-
అరుణాచల్: కొట్టుకుపోయిన చైనా సరిహద్దు హైవే
ఈటానగర్: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో అరుణాచల్ ప్రదేశ్లో భారీ కొండచరియాలు విరిగిపడ్డాయి. బుధవారం కురిసిన భారీ వర్షాలతో దిబాంగ్ వ్యాలీ జిల్లాలోని జాతీయ రహదారి-33పై మున్లీ, అనిని ప్రాంతాల మధ్య భారీగా కొండచరియాలు విరిగిపడినట్లు అధికారులు వెల్లడించారు. కొండ చరియలు విరిగిపడటంతో నేషనల్ హైవేపై కొంత భాగం కొట్టుకుపోయి పెద్ద గుంత ఏర్పడింది. దీంతో చైనా బోర్డర్లోని దిబాంగ్ వ్యాలీ జిల్లాకు భారత్లోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఇక.. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి దిబాంగ్ వ్యాలీ వెళ్లేందుకు ఇదొక్కటే మార్గం కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 🚨🚨🚨Arunachal Pradesh hit by massive landslides. Highway linking China border washed away#ArunachalPradesh pic.twitter.com/96eiVRcPkI— Rosy (@rose_k01) April 25, 2024 దీంతో వేంటనే రంగంలోకి దిగిన నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ సిబ్బంది హైవే మరమత్తులకు చర్యలు చేపట్టారు. ఈ ఘటన ద్వారా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అత్యవసర సేవలు, వస్తువులకు ప్రస్తుతం ఎటువంటి అంతరాయం లేదని అధికారులు పేర్కొన్నారు.ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేసింది. హైవే పునరుద్ధరణ పనుల కోసం మూడు రోజుల సమయం పడుతుందని పేర్కొంది. ఇక.. నేషనల్ హైవే-33 దిబాంగ్ వ్యాలీ జిల్లా ప్రజలకు, ఆర్మీకి చాలా కీలకం. -
ఆగని డ్రాగన్ దురాశ
ఇది ఆందోళన రేపే వార్త. తక్షణమే అడ్డుకట్ట వేయడానికి ఆలోచించాల్సిన వార్త. పొరుగు దేశం చైనా ‘వాస్తవాధీన రేఖ’ (ఎల్ఏసీ) వెంట తన వైపున మరో 175కు పైగా గ్రామాలను నిర్మిస్తోందట. మన అరుణాచల్ ప్రదేశ్కు అభిముఖంగా సాగుతున్న ఈ కొత్త నిర్మాణాలు ఇప్పటికే ఎల్ఏసీ వెంట డ్రాగన్ సాగించిన 628 ‘షియావోకాంగ్’ (సంపన్న గ్రామాలు)కు అదనం. ఎల్ఏసీ వెంట తన బలం, బలగం పెంచుకొనేందుకు బీజింగ్ మరోసారి దుష్టపన్నాగం పన్నుతోంది. అభిజ్ఞవర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ పత్రిక ప్రచురించిన ఈ కథనం సంచలనం రేపుతోంది. ఈశాన్యంలోని అరుణాచల్ ప్రదేశ్తో పాటు జమ్ము–కశ్మీర్లో లద్దాఖ్ ప్రాంతం వెంట కూడా చైనా వైపున కొత్త గ్రామాలు వెలుస్తున్నాయి. ఇది అత్యంత ఆందోళనకరమైన పరిణామం. వెరసి, రానురానూ ఎల్ఏసీ మరింత వివాదాస్పదం కానుంది. ఇది మన బలగాలు, స్థానికులు తక్షణం జోక్యం చేసుకోవాల్సిన అంశం. నిజానికి, వాస్తవాధీన రేఖ అనేది భూతలంపై స్పష్టంగా నిర్ణయించిన సరిహద్దు ఏమీ కాదు. చైనీయుల నియంత్రణలో ఉన్న భూభాగాన్నీ, భారత నియంత్రిత భూభాగాన్నీ వేరుపరచే ఊహాత్మక సరిహద్దు రేఖ. దీన్ని వాటంగా చేసుకొని, ఊహాత్మక సరిహద్దయిన ఎల్ఏసీ వెంట సైనిక సన్నద్ధతను పెంచుకోవాలనీ, ఆ క్రమంలో అక్కడ మరింత భూభాగంపై తమ హక్కును ప్రకటించుకోవా లనీ చైనా కుటిల ప్రయత్నం. అందుకే, ఆ జగడాలమారి దేశం ఎల్ఏసీ వెంట తన వైపున గ్రామాలకు గ్రామాలు నిర్మిస్తూ వస్తోంది. దాదాపుగా 900 ఎల్ఏసీ గ్రామాలను నిర్మించాలనేది చైనా వ్యూహం. అందులో 200 దాకా గ్రామాలు భారత సరిహద్దుకు సమీపంలో కట్టాలని దాని ప్రయత్నం. ఆ భారీ ప్రయత్నంలో భాగమే ఇప్పుడీ కొత్త నిర్మాణాలు. ఆ గ్రామాలు ఇటు గస్తీ పాయింట్లుగా, అటు భారత్తో ఘర్షణ తలెత్తితే చేతికి అందివచ్చే సైనిక స్థావరాలుగా ఉపకరిస్తాయనేది బీజింగ్ ఎత్తుగడ. చైనా సైనిక వ్యూహం మాట అటుంచితే, కొత్త ఆవాసాలతో అనేక దీర్ఘకాలిక ప్రభావాలున్నాయి. అది మన దేశాన్ని మరింత కలవరపెడుతోంది. గమనిస్తే, భారత – చైనాల మధ్య 2005 నాటి ‘సరి హద్దు రక్షణ సహకార ఒప్పందం’ (బీడీసీఏ) ఉంది. ‘‘సరిహద్దు ప్రాంతాల్లో స్థిరపడ్డ ప్రజానీకం ప్రయోజనాలను ఇరుపక్షాలూ సంరక్షించాలి’’ అని బీడీసీఏలోని ఏడో ఆర్టికల్ పేర్కొంటోంది. ఎప్పుడైనా ఎల్ఏసీని కచ్చితంగా నిర్ణయించాల్సిన పరిస్థితి వస్తే, అప్పటికి జనావాసాలైన ఈ కొత్త గ్రామాలను కదిలించడానికి వీలుండదు. ఆ అంశాన్ని అడ్డం పెట్టుకోవాలనేది డ్రాగన్ దురా లోచన. అలా తన ప్రాదేశిక హక్కుల వాదనకు బలం చేకూర్చేలా ఈ కొత్త గ్రామాలు, అక్కడ తెచ్చి పెట్టిన జనాభాను వాడుకోవాలనేది దాని పన్నాగం. చైనా వైపు కడుతున్న ఈ కొత్త గ్రామాలకు ఎదురుగా భారత్ వైపున కూడా గ్రామాలు లేకపోలేదు. అయితే, వాటిలో జన సంఖ్య అంతంత మాత్రమే! విస్తరణ కాంక్షతో ఊగుతున్న చైనా ఈ గ్రామాల నిర్మాణంతో ఆగడం లేదు. టిబెట్లో, ఎల్ఏసీ సమీప ప్రాంతాల్లో పెద్దయెత్తున ప్రాథమిక వసతి కల్పన ప్రాజెక్టులను చేపడుతోంది. ఇప్పటికే తన 14వ పంచవర్ష ప్రణాళిక (2021 –25)లో భాగంగా సిచువాన్ – టిబెట్ రైల్వేలైను సహా హైస్పీడ్ రైల్వే వ్యవస్థను విస్తరించే పని పెట్టుకుంది. అలాగే, వాస్తవాధీన రేఖ వెంట, భారత భూభాగానికి సమాంతరంగా సాగే రెండు జాతీయ రహదారులను (జీ–219, జీ–318) అప్గ్రేడ్ చేసే పనులూ కూడా ఆ ప్రణాళికలో భాగమే. వాటిలో ఒకటి (జీ–219) లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్లకు ఎదురుగా ఉంటే, మరొకటి (జీ–318) అరుణాచల్ ప్రదేశ్, సిక్కిమ్లకు అభిముఖమైనది కావడం గమనార్హం. తద్వారా ఒకపక్క టిబెట్ను తమలో భాగంగా ప్రచారం చేసుకోవడం, మరోపక్క ప్రాథమిక వసతుల పెంపు అనే రెండూ చైనా పెట్టుకున్న లక్ష్యాలు. అసలు 1959 మార్చి 28న దలైలామా నేతృత్వంలోని టిబెటన్ ప్రభుత్వాన్ని అక్రమంగా రద్దు చేసి, టిబెట్ను ఆక్రమించుకున్న చరిత్ర బీజింగ్ది. కానీ, మొన్న షిజాంగ్ (టిబెట్)లో ప్రజాస్వామ్య సంస్కరణకు 65వ వార్షికోత్సవం అంటూ ఎల్ఏసీ వెంట డ్రాగన్ సంబరాలు జరపడం ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నమే! టిబెట్ నుంచి తైవాన్ దాకా అన్నీ తమవేననే డ్రాగన్ రాజ్య విస్తరణ వాదం ప్రపంచానికి కొత్త కాదు. చైనా సాగిస్తున్న ఈ కొత్త గ్రామాల నిర్మాణం నాటకాన్ని సైతం భారత్ గతంలోనే గమనించకపోలేదు. అందుకనే ఆ జనావాసాలను బీడీసీఏ కింద సరిహద్దు చర్చల నుంచి మినహాయించా లని తేల్చిచెప్పింది. డ్రాగన్ మాత్రం తన వంకర బుద్ధి వదులుకోలేదు. భారత్లోని లద్దాఖ్కు అభి ముఖంగా తాను చట్టవిరుద్ధంగా దురాక్రమణ చేసిన ప్రాంతాల్లోనూ చకచకా గ్రామాలు కట్టే పని చేస్తూనే ఉంది. ఇందుకు ప్రతిగా మన దేశం ఎదురుదాడికి దిగింది. ‘సచేతన గ్రామాల పథకం’ పేర ఆ సరిహద్దులోని మన జనావాసాలను ఏడాది పొడుగూతా జనంతో ఉండే ఆధునిక పర్యాటక ఆకర్షణలుగా మార్చాలని ప్రయత్నిస్తోంది. అయితే అదింకా పూర్తి కాలేదు. పనులు సాగుతూనే ఉన్నాయి. తరచూ కయ్యానికి కాలుదువ్వే చైనాకు ముకుతాడు వేయడానికి మనం చేయాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి. క్లిష్టమైన హిమాలయ ప్రాంతాల్లో మనం మనవైపు నిర్మిస్తున్న గ్రామాలు సైతం నిర్మానుష్యంగా మిగలకుండా స్థానిక ప్రజలు ఆవాసం ఉండేలా చూడాలి. దురాక్రమణలు జరగకుండా ఉండాలంటే, స్థానికులు ప్రతి ఒక్కరిలో తామే సరిహద్దును కాపాడే సైనికులమనే భావన కల్పించాలి. మాతృభూమి పరిరక్షణ స్ఫూర్తి రగిలించాలి. అది జరగాలంటే, ముందుగా లద్దాఖ్ లాంటి ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్న ప్రజానీకపు న్యాయమైన కోరికలను మన్నించాలి. ప్రాంతీయ సంస్కృతి, ఆకాంక్షలకు అనుగుణంగా మన ఢిల్లీ పాలకులు వ్యవహరించాలి. సొంత ఇంటిని చక్కదిద్దు కొని, పొరుగు ప్రత్యర్థిపై పోరాడే క్రమంలో దేశ ప్రయోజనాల దృష్ట్యా అన్ని పక్షాలూ కలసిరావాలి. -
Lok sabha elections 2024: అరుణాచల్లో ఆమె ప్రాతినిధ్యమేది?
ఈటానగర్: చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం విషయంలో అరుణాచల్ ప్రదేశ్ అందుకు మినహాయింపేమీ కాదు. రెండు లోక్సభ స్థానాలతో పాటు రాష్ట్రంలో 50 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏకకాలంలో ఏప్రిల్ 19న ఎన్నికలు జరగననున్నాయి. కానీ ఈ ఈశాన్య రాష్ట్రంలో ఎన్నికల బరిలో దిగిన మహిళల సంఖ్య మాత్రం అంతంతే... ఇప్పటివరకు 15 మంది... అరుణాచల్ ఈస్ట్, అరుణాచల్ వెస్ట్ రెండు లోక్సభ స్థానాలకు మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. గణ సురక్ష పారీ్టకి ప్రాతినిధ్యం వహిస్తున్న టోకో శీతల్ ఒక్కరే మహిళ. 50 అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది మంది మహిళలు మాత్రమే నామినేషన్లు వేశారు. వారిలో అధికార బీజేపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు కాగా ఒకరు ఇండిపెండెంట్. వీరిలో హయులియాంగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి దా సంగ్లు పుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1987లో అరుణాచల్ ప్రదేశ్ పూర్తిస్థాయి రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి కేవలం 15 మంది మహిళలు మాత్రమే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రం నుంచి ఒక మహిళ మాత్రమే రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించారు. సిబో కైను 1978లో అసెంబ్లీకి గవర్నర్ నామినేట్ చేశారు. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) అభ్యర్థిగా సెప్పా నియోజకవర్గం నుంచి 1980లో అసెంబ్లీకి ఎన్నికైన మొదటి మహిళ న్యారీ వెల్లి. కోమోలి మొసాంగ్ 1980లో నాంపాంగ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా ఎన్నికయ్యారు. 1990లో కాంగ్రెస్ అభ్యర్థిగా తిరిగి ఆమె విజయం సాధించారు. ఒమేమ్ మోయోంగ్ డియోరీ 1984లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1990లో కాంగ్రెస్ టిక్కెట్పై లేకాంగ్ అసెంబ్లీ స్థానం నుంచి కూడా గెలుపొందారు. బలమైన గొంతుకలు కావాలి.. సాంస్కృతిక అడ్డంకులు, సామాజిక–ఆర్థిక పరిమితులు, అవగాహన లేమి వంటి అనేక అంశాలు ఎన్నికల రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రాజకీయ ప్రక్రియలో మహిళల ప్రమేయాన్ని ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రభుత్వం, పౌర సమాజ సంస్థల సమష్టి కృషి అవసరమని అరుణాచల్ ప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ కెంజుమ్ పాకం అన్నారు. రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లపై చట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నాని బాత్ సూచించారు. అప్పుడే అరుణాచల్ వంటి చోట్ల వారికి ప్రాతినిధ్యం దక్కుతుందన్నారు. -
‘చైనా తెలివి తక్కువ ప్రయత్నం’.. పేర్ల మార్పుపై భారత్ ఫైర్
న్యూఢిల్లీ:అరుణాచల్ ప్రదేశ్లోని 30 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదంటూ చైనా వితండవాదం చేస్తూ కవ్వింపులకు దిగుతున్న విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా వ్యవరిస్తున్న తీరుపై భారత విదేశి వ్యవహారాల అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు. అరుణాచల్ ప్రదేశ్ కోసం చైనా కనిపెట్టిన పేర్లను భారత్ తిరస్కరించింది.‘భారతదేశంలో అంతర్భగమైన అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు పేర్లు మార్చే తెలివి తక్కువ ప్రయత్నాలకు పూనుకున్నారు. అటువంటి తెలివి తక్కువ ప్రయత్నాలను తిరస్కరిస్తున్నాం. అక్కడి ప్రాంతాలకు పేర్లు పెట్టడం వల్ల అరుణాప్రదేశ్ చైనాది అయిపోదు. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లోని అంతర్భాగమే’ అని రణ్ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.చైనా ఎన్ని నిరాధారమైన వాదనలు చేసినా అరుణాచల్ ప్రదేశ్.. భారత్లో అంతర్భాగమని మర్చి 28న భారత్ తేల్చి చెప్పింది. చైనా పలుసార్లు కొత్త వాదనలకు తెరలేపినా.. ఈ విషయంలో భారత్ వైఖరిని మార్చలేదని తెలిపింది. అరుణచల్ ప్రదేశ్లో చైనా పేర్లు మార్చిన 30 ప్రాంతాల్లో.. 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం , కొంత భూభాగం ఉన్నాయని సోమవారం పలు కథనాలు వెలువడ్డ విషయం తెసిందే. -
‘చైనా తెలివి తక్కువ ప్రయత్నం’.. పేర్ల మార్పుపై భారత్ ఫైర్
న్యూఢిల్లీ:అరుణాచల్ ప్రదేశ్లోని 30 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదంటూ చైనా వితండవాదం చేస్తూ కవ్వింపులకు దిగుతున్న విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా వ్యవరిస్తున్న తీరుపై భారత విదేశి వ్యవహారాల అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు. అరుణాచల్ ప్రదేశ్ కోసం చైనా కనిపెట్టిన పేర్లను భారత్ తిరస్కరించింది. ‘భారతదేశంలో అంతర్భగమైన అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు పేర్లు మార్చే తెలివి తక్కువ ప్రయత్నాలకు పూనుకున్నారు. అటువంటి తెలివి తక్కువ ప్రయత్నాలను తిరస్కరిస్తున్నాం. అక్కడి ప్రాంతాలకు పేర్లు పెట్టడం వల్ల అరుణాప్రదేశ్ చైనాది అయిపోదు. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లోని అంతర్భాగమే’ అని రణ్ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. చైనా ఎన్ని నిరాధారమైన వాదనలు చేసినా అరుణాచల్ ప్రదేశ్.. భారత్లో అంతర్భాగమని మర్చి 28న భారత్ తేల్చి చెప్పింది. చైనా పలుసార్లు కొత్త వాదనలకు తెరలేపినా.. ఈ విషయంలో భారత్ వైఖరిని మార్చలేదని తెలిపింది. అరుణచల్ ప్రదేశ్లో చైనా పేర్లు మార్చిన 30 ప్రాంతాల్లో.. 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం , కొంత భూభాగం ఉన్నాయని సోమవారం పలు కథనాలు వెలువడ్డ విషయం తెసిందే. -
భారత్ Vs చైనా: అరుణాచల్పై మళ్లీ కవ్వింపులు..
బీజింగ్: డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి భారత్తో కవ్వింపు చర్యలకు దిగింది. ఎన్నికల వేళ భారత సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ విషయంలో మరో దుందుడుకు చర్యకు దిగింది. తాజాగా అరుణాచల్లో కొన్ని ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది.కాగా, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. భారత్లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదేనని ఇటీవలే చైనా వితండవాదం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా మరో అడుగు వేసి మరోసారి అక్కడి ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది. ఈ మేరకు చైనా పౌర వ్యవహారాల శాఖ ఇటీవల ఈ కొత్త పేర్లను విడుదల చేశారు.అరుణాచల్లోని మొత్తం 30 ప్రాంతాలకు చైనా తాజాగా కొత్త పేర్లను పెట్టినట్లు తెలుస్తోంది. వీటిల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం, కొంత భూభాగం ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో చైనా చర్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పందిస్తూ.. ఈరోజు నేను మీ ఇంటి పేరు మర్చినట్లయితే అది నాది అవుతుందా?. అరుణాచల్ భారత్లో ఒక రాష్ట్రం. అరుణాచల్ ఎల్లప్పుడూ భారత్ భూభాగమే. పేర్లు మార్చడం వల్ల ప్రభావం ఏమీ ఉండదు. వాస్తవాధీన రేఖ వద్ద మా సైనం మోహరించి ఉంది అని కామెంట్స్ చేశారు.#WATCH | Surat, Gujarat: On China's claim regarding Arunachal Pradesh, EAM Dr S Jaishankar says, "If today I change the name of your house, will it become mine? Arunachal Pradesh was, is and will always be a state of India. Changing names does not have an effect...Our army is… pic.twitter.com/EaN66BfNFj— ANI (@ANI) April 1, 2024 ఇదిలా ఉండగా.. భారత భూభాగంలోని ప్రదేశాల పేర్లను మార్చేందుకు చైనా ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. చైనా 2017లో అరుణాచల్ ప్రదేశ్లోని ఆరు ప్రదేశాలకు, 2021లో 15 స్థలాలకు, 2023లో 11 ప్రాంతాలకు కొత్త పేర్లను చైనా ప్రకటించింది. ఇవన్నీ తమ దేశంలోని ప్రాంతాలేనని చెప్పుకొచ్చింది. -
భారత్ Vs చైనా: అరుణాచల్పై మళ్లీ కవ్వింపులు..
బీజింగ్: డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి భారత్తో కవ్వింపు చర్యలకు దిగింది. ఎన్నికల వేళ భారత సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ విషయంలో మరో దుందుడుకు చర్యకు దిగింది. తాజాగా అరుణాచల్లో కొన్ని ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది. కాగా, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. భారత్లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదేనని ఇటీవలే చైనా వితండవాదం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా మరో అడుగు వేసి మరోసారి అక్కడి ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది. ఈ మేరకు చైనా పౌర వ్యవహారాల శాఖ ఇటీవల ఈ కొత్త పేర్లను విడుదల చేశారు. అరుణాచల్లోని మొత్తం 30 ప్రాంతాలకు చైనా తాజాగా కొత్త పేర్లను పెట్టినట్లు తెలుస్తోంది. వీటిల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం, కొంత భూభాగం ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో చైనా చర్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పందిస్తూ.. ఈరోజు నేను మీ ఇంటి పేరు మర్చినట్లయితే అది నాది అవుతుందా?. అరుణాచల్ భారత్లో ఒక రాష్ట్రం. అరుణాచల్ ఎల్లప్పుడూ భారత్ భూభాగమే. పేర్లు మార్చడం వల్ల ప్రభావం ఏమీ ఉండదు. వాస్తవాధీన రేఖ వద్ద మా సైనం మోహరించి ఉంది అని కామెంట్స్ చేశారు. #WATCH | Surat, Gujarat: On China's claim regarding Arunachal Pradesh, EAM Dr S Jaishankar says, "If today I change the name of your house, will it become mine? Arunachal Pradesh was, is and will always be a state of India. Changing names does not have an effect...Our army is… pic.twitter.com/EaN66BfNFj — ANI (@ANI) April 1, 2024 ఇదిలా ఉండగా.. భారత భూభాగంలోని ప్రదేశాల పేర్లను మార్చేందుకు చైనా ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. చైనా 2017లో అరుణాచల్ ప్రదేశ్లోని ఆరు ప్రదేశాలకు, 2021లో 15 స్థలాలకు, 2023లో 11 ప్రాంతాలకు కొత్త పేర్లను చైనా ప్రకటించింది. ఇవన్నీ తమ దేశంలోని ప్రాంతాలేనని చెప్పుకొచ్చింది. -
పోటీ లేదు.. ప్రచారం లేదు.. గెలిచేసిన బీజేపీ అభ్యర్థులు!
Arunachal Pradesh Assembly Elections: షెడ్యూల్ ప్రకారం ఎన్నికల తేదీకి వారాల ముందే అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుందని ముఖ్యమంత్రి పెమా ఖండూ ప్రకటించారు. శనివారం నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియడంతో సీఎం పెమా ఖండూ, డిప్యూటీ సీఎం చౌనా మెయిన్తోపాటు మరో ఎనిమిది మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. "మేము పోటీ లేకుండా 10 సీట్లు గెలుచుకున్నాం. ఎన్నికలకు ముందే ఇది చాలా పెద్ద విజయం. మా అభివృద్ధి పనులకు ప్రజలు ఇస్తున్న భారీ మద్దతుకు ఇదే నిదర్శనం. ప్రజలు మమ్మల్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు. మా ప్రభుత్వం ఏర్పాటు ఖాయం. అలాగే రెండు లోక్సభ స్థానాలను కూడా భారీ మెజారిటీతో గెలుచుకుంటాం” అని సీఎం ఖండూ అన్నారు. ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్లో బీజేపీ మద్దతుదారులు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 60 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ 34 స్థానాల్లో పోటీ చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో ఏప్రిల్ 19న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
అరుణాచల్లో 10 ఏకగ్రీవాలు
ఇటానగర్: అరుణాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పెమా ఖండూ, డిప్యూటీ సీఎం చౌనా మెయిన్ సహా 10 మంది బీజేపీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. శనివారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సరికి ఆయా నియోజకవర్గాల్లో వారు మాత్రమే బరిలో మిగిలారు. దాంతో వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనట్టు చీఫ్ ఎలక్టోరల్ అధికారి పవన్ కుమార్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అరుణాచల్లోని మిగతా 60 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు రెండు లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19వ తేదీన తొలి విడతలో పోలింగ్ జరగనుంది. -
అరుణాచల్లో బీజేపీకి తొలి విజయం?.. ఐదుగురు ఏకగ్రీవం?
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీకి సానుకూల వాతావరణం ఏర్పడింది. ముఖ్యమంత్రి పెమా ఖండూ సహా ఐదుగురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావచ్చని సమాచారం. మార్చి 26, బుధవారం నామినేషన్కు చివరి తేదీ అని, అయితే రాష్ట్రంలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఇతర పార్టీల అభ్యర్థులెవరూ నామినేషన్ దాఖలు చేయలేదని ఓ అధికారి తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లోని రెండు లోక్సభ, 60 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగిసినట్లు అధికారి తెలిపారు. గురువారం నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుందని, మార్చి 30 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చన్నారు. గురువారం నామినేషన్ పత్రాల పరిశీలన తర్వాత ఆ ఐదుగురు బీజేపీ అభ్యర్థులు ఏకపక్షంగా గెలుస్తారా లేదా అనేది నిర్ణయిస్తామని జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ లైకెన్ కోయు మీడియాకు తెలిపారు. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 197 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లో ముఖ్యమంత్రి పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్తో సహా ఐదుగురు అభ్యర్థులు ఎన్నికలలో ఏకగ్రీవంగా గెలిచారని బీజేపీ పేర్కొంది. వీరు పోటీ చేస్తున్న చోట నుంచి చివరి రోజు వరకు ఇతర పార్టీల అభ్యర్థులెవరూ నామినేషన్ దాఖలు చేయలేదని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి తేజీ నేచా పేర్కొన్నారు. -
Lok sabha elections 2024: ఒక్క ఓటు కోసం 39 కిలోమీటర్ల ట్రెక్కింగ్..
ఈటానగర్: ప్రజాస్వామ్యం మామూలు వ్యక్తిని సైతం మెహమాన్ను చేస్తుంది. అందుకు ఉదాహరణ ఈ 44 ఏళ్ల సొకేలా తయాంగ్. అరుణాచల్ ప్రదేశ్లోని అంజ్వా జిల్లాలోని మారుమూలన ఉన్న మలోగాం ఆమె గ్రామం. హయులియాంగ్ అసెంబ్లీతోపాటు, అరుణాచల్ ప్రదేశ్ ఈస్ట్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి ఆ గ్రామం వస్తుంది. అక్కడ ఎన్నికలు మొదటి ఫేజ్లో జరగనున్నాయి. ఇంతకీ ఆమె మెహమాన్ ఎందుకయ్యారంటే.. ఆ ఊరులో ఓటరు ఆమె ఒక్కరే. ఆమె కోసం పోలింగ్ సిబ్బంది అంతా.. ఎన్నికలు జరిగే ఏప్రిల్ 19వ తేదీ కంటే ఒకరోజు ముందు.. అంటే ఏప్రిల్ 18న 39 కిలోమీటర్ల ఎత్తు కొండలు ఎక్కాల్సి ఉంటుంది. చైనా సరిహద్దుకు దగ్గరలో ఉన్న ఆ గ్రామంలో తయాంగ్ కోసం తాత్కాలికంగా ఓ పోలింగ్ బూత్ కూడా ఏర్పాటు చేయనున్నారు. మలోగామ్లో ఇంకొన్ని కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ వారిలో ఎవరూ ఓటు కోసం నమోదు చేసుకోలేదు. దీంతో వారికి ఓటర్ల జాబితాలో చోటు దక్కలేదు. ఒక్కరికోసం బూత్ ఎందుకని.. సమీపంలోని ఏదైనా పోలింగ్ బూత్లో ఓటు వేయాల్సిందిగా అధికారులు ఆమెను కోరారు. కానీ అందుకు తయాంగ్ అంగీకరించలేదు. దీంతో ఆమె ఓటు కోసం అధికారులు, భద్రతా సిబ్బంది, పోర్టర్లతో సహా పోలింగ్ బృందం హయులియాంగ్ నుంచి అనూహ్య వాతావరణం మధ్య ప్రమాదకరమైన భూభాగం గుండా కష్టతరమైన ప్రయాణం చేయనుంది. హయులియాంగ్ నుంచి మలోగామ్కి కాలి నడకన వెళ్లడానికి ఒక రోజంతా పడుతుంది. పోలింగ్ రోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బూత్ తెరచి ఉంటుంది. ‘‘నేను మా గ్రామంలో చాలా అరుదుగా ఉంటాను. ఏదైనా పని ఉన్నప్పుడు లేదా ఎన్నికల సమయంలో మాలోగాం వస్తుంటా. మిగతా సమయంలో మాకు వ్యవసాయ భూములు ఉన్న లోహిత్ జిల్లాలోని వక్రోలో ఉంటాను. ఏప్రిల్ 18 సాయంత్రంలోగా ఇంటికి చేరుకుని ఓటు వేస్తా’’ అని చెబుతున్నారు. -
అరుణాచల్ భారత్దే: అమెరికా
వాషింగ్టన్: అరుణాచల్ ప్రదేశ్ను భారత్కు చెందిన ప్రాంతంగానే గుర్తిస్తున్నామని అమెరికా ప్రకటించింది. వాస్తవా«దీన రేఖ(ఎల్ఏసీ) ఆవలి వైపు ప్రాంతం కూడా తమదేనంటూ చైనా సైన్యం కానీ, పౌరులు గానీ ఏకపక్షంగా అక్రమంగా చొరబాట్లకు పాల్పడేందుకు చేసే ప్రయత్నాలను గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు అగ్రరాజ్యం తెలిపింది. ఇటీవల ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించిన నేపథ్యంలో చైనా ఆర్మీ మరో మారు ఆ భూభాగం తమదేనంటూ ప్రకటించడంపై అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ ఉప అధికారప్రతినిధి వేదాంత్ పటేల్ మీడియాకు ఈ విషయం తెలిపారు. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ను టిబెట్లోని ‘జాంగ్నాన్’గా చైనా తరచూ పేర్కొంటోంది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన భారత్..అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ తమదేనని, ఇకపైనా విడదీయరాని అంతర్భాగంగానే కొనసాగుతుందని బుధవారం పునరుద్ఘాటించిన విషయం తెలిసిందే. అమెరికాకు సంబంధం లేదు:చైనా అరుణాచల్ భారత్దేనంటూ అమెరికా చేసిన ప్రకటనను చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. భారత్–చైనా సరిహద్దు వివాదంతో అమెరికాకు ఏమాత్రం సంబంధం లేదని తెలిపింది. అమెరికా ఇతర దేశాల మధ్య వివాదాలను రెచ్చగొడుతూ, వాటిని తన స్వార్థ భౌగోళిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం అందరికీ తెలిసిందేనని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ వ్యాఖ్యానించారు. -
అరుణాచల్ భారత్దే: అమెరికా
వాషింగ్టన్: అరుణాచల్ ప్రదేశ్ అంశంలో డ్రాగన్ కంట్రీ చైనాకు ఎదురుదెబ్బ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాతమేనని అమెరికా పేర్కొంది. ఈ క్రమంలో చైనా ఆక్రమణను అమెరికా తీవ్రంగా ఖండిస్తున్నట్టు స్పష్టం చేసింది. కాగా, ఈ అంశంపై యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్పర్సన్ వేదాంత్ పటేల్ మాట్లాడుతూ..‘అరుణాచల్ ప్రదేశ్ను యునైటెడ్ స్టేట్స్ భారత భూభాగంగా గుర్తిస్తోంది. చొరబాట్లు లేదా ఆక్రమణలు, సైన్యం ద్వారా ప్రాదేశిక క్లెయిమ్లను ముందుకు తీసుకెళ్లే ఏకపక్ష ప్రయత్నాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. వాస్తవాధీన రేఖ వెంట చేసే ఆక్రమణ యత్నాలను తిప్పికొడుతున్నట్లు స్పష్టం చేశారు’. ఇక, ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్న వేళ అమెరికా.. భారత్కు మద్దతు ప్రకటించింది. ఇదిలా ఉండగా.. అరుణాచల్పై చైనా ఓవరాక్షన్ చేస్తోంది. దక్షిణ టిబెట్ (జాంగ్నాన్) తమ భూభాగంలోనిదేనని ఆ దేశ రక్షణ శాఖ అధికార ప్రతినిధి సీనియర్ కర్నల్ ఝాంగ్ షియాంగాంగ్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే అరుణాచల్ను చైనా ‘జాంగ్నాన్’గా పేర్కొంటోంది. ఇక, చైనా వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. #WATCH | On China's reaction to the visit of PM Modi to Arunachal Pradesh, Vedant Patel, Principal Deputy Spokesperson, US Department of State says, "The United States recognizes Arunachal Pradesh as Indian territory and we strongly oppose any unilateral attempts to advance… pic.twitter.com/hoXXmMX34e — ANI (@ANI) March 21, 2024 ఈ మేరకు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఓ ప్రకటనలో.. అరుణాచల్ ప్రదేశ్పై చైనా రక్షణ శాఖ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు అసంబద్దం. ఈ వ్యవహారంలో నిరాధార వాదనలను పునరావృతం చేయడం ద్వారా.. అవి వాస్తవాలుగా మారిపోవు. ఆ ప్రాంతం ఎల్లప్పుడూ మా దేశంలో అంతర్భాగం. మా అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో అక్కడి పౌరులు ప్రయోజనం పొందుతూనే ఉంటారు’ అని వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. చైనా- భారత్ సరిహద్దులోని తవాంగ్కు సైనిక బలగాలను, సాయుధ సంపత్తిని తరలించేందుకు ఉపయోగపడే ‘సేలా’ సొరంగ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు. ఈ సందర్బంగా కూడా చైనా అత్యుత్సాహం ప్రదర్శించింది. అది తమ భూభాగమని, అక్కడ భారత్ వేస్తోన్న అడుగులు.. సరిహద్దు వివాదాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని చైనా ఓవరాక్షన్ చేసింది. ఇక, రెండు సందర్భాల్లోనూ భారత విదేశాంగ శాఖ చైనాకు స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. -
మహారాష్ట్ర, అరుణాచల్లో భూకంపం.. భయంతో జనం పరుగులు!
మహారాష్ట్ర, అరుణాచల్లో ఈరోజు (గురువారం) ఉదయం భూమి కంపించింది. మహారాష్ట్రలోని నాందేడ్లో సుమారు 10 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నాందేడ్తో పాటు పర్భానీ, హింగోలిలో భూ ప్రకంపనలు కనిపించాయి. మీడియాకు అందిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని నాందేడ్లో గురువారం ఉదయం 6 గంటల 8 నిముషాలకు భూకంప సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.2గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం అఖారా బాలాపూర్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. మహారాష్ట్ర కంటే ముందు అరుణాచల్ ప్రదేశ్లో గురువారం తెల్లవారుజామున రెండుసార్లు భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారుజామున 1:49 గంటలకు మొదటి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ కమెంగ్లో ఉంది. దీని లోతు సుమారు 10 కిలోమీటర్లు. రెండవ భూకంపం 3.40 గంటలకు సంభవించింది. రెండో భూకంప కేంద్రం అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు కమెంగ్లో ఉంది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.4గా నమోదైంది.ఈ రెండు భూకంపాల వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. -
BJP: అరుణాచల్ అభ్యర్థుల జాబితా విడుదల
లోక్సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హడావిడి నెలకొనడంతో కేంద్రంలోని అధికార బీజేపీ స్పీడ్ పెంచింది. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాచాటి ముచ్చటగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు, నరేంద్రమోదీని మరోసారి ప్రధాని చేసేందుకు కాషాయ పార్టీ పూర్తిస్థాయి సన్నద్ధతతో ముందుకెళ్తోంది. లోక్సభ ఎన్నికలకు ఇప్పటికే 195 మందితో తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ.. రెండో జాబితాపై ఫోకస్ పెట్టింది. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ప్రకటిస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా అరుణాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 60 స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల జాబితాను బుధవారం బీజేపీ విడుదల చేసింది. ముఖ్యమంత్రి పెమా ఖండూ ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ముక్తో(ఎస్టీ) సీటు నుంచే మళ్లీ బరిలో దిగనున్నారు. అరుణాచల్ బీజేపీ చీఫ్ బియూరామ్ వాహ్గే పక్కే-కేసాంగ్ (ఎస్టీ) నుంచి,, ఉప ముఖ్యమంత్రి చౌనా మేన్ చౌకన్ (ఎస్టీ) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయించిన పూర్తి జాబితాను పార్టీ తన ట్విటర్లో షేర్ చేసింది. -
అరుణాచల్ప్రదేశ్పై చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్లో ఇటీవల ప్రధాని మోదీ చేసిన పర్యటనపై చైనా ప్రకటనను భారత్ ఖండించింది. ప్రధాని పర్యటనపై చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవ దూరమైనవని, అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పడూ భారత్లో భాగమేనని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ మంగళవారం స్పష్టం చేశారు. ‘అరుణాచల్ ప్రదేశ్పై చైనా ఉన్నతాధికారి వెన్బిన్ చేసిన వ్యాఖ్యలను మేం ఖండిస్తున్నాం. భారత్లోని మిగిలిన రాష్ట్రాల్లో పర్యటించినట్లుగానే మా నాయకులు అరుణాచల్ప్రదేశ్లోనూ పర్యటిస్తారు’ అని జైస్వాల్ తెలిపారు. కాగా, మార్చి 9వ తేదీన ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన ప్రపంచంలోనే అతి పొడవైన సేలా టన్నెల్తో పాటు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. ఈ పర్యటనపై మార్చ్ 11న చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ దక్షిణ టిబెట్లోని జాంగాన్(అరుణాచల్ ప్రదేశ్) తమ దేశంలో భాగమని, అరుణాచల్ప్రదేశ్ అనే రాష్ట్రాన్ని తాము గుర్తించడం లేదని వ్యాఖ్యానించడం భారత్ ఆగ్రహానికి కారణమైంది. ఇదీ చదవండి.. 10 వందేభారత్లకు ప్రధాని మోదీ పచ్చజెండా -
‘ఈశాన్యం’లో అభివృద్ధి వేగవంతం
ఈటానగర్/జోర్హాట్: ఈశాన్య రాష్ట్రాల్లో తమ ప్రభుత్వం గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి 20 సంవత్సరాలు పట్టేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శనివారం అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించారు. ఈశాన్య భారతదేశానికి సంబంధించి రూ.55,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం ఈటానగర్లో ‘వికసిత్ భారత్–వికసిత్ నార్త్ఈస్ట్’ బహిరంగ సభలో ప్రసంగించారు. ఇండియాకు.. దక్షిణాసియా, తూర్పు ఆసియా దేశాలకు మధ్య వాణిజ్యం, టూరిజంతోపాటు ఇతర సంబంధాల విషయంలో ఈశాన్య రాష్ట్రాలు బలమైన అనుసంధానంగా మారబోతున్నాయని తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో ఈ ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టామని, అభివృద్ధిని వేగవంతం చేశామని పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్ను సందర్శించేవారికి ‘మోదీ గ్యారంటీ’ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. ఈశాన్య ప్రజలంతా నా కుటుంబ సభ్యులే మోదీకి కుటుంబం ఉందా అని ప్రతిపక్ష నేతలు ప్రశి్నస్తున్నారని ప్రధాని అన్నారు. ‘‘వారికి ఒక్కటే చెబుతున్నా. ఈశాన్య రాష్ట్రాల ప్రజలంతా నా కుటుంబ సభ్యులే’’ అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికీ సురక్షితతాగునీరు, సొంతిల్లు, వంట గ్యాస్ కనెక్షన్, విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యం కలి్పంచాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. అప్పడే ‘వికసిత్ భారత్’ కల నెరవేరుతుందన్నారు. సేలా టన్నెల్ జాతికి అంకితం ప్రపంచంలో అత్యంత పొడవైన రెండు వరుసల సొరంగం ‘సేలా టన్నెల్’ను మోదీ వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అరుణాచల్ప్రదేశ్లో భారత్–చైనా సరిహద్దు ఎల్ఏసీ సమీపంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రూ.825 కోట్లతో సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తున ఈ టన్నెల్ నిర్మించింది. ఈ ప్రాజెక్టులో రెండు సొరంగాలున్నాయి. ఒకటి సింగిల్ ట్యూబ్ టన్నెల్. దీని పొడవు 1,003 మీటర్లు. ఎస్కేప్ ట్యూబ్తో కూడిన రెండో టన్నెల్ పొడవు 1,595 మీటర్లు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బలిపారా–చారిదువార్–తవాంగ్ మార్గం మూతపడుతోంది. సేలా టన్నెల్తో ఆ ఇక్కట్లు తప్పాయి. లచిత్ బోర్ఫుకన్ విగ్రహావిష్కరణ అస్సాంలోని జోర్హాట్లో 125 అడుగుల ఎత్త యిన అహోం జనరల్ లచిత్ బోర్ఫుకన్ కంచు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా అస్సాం సంప్రదాయ దుస్తులు, తలపాగా ధరించి, అహోం ఆచార ంలో పాలుపంచుకున్నారు. అస్సాంలో 1228 నుంచి 1826 వరకు అహోం రాజవంశం పరిపాలన సాగింంచింది. 1671లో జరిగి న స రాయ్ఘాట్ యుద్ధంలో అహోం సైనికాధికా రి లచిత్ బోర్ఫుకన్ అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించారు. బలీయమైన మొ ఘల్ సైన్యాన్ని వెనక్కి తరిమికొట్టారు. అహోం రా జ్యాన్ని కాపాడారు. ఆయనను అస్సాం ప్రజ లు ఇప్పటికీ స్మరించుకుంటూ ఉంటారు. -
ఎమ్మెల్యేలు జంప్.. పీసీసీ చీఫ్ రాజీనామా
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ అరుణాచల్ప్రదేశ్ పీసీసీ చీఫ్ రాజీనామా చేశారు. అరుణాచల్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు నబమ్ టుకీ తన పదవికి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ నాయకుడు ఒకరు శనివారం తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇటీవల బీజేపీలోకి ఫిరాయించిన నేపథ్యంలో నబమ్ టుకీ తన రాజీనామాను శుక్రవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి పంపినట్లు తెలిసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి ఫిరాయించకుండా అడ్డుకోలేకపోయిందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసినట్లు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి గ్యామర్ తానా చెప్పారు. నబమ్ టుకీ రాష్ట్రంలోని సగాలీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎల్పీ నాయకుడు, తూర్పు సియాంగ్ జిల్లాలోని మెబో నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన లాంబో తాయెంగ్ ఇటీవల బీజేపీలో చేరారు. అలాగే గత నెలలో మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాంగ్ ఎరింగ్, వాంగ్లిన్ లోవాంగ్డాంగ్ బీజేపీలో చేరారు. -
PM Modi: ప్రపంచంలోనే పొడవైన టన్నెల్ ప్రారంభించిన మోదీ
ఈటానగర్: ప్రపంచంలోనే అత్యంత పొడవైన డబుల్ లేన్ ఆల్ వెదర్ టన్నెల్ను ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ప్రదేశ్లోని ఈటానగర్ నుంచి వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా గత కాంగ్రెస్ హయాంలో పాలనపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లలో చేయని పనులను తాను పదేళ్లలో చేసిచూపించినట్టు మోదీ కామెంట్స్ చేశారు. కాగా, టన్నెల్ ప్రారంభోత్సవం అనంతరం మోదీ మాట్లాడుతూ.. భారత ఈశాన్య రాష్ట్రాల్లో మోదీ గ్యారంటీ ఫలితాలు కనిపిస్తున్నాయి. బీజేపీ ఘన విజయం సాధించనుందని అర్థం అవుతోంది. ఎన్నికల్లో విజయం కోసం నేను పనిచేయను. ప్రజల కోసమే పనిచేస్తాను. యూపీఏ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి కుంటుపడింది. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో రూ.55వేల పనులు ప్రారంభించడం ఆనందంగా ఉంది. #WATCH | Itanagar, Arunachal Pradesh: Prime Minister Narendra Modi inaugurates the Sela Tunnel. pic.twitter.com/hSeI30lhqk — ANI (@ANI) March 9, 2024 70 ఏళ్ల యూపీఏ పాలనలో చేయని అభివృద్ధిని నేను పదేళ్లలోనే చేసి చూపించాను. అష్ట లక్ష్మీ పథకం ద్వారా ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. పర్యాటక రంగం విషయంలో దక్షిణాసియా, తూర్పు ఆసియా దేశాలతో ఈశాన్య రాష్ట్రాలకు ఎంతో దృఢమైన సంబంధాలున్నాయి. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాము అని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలుపు అనే అంశాన్ని కూడా మోదీ ఇక్కడ గుర్తుచేశారు. #WATCH | Itanagar, Arunachal Pradesh: Prime Minister Narendra Modi says, "Our vision is that of 'Ashta Lakshmi' for the development of the Northeast. Our Northeast is becoming a strong link for trade and tourism with South Asia and East Asia." pic.twitter.com/c1PyO37H7M — ANI (@ANI) March 9, 2024 కాగా, అంతకుముందు ప్రధాని మోదీ.. అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏనుగుపై సఫారీ చేశారు. నేషనల్ పార్క్లో తిరుగుతూ కాసేపు అక్కడే సమయం గడిపారు. #WATCH | Itanagar, Arunachal Pradesh: Prime Minister Narendra Modi says, You must have heard of 'Modi Ki Guarantee'. You will realize its meaning once you reach Arunachal. The entire Northeast is a witness to this. I laid the foundation of the Sela Tunnel here in 2019, and today… pic.twitter.com/tqjnNd2fh6 — ANI (@ANI) March 9, 2024 ఈ టన్నెల్ విశేషాలు ఇవే.. సేలా టన్నెల్ను సముద్ర మట్టానికి 13వేల అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య నిర్మించారు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా బాలిపారా-చారిదౌర్-తవాంగ్(BCT) రహదారిలో అనుసంధానం కోల్పోకుండా ఉండే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. సరిహద్దు రహదారుల సంస్థ (BRO).. ఈ రెండు వరుసల టన్నెల్ను నిర్మించింది. ఈ ప్రాజెక్టులో రెండు సొరంగాలు ఉన్నాయి. టన్నెల్-1 సింగిల్ ట్యూబ్తో 1,003 మీటర్ల పొడవుండగా.. టన్నెల్-2 రెండు సొరంగమార్గాలతో 1,595 మీటర్ల పొడవు కలిగి ఉంది. రెండింటిని కలిపే రోడ్డు పొడవు 1200 మీటర్లు. టన్నెల్-2 సొరంగమార్గాల్లో ఒకటి సాధారణ ట్రాఫిక్కు, మరొకటి ఎమర్జెన్సీ సర్వీసులకు కేటాయించారు. పర్వతాల మధ్య సేలా పాస్కు 400 మీటర్ల దిగువన ఈ నిర్మాణం చేపట్టారు. ఈ టన్నెల్ వల్ల చలికాలంలో కూడా రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదు. భారత్-చైనా సరిహద్దులో ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా ఆయుధాలు, బలగాలను వేగంగా తరలించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. సరిహద్దు ప్రాంత ప్రజలకు సామాజిక-ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చనుంది. దీంతో తవాంగ్-దిరాంగ్ ప్రాంతాల మధ్య 12 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. 90 నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఈ టన్నెల్ మెరుగైన భద్రతా సామర్థ్యాన్ని కలిగి ఉంది. వెంటిలేషన్ వ్యవస్థలు, లైటింగ్, అగ్నిమాపక పరికరాలు వంటి అధునాతన సదుపాయాలను సొరంగాల్లో ఏర్పాటు చేశారు. 2019 ఫిబ్రవరి 9న ప్రధాని నరేంద్రమోదీ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దీనికోసం ప్రభుత్వం రూ.825 కోట్లు వెచ్చించింది. అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ చైనా సరిహద్దుల్లో ఉంటుంది. ఈ సొరంగమార్గంతో అత్యవసర పరిస్థితుల్లో భారత దళాలు త్వరితంగా సరిహద్దులకు చేరుకునే అవకాశం కలిగింది. చైనా సరిహద్దులు ఎత్తుగా ఉండటంతో డ్రాగన్ బలగాలు సులభంగా భారత దళాల కదలికలను కనిపెట్టగలవు. అయితే సొరంగమార్గం అందుబాటులోకి రావడంతో వారికి ఆ అవకాశం మూసుకుపోయింది. -
నేడు భారీ సొరంగాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో నిర్మితమైన పొడవైన సొరంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం దేశానికి అంకితం చేయనున్నారు. ఈ సొరంగం 13 వేల అడుగుల ఎత్తులో నిర్మితమయ్యింది. ఈ డబుల్ లేన్ ఆల్ వెదర్ టన్నెల్ అరుణాచల్ ప్రదేశ్లోని వెస్ట్ కమింగ్- తవాంగ్ జిల్లాలను కలుపుతుంది. భారత్ను చైనా భూభాగంతో విభజించే వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)కి చేరుకోవడానికి ఈ సొరంగమే ఏకైక మార్గం. దీనితో పాటు ఇటానగర్లో 20కి పైగా ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్లలో రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం తేజ్పూర్ చేరుకున్న ప్రధానికి అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి కజిరంగా నేషనల్ పార్క్కు ప్రధాని చేరుకున్నారు. రాత్రి విశ్రాంతి అనంతరం (ఈరోజు)శనివారం ఉదయం కజిరంగా అభయారణ్యాన్ని సందర్శిస్తారు. అనంతరం ప్రధాని ఇటానగర్కు వెళతారు. ప్రముఖ అహోం యోధుడు లచిత్ బోర్ఫుకాన్ 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని శనివారం హోలోంగథర్లో ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. దీనికి 'శౌర్య విగ్రహం' అని పేరు పెట్టారు. జోర్హాట్లోని మెలాంగ్ మెటెల్లి పొతార్లో జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. వర్చువల్ మాధ్యమం ద్వారా 18 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అసోంలో రూ. 768 కోట్ల వ్యయంతో డిగ్బోయ్ రిఫైనరీ విస్తరణ కోసం గౌహతిలో ఐఓసీఎల్కు చెందిన బెత్కుచి టెర్మినల్ను ప్రధాని ప్రారంభించనున్నారు. -
అరుణాచల్ ప్రదేశ్లో భూకంపం.. రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రత
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం రిక్కర్ స్కేల్పై 4.3 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలాజీ(NCS) వెల్లడించింది. Earthquake of Magnitude:4.3, Occurred on 03-02-2024, 10:11:01 IST, Lat: 36.77 & Long: 97.17, Depth: 60 Km ,Location: 975km N of Pangin, Arunachal Pradesh, India for more information Download the BhooKamp App@KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept @moesgoi pic.twitter.com/HZ6G2yFf0z — National Center for Seismology (@NCS_Earthquake) February 3, 2024 ఉదయం 10. 11 గంటలకు సుమారు 60 కిలోమీటర్ల లోతుగా భూకంపం కేంద్రీకృతం అయినట్లు పేర్కొంది. ఈ భూకంపంలో ఎటువంటి ఆస్తీ, ప్రాణ నష్టం జరగలేదని ప్రభుత్వ అధికారులు తెలిపారు. -
అగర్వాల్ ట్రిపుల్ సెంచరీ.. ఇన్నింగ్స్ తేడాతో హైదరాబాద్ విజయం
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో హైదరాబాద్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ప్లేట్ గ్రూపులో భాగంగా అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో ఇన్నింగ్స్ 180 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 187 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ బౌలర్లలో మిలాంద్, కార్తీకేయ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. త్యాగరాజన్ రెండు వికెట్లు సాధించారు. అనంతరం హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 615 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో తన్మయ్ అగర్వాల్ ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. 147 బంతుల్లోనే 300 పరుగుల మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 181 బంతులు ఎదుర్కొన్న అగర్వాల్.. 34 ఫోర్లు, 26 సిక్స్లతో 366 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ హ్లోత్ 105 బంతుల్లో 185 పరుగులతో సత్తా చాటాడు. వీరిద్దరి విధ్వంసం ఫలితంగా హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 443 పరుగుల అధిక్యం సాధించింది. 443 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన అరుణాచల్.. 256 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ను హైదరాబాద్ కేవలం రెండు రోజుల్లోనే ముగించింది. చదవండి: IND vs ENG: రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. శ్రీనాథ్ రికార్డు బద్దలు -
ఇషాన్ కిషన్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్.. 442 రన్స్ ఆధిక్యం
సాక్షి, హైదరాబాద్- Ranji Trophy 2023-24- Hyderabad vs Arunachal Pradesh: దేశవాళీ క్రికెట్లో అనామక అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై హైదరాబాద్ ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (160 బంతుల్లో 323 బ్యాటింగ్, 33 ఫోర్లు, 21 సిక్స్లు), కెప్టెన్ రాహుల్ సింగ్ గహ్లోత్ (105 బంతుల్లో 185; 26 ఫోర్లు, 3 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్లో భాగంగా సొంతగడ్డపై జరుతున్న నాలుగు రోజుల లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ తొలిరోజు ‘సూపర్ఫాస్ట్’ ప్రదర్శన కనబరిచింది. ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 48 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 529 పరుగులు సాధించింది. ప్రస్తుతం హైదరాబాద్ 357 పరుగుల ఆధిక్యంలో ఉంది. ముందుగా అరుణాచల్ ఇన్నింగ్స్ను కూల్చడం మొదలు, హైదరాబాద్ బ్యాటింగ్ అంతా మెరుపు వేగంతో సాగిపోయింది. హైదరాబాద్ బౌలర్ల విజృంభణతో తూంకుంటలోని నెక్స్జెన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన అరుణాచల్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 39.4 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ తెచీ డోరియా (127 బంతుల్లో 97 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. హైదరాబాద్ బౌలర్లు సీవీ మిలింద్ (3/36), కార్తికేయ (3/28), తనయ్ త్యాగరాజన్ (2/53) అరుణాచల్ జట్టును కట్టడి చేశారు. తొలి వికెట్కు 449 పరుగుల భాగస్వామ్యం అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన హైదరాబాద్ ఓపెనర్లు తన్మయ్, రాహుల్ అరుణాచల్ బౌలర్లపై విధ్వంసరచన చేశారు. ఇద్దరూ చెలరేగిన తీరుతో ప్రతీ ఓవర్ హైలైట్స్ను తలపించింది. తొలుత ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ తన్మయ్తో రాహుల్ తొలి వికెట్కు 40.2 ఓవర్లలో 449 పరుగుల భాగస్వామ్యం జోడించాక అవుటయ్యాడు. రాహుల్ అవుటయ్యాక కూడా తన్మయ్ తన జోరు కొనసాగించాడు. ఈ క్రమంలో రంజీ ట్రోఫీలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన భారత క్రికెటర్గా తన్మయ్ నిలిచాడు. తన్మయ్ 119 బంతుల్లో డబుల్ సెంచరీ చేయగా... 1985లో బరోడా జట్టుపై రవిశాస్త్రి (ముంబై) 123 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. డబుల్ సెంచరీ పూర్తయ్యాక కూడా తన్మయ్ విధ్వంసం కొనసాగింది. ఫాస్టెస్ట్ ‘ట్రిపుల్ .. ఇషాన్ సిక్సర్ల రికార్డు బద్దలు ఈ క్రమంలో తన్మయ్ ఫస్ట్క్లాస్ ఫాస్టెస్ట్ ట్రిపుసెంచరీ’ సాధించిన బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. తన్మయ్ 147 బంతుల్లో ‘ట్రిపుల్ సెంచరీ’ సాధించి ... 2017లో దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్లో 191 బంతుల్లో ‘ట్రిపుల్ సెంచరీ’ చేసిన మార్కో మరైస్ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాకుండా రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా నిలిచాడు. శుక్రవారం నాటి మొదటిరోజు ఆట ముగిసేసరికి తన్మయ్ 21 సిక్స్లు కొట్టగా... జార్ఖండ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ (2016లో ఢిల్లీపై 14 సిక్స్లు), హిమాచల్ప్రదేశ్ ఆటగాడు శక్తి సింగ్ (1990లో హరియాణాపై 14 సిక్స్లు) పేరిట ఉన్న రికార్డు తెరమరుగైంది. Day 2- 366 పరుగులు చేసి అవుట్ తన్మయ్ అగర్వాల్ వీరవిహారానికి అరుణాచల్ ప్రదేశ్ బౌలర్ నబం టెంపోల్ బ్రేక్ వేశాడు. శనివారం నాటి రెండో రోజు ఆటలో 366 పరుగుల వ్యక్తిగత స్కోరు(34 ఫోర్లు, 26 సిక్సర్లు) వద్ద తన్మయ్ క్యాచ్ అవుట్గా పెవిలియన్ చేరాడు. దీంతో రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్.. అభిరథ్ రెడ్డి(37), నితేశ్ రెడ్డి(12) రూపంలో మరో రెండు వికెట్లు కోల్పోయింది. మొత్తంగా 59 ఓవర్లు ముగిసే సరికి 614-4 స్కోరు చేసిన హైదరాబాద్ ప్రస్తుతం 442 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: Ranji Trophy: హనుమ విహారి, రికీ భుయ్ సెంచరీలు -
మనోళ్లు దంచికొట్టారు.. ఒక్కడే 323 నాటౌట్! 357 రన్స్ ఆధిక్యం
Hyderabad vs Arunachal Pradesh- Hyderabad lead by 357 runs: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో హైదరాబాద్ అద్భుత ప్రదర్శన సాగుతోంది. ఇప్పటికే ఆరంభ మ్యాచ్లో తిలక్ వర్మ కెప్టెన్సీలో నాగాలాండ్పై 194 పరుగుల తేడాతో గెలుపొందిన హైదరాబాద్.. రెండో మ్యాచ్లో రాహుల్ సింగ్ గహ్లోత్ సారథ్యంలో మేఘాలయను 81 రన్స్తో చిత్తు చేసింది. 172 పరుగులకే ఆలౌట్ ముచ్చటగా మూడో మ్యాచ్లోనూ అద్భుత ఆట తీరుతో సిక్కింపై 198 పరుగుల తేడాతో గెలుపొందింది. హ్యాట్రిక్ విజయాల తర్వాత ఇప్పుడు మరో భారీ గెలుపుపై కన్నేసింది. ప్లేట్ గ్రూపులో ఉన్న హైదరాబాద్- అరుణాచల్ ప్రదేశ్ మధ్య శుక్రవారం రంజీ మ్యాచ్ మొదలైంది.సొంతగడ్డపై నెక్స్జెన్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బౌలింగ్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్ను 172 పరుగులకే కట్టడి చేసింది. సంచలన ఆరంభం.. హైదరాబాద్ బౌలర్లలో సీవీ మిలింద్, కార్తికేయ మూడేసి వికెట్లు తీయగా.. టి.త్యాగరాజన్ రెండు, సాకేత్, ఇల్లిగరం సంకేత్ తలా ఓ వికెట్ తీశారు. ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్ ఆరంభించిన హైదరాబాద్కు ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్, గహ్లోత్ రాహుల్ సింగ్ సంచలన ఆరంభం అందించారు. 33 ఫోర్లు, 21 సిక్సర్లు తన్మయ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ నమోదు చేయగా.. గహ్లోత్ 105 బంతుల్లో 185 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. తన్మయ్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొదటి రోజు ఆట ముగిసే సరికి 160 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 323 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 33 ఫోర్లు, 21 సిక్సర్లు ఉన్నాయి. రంజీ మ్యాచ్లో తన్మయ్ టీ20 తరహా ఇన్నింగ్స్ కారణంగా హైదరాబాద్ మొదటి రోజు వికెట్ నష్టానికి 48 ఓవర్లలోనే 529 పరుగులు చేసింది. తద్వారా అరుణాచల్ ప్రదేశ్పై 357 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తన్మయ్కు తోడుగా అభిరథ్ రెడ్డి 19 రన్స్తో క్రీజులో ఉన్నాడు. చదవండి: చూసుకోవాలి కదా... జడ్డూ సైగ.. కోపంగా వెళ్లిన అశ్విన్! రనౌట్ వల్ల.. -
హైదరాబాద్ బ్యాటర్ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ 2023- 24 సీజన్లో హైదరాబాద్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ సంచలనం సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్తో శుక్రవారం మొదలైన మ్యాచ్లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో ఫస్ట్క్లాస్ క్రికెట్లో అత్యంత వేగంగా త్రిశతకం బాదిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. టీ20 మ్యాచ్ తరహాలో దంచికొడుతూ 147 బంతుల్లోనే 300 పరుగుల మార్కు అందుకుని ఈ మేరకు అరుదైన ఘనత సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఏకంగా 20 సిక్సర్లు ఉండటం విశేషం. ఆల్టైమ్ రికార్డు బ్రేక్ అరుణాచల్ ప్రదేశ్తో అద్భుత ఇన్నింగ్స్ మెరిసిన తన్మయ్ అగర్వాల్ సౌతాఫ్రికా క్రికెటర్ మార్కో మరేస్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. కాగా సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్లో బోర్డర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మార్కో.. ఈస్టర్న్ ప్రావిన్స్ మీద 191 బంతుల్లో 300 రన్స్ సాధించాడు. తన్మయ్ 147 బాల్స్లోనే ఈ మార్కును అందుకోవడం విశేషం. రవిశాస్త్రి పేరును చెరిపేసి.. ఇక అరుణాచల్ ప్రదేశ్తో మ్యాచ్లోనే అంతకుముందు తన్మయ్ అగర్వాల్ మరో రికార్డును కూడా సాధించాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ బాదిన భారత బ్యాటర్గా నిలిచాడు. తద్వారా 39 ఏళ్లుగా టీమిండియా మాజీ బ్యాటర్ రవిశాస్త్రి పేరిట చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. 119 బంతుల్లోనే 200 పరుగుల మార్కును అందుకుని తన్మయ్ ఈ ఘనత సాధించాడు. కాగా ప్లేట్ గ్రూపులో ఉన్న హైదరాబాద్- అరుణాచల్ ప్రదేశ్ జట్ల మధ్య శుక్రవారం రంజీ మ్యాచ్ ఆరంభమైంది. చదవండి: చూసుకోవాలి కదా... జడ్డూ సైగ.. కోపంగా వెళ్లిన అశ్విన్! రనౌట్ వల్ల..
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ
శ్రీరామానంద స్వామిజీ పాదయాత్ర
కుంభకోణాలకు చట్టబద్ధత కల్పించింది బీజేపీయే
No Headline
‘దేవర’ చిత్ర యూనిట్ను వదలని తేనెటీగలు
హోరెత్తిన ఎన్నికల ప్రచారం
సంక్షేమ ప్రభుత్వానికి ప్రజల మద్దతు
మన్యంలో మోసగాడు
పశువుల కోసం వెళ్లి గోదావరిలో పడి విద్యార్థి మృతి
హైరిస్క్ గర్భిణుల గుర్తింపు
తప్పక చదవండి
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement