చిన వైఎస్సార్ కటుంబానికి చెందిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని 16 నెలల పాటు జైల్లో పెట్టించి వెన్నుపోటు పొడిచిన ఘనత కిరణ్కుమార్రెడ్డికే దక్కుతుందన్నారు. మోదీ, అమిత్షా రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతున్నారని అన్నారు. అలాంటి పార్టీ తరపున పోటీ చేస్తూ ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేయమని చెప్పే ధైర్యం కిరణ్కు, చంద్రబాబుకు, పవన్కల్యాణ్కు ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని చేతులారా విడిగొట్టిన పాపం కిరణ్కుమార్రెడ్డికే దక్కుతుందన్నారు. పుట్టపర్తి సాయిబాబా చనిపోయినా పదిరోజులపాటు బతికే ఉన్నాడని నమ్మించి లారీల్లో బంగారం, డబ్బులు బెంగళూరుకు తరలించింది కిరణ్కుమార్రెడ్డి కాదా అని ప్రశ్నించారు. కాదు అని దేవుడి ఎదుట ప్రమాణం చేయగలవా అని సవాల్ విసిరారు. 2014లో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ల పాటు అవకాశం ఉన్నా ఓటుకు నోటు కేసులో చిక్కుకొని చంద్రబాబు రాత్రికి రాత్రే ఆంధ్రప్రదేశ్కు వచ్చి మనకు రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టి, మనకు నీడలేకుండా కిరణ్కుమార్రెడ్డి చేశారని అన్నారు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు రాష్ట్రానికి, ప్రజలకు ద్రోహం చేసి ఇద్దరూ ఇద్దరే అని పించుకొన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు బూటకపు హామీలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. 2014 ఎన్నికల్లో కిషోర్ను ఎర్రచందనం స్లగ్లర్, మరో వీరప్పన్ అని విమర్శించిన చంద్రబాబు నేడు అదే కిషోర్కుమార్రెడ్డికి ఎలా టికెట్ ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విడగొట్టి, జగన్ను జైల్లో పెట్టిస్తానని సొనియాగాంధీకి ముందే హామీ ఇచ్చింది కిరణ్ కాదా అని ప్రశ్నించారు. కిర్ణ్కుమార్ రెడ్డి వల్లనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిందన్నారు. కుట్రలు చేసి జగన్ను జైల్లోపెట్టించిన కిరణ్కుమార్ రెడ్డి మతతత్వ పార్టీ తరపున పోటీచేస్తున్నందున మైనార్టీలు ఓట్ల రూపంలో బుద్ధిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ రెడ్డెమ్మ, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర ఎండీసీ డైరెక్టర్ హరీష్రెడ్డి, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ నల్లారి తిమ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రవినాయక్, జెడ్పీటీసీ సమ్రీన్ ముక్తియార్, మండల ఆర్బీకే చైర్మన్ జయచంద్రారెడ్డి, సింగిల్విండో చైర్మన్ నక్కాచంద్రశేఖర్, మండల సచివాలయాల కన్వీనర్ నాగేంద్ర, వైస్ ఎంపీపీ కరుణాకర్, మండల ప్రత్యేక ఆహ్వానితులు అప్పల్ల, మాజీ ఎంపీపీ జమీర్, రెడ్డెమ్మకొండ చైర్మన్ నరసింహారెడ్డి పాల్గొన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయమని చెప్పే ధైర్యం ఉందా రాష్ట్రాన్ని విడగొట్టిన పాపం కిరణ్కుమార్రెడ్డిదే సత్యసాయిబాబా డబ్బులు, బంగారం దోచుకోలేదా కిరణ్? రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -
30 మద్యం బాటిళ్లు స్వాధీనం
ఓబులవారిపల్లె : మండలంలోని నూకనపల్లి గ్రామంలో మద్యం తరలిస్తున్న టీడీపీ నాయకుడు ఆర్.భరత్కుమార్ రెడ్డిని బుధవారంఅదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. స్పెషల్ టీమ్ అధికారులు తనిఖీలు చేయగా భరత్ కుమార్ రెడ్డి కారులో 31 మద్యం సీసాలు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. కారు, మద్యం సీసాలు సీజ్ చేశామని, కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టుకు హాజరు పరుస్తామని ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. మెడికల్ దుకాణంలో చోరీకి యత్నం – దొంగకు దేహశుద్ది చేసిన గ్రామస్తులు గుర్రంకొండ : పట్ట పగలే మొడికల్ స్టోర్లో దొంగలు చోరికి విఫలయత్నం చేశారు. గ్రామస్తులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. గుర్రంకొండ బస్టాండులో నాగరాజ మెడికల్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. బుధవారం భోజనానికి వెళ్లే సమయంలో షట్టర్ దించి తాళాలు వేయకుండా వెళ్లిపోయాడు. బస్టాండులో సంచరించే దొంగల ముఠా సభ్యులు ఇది గమనించారు. ఇద్దరు దుకాణం షట్టర్ తెరిచి లోపలికి వెళ్లగా, మరొకరు బయట కాపలా ఉన్నారు. ఇది గమనించిన స్థానికులు దుకాణం వైపు వస్తుండడంతో బయట ఉన్న వ్యక్తి పరారయ్యాడు. స్థానికులు లోపల ఉన్న దొంగలను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి దొంగలను స్టేషన్కు తరలించారు. -
ఐఎఫ్ఎస్ పరీక్షలో కృష్ణ శ్రీవాస్తవకు 52వ ర్యాంకు
నందలూరు(రాజంపేట): బుధవారం విడుదలైన ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెస్టు సర్వీసెస్) ఫలితాల్లో నందలూరు మండల నాగిరెడ్డిపల్లె అర్బన్ పరిధిలోని గొల్లపల్లెకు చెందిన గొబ్బిళ్ల కృష్ణ శ్రీవాస్తవ జాతీయ స్థాయిలో 52వ ర్యాంకు సాధించారు. రెండు వారాల క్రితం విడుదలైన సివిల్స్లో కూడా శ్రీవాస్తవ 444వ ర్యాంకు సాధించాడు. 2023లో గ్రూప్–1లో జిల్లా రిజిస్ట్రార్గా ఎంపికయ్యారు. భార్యపై భర్త కత్తితో దాడి మదనపల్లె : భార్యపై భర్త కత్తితో దాడికి పాల్పడిన సంఘటన బుధవారం జరిగింది. ప్రకాశం జిల్లా, పామూరు, బట్లగూడూరుకు చెందిన పి.శిరీష(25)కు నెల్లూరు గరిమానుపెంటకు చెందిన మధుతో పదేళ్ల కిందట వివాహమైంది. ఏడేళ్ల కిందట మదనపల్లె పట్టణానికి వచ్చి పప్పిరెడ్డిగారిపల్లెలోని షటిల్ కోర్ట్ సమీపంలో నివాసముంటున్నారు. మధు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తుండగా శిరీష కూలి పనులకు వెళుతుంది.వీరికి నవదీప్(7), నందకుమార్(6) సంతానం. ఇటీవల భార్యపై అనుమానంతో మధు తగొడవపడేవారు. బుధవారం మధు పనులకు వెళ్లి అనంతరం ఇంటికి రాగా, భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించి ఆగ్రహానికి లోనై ఆమైపె కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించారు. మరొకరితో సన్నిహితంగా ఉన్నందునే దాడి చేసినట్లు నస్థానికులు పోలీసులకు తెలిపారు. -
చంద్రబాబును నమ్మితే పథకాలు గల్లంతు
ప్రభుత్వవిప్ కొరముట్ల శ్రీనివాసులురైల్వేకోడూరు : టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మి ఓటేస్తే సంక్షేమ పథకాలు గల్లంతవుతాయని, అభివృద్ది, సంక్షేమం కోసం అందరూ ఫ్యాను గుర్తుకు ఓటేయాలని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించి వారి ప్రగతికి ప్రతి రూపంగా నిలిచారన్నారు. టీడీపీ, జనసేన, బీజేపిలు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించాలని, కూటమి నేతల మాటలను నమ్మి మోసపోవద్దని తెలియజేశారు. అసెంబ్లీ అభ్యర్తిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి మిథున్రెడ్డికి ఓట్లు వేసి జగనన్నకు బహుమతిగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొల్లం గంగిరెడ్డి, పంజం సుకుమార్రెడ్డి, పాటూరు శ్రీనివాసులరెడ్డి, చెవ్వు శ్రీనివాసులరెడ్డి, ఎల్వి.మోహన్రెడ్డి, రత్నాకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కారు అదుపుతప్పి ఇద్దరికి గాయాలు
కలకడ : ప్రమాదవశాత్తూ బుధవారం ఓ కారు అదుపు తప్పి ఇద్దరికి గాయలయ్యాయి. మండలంలోని గుర్రంకొండ రోడ్డు నుంచి కలకడ వైపు వస్తున్న కారు అదుపుతప్పి.. కలకడ కొత్తపల్లె గ్రామంలో రోడ్డు ప్రక్కన ఉన్న ఓ ఇంటిని డీకొంది. కారు నుజ్జు నుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారి ఆచూకీ తెలియరాలేదు. ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరికి గాయాలు కలికిరి : ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు... వాల్మీకిపురం మండలం ఆరడమక గ్రామానికి చెందిన రంజిత్కుమార్రెడ్డి తన ద్విచక్ర వాహనంలో కలికిరి నుంచి కలకడ రోడ్డు కొత్తగజ్జలవారిపల్లి వద్దనున్న పెట్రోలు బంకు వద్దకు వెళ్తున్నాడు. బంకు సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో రంజిత్కుమార్రెడ్డికి గాయాలయ్యాయి. స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో పరీక్షించిన వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం తిరుపతికి రెఫర్ చేశారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి లక్కిరెడ్డిపల్లి : మండలంలోని మద్దిరేవుల పంచాయతీన ఈడిగపల్లెకు చెందిన తుమ్మల వెంకటరమణ (32) తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడు వెంకటరమణ మంగళవారం రాత్రి ఈడిగపల్లె నుంచి బైకులో లక్కిరెడ్డిపల్లెకు వస్తుండగా ప్రమాదశాత్తూ కిందపడి తలకు గాయాలయ్యాయి. 108 వాహనం ద్వారా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ వెంకటరమణ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడిలో నలుగురికి తీవ్ర గాయాలు ఓబులవారిపల్లె : మండలంలోని బాలిరెడ్డిపల్లి గ్రామంలో కటారి నరసింహులు వర్గంపై అదే గ్రామానికి చెందిన నాగార్జున వర్గం దాడి చేయడంతో నరసింహులుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. కటారి నరసింహులు, నాగార్జున మధ్య చాలా ఏళ్లుగా భూ వివాదం నడుస్తోంది. గతంలో పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పారు. సోమవారం నాగార్జునకు చెందిన పొలంలో పశువులను తోలడంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. నాగార్జున, పెంచలయ్య, దారా నరసింహులు కలిసి కటారి నరసింహులు, మణి, లక్ష్మీదేవి, రెడ్డన్నలపై దాడి చేశారు. దీంతో నరసింహులు వర్గానికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. -
విద్యుత్ తీగ తగిలి యువకుడికి గాయాలు
వీరబల్లె(రాయచోటి టౌన్) : విద్యుత్ తీగ తగిలి శంకరయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని వంగిమళ్ల గ్రామం పెద్ద హరిజనవాడకు చెందిన శంకరయ్యకు విద్యుత్ తీగ తగిలి గాయాలపాలయ్యాడు. ఆయన ఇంటి సమీపంలో 11 కేవీ విద్యుత్ స్తంభానికి డిష్ వైర్ అమర్చారు. ఎండకు వైర్ కరిగి నేలపై పడింది. దానిని పక్కకు లాగేందుకు శంకరయ్య ప్రయత్నించాడు. దీంతో షాక్ తగిలి గాయాలయ్యాయి. 108 ద్వారా రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ విద్యుత్ షాక్తో రెండు కుక్కలు మృతి చెందాయి. బాధితుడికి భార్య, కుమార్తె ఉన్నారు. భార్య నిండు గర్భిణి కావడం.. విలపించడం స్థానికులను కలచివేసింది. -
అక్రమ మద్యం తరలింపుపై నిఘా
పీలేరు : అక్రమ మద్యం తరలింపుపై నిఘా పెంచామని రాయలసీమ జోన్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిప్యూటీ కమిషనర్ టి.విజయశేఖర్ అన్నారు. స్థానిక సెబ్ కార్యాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం చిత్తూరు రోడ్డు మార్గంలో చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం అక్రమంగా తరలించకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండెక్ట్, సెబ్ అధికారులు పాటించాల్సిన నియమ నిబంధనల గురించి తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెబ్ సీఐ శ్యాంప్రసాద్, ఎస్ఐ లక్ష్మీనరసయ్య, సిబ్బంది యోగానంద, గిరిబాబు, సుధాకర, సురేష్, రమేష్, జయభాను, గంగా మహేశ్వరి పాల్గొన్నారు. -
అకాల వర్షం.. అపార నష్టం
రాయచోటి : అకాల వర్షాలు అన్నమయ్య జిల్లాలో అపార నష్టాన్ని, కష్టాన్ని తెచ్చి పెట్టాయి. జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి కురిసిన బలమైన ఈదురు గాలులతో కూడిన వానకు పంటలు దెబ్బతిన్నాయి. సోమవారం రాత్రి కూడా జిల్లాలోని మదనపల్లి, పీలేరు, రాజంపేట నియోజకవర్గాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. మంగళవారం రాత్రి బలమైన ఈదురు గాలుల కారణంగా రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాలలో అరటి, బొప్పాయి పంటలు వెయ్యి ఎకరాలలో నేలవాలి అపార నష్టాన్ని కల్గించాయి. రాయచోటి, పీలేరు, వాల్మీకిపురం, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాలలో అరకొర దిగుబడితో ఉన్న మామిడి కాయలు కాస్త రాలిపోయి మామిడి రైతులకు గుండె కోతను మిగిల్చాయి. పంటలు చేతికందే సమయంలో బలమైన ఈదురు గాలులతో కూడిన వానలకు నష్టపోవడంతో రైతులు కంటతడి పెట్టారు. జిల్లాలో దిగుబడి దశలో ఉన్న అరటి, బొప్పాయి వేల ఎకరాలలో నిమ్మనపల్లి, గుర్రంకొండ, కురబలకోట ప్రాంతాలలో దెబ్బతినింది. అలాగే టమాటా పంట రెండు వందల ఎకరాలలో అధికంగా దెబ్బతిన్నట్లు రైతులు వాపోతున్నారు. బి.కొత్తకోట, కురబలకోట మండలాల పరిధిలో పలు గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలకూలాయి. కురబలకోట మండల పరిధిలో ఆరు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. మరిన్ని విద్యుత్ స్థంబాలు నేలకూలినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. దీంతో విద్యుత్ సరఫరా ఆయా గ్రామాలలో నిలిచిపోయింది. కరెంటు సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఉక్కపోతకు విరామం... 40 నుంచి 45 డిగ్రీల వేడితో భగభగమన్న ఉక్కపోత వాతావరణానికి మంగళవారం రాత్రి కురిసిన వర్షం కాస్త విరామాన్ని ఇచ్చింది. బలమైన ఈదురు గాలులతోపాటు జిల్లా వ్యాప్తంగా వర్షపు జల్లులు కురవడంతో ఉడికిపోతున్న జనానికి చల్లటి ఊపిరి పోసినట్లయింది. బుధవారం మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉన్నప్పటికీ గాలిలో తేమ, ఆకాశంలో మబ్బులు ఉండటంతో గత నెలరోజుల నుండి వేడిమి భరిస్తూ వచ్చిన జిల్లా వాసులకు కాస్త ఉపశమనం లభించింది. మంగళవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు (మిల్లీ మీటర్లలో) గాలివీడు 5.4 మిల్లీ మీటర్లు, చిన్నమండెం 10.0, సంబేపల్లె 12.4, టి సుండుపల్లి 42, రాయచోటి 29.4, లక్కిరెడ్డిపల్లి 7.0, రామాపురం 60.2, వీరబల్లి 61.4, పెనగలూరు 32.0, చిట్వేలి 21.0, రాజంపేట 49.0, పుల్లంపేట 38.0 మిల్లీ మీటర్లు నమోదైంది. ఓబులవారిపల్లెలో 26.8 మిల్లీ మీటర్లు, కోడూరు 50.2, ములకల చెరువు 49.4, తంబళ్లపల్లి 27.8 , పెద్దమండ్యం 39.2, గుర్రంకొండ 11.0, కలకడ 32.8 , కంభంవారిపల్లి 57.2, పీలేరు 41.6, కలికిరి 21.4, వాల్మీకిపురం 24.2, కురబలకోట 33.6, పెద్దతిప్ప సముద్రం 45.2, బి కొత్తకోట 81, మదనపల్లి 114, నిమ్మనపల్లి 31.2, రామసముద్రం 47.8 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. ఓబులవారిపల్లెలో 50 ఎకరాల్లో నష్టం ఓబులవారిపల్లె : మండలంలో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి గాలులు తోడవడంతో అరటిచెట్లు నేలకొరిగాయి. వై.కోట, గాదెల కొత్తపల్లి గ్రామాలలో దాదాపు 50 ఎకరాల్లో అరటిచెట్లు నేల కూలాయి. దాదాపు 60 లక్షల రూపాయలు పంట నష్టం వాటిల్లింది. గాదెల కొత్తపల్లి గ్రామంలో రమణారెడ్డికి చెందిన 2.50 ఎకరాలు అరటిచెట్లు పూర్తిగా నేలకొరిగాయి. మండలంలో 26.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు డిప్యూటీ తహసీల్దార్ పీర్ మున్నీ తెలిపారు. నేల వాలిన అరటి, బొప్పాయి, టమాటా, అరకొర మామిడి దిగుబడి నేలపాలు కొత్తకోట, కురబలకోటలో దెబ్బతిన్న విద్యుత్ ట్రాన్సుఫార్మర్లు, విద్యుత్ లైన్లు నష్టపరిహారం అంచనాల్లో అధికారులు -
జగన్తోనే సంక్షేమ పథకాల కొనసాగింపు
సిద్దవటం: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమరనాథ్రెడ్డిలు తెలిపారు. మంగళవారం మండలంలోని భాకరాపేట చెక్ పోస్ట్ నుంచి రోడ్ షో నిర్వహించారు. రోడ్షోకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో రూ.4 కోట్లతో సిద్దవటం పెన్నానది నుంచి పైపులైను ఏర్పాటు చేసి మాధవరానికి మంచి నీరు ఇచ్చామన్నారు. ప్రస్తుతం పైపులైను సమస్యలు ఉన్నాయని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాధవరం మంచి నీటి సమస్య పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామన్నారు. సంక్షేమ పథకాలు వలంటీర్ల ద్వారా ప్రతి గడపకు చేరాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగనన్నను మరో సారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏనాడైనా ఇలాంటి సంక్షేమ పథకాలు అందించారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా వారు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ నాయకులు ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి, మేడా మధుసూదన్ రెడ్డి, అకేపాటి సాయి భరత్ రెడ్డి, నార్త్ అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రతినిధి పండుగాయల రత్నాకర్, రాష్ట్ర మహిళా కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి, రాష్ట్ర హౌసింగ్ బోర్డు డైరెక్టర్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ఉపాసి శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ నీలకంఠా రెడ్డి, ఉప మండలాధ్యక్షుడు నారపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ నూర్, జిల్లా రైతు విభాగం కార్యదర్శి పల్లె సుబ్బరామి రెడ్డి, మైనారిటీ సెల్ కార్యదర్శి వలీచాన్, బీసీ సెల్ కార్యదర్శి కేవీ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమరనాథ్రెడ్డి సిద్దవటంలో రోడ్షోకు అపూర్వ స్పందన ఒంటిమిట్టలో జోరుగా ప్రచారం ఒంటిమిట్ట: ఒంటిమిట్ట మండలంలో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమరనాథరెఢ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెఢ్డిలు నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్రచార ర్యాలీకి జన సందోహం ఊపందుకుంది. ఒంటిమిట్ట మండల పరిధిలో కొత్తమాధవరం చెక్పోస్టు నుంచి ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం వరకు ప్రచార ర్యాలీ నిర్వహించారు. నవరత్నాలతో ప్రజలకు జరిగిన మేలును వివరిస్తూ మళ్లీ ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరారు. నల్గొండ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో క్రేన్ సహాయంతో గజమాల వేసి నాయకులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి తనయుడు సాయి భరత్ రెఢ్డి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ కార్పొరేషన్ డైరెక్టర్ ఇరగంరెఢ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు మేకపాటి నందకేశ్వర్ రెడ్డి, తేలూరు శేషారెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎన్నికల ప్రక్రియ ఉన్నతమైన బాధ్యత
జిల్లా స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రాం మోహన్ మిశ్రా రాయచోటి: ఎన్నికల ప్రక్రియను ఉన్నతమైన బాధ్యతగా భావించాలి. సార్వత్రిక ఎన్నికల వేళ సమర్థవంతంగా పనిచేస్తూ.. భద్రతా నిఘా చర్యలను మరింత పటిష్టం చేయాలి.. జిల్లాలో నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు కృషి చేయాలి.. అని జిల్లా స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రాంమోహన్ మిశ్రా అన్నారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం. అభిషిక్త్ కిషోర్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన అబ్జర్వర్లు, నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన ఎన్నికల సన్నద్ధత, తీసుకున్న చర్యలు, అమలు ప్రక్రియ, భద్రతా చర్యలు తదితర అంశాలపై కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ కృష్ణారావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్పెషల్ జనరల్ అబ్జర్వర్కు వివరించారు. అనంతరం స్పెషల్ జనరల్ అబ్జర్వర్ మాట్లాడుతూ... స్వేచ్ఛ, పారదర్శక విధానంలో స్నేహపూర్వక వాతావరణంలో జిల్లాలో ఎన్నికలు నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. సీజ్ చేసిన నగదు, వస్తువుల విడుదలలో జాప్యం లేకుండా, సామాన్యులకు ఇబ్బంది లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం. అభిషిక్త్ కిషోర్ మాట్లాడుతూ జిల్లాలో 413 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. మూడు నియోజకవర్గాలలో పూర్తిగా, మిగిలిన నియోజకవర్గాలలో 50 శాతం పైగా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ఎన్నికల కోడ్ నేపథ్యంలో తనిఖీలలో భాగంగా స్వాధీనం చేసుకుని ఎఫ్ఐఆర్ ఫైల్ కాని నగదు వస్తువులను సులభతరంగా విడుదల చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన జిల్లా సీజర్స్ పరిష్కార కమిటీ ద్వారా తక్షణ పరిష్కారాన్ని అందిస్తున్నామన్నారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ జిల్లాలో సజావుగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాజంపేట పార్లమెంట్ పోలీస్, వ్యయ పరిశీలకులు దిల్ నవాజ్ అహ్మద్, రవీంద్ర కుమార్, నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్లు, ఓం ప్రకాష్ బంకర్, కవిత ఎస్ మన్నికేరి, వ్యయ పరిశీలకులు వైభవ్ శుక్ల, ఎస్.జి.మూన్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఆర్ఓ సత్యనారాయణరావు, నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
మూడో రోజు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రశాంతం
● 3174 మందికి గాను 1047 మంది ఓటుహక్కు వినియోగం ● జిల్లాలో 33 శాతం పోలింగ్ రాయచోటి : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో రోజు జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కార్యక్రమం ప్రశాంతంగా, పకడ్బందీగా జరిగింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 3174 మందికి గాను 1047 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 33 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.జిల్లా ఫెసిలిటేషన్ సెంటర్లో 1178 మందికి గాను 184 మంది మాత్రమే ఓటు వేయడంతో 15.6 శాతంగా నమోదైంది. నియోజకవర్గాల వారీగా పోలింగ్ వివరాలు.. నియోజకవర్గం మొత్తం ఓటు పోలింగ్ ఓటర్లు వేసినవారు శాతం సింహ వాహనంపై దేవదేవుడు వల్లూరు: పుష్పగిరి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి కామాక్షీ వైద్య నాధేశ్వర స్వామి సింహ వాహనంపై , శ్రీ చెన్న కేశవ స్వామి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు. ఉదయం శ్రీ వైద్యనాధ స్వామి ఆలయంలో అర్చకులు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. రాత్రి మంగళ వాయిద్యాలు, దివిటీల వెలుగుల మధ్య స్వామి వారి గ్రామోత్సవాన్ని పుష్పగిరి మాడ వీధుల్లో ఘనంగా నిర్వహించారు. కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలను, తోమాల సేవను నిర్వహించారు. రాజంపేట 430 160 37.2 రైల్వేకోడూరు 490 133 27.01 రాయచోటి 271 233 86 తంబళ్లపల్లె 143 37 25.9 పీలేరు 203 135 66.5 మదనపల్లి 458 165 36 -
వడగళ్ల వర్షం.. పంటకు నష్టం
జిల్లా ఆస్పత్రిలో కూలిన విద్యుత్ స్తంభాలు, చెట్లు మదనపల్లె: ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వర్షం అకస్మాత్తుగా కురవడం.. ఈదురు గాలులకు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలోని రెండు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. దీంతో సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు ఆసుపత్రిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ స్తంభాలు చెట్లు నేలకొరికే సమయంలో జనసంచారం లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. బలమైన ఈదురు గాలులు మొదటగా చెట్లు నేలకూలాయి. అదే సమయంలో చెట్లు విద్యుత్ వైర్లపై పడడంతో విద్యుత్ స్తంభాలు సైతం విరిగి కింద పడ్డాయి. విద్యుత్ స్తంభాలను తొలగించి, విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. నిమ్మనపల్లె: మండలంలో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులు వడగళ్లతో కూడిన అకాల వర్షం కురిసింది. మండలంలోని రంగంవారిపల్లె పంచాయతీ సాకిబండవారిపల్లె, జంగంవారి పల్లెకు చెందిన టమాటా, మామిడి రైతులు గంగాధర, గఫూర్ సాబ్, జి.శ్రీనివాసులు, శివశంకర్ రెడ్డి, నారాయణరెడ్డి, సుధాకర్రెడ్డిలకు చెందిన కోత దశలోని టమాటా, మామిడి పంటలు దెబ్బతిని, రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మామిడి దిగుబడి అంతంతమాత్రంగానే ఉన్నా, గాలివాన బీభత్సంతో పంట నేలరాలింది. సచివాలయ ఉద్యానవన సహాయకులు జయకృష్ణవేణి క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి సుమారు 10 ఎకరాల వరకు పంట నష్టం వాటిల్లినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. పంట నష్టం వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం ద్వారా వారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. తంబళ్లపల్లె: మండలంలో మంగళవారం సాయంత్రం గాలి,వాన బీభత్సం సృష్టించింది. సుమారు 15 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, బీసీహాస్టల్ వద్ద భారీ వృక్షాలు విద్యుత్ స్తంభాలపై పడ్డాయి. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ఆకులరెడ్డెప్పరెడ్డి అనే రైతుకు చెందిన అరటి తోట పూర్తిగా దెబ్బతినింది. రూ.50వేల నష్టం వాటిల్లింది. ఆకుతోటలు సైతం నేలకొరిగాయి. పరషతోపు పంచాయతీ బోడుకిందపల్లె దామోదర్రెడ్డిపల్లెకు చెందిన రేషన్ షెడ్డు ధ్వంసం కావడంతో అందులో ఉన్న 100 బస్తాల వేరుశేనగ కాయలు తడిచి నష్టం వాటిల్లింది. -
మేమంతా సీఎం వైఎస్ జగన్ వెంటే
రాజంపేట : రాజంపేట పట్టణ టూవీలర్ మెకానిక్ల సంఘం సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి పీవీ మిథున్రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమరనాథరెడ్డిలకు మద్దతు పలికారు. మంగళవారం పట్టణంలోని ఆర్టీసీ క్రాస్లోని ఎర్రబల్లిలో టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు రాజంపేట మున్సిపాలిటీ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ కండువాలను కప్పుకున్నారు. ఇందులో పట్టణానికి చెందిన 50 మంది టూ వీలర్ మెకానికల్లు ఉన్నారు. టూ వీలర్ మెకానిక్స్ అసోసియేషన్ నుంచి రాము, రఫీ, మెకానిక్ రవి తదితరులు స్వచ్ఛందంగా వైఎస్సార్సీపీలో చేరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్మికులకు మేలు జరిగే విధంగా వినూత్న విధానంలో కార్యక్రమంలో తీసుకొచ్చారన్నారు. ప్రమాద బీమాలతోపాటు ఉపాధి మార్గాలను చూపే దిశగా స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ తీసుకొని స్వయం ఉపాధిపై ఆధారపడి జీవిస్తున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కాపునేత మర్రి రవి, వైఎస్సార్సీపీ నేతలు డీలరు సుబ్బరామిరెడ్డి, ఎర్రబల్లి వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీకి మద్దతు పలికిన టూ వీలర్ మెకానిక్ల సంఘం -
సుండుపల్లెలో టీడీపీకి షాక్
సుండుపల్లె(రాజంపేట) : సుండుపల్లె మండలంలో టీడీపీకి షాక్ తగిలింది. వైఎస్సార్సీపీ నాయకులు రెడ్డమ్మ, ప్రసాద్ ఆధ్వర్యంలో సీనియర్ నేత యర్రపురెడ్డి అజయ్రెడ్డి సమక్షంలో కమ్మ సామాజిక వర్గాల నేతలు భేటి అయ్యారు. అనంతరం ఆ వర్గానికి చెందిన 20 కుటుంబాలు మంగళవారం వైఎస్సార్సీపీలో చేరగా, ఎమ్మెల్యే అభ్యర్ధి సోదరుడు ఆకేపాటి అనిల్రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఇందులో జీరెడ్డివారిపల్లె పంచాయతీకి చెందిన పొతకూమరి బాబు నాయుడు, వెంకటరమణనాయుడు, చల్లా ఆదినారాయణనాయుడు, జూపల్లి శివయ్యనాయుడు, జలగం రెడ్డప్పనాయుడు, చల్లా ఆదినారాయణనాయడు, చల్లా రాంబాబునాయుడు, రాజగోపాల్నాయుడు, సోంపల్లె వెంకటరమణనాయుడు తదితర కమ్మ నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు సామాజిక వర్గమే సీఎం వైఎస్ జగన్ పాలనకు ఆకర్షితులవుతున్నారన్నారు. ఎంపీ అభ్యర్ధి పీవీ.మిథున్రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్ధి ఆకేపాటి అమరనాఽథ్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. జగన్ కోసం సిద్ధం.. మండల కేంద్రమైన సుండుపల్లెలో జగన్ కోసం సిద్ధం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. ఎమ్మెల్యే అభ్యర్ధి సోదరుడు ఆకేపాటి అనిల్రెడ్డి జగన్ కోసం సిద్ధం లక్ష్యాలను వివరించారు. ప్రతి ఒక్కరూ మళ్లీ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి చేసుకునేందుకు కృషిచేయాలన్నారు. ఆ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు యర్రపురెడ్డి అజంతమ్మ, యర్రపురెడ్డి అజయ్రెడ్డితోపాటు పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. మంత్రి సమక్షంలో... కేవీపల్లె : మండలంలోని సొరకాయలపేటకు చెందిన మార్గదర్శి మధుసూదన్రెడ్డి, గణపతి, రాజన్న, మోహన్రెడ్డి, యల్లేశ్వర, నరసింహులు, గంగులయ్య, వారి అనుచరులు టీడీపీని వీడి మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాస్ మల్లికార్జునరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరిన కమ్మ సామాజికవర్గ నేతలు -
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
రైల్వేకోడూరు : రైల్వేకోడూరు నియోజకవర్గంలో కోడూరు, చిట్వేలి మండలాలల్లో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ముఖ్యంగా మంగళవారం సాయంత్రం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ప్రభుత్వవిప్ కొరముట్ల శ్రీనివాసులు సమక్షంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ముప్పాల హేమనవర్మ ఆధ్వర్యంలో రైల్వేకోడూరు టీడీపీ నియోజకవర్గ మహిళా ఇన్చార్జ్ హస్తి సుప్రజపాటు టీడీపీ చెందిన 50 కుటుంబాలు వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా హస్తి సుప్రజ మాట్లాడుతూ టీడీపీలో మహిళలకు సముచిత స్థానం దక్కడంలేదన్నారు. నియోజకవర్గంలో ఆరేళ్లుగా టీడీపీ సేవ చేస్తున్న ప్రస్తుత నియోజకవర్గ టీడీపీ రూపానందరెడ్డి పార్టీ శ్రేణులను పట్టించుకోవడం లేదని చెప్పారు. వైఎస్సార్సీపీ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతను చూసి వైఎస్సార్సీపీలో చేరానని ఈ సందర్భంగా తెలిపారు. వైఎస్సార్సీపీలో చేరిన చిట్వేలి మండల టీడీపీ నాయకులు నియోజకవర్గంలోని చిట్వేలి మండలంలో టీడీపీ ఎదురుదెబ్బ తగిలింది. ఆనాదిగా ఆ పార్టీలో కొనసాగుతున్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన 100 కుటుంబాలు మంగళవారం రైల్వేకోడూరులోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వవిప్ కొరముట్ల సమక్షంలో మండల కన్వీనర్ చెవ్వు శ్రీని వాసులు రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ తీర్థం పు చ్చుకున్నారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ టీ డీపీ కోసం కష్టపడి పనిచేసినా గుర్తింపు లభించడం లేదన్నాఉ. అందుకే వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నట్టు తెలియజేశారు. చిట్వేలి మండలంలోని నక్కలపల్లె, కుమ్మరపల్లె, కస్తూరివారిపల్లె, తుమ్మశెట్టిపల్లె, సి.కందులవారిపల్లె, మార్గోపల్లె గ్రామాల కు చెందిన 100 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరా యి. అలాగే రైల్వేకోడూరు మండలంలోని అయ్యవారిపల్లెలో టీడీపీ చెందిన 50 కుటుంబాలు వైఎస్సార్సీపీ మహిళా నాయకురాలు లక్ష్మినారాయణమ్మ ఆద్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఎల్వీ మోహన్రెడ్డి, పంజం సందీప్రెడ్డి, కంపరాజు నాగేంద్రరాజు, కస్తూరి పృథ్వీనాయుడు, గడికోట సంతోష్నా యుడు, జగదీష్నాయుడు, విజయ్, రాజేంద్ర, ఓంకార్, మార్గోపల్లి చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
అల్లర్లు సృష్టించడం బాబుకే చెల్లు
పెద్దతిప్పసముద్రం : టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు, భయానక వాతావరణం కల్పించేలా అల్లర్లు సృష్టించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పెద్దతిప్పసముద్రంలో మాట్లాడారు. ఉమ్మడిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ముక్కలుగా చేసిన పాపం మాజీ సీఎంలు చంద్రబాబు, కిరణ్లకే దక్కాయని ఎద్దేవా చేసారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగే ప్రదేశంలో కూటమి అభ్యర్థులు సమావేశం నిర్వహించడం ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే తపనతో చంద్రబాబు, కిరణ్, లోకేష్, కిషోర్కుమార్ రెడ్డి తెర వెనుక కుట్రలు పన్నుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారని అయినా తనతో పాటు వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు సంయమనం పాటిస్తున్నామన్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో వేరే చోట కాకుండా అంగళ్లులోనే చంద్రబాబు ఇన్నిసార్లు సభలు పెట్టడం వెనుక మతలబు ఏమిటని సూటిగా ప్రశ్నించారు. ‘నువ్వే చంద్రగిరి వదిలి కుప్పానికి వచ్చి అక్కడ అభివృద్ధిని గాలికొదిలేశావ్, నీ తోడబుట్టిన తమ్ముడు ఎక్కడ ఉన్నాడో ప్రజలకు చెప్పవు’ అంటూ బాబును ప్రశ్నించారు. ముఖ్యమంత్రులుగా చంద్రబాబు, కిరణ్లు తంబళ్ళపల్లిలో ఏం అభివృద్ధి సాధించారని, తాను రేపే తప్పుకుంటా, దమ్ముంటే తనపై పోటీకి సిద్ధమా అంటూ చంద్రబాబు, కిరణ్, లోకేష్లకు సవాల్ విసిరారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషితో తంబళ్లపల్లెను అన్ని విధాలా అభివృద్ధి చేశానని ధీమా వ్యక్తం చేసారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ప్రజా ప్రతినిధులు, నాయకులు మహమూద్, శివన్న, గణపతిరెడ్డి, డ్రిప్ రమణ, రియాసత్ అలీఖాన్, సుబ్బరాం, అనిత, తమక శంకర్, కార్యం చంద్ర, ధనలక్ష్మి, కొట్టి మల్లి, భాస్కర్రెడ్డి, ఆసిఫ్,సుబ్బిరెడ్డి, ఖాదర్వలి, కేసవ్, సందీప్, సాదిక్, ఫుజేల్, నాయుడు, వెంకట్రమణ తదితరులు ఉన్నారు. రాష్ట్రాన్ని ముక్కలుగా చేసిన పాపం చంద్రబాబు, కిరణ్దే విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
రాయచోటి టౌన్ : రాయచోటి పట్టణ శివార్లలోని టీటీడీ కల్యాణ మండపానికి ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి (సుమారు 50–55 వయస్సు మధ్య గల) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. అర్బన్ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి పట్టణంలోని రాయచోటి – చిత్తూరు రోడ్డు వద్ద ఉన్న ఫిష్ మార్కెట్కు వెనుక భాగాన టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం ఉన్నట్లు స్థానికులు సమాచారమివ్వడంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించినట్లు తెలిపారు. మూడు రోజుల క్రితం మృతి చెంది ఉంటాడనే అనుమానం వ్యక్తం చేశారు. మృతుడు తెల్లటి ఫ్యాంట్, నల్ల గళ్ల చొక్కా, తెల్లటి హవాయీ చెప్పులు ధరించాడని, అలాగే తెల్లటి గడ్డంతో ఉన్నట్లు తెలిపారు. ఎవరైనా గుర్తించి ఆనవాళ్లు తెలిసిన వారు ఉంటే తమకు తెలియచేయాలని చెప్పారు. తమ ఫోన్ నంబర్ 9121100559 /560/561లకు ఫోన్ చేయవల్సిందిగా కోరారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం వల్లూరు : కడప– తాడిపత్రి ప్రధాన రహదారిపై విమానాశ్రయం సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. విమానాశ్రయం సమీపంలో రోడ్డు దాటుకుంటున్న గుర్తు తెలియని వ్యక్తిని కడప వైపు నుంచి యర్రగుంట్ల వైపుకు వెళుతున్న లారీ ఢీ కొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ వెంకట రమణ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వైఎస్సార్సీపీలోకి వంద కుటుంబాలు
రాజంపేట రూరల్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనా దక్షతను, రాష్ట్రాభివృద్దికి చేస్తున్న విశేష కృషికి ఆకర్షతులై వెంకటరాజంపేట గ్రామానికి చెందిన 100 కుటుంబాలకు చెందిన యువత వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పట్టణంలోని ఆకేపాటి భవన్(వైఎస్సార్సీపీ కార్యాలయం)లోకి సోమవారం యువనాయకుడు ఉద్దండం శ్రీనివాసులు ఆద్వర్యంలో విచ్చేసిన 100 మంది యువకులకు రాజంపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమరనాథరెడ్డి సోదరుడు అనీల్కుమార్రెడ్డి వైఎస్సార్సీపీ పార్టీ కండువాలు వేసి ఆహ్వనించారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో శశిధర్, బాస్కర్, గోపీ, మహేష్, శివకుమార్, కార్తవరాముడు, అవినాష్, శ్రీనివాసులు, ప్రశాంత్, కిరణ్, ఉపేంద్ర, గణేష్, విజయ్, శ్రీనాథ్, రమణబాబు. తదితరులు ఉన్నారు. -
కలుషిత నీరు తాగి 18 జీవాలు మృతి
కలకడ : విషపు నీరు తాగి 18 గొర్రెలు మృతి చెందిన సంఘటన కలకడ మండలం దిగువతాండలో సోమవారం జరిగింది. నడిమిచెర్ల వెటర్నిటి వైద్యాధికారిణి డాక్టర్ పూర్ణిమ కథనం మేరకు.. దిగువతాండకు చెందిన భీముడునాయక్ కుమారుడు రవినాయక్ గొర్లు మేపుకుని వారి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. సోమవారం ఉదయం మేతకోసం ఇంటినుంచి బయటకు వెళ్లిన గొర్లు మధ్యహ్నం నీరు తాగిన గంట సమయంలోపే సొమ్మసిల్లి పడియాయి. దీంతో తీవ్ర ఆందోళన చెందిన రవినాయక్ దంపతులు గ్రామస్తులకు, పశువైద్యాధికారికి సమాచారం అందించారు. వారు వచ్చి పరీశీలించే లోపే 18గొర్లు మృతిచెందగా, మరో రెండు గొర్లు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మృతిచెందిన గొర్లు నుంచి రక్తనమూనాలు సేకరించి, విషపు నీరు తాగడం వల్లే మృతిచెంది ఉండవచ్చునని ఉన్నతాదికారులు తెలిపారు. రక్తపరీక్షల రిపోర్ట్ వచ్చిన అనంతరం పూర్తి నివేదిక అందించడం జరుగుతుందని తెలిపారు. గొర్రెల కాపరి వైఎస్సార్సీపీ అభిమాని అని, ఎవరైనా కక్షతో చేశారా, నీటిలోకి విషం ఎలావచ్చిందిఅనే అనుమానాలు కలుగుతున్నాయి. గొర్రెలకాపరిని వైఎస్సార్సీపీ రాయలసీమ జోన్ ఎస్టీసెల్ కార్యదర్శి డాక్టర్ సురేష్నాయక్, స్థానిక సర్పంచ్ స్వాతి లు కలిసి పరామర్శించారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ
చంద్రబాబు పై గాడిద సామెత
"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత
వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
బుల్లితెర నటి పర్సనల్ వీడియో లీక్
బేర్ పంజా..భారీ నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
తప్పక చదవండి
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement