-
రంజాన్ నెలలో 10 లక్షల బిర్యానీ ఆర్డర్లు లాగించేసిన హైదరాబాదీలు
బిర్యానీ.. ఈ పేరు వింటే చాలు నోటిలో నీళ్లు ఊరాల్సిందే. బిర్యానీ వాసనకే సగం కడుపు నిండిపోతుంది. ఎప్పుడు రెస్టారెంట్కు వెళ్లినా బిర్యానీ తినకుంటే మాత్రం భోజనం అసంపూర్తిగా అనిపిస్తుంటుంది. ఇక మన హైదరాబాద్ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ బిర్యానీ ఘుమఘుమలకు ఒక్క తెలుగు వారేంటి.. దేశవిదేశీయులు ఫిదా అవ్వాల్సిందే. అంతటి గొప్ప పేరును కలిగిన బిర్యానీని రంజాన్ మాసంలో హైదరాబాద్ వాసులు తెగ లాంగించారట.. ఈ ఒక్క నెలలోనే ఏకంగా పది లక్షలు(1 మిలియన్) బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. బిర్యానీ ఆర్డర్లలో దేశవ్యాప్తంగా హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచిందని పేర్కొంది. బిర్యానీతో పాటు హలీమ్ ఆర్డర్లలోనూ నగర వాసులు రికార్డు సృష్టించారని, నెల రోజుల వ్యవధిలో 5.3 లక్షల ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. ఈ ఏడాది రంజాన్ మాసం మార్చి 11న ప్రారంభమైన విషయం తెలిసిందే. నేటితో(శుక్రవారం) ముగిసింది. ఈ క్రమంలో తాజాగా దేశవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ ఆర్డర్ల గురించి వివరాలను స్విగ్గీ ప్రకటించింది. ఈ నెల రోజుల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 60 లక్షల పేట్ల బిర్యానీ ఆర్డర్లు డెలివరీ చేసినట్లు తెలిపింది. మిగతా నెలలతో పోలిస్తే రంజాన్ నెలలో బిర్యానీ ఆర్డర్లు 15 శాతం పెరిగాయని పేర్కొంది. రంజాన్ సందర్భంగా సాయంత్రం 5:30 నుంచి 7 గంటల మధ్య ఇఫ్తార్ ఆర్డర్లు 34% పెరిగినట్లు స్విగ్గీ వెల్లడించింది. ఇఫ్తార్ ఆర్డర్లలోలో చికెన్ బిర్యానీ, మటన్ హలీమ్, సమోసా, ఫలుదా, ఖీర్లు టాప్ ప్లేస్లో ఉన్నట్లు చెప్పింది. హలీమ్ ఆర్డర్లలో ఏకంగా 1454.88 శాతం పెరుగుదల నమోదైందని, దీని తర్వాతి స్థానంలో ఫిర్ని ఆర్డర్లలో 80.97 శాతం, మాల్పువా ఆర్డర్లు 79.09 శాతం, ఫలుదా 57,93 శాతం, డేట్స్ 48.40 శాతం ఆర్డర్లు పెరిగాయని పేర్కొంది. -
ఫ్రెండ్స్కు కమ్మని బిర్యానీ వండిన స్టార్ హీరో
ఒక్కొక్కరికీ ఒక్కో పిచ్చి.. అలా తమిళ స్టార్ హీరో అజిత్కు బైక్స్ అన్నా.. బైక్ మీద విహరించడం అన్నా ఎంతో ఇష్టం. సినిమాల నుంచి కాస్త బ్రేక్ దొరికినా చాలు.. బైక్ మీద తనకు నచ్చిన ప్రాంతాలు చుట్టేస్తుంటాడు. అంతేకాదు.. చాలాసార్లు ప్రొఫెషనల్ రేసింగ్లో పాల్గొని అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. తన సినిమాల్లో కూడా బైక్పై చేజింగ్ సీన్లు, యాక్షన్ సీన్లు కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అజిత్ విడాముయర్చి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్కు బ్రేక్ వచ్చింది. ఇంకేముంది తన ఫ్రెండ్స్తో కలిసి బైక్ రైడ్కు వెళ్లాడు. అక్కడ వారికోసం ప్రత్యేకంగా బిర్యానీ కూడా చేశాడు. స్నేహితులతో కలిసి ట్రిప్ను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సినిమాల విషయానికి వస్తే.. అజిత్ చేతిలో గుడ్ బ్యాడ్ అగ్లీ అని మరో సినిమా కూడా ఉంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇది వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. Multitalented SOUL. 😘😘😘 #Ajith sir #VidaaMuyarchi #GoodBadUgly pic.twitter.com/mLyqLM0Vjv — Ashok Surya (@AshokSuryaOff03) March 21, 2024 Ride with Venus. It is #Ajith sir’s GAME #VidaaMuyarchi 🔥🔥🔥 pic.twitter.com/1vved9bWVp — Ashok Surya (@AshokSuryaOff03) March 20, 2024 చదవండి: శృంగార చిత్రంతో ఆస్కార్ వరకు.. ఎవరో గుర్తుపట్టారా..? -
వైరల్: అవునండీ... ఇది బిర్యానీ టీ
వేడి వేడిగా బిర్యానీ తింటే ఎంత మజా? ఆ తరువాత వేడి వేడిగా టీ తాగుతుంటే ఎంత మజా! ఆ మజాను ఈ మజాను మిక్స్ చేసి ‘బిర్యానీ టీ’ తయారుచేసింది ‘మాస్టర్ చెఫ్ 4’ విజేత నేహాదీపక్షా. టీ ఆకులు, దాల్చిన చెక్క, సోంపు, నల్లమిరియాలు, యాల కులు... మొదలైన వాటితో నేహా తయారు చేసిన ఈ ‘బిర్యానీ టీ’ చవులూరిస్తూ నెట్టింట వైరల్ అవుతుంది. వీడియో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా నెటిజనులు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ‘ఆహో ఓహో!’ అని పొగడ్తల దండకం అందుకుంటే, మరి కొందరు ‘బిర్యానీ టీ అంటే ఏమిటో కాదు వేడి వేడి బిర్యానీని వేడి వేడి టీలో కలపడం’ అని జోక్ చేస్తున్నారు. ఐస్క్రీమ్ రోల్ మేకర్ కూలింగ్ పాన్ను ఉపయోగించి ఒక చెఫ్ తయారుచేసిన ‘స్క్రీమ్టీ’కూడా ఈమధ్య నెట్లోకంలో హల్చల్ చేసింది. -
బిర్యానీ కోసం వెళ్లి.. ముగ్గురు మృతి
గద్వాల క్రైం: ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడి కుమార్తె జన్మదిన వేడుకలను సిబ్బంది సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. అనంతరం సిబ్బంది బిర్యానీ తినేందుకు వైద్యుడి కారులో హోటల్కు వెళ్లారు. అయితే డ్రైవర్ అత్యు త్సాహంతో అతి వేగంగా కారును నడపడంతో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడి కక్కడే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన జోగుళాంబ గద్వాల మండలం జమ్మిచేడ్ వద్ద శనివారం తెల్లవారుజమున చోటు చేసు కుంది. ప్రత్యక్ష సాక్షులు, గద్వాల సీఐ శ్రీనివాసులు కథనం ప్రకారం వివరాలు.. గద్వాలలోని అనంత ఆస్పత్రిలో స్థానిక చింతల్పేటకు చెందిన ఆంజనేయులు (50) సెక్యూరిటీగా పనిచేస్తుండగా, వనపర్తిజిల్లా పెబ్బేరుకు చెందిన పవన్ (28), మల్దకల్ మండలానికి చెందిన నరేశ్ (23), పాల్వా యి గ్రామానికి చెందిన నవీన్, కేటీదొడ్డి మండలం మైల గడ్డకు చెందిన గోవర్ధన్ ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నా రు. వైద్యుడు వెంకటేశ్ కూతురు పుట్టినరోజు ఉండటంతో శుక్ర వారం అర్ధరాత్రి సిబ్బంది సమక్షంలో వేడుకలు నిర్వ హించారు. ఆ తర్వాత ఆరుగురు సిబ్బంది బిర్యానీ తింటా మని చెప్పడంతో వెంకటేశ్ వారికి రూ.5వేలు ఇచ్చారు. డ్రైవర్ మ హబూబ్తో కలిసి ఆరుగురు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎర్రవల్లి వైపు బయలుదేరారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా కారు నడిపి జమ్మిచేడ్ శివారులో కల్వర్టు వద్ద డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో కారు గాల్లోఎగిరి 100 మీ టర్ల వరకు పల్టీలు కొట్టింది. ఈ క్రమంలోనే కారు పైభాగం (సన్రూఫ్) తెరుచుకోవడంతో ఆంజనేయులు, పవన్, నరేశ్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడి అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ మహబూబ్, నవీ న్, గోవర్ధన్లను అనంత ఆస్పత్రికి తరలించారు. విషమంగా ఉన్న నవీన్ను మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. మృతుడు ఆంజనేయులు కుమారుడు నవీన్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
బిర్యానీ గొడవ: కస్టమర్లపై దాడి.. రాజాసింగ్ సీరియస్
హైదరాబాద్: హైదరాబాద్లోని అబిడ్స్ గ్రాండ్ హోటల్లో బిర్యానీ విషయంలో గొడవ కాస్త పరస్పర దాడి దారి తీసింది. మటన్ బిర్యానీ సరిగా ఉడకలేదని.. డబ్బులు చెల్లించమని హోటల్ వెయిటర్లతో వినియోగదారులు చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెద్దది కావటంతో వెయిటర్లు వినియోగదారులపై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో 12 మంది యువతీ యువకులకు గాయాలై ఆస్పత్రి పాలయ్యారు. ఫిర్యాదు రావడంతో.. 10మంది వెయిటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు హోటల్ యజమానిపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కస్టమర్లపై దాడి చేసిన ముగ్గురు వెయిటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. ధూల్పేటకు చెందిన కస్టమర్లపై దాడి చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాండ్ హోటల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి: బైరి నరేష్ అడ్డగింత.. వాహనం ఢీ కొట్టి అయ్యప్ప భక్తుడికి గాయాలు -
జైల్ మండి.. భలే ఉందండి
బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉండరు. మండి బిర్యానీ ఆరగించేందుకు బిర్యానీ ప్రియులు అమితంగా ఇష్టపడుతుంటారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మండి బిర్యానీకి ప్రత్యేకంగా పలు రెస్టారెంట్లు వెలిశాయి. అయితే వినూత్న రీతిలో పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ‘ది న్యూ జైల్ మండి’ బిర్యానీ రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. రొటీన్కు భిన్నంగా జైల్ సెట్టింగ్లతో ఏర్పాటు చేసిన మండి రెస్టారెంట్ ఆకట్టుకుంటోంది. రెస్టారెంట్లో పూర్తిగా జైలు వాతావరణం ఉంటుంది. లోపలకి వెళితే జైల్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. సాధారణంగా మండి బిర్యానీ రుచే వేరు. సౌదీ అరేబియాలో ఒక రకమైన బిర్యానీ ఇది. కారం పసుపు వాడకుండా 18 రకాల మసాల దినుసులతో వండుతారు. మండి బిర్యానీలో చికెన్ ఫ్రైడ్, క్రిస్పీ ఫ్రైడ్, చికెన్ జ్యూసీ, లాలీపాప్, మటన్ మండి, ఫిష్ మండి, ఫ్రాన్స్ మండి ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జైల్ మండిలో అందుబాటులో ఉన్నాయి. వినూత్నంగా ఏర్పాటు చేశాం మండీ బిర్యానీకి ఆదరణ బాగా ఉంది. రుచికరంగా ఉండడం వల్ల ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. చూడడానికి జైల్ నిర్మాణం కలిగి ఉండడం మా రెస్టారెంట్ ప్రత్యేకత. జైల్ మాదిరిగా సెల్లను ఏర్పాటు చేశాము. మొత్తం 7 సెల్లు ఉన్నాయి. ఫ్యామిలీ కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాము. – ఎ.దర్శన్, నిర్వాహకుడు ప్రత్యేక అనుభూతి జైల్ రూపంలో ఉండడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత. జైలులో కూర్చుని తిన్న ఫీలింగ్ మాకు కలుగుతుంది. స్నేహితులందరం కలిసి వారానికి రెండు నుంచి మూడు సార్లు వస్తుంటాము. రెస్టారెంట్ వినూత్నంగా ఉండడమే కాదు ఇక్కడ మండీ బిర్యానీ చాలా రుచికరంగా ఉంటుంది. ఫ్యామిలీ కూర్చోవడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. – గణేష్, హిమగిరి కాలనీ, నల్లగొండ -
కొత్త పిన్ కోడ్తో బిర్యానీ డెలివరీ.. సిద్దమైన బావర్చి
క్రిస్మస్, న్యూ ఇయర్లను పురస్కరించుకుని హైదరాబాద్ వాసులకు బావర్చి రెస్టారెంట్.. స్విగ్గీతో కలిపి సుమారు 35 లక్షల వినియోగదారులకు తమ వంటకాన్ని అందించడానికి సన్నాహాలు చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బిర్యానీ ప్రియులకు మరచిపోలేని ఇయర్ ఎండ్ అనుభవాన్ని అందించడానికి హైదరాబాద్లో 31 అనే కొత్త పిన్ కోడ్తో అమీర్పేట్, గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ, నిజాంపేట్, నానక్రామ్గూడ మొదలైన ప్రాంతాల్లో 2023 డిసెంబర్ 22 నుంచి 2024 జనవరి 1 మధ్య స్విగ్గీ వినియోగదారులకు బావర్చి బిర్యానీ ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. RTC X రోడ్డులో ఉన్న బావర్చి రెస్టారెంట్ నగరంలోనే కాకుండా దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బిర్యానీ రెస్టారెంట్లలో ఒకటి. గత ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా స్విగ్గీలో నిమిషానికి 3 బిర్యానీలను విక్రయించడం ద్వారా జాతీయ రికార్డు సొంతం చేసుకుంది. బిర్యానీకి ప్రసిద్ధి చెందిన ఈ రెస్టారెంట్.. చికెన్, మటన్ బిర్యానీ వంటి వంటకాలను వినియోగదారులకు అందిస్తోంది. దేశంలోని వేలాది రెస్టారెంట్లతో అనుభందం ఉన్న స్విగ్గీకి హైదరాబాద్ కూడా అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది వినియోగదారులకు బావర్చి రెస్టారెంట్ను అందుబాటులోకి తీసుకురావడం గురించి స్విగ్గీ నేషనల్ బిజినెస్ హెడ్ సిద్దార్థ్ భకూ మాట్లాడుతూ.. హైదరాబాద్ వాసులకు బిర్యానీ పట్ల ఉన్న ప్రేమ వర్ణించలేనిది. హౌ ఇండియా స్విగ్గీ నివేదిక 2023 ప్రకారం, దేశంలోని ఆర్డర్ చేసుకునే ప్రతి ఆరు బిర్యానీలలో ఒకటి హైదరాబాద్ బిర్యానీ ఉంటుందని వెల్లడించారు. -
ఏడాదంతా..ఇడ్లీలు, బిర్యానీలే!
సాక్షి, హైదరాబాద్: ఇడ్లీతో టిఫిన్.. బిర్యానీతో భోజనం... ఏడాదంతా ఇదే మెనూ! ఇద్దరు హైదరాబాదీ స్విగ్గీ కస్టమర్ల తీరిది. 2023లో ఓ ఇడ్లీ ప్రియుడు ఇడ్లీల కోసం వెచ్చించిన సొమ్ము అక్షరాల రూ. 6 లక్షలు. మరో బిర్యానీ ప్రియుడైతే ఏకంగా ఏడాదిలో 1,633 బిర్యానీలు ఆర్డర్ చేశాడు. అంటే రోజుకు నాలుగు బిర్యానీల కంటే ఎక్కువే ఆరగించాడు. దేశవ్యాప్తంగా ప్రతి ఆరు బిర్యానీ ఆర్డర్లలో ఒకటి హైదరాబాద్ నుంచే ఉందని ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’వార్షిక నివేదిక వెల్లడించింది. అందులోని పలు ఆసక్తికర ఆర్డర్లివే.. బిర్యానీ తింటూ ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్.. దేశవ్యాప్తంగా ప్రతి సెకనుకు 2.5 బిర్యానీల కోసం ఆర్డర్లు వచ్చాయి. ప్రతి 5.5 బిర్యానీ ఆర్డర్లలో ఒక వెజ్ బిర్యానీ ఉంది. కొత్తగా 20.49 లక్షల మంది యూజర్లు స్విగ్గీలో బిర్యానీలు ఆర్డర్ చేశారు. చంఢీగఢ్లోని ఓ బిర్యానీ ప్రియుల కుటుంబం అక్టోబర్లో జరిగిన భారత్–పాక్ ప్రపంచ క్రికెట్ కప్ మ్యాచ్ రోజున ఏకంగా 70 బిర్యానీలు ఆర్డర్ చేసింది. దేశవ్యాప్తంగా ఆ రోజు ప్రతి నిమిషానికి 250 బిర్యానీలను స్విగ్గీ డెలివరీ చేసింది. స్విగ్గీ డెలివరీ పార్ట్నర్స్ గతేడాది 16.64 కోట్ల కిలోమీటర్ల మేర విద్యుత్ వాహనాలు, సైకిళ్లపై ప్రయాణించి డెలివరీ చేశారు. గతేడాది అత్యధికంగా చెన్నైకి చెందిన వెంకటేశన్ 10,360, కొచి్చకి చెందిన సంథిని 6,253 ఆర్డర్లను డెలివరీ చేశారు. చిప్స్, బిస్కెట్ల కోసం రూ.31,748 ఖర్చు.. నిత్యావసరాలను విక్రయించే స్విగ్గీ ఇన్స్టామార్ట్లో కస్టమర్లు అత్యధికంగా పాలు, పెరుగు, ఉల్లిగడ్డల కోసం వెతికారు. జైపూర్కు చెందిన ఓ కస్టమర్ ఒక్క రోజులో 67 ఉత్పత్తులను ఆర్డర్ చేశాడు. చెన్నైకి చెందిన ఓ వ్యక్తి కాఫీ, జ్యూస్, బిస్కెట్లు, చిప్స్ కోసం ఒక్క ఆర్డర్లో అత్యధికంగా రూ. 31,748 ఖర్చు చేశాడు. అత్యంత వేగంగా ఢిల్లీలో ఒక కస్టమర్కు 65 సెకన్లలో నూడుల్స్ ప్యాకెట్లను డెలివరీ చేశారు. హైదరాబాద్, ముంబై కంటే బెంగళూరు నుంచి మామిడి పండ్ల కోసం ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. ఒక్క రోజులో 207 పిజ్జాలు.. చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ నుంచి ఒక్కో కస్టమర్ నుంచి గరిష్టంగా 10 వేల కంటే ఎక్కువే ఆర్డర్లు వచ్చాయి. భువనేశ్వర్లోని ఒక కస్టమర్ ఒక్క రోజులో 207 పిజ్జాలు ఆర్డర్ చేశారు. ముంబైకి చెందిన ఓ కస్టమర్ ఏడాదిలో రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్ ఆర్డర్లు చేశాడు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ ప్రాంతంలో జరిగిన ఓ పెద్ద పార్టీలో 269 ఐటెమ్స్ ఆర్డర్ చేశారు. దుర్గా పూజ సందర్భంగా దేశవ్యాప్తంగా 77 లక్షల రసగుల్లాల ఆర్డర్స్ వచ్చాయి. నవరాత్రి రోజుల్లో చాలా మంది ఫేవరేట్ ఆర్డర్ మసాలా దోశ. కేక్లే కేక్లు.. గార్డెన్ సిటీగా పేరొందిన బెంగళూరు కేక్ సిటీగా మారింది! 2023లో ఈ నగరంలో 85 లక్షల చాక్లెట్ కేక్స్ ఆర్డర్లు వచ్చాయి. ప్రేమికుల దినోత్సవం నాడు దేశవ్యాప్తంగా నిమిషానికి 271 కేక్స్ ఆర్డర్ చేశారు. నాగ్పూర్కు చెందిన ఓ కస్టమర్ ఒక్క రోజులో 92 కేక్లు ఆర్డర్ చేశాడు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ సమయాల్లోనూ కేక్లు ఆర్డర్ చేయడం గమనార్హం. 2023లో వేగాన్ ఆర్డర్లు 146 శాతం మేర పెరిగాయి. అలాగే మిల్లెట్స్ ఆధారిత ఆహార ఉత్పత్తుల ఆర్డర్లు 124 శాతం మేర పెరిగాయి. బుక్ఫీట్, ఫాక్సీటేల్, జొవార్, బాజ్రా, రాగి, రాజ్గిరి వంటి డిషెస్ కోసం ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. -
చికెన్ ముక్క లేకుండా బిర్యానీ వడ్డించిన హోటల్.. రూ.30 వేలు పరిహారం!
కర్ణాటక: చికెన్ ముక్క లేకుండా బిర్యాని తినడం ఎంత అవమానకరమో మాంసప్రియులకు తెలుసు. అయితే మైసూరు బజ్జీలో మైసూరు ఉంటుందా?, అలాగే చికెన్ బిర్యానీలో చికెన్ ఉంటుందా? అని వాదించిన హోటల్కు కస్టమర్ కోర్టు ద్వారా షాక్ ఇచ్చాడు. ముక్క లేకుండా బిర్యాని ఇచ్చిన హోటల్ యాజమాన్యంపై కేసు వేసి కోర్టులో గెలిచి పరిహారం సాధించుకున్నాడు. రూ.30 వేలు ఇవ్వాలని కేసు.. వివరాలు.. బెంగళూరు ఐటీఐ లేఔట్ నివాసి కృష్ణప్ప.. మే నెలలో భార్యకు బాగాలేక వంట చేయలేదు. దీంతో స్థానిక ప్రశాంత్ హోటల్కు వెళ్లి రూ.150 పెట్టి చికెన్ బిర్యాని తీసుకున్నాడు. ఇంటికి తీసికెళ్లి పొట్లం విప్పి చూడగా అందులో చికెన్ ముక్కలు లేవు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన కృష్ణప్ప వినియోగదారుల కోర్టులో కేసు వేశాడు. సాక్ష్యం కోసం బిర్యాని ఫోటోలు, బిల్లు ఇచ్చాడు. తనకు రూ.30వేల నష్టపరిహారం అడిగాడు. కేసు పరిశీలించిన కోర్టు రూ.1000 పరిహారం, బిర్యానీ ధర రూ.150 తిరిగి ఇవ్వాలని హోటల్వారికి ఆదేశించింది. ఈ కేసులో కృష్ణప్ప తానే వాదించుకుని గెలిచాడు. కోడికూర కోసం భార్య హత్య.. 6 ఏళ్ల జైలు చికెన్కూర వండలేదనే కోపంతో భార్యను హత్య చేసిన కిరాతక భర్తకి కోర్టు 6 ఏళ్లు జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధించిన సంఘటన దావణగెరె జిల్లా హరిహరలో చోటుచేసుకుంది. హరిహర తాలూకా మాగనహళ్లికి చెందిన కెంచప్ప భార్య శీలా కోడికూర వండలేదని గొడవ పెట్టుకున్నాడు. కోపం పట్టలేక కత్తితో పొడిచి హత్య చేసాడు. హరిహర గ్రామీణ పోలీసులు కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. విచారణలో కెంచప్ప నేరం రుజువు కావడంతో కోర్టు పై విధంగా తీర్పు వెలువరించింది. కాగా, జైల్లో కెంచప్పకు వారానికి రెండుసార్లు మాంసాహారం లభిస్తుంది. -
సింగపూర్ ఆహార పోటీల్లో విజేతగా ‘బిరియాని’
హైదరాబాదీ వంటకం బిరియానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సింగపూర్లో జరిగిన ఫేవరెట్ హాకర్ ఆహార పోటీల్లో ఈ హైదరబాదీ వంటకం విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో మొత్తం 12 ఆహార పదార్థాలను విజేతలుగా ఎంపిక చేయగా అందులో బిరియాని ఒకటిగా నిలిచింది. అక్కడ బిరియాని తయారీకి ప్రసిద్ధి చెందిన హాజీ హనీఫా ఎం అన్సారీ ఈటింగ్ హౌజ్ బహుమతిని అందుకుంది. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో భాగంగా పైప్డ్ గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ సిటీ ఎనర్జీ పీటీఈ లిమిటెడ్ అనే సంస్థ ఈ పోటీలను నిర్వహించింది. ఈ సంస్థ అక్కడి ఫుడ్ కోర్టులు, ఆహార దుకాణాలకు గ్యాస్ను సరఫరా చేస్తుంది. జులై 4 నుంచి సెప్టెంబర్ 15 వరకు దాదాపు రెండున్నర నెలలపాటు ఈ పోటీలు జరిగాయి. 13వ వార్షిక సిటీ హాకర్ (వీధి దుకాణాలు) ఫుడ్ హంట్లో భాగంగా సింగపూర్ ప్రత్యేకమైన హాకర్ సంస్కృతిని ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఈ పోటీల్లో విజేతకు 500 సింగపూర్ డాలర్లు (సుమారు రూ.30 వేలు), మెడల్, సర్టిఫికెట్ను అందజేస్తారు. -
India-Pakistan Match: 70 బిరియానీలు ఆర్డర్ చేసిన కుటుంబం
క్రికెట్కు భారత్లో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ మరింత ఎక్కువగా ఉంటుంది. అభిమానులు పనులన్నీ మానుకుని మరీ టీవీలకు అతక్కుపోతారు. టాస్ దగ్గర నుంచి మ్యాచ్ చివరి బాల్ వరకూ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తారు. ప్రస్తుతం భారత్లో క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా చంఢీగడ్లో ఓ కుటుంబం ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో ఏకంగా 70 బిరియానీలు ఆర్డర్ పెట్టింది.ఈ విషయాన్ని తెలియజేస్తూ స్విగ్గీ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్టు పెట్టింది. దీనిపై యూజర్లు పలు రకాలుగా కామెంట్లు పెట్టారు. కాగా ఈ మ్యాచ్లో భారత్.. పాకిస్తాన్ను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 191 ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 30.3 ఓవర్లలలోనే లక్ష్యాన్ని చేధించింది. 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. గతంలో ఆసియా కప్లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఇలాగే 62 బిరియానీలు ఆర్డర్ పెట్టింది. 70 biryanis ordered by a household in chandigarh in one-go, seems they already know who's winning 👀 #INDvsPAK pic.twitter.com/2qQpIj5nhu — Swiggy (@Swiggy) October 14, 2023 -
పెరుగు అడిగితే చంపేశారు!
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: బిర్యానీ తింటూ అదనంగా రైతా(పెరుగు) అడిగిన పాపానికి రెస్టారెంట్ సిబ్బంది ఓ యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. పోలీసులు వచ్చినా వారి ముందు కూడా కొట్టడం.. పోలీస్స్టేషన్లో ఊపిరి ఆడటం లేదని చెప్పినా పోలీసులు సైతం పట్టించుకోకుండా చివరి నిమిషంలో ఆస్పత్రికి తరలించడంతో అప్పటికే పరిస్థితి విషమించి చనిపోయాడు. పంజగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని మెరీడియన్ రెస్టారెంట్లో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. మినరల్ వాటర్ వ్యాపారం చేసే పాతబస్తీ చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ లియాకత్ (32) ఆదివారం రాత్రి 10:30 ప్రాంతంలో తన స్నేహితులైన తొమ్మిది మందితో కలిసి పంజగుట్ట కూడలిలో ఉన్న మెరీడియన్ రెస్టారెంట్కు వచ్చారు. బిర్యానీ తింటున్న సమయంలో లియాకత్ రైతా అదనంగా కావాలని వెయిటర్ను కోరారు. రెండు సార్లు అడిగినా వెయిటర్ నుంచి నిర్లక్ష్యపు సమాధానం, పరుషపదజాలం రావడంతో లియాకత్కు, అతడికి వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల సమక్షంలోనే దాడి: దీంతో మరో ఇద్దరు వెయిటర్లు, రెస్టారెంట్ మేనేజర్, సూపర్వైజర్ వచ్చి విచక్షణారహితంగా లియాకత్తో పాటు అతడి స్నేహితులపై దాడికి దిగారు. ఇంతలో ఓ రెస్టారెంట్ ఉద్యోగి సమాచారంకో అక్కడకు చేరుకున్న పంజగుట్ట పోలీసుస్టేషన్ గస్తీ సిబ్బంది ఎదుటే రెస్టారెంట్ సిబ్బంది, నిర్వాహకులు లియాకత్ తదితరులపై దాడి కొనసాగించారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పోలీసుల సమక్షంలోనే దాడి చేస్తూ రెస్టారెంట్పై అంతస్తు నుంచి కింది వరకు తీసుకువచ్చారని ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. వీరి దెబ్బలు తాళలేకపోయిన లియాకత్ ఆయాసంతో అక్కడే కూలబడిపోయాడు. దీంతో పోలీసులు అతడితో పాటు స్నేహితులు మహ్మద్ జమీర్, మహ్మద్ నాసర్, మహ్మద్ ముస్తఫాను ఠాణాకు తీసుకువచ్చారు. ఠాణాకు తీసుకువచ్చినా నిర్లక్ష్యం... అప్పటికే లియాకత్ తనకు తీవ్రంగా ఆయాసం వస్తోందని, ఊపిరి అందట్లేదని చెప్తున్నా డ్యూటీలో ఉన్న ఎస్సై, కానిస్టేబుల్ పట్టించుకోలేదని అంటున్నారు. ‘నాటకాలు ఆడుతున్నావా..?’ అంటూ అతడినే గద్దించారు. కొద్దిసేపటికి లియాకత్ అక్కడే కుప్పకూలిపోవడంతో కారు తాళాలు ఇచ్చి స్నేహితులతోనే సోమాజీగూడలోని ప్రైవేట్ ఆస్పత్రికి పంపారు. ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకెళ్ళడంతో... అప్పటికే లియాకత్ చనిపోయినట్టు ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ ఆస్పత్రి వద్దకు వచ్చి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బైఠాయించారు. ఆ మేరకు పోలీసులు హామీ ఇవ్వడంతో పరిస్థితి అప్పటికి సద్దుమణిగింది. వెస్ట్జోన్ డీసీపీ జోయల్ డెవిస్ పంజగుట్ట పోలీసులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. రెస్టారెంట్ను తాత్కాలికంగా మూసివేయించారని సమాచారం. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. హత్య కేసు నమోదు... లియాకత్ స్నేహితుడు, బండ్లగూడకు చెందిన హస్ర చాంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెయిటర్లు బీహార్ వాస్తవ్యుడు, అమీర్పేట హాస్టల్లో ఉండే కృష్ణ సూర్య ప్రకాష్ (33), అమీర్పేట బాపూ నగర్కు చెందిన మెగావత్ పాండు (36), సరూర్నగర్కు చెందిన మేనేజర్ సయ్యద్ హఫ్తాబ్ హైదర్ (55), జగద్గిరిగుట్టకు చెందిన సూపర్వైజర్ అబ్దుల్ మోయిన్(40), సనత్నగర్కు చెందిన సూపర్వైజర్ మహ్మద్ అజీజుద్దీన్ (23)పై హత్య కేసు నమోదు చేశారు. మృతదేహానికి గాంధీ ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం పరీక్షలు పూర్తి చేసి కుటుంబీకులకు అప్పగించారు. -
ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్.. 62 బిర్యానీలు ఆర్డర్ చేసిన మహిళ
వీకెండ్లు, పండగలు.. ఇలా సందర్భం ఏదైనా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయడం సాధారణంగా మారిపోయింది. బంధువులు, స్నేహితులతో కలసి పార్టీలు చేసుకుంటున్నప్పుడు కాస్త ఎక్కువగానే ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. అయితే బెంగళూరుకు చెందిన ఓ మహిళ మాత్రం ఏకంగా 62 బిర్యానీలు ఆర్డర్ చేసింది. శనివారం(సెప్టెంబర్ 2) భారత్-పాకిస్తాన్ (India-Pakistan match) ఆసియా కప్ (Asia Cup 2023) మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా బెంగళూరు వాసి ఒకరు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ (Swiggy)లో 62 బిర్యానీలను ఆర్డర్ చేశారు. దీని గురించి స్విగ్గీ సంస్థ ‘ఎక్స్’(ట్విటర్) (Twitter)లో షేర్ చేసింది. "బెంగళూరు నుంచి ఎవరో ఇప్పుడే 62 యూనిట్ల బిర్యానీలు ఆర్డర్ చేశారు? ఎవరు మీరు? ఎక్కడ ఉన్నారు? భారత్-పాకిస్తాన్ మ్యాచ్కి వాచ్ పార్టీని నిర్వహిస్తున్నారా? మేమూ రావచ్చా?" అంటూ రాసుకొచ్చింది. స్విగ్గీ పోస్ట్ను షేర్ చేసిన వెంటనే చాలా మంది ఇంటర్నెట్ యూజర్లు పోస్ట్పై కామెంట్ చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఆ వ్యక్తి ఎవరా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. మ్యాచ్లో భారత్ గెలిస్తే ఫుడ్ ఫ్రీ పంపిస్తారా? అంటూ ఓ యూజర్ చమత్కరించారు. కానీ వర్షం కారణంగా పార్టీ అకస్మాత్తుగా ముగిసింది అంటూ మరొకరు నిట్టూర్చారు. కాగా శ్రీలంకలోని క్యాండీలో పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న భారత్-పాకిస్థాన్ గ్రూప్-స్టేజ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 266 పరుగులు చేయగా వర్షం కురవడంతో పాకిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్ ఆడకుండానే మ్యాచ్ను రద్దు చేశారు. సోమవారం ఇదే వేదికపై భారత్ నేపాల్తో తలపడనుంది. someone from bengaluru just ordered 62 units of biryanis?? who are you? where exactly are you? are you hosting a #INDvsPAK match watch-party?? can i come? — Swiggy (@Swiggy) September 2, 2023 -
తరచూ చికెన్ బిర్యానీ తింటున్నారా? ఫ్రీగా మీకు క్యాన్సర్, గుండెజబ్బులు
బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో. చిన్నా,పెద్దా అని తేడా లేకుండా చాలామంది ఫేవరెట్ ఫుడ్ లిస్ట్లో బిర్యానీ ముందుంటుంది. అందులోనూ హైదరాబాద్ బిర్యానీ అంటే సెలబ్రిటీలు కూడా మనసు పారేసుకుంటారు. నాన్వెజ్లో ఎన్ని వెరైటీలు ఉన్నా చికెన్ బిర్యానీ ప్రత్యేకతే వేరు. అందుకే స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ యాప్స్లోనూ బిర్యానీ మోస్ట్ సేలబుల్ డిష్. అయితే టేస్ట్ బాగుంది కదా అని రోజూ బిర్యానీ కుమ్మేస్తే మొదటికే మోసం వస్తుందంటున్నారు డాక్టర్లు. తరచూ బిర్యానీ తింటే ముప్పు తప్పందని హెచ్చరిస్తున్నారు. చాలామందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. ఏదైనా అకేషన్, పార్టీ ఉంటే కశ్చితంగా బిర్యానీ ఉండాల్సిందే. ఈ క్రేజ్కు తగ్గట్లే ఇప్పుడు మార్కెట్లో ఎక్కడపడితే అక్కడ బిర్యానీ పాయింట్లు వెలిశాయి. అయితే ఇలా ఎప్పుడు పడితే అప్పుడు బిర్యానీలు తింటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా రెస్టారెంట్స్లో దొరికే బిర్యానీలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వాటిలో వినియోగించే మసాలా దినుసులు,నాసీరకం పదార్థాల వల్ల కడుపులో లేనిపోని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కలర్స్తో క్యాన్సర్ అసలే మార్కెట్లో ఇప్పుడు కల్తీ బాగా పెరిగిపోయింది. కాదేదీ అనర్హం అన్నట్లు తినే తిండి దగ్గర్నుంచి తాగే నీళ్ల వరకు అన్నింటిని కల్తీ చేసి పడేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి ఇష్టమొచ్చినట్లు రంగులు, ఆర్టిఫిషియల్ ఎసెన్సులు వాడేస్తున్నారు. ఇలాంటి కలర్స్ వాడటం వచ్చే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. బిర్యానీ అధికంగా తింటే ఊబకాయం, గ్యాస్, గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. చికెన్పై బాక్టీరియా చికెన్పై సాధారణంగా సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టిరియా ఉంటుంది. కాబట్టి వండేముందు శుభ్రంగా కడిగి బాగా ఉడికిన తర్వాత మాత్రమే తినాలి. లేకపోతే ఈ బాక్టీరియా శరీరం లోపలికి చేరి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కానీ రెస్టారెంట్స్, హోటల్స్లో ఎంతవరకు హైజీన్ మెయింటైన్ చేస్తారన్నది చెప్పలేం. దీనివల్లే ఒక్కోసారి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తరచూ బయట బిర్యానీ తింటే గుండె సమస్యలు కూడా వస్తాయట. మేం రోజూ చికెన్ తింటున్నాం. మాకేం కాలేదు కదా అని వాదించే వాళ్లూ ఉంటారు. అయితే ఇప్పుడు సమస్యలు రాకపోయినా ప్రతిరోజూ బిర్యానీ, మసాలాలు ఎక్కువగా ఉండే వంటలు తింటే దీర్ఘకాలంలో అనేక సమస్యలు వస్తాయట. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఊబకాయంతో పాటు జీర్ణ సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయట. ప్రోటీన్ సంగతి సరే, మరి కొవ్వు? సాధారణంగా చికెన్లో ప్రోటీన్ అధికంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. జిమ్, వర్కవుట్స్ చేసే వాళ్ల డైట్ లిస్ట్లో ప్రతిరోజూ చికెన్ ఉంటుంది. దీనివల్ల ప్రోటీన్ అధికంగా శరీరంలో చేరిపోయి కొవ్వు రూపంలో మారిపోతుంది. దీంతో మీకు తెలియకుండానే బరువు పెరుగుతారు. కాబట్టి రోజూ తినే అలవాటు మానుకొని వారానికి ఒకటి లేదా రెండు సార్లు తింటే మంచిదంటున్నారు వైద్యులు. -
క్రైమ్ బ్రాంచి పోలీసునని చెప్పి.. బిర్యానీ తెమ్మని.. ఇంతలో..
మెదక్: క్రైమ్ బ్రాంచి పోలీసునని పరిచయం చేసుకున్నాడు. హైదరాబాద్ వెళ్లాలని కారు కిరాయికి మాట్లాడుకున్నాడు. మార్గమధ్యలో ఓ హోటల్ వద్ద ఆపి డ్రైవర్ను బిర్యానీ తెమ్మని చెప్పాడు. అతడు వచ్చేలోపే కారుతో ఉడాయించాడు. ఈసంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం గంగాపూర్కు చెందిన గండ్ల నరేష్గౌడ్ కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో శనివారం జహీరాబాద్లో ఉండగా ఓ అపరిచిత వ్యక్తి క్రైమ్ బ్రాంచి పోలీసునని సంగారెడ్డి వరకు కారు కిరాయికి కావాలని రూ. 2 వేలకు మాట్లాడుకున్నాడు. జహీరాబాద్ నుంచి వస్తుండగా మార్గమధ్యలో బుదేరా వద్ద ఓ దాబాలో లంచ్ చేసి, అక్కడి నుంచి సంగారెడ్డి పోలీస్స్టేషన్ వద్ద ఐదు నిమిషాలు ఆపమన్నాడు. అక్కడి నుంచి ఎస్పీ ఆఫీస్ వద్ద ఫోన్లో మాట్లాడాడు. జూబ్లీహిల్స్లో సాయంత్రం మీటింగ్ ఉందని డ్రైవర్కు తెలిపాడు. అదనంగా రూ. 3 వేలు కిరాయి అవుతుందని చెప్పగా సరే అన్నాడు. హైదరాబాద్ వైపు వస్తుండగా పటాన్చెరు మండలం రుద్రారం సమీపంలోని ఓ హోటల్ వద్దకు రాగానే మూడు బిర్యానీలు తీసుకురమ్మని డ్రైవర్కు చెప్పి రూ.1000 ఇచ్చాడు. దీంతో డ్రైవర్ బిర్యాని ఆర్డర్ చేశాడు. పది నిమిషాలు పడుతుందని హోటల్ నిర్వాహకుడు తెలపగా.. కారులో ఉన్న వ్యక్తికి చెప్పేందుకు వచ్చాడు. అప్పటికే అతడు కారుతో పరారయ్యాడు. ఈ మేరకు డ్రైవర్ నరేష్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
క్యాంటీన్లో బిర్యానీ తిన్న విద్యార్థులు.. 40 మందికి అస్వస్థత, రహస్యంగా తరలించి..
సాక్షి, వరంగల్: జిల్లాలోని బట్టుపల్లి ఎస్సార్ప్రైమ్ క్యాంపస్లో ఫుడ్ పాయిజన్ కావడంతో కలకలం రేగింది. 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 10 మందికి క్యాంపస్ లోనే చికిత్స అందించారు కాలేజీ సిబ్బంది. ఆదివారం రాత్రి చికెన్ బిర్యాని తిన్న విద్యార్థులు కడుపు నొప్పితో పాటు వాంతులు, విరోచనాలతో అస్వస్థత గురి కావడంతో 30 మందిని ఫాతిమా కొలంబియా మెడికేర్ ఆసుపత్రికి తరలించారు. 15 మంది కి చికిత్స చేసి డిశ్చార్జ్ చేసిన ఆసుపత్రి వర్గాలు, మరో 15 మందికి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. రహస్యంగా ఆసుపత్రికి తరలించి వైద్య అందించడంతో పేరెంట్స్ తో పాటు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సార్ ప్రైమ్ నిర్వాహకులకు ఫీజుల వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ పిల్లల ఆరోగ్యం పైన లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. కొత్తగా ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’) పరిశుభ్రతను గాలికి వదిలేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎస్సార్ ప్రైమ్ గుర్తింపు రద్దు చేసి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం నోరు మెదుపకపోగా ఆసుపత్రి వైద్యులు మాత్రం విద్యార్థుల ఆరోగ్య నిలకడ ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. (చదవండి: మానవత్వం చాటుకున్న కేటీఆర్.. రోడ్డు ప్రమాద బాధితులను కాన్వాయ్లో ఆసుపత్రికి తరలింపు) -
భర్తకు బిర్యానీలో నిద్రమాత్రలు.. ప్లాన్ ప్రకారం ప్రియుడు రాక.. అక్కడే ట్విస్ట్!
విజయనగరం క్రైమ్: వివాహేతర సంబంధం మోజులో ఉన్న భార్య కట్టుకున్న భర్తనే కడతేర్చాలని ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో భర్తకు బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి పెట్టింది. దీంతో భర్త నిద్రలోకి వెళ్లిన తర్వాత వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని పిలిపించి నైలాన్తాడు మెడకు బిగించి హత్య చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో భర్తకు తెలివివచ్చి కేకలు వేయడంతో అందరూ పారిపోయారు. బాధితుడు తేరుకుని టూటౌన్ పోలీసులకు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు టూటౌన్ సీఐ సీహెచ్.లక్ష్మణరావు గురువారం స్థానిక పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక కుమ్మరివీధికి చెందిన కోటరాజు, భార్య శ్రీదేవి, పిల్లలు బుధవారం రాత్రి ఇంట్లో నిద్రకు ఉపక్రమించారు. శ్రీదేవికి చిన గోకవీధికి చెందిన గంధవరపు రఘుతో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తప్పించాలనే ఉద్దేశంతో మట్టుబెట్టాలని ప్రణాళిక వేసింది. తన భర్తను చంపేయమని రఘుకు చెప్పింది. వెంటనే రఘు ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర నుంచి నిద్రమాత్రలు కొని శ్రీదేవికి ఇచ్చాడు. అవి తీసుకుని శ్రీదేవి భర్త రాజుకు బుధవారం రాత్రి మటన్ బిర్యానీలో కలిపి తినిపించింది. వివరాలు వెల్లడిస్తున్న టూటౌన్ సీఐ సీహెచ్.లక్ష్మణరావు (వెనుక ముసుగులో నిందితులు) రాజు నిద్రలోకి జారుకున్న తర్వాత రఘుకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలవగా వరుసకు బావమరిది అయిన బొగ్గులదిబ్బకు చెందిన కేత శ్రీను సహాయం కోరి రూ. 20వేలకు ఒప్పందం కుదుర్చుకుని ఇద్దరూ వచ్చారు. వారు తెచ్చుకున్న నైలాన్ తాడును రాజు మెడకు బిగించి హత్య చేసేందుకు ప్రయత్నించగా మెలకువ వచ్చిన రాజు పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి ఇద్దరూ పారిపోయా రు. ఈ మేరకు విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించడంతో రఘు, శ్రీను, శ్రీదేవిలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సమావేశంలో ఎస్సై షేక్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
బిర్యానీపై హైదరాబాదీలకు తరగని మోజు.. కోటిన్నర బిర్యానీల ఆర్డర్!
గత ఆరు నెలల్లో హైదరాబాదీలు 72 లక్షలకు పైగా బిర్యానీ ఆర్డర్లను గత 12 నెలల్లో 150 లక్షల బిర్యానీ ఆర్డర్లను అందుకున్నారు. బిర్యానీపై తరగని మోజుకు, నగరానికి బిర్యానీకి మధ్య ఉన్న అనుబంధానికి అద్దం పడుతుంది. ధమ్ బిర్యానీ చాంపియన్... గత ఐదున్నర నెలల్లో, 2022 ఇదే కాలంతో పోలిస్తే నగరంలో బిర్యానీ ఆర్డర్లలో 8.39% వృద్ధి నమోదైంది. దమ్ బిర్యానీ 9 లక్షలకు పైగా ఆర్డర్లతో తిరుగులేని చాంపియన్గా నిలిచింది. 7.9 లక్షల ఆర్డర్లతో సువాసనగల ఫ్లేవర్డ్ బిర్యానీ తన సత్తా చాట గా, బ్యాచిలర్స్, సింగిల్స్కి అలవాటైన మినీ బిర్యానీ 5.2 లక్షల ఆర్డర్లను అందుకుంది. బిర్యానీ ప్రియత్వం ఓ రేంజ్లో ఉండటంతో నగరంలో దాదాపు 15,000 పైగా రెస్టారెంట్లు తమ మెనూలో బిర్యానీని తప్పనిసరి డిష్గా అందజేస్తున్నాయి. బిర్యానీలు అందించే రెస్టారెంట్స్ అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో కూకట్పల్లి, మాదాపూర్, అమీర్పేట్, బంజారాహిల్స్, కొత్తపేట్ – దిల్సుఖ్నగర్ ఉన్నాయి, కూకట్పల్లి టాప్... హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఆర్డర్ పరిమాణం పరంగా అత్యధిక బిర్యానీ వినియోగం జరిగింది. వీటిలో. కూకట్పల్లి నెంబర్ వన్ కిరీటం అందుకుంటోంది. ఆ తర్వా తి స్థానాల్లో వరుసగా మాదాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి కొండాపూర్ ఉన్నాయి. నగరవాసులు వేలూ లక్షల బిర్యానీలు హాంఫట్ మనిపిస్తున్నారు. ఏ యేటికాయేడు బిర్యానీ పై తమ ఇష్టాన్ని పెంచుకుంటూనే ఉన్నారు. ఆదివారం ప్రపంచ బిర్యానీ దినోత్సవం సందర్భంగా, ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గి నిర్వహించిన ఓ అధ్యయనం ఒక్క ఏడాదిలో.. కోటిన్నర బిర్యానీలు నగరం ఆరగించేసిందని తేల్చింది. – సాక్షి, సిటీబ్యూరో బిర్యానీ ఓ అనుభవం... నగరంలో బిర్యానీ ప్రియులతో మా ప్రయా ణం చాలా సుదీర్ఘమైనది. నగరవాసులకు బిర్యానీ అనేది కేవలం ఒక తినే వంటకం మాత్రమే కాదు అంతకు మించిన ఒక సంతోషకరమైన అనుభవం. ఈ ప్రపంచ బిర్యానీ దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని రూ.199 నుంచే ప్రారంభం అవుతున్న మా బిర్యానీ వైరెటీలను నగరవాసులకు ఆస్వాదించవచ్చు. – కుశాగ్ర గుప్తా, వైస్ప్రెసిడెంట్, ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ -
గడువు ముగిసిన ఆహార పదార్థాలు.. హోటల్స్కు భారీ జరిమానా..
కడప అర్బన్ : కడప రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి, అదనపు ఎస్పీ షేక్ మాసుంబాష ఆదేశాల మేరకు మంగళవారం విజిలెన్స్ అధికారులు, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం, కడప నగరపాలక సంస్థ శానిటరీ అధికారులు హోటళ్లపై విస్తృతంగా దాడులు నిర్వహించారు. కడప నగరంలోని ఐదు హోటళ్లలో గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006 కింద కేసులు నమోదు చేశారు. ఆయా హోటళ్లకు మొత్తం రూ.1,80,000 జరిమానా విధించారు. ఈ హోటళ్లలో రాజ్ మయూర గార్డెనియా యాజమాన్యానికి రూ.50,000, మయూర బేకరీకి రూ.60,000, ఆంధ్రరుచులుకు రూ.10,000, స్వప్న బార్ అండ్ రెస్టారెంట్కు రూ.40,000, రాయలసీమ స్పైస్కు రూ.20,000 జరిమానా విధించారు. ఈ మొ త్తాన్ని ఆయా హోటళ్ల యజమానులు కడప నగర పాలక సంస్థకు చెల్లించాలని ఆదేశించారు. ఈ తనిఖీలలో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ టి.రెడ్డెప్ప, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.విజయకిషోర్, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎం.డి షంషీర్ఖాన్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు సంయుక్తంగా పాల్గొన్నారు. రెస్టారెంట్లకు జరిమానా ప్రొద్దుటూరు : పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి షేక్ మాసుం బాషా, ఆఫీసర్ పూల రామకృష్ణ, సీఐ అశోక్కుమార్, ప్రొద్దుటూరు డివిజన్ ఫుడ్ సేప్టీ ఆఫీసర్ హరిత, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు కిరణ్, శ్రీనివాసరెడ్డి, గోవిందరెడ్డిలు తనిఖీల్లో పాల్గొన్నారు. పట్టణంలోని సాగర బార్ అండ్ రెస్టారెంట్, ఆంధ్ర కిచెన్, హైదరాబాద్ చెఫ్స్, సిప్ ఇన్ రెస్టారెంట్ అండ్ బార్ హోటల్లో తనిఖీలు చేశారు. కిచెన్లో పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత పరిమితులను అధికారులు పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించని సాగర్ బార్ అండ్ రెస్టారెంట్పై రూ.50 వేలు జరిమానా విధించారు. ఆంధ్రకిచెన్ రెస్టారెంట్పై రూ.25 వేలు జరిమానా, హైదరాబాద్ చెఫ్స్ రెస్టారెంట్పై రూ.25 వేలు, సిప్ ఇన్ రెస్టారెంట్ అండ్ బార్పై రూ.50 వేలు జరిమానా విధించారు. ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరిశీలనకు స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీకి పంపించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి మాసుం బాషా మా ట్లాడుతూ హోటల్, రెస్టారెంట్ వారు విని యోగదారులకు నాణ్యమైన పదార్థాలు అందించాలని తెలిపారు. భారత ఆహార సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో వంటకాలను తయారు చేసి అమ్మాలని చెప్పారు. ఆహార పదార్థాల్లో చైనా సాల్ట్, ఫుడ్ కలర్ ఇతర నిషేధిత పదార్థాలు వాడరాదని, పార్సిల్ విషయంలో ప్లాస్టిక్ కవర్లు వాడరాదని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని సంస్థలపై భారీ ఎత్తున జరిమానా విధించడమే కాకుండా క్రిమినల్ కేసులు కూడా నమదు చేసి వ్యాపార సంస్థలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. -
రూపాయి బిర్యానీ కోసం వెళ్తే రూ.235 జరిమానా
కరీంనగర్క్రైం: రూపాయి నోటుకు బిర్యానీ వస్తుందని ఆశపడి వెళ్లిన వారికి రూ.100 నుంచి రూ.235 వరకు జరిమానా పడింది. కరీంనగర్లోని తెలంగాణచౌక్ సమీపంలో కొత్తగా ప్రారంభించిన ఒక బిర్యానీసెంటర్ నిర్వాహకులు శుక్రవారం రూపాయి నోటు ఇచ్చిన వారికి బి ర్యానీ ఇస్తామని ప్రచారం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా సమయాన్ని కూడా సూచించారు. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో జనం రూపాయి నోటుకు బిర్యానీ కోసం ఎగబడ్డారు. అరగంటలో 800లకు పైగా బి ర్యానీ ప్యాకెట్లను కొనుగోలు చేసేశారు. చాలామందికి బిర్యానీ లభించకపోవడంతో హోటల్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు వచ్చి బిర్యానీసెంటర్ను మూసివేయించడంతోపాటు రోడ్లమీద అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసిన వందమంది వాహనాలకు రూ.100 నుంచి రూ.235వరకు జరిమానా విధించారు. దీంతో కొందరు బిర్యానీ సెంటర్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
IPL సీజన్లో స్విగ్గిలో అత్యధికంగా చికెన్ బిర్యానీ ఆర్డర్..!
-
అమ్మమ్మ చేతి బిర్యాని.. కోట్లు సంపాదించేలా..
RNR Co-Founder Ramya Ravi Success Story: కొంతమంది చదువులో రానించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు, మరి కొందరు బిజినెస్ చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. అయితే బెంగళూరుకు చెందిన ఒక యువతి బిర్యాని విక్రయిస్తూ కోట్లు సంపాదిస్తోంది. బిర్యానీ ఏంటి? కోట్లు సంపాదించడం ఏంటి అని మీకు సందేహం రావొచ్చు.. ఇది అక్షరాలా నిజం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మనకు బిర్యాని అనగానే హైదరాబాద్ గుర్తుకు వస్తుంది. అయితే దొన్నె బిర్యాని అంటే మొదట గుర్తొచ్చేది బెంగళూరు. ఈ దొన్నె బిర్యాని అమ్ముతూ కోట్ల రూపాయలు సంపాదిస్తోంది బెంగళూరుకు చెందిన 'రమ్య రవి' (Ramya Ravi). అమ్మమ్మ చేసే దొన్నె బిర్యాని తింటూ పెరిగిన ఈమె ఇప్పుడు ఆ బిర్యానితో బిజినెస్ చేస్తోంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు, చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో రమ్య (2020లో) రూ. 5 లక్షల పెట్టుబడితో బిర్యాని వ్యాపారం ప్రారంభించాలని ముందడుగు వేసింది. అందరూ భయపడుతున్న సమయంలో ప్రారంభించిన ఈ బిజినెస్ ఊహకందని రీతిలో విజయ పథంలో పయనించడం మొదలు పెట్టింది. (ఇదీ చదవండి: ఐఏఎస్ వదిలి ఇండియాలో అతిపెద్ద తయారీదారుగా.. ఎవరీ బాలగోపాల్ చంద్రశేఖర్!) వ్యాపారం ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే లాభాలు రావడం మొదలయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం ఈమె బిజినెస్ టర్నోవర్ ఏకంగా రూ. 10 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం బెంగళూరు RNR దొన్నె బిర్యానీకి మారుపేరుగా నిలిచింది. బెంగళూరులో పుట్టి పెరిగిన ఈమె ది వ్యాలీ స్కూల్ నుంచి పాఠశాల విద్యను, క్రైస్ట్ కాలేజీ బీకామ్ పూర్తి చేసింది. ఆ తరువాత వ్యాపారంలో కొన్ని మెళుకువలను నేర్చుకోవడానికి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్లో కోర్స్ కూడా పూర్తి చేసింది. ఈమెకు శ్వేత, రవీనా అనే ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు. (ఇదీ చదవండి: అమ్మేది పాత బూట్లు.. సంపాదన రూ. కోట్లు - హైస్కూల్ డ్రాపౌట్ యువకుని సక్సెస్ స్టోరీ) ప్రారంభంలో బెంగళూరు నాగరబావి ప్రాంతంలో కేవలం 200 అడుగుల స్థలంలో హోటల్ ప్రారంభించింది. ఆ సమయంలో వారికి కేవలం ఒక వంటవాడు మాత్రమే ఉండేవాడు. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా దినదినాభివృద్ధి చెందింది. వారు వ్యాపారం ప్రారంభించిన మొదటి నెలలోనే 10000 డెలివరీలు చేశారు. క్రమంగా డిమాండ్ భారీగా పెరగడంతో వ్యాపారం విస్తరించడంపై ద్రుష్టి సారించారు. ఇందులో భాగంగానే 2021లో బెంగళూరులోని జయనగర్లో రెస్టారెంట్ ప్రారంభించారు. వీరు ఇతర రెస్టారెంట్స్ మాదిరిగా కాకూండా టిన్ బాక్స్లలో బిర్యాని అందిస్తారు. ఈ విధానం చాలామందిని ఆకర్శించింది. ప్రస్తుతం భారీ లాభాల్లో పరుగులు పెడుతోంది -
ఐపీఎల్ 2023: ‘మోస్ట్ ఆర్డర్ డిష్’ టైటిల్ ఎవరిదో తెలుసా?
సాక్షి, ముంబై: రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్ను అలరించిన ఐపీఎల్ 2023 గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య సాగిన ఫైనల్ పోరుతో ముగిసింది. ఎంస్ ధోనీ నేతృత్వంలోని సీఎస్కే టైటిల్ను కైవసం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఫుడ్ సరఫరా సంస్థ స్విగ్గి కీలక విషయాన్ని వెల్లడించింది. ఐపీఎల్ సీజన్లో ట్రోఫీ బిర్యానీ గెల్చుకుంది, బిర్యానీ ‘మోస్ట్ ఆర్డర్ డిష్’ టైటిల్ను గెలుచుకుంది అంటూ ట్విట్ చేసింది. ఈ ఐపీఎల్ సీజన్లో బిర్యానీ ఆర్డర్ల వివరాలను స్విగ్గీ తాజాగా ప్రకటించింది. నిమిషానికి 212 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు వెల్లడించింది. ఎక్కువ మంది ఆర్డర్ చేసింది బిర్యానీనే అని, 12 మిలియన్లకు పైగా ఆర్డర్స్ వచ్చాయని పేర్కొంది. ఆర్డర్ చేసిన ప్రతి వెజ్ బిర్యానీకి, దేశవ్యాప్తంగా 20 నాన్-వెజ్ బిర్యానీలే. తొలి మ్యాచ్ నుంచి గ్రాండ్ ఫినాలే వరకు టోర్నీలో కేవలం క్రికెటర్సే కాదు స్విగ్గీ యూజర్లు కూడా నెక్ట్స్ లెవల్ అనిపించుకున్నారు. (Ravindra Jadeja వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్ సూపర్ పిక్స్ వైరల్) ఈ సీజన్లో అత్యంత వేగవంతమైన డెలివరీ కేవలం 77 సెకన్లు. ఇది కోల్కతాలో జరిగింది. ఈ క్రికెట్ సీజన్లో 12 మిలియన్లకు పైగా ఆర్డర్లతో ఫుడ్ లీడర్ బోర్డ్లో ఆధిపత్యం బెంగుళూరు టాప్లో నిలిచింది.అలాగే ఢిల్లీకి చెందిన ఒక వినియోగదారు ఈ సీజన్లో అత్యధికంగా 701 సమోసాలను ఆర్డర్ చేశారు. అత్యధిక సింగిల్ ఆర్డర్ రూ.26,474. కాగా ఐపీఎల్ సీజన్ ఫీవర్ను క్యాష్ చేసుకున్న ఫుడ్ డెలివరీ సంస్థ రకరకాల ట్వీట్లతో సందడి చేసింది. చిత్ర విచిత్ర కామెంట్లతో ట్విట్టర్ లో నెటిజన్లను ఆకర్షించింది. కొన్నింటిపై ట్రోల్స్ను కూడా ఎదుర్కొంది. ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా పదే పదే ఆగిపోతుండటంపై ‘అసలు ఆకాశంలో ఎవరు ఉల్లిగడ్డలు కోస్తున్నారబ్బా ఫన్నీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. (IPL 2023 విజేత, కెప్టెన్ ఎంఎస్ ధోని నెట్వర్త్ ఎంతో తెలుసా?) మరిన్ని బిజినెస్ వార్తలు కోసం చదవండి సాక్షి బిజినెస్ -
బిర్యానీ బిందాస్..ఏటీఎం సైతం వచ్చేసింది!
సాక్షి, అమరావతి: బిర్యానీకి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు, హోటళ్లలో అత్యధికులు ఆరగిస్తున్న వంటకాల్లో బిర్యానీదే అగ్రస్థానం. వివాహాలు, పుట్టిన రోజు వేడుకల్లోనూ బిర్యానీ తప్పనిసరి ఐటమ్గా మారిపోయింది. గల్లీ స్టాల్స్ నుంచి.. మాల్స్ వరకు బిర్యానీ ప్రియులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త పేర్లు ఫ్లేవర్లతో బిర్యానీలు మార్కెట్లోకి దూసుకొస్తున్నాయి. కుండల నుంచి డబ్బా వాలా వరకు.. కుండ నుంచి మొదలైన బిర్యానీ విక్రయాల ట్రెండ్ ఇప్పుడు స్టీల్ బిందె.. స్టీల్ బకెట్.. డబ్బాల్లో విక్రయించే వరకు చేరింది. కుండ, రెడ్ బకెట్, గ్రీన్ బకెట్, బ్లూ బకెట్, స్టీల్ బిందె, స్టీల్ డబ్బా, మండీ, బిగ్ థాలీ బిర్యానీ వంటి ఆకట్టుకునే ప్యాకింగ్లతో విక్రయాలు ఊపందుకున్నాయి. ఎంత మందికి.. ఎంత ధర అనే కేటగిరీని బట్టి కుండ, బకెట్, స్టీల్ బిందె, స్టీల్ డబ్బాల సైజులను ఎంపిక చేసి పార్శిల్ ఇస్తున్నారు. ఇంటిల్లిపాది ఆరగించాక మిగిలిన బకెట్, బిందె, డబ్బాలను ఇంట్లో వినియోగించుకునేందుకు ఆహార ప్రియులు ఆసక్తి చూపడంతో ఈ తరహా విక్రయాలకు డిమాండ్ పెరిగింది. నిన్న మొన్నటివరకు మెట్రోలకే పరిమితమైన ఈ కల్చర్ ఇప్పుడు గ్రామాలకూ పాకింది. స్విగ్గీ, జొమాటో తదితర ఆన్లైన్ సర్వీసుల ద్వారా కూడా కుండ, బకెట్, బిందె బిర్యానీలు ఆర్డర్ ఇస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కుండ బిర్యానీ క్రేజే వేరు మట్టి కుండలో వండే బిర్యానీకి ఉండే క్రేజే వేరు. తొలినాళ్లలో కుండలోనే బిర్యానీ వండి విక్రయిస్తే.. ఇప్పుడు భారీ గిన్నెల్లో వండిన బిర్యానీని కుండల్లో నింపి విక్రయిస్తున్నారు. కోనసీమలోని రావులపాలెంలో కుండ బిర్యానీ ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు విజయవాడ, విశాఖపట్నంతోపాటు రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాలకు కుండ బిర్యానీ విక్రయాలు విస్తరించాయి. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు పంజాబ్, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కుండ బిర్యానీ చాలా ఫేమస్ అయిపోయింది. కాగా.. రెడ్, గ్రీన్, బ్లూ బకెట్ బిర్యానీల ట్రెండ్ కూడా రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ తదితర నగరాల్లో వీటి విక్రయాలు పెరిగాయి. ఎంత మందికి బిర్యానీ కావాలో చెప్పి అందుకు తగిన ధర చెల్లిస్తే సరిపడా సైజు బకెట్లో బిర్యానీ పార్శిల్ ఇస్తున్నారు. కొన్ని రోజుల క్రితం విశాఖపట్నంలో స్టీల్ బిందె, స్టీల్ డబ్బా బిర్యానీలు రంగప్రవేశం చేయగా.. వాటికి మంచి డిమాండ్ ఏర్పడింది. బిర్యానీ ఏటీఎం వచ్చేసింది దేశంలో తొలిసారిగా తమిళనాడులోని కొలత్తూర్లో ఓ స్టార్టప్ కంపెనీ బిర్యానీ ఏటీఎం తెరిచింది. ఏటీఎం మెషిన్లో 32 అంగుళాలతో ఏర్పాటు చేసిన టచ్ స్క్రీన్పై వినియోగదారుడి పేరు, ఫోన్ నంబర్ నమోదు చేస్తే మెనూ వస్తుంది. కావాల్సిన బిర్యానీని ఎంపిక చేసి.. ధర మొత్తాన్ని క్రెడిట్ కార్డు లేదా యూపీఐ స్కాన్ ద్వారా చెల్లిస్తే.. మనం ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ పార్శిల్ ఏటీఎం నుంచి అందుబాటులోకి వస్తుంది. -
బొంగు బిర్యానీ, బకెట్ బిర్యానీ, కుండ బిర్యానీ.. యాక్ ఛీ! బాత్రూం బిర్యానీ!
ప్రశాంత్నగర్ (సిద్దిపేట): ఘుమఘుమలాడే బిర్యానీ అంటే ఎవరికై నా ఇష్టమే.. కానీ బిర్యానీ తయారీకి ఉపయోగించే బియ్యం కడిగేది బాత్రూంలోని నీటితో అని తెలిస్తే?.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ రెస్టారెంట్లో బిర్యానీకి ఉపయోగించే బియ్యాన్ని బాత్రూంలోని నీటితో శుభ్రపరుస్తున్నారు. దీన్ని ఓ వినియోగదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో.. ఎందుకు బాత్రూంలో బిర్యానీ బియ్యం కడుగుతున్నారని నిర్వాహకుల్ని వినియోగదారుడు ప్రశ్నిస్తే.. నీటి సమస్య వల్ల ఇలా చేస్తున్నట్టు ఇచ్చిన సమాధానం స్పష్టంగా వినిపిస్తోంది. దీంతో నెటిజన్లు.. ‘బొంగు బిర్యానీ, బకెట్ బిర్యానీ, కుండ బిర్యానీ, బిందె బిర్యానీ, స్టీల్ డబ్బా బిర్యానీ.. ఇలా చాలా రకాలను మీరు చూసి ఉంటారు.. కానీ మా సిద్దిపేటలో సరికొత్త బిర్యానీ ఆవిష్కరించారు.. అదే బాత్రూం బిర్యానీ.. తినండి సూపర్ టేస్ట్’.. అంటూ.. సోషల్మీడియాలో సైటెర్లు విసురుతున్నారు. (చదవండి: రాష్ట్రంలో పెద్ద పులుల గాండ్రింపు!)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement