-
వరల్డ్కప్ బెర్త్ కోసం ఇద్దరితో పోటీపడుతున్న అక్షర్ పటేల్..!
టీ20 వరల్డ్కప్ 2024 జట్ల ప్రకటన కోసం మే 1 డెడ్లైన్ కావడంతో అన్ని దేశాల సెలెక్షన్ ప్యానెల్లు తమతమ జట్లను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఈ క్రమంలో భారత సెలెక్టర్లు కూడా తమ జట్టుకు తుది రూపు తెచ్చేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. టీమిండియా విషయంలో సెలెక్టర్లు ఇదివరకే ఓ అంచనాతో ఉన్నప్పటికీ ఒకట్రెండు బెర్తుల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. హార్దిక్ బెర్త్ కన్ఫర్మ్..?ఆల్రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేల మధ్య పోటీ ఉందని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. సెలెక్టర్లు పాండ్యావైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. శివమ్ దూబేకు ఐపీఎల్లో బౌలింగ్ చేసే అవకాశం రాకపోవడం అతనికి మైనస్ అవుతుంది. దూబే బ్యాటింగ్లో మెరుపులు మెరిపిస్తున్నా ఆల్రౌండర్ కోటా కాబట్టి సెలెక్టర్లు రెండు విభాగాలను పరిగణలోకి తీసుకుంటారు. హార్దిక్కు గత అనుభవం కూడా కలిసొస్తుంది. పంత్ ఫిక్స్.. సంజూ వర్సెస్ రాహుల్రిషబ్ పంత్ టీ20 వరల్డ్కప్ బెర్త్ పక్కా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్ 2024లో ప్రదర్శనల ఆధారంగా పంత్ ఎంపిక జరుగనున్నట్లు సమాచారం.సెకెండ్ ఛాయిస్ వికెట్కీపర్ స్థానం కోసం కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ తీవ్రంగా పోటీపడుతున్నప్పటికీ.. రాహుల్వైపే సెలెక్టర్లు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.అక్షర్ వర్సెస్ ఆవేశ్ వర్సెస్ బిష్ణోయ్బౌలింగ్ విభాగంలో బుమ్రా, సిరాజ్, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ బెర్త్లు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. ఒక్క బెర్త్ విషయంలో సెలెక్టర్లు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తుంది. అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్లలో ఎవరిని ఎంపిక చేయాలని సెలెక్టర్లు తలలుపట్టుకున్నారు. వరల్డ్కప్ వేదికలు స్లో ట్రాక్స్ కావడంతో అక్షర్కు మెరుగైన అవకాశాలు ఉండచ్చు. -
తెలివిగా వ్యవహరిస్తున్న హార్దిక్.. పాపం శివం దూబే! నిజంగా నష్టమేనా?
‘‘ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన నాకెందుకో అంతగా నచ్చలేదు. ప్రేక్షకులకు వినోదం అందించడమే లక్ష్యంగా చూస్తే ఇది బాగానే ఉంటుంది. కానీ.. క్రికెటింగ్ కోణంలో చూస్తే.. సరికాదనే అనిపిస్తోంది. ఇక్కడ 12 మందితో కాదు 11 మందితోనే ఆడాలి.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల వాషింగ్టన్ సుందర్, శివం దూబే వంటి ఆల్రౌండర్లకు బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదు. టీమిండియాకు ఇదైతే శుభసూచకం కాదు’’- రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ ఓపెనర్. ‘‘ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు నేను అనుకూలం కాదు. ఈ నిబంధన వల్ల జట్లు నిఖార్సైన బ్యాటర్లు లేదంటే బౌలర్ల సేవలనే ఉపయోగించుకుంటాయి. ఆల్రౌండర్లను ఎవరు పట్టించుకుంటారు? ఇలాంటి నిబంధనలు రూపొందించే వాళ్లు కేవలం బ్యాటింగ్ ఒక్కటే మ్యాచ్ దిశానిర్దేశాన్ని మారుస్తుందని అనుకుంటారేమో(నవ్వులు).. ఈ రూల్ వల్ల బౌలర్లకు తిప్పలు తప్పవు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల జట్టులో అదనపు సభ్యుడు చేరతాడు. ఒకవేళ ఒక జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలహీనంగా ఉంటే వాళ్లు బ్యాటర్ను.. బౌలింగ్ వీక్గా ఉంటే బౌలర్ను తెచ్చుకుంటారు. అందుకే బ్యాటర్ వచ్చీ రాగానే హిట్టింగ్ మొదలుపెడతాడు. గత రెండేళ్లుగా గమనిస్తూనే ఉన్నా.. ఎనిమిదో నంబర్ వరకు బ్యాటర్లు ఉంటారు కాబట్టి స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపిస్తారు’’- అక్షర్ పటేల్, టీమిండియా స్పిన్ ఆల్రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్. మొన్న రోహిత్ శర్మ.. ఇప్పుడు అక్షర్ పటేల్ ఇలా చాలా మంది ఐపీఎల్లోని ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఆల్రౌండర్లకు నష్టం చేకూరుస్తుందనే వాదనలు వినిపిస్తున్నారు. ఏమిటీ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన? ఐపీఎల్-2023కి ముందు నిర్వాహకులు ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. బ్యాటింగ్ లేదంటే బౌలింగ్ చేయడానికి జట్టులోకి వచ్చే సబ్స్టిట్యూట్ ప్లేయర్. ఈ నిబంధన ప్రకారం ఇండియన్ ప్లేయర్ను ఎక్కువగా వాడుకునే అవకాశం ఉంటుంది. టాస్ సమయంలో కెప్టెన్ సబ్స్టిట్యూట్ ప్లేయర్లుగా నలుగురి పేర్లను నామినేట్ చేయాలి. అందులో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగించుకోవాలి. ఎప్పుడు తెచ్చుకోవచ్చు? ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు లేదంటే ఓవర్ పూర్తైన తర్వాత.. లేదంటే వికెట్ పడిన అనంతరం.. లేదా బ్యాటర్ రిటైర్ అయినపుడు కెప్టెన్ తమ ఇంపాక్ట్ ప్లేయర్ను బరిలోకి దించవచ్చు. ఒక బౌలింగ్ చేస్తున్న జట్టు ఓవర్ మధ్యలోనే(వికెట్ పడ్డా/బ్యాటర్ రిటైర్ అయినా) ఇంపాక్ట్ ప్లేయర్ను తీసుకువస్తే ఆ వ్యక్తిని మిగిలిన ఓవర్ పూర్తయ్యేదాకా బౌలింగ్ చేసేందుకు అనుమతించరు. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన తర్వాత.. ఎవరి స్థానంలో అయితే ఇంపాక్ట్ ప్లేయర్ వస్తారో.. సదరు ఆటగాడు మిగిలిన మ్యాచ్కు దూరమవుతాడు. కనీసం సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా ఉండే అవకాశం కూడా ఉండదు. ఒకవేళ విదేశీ ప్లేయర్ని తీసుకుంటే? నిబంధనల ప్రకారం తుదిజట్టులో నలుగురు మాత్రమే విదేశీ ఆటగాళ్లు ఉండవచ్చు. కాబట్టి అప్పటికే జట్టులో నలుగురూ ఉన్నారంటే కచ్చితంగా ఇండియన్ ప్లేయర్నే ఇంపాక్ట్ ప్లేయర్గా తెచ్చుకోవాలి. అయితే, టాస్ సమయంలోనే నలుగురు సబ్ట్యూట్లలో ఒకరిగా విదేశీ ప్లేయర్ను నామినేట్ చేయాలి. జట్టులో ఎంతమంది? ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా జట్టులో 11 మంది కంటే ఎక్కువయ్యే అవకాశం లేదు. బ్యాటర్ స్థానంలో బ్యాటర్.. బౌలర్ స్థానంలో బౌలర్నే ఎక్కువగా సబ్ట్యూట్గా ఉపయోగించుకుంటారు. ఒకవేళ బౌలింగ్ టీమ్ గనుక ఇంపాక్ట్ ప్లేయర్గా బౌలర్ను తీసుకువస్తే.. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయవచ్చు. లేదంటే పవర్ ప్లే లేదా డెత్ ఓవర్ల స్పెషలిస్టు సేవలను వారి ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకోవచ్చు. శివం దూబేకు నో ఛాన్స్! ముందే సర్దుకున్న హార్దిక్ అయితే, ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వలన ఆల్రౌండర్లు నష్టపోతున్నారనేది చర్చ. రోహిత్ శర్మ, అక్షర్ పటేల్ చెప్పినట్లు బ్యాటింగ్ టీమ్ స్పెషలిస్టు బ్యాటర్ను.. బౌలింగ్ టీమ్ స్పెషలిస్టు బౌలర్ను తెచ్చుకుంటుంది. ఒకవేళ ఆల్రౌండర్లకు ఛాన్స్ ఇచ్చినా వాళ్లు ఏదో ఒక సేవకే పరిమితం అవుతారు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేస్ ఆల్రౌండర్ శివం దూబేను ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకుంటోంది. అతడు కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తుండగా.. బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదు. టీ20 వరల్డ్కప్-2024 టోర్నీకి ముందు ఇలా జరగడం ఒక విధంగా అతడికి నష్టం చేకూరుస్తోంది. ప్రపంచకప్ జట్టులో స్థానం కోసం హార్దిక్ పాండ్యాతో పోటీ పడుతున్న దూబే.. బౌలింగ్ చేయనట్లయితే సెలక్టర్లు అతడి వైపు మొగ్గు చూపరు. మరోవైపు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఉన్న పాండ్యా ప్రమాదాన్ని ముందుగా పసిగట్టాడేమో మళ్లీ బౌలింగ్ మొదలుపెట్టి తన ఆల్రౌండ్ నైపుణ్యాలను మరోసారి నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అలా చూసుకుంటే కష్టమే ఆల్రౌండర్లకు జరుగుతున్న నష్టం గురించి ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇక అంతర్జాతీయ మ్యాచ్లలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండదు కాబట్టి తుదిజట్టు కూర్పు కాస్త కష్టంగానే మారుతుంది. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగి ఫామ్(బ్యాటింగ్/బౌలింగ్) కోల్పోయిన ఆల్రౌండర్కు జాతీయ జట్టు తరఫున ముఖ్యంగా వరల్డ్కప్ వంటి మెగా టోర్నీ సమీపిస్తున్న తరుణంలో టీమిండియాలో చోటు దక్కించుకోవడం కష్టమే! -
Ind vs Eng: బ్యాటింగ్లో విఫలమైనా.. అద్భుత క్యాచ్తో మెరిసి..
India vs England, 2nd Test: ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుత క్యాచ్తో మెరిశాడు. బంతిని సరిగ్గా అంచనా వేసి డైవ్ చేసి మరీ ఒడిసిపట్టి భారత శిబిరంలో నవ్వులు నింపాడు. కాగా హైదరాబాద్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన టీమిండియా.. విశాఖపట్నంలో రెండో మ్యాచ్లో తలపడుతోంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి స్టేడియంలో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ(209) కారణంగా తొలి ఇన్నింగ్స్లో 396 పరుగులు చేసింది. బ్యాటింగ్లో విఫలం అయితే, ఈ మ్యాచ్లో బ్యాటర్గా శ్రేయస్ అయ్యర్ విఫలమయ్యాడు. 59 బంతులు ఎదుర్కొన్న ఈ నాలుగో నంబర్ బ్యాటర్ కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. తద్వారా జట్టుతో పాటు అభిమానులనూ నిరాశపరిచాడు. అయితే, రెండో రోజు ఆటలో భాగంగా శనివారం సూపర్ క్యాచ్ అందుకుని ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 23వ ఓవర్ను టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ వేశాడు. డైవ్ చేసి.. క్యాచ్ పట్టి అతడి బౌలింగ్లో రెండో బంతికి ఫోర్ బాదిన ఇంగ్లిష్ ఓపెనర్ జాక్ క్రాలే.. మరుసటి బాల్కు కూడా షాట్ ఆడాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో బంతి గాల్లోకి లేవగా బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ వెనక్కి పరుగెత్తి.. డైవ్ చేసి క్యాచ్ పట్టాడు. దీంతో 76 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ప్రమాదకరంగా మారుతున్న జాక్ క్రాలే కథ ముగిసింది. రెండో వికెట్ దక్కడంతో టీమిండియాలో సంబరాలు మొదలయ్యాయి. ఇక శ్రేయస్ అయ్యర్ క్యాచ్ అందుకున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘బ్యాటింగ్తో కాకపోయినా.. ఫీల్డింగ్తోనైనా జట్టులో చోటిచ్చినందుకు కనీస న్యాయం చేస్తున్నావు’’ అంటూ సెటైరికల్గా ప్రశంసిస్తున్నారు. చదవండి: Ind vs Eng: పుజారా అక్కడ దంచికొడుతున్నాడు.. జాగ్రత్త: గిల్కు మాజీ కోచ్ వార్నింగ్ 𝙄. 𝘾. 𝙔. 𝙈. 𝙄 That was a ripper of a catch! ⚡️ ⚡️ Follow the match ▶️ https://t.co/X85JZGt0EV #TeamIndia | #INDvENG | @ShreyasIyer15 | @IDFCFIRSTBank pic.twitter.com/JSAHGek6nK — BCCI (@BCCI) February 3, 2024 -
Day 3: భారత బౌలర్లకు 6 వికెట్లు.. పోప్ సెంచరీ.. హైలైట్స్ ఇవే
India vs England 1st Test Day 3 Updates: టీమిండియాతో తొలి టెస్టు మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. హైదరాబాద్లో శనివారం నాటి ఆట పూర్తయ్యే సరికి 77 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ ఒలీ పోప్ అద్భుత సెంచరీ కారణంగా ఈ మేరకు మెరుగైన స్కోరు సాధించింది. మూడో రోజు హైదరాబాద్ టెస్టు ఆసక్తికరమైన మలుపులు తిరిగింది. ఆరంభంలో టీమిండియా, ఆ తర్వాత ఇంగ్లండ్ అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఓ దశలో మ్యాచ్ ఇండియా వైపే మొగ్గు చూపినా.. ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ పోరాడడంతో ఆ జట్టుకు 126 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. మూడో రోజు ఆట ముగిసే సరికి పోప్ 148, రెహాన్ అహ్మద్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ రెండు, జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 436 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్లో 316/6 స్కోరు చేసిన ఇంగ్లండ్ ప్రస్తుతం భారత జట్టు కంటే 126 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆరో వికెట్ డౌన్.. 275 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన బెన్ ఫోక్స్ను.. అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి రెహాన్ ఆహ్మద్ వచ్చాడు. అతడితో పాటు ఓలీ పోప్(125) పరుగులతో ఉన్నాడు. ఒలీ పోప్ టాప్ క్లాస్ సెంచరీ 60.2: జడేజా బౌలింగ్లో మూడు పరుగులు తీసి శతకం పూర్తి చేసుకున్న ఇంగ్లండ్ వన్డౌన్ బ్యాటర్ ఒలీ పోప్. ఇంగ్లండ్ స్కోరు: 245/5 (61) 200 పరుగుల మార్కు అందుకున్న ఇంగ్లండ్ 52 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 200-5 ఆధిక్యంలోకి ఇంగ్లండ్.. టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 5 పరుగుల ఆధిక్యంలోకి వచ్చింది. 50 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్రీజులో పోప్(81), బెన్ ఫోక్స్(10) పరుగులతో ఉన్నారు. టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 172/5 (42) ఒలీ పోప్ 67, బెన్ ఫోక్స్ రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 18 పరుగులు వెనుబడి ఉంది. స్టోక్స్ అవుట్ 36.5: అశ్విన్ బౌలింగ్లో ఐదో వికెట్గా వెనుదిరిగిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్స్టోక్స్(6). ఇంగ్లండ్ స్కోరు: 163/5 (36.5). టీమిండియా ఇంకా 27 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. స్టోక్స్ స్థానంలో బెన్ ఫోక్స్ క్రీజులోకి వచ్చాడు. పోప్ 60 పరుగులతో ఆడుతున్నాడు. 28.3: పోప్ హాఫ్ సెంచరీ నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 27.4: .జడేజా బౌలింగ్లో బెయిర్స్టో బౌల్డ్(10). బెన్స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 140/4 (27.4) 27 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 136/3 బెయిర్ స్టో ఆరు, పోప్ 46 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా ఆధిక్యం 54 పరుగులు ఇంగ్లండ్ స్కోరు: 122/3 (24).. టీమిండియాకు 68 పరుగుల ఆధిక్యం బెయిర్స్టో 3, ఒలీ పోప్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. దెబ్బకు దెబ్బ కొట్టిన బుమ్రా రెండో ఇన్నింగ్స్లో బుమ్రా బౌలింగ్లో రూట్(2) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. బెయిర్స్టో క్రీజులోకి వచ్చాడు. 21 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 117-3. కాగా అంతకు ముందు రూట్ బుమ్రాను బౌల్డ్ చేసిన సంగతి తెలిసిందే. బుమ్రా మ్యాజిక్.. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 18.5: బుమ్రా బౌలింగ్లో బెన్ డకెట్(47) క్లీన్బౌల్డ్. దెబ్బకు ఎగిరిపడ్డ వికెట్. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్. జో రూట్ క్రీజులోకి వచ్చాడు. పోప్ 31 పరుగులతో ఆడుతున్నాడు. ఇంగ్లండ్ స్కోరు: 113/2 (18.5). టీమిండియాకు ఇంకా 77 పరుగుల ఆధిక్యం నిలకడగా ఆడుతున్న డకెట్, పోప్ 16.3: డకెట్, పోప్ కలిసి 43 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. స్కోరు: 97-1(17). టీమిండియా ఆధిక్యం 93 రన్స్. భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 89/1 (15) ఒలీ పోప్ 16, బెన్ డకెట్ 38 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 101 పరుగులు వెనుకబడి ఉంది 12 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 67/1 డకెట్ 30, పోప్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. క్రాలే దూకుడుకు బ్రేక్.. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 9.2: అశ్విన్ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటైన ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే. 33 బంతుల్లోనే 31 పరుగులతో జోరు మీదున్న క్రాలేకు అశూ అడ్డుకట్ట వేయడంతో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. అతడి స్థానంలో ఒలీ పోప్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 45/1 (9.2) 7 ఓవర్లలో స్కోరు: 33-0 క్రాలే 25, డకెట్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. 6.3: అక్షర్ పటేల్ బౌలింగ్లో సిక్సర్ కొట్టిన క్రాలే 5.5: అశ్విన్ బౌలింగ్లో ఫోర్ బాదిన క్రాలే 5 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 13-0 ఓపెనర్లు జాక్ క్రాలే 10, బెన్ డకెట్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 177 పరుగులు వెనుకబడి ఉంది. హైలైట్స్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 246 టీమిండియా మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 436 టీమిండియా ఆలౌట్.. ఓవరాల్గా 190 పరుగుల ఆధిక్యం 120.6: రెహాన్ అహ్మద్ బౌలింగ్లో అక్షర్ పటేల్ బౌల్డ్. పదో వికెట్ కోల్పోయిన టీమిండియా. తొలి ఇన్నింగ్స్లో భారత్ స్కోరు: 436 (121). మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ రెండు వికెట్లు తీయగా... రెహాన్ అహ్మద్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. వచ్చీ రాగానే బుమ్రా బౌల్డ్ 119.4: జడ్డూ స్థానంలో క్రీజులోకి వచ్చిన బుమ్రా జో రూట్ బౌలింగ్ క్లీన్బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సిరాజ్ క్రీజులోకి వచ్చాడు. అక్షర్ పటేల్ 44 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా స్కోరు: 436/9 (120). 190 పరుగుల ఆధిక్యంలో టీమిండియా జడ్డూ అవుట్.. ఎనిమిదో వికెట్ డౌన్ 119.3: జో రూట్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగిన రవీంద్ర జడేజా. 87 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడ్డూ ఇన్నింగ్స్ ముగిసిపోయింది. అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా క్రీజులోకి వచ్చాడు. టీమిండియా ఆధిక్యం 190 రన్స్ 118.6: ఫోర్ బాదిన అక్షర్ 179 పరుగుల ఆధిక్యంలో టీమిండియా 113: జడేజా 84, అక్షర్ పటేల్ 36 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్- ఇంగ్లండ్ మధ్య మొదలైన మూడో రోజు ఆట రవీంద్ర జడేజా 83, అక్షర్ పటేల్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 423-7(112). రెండో రోజు హైలైట్స్ ►శుక్రవారం నాటి ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్లో టీమిండియా స్కోరు: 421/7 ►కేఎల్ రాహుల్(86), జడేజా అర్ధ సెంచరీలు ►రాణించిన కేఎస్ భరత్(41), అక్షర్ పటేల్ ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్ టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు మూడో రోజు ఆట ఆరంభమైంది. హైదరాబాద్ వేదికగా గురువారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. భారత బౌలర్ల విజృంభణతో 246 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన రోహిత్ సేన ప్రస్తుతం 175కు పైగా పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తుదిజట్లు: టీమిండియా రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్. ఇంగ్లండ్ జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ టామ్ హార్ట్లే, మార్క్ వుడ్, జాక్ లీచ్. చదవండి: మొదటి టెస్టు మన చేతుల్లోకి... -
టాప్-10లోకి దూసుకొచ్చిన జైస్వాల్, అక్షర్ పటేల్
ఐసీసీ తాజాగా (భారత్-ఆఫ్ఘనిస్తాన్ మూడో టీ20 అనంతరం) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్, బౌలింగ్లో అక్షర్ పటేల్ టాప్-10లోకి దూసుకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్తో రెండో టీ20లో మెరుపు ఇన్నింగ్స్తో విజృంభించిన యశస్వి.. ఏడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. ఇదే సిరీస్లో విశేషంగా రాణించిన అక్షర్ పటేల్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకి ఐదో ప్లేస్కు చేరుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో ఆడనప్పటికీ సూర్యకుమార్ యాదవ్ టాప్ ప్లేస్ను కాపాడుకోగా.. ఆఫ్ఘన్ సిరీస్కు దూరమైన రుతురాజ్ ఓ స్థానం కోల్పోయి తొమ్మిదో ప్లేస్కు పడిపోయాడు. ఈ జాబితాలో ఫిలప్ సాల్ట్, మొహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్, ఎయిడెన్ మార్క్రమ్ రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్ విషయానికొస్తే.. ర్యాంకింగ్స్లో అక్షర్ పటేల్ ఎఫెక్ట్ సహచర బౌలర్ రవి భిష్ణోయ్పై పడింది. తాజా ర్యాంకింగ్స్లో బిష్ణోయ్ ఏకంగా నాలుగు స్థానాలు దిగజారి ఆరో ప్లేస్కు పడిపోయాడు. జింబాబ్వే సిరీస్లో రాణించిన లంక బౌలర్లు హసరంగ, తీక్షణ ఒకటి, రెండు స్థానాలు మెరుగుపర్చుకుని సంయుక్తంగా మూడో స్థానానికి ఎగబాకారు. ఆదిల్ రషీద్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అకీల్ హొసేన్ ఓ స్థానం మెరుగుపర్చుకుని రెండో ప్లేస్కు చేరాడు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్తో నిన్న ముగిసిన టీ20 సిరీస్ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. రసవత్తరంగా సాగిన నిన్నటి సమరంలో భారత్ రెండో సూపర్ ఓవర్లో విజయం సాధించింది. తొలుత రోహిత్ శర్మ మెరుపు శతకంతో విరుచుకుపడటంతో భారత్ 212 పరుగులు చేయగా.. ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే స్కోర్ చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లో సైతం మరోసారి స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈ సూపర్ ఓవర్లో భారత్ ఎట్టకేలకు విజయం సాధించింది. -
T20 WC: ప్రపంచకప్ జట్టులో కుల్దీప్నకు నో ఛాన్స్! ఆ ముగ్గురే..
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ దళ కూర్పు గురించి మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగా టోర్నీలో భారత జట్టు ముగ్గురు స్పిన్ బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. తన ప్రాధాన్యం మాత్రం వీళ్లేనంటూ ముగ్గురు స్టార్ల పేర్లు చెప్పాడు. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచకప్-2024 జూన్ 4 నుంచి ఆరంభం కానుంది. ఈవెంట్ మొదలైన మరుసటి రోజు టీమిండియా ఐర్లాండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఈ ఐసీసీ టోర్నీకి ముందు ఆఖరి ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా రోహిత్ సేన అఫ్గనిస్తాన్తో స్వదేశంలో తలపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ జట్టులో స్పిన్ విభాగం నుంచి అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకోగా.. తొలి రెండు మ్యాచ్లలో చైనామన్ బౌలర్ కుల్దీప్నకు తుదిజట్టులో చోటు దక్కలేదు. రవి, అక్షర్, సుందర్ ఈ రెండు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా అఫ్గన్తో ఆదివారం ముగిసిన రెండో టీ20లో అక్షర్ రెండు కీలక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో కలర్స్ షోలో మాట్లాడుతూ ప్రజ్ఞాన్ ఓజా అక్షర్ పటేల్పై ప్రశంసలు కురిపించాడు. బంతితోనూ, బ్యాటింగ్తోనూ రాణించగల ఈ ఆల్రౌండర్ అసలైన మ్యాచ్ విన్నర్ అని కొనియాడాడు. కీలక సమయంలో మ్యాచ్ను మలుపుతిప్పగల సత్తా అక్షర్ సొంతమని ఓజా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్-2024 జట్టులో అతడికి కచ్చితంగా చోటివ్వాలని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా..."నా వరకైతే వరల్డ్ కప్ జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉండాలి. నంబర్ 1.. రవీంద్ర జడేజా. అతడి అనుభవం జట్టుకు ప్రయోజనకరం. ఇక రెండో బౌలర్.. రవి బిష్ణోయి, మూడో ఆటగాడు అక్షర్ పటేల్. క్లిష్ట పరిస్థితుల్లో తెలివిగా బౌలింగ్ చేయగలడు" అని మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా పేర్కొన్నాడు. ఆ ముగ్గురికి ప్రాధాన్యం ఇవ్వాలంటూ.. కుల్దీప్ యాదవ్ను మాత్రం విస్మరించాడు. ఇదిలా ఉంటే.. అఫ్గన్తో సిరీస్కు విశ్రాంతి తీసుకున్న రవీంద్ర జడేజా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా జట్టుతో చేరనున్నాడు. చదవండి: BCCI: బీసీసీఐ సెలక్టర్పై వేటు? కారణం అదే! ప్రకటన విడుదల -
Ind vs Afg: రీఎంట్రీలో కోహ్లి మార్కు .. జైస్వాల్, దూబే దంచికొట్టారు!
India vs Afghanistan, 2nd T20I: అఫ్గనిస్తాన్తో రెండో టీ20లో టీమిండియా జయభేరి మోగించింది. ఇబ్రహీం జద్రాన్ బృందాన్ని ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్-2024కు ముందు ఆడుతున్న ఆఖరిదైన ద్వైపాక్షిక సిరీస్లో అఫ్గన్పై ఆద్యంతం ఆధిపత్యం కనబరుస్తూ సత్తా చాటుకుంది. ముఖ్యంగా యువ ఆటగాళ్లే ఈ విజయంలో కీలక పాత్ర పోషించడం విశేషం. కాగా టీమిండియాతో తొలిసారి టీ20 సిరీస్ ఆడేందుకు అఫ్గనిస్తాన్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గైర్హాజరీలో యువ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ ఈ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. 172 పరుగులకు అఫ్గన్ ఆలౌట్ ఈ క్రమంలో మొహాలీ వేదికగా తొలి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో భారత్ చేతిలో ఓడిన అఫ్గన్ జట్టు.. ఆదివారం నాటి మ్యాచ్లోనూ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇండోర్ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జద్రాన్ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు, రవి బిష్ణోయి రెండు, అక్షర్ పటేల్ రెండు, శివం దూబే ఒక వికెట్ పడగొట్టారు. రనౌట్ల రూపంలో రెండు వికెట్లు వచ్చాయి. కాగా గుల్బదిన్ నైబ్ (35 బంతుల్లో 57), కరీం జనత్(10 బంతుల్లో 20), ముజీబ్ ఉర్ రహ్మాన్(9 బంతుల్లో 21) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఈ మేరకు స్కోరు చేయగలిగింది. ఇది మెరుగైన స్కోరే అయినప్పటికీ.. పరుగుల వరదపారించడానికి వీలైన హోల్కర్ స్టేడియంలో టీమిండియాను నిలువరించడం అంతతేలిక కాదని అఫ్గన్కు త్వరగానే అర్థమైంది. ఇండియా ఇన్నింగ్స్లో ఐదో బంతికే కెప్టెన్ రోహిత్ శర్మను డకౌట్ చేసినప్పటికీ.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అఫ్గన్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారాడు. విరాట్ కోహ్లి (16 బంతుల్లో 29 పరుగులు) కూడా త్వరగానే పెవిలియన్ చేరినా పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. కోహ్లి దంచికొడితే.. జైస్వాల్, దూబే దుమ్ములేపారు కోహ్లి స్థానంలో క్రీజులోకి వచ్చిన శివం దూబేతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జైస్వాల్ 34 బంతుల్లో 5 ఫోర్లు, ఆరు సిక్సర్లతో చెలరేగి 68 పరుగులు సాధించగా.. దూబే 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్ల సాయంతో 63 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి సునామీ ఇన్నింగ్స్ కారణంగా 15.4 ఓవర్లలోనే టీమిండియా అఫ్గన్ విధించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. కీలక సమయంలో అఫ్గన్ కీలక వికెట్లు(జద్రాన్, గుల్బదిన్) తీసిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అదొక్కటే లోటు అంతాబాగానే ఉన్నా తొలి టీ20 మాదిరే రెండో టీ20లోనూ రోహిత్ శర్మ డకౌట్ కావడం అభిమానులకు నిరాశ కలిగింది. రీఎంట్రీలో హిట్మ్యాన్ మెరుపులు చూడాలనుకుంటే ఆ లోటు ఇప్పటికి అలాగే మిగిలిపోయింది. -
Tilak Varma: క్యాప్షన్, వీడియో రెండూ నకిలీవే: అక్షర్ పటేల్
Tilak VarmaTraining Video: టీమిండియా యువ బ్యాటర్, హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్కు సన్నద్ధం అవుతున్నాడు. ఇందులో భాగంగా జిమ్లో చెమటోడుస్తూ ఫిట్నెస్ మెరుగుపరుచుకునే పనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తన వర్కౌట్లకు సంబంధించిన వీడియోను తిలక్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘కొత్త ఏడాది చేసుకున్న తీర్మానాలకు కట్టుబడి ఉంటాను. 2024ను ఆరంభించడానికి ఇంతకంటే గొప్ప మార్గం ఇంకొకటి లేదు’’ అని తిలక్ వర్మ సదరు వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఇందుకు బదులుగా టీమిండియా వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ‘‘నీకు ఇలాంటి నకిలీ క్యాప్షన్లు ఎవరు ఇస్తారు’’ అంటూ సరదాగా ట్రోల్ చేశాడు. క్యాప్షన్, వీడియో రెండూ నకిలీవే మరో టీమిండియా స్టార్, ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా సూర్యకు వత్తాసు పలుకుతూ.. ‘‘క్యాప్షన్ ఒక్కటే కాదు.. ఆ వీడియో కూడా నకిలీదే. డిసెంబరు 30నాటి ట్రెయినింగ్ సెషన్కు సంబంధించిన వీడియో అది’’ అంటూ తిలక్ వర్మను ఆటపట్టించాడు. తిలక్ను ఉద్దేశించి సూర్య, అక్షర్ చేసిన కామెంట్లు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రపంచకప్ జట్టులో చోటే లక్ష్యంగా కాగా అండర్-19 వరల్డ్కప్లో సత్తా చాటి ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ.. ముంబై ఇండియన్స్ తరఫున ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఐపీఎల్-2022, 2023 సీజన్లలో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుని.. టీమిండియాలో ఎంట్రీ ఇచ్చాడు. వెస్టిండీస్తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ లెఫ్టాండర్.. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన సిరీస్లోనూ ఆడాడు. అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు మొత్తంగా 15 టీ20లు, 4 వన్డేలు ఆడిన తిలక్ వర్మ.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 310, 68 పరుగులు సాధించాడు. అదే విధంగా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడీ పార్ట్టైమ్ స్పిన్నర్. తదుపరి జనవరి 11 నుంచి మొదలుకానున్న అఫ్గనిస్తాన్ సిరీస్లో తనను తాను నిరూపించుకుని టీ20 ప్రపంచకప్ జట్టులో చోటే లక్ష్యంగా తిలక్ వర్మ ముందుకుసాగుతున్నాడు. చదవండి: T20 WC 2024: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక నిర్ణయం! View this post on Instagram A post shared by Tilak Varma (@tilakvarma9) -
ఆవేశ్ ఖాన్కు 5 వికెట్లు: తిలక్, అక్షర్ అర్ధ శతకాలు! టాప్ స్కోరర్ అతడే
South Africa A vs India A, 2nd unofficial Test: సౌతాఫ్రికా-‘ఏ’ జట్టుతో అనధికారిక రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్లు తిలక్ వర్మ, అక్షర్ పటేల్ అర్ధ శతకాలతో రాణించారు. యూపీకి చెందిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురేల్ సైతం హాఫ్ సెంచరీతో మెరిశాడు. కాగా ప్రొటిస్ యువ జట్టుతో రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్ ఆడేందుకు భారత్-ఏ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు డ్రాగా ముగియగా.. బెనోనీలో బాక్సింగ్ డే మొదలుకావాల్సిన రెండో టెస్టు వర్షం కారణంగా ఒకరోజు ఆలస్యంగా ఆరంభమైంది. టాస్ పడకుండానే తొలి రోజు ముగిసిపోగా.. రెండో రోజు ఆట సందర్భంగా టాస్ గెలిచిన భారత్-ఏ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆవేశ్ ఖాన్కు ఐదు వికెట్లు ఆతిథ్య సౌతాఫ్రికా-ఏ జట్టును 263 పరుగులకు పరిమితం చేసింది. ప్రొటిస్ ఇన్నింగ్స్లో టెయిలెండర్ షెపో మొరేకీ 42 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత పేసర్లలో ఆవేశ్ ఖాన్ అత్యధికంగా ఐదు వికెట్లతో చెలరేగగా.. నవదీప్ సైనీ ఒక వికెట్ పడగొట్టాడు. స్పిన్ ఆల్రౌండర్లు అక్షర్ పటేల్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో చివరిదైన నాలుగో రోజు ఆటలో భాగంగా.. శుక్రవారం బ్యాటింగ్ కొనసాగించిన భారత్-ఏ.. 95.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. దీంతో ఫలితం తేలకుండానే ఈ మ్యాచ్ కూడా ముగిసిపోయింది. అక్షర్ ధనాధన్ హాఫ్ సెంచరీ ఇక భారత్ ఇన్నింగ్స్లో హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ 169 బంతులు ఎదుర్కొని 50 పరుగులు సాధించగా.. అక్షర్ పటేల్ 61 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసి అజేయంగా నిలిచాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ 69 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. టాపార్డర్లో ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 18, సాయి సుదర్శన్ 30, వన్డౌన్లో దిగిన రజత్ పాటిదార్ 33 పరుగులు సాధించారు. మిగతా వాళ్లలో సర్ఫరాజ్ ఖాన్ 34, వాషింగ్టన్ సుందర్(9- నాటౌట్) రన్స్ చేశారు. రోహిత్ సేనతో చేరిన భరత్ కాగా ఆంధ్ర క్రికెటర్, టీమిండియా వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ సారథ్యంలో భారత్-ఏ జట్టు సౌతాఫ్రికాకు వెళ్లింది. అతడి కెప్టెన్సీలో తొలి టెస్టు డ్రా చేసుకుంది. అయితే, భరత్ టీమిండియాతో చేరే క్రమంలో ‘ఏ’ జట్టుకు దూరం కాగా.. అభిమన్యు ఈశ్వరన్ అతడి స్థానంలో రెండో టెస్టులో జట్టును ముందుండి నడిపించాడు. ఇక అనధికారిక టెస్టుల్లో మ్యాచ్లు నాలుగు రోజుల పాటే సాగుతాయన్న విషయం తెలిసిందే. -
జడ్డూ వైస్ కెప్టెన్ అయితే ఏంటి? సెలక్టర్లు ఒక్కసారి వద్దనుకుంటే..
South Africa vs India, 3rd T20I: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా భవితవ్యం గురించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అక్షర్ పటేల్ రూపంలో జడ్డూకు ప్రమాదం పొంచి ఉందన్నాడు. టీ20 జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలంటే జడ్డూ బ్యాట్ ఝులిపించాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. లేనిపక్షంలో ఏ క్షణమైనా సెలక్టర్లు జడేజాపై వేటు వేయడానికి వెనుకాడరని పేర్కొన్నాడు. ముఖ్యంగా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో వైస్ కెప్టెన్ అన్న ట్యాగ్ అతడిని కాపాడుతుందనుకుంటే పొరబడ్డేనని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. సమం చేసి పరువు నిలుపుకోవాలని కాగా సౌతాఫ్రికా పర్యటనలో భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తుండగా.. రవీంద్ర జడేజా అతడికి డిప్యూటీగా వ్యవహరిస్తున్నాడు. ఇక మూడు మ్యాచ్ల సిరీస్లో మొదటిది వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో టీమిండియా ఓటమిపాలైంది. ఈ క్రమంలో సిరీస్ సమం చేసి పరువు కాపాడుకోవాలని పట్టుదలగా ఉన్న భారత్.. మూడో టీ20లో పలు మార్పులతో బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. అక్షర్ పటేల్ రూపంలో జడ్డూకు పోటీ ‘‘రింకూ సింగ్ మరోసారి మంచి స్కోరు సాధించాలని కోరుకుంటున్నా. జితేశ్ శర్మతో పాటు రవీంద్ర జడేజా కూడా తమ వంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జడ్డూ ఇంకాస్త మెరుగ్గా ఆడాలి. ఎందుకంటే పొట్టి ఫార్మాట్లో అక్షర్ పటేల్ రూపంలో అతడికి గట్టి పోటీ ఉంది. కేవలం వైస్ కెప్టెన్ అయినంత మాత్రాన జడ్డూ తుదిజట్టులో ఉంటాడన్న నమ్మకం లేదు. నిజానికి ఇటీవలి కాలంలో టీమిండియా వైస్ కెప్టెన్ పదవికి పెద్దగా విలువేమీ ఉండటం లేదు. అప్పుడు అజింక్య రహానే.. మొన్న అయ్యర్ ఆస్ట్రేలియాతో సిరీస్లో శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. అంతకు ముందు టెస్టుల్లో అజింక్య రహానే కూడా టెస్టు జట్టు సారథికి డిప్యూటీగా వ్యవహరించాడు. ఈ మధ్య సెలక్టర్లు ఆటగాళ్లపై వేటు వేయడానికి ముందూ వెనుకా ఆలోచించడం లేదు. అది వైస్ కెప్టెన్ అయినా.. ఇంకెవరైనా సరే! ఇలా ఎందుకు చేస్తున్నారో నాకైతే అంతుపట్టడం లేదు’’ అంటూ గురువారం నాటి మూడో టీ20 ఆరంభం నేపథ్యంలో ఆకాశ్ చోప్రా ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే రెండో టీ20లో రింకూ సింగ్ 68 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ సూర్య 56 పరుగులు సాధించాడు. రవీంద్ర జడేజా 14 బంతుల్లో 19 పరుగులు చేశాడు. జితేశ్ శర్మ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇక సౌతాఫ్రికా- టీమిండియా మధ్య సిరీస్ విజేతను తేల్చే మూడో టీ20కి జొహన్నస్బర్గ్ వేదిక. చదవండి: #AusVsPak: పాక్ బౌలర్లకు చుక్కలు.. టెస్టులో వార్నర్ టీ20 ఇన్నింగ్స్! ఆ తప్పిదం వల్ల నో వికెట్! -
అదొక్కటే కలిసి రాలేదు.. అతడిని ఒత్తిడిలోకి నెట్టడం ఇష్టం: సూర్య
టీమిండియా టీ20 కెప్టెన్గా వ్యవహరించిన తొలి సిరీస్లోనే సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో అటు బ్యాటర్గా.. ఇటు సారథిగా తన పాత్రను సమర్థవంతంగా పోషించి.. భారత జట్టుకు ట్రోఫీని అందించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సహా కీలక ఆటగాళ్లు ఎవరూ లేకుండానే యువ జట్టుతో ఆసీస్పై పైచేయి సాధించగలిగాడు. కాగా ఆస్ట్రేలియాతో నాలుగో టీ20లో గెలుపొందడం ద్వారా టీమిండియా ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. రాయ్పూర్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో 20 పరుగుల తేడాతో విజయం సాధించి 3-1తో సత్తా చాటింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు సాధించింది. రింకూ సింగ్ 29 బంతుల్లో 46 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ 19 బంతుల్లోనే 35 పరుగులతో రాణించాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాను టీమిండియా స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవి బిష్ణోయి దెబ్బకొట్టారు. అక్షర్ అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. రవి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు చాలా రోజుల తర్వాత భారత జట్టులో పునరాగమనం చేసిన పేసర్ దీపక్ చహర్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్ కూడా ఒక వికెట్ తీయగలిగాడు. ఈ క్రమంలో.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన మాథ్యూ వేడ్ బృందం 154 పరుగులకే ఆట ముగించి.. భారత్కు సిరీస్ను సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో సిరీస్ విజయంపై టీమిండియా తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈరోజు టాస్ తప్ప అన్నీ మాకు అనుకూలంగా జరిగాయి. మా కుర్రాళ్లు పట్టుదలగా నిలబడి మ్యాచ్ గెలిపించారు. వాళ్లు ఇలా బాధ్యతగా ఆడటమే మాకు అన్నిటికన్నా ముఖ్యం. మ్యాచ్కు ముందే మేమంతా సమావేశమైన సమయంలో.. ‘మిమ్మల్ని మీరు నిరూపించుకునే అద్భుత అవకాశం. ప్రతి ఒక్కరు భయం లేకుండా ఆడాలి’ అని చెప్పాం. నిజానికి అక్షర్ పటేల్ను ఒత్తిడిలోకి నెట్టడం నాకెంతో ఇష్టం. ఎందుకంటే.. ఎంత ప్రెజర్ పెడితే అతడు అంత గొప్ప స్పెల్స్ వేస్తాడు. ఇక డెత్ ఓవర్లలో యార్కర్లు వేయాలని ముందుగానే నిర్ణయించుకున్నాం’’ ప్రణాళికను సరిగ్గానే అమలు చేశాం’’ అని సూర్య పేర్కొన్నాడు. కాగా ఆసీస్తో మ్యాచ్లో 4 ఓవర్ల బౌలింగ్లో 16 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మిగిలిన నామమాత్రపు మ్యాచ్ ఆదివారం బెంగళూరులో జరుగనుంది. చదవండి: టీమిండియా హెడ్కోచ్ అయితేనేం! కుమారుల కోసం అలా.. The moment #TeamIndia recorded their third win of the series 👌 Celebrations and smiles all around in Raipur 😃#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/BxRiBbSzCz — BCCI (@BCCI) December 1, 2023 -
Rishabh Pant, Axar Patel: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిషబ్ పంత్, అక్షర్ పటేల్ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిషబ్ పంత్, అక్షర్ పటేల్
టీమిండియా క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్ ఇవాళ (నవంబర్ 3) ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో వీరు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానంతరం ఆలయం వెలుపలికి వచ్చిన పంత్, అక్షర్లతో ఫొటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు. టీటీడీ సిబ్బంది సైతం ఈ ఇద్దరితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. Pant & Axar visited Lord Balaji Temple at Andhra Pradesh.pic.twitter.com/VzYQVgRiD9 — Johns. (@CricCrazyJohns) November 3, 2023 కాగా, గాయాల కారణంగా పంత్, అక్షర్లు ప్రస్తుతం టీమిండియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. గతేడాది చివర్లో కార్ యాక్సిడెంట్కు గురైన పంత్ పూర్తిగా కోలుకునే క్రమంలో ఉండగా.. అక్షర్ ఇటీవలే వరల్డ్కప్కు ఎంపికయ్యాక గాయపడ్డాడు. అక్షర్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాకు ఎంపికయ్యాడు. ఇదిలా ఉంటే, 2023 వన్డే ప్రపంచకప్లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ ఎడిషన్లో భారత్ ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఏడింట విజయాలు సాధించి సెమీస్కు అర్హత సాధించింది. నిన్ననే శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ రికార్డు స్థాయిలో 302 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ ఎడిషన్లో భారత్ లీగ్ దశలో ఇంకా రెండు మ్యాచ్లు (సౌతాఫ్రికా, నెదర్లాండ్స్) ఆడాల్సి ఉంది. -
వరల్డ్కప్కు మిస్సయ్యాడు.. కానీ అక్కడ మాత్రం విధ్వంసం! కేవలం 27 బంతుల్లోనే
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా వన్డే ప్రపంచకప్-2023కు దూరమైన సంగతి తెలిసిందే. తొలుత ప్రకటించిన ప్రిలిమనరీ జట్టులో సభ్యునిగా ఉన్న అక్షర్.. టోర్నీ ఆరంభ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కలేదు. వరల్డ్కప్కు దూరమైన అక్షర్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ప్రస్తుతం జరగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గుజరాత్ జట్టు తరుపున అక్షర్ ఆడుతున్నాడు. ఈ టోర్నీలో భాగంగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అక్షర్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 27 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 52 పరగులు చేశాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 234 పరుగుల భారీ లక్ష్య చేధనలో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 197 పరుగులు మాత్రమే చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ(112) సెంచరీతో చెలరేగాడు. చదవండి: World Cup 2023: ఇంగ్లండ్తో మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్! -
అక్షర్ పటేల్ సంచలన పోస్టులు.. వరల్డ్కప్ నుంచి కావాలనే తప్పించారా!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ వరల్డ్కప్ 2023కు ఆఖరి నిమిషంలో దూరమైన సంగతి తెలిసిందే. గాయం కారణంగా అక్షర్ ఈ మెగా టోర్నీకి అందుబాటులో లేడని బీసీసీఐ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అదే విధంగా అతడి స్ధానంలో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే వన్డే వరల్డ్ కప్ నుంచి తనను తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై అక్షర్ పటేల్ అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అతడి ఇన్స్టాగ్రామ్ స్టోరీలు ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. " కామర్స్ కు బదులుగా సైన్స్ సబ్జెక్స్ తీసుకుని ఉండాల్సి ఉంది. మంచి పీఆర్ ను నియమించుకోవాల్సిందని" తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అక్షర్ రాసుకొచ్చాడు. అదే విధంగా మరో స్టోరీలో ఓ అస్తి పంజరం కత్తెరతో గుండెను కోసేస్తున్నట్లు ఉన్న ఎనిమిషేన్ ఫోటోను అక్షర్ షేర్ చేశాడు. అయితే వెంటనే తన చేసిన పోస్టులను అక్షర్ డిలీట్ చేశాడు. కానీ నెటిజన్లు అప్పటికే స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా అతడి పోస్టులను చూస్తే.. గాయం చిన్నదే అయినప్పటికీ కావాలనే తనను పక్కన పెట్టినట్లు అక్షర్ ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. "అక్షర్ ఇటువంటి పోస్టులు ఏమీ చేయలేదని, అవన్నీ ఫేక్ స్క్రీన్ షాట్లు" అని మరి కొంత మంది సోషల్ మీడియాలో కామెట్లు చేస్తున్నారు. ఇక ఈ విషయంపై అక్షర్ పటేల్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. -
భారత వరల్డ్కప్ జట్టులో కీలక మార్పు
భారత వరల్డ్కప్ జట్టులో అందరూ ఊహించినట్లుగానే కీలక మార్పు జరిగింది. తొలుత ప్రకటించిన ప్రొవిజనల్ జట్టులోని సభ్యుడు అక్షర్ పటేల్ ఆసియా కప్-2023 సందర్భంగా గాయం బారిన పడి, పూర్తిగా కోలుకోలేని కారణంగా వరల్డ్కప్ జట్టు నుంచి తప్పించబడ్డాడు. అక్షర్ స్థానంలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వరల్డ్ కప్ జట్టులోకి వచ్చాడు. ఈ ఒక్క మార్పు మినహా, ముందుగా ప్రకటించిన జట్టే యధాథంగా కొనసాగించబడింది. జట్టులో మార్పులు చేర్పులకు ఇవాళే (సెప్టెంబర్ 28) ఆఖరి తేదీ కావడంతో భారత సెలక్టర్లు హుటాహుటిన మార్పు విషయాన్ని అనౌన్స్ చేశారు. కాగా, ప్రపంచకప్ కోసం తొలుత ప్రకటించిన భారత జట్టులో అశ్విన్కు చోటు దక్కని విషయం తెలిసిందే. అయితే తదనంతరం జరిగిన పరిణామాల్లో వరల్డ్కప్ జట్టుకు ఎంపికైన అక్షర్ పటేల్ గాయపడటం.. ఆసీస్తో సిరీస్కు అశ్విన్ భారత జట్టులోకి రావడంతో.. వచ్చీ రావడంతోనే చెలరేగిపోవడం (2 మ్యాచ్ల్లో 5 వికెట్లు).. గాయం నుంచి పూర్తిగా కోలుకోని అక్షర్కు అశ్విన్ ప్రత్యామ్నాయంగా మారడం వంటివి చకాచకా జరిగిపోయాయి. ఇదిలా ఉంటే, అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకాబోయే వరల్డ్కప్లో భారత్ తమ తొలి మ్యాచ్ను అక్టోబర్ 8న ఆడనుంది. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్లో టీమిండియా.. ఆసీస్తో తలపడుతుంది. ఆతర్వాత అక్టోబర్ 14న భారత్.. తమ చిరకాల ప్రత్యర్థి పాక్ను ఢీకొంటుంది. ఈ రెండు మ్యాచ్లకు ముందు భారత్ రెండు వార్మప్ మ్యాచ్లు ఆడుతుంది. సెప్టెంబర్ 30న ఇంగ్లండ్తో.. అక్టోబర్ 3న నెదర్లాండ్స్తో రోహిత్ సేన తలపడుతుంది. వరల్డ్కప్కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ -
ఇంగ్లండ్తో వార్మప్ గేమ్.. టీమిండియాతో అశ్విన్.. వరల్డ్కప్ జట్టులోకి వచ్చినట్లేనా..?
భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రపంచకప్ జట్టులోకి రావడంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 30న గౌహతిలో ఇంగ్లండ్తో జరిగే వార్మప్ మ్యాచ్లో ఆశ్విన్ ఆడటం ఖాయమైపోయిందని సమాచారం. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ఇవాళ (సెప్టెంబర్ 28) గౌహతికి చేరగా అశ్విన్ జట్టుతో పాటు కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి అశ్విన్ వరల్డ్కప్ జట్టులోకి రావడం ఖాయమైపోయిందని అభిమానులు అనుకుంటున్నారు. Exclusive visuals: Team India arrives in Guwahati for first warm up match against England. Ravichandran Ashwin travels with the squad, no Axar Patel. @ThumsUpOfficial @cricketworldcup @CricSubhayan @debasissen pic.twitter.com/nkNQppcXjO — RevSportz (@RevSportz) September 28, 2023 కాగా, ప్రపంచకప్ కోసం తొలుత ప్రకటించిన భారత జట్టులో అశ్విన్కు చోటు దక్కని విషయం తెలిసిందే. అయితే తదనంతరం జరిగిన పరిణామాల్లో వరల్డ్కప్ జట్టుకు ఎంపికైన అక్షర్ పటేల్ గాయపడటం.. ఆసీస్తో సిరీస్కు అశ్విన్ భారత జట్టులోకి రావడంతో.. వచ్చీ రావడంతోనే చెలరేగిపోవడం.. గాయం నుంచి పూర్తిగా కోలుకోని అక్షర్కు అశ్విన్ ప్రత్యామ్నాయంగా మారడం వంటివి చకాచకా జరిగిపోయాయి. Virat Kohli And #TeamIndia Arrived In Guwahati For The 1st Warm Up Game Against England ahead of World Cup 2023.🇮🇳💙#ViratKohli #CWC2023 @imVkohli pic.twitter.com/LdHrWWucv0— virat_kohli_18_club (@KohliSensation) September 28, 2023 తాజాగా ఇంగ్లండ్తో వార్మప్ మ్యాచ్కు అక్షర్ జట్టుతో కనిపించకపోవడం.. అశ్విన్ జట్టుతో పాటు ప్రయాణించడం చూస్తుంటే ప్రపంచకప్ జట్టుకు అశ్విన్ ఎంపిక లాంఛనమేనని తెలుస్తుంది. మరి సెలెక్టర్లు అశ్విన్ను అక్షర్కు ప్రత్యామ్నాయంగా ఎంపిక చేస్తారో లేక యాష్ను జట్టుతో పాటు అదనపు సభ్యుడిగా కొనసాగిస్తారో వేచి చూడాలి. తొలుత అక్షర్ వార్మప్ మ్యాచ్ల సమయానికంతా గాయం నుంచి కోలుకుంటాడని బీసీసీఐ పెద్దలు చెప్పుకొచ్చారు. అయితే అక్షర్ గాయం విషయంలో ఆశించిన పురోగమనం లేకపోవడంతో అతని ప్రత్యామ్నాయంగా అశ్విన్ను జట్టులోకి ఎంపిక చేసినట్లు తేటతెల్లమవుతుంది. వరల్డ్కప్ జట్టులో మార్పులు చేర్పులకు ఇవాళే (సెప్టెంబర్ 28) ఆఖరి తేదీ కావడంతో మరికాసేపట్లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకాబోయే వరల్డ్కప్లో భారత్ తమ తొలి మ్యాచ్ను అక్టోబర్ 8న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్లో టీమిండియా.. ఆసీస్తో తలపడుతుంది. ఆతర్వాత అక్టోబర్ 14న భారత్.. తమ చిరకాల ప్రత్యర్థి పాక్ను ఢీకొంటుంది. ఈ రెండు మ్యాచ్లకు ముందు భారత్ రెండు వార్మప్ మ్యాచ్లు ఆడుతుంది. సెప్టెంబర్ 30న ఇంగ్లండ్తో.. అక్టోబర్ 3న నెదర్లాండ్స్తో రోహిత్ సేన తలపడుతుంది. భారత వరల్డ్కప్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ -
ICC WC 2023: అక్షర్ పటేల్ అవుట్.. ప్రపంచకప్ జట్టులో అశ్విన్!
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవి చంద్రన్ వన్డే వరల్డ్కప్-2023లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయపడటంతో అతడికి మార్గం సుగమమయ్యే ఛాన్స్ ఉంది. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇందుకు సంబంధించి సంకేతాలు ఇచ్చాడు. కాగా ఆసియా వన్డే కప్-2023లో బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన అక్షర్ పటేల్ ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు అతడు దూరమయ్యాడు. తొలి రెండు మ్యాచ్లు ఆడలేకపోయినప్పటికీ.. రాజ్కోట్ వన్డేకు అందుబాటులోకి వస్తాడనుకుంటే గాయం తీవ్రత దృష్ట్యా కుదరడం లేదని సమాచారం. ఇక వన్డే వరల్డ్కప్ టోర్నీకి మరో ఎనిమిది రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అక్షర్ గనుక కోలుకోకపోతే అశ్విన్ ప్రపంచకప్ జట్టులో ఎంట్రీ ఇవ్వడం ఖాయమే! సుదీర్ఘ కాలం తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్తో పునరాగమనం చేసిన అశ్విన్.. రెండు మ్యాచ్లలో కలిపి 4 వికెట్లు తీశాడు. వన్డేల్లోనూ సత్తా చాటగలనని నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్తో నామమాత్రపు మూడో వన్డేకు ముందు మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మకు అశూ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులుగా.. ‘‘అతడు క్లాస్ బౌలర్. ఒత్తిడిని అధిగమించి ఎలా ఆడాలో తెలిసిన అనుభవజ్ఞుడు. గతేడాది కాలంగా వన్డేలు ఆడనప్పటికీ గత రెండు మ్యాచ్లతో తన బౌలింగ్ స్థాయి ఏమిటో చాటిచెప్పాడు. అతడి బౌలింగ్లో వైవిధ్యం ఉంటుంది. వన్డే వరల్డ్కప్నకు ముందు మాకు అన్నీ సానుకూలాంశాలే కనిపిస్తున్నాయి. మా బ్యాకప్ ప్లేయర్లందరూ సంసిద్ధంగా ఉండటం సంతోషంగా ఉంది’’ అని రోహిత్ సమాధానమిచ్చాడు. కాగా సెప్టెంబరు 28 వరకు ప్రపంచకప్ జట్టులో మార్పులకు అవకాశం ఉన్న నేపథ్యంలో రోహిత్ మాటల్ని బట్టి అశ్విన్ ప్రపంచకప్ ఆడే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. అక్షర్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న విషయం తెలిసిందే. ఇక అక్టోబరు 5 నుంచి ఐసీసీ టోర్నీ ఆరంభం కానుండగా.. 8న ఆస్ట్రేలియాతో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
IND VS AUS 3rd ODI: టీమిండియాకు భారీ షాక్
ఈనెల 27న రాజ్కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగనున్న నామమాత్రపు చివరి వన్డేకు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్ అందింది. ఆసియా కప్-2023 సందర్భంగా గాయపడి, ఆసీస్తో జరిగిన తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్.. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేక ఆసీస్తో జరిగే మూడో వన్డేకు కూడా దూరమయ్యాడు. ఈ విషయాన్ని ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్బజ్ ప్రకటించింది. ప్రస్తుతం ఎన్సీఏలోని రిహాబ్లో ఉన్న అక్షర్ గాయం నుంచి కోలుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాడు. భారత సెలక్టర్లు ఆసీస్తో మూడో వన్డేకు అక్షర్కు ప్రత్యామ్నాయ ఆటగాడిని కూడా ప్రకటించలేదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్షర్ వరల్డ్కప్కు కూడా దూరమయ్యే ప్రమాదముందని తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. అక్షర్ వరల్డ్కప్ సన్నాహక మ్యాచ్ల సమయానికంతా కోలుకుంటాడని చెబుతున్నాయి. మరోవైపు వరల్డ్కప్లో అక్షర్కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసీస్తో సిరీస్లో జోరును ప్రదర్శిస్తూ సెలెక్టర్లకు సవాలు విసిరాడు. యాష్ ఆసీస్తో తొలి రెండు వన్డేల్లో 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో వరల్డ్కప్లో స్పిన్ ఆల్రౌండర్గా ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంపై సెలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ వరల్డ్కప్ సమయానికి అక్షర్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తే.. అక్షర్, అశ్విన్లలో ఎవరిని ఎంపిక చేస్తారో వేచి చూడాలి. వీరిద్దరిలోనే ఎవరిని ఎంపిక చేయాలో అర్ధం కాక సెలెక్టర్లు సతమతమవుతుంటే, వాషింగ్టన్ సుందర్ నేను కూడా లైన్లో ఉన్నానంటూ సవాలు విసురుతున్నాడు. మరి ఉన్న ఒక్క స్పిన్ ఆల్రౌండర్ పోజిషన్ కోసం ఎవరిని ఎంపిక చేస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. కాగా, వరల్డ్కప్లో పాల్గొనబోయే 15 మంది సభ్యుల బృంధాన్ని అన్ని జట్లు సెప్టెంబర్ 28వ తేదీలోపు ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉంటే, ఆసీస్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో మరో మ్యాచ్ ఉండగానే టీమిండియా 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్.. నిన్న జరిగిన రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
ఆసియా కప్ ఫైనల్లో అశూ ఆడాల్సింది.. అతడికి వీలు కాలేదనే సుందర్కు ఛాన్స్
India vs Australia, 1st ODI: ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో వాషింగ్టన్ సుందర్ను కాదని.. రవిచంద్రన్ అశ్విన్కు చోటు ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆసియా కప్-2023 ఫైనల్లో మైదానంలో దిగిన వాషీకి ఆసీస్తో తుదిజట్టులో చోటు దక్కుతుందని అంతా అనుకున్నారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత జట్టులోకి అశూ రీఎంట్రీ ఇస్తున్న తరుణంలో సుందర్ వైపే మొగ్గుచూపుతారని హర్భజన్ సింగ్ వంటి మాజీలు కూడా అభిప్రాయపడ్డారు. ఆసియా కప్ ఫైనల్లో ఆడించారు కాబట్టి తొలి వన్డేలో అతడికి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. అక్షర్ పటేల్ గాయం కారణంగా ఆశల పల్లకిలో కాగా అక్షర్ పటేల్ గాయం కారణంగా చెన్నై ఆఫ్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ వరల్డ్కప్-2023 ఆశలు సజీవంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసీస్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో రాణిస్తే ఐసీసీ ఈవెంట్లో అడుగుపెట్టే అవకాశం ముంగిట నిలిచారు. ఈ నేపథ్యంలో మొహాలీ వేదికగా శుక్రవారం మొదలైన తొలి మ్యాచ్లో అశూకు చోటు దక్కగా.. వాషీకి మొండిచేయి ఎదురైంది. దీంతో మేనేజ్మెంట్ తీరుపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. వాషీని పరిగణనలోకి తీసుకోనపుడు ఎందుకు శ్రీలంకకు పంపించారని ప్రశ్నిస్తున్నారు. ఆసియా కప్ ఫైనల్కు ఫస్ట్ ఛాయిస్ అశూనే ఈ క్రమంలో.. దినేశ్ కార్తిక్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అక్షర్ పటేల్ స్థానంలో ఆసియా కప్-2023 శ్రీలంకతో ఫైనల్కు తొలి ఛాయిస్ అశ్వినే అని పేర్కొన్నాడు. అశూ కుదరదన్నాడు కాబట్టే వాషీని ఫ్లైట్ ఎక్కించారని తనకు తెలిసిందన్నాడు. ఈ మేరకు క్రిక్బజ్ షోలో డీకే మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసిన అంతర్గత సమాచారం ప్రకారం.. ఈ విషయంలో రోహిత్, అజిత్, రాహుల్ ద్రవిడ్లను నేను సమర్థిస్తాను. ఆసియా కప్ ఫైనల్కు ముందుగా వాళ్లు అశ్విన్కే పిలుపునిచ్చారు. ఆ తర్వాతే అశూను ఎంపిక చేశారు అయితే, తాను మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా లేనని అశ్విన్ చెప్పాడు. అంతేకాదు.. తనకు బదులు లోకల్ మ్యాచ్లు ఆడి రిథమ్లో ఉన్న వాషింగ్టన్ సుందర్ను పంపిస్తే బాగుంటుందని సూచించాడు. దీంతో ఎన్సీఏలోనే ఉన్న సుందర్ను శ్రీలంకకు పంపించారు. ఆ తర్వాత అశ్విన్ రెండు క్లబ్ మ్యాచ్లు ఆడాడు. ఆ తర్వాతే ఆసీస్తో సిరీస్కు అతడిని ఎంపిక చేశారు. అసలు విషయం ఇదే. వాళ్ల మొదటి ప్రాధాన్యం అశ్విన్కే. వాషింగ్టన్ ఈ విషయంలో కాస్త నిరాశకు గురికావొచ్చు. అయితే, వాళ్లు మాత్రం అశ్విన్ వైపే మొగ్గుచూపారు’’ అని చెప్పుకొచ్చాడు. వరల్డ్కప్ జట్టులోనూ.. కాగా గత ఆరేళ్ల వ్యవధిలో అశ్విన్ రెండే రెండు వన్డేలు ఆడిన విషయం తెలిసిందే. ఇక అక్షర్ గనుక కోలుకోకపోతే అక్టోబరు 5 నుంచి మొదలయ్యే వన్డే వరల్డ్కప్ టోర్నీలో ఈ 2011 ప్రపంచకప్ విజేతకు చోటు ఖాయమే అనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఆసీస్తో తొలి వన్డేలో అశూ ఒక వికెట్ తీశాడు. మార్నస్ లబుషేన్ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: అవును.. నాకు ధోనితో విభేదాలున్నాయి.. కానీ! గంభీర్కు స్ట్రాంగ్ కౌంటర్? WC: అలాంటి వాళ్లకు నో ఛాన్స్! అందుకే అతడిని ఎంపిక చేయలేదు: చీఫ్ సెలక్టర్ -
ప్రపంచకప్ జట్టులో అశ్విన్..!
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు ప్రపంచకప్-2023 జట్టుకు ఎంపికయ్యేందుకు ఇంకా దారులు మూసుకుపోలేదు. అతనితో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు వరల్డ్కప్కు ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విషయంపై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆసియా కప్ -2023 ముగిసిన అనంతరం క్లూ ఇచ్చాడు. ముందుగా ప్రకటించిన ప్రొవిజనల్ జట్టులోని సభ్యుడు, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఆసియా కప్లో బంగ్లాదేశ్తో జరిగిన సూపర్-4 మ్యాచ్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. అక్షర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ హుటాహుటిన జట్టులో చేరి ఆసియా కప్ ఫైనల్ ఆడాడు. అక్షర్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను వరల్డ్కప్ ఫస్ట్ హాఫ్ మ్యాచ్లకు దూరమవుతాడని తెలుస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే అక్షర్ స్థానాన్ని వాషింగ్టన్ సుందర్ లేదా అశ్విన్లలో ఎవరో ఒకరితో భర్తీ చేసే అవకాశం ఉంది. సుందర్తో పోలిస్తే అశ్విన్ అనుభవజ్ఞుడు కావడంతో అతనికే అవకాశాలు ఉంటాయి. మరోవైపు అక్షర్ త్వరలో ఆస్ట్రేలియాతో జరుగనున్న వన్డే సిరీస్కు కూడా అందుబాటులో ఉండడని సమాచారం. భారత సెలెక్టర్లు ఒకవేళ అశ్విన్ను ప్రపంచకప్ జట్టులో చేర్చుకోవాలని భావిస్తే, ఆసీస్ సిరీస్ కోసం ఇవాళ ప్రకటించే భారత జట్టులో అతని చోటు ఇస్తారు. కాగా, ముందుగా ప్రకటించిన భారత ప్రొవిజనల్ వరల్డ్కప్ స్క్వాడ్లో స్పిన్ బౌలర్లుగా అక్షర్ పటేల్తో పాటు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లను ప్రకటించిన విషయం తెలిసిందే. చివరి నిమిషంలో ఈ ప్రొవిజనల్ జట్టులో మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు. ఎవరైనా ఆటగాడు గాయం బారిన పడితే, అతని స్థానాన్ని ఇంకొకరితో భర్తీ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఆసీస్తో ఈ నెల 22, 24, 27 తేదీల్లో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం భారత జట్టును ఇవాళ ప్రకటిస్తారు. ఈ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు దాదాపుగా ప్రపంచకప్ జట్టులో ఉంటారు. ఆసియా కప్ సందర్భంగా గాయపడిన అక్షర్ స్థానంలో సెలెక్టర్లు ఎవరిని తీసుకుంటారోనన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్ ముగిశాక అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్తో టీమిండియా వరల్డ్కప్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 14న భారత్.. చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ను ఢీకొంటుంది. -
టీమిండియాకు షాక్.. ఫైనల్కు ఆల్రౌండర్ దూరం! లంకకు యువ క్రికెటర్..
Asia Cup 2023 Final: ఆసియా కప్-2023 ఫైనల్కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది. యువ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్తో ఈ స్పిన్ ఆల్రౌండర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించినట్లు సమాచారం. లంకకు బయల్దేరిన యువ క్రికెటర్ ఈ క్రమంలో చెన్నై ఆటగాడు సుందర్ ఇప్పటికే శ్రీలంకు బయల్దేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘అక్షర్ను గాయాలు వేధిస్తున్నాయి. చిటికిన వేలికి గాయమైంది. ముంజేయికి కూడా దెబ్బతగిలింది. వాషీని ఎయిర్పోర్టులో చూశానన్న డీకే అంతేకాదు.. తొడ కండరాలు పట్టేశాయి కూడా. అందుకే వాషింగ్టన్ను శ్రీలంకకు పిలిపిస్తున్నారు’’ అని పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే.. టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ సైతం సుందర్ ప్రయాణం గురించి హింట్ ఇచ్చాడు. ‘‘ఎయిర్పోర్టులో అనుకోకుండా.. నాకు వాషింగ్టన్ సుందర్ తారసపడ్డాడు. అతడికి ఎక్కడికి వెళ్తున్నాడో గెస్ చేయండి’’ అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్తో మ్యాచ్ తర్వాత విలేకరులతో మాట్లాడిన టీమిండియా ఓపెనర్ శుబ్మన్ గిల్.. అక్షర్ గాయాలు అంత తీవ్రమైనవి కావని పేర్కొనడం గమనార్హం. బంగ్లాదేశ్తో మ్యాచ్లో అక్షర్ పోరాటం కాగా ఆసియా కప్-2023 సూపర్-4లో ఆఖరి మ్యాచ్లో భారత జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్తో మ్యాచ్లో చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన శుక్రవారం నాటి మ్యాచ్లో అక్షర్ పటేల్ 34 బంతుల్లో 42 పరుగులతో రాణించాడు. అంతకుముందు బంగ్లా ఇన్నింగ్స్లో 9 ఓవర్ల బౌలింగ్లో 47 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే.. గాయాల తీవ్రత ఎక్కువైతే మాత్రం వన్డే వరల్డ్కప్-2023కి కూడా అక్షర్ పటేల్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. వన్డేల్లో సుందర్ గణాంకాలు ఇక యువ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 16 వన్డేలు ఆడాడు. 16 వికెట్లు తీయడంతో పాటు 233 పరుగులు సాధించాడు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్తో చివరిగా వన్డే ఆడాడు. కాగా ఆదివారం (సెప్టెంబరు 17) టీమిండియా- శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. చదవండి: అతడిని కాదని నీకు ఛాన్స్.. ‘రాక రాక’ వచ్చిన అవకాశం! ఇకనైనా మారు.. -
అతడు అద్భుతం.. క్రెడిట్ వాళ్లకు ఇవ్వాల్సిందే.. మేం ఓడినా: రోహిత్ శర్మ
Asia Cup 2023- Ind Vs Ban: Rohit Sharma Comments On Loss: ‘‘భవిష్యత్తు మ్యాచ్లు.. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అందరు ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని భావించాం. అందుకే బంగ్లాదేశ్తో మ్యాచ్లో మార్పుల విషయంలో కాంప్రమైజ్ కాలేదు. వరల్డ్కప్ ఆడాల్సిన కొంతమంది ఆటగాళ్లను పరీక్షించేందుకు జట్టులోకి తీసుకున్నాం. అక్షర్ పటేల్ అద్భుతం ఈరోజు అక్షర్ పటేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ దురదృష్టవశాత్తూ లక్ష్యం పూర్తి చేయలేకపోయాడు. అయితే, ఆఖరి వరకు అతడు పట్టుదలగా పోరాడిన తీరు అద్భుతం’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆల్రౌండర్ అక్షర్ పటేల్(34 బంతుల్లో 42 పరుగులు)ను ప్రశంసించాడు. బంగ్లాదేశ్ చేతిలో భంగపాటు అదే విధంగా.. బంగ్లాదేశ్ విజయంలో ఆ జట్టు బౌలర్లదే కీలక పాత్ర అన్న రోహిత్... వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందేనని పేర్కొన్నాడు. కాగా ఆసియా కప్-2023 ఫైనల్లో బెర్తు ఖరారు చేసుకున్న తర్వాత సూపర్-4లో బంగ్లాదేశ్తో జరిగిన నామమాత్రపు మ్యాచ్లో భారత జట్టు ఓటమిపాలైన విషయం తెలిసిందే. స్టార్లు లేకుండా బరిలోకి దిగి ప్రాధాన్యం లేని మ్యాచ్ కావడంతో ఏకంగా ఐదు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా అనూహ్య రీతిలో బంగ్లా చేతిలో ఓడి పరాభవం మూటగట్టుకుంది. విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్లతో పాటు మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ లాంటి కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చి.. షకీబ్ బృందం చేతిలో భంగపాటుకు గురైంది. అందుకే వాళ్లకు అవకాశాలు కాగా బంగ్లాతో మ్యాచ్లో హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ(5) వన్డే అరంగేట్రం చేయగా.. సూర్యకుమార్ యాదవ్(26) కూడా చోటు దక్కించుకున్నాడు. అదే విధంగా.. మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ కృష్ణ జట్టులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన కెప్టెన్ రోహిత్ శర్మ.. వన్డే వరల్డ్కప్-2023కు ముందు ఆటగాళ్ల సన్నద్ధతను పరీక్షించేందుకే ఈ మ్యాచ్లో వీరికి అవకాశం ఇచ్చినట్లు తెలిపాడు. రాజీపడేది లేదు ఆటలో గెలుపోటములు సహజమని.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం పట్ల పశ్చాత్తాపం లేదని పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్లో శతకం(121)తో ఆకట్టుకున్న శుబ్మన్ గిల్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘గిల్ అద్బుతం సెంచరీతో ఆకట్టుకున్నాడు. గిల్ ఫామ్లో ఉన్నాడు.. సెంచరీతో అతడి నుంచి మేము ఏం కోరుకుంటున్నామో అదే చేసి చూపించాడు. జట్టు కోసం ఏమేం చేయాలో అంతా చేశాడు. గతేడాది కాలంగా గిల్ మంచి ఫామ్లో ఉన్నాడు. కొత్త బంతితో బౌలర్లు అటాక్ చేసినపుడు కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. హార్డ్వర్క్తో ఎప్పటికప్పుడు తనని తాను నిరూపించుకుంటున్నాడు’’ అని రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. కాగా ఈ మ్యాచ్లో రోహిత్ డకౌట్ అయ్యాడు. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ స్కోర్లు: టాస్: టీమిండియా.. బౌలింగ్ బంగ్లా స్కోరు: 265/8 (50) టీమిండియా స్కోరు: 259 (49.5) విజేత: 6 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షకీబ్ అల్ హసన్(80 పరుగులు సహా.. 10 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి ఒక వికెట్). చదవండి: క్లాసెన్ మహోగ్రరూపం.. క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని విధ్వంసం Super11 Asia Cup 2023 | Super 4 | India vs Bangladesh | Highlightshttps://t.co/hEYw3GY8qd#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 15, 2023 -
బ్యాటింగ్ ఆధారంగా బౌలర్లను సెలక్ట్ చేస్తారా.. నిజమా?: మాజీ బ్యాటర్
India World Cup 2023 squad: ‘‘అక్షర్ పటేల్- యుజీ చహల్.. ఈ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలన్న విషయంలో కచ్చితంగా చర్చ జరిగి ఉంటుంది. టీమిండియాకు ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్ చేయగల ఆటగాడు కావాలి. సరే.. అలాగే అనుకుందాం.. ఈ ఆప్షన్ ఉంది కాబట్టి ఇలా చేశారు. కానీ.. నిజంగానే బ్యాటింగ్ చేయగల సమర్థత ఆధారంగానే బౌలర్లను సెలక్ట్ చేస్తారా?’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అసహనం వ్యక్తం చేశాడు. లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ను కాదని.. ఆల్రౌండర్ అన్న కారణంగా అక్షర్ పటేల్ను జట్టులోకి తీసుకోవడం ఎందుకో సబబుగా అనిపించడం లేదని పేర్కొన్నాడు. చహల్కు నో ఛాన్స్ కాగా భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి వన్డే ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి మంగళవారం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఆసియా వన్డే కప్-2023 టీమ్లో ఉన్న ప్రధాన ఆటగాళ్లందరికీ ఇందులో చోటు దక్కింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుత రికార్డు ఉన్న మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్కు మాత్రం ఈసారి కూడా సెలక్టర్లు మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించాడు. కేవలం బ్యాటింగ్ చేస్తారన్న కారణంగా బౌలర్లను జట్టులోకి తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నాడు. ఇద్దరూ తుదిజట్టులో ఉండరు కదా! అదే విధంగా.. ‘‘బ్యాటింగ్లో డెప్త్ కోసం నంబర్ 8లో ఆల్రౌండర్ను తీసుకుంటామని అంటున్నారు. నిజానికి.. జట్టులోని టాప్-6 బ్యాటర్లలో కొందరు విఫలమైనా జడేజా రూపంలో సూపర్ ఫామ్లో ఉన్న ఆటగాడు అందుబాటులో ఉన్నాడు. టాప్ బ్యాటర్లంతా బాధ్యతాయుతంగా ఆడితే ఎనిమిదో నంబర్ ఆటగాడి గురించి ఆందోళనే ఉండదు కదా! ఒకేరకమైన నైపుణ్యాలు కలిగిన జడేజా, అక్షర్ తుదిజట్టులో కలిసి ఆడతారా? అంటే అదీ లేదు. లెఫ్టాండర్ బ్యాటర్ ఉన్నపుడు లెఫ్టార్మ్ ఫింగర్ స్పిన్నర్ చేతికి కెప్టెన్ బంతిని ఇవ్వడు. కాబట్టి లెఫ్టార్మ్ స్పిన్నర్లతో మిడిల్ ఓవర్లలో 20 ఓవర్లు ఎలా వేయిస్తారు? ఇలా జరగడం సాధ్యమేనా? దీనిని బట్టి అక్షర్ను బెంచ్కే పరిమితం చేస్తారనడం స్పష్టంగా అర్థమవుతోంది కదా!’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అగార్కర్ రీజన్ ఇదీ కాగా చహల్ను ఎంపిక చేయకపోవడంపై మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం.. జడేజా, అక్షర్ ఎడంచేతి వాటం బ్యాటర్లకు సమర్థవంతంగా బౌలింగ్ చేయగలరు.. అదే విధంగా.. వీరిద్దరి బ్యాటింగ్ కూడా అవసరం కాబట్టే ఇద్దరినీ ఎంపిక చేశామని స్పష్టం చేశాడు. చదవండి: ప్రపంచకప్నకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. ఆ ముగ్గురు అవుట్! కెప్టెన్ సహా.. WC: అంతా బాగానే ఉంది.. కానీ అదొక్కటే లోటు! ఆ ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్.. -
అందుకే అక్షర్ను తీసుకున్నాం..ఆఫ్ స్పిన్నర్ అవసరం లేదు! మేము క్లియర్గానే ఉన్నాం!
India World Cup 2023 squad: ‘‘జట్టు కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఈ క్రమంలో కొందరికి నిరాశ కలగడం సహజం. సమతూకం కోసమే శార్దుల్, అక్షర్లను తీసుకున్నాం. గత కొన్నేళ్లుగా లోయర్ ఆర్డర్లో బలహీన బ్యాటింగ్తో సమస్య ఎదుర్కొన్నాం. 8వ, 9వ స్థానాల్లో ఆడేవారు కూడా కొన్ని పరుగులు చేయడం అవసరం. వారికి ఆ విషయం స్పష్టంగా చెప్పాం కూడా. పాకిస్తాన్తో మ్యాచ్లో హార్దిక్ ఆట చూస్తే అతను ఎంత కీలకమో అర్థమవుతుంది. ఫైనల్తో కలిపితే 11 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. టి20లతో పోలిస్తే వన్డేల్లో కోలుకునేందుకు, వ్యూహాలు రూపొందించుకునేందుకు తగినంత సమయం ఉంటుంది. అందుకే అక్షర్కు చోటు అన్ని రకాలుగా ఈ టీమ్ అత్యుత్తమం అని మేం భావిస్తున్నాం. టీమ్ ప్రకటించేందుకు ముందు ఎంతో చర్చించి, ఎంతో ఆలోచింతాం. ఎంపికతో ఎంతో సంతృప్తిగా ఉన్నాం’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. జట్టు సమతూకం కోసం ఆల్రౌండర్ల జాబితాలో అక్షర్ పటేల్ పేరును చేర్చినట్లు వెల్లడించాడు. కాగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి రోహిత్ మంగళవారం.. వన్డే వరల్డ్కప్-2023 జట్టును ప్రకటించాడు. నాడు రోహిత్ను కాదన్న ధోని ఈ సందర్భంగా టీమ్లో స్థానం దక్కదని వాళ్ల బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునన్న హిట్మ్యాన్.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు. కాగా 2011 వరల్డ్కప్ సమయంలో రోహిత్ శర్మ పేరును పరిగణనలోకి తీసుకోవాలని సెలక్టర్లు సూచించినప్పటికీ.. నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పీయూశ్ చావ్లా కోసం అతడిని పక్కన పెట్టాడని ఇటీవలే మాజీ సెలక్టర్ రాజా వెంకట్ పేర్కొన్న విషయం తెలిసిందే. అందుకే ఆఫ్ స్పిన్నర్ ఆలోచన విరమించుకున్నాం: అగార్కర్ జట్టులో ఇప్పుడు ఎవరికీ ఫిట్నెస్ సమస్యలు లేవు. అందరూ పూర్తిగా కోలుకున్నారు. ఎన్సీఏలో జరిగిన క్యాంప్లో రాహుల్ 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 50 ఓవర్లు కీపింగ్ కూడా చేశాడు. కాబట్టి అతని గురించి ఎలాంటి ఆందోళన లేదు. ఆఫ్స్పిన్నర్పై చర్చ జరిగింది. అయితే జడేజా, అక్షర్ ఎడంచేతి వాటం బ్యాటర్లకు సమర్థంగా బౌలింగ్ చేయగలరని నమ్ముతున్నాం. వీరిద్దరి బ్యాటింగ్ కూడా అవసరం కాబట్టి ఆఫ్స్పిన్నర్ ఆలోచనను పక్కన పెట్టాం’’ అని జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తమ ఎంపికలను సమర్థించుకున్నాడు. కాగా 2011 నాటి వరల్డ్కప్ జట్టులో ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లు హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. అదే విధంగా సచిన్ టెండుల్కర్, సురేశ్ రైనా రూపంలో మంచి ఆప్షన్లు ఉండేవి. ఇక 2019 నాటికి లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్, ఆఫ్ స్పిన్నర్ కేదార్ జాదవ్ జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే, ఈసారి మాత్రం ఉపఖండ పిచ్పై ఆఫ్ స్పిన్నర్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగనుండటంపై మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: అతడు ఉండగా అక్షర్ ఎందుకు? మ్యాచ్ విన్నర్కు చోటు లేకపోవడమేమిటి?: మాజీ క్రికెటర్
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
సింగరేణిని అమ్మేందుకు కాంగ్రెస్ కుట్ర
విషాదం నింపిన క్యాన్సర్
No Headline
అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
రూ.14.05లక్షలు పట్టివేత
రాజన్న సేవలో ఐజీ
పుంజుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు
జిల్లా ప్రజలను నిరాశపరచిన ప్రధాని మోదీ
వెండితెరపై పల్లెటూరు పిల్లాడు
విద్యుత్షాక్తో యువకుడి మృతి
తప్పక చదవండి
- ‘సంతోషం’.. కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్పై దీదీ
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
- అమిత్ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..
- టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement