-
‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
లక్నో సూపర్ జెయింట్స్ను చిత్తుగా ఓడించిన కోల్కతా నైట్ రైడర్స్పై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. ఏకపక్ష విజయం అన్న మాటలకు కేకేఆర్ సరైన నిర్వచనం ఇచ్చిందని.. విధ్వంసకర ఆట తీరును కళ్లకు కట్టిందని ఆకాశానికెత్తాడు.లక్నో గల్లీకి వెళ్లి గల్లీ క్రికెట్లో మాదిరి వారిని మట్టికరిపించిన తీరు అద్భుతమంటూ కేకేఆర్ను కొనియాడాడు. కాగా సొంత మైదానంలో ఆదివారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది.సంచలన ఇన్నింగ్స్ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(14 బంతుల్లో 32), సునిల్ నరైన్(39 బంతుల్లో 81) మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా.. ఏడో నంబర్ బ్యాటర్ రమణ్ దీప్ సింగ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.కేవలం ఆరు బంతుల్లోనే 25 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన లక్నోను కేకేఆర్ 137 పరుగులకే కుప్పకూల్చింది. పేసర్లు హర్షిత్ రాణా(3/24, రసెల్(2/17), మిచెల్ స్టార్క్(1/22).. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి(3/30), సునిల్ నరైన్(1/22) లక్నో బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేశారు.ఏకపక్ష విజయం ఫలితంగా కేకేఆర్ లక్నోపై ఏకంగా 98 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఐపీఎల్లో లక్నోకు ఇదే అతిపెద్ద పరాజయం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘లక్నో గల్లీకి వెళ్లి గల్లీ క్రికెట్ మాదిరే వారిని చిత్తు చేసింది కేకేఆర్. ఏకపక్ష విజయం ఎలా ఉంటుందన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.SRH అని ఎవరన్నారు?లక్నోకు తమ రెండున్నరేళ్ల ప్రయాణంలో అతిపెద్ద ఓటమిని రుచి చూపించింది. ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో సన్రైజర్స్ హైదరాబాద్ అత్యంత విధ్వంసకర జట్టు అని ఎవరు చెప్పారు?ఎస్ఆర్హెచ్ కాదు! అది కేకేఆర్ మాత్రమే’’ అని ఆకాశ్ చోప్రా శ్రేయస్ అయ్యర్ సేనకు కితాబులిచ్చాడు. ఇప్పటికే కేకేఆర్ ఆరుసార్లు 200 పరుగుల స్కోరు దాటిందని.. కోల్కతా కంటే ప్రమాదకర జట్టు ఇంకేది ఉందని టేబుల్ టాపర్ను ప్రశంసించాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు(287) సాధించిన జట్టుగా సన్రైజర్స్ ఈ ఎడిషన్ సందర్బంగా అరుదైన రికార్డు సాధించిన విషయం తెలిసిందే.చదవండి: అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. వసీం అక్రం కౌంటర్High-Fives in the @KKRiders camp 🙌With that they move to the 🔝 of the Points Table with 16 points 💜Scorecard ▶️ https://t.co/CgxfC5H2pD#TATAIPL | #LSGvKKR pic.twitter.com/0dUMJLasNQ— IndianPremierLeague (@IPL) May 5, 2024 -
T20 WC: తుదిజట్టులో చోటివ్వాల్సిందే.. కెప్టెన్ కూడా కాదనలేడు!
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ శివం దూబే మరోసారి అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో ఆదివారం నాటి మ్యాచ్లో 20 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్ల సాయంతో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు.కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(98), డారిల్ మిచెల్(52)తో కలిసి చెన్నై సూపర్ కింగ్స్కు 212 పరుగుల భారీ స్కోరు అందించాడు. తద్వారా రైజర్స్పై 78 పరుగుల తేడాతో గెలుపొందడంలో తన వంతు పాత్ర పోషించాడు.కాగా ఐపీఎల్-2024లో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. సీఎస్కే తరఫున మిడిలార్డర్ బ్యాటర్గా బరిలోకి దిగుతున్న దూబే.. తొమ్మిది ఇన్నింగ్స్లో కలిపి 350 పరుగులు చేశాడు.ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు ఇప్పటి దాకా సాధించిన ఐదు విజయాల్లో తనదైన ముద్ర వేశాడు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్కప్-2024 ఆడనున్న టీమిండియాలో అతడికి తప్పక చోటివ్వాలని డిమాండ్లు పెరిగాయి.ఈ నేపథ్యంలో సీఎస్కే తాజా విజయం నేపథ్యంలో దూబే ఇన్నింగ్స్పై స్పందించిన భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ పిల్లాడు సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. అతడిని కేవలం ప్రపంచకప్ జట్టుతో పంపించడమే కాదు.తుదిజట్టులోనూ అతడిని తప్పక ఆడించాలి. కేవలం ఎంపిక గురించి కాదు.. ప్లేయింగ్ ఎలెవన్లోనూ చోటివ్వాలని సెలక్టర్లు ఫిక్సైపోవాలి. కెప్టెన్గానీ.. మేనేజ్మెంట్ గానీ అతడిని విస్మరించడానికి వీల్లేదు.ప్రస్తుత టీమిండియా ప్లేయర్లలో అతడి కంటే బెటర్గా హిట్టింగ్ ఆడే బ్యాటర్ మరొకరు లేరు. ఒకవేళ అతడిని గనుక బెంచ్కే పరిమితం చేస్తే అంతకంటే అన్యాయం మరొకటి ఉండదు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్-2024 మొదలుకానుంది. ఈ నేపథ్యంలో జట్ల ప్రకటనకు మే 1 ఆఖరి తేదీగా పేర్కొంది ఐసీసీ. -
అసలు నువ్వేం చేస్తున్నావు యశస్వి?.. మా వాడికేం ఢోకా లేదు
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు బ్యాట్ ఝులిపించలేదు. కనీస స్థాయి ప్రదర్శన చేయలేక చతికిలపడ్డాడు. కాగా గత సీజన్లో 14 మ్యాచ్లు ఆడి ఏకంగా 625 పరుగులు సాధించిన ఈ లెఫ్టాండర్.. టీమిండియాలో ఎంట్రీ ఇచ్చి దుమ్ములేపాడు. టెస్టు, టీ20లలో భారత ఓపెనర్గా సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్లో యశస్వి జైస్వాల్పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. కానీ.. అందుకు తగ్గట్లుగా ఈ రాజస్తాన్ రాయల్స్ స్టార్ రాణించలేకపోతున్నాడు. తాజా సీజన్లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో కలిపి యశస్వి జైస్వాల్ కేవలం 39 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు సాధించిన అత్యధిక స్కోరు 24. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో అయితే పరుగుల ఖాతా తెరవకుండానే అతడు వెనుదిరిగాడు. ఈసారి పరుగుల ఖాతా కూడా తెరవలేదు జైపూర్లో శనివారం జరిగిన మ్యాచ్లో రెండు బంతులు ఎదుర్కొని జైస్వాల్ డకౌట్ అయ్యాడు. రీస్ టోప్లీ బౌలింగ్లో మాక్స్వెల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, మరో ఓపెనర్ జోస్ బట్లర్ అజేయ శతకం(100)తో రాజస్తాన్ను గెలుపు తీరాలకు చేర్చాడు. 4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷 And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪 Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN — IndianPremierLeague (@IPL) April 6, 2024 సంజూ శాంసన్(69) సైతం మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి రాజస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా రాజస్తాన్ ఖాతాలో వరుసగా నాలుగో గెలుపు చేరింది. ఇక ఇలా జట్టు ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో గెలుపొందింది కాబట్టి జైస్వాల్ వైఫల్యం పెద్దగా లెక్కలోకి రాలేదు. నిజానికి ఏ ఒక్క మ్యాచ్లో ఫలితం తారుమారైనా వేళ్లన్నీ జైస్వాల్ వైపు చూపేవనడంలో సందేహం లేదు. ఏదేమైనా.. ఒంటిచేత్తో జట్టును గెలిపించే సత్తా ఉన్న ఆటగాడైన ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇలా విఫలం కావడం విమర్శలకు తావిస్తోంది. అసలు నువ్వేం చేస్తున్నావు యశస్వి? ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రతిసారీ లెఫ్టార్మ్ పేసర్ల చేతిలో అవుట్ అవుతున్న జైస్వాల్ ఇప్పటికైనా బలహీనతలు అధిగమించేందుకు కృషి చేయాలని సూచించాడు. ‘‘యశస్వి జైస్వాల్ మళ్లీ స్కోరు చేయలేకపోయాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్లో మూడింటిలో లెఫ్టార్మ్ పేసర్ల చేతికే చిక్కాడు. అసలు నువ్వేం చేస్తున్నావు యశస్వి? దయచేసి పట్టుదలగా నిలబడి బ్యాటింగ్ చెయ్యి.. కొన్ని పరుగులు సాధించు. నిజానికి నువ్వు మంచి ఆటగాడివి’’ అంటూ జైస్వాల్ ఆట తీరును ఆకాశ్ చోప్రా విమర్శించాడు. ఇప్పటికైనా తిరిగి పుంజుకుంటే వరల్డ్కప్ జట్టులో పోటీ లేకుండా బెర్తు ఖరారు చేసుకోవచ్చని సూచించాడు. చెత్త బ్యాటర్ అయిపోడు ఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్కు రాజస్తాన్ రాయల్స్ కోచ్ కుమార్ సంగక్కర అండగా నిలిచాడు. ఫ్రాంఛైజీ క్రికెట్తో పాటు టీమిండియా తరఫున కూడా అదరగొట్టిన యశస్వి.. రెండు ఇన్నింగ్స్లో విఫలమైనంత మాత్రాన చెత్త బ్యాటర్ ఏమీ అయిపోడని వెనకేసుకువచ్చాడు. అతడి నైపుణ్యాలేమిటో తమకు తెలుసునని.. కచ్చితంగా కమ్బ్యాక్ ఇస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. చదవండి: Virat Kohli: ఇంత స్వార్థమా?.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
#Pandya: ఆ చెత్త షాట్ అవసరమా హార్దిక్?
IPL 2024- MI Vs RR- #Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన తర్వాత హార్దిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. ఎక్కడకు వెళ్లినా ప్రేక్షకుల నుంచి హేళనలు.. చెత్త కెప్టెన్సీ కారణంగానే ముంబైకి వరుస ఓటములంటూ మాజీ క్రికెటర్లు, విశ్లేషకుల నుంచి విమర్శలు. ఇక ఆటగాడిగానూ హార్దిక్ పాండ్యా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడం కూడా ముంబై అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో కలిపి ఈ పేస్ ఆల్రౌండర్ 69 పరుగులు చేశాడు. బ్యాటర్గా ఫర్వాలేదనిపించినా బౌలింగ్లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఇంత వరకు కేవలం ఒకే ఒక వికెట్ తీశాడు. ఇక రాజస్తాన్ రాయల్స్తో సోమవారం నాటి మ్యాచ్లో హార్దిక్ పాండ్యా అవుటైన తీరు కూడా విమర్శలకు తావిచ్చింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబైని తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఆదుకునే ప్రయత్నం చేశారు. ఐదో స్థానంలో వచ్చిన తిలక్ 29 బంతుల్లో 32 పరుగులు చేయగా.. పాండ్యా 21 బంతుల్లోనే 34 రన్స్ సాధించాడు. అయితే, అప్పటికి ఇంకా పది ఓవర్లు మిగిలి ఉన్నా పాండ్యా అనవసరపు షాట్తో యజువేంద్ర చహల్ బౌలింగ్లో వికెట్ పారేసుకున్నాడు. రోవ్మన్ పావెల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. Chahal strikes, Hardik departs ⚡#IPLonJioCinema #TATAIPL #MIvRR pic.twitter.com/oM7EOvnxvm — JioCinema (@JioCinema) April 1, 2024 ఈ విషయం గురించి భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పేందుకు కృషి చేశారు. కానీ.. వీరిద్దరు ఇంకాసేపు క్రీజులో ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. వాంఖడే పిచ్ 210 పరుగులు స్కోరు చేసేదిగా లేకపోవచ్చు. కానీ 160- 170 పరుగులు సాధించేందుకు ఆస్కారం ఉంది. అయినా.. పదో ఓవర్లో మూడో బంతికి యుజీ బౌలింగ్లో పాండ్యా సిక్సర్ కొట్టేందుకు యత్నించాడు. నిజానికి తను బంతిని సరిగ్గా అంచనా వేస్తే ఫలితం వేరేలా ఉండేది. ఆ షాట్ ఆడి తను అవుటయ్యాడు. ఆ తర్వాత తిలక్ వర్మ కూడా పెవిలియన్ చేరాడు. వీరిద్దరి నిష్క్రమణ తీవ్ర ప్రభావం చూపింది’’ అని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్-2024: ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ స్కోరు ►వేదిక: ముంబై.. వాంఖడే స్టేడియం ►టాస్: రాజస్తాన్ రాయల్స్.. బౌలింగ్ ►ముంబై స్కోరు: 125/9 (20) ►రాజస్తాన్ స్కోరు: 127/4 (15.3) ►ఫలితం: ఆరు వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ట్రెంట్ బౌల్ట్(రాజస్తాన్- 3/22). చదవండి: IPL 2024: గేమ్ చేంజర్.. అతడు ఉంటే ముంబై కచ్చితంగా గెలిచేది! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'వెంటనే ముంబై కెప్టెన్సీ నుంచి హార్దిక్ను తీసేయండి'.. క్లారిటీ ఇచ్చిన ఆకాష్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి చవి చూసింది. ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ఏకంగా 277 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్లో ముంబై బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి తన వ్యూహాలను అమల చేయడంలో విఫలమయ్యాడు. బౌలర్లను సరిగ్గా ఉపయోగించడంలో పాండ్యా చేతులేత్తేశాడు. ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను సద్వినియోగం చేసుకోవడంలో హార్దిక్ ఇబ్బంది పడుతున్నాడు. తొలి 10 ఓవర్లలో బుమ్రాతో హార్దిక్ కేవలం ఒకే ఒక్క ఓవర్ వేశాడు. నాలుగో ఓవర్ వేసిన బుమ్రా.. మళ్లీ 13 ఓవర్లో ఎటాక్లోకి వచ్చాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అభిషేక్, ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీలు సాధించారు. దీంతో హార్దిక్ పాండ్యాపై మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా సైతం హార్దిక్ పాండ్యాపై సీరియస్ అయినట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. "ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఇటువంటి చెత్త కెప్టెన్సీని నేను చూడలేదు. హార్దిక్ పాండ్యా తన సారథ్యాన్ని వదిలేయాలి. లేకపోతే ముంబై ఫ్రాంచైజీ అయినా అతడి తొలగించాలి’ అంటూ జియో సినిమా షోలో చోప్రా పేర్కొన్నట్లు ఓ నెటిజన్ ట్విట్ చేశాడు. తాజాగా ఇదే విషయంపై చోప్రా క్లారిటీ ఇచ్చాడు. తను అటువంటి వ్యాఖ్యలు ఏమీ చేయలేదని, అవన్నీ రూమర్సే అని చోప్రా చెప్పుకొచ్చాడు. "అసలు ఏమి జరుగుతుందో నాకు అర్దం కావడం లేదు. మీకేం అయింది? అబద్ధాలను ప్రచారం చేయొద్దు బ్రదర్. మీ స్టేట్మెంట్ తప్పు. అలాగే నా పేరును ప్రస్తావించారు. కానీ, నా పేరులోనూ అక్షర దోషాలు ఉన్నాయి" అంటూ ఓ యూజర్ ట్వీట్కు చోప్రా రిప్లే ఇచ్చాడు. -
'సీఎస్కే ఓపెనర్గా యువ సంచలనం.. ధోని బ్యాటింగ్కు వచ్చేది అప్పుడే'
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్-2024 మెగా సమరానికి సమయం ఆసన్నమైంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ 17వ సీజన్కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. చెపాక్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. సాయంత్రం 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి పోరులో ఎలాగైనా విజయం సాధించి శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. కాగా ఈ ఏడాది సీజన్లో సీఎస్కే కొత్త కెప్టెన్తో బరిలోకి దిగుతోంది. కెప్టెన్ల ఫొటో సెషన్కు ముందు ఎంఎస్ ధోనీ తన బాధ్యతలను యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించేశాడు. కాగా మొదటి మ్యాచ్ నేపథ్యంలో సీఎస్కే ప్లేయింగ్ ఎలెవన్ గురించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో చర్చించాడు. కివీ స్టార్ రచిన్ రవీంద్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో కలిసి సీఎస్కే ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని చోప్రా జోస్యం చెప్పాడు. అదేవిధంగా వేలంలో భారీ మొత్తం వెచ్చించి కొన్న యువ ఆటగాడు సమీర్ రిజ్వీ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగే అవకాశముందని చోప్రా అభిప్రాయపడ్డాడు. రచిన్ రవీంద్ర.. రుతురాజ్ గైక్వాడ్తో కలిసి చెన్నై ఇన్నింగ్స్ను ప్రారంభిస్తాడు. అజింక్యా రహానే, డార్లీ మిచెల్ వరుసగా మూడు, నాలుగు స్ధానాల్లో బ్యాటింగ్కు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఐదో స్ధానంలో శివమ్ దూబే బ్యాటింగ్కు రానున్నాడు. ఆ తర్వాత స్ధానాల్లో రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని బ్యాటింగ్కు వస్తారు. ఆపై శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ వంటి ఆల్రౌండర్లు క్రీజులోకి రానున్నారు. అయితే విదేశీ ప్లేయర్ల కోటాలో పతిరానా అందులో బాటులో లేడు కాబట్టి నాలుగో ఆటగాడిగా మొయిన్ అలీ లేదా ముస్తిఫిజర్ రెహ్మన్కు చోటు దక్కే అవకాశముంది. అదేవిధంగా యువ ఆటగాడు సమీర్ రిజ్వీని సీఎస్కే ఉపయోగించుకునే ఛాన్స్ ఉందని యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు. -
భారత టీ20 జట్టు నుంచి అవుట్! వరల్డ్కప్లో నో ఛాన్స్!
IPL 2024- T20 WC 2024: టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు కష్టమేనని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. సెలక్టర్లు అతడిని పక్కనపెట్టినట్లు ఇప్పటికే సంకేతాలిచ్చారని పేర్కొన్నాడు. ఐపీఎల్-2024లో సత్తా చాటితేనే తిరిగి భారత టీ20 జట్టులో స్థానం పొందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు కెప్టెన్గా ఉన్న భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. వెన్నునొప్పి కారణంగా గత సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఆ తర్వాత భారత టీ20 జట్టులో పునరాగమనం చేసిన అతడు ఫర్వాలేదనిపించాడు. వన్డే వరల్డ్కప్-2023లోనూ సత్తా చాటాడు. అయితే, గత కొన్ని రోజులుగా కెరీర్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు అయ్యర్. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడనే కారణంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి అతడి సెంట్రల్ కాంట్రాక్టును రద్దు చేసింది. ఈ నేపథ్యంలో భారత జట్టులో శ్రేయస్ అయ్యర్ పునరాగమనంపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో జూన్లో మొదలుకానున్న టీ20 ప్రపంచకప్-2024 జట్టులో అతడికి చోటు దక్కుతుందా లేదా అన్న అంశంపై ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. భారత టీ20 జట్టు నుంచి అవుట్! వరల్డ్కప్లో నో ఛాన్స్! ‘‘శ్రేయస్ అయ్యర్... ప్రస్తుతం నీ పేరు భారత టీ20 జట్టులో లేదు. ఒకవేళ ఐపీఎల్ తాజా ఎడిషన్లో నువ్వు సత్తా చాటితే రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది. 550కి పైగా పరుగులు సాధిస్తే సెలక్టర్లు కచ్చితంగా ఈ పేరును పరిగణనలోకి తీసుకుంటారు. ఐపీఎల్లో అదరగొడితేనే కీలక సభ్యుడిగా జట్టులో చోటిస్తారు. కానీ ప్రస్తుతం అతడి పేరు పరిశీలనలో లేదన్నది వాస్తవం’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2023లో శ్రేయస్ అయ్యర్ స్థానంలో నితీశ్ రాణా కేకేఆర్ను ముందుకు నడిపించాడు. కానీ కనీసం ప్లే ఆఫ్స్నకు కూడా చేర్చలేకపోయాడు. ఈ నేపథ్యంలో తిరిగి కేకేఆర్ పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్.. కెప్టెన్గా, బ్యాటర్గా రాణిస్తేనే వరల్డ్కప్ అవకాశాలను సజీవం చేసుకోగలడు. ఐపీఎల్ పదిహేడో ఎడిషన్లో ప్రదర్శనపైనే అతడి అంతర్జాతీయ టీ20 కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు!! ఇదిలా ఉంటే.. మార్చి 22న ఐపీఎల్-2024కు తెరలేవనుంది. చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య చెపాక్లో ఆరంభ మ్యాచ్ జరుగనుంది. ఇక కేకేఆర్ మార్చి 23న సొంతమైదానంలో సన్రైజర్స్ హైదారాబాద్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: # RCB: మేమేం ఏడ్వటం లేదు... అబ్బే ఇవి కన్నీళ్లుకావు! -
IPL 2024: సన్రైజర్స్ తుదిజట్టు ఇదే.. మార్క్రమ్కు నో ఛాన్స్?
ఐపీఎల్-2024 ఆరంభానికి కౌంట్డౌన్ మొదలైంది. మార్చి 22న ఈ మెగా ఈవెంట్కు చెపాక్ వేదికగా తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆరంభ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో మరుసటి రోజే అంటే మార్చి 23న సన్రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కోల్కతా వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఇదిలా ఉంటే.. గత కొన్నేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్న సన్రైజర్స్ ఈసారి మరో కొత్త కెప్టెన్తో ముందుకు రానుంది. ఆస్ట్రేలియా సారథి, వన్డే వరల్డ్కప్-2023 విజేత ప్యాట్ కమిన్స్పై కోట్లు కుమ్మరించి తన నాయకుడిగా ప్రకటించింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్పై వేటు వేసింది. ఇక జట్టులో వీరిద్దరితో పాటు మరో ఆరుగురు విదేశీ ప్లేయర్లు కూడా ఉన్నారు. నిబంధనల ప్రకారం తుదిజట్టులో కేవలం నలుగురు ఫారిన్ ప్లేయర్లను మాత్రమే ఆడించాలి. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతుందా అన్న చర్చల నడుమ.. టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన జట్టును ప్రకటించాడు. విదేశీ ప్లేయర్ల కోటాలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు.. ట్రవిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్లకు తన టీమ్లో చోటిచ్చాడు. ‘‘అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్.. ఇద్దరు లెఫ్టాండర్లతో ఓపెనింగ్ చేయించాలనుకుంటే వీరికి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఇవ్వాలి. లేదంటే అభిషేక్ను వన్డౌన్లో ఆడించి.. మయాంక్ అగర్వాల్ను ఓపెనర్గా పంపాలి. ఆ తర్వాతి స్థానాల్లో రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనాద్కట్/ఉమ్రాన్ మాలిక్/టి. నటరాజన్లను పంపించాలి’’అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఒకవేళ స్పిన్ పిచ్లపై ఆడాల్సి వస్తే.. మార్కో జాన్సెన్ స్థానంలో వనిందు హసరంగను తీసుకుంటే బాగుంటుందని ఆకాశ్ చోప్రా సూచించాడు. షాబాజ్ అహ్మద్ రూపంలో మరో స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. కాగా ఆకాశ్ చోప్రా తన తుదిజట్టులో ఐడెన్ మార్క్రమ్కు చోటు ఇవ్వకపోవడం గమనార్హం. గత సీజన్లో అతడు 13 ఇన్నింగ్స్ ఆడి సగటు 22.55తో 248 పరుగులు సాధించాడు. ఐపీఎల్ 2024- సన్రైజర్స్ హైదరాబాద్- ఆకాశ్ చోప్రా తుదిజట్టు: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనాద్కట్/ఉమ్రాన్ మాలిక్/టి. నటరాజన్. ఐపీఎల్-2024- సన్రైజర్స్ జట్టు: అబ్దుల్ సమద్ ఐడెన్ మార్క్రమ్* రాహుల్ త్రిపాఠి గ్లెన్ ఫిలిప్స్* హెన్రిచ్ క్లాసెన్* మయాంక్ అగర్వాల్.. అన్మోల్ ప్రీత్ సింగ్ ఉపేంద్ర సింగ్ యాదవ్ నితీష్ కుమార్ రెడ్డి అభిషేక్ శర్మ మార్కో జాన్సెన్* వాషింగ్టన్ సుందర్ సన్వీర్ సింగ్ భువనేశ్వర్ కుమార్ టి.నటరాజన్ మయాంక్ మార్కండే ఉమ్రాన్ మాలిక్ ఫజల్హక్ ఫరూఖీ* షాబాజ్ అహ్మద్ (ఆర్సీబీ నుంచి ట్రేడింగ్) ట్రావిస్ హెడ్ * (వేలం - 6.80 కోట్లు) వనిందు హసరంగ* (వేలం - 1.50 కోట్లు) ప్యాట్ కమిన్స్* (వేలం - 20.50 కోట్లు) జయదేవ్ ఉనాద్కట్ (వేలం - 1.60 కోట్లు) ఆకాశ్ సింగ్ (వేలం - 20 లక్షలు) ఝతావేద్ సుబ్రమణియన్ (వేలం - 20 లక్షలు) *- విదేశీ ఆటగాళ్లు. చదవండి: హార్దిక్ రిటైర్ అవ్వటమే బెటర్: భారత మాజీ పేసర్ షాకింగ్ కామెంట్స్ -
ఆ జట్టు ఈసారి కూడా ప్లే ఆఫ్స్ చేరలేదంటే సిగ్గుచేటే!
"It's a shame if this team..: ఐపీఎల్-2024 ఆరంభానికి సమయం ఆసన్నమవుతోంది. మార్చి 22న ఈ మెగా ఈవెంట్కు చెన్నైలో తెరలేవనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. రాజస్తాన్ రాయల్స్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రాజస్తాన్ రాయల్స్ మెరుగైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్.. సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, షిమ్రన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్.. వీరితో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. ఇక రోవ్మన్ పావెల్తో పాటు రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చహల్, ఆడం జంపా, ట్రెంట్ బౌల్ట్ కూడా ఉండనే ఉన్నారు. విదేశీ ప్లేయర్లలో చాలా మందికి తుదిజట్టులో ఆడే అవకాశం రాదన్న మాట నిజమే. అయితే, జట్టుకు అవసరాలకు అనుగుణంగా ఒక్కొక్కరికి ఒక్కోసారైనా ఛాన్స్ దక్కుతుంది. ఇప్పుడిక ఆవేశ్ ఖాన్ కూడా రాయల్స్తో చేరాడు. వీళ్లందరినీ చూస్తుంటే ఈ జట్టు ట్రోఫీ గెలుస్తుందని భావిస్తుందని అనుకోవచ్చా? అంటే కచ్చితంగా అవుననే అంటాను. అయితే, గత సీజన్లో తాము ఇంపాక్ట్ ప్లేయర్ను వాడదలచుకోలేదని రాయల్స్ చెప్పింది. ఈసారి మాత్రం వాళ్లు ఇంపాక్ట్ ప్లేయర్ను ఎలా ఉపయెగించుకుంటుందన్న అంశం మీద విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఇంత మంచి జట్టు ఉన్నా.. ఒకవేళ రాయల్స్ గనుక ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేదంటే నిజంగా అది సిగ్గుచేటే’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఐపీఎల్-2022 సీజన్లో ఫైనల్ వరకు వెళ్లిన రాజస్తాన్ రాయల్స్ ఆఖరి మెట్టుపై గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. ఇక గతేడాది ప్లే ఆఫ్స్(టాప్-4) కూడా చేరలేక ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. రాజస్తాన్ రాయల్స్ 2024 జట్టు సంజూ శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హిట్మెయిర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చాహల్, ఆడమ్ జంపా, రోవ్మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్ కాడ్మోర్, నండ్రే బర్గర్, అబిద్ ముస్తాక్, అవేశ్ ఖాన్ (లక్నో సూపర్ జెయింట్స్ నుంచి స్వాపింగ్). చదవండి: Anant- Radhika: రోహిత్ తిరుగు పయనం.. భయ్యాకు కోపం వచ్చిందంటే! -
అతడు తప్పు చేయలేదు.. అలాంటపుడు శిక్ష ఎందుకు?
స్టార్ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లను వార్షిక కాంట్రాక్టు జాబితా నుంచి తొలగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో బీసీసీఐని కొంతమంది సమర్థిస్తుంటే.. మరికొంత మంది మాజీ క్రికెటర్లు మాత్రం తప్పుబడుతున్నారు. కాగా సెంట్రల్ కాంట్రాక్టు కలిగి ఉన్న క్రికెటర్లందరూ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా తప్పక దేశవాళీ క్రికెట్లో ఆడాలని బీసీసీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. కోచ్, కెప్టెన్, సెలక్టర్ల సూచనల మేరకు ఎవరైతే దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందో నిర్ణయిస్తామని తెలిపింది. ముఖ్యంగా ఫిట్గా ఉన్న యువ ఆటగాళ్లు బోర్డు సూచించినపుడు తప్పక డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని ఆటగాళ్లను ఆదేశించింది. అయితే, అయ్యర్, ఇషాన్ ఈ నిబంధనలు ఉల్లంఘించారనే వార్తల నడుమ.. వారిద్దరి సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేయడం ఇందుకు బలాన్నిచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లకు అండగా నిలబడ్డాడు. వారికి మద్దతుగా నిలుస్తూ.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వంటి వాళ్లకు మాత్రం ఈ నిబంధనల నుంచి ఎలా మినహాయింపు ఇస్తారని ప్రశ్నించాడు. ఈ క్రమంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘హార్దిక్ పాండ్యా విషయాన్ని సంక్లిష్టం చేయాల్సిన అవసరం లేదు. అతడు ఎన్నో ఏళ్లుగా రెడ్ బాల్ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. కాబట్టి ఈ నిబంధన విషయంలో అతడి గురించిన ప్రస్తావనే అనవసరం. అతడు టెస్టు సిరీస్లకు అందుబాటులోనే ఉండటం లేదు. అలాంటపుడు అతడిని ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడమని చెప్పడంలో అర్థమే లేదు. నాలుగు రోజుల మ్యాచ్కు ఓ ఆటగాడి శరీరం సహకరించనపుడు. గాయాల బారిన పడే ప్రమాదం ఉందనీ తెలిసినపుడు అలాంటి వ్యక్తిని ఎవరూ కూడా ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడమని ఆదేశించరు. ఒకవేళ తను టెస్టు ఆడేందుకు పూర్తి ఫిట్గా ఉంటే.. తను టీమిండియాకు ఆడటం మానేసి.. ప్రమోషన్ షూట్లలో పాల్గొంటే అప్పుడు తనది తప్పని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం అతడు ఇలాంటి తప్పులేమీ చేయలేదు. కాబట్టి బీసీసీఐకి అతడిని శిక్షించాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నాడు. చదవండి: Shreyas Iyer: సెమీస్ తుదిజట్టులో అయ్యర్.. రహానే కీలక వ్యాఖ్యలు -
'అతడొక లీడింగ్ వికెట్ టేకర్.. అయినా కాంట్రాక్ట్ నుంచి'
బీసీసీఐ తాజాగా 2024-25 ఏడాదికి గానూ వార్షిక ఆటగాళ్ల కాంట్రాక్టులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో భారత స్టార్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ లిస్ట్లో వీరిద్దరితో పాటు చాలా మంది క్రికెటర్ల పేర్లు లేవు. అందులో స్టార్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఒకడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి చాహల్ను తప్పించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని చోప్రా తెలిపాడు. "సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో యూజీ చాహల్ పేరు లేకపోవడం చూసి నేను ఆశ్యర్యపోయాను. ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే,శిఖర్ ధావన్, దీపక్ హుడాలను తప్పించడంలో ఒక అర్ధముంది. కానీ చాహల్ టీ20ల్లో భారత తరుపున లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నాడు. అటువంటి ఆటగాడికి కాంట్రాక్ట్ దక్కకపోవడం దురదృష్టకరం. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం దేనికి సంకేతమో నాకు అర్ధం కావడం లేదు. బహుశా వారు చాహల్ స్ధానంలో కొత్త ఆటగాడిని వెతుకుతున్నట్లున్నారని" తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు. కాగా చాహల్ గతేడాది ఆగస్టు నుంచి జట్టుకు దూరంగా ఉంటున్నాడు. -
Ind vs Eng 3rd Test: భరత్నే ఆడించండి.. అతడు వద్దు!
India vs England, 3rd Test: ఇంగ్లండ్తో మూడో టెస్టులో శ్రీకర్ భరత్నే టీమిండియా వికెట్ కీపర్గా కొనసాగించాలని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. బ్యాటింగ్ విషయాన్ని పక్కనపెడితే.. కీపర్గా భరత్ రాణిస్తున్న విషయాన్ని మర్చిపోవద్దని గుర్తుచేశాడు. పిచ్లు కఠినంగా ఉన్న కారణంగానే కేఎల్ రాహుల్ను వికెట్ కీపర్గా కాకుండా బ్యాటర్గా ఆడిస్తున్నారన్న ఆకాశ్ చోప్రా.. కాబట్టి భరత్ బ్యాటింగ్ వైఫల్యాన్ని భూతద్దంతో చూడద్దని విజ్ఞప్తి చేశాడు. కాగా సౌతాఫ్రికా పర్యటన నుంచి ఇషాన్ కిషన్ మధ్యలోనే నిష్క్రమించడంతో మరోసారి ఆంధ్ర క్రికెటర్ టీమిండియాలో భాగమయ్యాడు. ప్రొటిస్తో టెస్టుల తర్వాత ఇంగ్లండ్తో స్వదేశంలో ఆడుతున్న సిరీస్లోనూ కీపర్గా భరత్కు అవకాశం వచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టులో అతడు 69 పరుగులు చేశాడు. అయితే, సొంతమైదానం విశాఖపట్నంలో జరిగిన రెండో మ్యాచ్లో మాత్రం భరత్ పూర్తిగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్లో కలిపి 23 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో మూడో టెస్టులో ధ్రువ్ జురెల్ అరంగేట్రానికి మేనేజ్మెంట్ సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. భరత్ స్థానంలో వికెట్ కీపర్గా అతడికి ఛాన్స్ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాత్రం భరత్నే కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. ‘‘ధ్రువ్ జురెల్ అరంగేట్రం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నా అభిప్రాయం ప్రకారం.. భరత్నే కొనసాగించడం మంచిది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగింది రెండే టెస్టులు. అతడు వికెట్ కీపింగ్ బాగానే చేస్తున్నాడు. కానీ అందరూ అతడి బ్యాటింగ్ వైఫల్యాన్నే ఎత్తి చూపుతున్నారు. పిచ్లు కఠినంగా ఉంటాయనే కారణంగానే రాహుల్ను ప్యూర్ బ్యాటర్గా మాత్రమే బరిలోకి దించారు కదా. మరి భరత్ను స్పెషలిస్టు కీపర్గానే చూడాలి కదా. హైదరాబాద్ టెస్టులో అతడు బ్యాటింగ్ కూడా బాగానే చేశాడు. అయినా కూడా.. బ్యాటర్గానే అతడి సేవలు కావాలనుకుంటే.. కనీసం మరొక్క మ్యాచ్లోనైనా అవకాశం ఇవ్వాలి. ఇప్పుడే తొందరపడకూడదు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కాగా ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: వదినమ్మ అంటూనే వెకిలి కామెంట్.. పో.. ఇక్కడి నుంచి! -
భరత్కే పెద్దపీట.. అంతేగానీ అతడిని ఇప్పట్లో ఆడించరు!
టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ పునరాగమనంపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో వికెట్ కీపర్గా ప్రస్తుతం కేఎస్ భరత్కే మేనేజ్మెంట్ పెద్దపీట వేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఒకవేళ ఏదేని కారణాల చేత భరత్ జట్టుకు దూరమైతే.. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ లేదంటే జగదీశన్ వంటి వాళ్లకు ఛాన్స్ ఇస్తారని అభిప్రాయపడ్డాడు. అంతేగానీ.. ఇషాన్ కిషన్కు మాత్రం రీఎంట్రీ అంత సులువుకాదని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. బ్రేక్ తీసుకున్న ఇషాన్ కాగా మానసికంగా అలసిపోయానంటూ సౌతాఫ్రికా పర్యటన నుంచి ఇషాన్ కిషన్ మధ్యలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబంతో సమయం గడుపుతూనే.. వర్కౌట్లతో బిజీ అయ్యాడు. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్తో ఇషాన్ కిషన్కు విభేదాలు తలెత్తాయన్న వార్తల నడుమ.. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాతే ఇషాన్ తిరిగి జట్టులోకి వస్తాడని పేర్కొన్నాడు. అయితే, రంజీ ట్రోఫీ-2024 రూపంలో అవకాశం ఉన్నా.. ఇషాన్ మాత్రం దానిని పక్కనపెట్టాడు. భరత్కు అవకాశం జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్వాగతం పలికినా జట్టుతో చేరలేదు. ఇదిలా ఉంటే.. ఇషాన్ తిరిగి వచ్చిన తర్వాత సౌతాఫ్రికాతో టెస్టుల్లో అతడి స్థానాన్ని భర్తీ చేసిన ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ భరత్.. స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టుల్లోనూ ఆడుతున్నాడు. అయితే, వికెట్ కీపింగ్ పరంగా అతడికి మంచి మార్కులే పడుతున్నా.. బ్యాటర్గా ఆకట్టుకోలేకపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇషాన్ కిషన్ మేనేజ్మెంట్ను అడిగి మరీ విరామం తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు. తన బ్రేక్ను పొడిగిస్తూనే ఉన్నాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లోనూ కనిపించడం లేదు. మానసికంగా అలసిపోయానంటూ అతడు సెలవు తీసుకున్నాడు. తను బాగుండాలని కోరుకుంటున్నా. అయితే, ఇప్పట్లో అతడు నేరుగా టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేదు. కేఎస్ భరత్ వికెట్ కీపర్గా జట్టులో ఉన్నాడు. అతడి గైర్హాజరీలో ధ్రువ్ జురెల్ లేదంటే.. జగదీశన్ కూడా జట్టులోకి వస్తారేమో కూడా తెలియదు. కానీ.. ఇషాన్ కిషన్కు మాత్రం పిలుపునివ్వరు. అతడు దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాతే మళ్లీ జాతీయ జట్టుకు సెలక్ట్ చేస్తారు’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఆ విషయంలో కోహ్లితో పోల్చవద్దు ఈ సందర్భంగా.. ‘‘విరాట్ కోహ్లి కూడా కాంపిటేటివ్ క్రికెట్ ఆడటం లేదు కదా అంటూ ప్రశ్నలు వేయద్దు. ఎందుకంటే.. కోహ్లి, ఇషాన్ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి.. దయచేసి ఇద్దరినీ పోల్చే ప్రయత్నం చేయొద్దు’’ అంటూ ట్రోల్ చేసే వాళ్లకు చురకలు అంటించాడు ఆకాశ్ చోప్రా. చదవండి: Virat Kohli: అంతా అబద్ధం.. కోహ్లి విషయంలో మాట మార్చిన డివిలియర్స్ -
అతడిని చూస్తే యువీ గుర్తుకొస్తున్నాడు.. హార్దిక్ను వదిలేసి!
India Potential Selection Dilemma For T20 World Cup 2024: టీమిండియా ఆల్రౌండర్ శివం దూబేపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. దూబే ఆట తీరు చూస్తుంటే తనకు యువరాజ్ సింగ్ గుర్తుకు వస్తున్నాడని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో ఈ ముంబై బ్యాటర్కు కచ్చితంగా చోటివ్వాలని ఆకాశ్ చోప్రా బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్ సందర్భంగా చాలా ఏళ్ల తర్వాత టీమిండియా తరఫున బరిలోకి దిగిన శివం దూబే.. అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్లో మూడు మ్యాచ్లలో కలిపి 124 పరుగులు సాధించిన ఈ పేస్ ఆల్రౌండర్.. రెండు వికెట్లు తీశాడు. పాండ్యా గైర్హాజరీలో చోటు సంపాదించి.. సత్తా చాటి తద్వారా టీమిండియా 3-0తో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. గాయం కారణంగా దూరమైన హార్దిక్ పాండ్యా స్థానంలో వచ్చిన అవకాశాన్ని ఇలా పూర్తిగా సద్వినియోగం చేసుకున్న దూబే.. ప్రపంచకప్-2024 రేసులో తానూ ఉన్నానంటూ సెలక్టర్లకు గట్టి సందేశమే పంపాడు. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘శివం అతి సుందరం.. పవర్ హిట్టర్.. మూడో టీ20లో అతడిని ఇంకాస్త లేట్గా బ్యాటింగ్కు పంపాల్సింది. శివం కంటే ముందుగా సంజూ శాంసన్ లేదంటే.. రింకూ సింగ్ను బరిలోకి దించితే బాగుండేది. ఎందుకంటే శివం.. ఆచితూచి ఆడే ప్లేయర్ కాదు.. అటాకర్. అటాకర్.. అచ్చం యూవీ మాదిరే బౌలర్లపై ఆధిపత్యం కొనసాగిస్తూ దూకుడు ప్రదర్శించగలడు. నాకు అతడిని చూస్తే యువీ గుర్తుకువస్తాడు. శివంను లోయర్ ఆర్డర్లో ఆడిస్తేనే ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయి’’ అని అభిప్రాయపడ్డాడు. ఇద్దరూ జట్టులో ఉండాలి అదే విధంగా.. ‘‘తొలి రెండు మ్యాచ్లలో శివం దూబే ఎంత శక్తిమంతంగా సిక్సర్లు బాదాడో చూశాం. అతడి ఆట తీరుకు ముచ్చటపడి కొందరైతే హార్దిక్ను వదిలేసి.. దూబేను జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. నా వరకైతే ఈ ఇద్దరూ జట్టులో ఉంటే బాగుంటుంది. అఫ్గన్తో మూడు మ్యాచ్లలో అదరగొట్టి తాను ప్రపంచకప్ రేసులో ఎవరి కంటే తక్కువ కాదని దూబే నిరూపించాడు. అసలైన పోటీదారు అనిపించుకున్నాడు. ఐపీఎల్లోనూ దూబే ఇలాగే రాణిస్తే.. టీమిండియాలోకి రాకుండా అతడిని ఎవరూ ఆపలేరు’’ అని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. చదవండి: Ayodhya Ram Mandir Inauguration: అయోధ్యకు వెళ్లి తీరతా.. ఏం చేస్తారో చేసుకోండి: హర్భజన్ సింగ్ Ranji Trophy 2024: బ్యాట్తో చెలరేగిన దూబే.. టెస్టుల్లోనూ ఎంట్రీకి సై! -
Ind Vs Eng: వాళ్లిద్దరి అధ్యాయం ఇక ముగిసినట్లే!
అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారా టెస్టు కెరీర్ అధ్యాయం ముగిసిపోయినట్లేనని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఇంగ్లండ్తో సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టుతో ఈ విషయం నిరూపితమైందని పేర్కొన్నాడు. ఇక ముందు ఈ వెటరన్ బ్యాటర్లు టీమిండియా తరఫున ఆడే అవకాశం లేదన్నాడు. కాగా ఒకప్పుడు టెస్టు స్పెషలిస్టులుగా టీమిండియాకు పలు చిరస్మరణీయ విజయాలు అందించారు రహానే, పుజారా. వైస్ కెప్టెన్గా రహానే.. నయావాల్గా పుజారా తమ వంతు పాత్రలను చక్కగా పోషించారు. కానీ గత కొన్ని రోజులుగా వీరిద్దరిని పక్కన పెట్టేశారు సెలక్టర్లు. అడపాదడపా వచ్చిన అవకాశాలను రహానే, పుజారా సద్వినియోగం చేసుకోకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు.. యంగ్ క్రికెటర్ల నుంచి ఎదురవుతున్న పోటీలోనూ వీరు వెనుకబడిపోయారు. దీంతో ఇటీవల సౌతాఫ్రికా పర్యటన రూపంలో బిగ్ సిరీస్ నేపథ్యంలో రహానే, పుజారాలను సెలక్టర్లు పట్టించుకోలేదు. తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ప్రకటించిన రెండు మ్యాచ్ల జట్టులోనూ చోటివ్వలేదు. వాళ్లిద్దరిది ముగిసిన అధ్యాయం ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. "ఊహించిన విధంగానే జట్టు ప్రకటన ఉంది. అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారాలను ఎంపిక చేయలేదు. ఇక వాళ్లిద్దరిది ముగిసిన అధ్యాయం. ఎప్పుడైతే సౌతాఫ్రికాతో ఆడే జట్టులో వారికి స్థానం ఇవ్వలేదో అప్పుడే ఇక ముందు కూడా వాళ్లకు ఆడే అవకాశం రాదని ఊహించాను. అక్కడ ధోని కెప్టెన్ కాబట్టి టీమిండియా దారులు మూసుకుపోయినా రహానేకు మాత్రం ఐపీఎల్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కు అతడు గత సీజన్లో ఆడాడు. ఈసారి కూడా బాగా ఆడితే మరికొన్నాళ్లపాటు కొనసాగగలడు. నిజానికి చెన్నైకి ఆడటం ముఖ్యం కాదు.. అక్కడ ధోని కెప్టెన్ కాబట్టి ఆ జట్టుకు ఆడి నిరూపించుకుంటే మళ్లీ టీమిండియా తలుపు తట్టవచ్చు" అని అభిప్రాయపడ్డాడు. కాగా ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక విజయం తర్వాత రహానే వరుసగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2023లో చెన్నైకి ఆడిన అతడు ఫుల్ఫామ్లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో చాలాకాలం తర్వాత ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021-23 ఫైనల్ సందర్భంగా టీమిండియాకు ఆడే చాన్స్ వచ్చింది. మిగతా వాళ్లంతా విఫలమైనా ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్లో మిగతా వాళ్లంతా విఫలమైనా రహానే మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే, పుజారా మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. ఈక్రమంలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే జట్టులో రహానేకు చోటు దక్కినా.. పుజారాకు మొండిచేయి ఎదురైంది. పుజారా డబుల్ సెంచరీ అయితే, కరేబియన్ గడ్డపై పాత కథను రిపీట్ చేసిన రహానే మళ్లీ టీమిండియాలో స్థానం సంపాదించలేకపోయాడు. ఇక పుజారా సంగతి సరేసరి. ఇంగ్లండ్ కౌంటీల్లో రాణిస్తున్నా సెలక్టర్లు కరుణించడం లేదు. తాజాగా రంజీ ట్రోఫీ-2024లో ఆరంభ మ్యాచ్లో పుజారా డబుల్ సెంచరీతో సౌరాష్ట్ర తరఫున సత్తా చాటగా.. ముంబై కెప్టెన్ రహానే మాత్రం డకౌట్ అయ్యాడు. -
ఈసారి తప్పు ముమ్మాటికీ రోహిత్దే.. చెత్త సెలక్షన్: మాజీ బ్యాటర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆట తీరుపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించాడు. అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్లో హిట్మ్యాన్ నుంచి ఇలాంటి ప్రదర్శన ఊహించలేదన్నాడు. ముఖ్యంగా రెండో టీ20లో రోహిత్ వికెట్ పారేసుకున్న విధానం విస్మయపరిచిందని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రీఎంట్రీలో రనౌట్ సుమారు పద్నాలుగు నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై అఫ్గన్తో తొలి మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ ఓపెనర్.. రనౌట్గా వెనుదిరిగి పూర్తిగా నిరాశపరిచాడు. ఇండోర్లో డకౌట్ మొహాలీ మ్యాచ్లో ఈ మేరకు.. శుబ్మన్ గిల్తో సమన్వయలోపం కారణంగా పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు రోహిత్. ఈ నేపథ్యంలో కనీసం రెండో టీ20లోనైనా హిట్మ్యాన్ మెరుపులు చూడాలని ఆశించిన వాళ్లకు మళ్లీ నిరాశే మిగిలింది. ఇండోర్లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో రోహిత్.. డకౌట్ అయ్యాడు. తప్పుడు షాట్ సెలక్షన్ అఫ్గన్ బౌలర్ ఫజల్హక్ ఫారూకీ సంధించిన బంతికి బౌల్డ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా రోహిత్ శర్మ బ్యాటింగ్ను విశ్లేషిస్తూ.. "రోహిత్ అవుటైన తీరు ఆశ్చర్యపరిచింది. తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఇలాంటి షాట్ ఎందుకు ఆడాడో అర్థం కాలేదు. బంతి నేరుగా స్టంప్స్ ను హిట్ చేసింది. సాధారణంగా రోహిత్ అలాంటి షాట్లు ఆడడు. తొలి టీ20లో సున్నాకే రనౌట్ అయ్యాడు. అందులో అతడి తప్పేమీ లేదు. కానీ రెండో టీ20లో తప్పుడు షాట్ సెలక్షన్తో మూల్యం చెల్లించాడు. ఈసారి తప్పు ముమ్మాటికీ అతడిదే. ఆ రోహిత్ కావాలి రోహిత్ శర్మ టీ20 ఆట తీరు, సామర్థ్యాలపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. కానీ అతడి నుంచి ఇలాంటి ప్రదర్శన ఎవరూ ఊహించరు. ఐపీఎల్ ద్వారానైనా రోహిత్ ఫామ్లోకి రావాలి. వన్డే వరల్డ్ కప్లో దంచికొట్టిన రోహిత్ శర్మ మనకి కావాలి" అని పేర్కొన్నాడు. ఏదేమైనా ఐపీఎల్-2024లో రోహిత్ బ్యాట్ ఝులిపిస్తేనే టీమిండియాకు వరల్డ్ కప్లో సానుకూలంగా ఉంటుందని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా.. అఫ్గనిస్తాన్తో రెండో టీ20లో రోహిత్ శర్మ విఫలం కాగా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్, పేస్ ఆల్రౌండర్ శివం దూబే ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరి కారణంగా రెండో టీ20లో గెలిచిన టీమిండియా సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. -
వరల్డ్కప్ జట్టులో ఉంటాడనుకుంటే.. కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా?!
It seemed like he could be in the World Cup team: టీమిండియా సెలక్టర్ల నిర్ణయాలను అర్థం చేసుకోవడం కష్టమని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ప్రపంచకప్-2024 జట్టులో ఉంటాడనుకున్న ఆటగాడిని అకస్మాత్తుగా ఎందుకు పక్కనపెట్టారని ప్రశ్నించాడు. ఒకప్పుడు ప్రతి సిరీస్కు ఎంపికైన ఆ ప్లేయర్కు ఇప్పుడు కనీసం భారత్-‘ఏ’ జట్టులో కూడా చోటు దక్కకపోవడం ఏమిటని వాపోయాడు. నెట్బౌలర్ నుంచి టీమిండియా స్థాయికి ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ప్రతిభావంతుల్లో జమ్మూ కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ ఒకడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో నెట్ బౌలర్గా మొదలైన అతడి ప్రయాణం.. టీమిండియాకు ఎంపిక అయ్యే స్థాయికి చేరుకుంది. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా 2022లో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ఈ రైటార్మ్ ఫాస్ట్బౌలర్. అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. తన పదునైన, వేగవంతమైన డెలివరీలతో బ్యాటర్లను తిప్పలు పెట్టడంలో ఉమ్రాన్ మాలిక్ దిట్ట. ఈ క్రమంలో టీమిండియా టీ20 జట్టులో కీలక సభ్యుల్లో ఒకడిగా మారాడు ఈ ఫాస్ట్బౌలర్. అయితే, ఐపీఎల్-2023లో పేలవ ప్రదర్శన తర్వాత ఒక్కసారిగా ఉమ్రాన్ మాలిక్ రాత తలకిందులైంది. వాళ్లిద్దరికి మాత్రం ఛాన్స్లు ఫామ్లేమితో సతమతమవుతున్న అతడికి వెస్టిండీస్ టూర్ రూపంలో టీమిండియా మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కరేబియన్ దీవుల్లో ఆడిన రెండు వన్డేల్లో ధారాళంగా పరుగులు ఇచ్చుకుని జట్టులో తన స్థానాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు ఉమ్రాన్. అయితే, ఉమ్రాన్ మాలిక్ మాదిరే అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్లు కూడా వైఫల్యం చెందినా బీసీసీఐ సెలక్టర్లు వారికి అవకాశాలు ఇస్తున్నారు. తాజాగా అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్కు ఎంపిక చేసిన జట్టులోనూ ఉమ్రాన్కు స్థానం దక్కకపోగా.. వీరిద్దరు మాత్రం చోటు దక్కించుకోవడం విశేషం. మొన్నటిదాకా ఎక్కడ చూసినా అతడే ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... ‘‘కొంతకాలం క్రితం ఎక్కడ చూసినా ఉమ్రాన్ మాలికే కనబడ్డాడు. అతడిని వెస్టిండీస్ పర్యటనకు తీసుకువెళ్లారు. ఒకానొక సందర్భంలో అతడు వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమని అందరూ భావించారు. కానీ.. ఇటీవల వరుస సిరీస్లలో అతడికి మొండిచేయే చూపారు. కనీసం ఇండియా-ఏ జట్టుకు కూడా అతడిని ఎంపిక చేయలేదు. మూడు నెలల కాలంలోనే అంత పెద్ద మార్పులేం జరిగిపోయాయి. టీమిండియాలో అడుగుపెట్టి.. కొన్ని అవకాశాలు అందిపుచ్చుకున్న తర్వాత.. అకస్మాత్తుగా అతడు కనిపించకుండా పోయాడు. అసలు ఉమ్రాన్ మాలిక్ ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? అతడి విషయంలో అసలు ఏం జరుగుతోంది? ఎందుకు ఇలా జరుగుతోంది అన్న విషయాలను మనం తెలుసుకోవాలి’’ అని పేర్కొన్నాడు. ఉమ్రాన్ మాలిక్కు తగినన్ని అవకాశాలు ఇవ్వాలని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా మేనేజ్మెంట్కు సూచించాడు. కాగా గతేడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్తో టీ20లో ఉమ్రాన్ మాలిక్ తన అత్యుత్తమ గణాంకాలు (2/9- 2.1 ఓవర్లలో) నమోదు చేశాడు. మొత్తంగా తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు ఆడిన 10 వన్డేల్లో 13, 8 టీ20లలో 11 వికెట్లు తీశాడు ఉమ్రాన్ మాలిక్. చదవండి: Ind Vs Afg: అఫ్గన్తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
‘మనం వద్దని మాల్దీవులు ఓటేసింది.. ఇకపై అక్కడికి వెళ్తారా? లేదా..’
Cricket Stars Fume Over Maldives Row: భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులను టీమిండియా మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. భారతీయులను తక్కువ చేసేలా మాట్లాడటం తగదని హితవు పలుకుతున్నారు. గతంలో ఎన్నోసార్లు మాల్దీవుల పర్యటనకు వెళ్లామని.. కానీ ఇకపై అలాంటి పరిస్థితులు ఉండబోవని స్పష్టం చేస్తున్నారు. భారతదేశంలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని.. ఇకపై వాటిపైనే మనమంతా దృష్టి సారించాలని పిలుపునిస్తున్నారు. భారత పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేలా తమ వంతు సహకారం అందిస్తామంటూ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి మద్దతు తెలుపుతున్నారు. మోదీ ఫొటోలు వైరల్.. మాల్దీవుల మంత్రుల నోటి దురుసు కాగా ప్రధాని మోదీ.. కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్లో ఇటీవల పర్యటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో లక్షద్వీప్ను పర్యాటక ధామంగా మార్చాలంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు మాల్దీవులతో లక్షద్వీప్ను పోలుస్తూ ప్రధాని మోదీ ఫొటోలను నెట్టింట వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో మాల్దీవుల మంత్రులు మోదీని కించపరిచే విధంగా తోలుబొమ్మ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. భారత్లో బీచ్లు, హోటల్ గదులు శుభ్రంగా ఉండవని.. అలాంటి దేశంతో తమకు పోలికేంటని వివాదాస్పద రీతిలో కామెంట్లు చేశారు. దీంతో బాయ్కాట్ మాల్దీవ్స్, #ExploreIndianIslands ట్రెండ్ చేస్తున్నారు భారత నెటిజన్లు. మన పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా, మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, మాజీ బ్యాటర్ సురేశ్ రైనా తదితరులు స్పందించారు. ఈ మేరకు సెహ్వాగ్.. ‘‘ఉడుపి, పాండిలోని పారడైజ్ బీచ్, అండమాన్లోని నీల్, హవెలాక్తో పాటు దేశంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇంతవరకు మనం చూడని చక్కటి బీచ్లు కూడా చాలా ఉన్నాయి. మన ప్రధాని పట్ల మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన తీరును అందరూ గమనించాలి. ఇకపై అవసరమైన చోట్ల మౌలిక సదుపాయాలు మరింత అభివృద్ధి చేసి మన పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసి.. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకోవాలి’’ అని పేర్కొన్నాడు. Whether it be the beautiful beaches of Udupi , Paradise Beach in Pondi, Neil and Havelock in Andaman, and many other beautiful beaches throughout our country, there are so many unexplored places in Bharat which have so much potential with some infrastructure support. Bharat is… pic.twitter.com/w8EheuIEUD — Virender Sehwag (@virendersehwag) January 7, 2024 ఇక ఇర్ఫాన్ పఠాన్.. ‘‘నాకు 15 ఏళ్ల వయసు ఉన్నపటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో పర్యటించాను. ఇండియన్ హోటల్స్లో లభించిన ఆతిథ్యం మరెక్కడా లభించదు. మన దేశంలో ఉన్నన్ని పర్యాటక ప్రాంతాలు మరెక్కడా లేవు. మనం ప్రతి దేశ సంస్కృతిని గౌరవిస్తాం. కానీ.. నా మాతృదేశం గురించి, ఇక్కడి ఆతిథ్యం గురించి ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలు వినడం ఎంతో బాధిస్తోంది’’ అని మాల్దీవుల మంత్రులకు చురకలు అంటించాడు. Having traveled the world since I was 15, every new country I visit reinforces my belief in the exceptional service offered by Indian hotels and tourism. While respecting each country's culture, it's disheartening to hear negative remarks about my homeland's extraordinary… — Irfan Pathan (@IrfanPathan) January 7, 2024 మనం వద్దని మాల్దీవులు ఓటేసింది.. ఇక వెళ్లాలా లేదా? అదే విధంగా ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘ఇండియా వద్దని మాల్దీవులు ఓటేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో.. వెళ్లవద్దో అన్న అంశంలో భారతీయులు తెలివిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా కుటుంబం అయితే, ఇలాగే చేస్తుంది. జై హింద్’’ అని పేర్కొన్నాడు. ‘India Out’ was a part of the manifesto. Maldives voted for it. Now, it’s up to us, Indians, to choose wisely. I know that my family will. Jai Hind 🇮🇳 — Aakash Chopra (@cricketaakash) January 6, 2024 కాగా మోదీపై అనుచిత వ్యాఖ్యల కారణంగా ఇప్పటికే చాలా మంది భారత ప్రముఖులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. పర్యాటకమే ఆయువుపట్టుగా ఉనికిని చాటుకుంటున్న తమకు.. తాజా పరిణామాలు భారీ నష్టం చేకూరుస్తాయని పసిగట్టిన మాల్దీవుల ప్రభుత్వం.. ఇప్పటికే సదరు మంత్రులపై వేటు వేసింది. -
ఆసియాలో పులి.. అక్కడ మాత్రం జీరో! కింగ్ అవ్వాలంటే అదొక్కటే
వైట్బాల్ క్రికెట్లో అదరగొడుతున్న టీమిండియా ఓపెనర్ శుబ్మన్ గిల్.. టెస్టుల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. 2023 ఏడాదిలో మొత్తంగా 45 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన గిల్ 7 సెంచరీలు, 10 అర్ధసెంచరీల సాయంతో 2,118 పరుగులు చేశాడు. అయితే ఏడాది టెస్టుల్లో మాత్రం గిల్ 10 ఇన్నింగ్స్లలో కేవలం 258 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒకే ఒక సెంచరీ ఉంది. మిగితా ఆరు సెంచరీలు వన్డేలు, టీ20లో చేసినవే. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో కూడా గిల్ దారుణంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్లు కలిపి కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో గిల్పై టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో కాకుండా విదేశీ పిచ్లపై కూడా రాణిస్తానే అత్యుత్తమ టెస్టు బ్యాటర్గా పరిగిణించబడతారని చోప్రా తెలిపాడు. తన యూట్యూబ్ ఛానెల్లో చోప్రా మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో శుబ్మన్ గిల్ ప్రదర్శన నన్ను చాలా నిరాశపరిచింది. గిల్ను అభిమానులు ప్రిన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని పిలుచుకుంటారు. ప్రిన్స్ నుంచి రాజుగా మారాలంటే అతడు రెడ్బాల్ క్రికెట్లో నిలకడగా రాణించాలి. ముఖ్యంగా సేనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్,న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అతడి గణంకాలను మెరుగుపరుచుకోవాలి. ఆసియాలో అతడి రికార్డులు అద్బుతంగా ఉన్నాయి. అదే సేనా దేశాల్లో అతడి రికార్డులు ఆసియాకు భిన్నంగా ఉన్నాయి. గిల్కు ఇంకా చాలా కెరీర్ ఉంది. అతడు రాబోయో రోజుల్లో సేనా దేశాల్లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తాడని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. చదవండి: Test team of the year 2023: అత్యుత్తమ టెస్టు జట్టు ఇదే.. కోహ్లి, రోహిత్లకు నో ఛాన్స్ -
విరాట్ కోహ్లికి రూ.42 కోట్లు.. టీమిండియా మాజీ ఓపెనర్ సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్-2024 వేలంలో స్టార్క్ను రూ.24.75 కోట్ల భారీ ధరకు కోల్కతా నైట్రైడర్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా స్టార్క్ నిలిచాడు. అతడితో పాటు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా భారీ మొత్తం దక్కించుకున్నాడు. రూ.20.50 కోట్లకు ఎస్ఆర్హెచ్ కొనుగొలు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాళ్లు సురేష్ రైనా, ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ఆటగాళ్ల కంటే విదేశీ ఆటగాళ్లపై ఎక్కువ మొత్తం ఫ్రాంచైజీలు వెచ్చించడాన్ని రైనా తప్పుబట్టాడు. మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ వంటి టీమిండియా స్టార్లు విదేశీ ఆటగాళ్ల కంటే తక్కువ తీసుకుంటున్నారని అతడు అన్నాడు. అదే విధంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రస్తుతం వేలంలోకి వస్తే రూ. 42 కోట్లకు అమ్ముడుపోతాడని ఆకాష్ చోప్రా జోస్యం చెప్పాడు. అయితే అందుకు ఐపీఎల్ రూల్స్ సవరించాల్సి ఉంటుందని చోప్రా చెప్పుకొచ్చాడు. "ఐపీఎల్ రూల్స్లో కొన్ని మార్పులు చేయాలి. ప్రతీ ఫ్రాంచైజీ పర్స్ను రూ.200 కోట్లకు పెంచాలి. అందులో భారత ఆటగాళ్ల కోసం రూ.150 కోట్లు వెచ్చించేలా కండీషన్ పెట్టాలి. మిగిలిన 50 కోట్ల రూపాయలను విదేశీ క్రికెటర్ల కోసం ఉంచాలి. అప్పుడు కోహ్లి వేలంలో వస్తే 42 కోట్ల రూపాయలకు అమ్ముడుపోతాడని" జియో సినిమాతో చోప్రా పేర్కొన్నాడు. రైనా మాట్లాడుతూ.. "ప్రస్తుతం భారత స్టార్లు జస్ప్రీత్ బుమ్రాకు రూ.12 కోట్లు, మహ్మద్ షమీకి రూ.5 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. ధోని కూడా కేవలం రూ.12 కోట్లకే సీఎస్కే ఆడుతున్నాడు. 8 ఏళ్ల పాటు ఐపీఎల్ ఆడని ఆటగాడికి దాదాపు రూ.25 కోట్లు ఇచ్చారు. అది సరైన నిర్ణయం కాదని అన్నాడు. చదవండి: IPL 2024 Auction: వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ కసి చూపించేశాడు! 10 సిక్స్లతో విధ్వంసం -
పంజాబ్ కింగ్స్లోకి ఆసీస్ విధ్వంసకర ఆటగాడు..!?
వన్డే వరల్డ్కప్లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆసీస్ ఆరోసారి వరల్డ్ ఛాంపియన్స్గా నిలవడంలో హెడ్ది కీలక పాత్ర. . భారత్తో జరిగిన ఫైనల్లో 137 పరుగులతో హెడ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓవరాల్గా మెగా టోర్నీలో కేవలం 5 మ్యాచ్లు మాత్రమే ఆడిన హెడ్.. 44 సగటుతో 220 పరుగులు చేశాడు. కాగా ఈ వరల్డ్కప్ హీరో ఐపీఎల్-2024 మినీ వేలంలో రూ.2 కోట్ల కనీస తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. అద్భుత ఫామ్లో ఉన్న అతడి కోసం ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వేలంలో ట్రావిస్ హెడ్ను దక్కించుకోవడానికి పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ప్రయత్నించాలని అకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. "మిని వేలంలో పంజాబ్ కింగ్స్ అఫ్గాన్ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ కోసం ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది. సామ్ కుర్రాన్ స్ధానంలో అతడిని ఆడించే ఛాన్స్ ఉంది. నా వరకు అయితే కుర్రాన్ కంటే ఒమర్జాయ్ బాగా రాణిస్తాడని అనుకుంటున్నాను. అయితే ఒమర్జాయ్తో పాటు ట్రావిడ్ హెడ్ కోసం కూడా పంజాబ్ ట్రై చేయాలి. అతడు జానీ బెయిర్స్టోకు హెడ్ ప్రత్యామ్నయంగా ఉంటాడు. అతడికి బ్యాటింగ్తో పాటు బౌలింగ్ చేసే స్కిల్ కూడా ఉంది. అదే విధంగా భారత బౌలర్ కావాలనుకుంటే లార్డ్ శార్ధూల్ ఠాకూర్ కూడా అందుబాటులో ఉన్నాడు" అని తన యూట్యాబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024 మినీవేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. చదవండి: World Cup 2023: వన్డే వరల్డ్కప్ ఫైనల్ పిచ్కు ఐసీసీ రేటింగ్.. ఎంతంటే? -
ఆడేది 3 మ్యాచ్లు మాత్రమే.. 17 మంది ఎందుకు? భారత సెలక్టర్లపై ప్రశ్నల వర్షం
దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత జట్లను బీసీసీఐ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. సౌతాఫ్రికా టూర్లో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్లకు మూడు వేర్వేరు జట్లను బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. మూడు ఫార్మాట్లలో ముగ్గురు వెర్వేరు కెప్టెన్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాతో టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు సారథ్యం వహించనుండగా.. వన్డేల్లో రాహుల్.. టెస్టుల్లో రోహిత్ శర్మకు జట్టు పగ్గాలను అప్పగించారు. అయితే ప్రోటీస్తో వైట్ బాల్ సిరీస్లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి దూరమయ్యారు. ఇక ఇది ఇలా ఉండగా.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు 17 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఎంపికపై టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. టీ20లకు 17 మంది సభ్యులను సెలక్టర్లు ఎందుకు ఎంపిక చేశారో అర్ధం కావడం లేదని చోప్రా అన్నాడు. కాగా ఆసీస్తో టీ20 సిరీస్కు దూరమైన రవీంద్ర జడేజా, శుబ్మన్ గిల్, మహ్మద్ సిరాజ్చ కుల్దీప్ యాదవ్.. దక్షిణాఫ్రికాతో సిరీస్కు మాత్రం అందుబాటులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. "దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లో సూర్యకుమార్ యాదవ్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇది సరైన నిర్ణయమే. రవీంద్ర జడేజాను వైస్కెప్టెన్గా ఎంపిక చేశారు. ఇది కాస్త ఆసక్తికర నిర్ణయం. కానీ కేవలం మూడు మ్యాచ్ల సిరీస్కు 17 మంది ఆటగాళ్లు ఎందుకు? ఇప్పుడు తిలక్ వర్మ, రింకూ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు దక్కే సూచనలు కన్పించడం లేదు. ప్లేయింగ్ ఎలెవన్ను ఎంపిక చేయడం కూడా చాలా కష్టతరమవుతోంది. కనీసం నలుగురు ఆటగాళ్లు సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా బెంచ్కే పరిమితమవుతారు. అటువంటి అంతమంది ఆటగాళ్లను దక్షిణాఫ్రికాకు పంపడం ఎందుకు "అని ప్రశ్నల వర్షం కురిపించాడు. దక్క్షిణాఫ్రికాతో టీ20లకు భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ , అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్. -
అంతా సాఫీగా సాగుతున్నప్పుడు హార్దిక్ ఫ్రాంచైజీ మారడం ఎందుకు..?
ఐపీఎల్ 2024 ఎడిషన్ ప్రారంభానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్ (నిలబెట్టుకోవడం), రిలీజ్ (వేలానికి వదిలేయడం) ప్రక్రియ నిన్నటితో (నవంబర్ 26) ముగిసింది. ఇందులో భాగంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. హార్దిక్ ఫ్రాంచైజీ మార్పు ఇందులో ప్రధానమైన అంశం. గుజరాత్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను రిటైన్ చేసుకున్నట్లే చేసుకుని, ట్రేడింగ్ అంటూ అతన్ని ముంబై ఇండియన్స్కి వదిలేసింది. ఈ అనూహ్య పరిణామం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. హార్ధిక్ ముంబై ఇండియన్స్కు వచ్చేస్తున్నాడని కొద్దిరోజుల ముందు నుంచే ప్రచారం జరిగినప్పటికీ ఆఖర్లో ప్రాంచైజీకి చెందిన ఓ కీలక వ్యక్తి ఇందుకు నో చెప్పాడని టాక్ వినిపిస్తుంది. అందుకే గుజరాత్ హార్దిక్ను రిటైన్ చేసుకుందని, ఈ లోపే ముంబై యాజమాన్యం జోక్యం చేసుకుని హార్దిక్ను సొంతగూటికి చేరేలా చేసిందని ప్రచారం జరుగుతుంది. అసలు హార్దిక్ ఫ్రాంచైజీ మారడమెందుకు..? ట్రేడింగ్ అనే టాపిక్కు ముందు అసలు హార్దిక్ ఫ్రాంచైజీ మారేందుకు ఎందుకు పచ్చ జెండా ఊపాడనే విషయం చర్చయనీయాంశంగా మారింది. టైటాన్స్ను అరంగేట్రం ఎడిషన్లోనే ఛాంపియన్గా, రెండో దఫా రన్నరప్గా నిలబెట్టిన హార్దిక్.. అంతా సాఫీగా సాగుతుండగా ఇంతటి కఠినమైన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడన్న విషయం అభిమానులకు అంతుపట్టడం లేదు. సోషల్మీడియాలో నడుస్తున్న ప్రచారం ప్రకారం హార్దిక్కు-టైటాన్స్ మేనేజ్మెంట్కు రెమ్యూనరేషన్ విషయంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తుంది. ఈ విషయమే హార్దిక్ ఫ్రాంచైజీ మార్పుకు ప్రధాన కారణమని సమాచారం. Once in a while life would give you an opportunity to choose between money and legacy. Whatever you choose will define you for the rest of your life. — Aakash Chopra (@cricketaakash) November 27, 2023 ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. హార్దిక్ రెమ్యూనరేషన్ కోసం ఫ్రాంచైజీ మారాడని పరోక్షంగా ఆరోపిస్తూ ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక్కోసారి జీవితంలో డబ్బు, విలువల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఎంచుకున్నదే మీ జీవితాంతం మిమ్మల్ని నిర్వచిస్తూ ఉంటుందని హార్దిక్ను ఉద్దేశిస్తూ వివాదాస్పద ట్వీట్ చేశాడు. ఇలాంటి నిరాధారమైన ప్రచారాలను పక్కన పెడితే అసలు హార్దిక్ ఫ్రాంచైజీ ఎందుకు మారాడన్న విషయం ప్రస్తుతం క్రికెట్ అభిమానులకు చర్చనీయాంశంగా మారింది. -
వచ్చే ఆరునెలలూ కేవలం టీ20లే ఆడించండి: టీమిండియా మాజీ ఓపెనర్
Ind Vs Aus 1st T20- Suryakumar Yadav: టీమిండియా తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టడంలో ‘స్కై’కి ఎవరూ సాటిరారని పేర్కొన్నాడు. ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ ధాటికి ప్రత్యర్థి జట్టు తమ ప్రణాళికలను అప్పటికప్పుడు మార్చుకోవాల్సి వస్తుందంటూ ఆకాశానికెత్తాడు. తొలిసారి టీమిండియా కెప్టెన్గా కాగా రోహిత్ శర్మ గైర్హాజరీ, హార్దిక్ పాండ్యా గాయపడిన నేపథ్యంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు సూర్య టీమిండియా కెప్టెన్గా ఎంపికయ్యాడు. తొలిసారిగా భారత జట్టు పగ్గాలు చేపట్టిన ఈ ముంబై బ్యాటర్ గురువారం నాటి తొలి మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వైజాగ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి.. 208 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాకులు తగిలాయి. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రనౌట్ కాగా.. మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 21 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆదిలోనే జట్టు ఇలా కష్టాల్లో కూరుకుపోయిన వేళ వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 58 పరుగులతో అదరగొట్టగా... నాలుగో స్థానంలో దిగిన సూర్య ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. నో బాల్తో విజయం ఖరారు మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 190కి పైగా స్ట్రైక్రేటుతో 80 పరుగులు సాధించాడు. ఇక రింకూ సింగ్ ఆఖరి బంతికి షాట్ బాది(నో బాల్ వల్ల.. ఆ సిక్సర్ కౌంట్ కాలేదు) టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. సూర్య వచ్చాడంటే వ్యూహాలు మార్చాల్సిందే ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్.. ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టేలా ఉంటుంది. నార్మల్ బాల్ వేస్తే కచ్చితంగా షాట్ బాదుతాడు. మిడిలార్డర్లో తను బ్యాటింగ్కు వస్తున్నాడంటే ప్రత్యర్థి ఫీల్డింగ్ మార్పులు చేసుకోవాల్సిందే. డీప్ ఫైన్ లెగ్.. మిడాన్ దిశగా థర్డ్మ్యాన్ను పెట్టాలి. సూర్య క్రీజులోకి వచ్చాడంటే తనకు తగ్గట్లు అప్పోజిషన్ టీమ్ అప్పటికప్పుడు తమ వ్యూహాలు మారుస్తూ పోవాలి. ఈ విషయంలో మిగతా బ్యాటర్లతో పోలిస్తే సూర్య మరింత ప్రత్యేకం’’ అని సూర్య ఆట తీరును ప్రశంసించాడు. వచ్చే ఆరునెలలు కేవలం టీ20లే ఆడించండి ఇక అంతకు ముందు జియో సినిమా షోలో తన అభిప్రాయాలు పంచుకున్న ఆకాశ్ చోప్రా.. ప్రతి ఆటగాడిని మూడు ఫార్మాట్లు ఆడేలా ఒత్తిడి పెట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. సూర్యుకుమార్ వంటి విధ్వంసకర ఆటగాళ్లను వారికి ప్రావీణ్యం ఉన్న ఫార్మాట్లకు పరిమితం చేయడం ద్వారా ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. టెస్టు, వన్డే, టీ20లలంటూ అటూ ఇటూ తిప్పకుండా.. సూర్యను వచ్చే ఆర్నెళ్ల పాటు పొట్టి ఫార్మాట్లోనే వీలైనంత ఎక్కువగా ఆడించాలని ఆకాశ్ చోప్రా మేనేజ్మెంట్కు సూచించాడు. టీ20 స్పెషలిస్టుగా తన సేవలను విరివిగా వినియోగించుకుంటూ అతడి నైపుణ్యాలు మరింత మెరుగుపడేలా తీర్చిదిద్దాలని సలహా ఇచ్చాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక విమర్శల పాలైన సూర్య.. తనకు అచ్చొచ్చిన టీ20 ఫార్మాట్లో తిరిగి బ్యాట్ పట్టగానే సునామీ ఇన్నింగ్స్ ఆడటం విశేషం. చదవండి: రోహిత్ అలా.. కోహ్లి ఇలా.. ఎవరు మాత్రం టెంప్ట్ కాకుండా ఉంటారు?: ఆశిష్ నెహ్రా Captain Suryakumar Yadav's first match as #TeamIndia Captain presented an additional challenge 😉 How well does SKY remember his match-winning knock? 🤔 WATCH 🎥#TeamIndia | #INDvAUS pic.twitter.com/X9fLNQEqjw — BCCI (@BCCI) November 24, 2023 -
అశ్విన్ను ఆడించి తప్పు చేయకండి! సిరాజ్ కూడా వద్దు.. ఎందుకంటే?
ICC WC 2023- Ind Vs Eng: ఇంగ్లండ్తో మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్ను ఆడించి తప్పుచేయొద్దని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా టీమిండియా మేనేజ్మెంట్కు సూచించాడు. లక్నో పిచ్ను పొరపాటుగా అంచనా వేసి మూల్యం చెల్లించే పరిస్థితి తెచ్చుకోకూడదని విజ్జప్తి చేశాడు. సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023లో రోహిత్ సేన వరుస విజయాలు సాధిస్తున్న విషయం తెలిసిందే. లీగ్ దశలో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్లలో ఐదూ గెలిచి అజేయంగా నిలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన ఇంగ్లండ్తో ఆదివారం పోటీపడనుంది. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) లక్నోలోని భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి ఏక్నా క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత జట్టు కూర్పు.. ముఖ్యంగా అదనపు స్పిన్నర్ను ఆడించాలా లేదా అన్న అంశంపై మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆఫ్ స్పిన్నర్ను ఆడించాలన్న నిర్ణయం సరైందే.. కానీ ‘‘ఇంగ్లండ్ వంటి జట్టుతో ఆడుతున్నపుడు.. ఆఫ్ స్పిన్నర్ను ఆడించాలనుకోవడం సరైన నిర్ణయమే. లక్నో వంటి పెద్ద మైదానం.. కాబట్టి ఆఫ్ స్పిన్నర్ను ఆడించాలనే అభిప్రాయాలు ఉండటమూ సహజమే. ఐపీఎల్లో ఇక్కడ బంతి టర్న్ అయింది కాబట్టి ఆఫ్ స్పిన్నర్ను ఆడిస్తే బాగుంటుందనుకోవడం మాత్రం సబబు కాదు. ఎందుకంటే ఈసారి ఐపీఎల్ మాదిరి వికెట్ ఉండబోదు. అపుడు నల్లరేగడి మట్టితో పిచ్ రూపొందించారు. ఇది ఎర్రమట్టి పిచ్.. కాబట్టి కానీ ఇప్పుడు ఇది ఎర్రమట్టితో చేసిన పిచ్. దీని మీద బంతి బౌన్స్ అవుతుంది. పేస్ రాబట్టవచ్చు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పరిస్థితి మరింత మారిపోతుంది. ఒకవేళ మనం ముగ్గురు స్పిన్నర్ల సెకండ్ ఫీల్డింగ్ చేయాల్సి వస్తే.. మనకు తెలియకుండానే ప్రత్యర్థికి మంచి చేసిన వాళ్లం అవుతాం. లేదు కచ్చితంగా ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలని భావిస్తే.. అశ్విన్ జట్టులోకి వస్తాడు. అలాంటపుడు పేసర్లు సిరాజ్.. షమీలలో ఒకరిని ఎంచుకోవాల్సి వస్తే నా ఓటు మాత్రం షమీకే. గత మ్యాచ్లో సిరాజ్ బాగానే బౌలింగ్ చేశాడు. సిరాజ్ వద్దు.. ఎందుకంటే అయితే, షమీ ఐదు వికెట్ల హాల్తో అద్భుత ఫామ్లో ఉన్నాడు. ఫామ్ దృష్ట్యా సిరాజ్ కంటే ముందున్న షమీని తుదిజట్టులోకి తీసుకోవాలి’’ అని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా టీమిండియా చివరగా తలపడిన న్యూజిలాండ్తో మ్యాచ్లో మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ధర్మశాలలో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా ప్రపంచకప్-2023లో షమీకి ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ తుది జట్ల అంచనా టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్ ), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్/ రవిచంద్రన్ అశ్విన్. ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్ ), బెయిర్స్టో, మలాన్, రూట్, స్టోక్స్, బ్రూక్, లివింగ్స్టోన్, వోక్స్, విల్లీ, అట్కిన్సన్, రషీద్. చదవండి: హార్దిక్ వచ్చేంత వరకు అతడే.. ఇంగ్లండ్ డేంజరస్ టీమ్! కాబట్టి మేము.. WC 2023: దెబ్బ మీద దెబ్బ.. పాకిస్తాన్కు భారీ షాకిచ్చిన ఐసీసీ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam)
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Mothers day 2024 మామ్స్తో సెలబ్రిటీలు, రెండు కళ్లూ చాలవు (ఫోటోలు)
లండన్ ట్రిప్ను ఎంజాయ్ చేస్తున్న మీనా
పెళ్లికి రెడీ అయిన హాట్ బ్యూటీ.. అంతకు ముందే 'ఎగ్ ఫ్రీజింగ్'
అందరూ ఓటు వేయండి.. ఓటర్లకు ప్రియాంక గాంధీ విజ్ఞప్తి
నా ప్రాణాలు పోయిన పర్లేదు..రిగ్గింగ్ జరిగితే ఊరుకోను
ఓటు హక్కు వినియోగించుకున్న తండ్రి కొడుకులు
రూ. 400 కోట్ల లాభం వస్తోంది.. చాలదా?: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్
పెళ్లికి రెడీ అయిన మరో హీరోయిన్!
ఓటు వేసిన YSRCP నేతలు
ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement