-
‘గొర్రెల’కు మంగళం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం అటకెక్కినట్టే కనిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై ఒక విడత పూర్తయిన ఈ పథకం కింద రెండో విడత గొర్రెలను పంపిణీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మౌఖికంగా వచి్చన ఉన్నతస్థాయి ఆదేశాల మేరకు చడీచప్పుడు లేకుండా గొల్ల కుర్మలు కట్టిన డీడీలను పశుసంవర్ధక శాఖ అధికారులు వెనక్కు ఇచ్చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక దరఖాస్తును కూడా రూపొందించిన ప్రభుత్వం.. ఆ దరఖాస్తు పెట్టుకున్న గొల్లకుర్మల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. గత నెలరోజులుగా..: ఈ డీడీల వాపస్ ప్రక్రియ నెల రోజుల క్రితమే ప్రారంభమైందని, జిల్లాల వారీగా వరుసగా డీడీలు వెనక్కు ఇస్తున్నారని, కొన్ని జిల్లాల్లో రెండు, మూడు రోజుల కిందటే ప్రారంభించామని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం కింద ఇప్పటివరకు 4 లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేశారు. మరో 3,37,816 మంది గొల్లకుర్మలకు రెండో విడతలో గొర్రెలు ఇవ్వాల్సి ఉండగా, గత ఎన్నికల కంటే ముందు సుమారు 80 వేల మంది రూ.43,750 చొప్పున డీడీలు తీసి గొర్రెలెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. కానీ, ప్రభుత్వం అకస్మాత్తుగా డీడీలు వాపస్ చేస్తుండటం గమనార్హం. ప్రత్యేక దరఖాస్తు రూపొందించి మరీ... వాస్తవానికి, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు పెట్టిన మేనిఫెస్టోలో కూడా గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రస్తావించింది. తాము అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని కొనసాగిస్తామని, 90 రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీ పథకాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచి్చంది. కానీ, అందుకు విరుద్ధంగా ఇప్పుడు ప్రత్యేక దరఖాస్తు రూపొందించి మరీ గొల్లకుర్మలు కట్టిన డీడీలను వారికి వెనక్కు ఇచ్చేస్తుండటం గమనార్హం. అయితే, మంత్రివర్గంలో ఎవరికీ కేటాయించకపోవడంతో సీఎం రేవంత్రెడ్డి పరిధిలోకే పశుసంవర్ధక శాఖ వస్తుంది. నేరుగా సీఎం పర్యవేక్షణలోకి రావడంతో శాఖ కార్యకలాపాల గురించి ఆయనకు చెప్పేందుకు అధికారులు ముందుకు వెళ్లలేని పరిస్థితి. అసలు గొర్రెల పథకం గురించి చర్చ జరిగింది ఒక్కసారేనని, ఈ చర్చ తర్వాతే ఉన్నతాధికారులు కొందరిపై రేవంత్ చర్యలు తీసుకున్నారని అధికారులంటున్నారు. అయితే, డీడీలు వెనక్కు ఇవ్వాలని నిజంగానే రేవంత్ ఆదేశాలిచ్చారా లేక అధికారులే చొరవ తీసుకుని ఈ పథకానికి మంగళం పాడేందుకు సిద్ధమవుతున్నారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో పథకం అమలులో అవినీతి జరిగితే ఈ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసి గొల్లకుర్మలకు మేలు చేయాలే కానీ ఏకంగా పథకాన్ని తీసేవిధంగా వ్యవహరించడమేంటనే చర్చ జరుగుతోంది. డీడీలు వెనక్కు ఇస్తున్న ప్రక్రియపై గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ మాట్లాడుతూ.. గతంలో మాదిరి కాకుండా అవినీతికి తావు లేకుండా నగదు బదిలీ ద్వారా పథకాన్ని అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. డీడీలను వాపస్ చేయడాన్ని వెంటనే నిలిపివేసి అసలు ఈ పథకాన్ని కొనసాగిస్తారా లేదా అన్నదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. -
హైకోర్టు జడ్జీల ఫోన్లనూ ట్యాప్ చేశాం
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు ఆదేశాల మేరకు తాము హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లనూ ట్యాప్ చేశామని ఈ కేసులో నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు బయటపెట్టారు. తాము నిఘా ఉంచి, పర్యవేక్షించిన వారిలో జస్టిస్ శరత్ కాజా కూడా ఉన్నారని వెల్లడించారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో 2024 మార్చి 23న అరెస్టయిన భుజంగరావును పోలీసులు రెండుసార్లు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పలు విషయాలు వెల్లడించినట్లు నేరాంగీకార వాంగ్మూలాల్లో పొందుపరిచిన పోలీసులు.. వీటిని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాటిలోని వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మిర్యాల గ్రామానికి చెందిన భుజంగరావు 1991లో ఎస్సైగా ఎంపికయ్యారు. మల్కాజిగిరి, నాచారం, వనస్థలిపురంలో పనిచేసి, 2005లో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు. మాదాపూర్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించిన తర్వాత డిప్యుటేషన్పై 2011 జనవరి నుంచి 2014 ఫిబ్రవరి వరకు ట్రాన్స్కోలో పనిచేశారు. పదోన్నతి పొందిన తర్వాత 2014–15 మధ్య ఎస్ఐబీలో డీఎస్పీగా పని చేశారు. అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన తర్వాత 2021లో డిప్యుటేషన్పై నిఘా విభాగంలోకి వెళ్లారు. గత ఏడాది డిసెంబర్ 16 వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ వ్యవహారాలు పర్యవేక్షించారు. బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తేవడానికి... భుజంగరావు ఇంటెలిజెన్స్లో టాప్ సీక్రెట్ సెల్ అనే స్పెషల్ వింగ్ను పర్యవేక్షించారు. ఇందులో తనకు నమ్మకస్తులైన ఇన్స్పెక్టర్లు చలపతి, శ్రీధర్, ఎస్సై సెయింట్ ప్రభాకర్ రాజు, ఏఎస్సైలు నర్సింగ్ రావు, జంగయ్య కీలకంగా వ్యవహరించారు. భుజంగరావు రాజకీయ నాయకుల కార్యకలాపాలతోపాటు అసమ్మతి నేతలు, ప్రతిపక్ష పార్టీల్లోని పరిస్థితులను గమనిస్తూ వివరాలను ఉన్నతాధికారులకు ఇచ్చేవారు. ఇంటెలిజెన్స్లో పని చేస్తుండగానే భుజంగరావుకు ప్రభాకర్ రావుతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి సామాజిక వర్గం ఒకటే కావడంతో బాగా దగ్గరయ్యారు. ప్రభాకర్రావు 2020 జూన్లో పదవీ విరమణ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన్ను ఓఎస్డీ హోదాలో చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్గా నియమించింది. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదంతో 2020 నవంబర్లో నిఘా విభాగాధిపతిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయన తన సామాజిక వర్గానికి చెందిన, తనకు నమ్మకమైన వారిని నిఘా విభాగంలోకి తీసుకురావడం ప్రారంభించారు. డీఎస్పీ ప్రణీత్రావు, అదనపు ఎస్పీగా రిటైర్ అయిన వేణుగోపాల్ రావు, అదనపు ఎస్పీ తిరుపతన్నల, వెంకట్రావు ఇలా ఎస్ఐబీలోకి వచి్చనవారే. ప్రత్యర్థి పార్టీల నాయకులతోపాటు బీఆర్ఎస్లోని తిరుగుబాటుదారులను పర్యవేక్షించడం, వారికి సంబం«ధించిన ఆర్థిక వనరులను దెబ్బతీయడం ద్వారా బీఆర్ఎస్ను మూడోసారి అధికారంలోకి తీసుకురావడానికి వీళ్లు పని చేశారు. దీనికోసం ఎస్ఐబీ, నిఘా విభాగాల్లో ఉన్న అన్ని వనరులనూ వినియోగించుకున్నారు. ఎవరి నిఘాకు చిక్కకుండా... హైదరాబాద్ నగరంపై పట్టు నిలుపుకోవడం కోసం బీఆర్ఎస్ నాయకులు పి.రాధాకిషన్రావును టాస్్కఫోర్స్ ఓఎస్డీగా నియమించుకున్నారు. ఇన్స్పెక్టర్ గట్టుమల్లు రాధాకిషన్ రావు ద్వారానే ఎస్ఐబీలోకి వచ్చారు. భుజంగరావు సహా అంతా బీఆర్ఎస్ కోసం పనిచేసేలా ఒప్పించిన ప్రభాకర్రావు అందుకు ప్రతిఫలంగా వారికి యాక్సిలేటరీ పదోన్నతులు, వివిధ పతకాలతోపాటు ఇన్సెంటివ్స్ కూడా ఇప్పించేవాడు. వీళ్లంతా ఎవరి నిఘాకు చిక్కకుండా ఉండేందుకు వీళ్లంతా వాట్సాప్ వంటి ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లోనే సంప్రదింపులు జరిపారు. 2018కి ముందు అప్పటి నిఘా చీఫ్ నవీన్ చంద్ ద్వారా ప్రభాకర్రావు ఏర్పాటు చేయించిన స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పని తీరు రానురాను మారిపోయింది. ప్రణీత్రావు చేతికి వచ్చిన తర్వాత కేవలం అక్రమ ఫోన్ ట్యాపింగ్ కోసమే పని చేసింది. బీఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థుల సమాచారాన్ని సేకరించే భుజంగరావు ఆ వివరాలను ప్రభాకర్రావుతోపాటు ప్రణీత్కు ఇచ్చి వారి ఫోన్లు ట్యాపింగ్ చేయించేవాడు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ప్రణీత్ ఇచి్చన సమాచారంతోనే ఆ పట్టణ శివార్లలో రూ.కోటి నగదు పోలీసులు స్వా«దీనం చేసుకోగలిగారు. వాట్సాప్ గ్రూప్ల ఏర్పాటు సాధారణంగా నిఘా విభాగం ఓ ఫోన్ నంబర్ను నిఘాలో ఉంచాలన్నా, ట్యాప్ చేయాలన్నా అదనపు డీజీ అనుమతి తీసుకోవాలి. అయితే ఆ అవసరం లేకుండా నేరుగా ఏ నంబర్ అయినా ట్యాప్ చేసే స్వేచ్ఛను భుజంగరావుకు ప్రభాకర్రావు ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కామారెడ్డిలోనూ పోటీ చేశారు. ఆయన్ను గెలిపించడం కోసం ప్రతిపక్ష పార్టీల నేతలను దెబ్బతీయడానికి ప్రభాకర్రావు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. బీజేపీ అభ్యర్థి కె.వెంకట రమణారెడ్డి, రేవంత్రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి కదలికలను ట్రాక్ చేయడానికి డీఎస్పీ తిరుపతన్న నేతృత్వంలో ప్రత్యేక బృందం పని చేసింది. దీనికోసం ప్రణీత్ ఎస్ఐబీ టీమ్తో ‘కేఎంఆర్’పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. గత ఎన్నికల సమయంలో హైదరాబాద్తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిపక్షాలకు చెందిన నగదును పట్టుకోవడానికీ తిరుపతన్న టీమ్ పని చేసింది. దీనికోసం ‘పోల్–2023’పేరుతో మరో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. దాదాపు 15 కీలక ఆపరేషన్లలో ప్రతిపక్షాలకు చెందిన నగదు పట్టుకోవడంతోపాటు ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలు చేశారు. విద్యార్ధి, కులసంఘాల నాయకుల పైనా... ప్రభాకర్రావు నేతృత్వంలోని ఎస్ఐబీ అధికారులు ప్రభుత్వాన్ని విమర్శించే విద్యార్థి సంఘాల, కులసంఘాల నాయకుల పైనా నిఘా ఉంచారు. జర్నలిస్టులు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన ముఖ్యమైన కేసులను వాదించే న్యాయవాదుల ఫోన్లతోపాటు వారి వ్యక్తిగత జీవితాలనూ ప్రభాకర్రావు మానిటర్ చేయించారు. ఈ వివరాలన్నీ తెలుసుకోవడం ద్వారా వారిని ప్రభావితం చేయడం లేదా భయపెట్టాలని భావించారు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి బయటకు రావడంతోపాటు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్పై ఆందోళన చేయడం, కేటీఆర్, ఎమ్మెల్యేలకు ఎర కేసులపై వ్యాఖ్యలు చేయడం, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం తదితర సందర్భాల్లో ఆయన కదలికలు, ఫోన్పై నిఘా కొనసాగిందని భుంజగరావు చెప్పారు. ప్రధానంగా ప్రతిపక్షాలను ఇరుకున పెట్టాలని, ఆర్థికంగా దెబ్బతీయాలని బీఆర్ఎస్కు లాభం చేకూర్చాలనే లక్ష్యాలతోనే తాము పని చేసినట్లు అంగీకరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఊహించని విధంగా ఓడిపోవడంతో ప్రభాకర్రావు ఆదేశాల మేరకు ట్యాపింగ్, అక్రమ నిఘాకు సంబంధించిన సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడానికి భుజంగరావు సహా అధికారులంతా కలిసి కుట్ర చేసి అమలుపరిచారని పోలీసులు కోర్టుకు తెలిపారు. -
టాస్క్ఫోర్స్ కేంద్రంగా వసూళ్ల పర్వం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అగ్ర నాయకుల ఆదేశాల మేరకు, ఆ పార్టీ కోసం హైదరాబాద్ టాస్క్ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకి షన్రావు భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడినట్లు అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఏఎస్పీ నాయిని భుజంగరావు పోలీసుల ఎదుట వెల్లడించారు. నగరంలో ఆయనకున్న వనరులను అనుకూలంగా మార్చుకుని ఈ దందాలు చేసినట్లు నేరాంగీకార వాంగ్మూలంలో బయటపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ టాస్క్ఫోర్స్ కేంద్రంగా సాగిన వ్యవహారాలను ఈ వాంగ్మూలా ల్లో పోలీసులు పొందుపరిచారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభా కర్రావు నాటి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ నవీన్రావు పేర్లు చెప్పి సైబరాబాద్ పోలీసులను ప్రభావితం చేసినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ అగ్రశ్రేణి నాయకుల ఆదేశాల మేరకు పనిచేసిన రాధాకిష న్రావు టాస్క్ఫోర్స్ కార్యాలయంలో వ్యాపారులు, ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన సెటిల్మెంట్లు పెద్దఎత్తున చేశారు. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల నగదు రవాణాలోనూ రాధాకిషన్రావు కీలకంగా వ్యవహరించారు. దీనికోసం తన టాస్క్ఫోర్స్ను వినియోగించడంతోపాటు ప్రతిమ, యశోద ఆస్పత్రుల యజమానుల సహకారం తీసుకున్నాడు. 15 ఆపరేషన్లు చేసిన తిరుపతన్న టీమ్తనతోపాటు ప్రభాకర్రావు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ తిరుపతన్న హైదరాబాద్ టాస్క్ఫోర్స్, సైబరాబాద్, రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ సహకారం తీసుకున్నారని భుజంగరావు వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నగదు పట్టుకోవడం కోసం ప్రత్యేక టీమ్తో పని చేశారు. ఇందులో ఇద్దరు ఇన్స్పెక్టర్లు, పది మంది కానిస్టేబుళ్లు, మరో పది మంది హెడ్ కానిస్టేబుళ్లను నియమించుకున్నారు. తిరుపతన్న రోజూ గరిష్టంగా 40 ఫోన్లు ట్యాప్ చేశారు. తన కార్యాలయంలో మూడు సిస్టమ్స్తోపాటు తొమ్మిది లాగర్స్ను ఏర్పా టు చేసుకున్నారు. ఇలా వివిధ మార్గాల నుంచి వచ్చిన సమాచారంతో 15 ఫీల్డ్ ఆపరేషన్లు చేశారు. రేవంత్రెడ్డి మిత్రులు గాలి అనిల్కుమార్ నుంచి రూ.90 లక్షలు, కె.వినయ్రెడ్డి నుంచి రూ.1.95 కోట్లు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి చెందిన రాఘవ ఇన్ఫ్రా నుంచి రూ.10.5 కోట్లు, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మిత్రు డు సీహెచ్ వేణు దగ్గర రూ.3 కోట్లు, జి.వినోద్కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ నుంచి రూ.50 లక్షలు, ఉత్తమ్కుమార్రెడ్డి మిత్రుడు గిరిధర్ నుంచి రూ.35 లక్షలు, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డి నుంచి రూ.90 లక్షలు, ఖమ్మంలో ఫెర్టిలైజర్ సంస్థ యజమాని నుంచి రూ.10 లక్షలు స్వాధీనం చేసు కోవడంలో తిరుపతన్న కీలకంగా వ్యవహరించారు. -
రైతులపై దాడి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: అదిలాబాద్లో రైతన్నలపైన లాఠీచార్జిని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రైతన్నలపైన దాడి చేసిన ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన ‘ఎక్స్’ వేదికగా డిమాండ్ చేశారు. ‘‘ రాష్ట్రంలో రైతన్నలపైన దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండడం సిగ్గుచేటు. రాజకీయాలు పక్కన పెట్టి రైతన్నల సమస్యలను పట్టించుకోవాలని ముఖ్యమంత్రికి సూచన. ఐదు నెలల్లోనే రాష్ట్రం వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోవడం ముమ్మాటికి ప్రభుత్వ పరిపాలన వైఫల్యమే. రాష్ట్రంలో రైతన్నల సమస్యలపైన ముఖ్యమంత్రి వెంటనే ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలి. రైతన్నలపైన లాఠీచార్జ్ చేసిన అధికారులపైన కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలి. రైతన్నలపైన ప్రభుత్వ దాడులు బిఆర్ఎస్ పార్టీ ఊరుకోదు’’అని కేటీఆర్ మండిపడ్డారు.‘‘ విత్తనాల కోసం బారులు తీరిన రైతన్నలపై లాఠీచార్జ్ అత్యంత దారుణం, ఇది రైతన్నలపైన ప్రభుత్వ దాడి. ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లో రాష్ట్ర వ్యవసాయం ముఖ్యంగా రైతన్నల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. రైతన్నలకు కావాల్సిన సాగునీటి నుంచి మొదలుకొని, రైతుబంధు పెట్టుబడి సహాయం వరకు, చివరికి కనీసం విత్తనాలు అందించలేని దుర్మార్గపూరిత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మార్పు తెస్తాం, ప్రజా పాలన అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రైతన్నలపైన లాఠీఛార్జ్ పేరుతో దాడులు చేయడమే కాంగ్రెస్ పార్టీ తీసుకువస్తామన్న మార్పా?’’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.ఆదిలాబాద్ లో రైతన్నలపై లాఠీచార్జిని తీవ్రంగా ఖండించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.రైతన్నలపై దాడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి.రాష్ట్రంలో రైతన్నలపైన దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనలో బిజీగా… pic.twitter.com/5ZVCew2IKV— BRS Party (@BRSparty) May 28, 2024 -
కవిత లిక్కర్ కేసు: నేడు ఈడీ, సీబీఐ కౌంటర్ వాదనలు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ( మంగళవారం) ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. కవిత బెయిల్ పిటిషన్ను జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించనున్నారు. నిన్న(సోమావారం) కవిత తరపున ముగిసిన వాదనలు ముగిశాయి. ఇవాళ ఈడీ, సీబీఐ వాదనలు వినిపించనున్నారు. ఈడీ, సీబీఐ వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేస్తామని న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. సీబీఐ, ఈడీ దర్యాప్తుకు సహకరించిన నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ‘‘కవిత అరెస్టు చట్టబద్ధంగా జరగలేదు. తనకు మైనారిటీ తీరని పిల్లలు ఉన్నారు. మహిళా అనే కోణంలో బెయిల్ ఇవ్వాలి. తనకు వ్యతిరేకంగా వాంగ్మూలం వచ్చిన మాగుంట ఎన్డీఏ తరఫున అభ్యర్థిగా పోటీ చేశారు. బీజేపీకి రూ. 50 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చారు. 2022లో కేసు నమోదు అయితే 2024లో కవిత అరెస్టు జరిగింది. రాజకీయ కక్ష సాధింపుతో కవితపై కేసు పెట్టారు’’ అని ఢిల్లీ కోర్టులో కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి సోమవారం వాదనలు వినిపించించారు. ఇది వరకే ఈడి, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్లు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో కవిత ఢిల్లీ హైకోర్టులో ఆశ్రయించారు. లిక్కర్ కేసులో అరెస్టయి రెండు నెలలకుపైగా కవిత తిహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వినిపించిన వాదనలు..కవితను అరెస్ట్ చేయమని ఈడీ సుప్రీం కోర్టుకు చెప్పిందిసుప్రీంకోర్టులో ఈడీ కోర్టు ధిక్కరణకు పాల్పడిందిరాజకీయ కారణాలతో పక్షపాత ధోరణితో ఈడీ అధికారులు వ్యవహరించారుమా వాదన వినకుండానే సీబీఐ ఇంటరాగేషన్కు ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చిందిసమాచారం ఇవ్వకుండానే సీబీఐ నన్ను అరెస్టు చేసింది: బెయిల్ రిక్వెస్ట్లో కవితఈ అంశాలపై ఎలాంటి కోర్టు ఉత్తర్వులు అప్ లోడ్ చేయలేదుపూర్తి రహస్యం పాటించడం ఎందుకు ?సీబీఐ విచారణ, అరెస్టు లో చట్టపరమైన ప్రక్రియ పాటించలేదుఈడీ కేసులో ఇప్పటివరకు ఏడు చార్జిషీట్ లు దాఖలు చేసిందిమహిళను విచారణ కోసం కార్యాలయానికి పిలవకూడదుకేసు నమోదు చేసినప్పుడు కవిత పేరే లేదుఈ విచారణలో సమీర్, బుచ్చిబాబు, మాగుంట నా పేరు చెప్పారుబెయిల్ కి ఉన్న గ్రౌండ్స్ ఏమిటి అని అడిగిన జడ్జికేసు గురించి అన్ని విషయాలు తెలుసన్న జడ్జికవితని అరెస్టు చేయాల్సిన అవసరం లేదు, దాని వల్ల ఈడి కి వచ్చి లాభం ఏమిటి ? అని కవిత తరపు న్యాయవాది వాదనలునేను గత మార్చి లో వరుసగా మూడు రోజులు విచారణకు వచ్చాసూర్యాస్తమయం తర్వాత కూడా నన్ను విచారించారునా మొబైల్ ఫోన్ ను కూడా ఇచ్చానుమహిళ ఫోన్లోకి తొంగి చూశారురైట్ టు ప్రైవసికి భంగం కలిగించారుకొత్త మోడల్ ఫోన్ లు రావడంతో పాత ఫోన్లు పని మనుషులకు ఇచ్చానుఆ ఫోన్లు పని మనుషులు ఫార్మాట్ చేశారు.. నాకేం సంబంధం లేదుకస్టడీ లో ఉన్న నిందితులతో కలిపి నన్ను ఈడి విచారణ జరపలేదుఎన్నో చార్జిషీట్లు దాఖలు చేసినా నా పేరు ఎక్కడ ప్రస్తావించలేదుమాగుంట శ్రీనివాసులురెడ్డి నాకు వ్యతిరేకంగా 164 స్టేట్మెంట్ ఇచ్చారుఆ తర్వాత రూ.50 కోట్లు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారుఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేశారుఅరెస్టు చేయమని సుప్రీం కోర్టు కి చెప్పి ఆ తర్వాత మాట తప్పి, కవితని అరెస్టు చేశారుసీబీఐ సమన్లు అన్నింటికీ నేను సహకరించా: బెయిల్ రిక్వెస్ట్లో కవితమహిళను, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అందులో ఒకరు మైనర్: బెయిల్ రిక్వెస్ట్లో కవితనేను ఒక రాజకీయ నాయకురాల్ని: బెయిల్ రిక్వెస్ట్లో కవితబెయిల్ కు ఎలాంటి షరతులు పెట్టినా ఓకే: బెయిల్ రిక్వెస్ట్లో కవిత -
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ‘తెలంగాణ దశాబ్ది ముగింపు వేడుకలు’ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్ 1 నుంచి మూడు రోజులపాటు బీఆర్ఎస్ అధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరపాలని ఆదేశించారు. 14 ఏళ్లు పోరాడి తెలంగాణను సాధించి, స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దశాబ్దకాలంపాటు తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత బీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వానిదేనని కేసీఆర్ పునరుద్ఘాటించారు.ఈ చారిత్రక సందర్భంలో దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ సూచనలను అనుసరించి గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా వేడుకల్లో పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కేసీఆర్ పార్టీ కార్యకర్తలను, నేతలను కోరారు. ముగింపు ఉత్సవాలు ఇలా: జూన్ 1న సాయంత్రం 7 గంటలకు గన్పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్బండ్ వద్ద ఉన్న అమర జ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధనలో ప్రాణాలఅరి్పంచిన అమరులకు పుష్పాంజలి ఘటించి నివాళి అర్పిస్తారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ రోజున హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన సభ నిర్వహిస్తారు.ఇదే రోజు హైదరాబాద్లోని పలు దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, మిఠాయిలు పంపిణీ చేస్తారు. జూన్ 3న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల్లో ముగింపు వేడుకలు నిర్వహిస్తా రు. ఈ సందర్భంగా పార్టీ జెండాను, జాతీయ జెండాను ఎగురవేస్తారు. జిల్లా ల్లోని దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో స్వీట్లు, పండ్లు పంపిణీ చేస్తారు. -
బీఆర్ఎస్ నేతలపైనా నిఘా!
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన ఈ నిఘా కేవలం ప్రతిపక్ష నేతలకే పరిమితం కాలేదని, అధికార బీఆర్ఎస్కు చెందిన అసమ్మతి నేతలపైనా సాగినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు, హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్రావు నేతృత్వంలో అనేక అక్రమాలు సాగాయని నేరాంగీకార వాంగ్మూలాల్లో పోలీసులు పేర్కొన్నారు. మొయినాబాద్ ఫామ్హౌస్ ఆపరేషన్ కోసం అవసరమైన నిఘా పరికరాలను ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి కొనుగోలు చేయగా... కేరళకు చెందిన ఓ కీలక వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు ఏకంగా చార్టర్డ్ ఫ్లైట్లో అక్కడకు వెళ్లినట్లు బయటపడింది. పంజగుట్ట పోలీసులు గతంలో అరెస్టు చేసిన మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్రావు, డీఎస్పీ నాయిని భుజంగరావులకు సంబంధించిన నేరాంగీకార వాంగ్మూలాల్లో ఈ కీలకాంశాలను పొందుపరిచిన దర్యాప్తు అధికారులు.. వీటిని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. రోహిత్రెడ్డి ఫామ్హౌస్లో ఆపరేషన్ దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ఆ పారీ్టకి బ్రేక్ వేయాలని నాటి సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. 2022 అక్టోబర్ చివరి వారంలో నాటి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ద్వారా ఓ కీలక విషయం కేసీఆర్కు తెలిసింది. బీఆర్ఎస్ను వీడి తమ పార్టీలో చేరేలా బీజేపీకి చెందిన కొందరు వ్యక్తులు ఎర వేస్తున్నారంటూ రోహిత్రెడ్డి నాటి సీఎంకు చెప్పారు. అప్పటికే మునుగోడు ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీని ఇరుకున పెట్టాలని నిర్ణయించుకున్న కేసీఆర్ ఈ విషయాన్ని ప్రభాకర్రావు, రాధాకిషన్రావులకు అప్పగించడంతోపాటు వారికి సహకరించాలని రోహిత్రెడ్డిని ఆదేశించారు. డీఎస్పీ ప్రణీత్రావు ద్వారా కొందరు ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టడం ద్వారా కీలక విషయాలు రాబట్టారు. ఈ ఆడియో క్లిప్స్ను కేసీఆర్కు అందించారు. వీటి ఆధారంగా మొయినాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో ఉన్న రోహిత్రెడ్డి ఫామ్హౌస్లో ప్రత్యేక ఆపరేషన్కు ప్లాన్ చేశారు. ఫలానా రోజున అక్కడికి రావాలని రోహిత్రెడ్డి ద్వారా నందుతోపాటు ఇద్దరు స్వామీజీలకు సందేశం పంపారు. అప్పట్లో హైదరాబాద్ టాస్క్ఫోర్స్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ శ్రీనాథ్రెడ్డి, ఎస్సై శ్రీకాంత్లను రాధాకిషన్రావు ఢిల్లీకి పంపి ప్రత్యేక స్పై కెమెరాలు ఖరీదు చేయించారు. వీటిని శ్రీకాంత్తోపాటు మరో ఇద్దరు ఎస్సైలు మల్లికార్జున్, అశోక్రెడ్డి ఫామ్హౌస్లో బిగించారు. రోహిత్రెడ్డితోపాటు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను స్వయంగా కేసీఆర్ రంగంలోకి దింపారు. క్షేత్రస్థాయిలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఆపై ఏర్పాటైన సిట్ ద్వారా ఆర్ఎస్ఎస్ కీలక నేత బీఎల్ సంతోష్ను అరెస్టు చేయించాలని తద్వారా బీజేపీని దారిలోకి తెచ్చుకుని తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై ఉన్న ఈడీ కేసు నీరుగారేలా చేయాలని భావించారు. కొందరు సైబరాబాద్ పోలీసుల అసమర్థత కారణంగా కేరళలోని మాతా అమృతానందమయి ఆశ్రమానికి చెందిన ఒక ముఖ్యమైన వ్యక్తి తప్పించుకున్నాడు. దీంతో ఆయన్ను పట్టుకోవడానికి ఎస్పీ రెమా రాజేశ్వరి, ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లుతో కూడిన బృందాన్ని ఏకంగా చార్టర్డ్ ఫ్లైట్లో అక్కడకు పంపించారు. ఈ ప్రయత్నమూ సఫలీకృతం కాకపోవడంతోపాటు ఆయా నిందితులను అరెస్టు చేయొద్దని, కేసును సీబీఐకి అప్పగించాలని న్యాయస్థానం నుంచి ఆదేశాలు రావడంతో అంతా అసంతృప్తి చెందారు. తాను అనుకున్నది జరగకపోవడంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు ఇబ్బందికరంగా ఉన్న పరిణామాలను గుర్తించి... ప్రభాకర్రావు, రాధాకిషన్రావు మధ్య తరచూ వివిధ నియోజకవర్గాల్లోని రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిగేవి. బీఆర్ఎస్తోపాటు దాని నాయకులకు ఇబ్బందికరంగా ఉన్న పరిణామాలను వీళ్లు గుర్తించే వాళ్లు. ఈ సమాచారాన్ని ప్రణీత్కు పంపి ఆయా వ్యక్తులపై నిఘా పెట్టమని ఆదేశించే వాళ్లు. ఇలా ఎస్ఐబీ నిఘా ఉంచిన వారిలో బీఆర్ఎస్కు చెందిన వాళ్లూ ఉండటం గమనార్హం. నాటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదించిన అప్పటి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, అప్పట్లో కడియం శ్రీహరితో విభేదాలు ఉన్న మాజీ మంత్రి టి.రాజయ్య, తాండూరు ఎమ్మెల్యేపై అసంతృప్తిగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి దంపతులతోపాటు మాజీ ఐపీఎస్ అధికారి, నాటి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, రెండు మీడియా సంస్థల అధినేతలు, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్, గద్వాలకు చెందిన సరిత తిరుపతయ్య, కోరుట్ల వాసి జువ్వాడి నర్సింగరావు, అచ్చంపేటకు చెందిన వంశీకృష్ణ, మానకొండూరుకు చెందిన కవ్వంపల్లి సత్యనారాయణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, బండి సంజయ్ల ఫోన్లు ట్యాప్ చేశారు. వీరితోపాటు వివిధ నిర్మాణ సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన యజమానులు, వ్యాపారవేత్తల ఫోన్ల పైనా అక్రమ నిఘా ఉంచారు. ఫోన్ కాల్స్కు దూరంగా ఉన్న వారిపై.. ఎస్ఐబీ నిఘా ఉంటుందన్న భయంతో అప్పట్లో అనేక మంది రాజకీయ నాయకులు, న్యాయాధికారులు, ప్రభుత్వ అధికారులు ఫోన్ కాల్స్కు దూరంగా ఉన్నారు. వీళ్లు ఎక్కువగా సిగ్నల్, స్నాప్చాట్ తదితర సోషల్ మీడియాను వినియోగిస్తూ ఎ¯న్క్రిపె్టడ్ విధానంలో మాట్లాడటం ప్రారంభించారు. దీన్ని గుర్తించిన ప్రభాకర్రావు, ప్రణీత్రావు.. వారు ఎవరితో మాట్లాడారో గుర్తించడానికి వారి ఐపీడీఆర్లు (ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్స్) సేకరించి, విశ్లేషించారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్టోబర్–నవంబర్ల్లో ట్యాపింగ్ మరింత పెరిగింది. నాటి మంత్రి టి.హరీశ్రావు సిఫార్సుతో ఐన్యూస్ సంస్థ అధినేత శ్రావణ్ కుమార్ ప్రభాకర్రావుతో సన్నిహితంగా మెలిగారు. అనేక సందర్భాల్లో ఆయన వాట్సాప్ ద్వారా ప్రణీత్రావుతో టచ్లో ఉన్నారు. అలా కాంగ్రెస్, బీజేపీ నాయకులు, వారి మద్దతుదారుల వివరాలు సేకరించి అందించే వారు. ప్రత్యర్థి నాయకులను లక్ష్యంగా చేసుకుని వారి నగదును స్వా«దీనం చేసుకోవడానికి, టార్గెట్ చేసిన వ్యక్తులను ట్రోల్ చేయడానికి శ్రావణ్ పూర్తి సహాయ సహకారాలు అందించారు. తాను 2020లో పదవీ విరమణ చేసిన తర్వాత రెండుసార్లు టాస్క్ఫోర్స్ ఓఎస్డీగా పెద్దాయన (కేసీఆర్) అవకాశం ఇచ్చారని, ఈ విశ్వాసంతో కొన్ని కేసులకు అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు బయటపెట్టనని రాధాకిషన్రావు వాంగ్మూలంలో పేర్కొన్నారు. -
తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతున్న ధాన్యం కొనుగోళ్లు
-
ముగిసిన ఖమ్మం-వరంగల్-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్
Updatesముగిసిన ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్క్యూ లైన్లలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశంమహబూబాబాద్ 2 గంటల వరకు పోలింగ్ శాతంపురుషులు: 10745మహిళలు: 6462మొత్తం: 17207శాతం: 49.26% సూర్యాపేట జిల్లా :ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ 2 గంటల వరకు 52.8 శాతంMale: 17968Female: 9220Total: 27188యాదాద్రి భువనగిరి జిల్లాజిల్లాలో 2 గంటల వరకు 47.92 శాతం నమోదుపురుషులు:9673మహిళలు: 6659మొత్తం: 16332శాతం: 47.92 జనగామ జిల్లా:జనగామ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మధ్యాహ్నం 2:00 గంటల వరకు 49.66% పోలింగ్ నమోదు వరంగల్ జిల్లా వరంగల్-ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికలలో ఉదయం 12:00 గంటల వరకు పోలింగ్ శాతం 30.18 %జనగామ జిల్లా:జనగామ జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం 12:00 గంటల వరకు 28.38% పోలింగ్ నమోదుమహబూబాబాద్ జిల్లా:వరంగల్-ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలలో ఉదయం 12:00 గంటల వరకు 28.49 పోలింగ్ శాతం నమోదుహనుమకొండ: ప్రశాంతంగా కొనసాగుతున్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్మధ్యాహ్నం 12గంటల వరకు హనుమకొండ జిల్లాలో పోలింగ్ శాతం 32.90యాదాద్రి భువనగిరి జిల్లాజిల్లాలో మధ్యాహ్నం 12 గంటల వరకు 27.71 శాతం నమోదు పురుషులు: 5902మహిళలు: 3543 మొత్తం: 9445 నల్లగొండ జిల్లా:జిల్లాలో మధ్యాహ్నం 12 గంటల వరకు 29.30 పోలింగ్ శాతం నమోదునల్గొండ:సూర్యాపేట జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ శాతం 31.27%పురుషులు: 10813మహిళలు: 5290మొత్తం: 16103 నల్గొండ:మిర్యాలగూడలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సరళిని పరిశీలించిన బీఆర్ఎస్ మాజీ మంత్రి గుంతకంట్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు.నల్గొండ:తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్నల్లగొండ:నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి అశోక్కు గన్ మెన్ కేటాయింపునార్కెట్పల్లి గొడవ నేపథ్యంలో అధికారుల నిర్ణయంవరంగల్:మహబూబాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం సమీపంలో ఘర్షణపోలీసులకు ఓటు వేయాలని ప్రసన్నం చేసుకుంటున్న పార్టీ నాయకుల మధ్య స్వల్ప ఘర్షణ200 మీటర్ దూరం లో ఉన్నాం మీ కు ఇబ్బంది ఇంటి అని పోలీసుల తో వాగ్వివాదంనల్లగొండ ఎన్జీ కాలేజ్ లో అధికారుల నిర్లక్ష్యంవికలాంగులు ఓటేసేందుకు కనీస సౌకర్యాలు లేని వైనంమేమేం చేయాలి చైర్లు లేకపోతే అంటూ సిబ్బంది సమాధానంఇబ్బందులు పడుతోన్న వికలాంగులు నల్లగొండ నార్కెట్పల్లి లో ఓ షెడ్డులో డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు నార్కట్పల్లి పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించిన స్వతంత్ర అభ్యర్థి అశోక్తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట స్వతంత్ర అభ్యర్థి అశోక్ నిరసనస్టేషన్ ఎదుట బైఠాయించిన అశోక్ సూర్యాపేటలో 11 శాతం పోలింగ్..సూర్యాపేట జిల్లా:ఎమ్మెల్సీ ఎన్నికలో పది వరకు గంటల పోలింగ్ శాతం:Male: 4258Female: 1570Total: 5828Percentage: 11.32% నల్లగొండ:నార్కెట్పల్లిలో స్వల్ప ఉద్రిక్తతఓపార్టీ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో అక్కడకు వెళ్లిన స్వతంత్ర అభ్యర్థి అశోక్ఇరు వర్గాల మధ్య వాగ్వాదంపోలీసులకు ఫిర్యాదు చేసిన అశోక్ నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న) ఓటు హక్కును వినియోగించుకున్నారు నల్గొండ: సూర్యాపేట: గ్రాడ్యూయెట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 459 బూత్లో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వరంగల్:మహబూబాబాద్ లోని 178వ పోలింగ్ బూత్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్: జనగామ ప్రెస్టన్ కళాశాలలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఖమ్మంఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా చర్ల మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో మందకొడిగా ఓటింగ్ జరుగుతోంది.చర్ల మండలం లో మొత్తం 1122 ఓటర్లు ఉన్నారు.వీరికోసం చర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.గ్రాడ్యుయేట్ లు కూడా అర్ధ రాత్రి వరకు రాజకీయ పార్టీల నేతల రాక కోసం ఎదురు చూశారు.కొంతమంది నాయకులు గ్రాడ్యుయేట్ లను కలిసి అన్ని చూసుకుంటామని చెప్పారని తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోందిమూడు ఉమ్మడి జిల్లాలోని పట్టభద్రులు ఓటు వేయడానికి తరలి వస్తున్నారు వరంగల్:హన్మకొండ పింగిలి కళాశాల పోలింగ్ బూతులో ఓట్లు వేయడానికి క్యూలో ఉన్న పట్టభద్రులు నల్లగొండ:మిర్యాలగూడ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్లో ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు వరంగల్:పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోందిహనుమకొండ పింగళి కాలేజీ పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూర్యాపేట పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోందిసూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైందిఓటు వేయడానికి పట్టభద్రులు తరలి వసున్నారు ఓటు వేయడానికి క్యూలైన్లో నిల్చున్నారు నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రారంభం అయిన పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ వరంగల్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభంవరంగల్- నల్గొండ - ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులువరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,73,413 మంది ఓటర్లు ఉన్నారువీరి కోసం 227 పోలింగ్ కేంద్రాలు 296 బ్యాలెట్ బాక్స్ లు అధికారులు ఏర్పాటు చేశారు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. జూన్ 5వ తేదీన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్నేడు వరంగల్–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది.పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులతో తరలి వెళ్ళిన సిబ్బంది, అధికారులుసోమవారం పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బరిలో 52 మంది ఉన్నా... ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పోటీలో ఉన్నారు.605 పోలింగ్ బూత్లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు.వరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధి 34 అసెంబ్లీ నియోజక వర్గాలలో విస్తరించి ఉంది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం.వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,73,406 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో 1,23,985 మంది ఓటర్లునల్గొండ ఉమ్మడి జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుపట్టభద్రులను ఆకట్టుకునే పనిలో మూడు ప్రధానపార్టీల అభ్యర్థుల ప్రచారంఉదయం 6 నుండి సాయంత్రం 8 గంటల వరకు 144 సెక్షన్ అమలుఈ ఎన్నికలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలతోపాటు కొందరు స్వతంత్రులు పెద్దఎత్తున ప్రచారం చేశారు.ఈరోజు తేదిన ప్రత్యేక సెలవువరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధి 34అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించి ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లు -
‘పౌర సరఫరా’లో రూ.1,000 కోట్ల స్కాం!: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు. మిల్లుల్లో నిల్వ ఉన్న 35 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం సేకరణ పేరుతో రూ.700 కోట్ల నుంచి రూ.750 కోట్లు, మధ్యాహ్న భోజన పథకం కోసం 2.20 ఎల్ఎంటీల సన్న బియ్యం కొనుగోలు పేరిట మరో రూ.300 కోట్లు..మొత్తం రూ.1,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో బి–టాక్స్, యు–ట్యాక్స్, ఆర్ఆర్– ట్యాక్స్ రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పార్టీ నేతలు శంభీపూర్ రాజు, పెద్ది సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులతో కలిసి కేటీఆర్ మాట్లాడారు. 4 కంపెనీలకే టెండర్లు వచ్చేలా చేశారు.. ‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022–23 యాసంగిలో రైతుల నుంచి సేకరించి మిల్లర్ల దగ్గర నిల్వ ఉంచిన 35 ఎల్ఎంటీల ధాన్యాన్ని విక్రయించేందుకు మూడు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ గ్లోబల్ టెండర్ల కహానీకి తెరలేపింది. అధికారంలోకి వచ్చి 50 రోజులైనా కాకముందే ఈ దోపిడీకి తెరలేపి జనవరి 25న కమిటీ వేసి, మార్గదర్శకాలు జారీ చేశారు. క్వింటాలుకు రూ.2,100 చొప్పున కొనుగోలు చేయానికి రైస్ మిల్లర్లు ముందుకు వచ్చినప్పటికీ తిరస్కరించి గ్లోబల్ టెండర్లు పిలిచారు. ప్రత్యేక నిబంధనలతో కేవలం 4 కంపెనీలకే టెండర్లు వచ్చేలా చేశారు. కేంద్రీయ భండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందూస్తాన్ కంపెనీ, నాకాఫ్ అనే నాలుగు సంస్థలు బిడ్లను దక్కించుకున్నాయి. గురుకులాల్లో కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత సరిగ్గా పనిచేయనందుకు కేంద్రీయ భండార్ అనే సంస్థను 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంస్థ కోసం నిబంధనలు సడలించింది..’అని కేటీఆర్ విమర్శించారు. టెండర్ మొత్తానికంటే అదనంగా వసూళ్లు ‘మిల్లర్లు క్వింటాలు రూ.2,100కు కొంటామన్నప్పటికీ సగటున రూ.200 తగ్గించి రూ.1,885– రూ.2,007 మధ్య ఆ 4 సంస్థలు కొనేలా ఒప్పందం చేశారు. టెండర్ మార్గదర్శకాల ప్రకారం 90 రోజుల్లో 35 ఎల్ఎంటీల ధాన్యాన్ని తీసుకుని ప్రభుత్వానికి రూ.7,500 కోట్లు చెల్లించాలి. మిల్లర్లతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకూడదు. కానీ మిల్లర్లతో ఆయా సంస్థలు నేరుగా ఆర్థిక లావాదేవీలు చేస్తూ మనీలాండరింగ్కు పాల్పడ్డాయి. గోదాముల్లోని ధాన్యాన్ని తీసుకుపోకుండా రైస్ మిల్లర్లపై బెదిరింపులకు పాల్పడ్డాయి. టెండర్లు వేసిన మొత్తానికి కాకుండా అదనంగా చెల్లించాలంటూ రాష్ట్రంలోని 4 వేల మంది రైస్ మిల్లర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ‘సీఎం పేషీకి ఖర్చయ్యింది.. ఢిల్లీకి పోవాలి.. పార్లమెంటు ఎన్నికలు’అంటూ క్వింటాలుకు రూ.150 నుంచి రూ.236 అదనంగా చెల్లించి తీరాలని ఒత్తిడి చేస్తున్నారు. క్వింటాలుకు రూ.236 ఎక్కువగా ఇస్తే ధాన్యం లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు క్లియరెన్స్ ఇస్తామంటూ బంపరాఫర్ కూడా ఇచ్చారు. ఈ మేరకు జలసౌధలో అనధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. దాదాపు 35 ఎల్ఎంటీలకు గాను కింటాలుకు రూ.200 చొప్పున రూ.700 కోట్ల అదనపు డబ్బు మనీలాండరింగ్ ద్వారా మిల్లర్ల దగ్గర వసూలు చేస్తున్నారు. మరోవైపు ధాన్యం లిఫ్ట్ చేసేందుకు గడువు ఈ నెల 23తో అయిపోయింది. ఇప్పటికీ 20 శాతం కూడా లిఫ్ట్ చేయలేదు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి.. బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. కానీ తమకు రావాల్సిన రూ.700 కోట్లు మొత్తం వాళ్ల చేతికి రాలేదు కాబట్టి ఈ డెడ్లైన్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు..’అని కేటీఆర్ ఆరోపించారు. సన్న బియ్యం పేరిట మరో స్కాం ‘రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకానికి 2.20 ఎల్ఎంటీల సన్న బియ్యం కావాలి. వీటి కోసం కూడా పౌరసరఫరాల శాఖ గ్లోబల్ టెండర్ పిలిచింది. ఇందులో కూడా అవే నాలుగు కంపెనీలు పాల్గొన్నాయి. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం ధర కిలో రూ.42–45 ఉంది. కానీ బహిరంగ మార్కెట్, మిల్లర్లను పక్కనబెట్టి టెండర్ల పిలిచారు. కిలోకు రూ.15 అదనంగా అంటే రూ.57కు టెండర్ ఖరారు చేశారు. 2.20 ఎల్ఎంటీలకు కిలోకు అదనంగా రూ.15 చొప్పున రూ.300 కోట్ల స్కామ్ జరిగింది. ఇలా మొత్తంగా రూ.1,000–1,100 కోట్ల స్కామ్ జరిగింది..’అపి కేటీఆర్ వివరించారు. ‘మా ప్రభుత్వం హయాంలో కొనుగోలు చేసిన దాంట్లో 1.6 ఎల్ఎంటీల సన్న ధాన్యం ఉంది. దాన్ని మిల్లింగ్ చేసి విద్యాశాఖకు ఇస్తే.. కేవలం 60 వేల టన్నులే కొనాల్సి వచ్చేది. కానీ 1.6 ఎల్ఎంటీల సన్న ధాన్యం కిలో రూ.22.59 పైసలకు అమ్మేశారు..’అని విమర్శించారు. -
‘రింగు’ పరిహారానికి రుణం
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణలో సగం వాటా భరించడం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద భారంగా మారింది. ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించనుంది. భూసేకరణలో సగం ఖర్చు కూడా కేంద్రమే భరిస్తుంది. మిగతా సగం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. అయితే ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేని ప్రస్తుత తరుణంలో భూసేకరణ వ్యయంలో సగం భరించడం కూడా ప్రభుత్వానికి కష్టంగా మారింది. సొంత ఆదాయవనరుల నుంచి నిధులు కేటాయించే పరిస్థితి లేకపోవడంతో రుణం తీసుకోవాలని నిర్ణయించింది. వాస్తవానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రుణం వైపే మొగ్గుచూపింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పంథాలో వెళ్తోంది. హడ్కో వైపు చూపు: భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ఒకేసారి చెల్లించాలంటూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) గతంలో ఒత్తిడి చేసింది. దీన్ని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ఏర్పడింది. ఆ డబ్బు చెల్లించకుంటే ప్రాజెక్టే నిలిచిపోయే ప్రమాదం ఉందంటూ ఎన్హెచ్ఏఐ నుంచి పరోక్ష హెచ్చరికలూ వెలువడ్డాయి. చివరకు విడతలవారీగా చెల్లించేందుకు అంగీకారం కుదరింది. తొలుత రూ. వెయ్యి కోట్లు.. ఆ తర్వాత మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు నాటి ప్రభుత్వం సమ్మతించింది. అయితే అలైన్మెంట్ మార్గంలో ఉన్న విద్యుత్ స్తంభాల లాంటి వాటి తరలింపునకు అవసరమయ్యే రూ. 364 కోట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని ఎన్హెచ్ఏఐ కోరడంతో ప్రస్తుత ప్రభుత్వం తొలుత తటపటాయించినా తర్వాత సమ్మతించింది. కానీ సీఎం రేవంత్రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించాక ఆ మొత్తాన్ని కేంద్రమే భరించేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో భూపరిహారం వాటా నిధుల కోసం రుణం పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం ప్రారంభించింది. అప్పట్లో ఇదే విషయాన్ని అధికారులు ‘సాక్షి’కి వెల్లడించారు. కానీ ఎక్కడి నుంచి రుణం పొందాలనే విషయంలో డోలాయమానం నెలకొంది. వారం క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో దీనిపై స్పష్టత వచి్చంది. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా హడ్కో నుంచి సేకరించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ప్రాజెక్టు నిర్మాణ సన్నాహాలు వేగం పుంజుకోనున్నాయి. అంచనా వ్యయం పెరిగే అవకాశం.. గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో నెలకొన్న విభేదాలు, ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు.. ఇలా దాదాపు రెండేళ్ల సమయం గడిచిపోయింది. దీనివల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. 2022 చివర్లో రీజనల్ రింగురోడ్డుకు బడ్జెట్ ఖరారు చేసిన సమయంలో ఉత్తర భాగం నిర్మాణానికి రూ. 13,200 కోట్లు ఖర్చవుతుందని ఎన్హెచ్ఏఐ ప్రతిపాదించింది. ఇప్పుడు ఆ మొత్తం రూ. 16 వేల కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. దీంతో ఇక జాప్యం చేయకుండా వెంటనే టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈలోగా భూపరిహారం వ్యవహారాన్ని కొలిక్కి తేవాల్సి ఉంది. ఇది జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో వీలైనంత త్వరలో లోన్ మొత్తాన్ని పొందాల్సి ఉంది. -
బీఆర్ఎస్పై రఘునందన్ రావు సంచలన ఆరోపణలు.. ఈసీకి లేఖ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ. 30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆర్ఎస్ తెర లేపి, అక్రమాలకు పాల్పడుతోందని కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి లేఖలు రాశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారిక కెనరా బ్యాంక్ ఎకౌంట్ నుంచి 34 మంది ఎన్నికల ఇంఛార్జిలకు ఈ డబ్బు బదిలీ చేసిందని తెలిపారు.ఎన్నికల కమిషన్ వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ను కూడా తాను రాసిన లేఖకు జతచేశారు. ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోకపోతే కోట్లాది రూపాయలతో బీఆర్ఎస్ పార్టీ ఓటర్లను కొనుగోలు చేస్తుందని అన్నారు. వెంటనే అకౌంట్లో డబ్బులు ఫ్రీజ్ చేసి విచారణ జరపాలని కోరుతున్నామని రఘునందన్ రావు అన్నారు.రాష్ట్రంలో ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రేపు (మే 27వ తేదీ 2024)న ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. బరిలో తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్), రాకేశ్రెడ్డి (భారాస), ప్రేమేందర్రెడ్డి (భాజపా) ఉన్నారు. -
కనీసం మాట మాట్లాడటానికి ఇష్టపడటం లేదు: కేటీఆర్
-
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్లాక్ మెయిలర్: గాదరి కిషోర్
హైదరాబాద్: ఎల్లుండి (సోమవారం) జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్లో ఉండే నల్గొండ పట్టభద్రులు వెళ్లి ఓటు వేయాలని బీఆర్ఎస్ నేత గాదరి కిషోర్ కుమార్ కోరారు. ఆయన శనివారం తెలంగాణ భవన్లో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్లాక్ మెయిలర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక మొత్తం ఇలాగే ఉంది. వందలాది కేసులు ఉన్న వ్యక్తి మల్లన్న. బ్లాక్ మెయిల్ కేసులు ఉన్నాయి. రేవంత్రెడ్డి సీఎం అవ్వగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి, మేమే ఇచ్చినం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. చేసింది చెప్పుకోలేక మేము ఓడిన వాతావరణం కనిపించింది. ఏదైనా అడిగితే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టడం తప్ప చేసిందేమీ లేదు. రైతు బంధు ఇవ్వలేదు, సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తాం అంటున్నారు. మేనిఫెస్టోలో అన్ని రకాల వడ్లకు రూ. 500 ఇస్తామన్నారు. రైతు రుణమాఫీ ఇద్దరు భార్యాభర్తలకు కలిపి రెండు లక్షలు చేస్తామని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ కథ మొదటికి వచ్చింది. మోసపూరిత మాటలతో ప్రజల్ని మభ్య పెడుతున్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు’’ అని గాదరి కిషోర్ మండిపడ్డారు. -
తెలంగాణలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల వేడి
-
హైదరాబాద్పై బీజేపీ, కాంగ్రెస్ కుట్ర
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘కాంగ్రెస్, బీజేపీలది రాజకీయం.. కానీ కేసీఆర్ది తెలంగాణతో పేగుబంధం. పోరాటాలు చేసి, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిండు. ఇవ్వాళ బీజేపీ కొత్త కుట్ర చేస్తోంది. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తరట.. హైదరాబాద్ లేని తెలంగాణ ఉంటదా.. తల లేని మొండెం అయిపోతాం మనం. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు కలిసి హైదరాబాద్ను యూటీ చేయాలని లేదా మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా చేయాలని కుట్రలకు తెరతీస్తున్నారు.తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్ను కాపాడుకునే బాధ్యత మీపై ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికను ఆషామాïÙగా తీసుకోకుండా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డిని గెలిపించండి’అని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, బోనకల్లో శుక్రవారం నిర్వహించిన పట్టభద్రుల సమావేశాల్లో ఆయన మాట్లా డారు. తెలంగాణ వచ్చి పదేళ్లు అవుతుండగా, ఇప్ప టి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ను మరో పదేళ్లు కొనసాగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.రైతులను ఆ మంత్రి కుక్కలతో పోలుస్తారా? సత్తుపల్లిలో సమావేశం అనంతరం తల్లాడ మండలం నూతనకల్లో క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులతో హరీశ్రావు మాట్లాడారు. వర్షాలు పడినా జీలుగు విత్తనాలు ఇవ్వడం లేదని, కల్యాణలక్ష్మి చెక్కులు రాలేదని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సన్న ధాన్యంతోపాటు దొడ్డు ధాన్యానికి కూడా బోనస్ ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ‘వడ్లకు బోనస్ ఇవ్వమంటే ఇవన్నీ వ్యవసాయం తెలియని వారి మాటలని.. రైతులు మొరుగుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి అనడం ఏమిటని ప్రశ్నించారు. రైతులను వ్యవసాయ శాఖ మంత్రి కుక్కలతో పోలుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టభద్రులు ఓటు వృథా చేసుకోవద్దు జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆలోగా రైతుల సమస్యలు పరిష్కరించకపోతే రైతులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని హరీశ్రావు హెచ్చరించారు. ఈ సందర్భంగా విత్తనాలు అందడం లేదని రైతులు ఆయన దృష్టికి తీసుకురావడంతో మండల వ్యవసాయ శాఖా« దికారులతో మాట్లాడారు. నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ మాట్లాడు తూ పట్టభద్రులు తమ ఓటును వృథా చేసుకోవద్దని కోరారు.సమావేశంలో ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టిమ్స్ ఆసుపత్రులపై కాంగ్రెస్ది రాజకీయం: హరీశ్ సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మాణ పనులు ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రులపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విషం చిమ్మడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఐదు నెలలుగా నిర్మాణ పనుల పర్యవేక్షణను గాలికి వదిలిన మంత్రి కోమటిరెడ్డి.. గత ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రులపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందన్నారు. -
గ్యారంటీలను మరిచిన కాంగ్రెస్: కేటీఆర్
చౌటుప్పల్, నకిరేకల్: ప్రజలకు సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారంటీ స్కీంలు అంటూ అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలో వచ్చారని.. ఆరు నెలలైనా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా హామీలేవీ అమలు కాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. శుక్రవారం భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామెరలో, నల్లగొండ జిల్లా నకిరేకల్లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్ల మాయమాటలు నమ్మితే గోస పడుతామని తాము ముందే చెప్పామని.. ఇప్పుడు అదే జరిగిందని చెప్పారు. డిసెంబర్ 9న రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్రెడ్డి చెప్పారని.. ఇప్పటివరకు చేయకపోగా దేవుళ్ల మీద ఒట్లు పెడుతూ మరోసారి రైతులను మోసం చేసే పనిలో ఉన్నారని ఆరోపించారు. ధాన్యం బోనస్ విషయంలో కూడా రేవంత్రెడ్డి మాట తప్పారని.. సన్న వడ్లకు మాత్రమే ఇస్తామంటున్నారని విమర్శించారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.. కాంగ్రెస్ గ్యారంటీల విషయంలో రాహుల్గాందీ, ప్రియాంకా గాంధీ కూడా అబద్ధాలు ఆడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా జాబ్లు ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇచ్చిన 30వేల ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చినవేనని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో 400కుపైగా సంక్షేమ కార్యక్రమాలు చేపడితే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం 420 హామీలు ఇచ్చి మోసం చేసిందని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి పక్కా 420 వ్యక్తి అని వ్యాఖ్యానించారు. రేవంత్ తీరుతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయే ప్రమాదం ఉందని ఆరోపించారు. గత ఆరు నెలల్లో రాష్ట్రంలో 1.5 లక్షల వివాహాలు జరిగాయని.. ఆ జంటలకు లక్ష రూపాయలతోపాటు 1.5 లక్షల తులాల బంగారాన్ని రేవంత్రెడ్డి బాకీ ఉన్నారన్నారు. గోల్డ్ మెడలిస్టు కావాలా.. బ్లాక్ మెయిలిస్టా.. బీఆర్ఎస్ తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గోల్డ్ మెడలిస్టు అని.. కాంగ్రెస్ నుంచి పోటీచేస్తున్న వ్యక్తి పెద్ద బ్లాక్ మెయిలిస్టని కేటీఆర్ ఆరోపించారు. ఎవరు కావాలో పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు ఉండాలంటే బీఆర్ఎస్ ఆభ్యర్థి రాకేశ్రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశాల్లో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కిషోర్, అంజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.తప్పుడు వార్తల రేవంత్ను జైల్లో పెట్టాలి: ‘ఎక్స్’లో కేటీఆర్సాక్షి, హైదరాబాద్: అసత్య వార్తలను ప్రచారం చేయడం అలవాటుగా మార్చుకున్న సీఎం రేవంత్రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టకూడదని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘మా బంధువుకు రూ.10 వేల కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్టు దక్కిందంటూ రేవంత్ గతంలో సిగ్గులేకుండా ఓ అబద్ధాన్ని తయారు చేశారు. ఇదే హాస్యగాడు సెక్రటేరియట్ కింద నుంచి నిజాం నగలను తవ్వుకెళ్లామనే అసత్య వాదనను సృష్టించారు. కేంద్ర హోంమంత్రి ఫేక్ వీడియోను కూడా సర్క్యులేట్ చేశారు. సీఎం హోదాలో ఉంటూ ఉస్మానియా యూనివర్సిటీ నకిలీ సర్క్యులర్ను పోస్ట్ చేశారు. తప్పుడు వార్తల రేవంత్ను జైల్లో పెట్టాలి..’’అని కేటీఆర్ విమర్శించారు. -
కాంగ్రెస్ మార్క్ మార్పు ఇదేనా!: కేటీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘రాష్ట్రంలో ఓ వైపు కరెంట్ కోతలు, మరోవైపు కాలుతున్న ట్రాన్స్ఫార్మర్లు..మోటార్లు, ఆస్పత్రుల్లో గంటల తరబడి కరెంటు కోతలు, ఎండుతున్న చెరువులు.. ఇదేనా కాంగ్రెస్ మార్కు మార్పు? ఒక్కసారి ఆలోచించి వారికి ఇప్పటికైనా తగిన బుద్ధి చెప్పాలి..’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘6 నెలల క్రితం అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. కేసీఆర్తో సహా అందరం ప్రతి నియోజకవర్గంలో పర్యటించాం. మోసపోతే గోసపడుతామని చెప్పాం. కానీ కాంగ్రెస్ వాగ్దానాలు నమ్మి ఆ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపితే నమ్మి ఓటేసి ఇప్పుడు బాధపడుతున్నారు. డిసెంబర్ 9 నాడే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానన్నారు. కేసీఆర్ లక్ష మాఫీ చేసిన వారికీ రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి.. మొదటి రోజే మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఏం శిక్ష వేస్తారో వేయాలి..’అని అన్నారు. ‘సీఎం రేవంత్రెడ్డి ఓ మెజీషియన్.. పచ్చి అబద్ధాలకోరు. తెలంగాణ ప్రజలను ఇంకా నమ్మించాలని చూస్తున్నాడు..’అని ధ్వజమెత్తారు. వరంగల్–నల్లగొండ–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నర్సంపేట, వరంగల్, హనుమకొండలలో నిర్వహించిన సమావేశాల్లో కేటీఆర్ ప్రసంగించారు. రెండోసారి కూడా మోసపోతే మోసపోయిన వాళ్లదే తప్పు ‘అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈస్ట్మన్ కలర్ సినిమా చూపించారు. కానీ రాష్ట్రంలో కరెంట్ కోతలు ఎలా ఉన్నాయో చెప్పడానికి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మంగళవారం నాటి ఘటనే ఉదాహరణ. ఎంజీఎం లాంటి పెద్ద ఆస్పత్రిలో 5 గంటలు కరెంట్ పోవడం దారుణం కాదా? ఆరు నెలల క్రితం వ్యవసాయం ఎలా ఉండే? ఇప్పుడు ఎలా ఉంది? రుణమాఫీ జరిగిందా? కౌలు రైతులకు, రైతు కూలీలకు సాయం అందిందా? వంద రోజుల్లోనే చేసేస్తామన్న హామీలు ఏమయ్యాయి? రూ.2500 వచ్చినయా? ఏడాదిలో రూ.2 లక్షల ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఏదీ చేయలేదు. నాట్లు వేసే నాడు వేయాల్సిన రైతుబంధు..ఓట్లు వేసే నాడు రేవంత్రెడ్డికి గుర్తొస్తుంది. ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలు చేశానని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు. తెలంగాణలో అన్ని హామీలు ఆమలు చేస్తున్నట్లు రాహుల్గాం«దీ, ప్రియాంక గాం«దీలు కూడా ఇతర రాష్ట్రాల్లో అబద్ధాలు చెబుతున్నారు..’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. పదేళ్ల ప్రగతి చెప్పుకోవడంలో విఫలమయ్యాం ‘గత పదేళ్లలో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించిందని చెప్పుకోవటానికి చాలా ఉన్నాయి. అన్ని రంగాలు అభివృద్ధి చెందాయి. కానీ మనం చేసిన మంచి పనులను చెప్పుకోవటంలో విఫలమయ్యాం. యూట్యూబ్లలో మనపై తప్పుడు ప్రచారాలు చేశారు. దీని కారణంగానే 1.8 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో మనం ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు. కానీ రెండోసారి కూడా మోసపోతే మోసపోయిన వాళ్లదే తప్పు అవుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డిని గెలిపించి కాంగ్రెస్కు తగ్గిన బుద్ధి చెప్పాలి..’అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆయా సమావేశాల్లో రాకేశ్రెడ్డితో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఎమ్మెల్సీలు డా.బండా ప్రకా‹Ù, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనచారి, ఎమ్మెల్యేలు డా.సంజయ్, పాడి కౌశిక్రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మానవత్వాన్ని చాటిన కేటీఆర్ గీసుకొండ: రోడ్డు పక్కన పడిపోయిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి, మాజీ మంత్రి కేటీఆర్ మానవత్వాన్ని చాటారు. బుధవారం హైదరాబాద్ నుంచి నర్సంపేట వెళుతుండగా గ్రేటర్ వరంగల్ పరిధిలోని ధర్మారం రైల్వే గేటు సమీపంలో అంజయ్య అనే వ్యక్తి మోపెడ్పై వెళుతూ ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనపడి అపస్మారకస్థితిలో ఉన్నాడు. విషయం గమనించిన కేటీఆర్ కారు ఆపి అతన్ని పరిశీలించారు. వెంటనే గన్మెన్ల సాయంతో తన కాన్వాయ్లోని ఓ వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నర్సంపేటకు వెళ్లారు. ఆరు నెలల్లోనే ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు – పదేళ్ల తరువాత మళ్లీ అన్నదాతల ఆత్మహత్యలు – కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు, అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు – ‘ఎక్స్’లో కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు ఆవిష్కృతం అయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. పదేళ్లు కనిపించని కరెంట్ కోతలు, విద్యుత్ సబ్ స్టేషన్ల ముట్టళ్లు ఇప్పుడు చూస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఆయన ఈ మేరకు పోస్టు చేశారు. ‘కాలిన మోటార్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లతో పాటు మళ్లీ ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు, జనరేటర్ల మోతలు చూస్తున్నాం. సాగునీరు లేక ఎండిన పంట పొలాలు, ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు చూస్తున్నాం. బోసిపోయిన చెరువులు, పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు, రైతుబంధు కోసం నెలలపాటు పడిగాపులు చూస్తున్నాం. తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కులేదు. పదేళ్ల తరువాత మళ్లీ అన్నదాతల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. జోగిపేటలో విత్తనాల కోసం రైతులు పాసుబుక్కులతో క్యూలు కడుతున్నారు. అయినా కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు, అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో..’అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
సన్న బియ్యం పెద్ద లొల్లి
-
KSR : సన్నబియ్యం రాజకీయం..! ఎవరి వాదన కరెక్ట్ ?
-
సన్న వడ్లపై సర్కార్ సన్నాయి నొక్కులు
నల్లగొండ టూటౌన్/ మిర్యాలగూడ: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ అంటూ రేవంత్రెడ్డి సర్కార్ సన్నాయి నొక్కులు నొక్కుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను ప్రజలు నమ్మారని, కానీ ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల అపఖ్యాతిని మూటగట్టుకుందని విమర్శించారు. మంగళవారం నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, హాలియాల లో నిర్వహించిన వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమా వేశాల్లో కేటీఆర్ మాట్లాడారు.‘‘కాంగ్రెస్ రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు నెలకు రూ.2,500, వరి ధాన్యానికి రూ.500 బోనస్ అని అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేసింది. డిసెంబర్ 9 నాటికి రైతుబంధు ఇస్తామని చెప్పిన రేవంత్రెడ్డి.. మే వచి్చనా సొమ్ము వేయలేదు. నాగార్జునసాగర్ ఆయకట్టు ఎండిపోతే కాంగ్రెస్ నాయకులు పట్టించుకోలేదు. అన్నదాతలు ఆగమవుతున్నారు. సాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పజెప్పిన దద్దమ్మలు కాంగ్రెస్ వాళ్లు. రేవంత్ పాలనలో అంతా మోసమే..’’అని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపిస్తే నమ్మి కాంగ్రెస్ను గెలిపించారని.. ఇప్పుడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ మోసపోవద్దని పేర్కొన్నారు. మొదటిసారి మోసపోతే కాంగ్రెస్ మాయ అనుకుందామని.. అదే రెండోసారి మోసపోతే మన తప్పే అవుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్ మెయిలర్.. ఉన్నత చదువులు చదివి అమెరికాలో మంచి ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ కోసం వచి్చన గోల్డ్ మెడ లిస్ట్ కావాలో.. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజే గోల్డ్ స్నాచర్ కావాలో పట్టభద్రులు తేల్చుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలర్ అని ఆరోపించారు. దీనిపై మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా ఆలోచన చేయాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డి గెలిస్తే.. మండలిలో పట్టభద్రులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జి.జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. -
అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలి: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనే రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వానాకాలం నుంచి అన్ని రకాల వడ్లకు క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ ఇవ్వాలన్నారు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇచ్చేలా బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. వరి ధాన్యానికి బోనస్ చెల్లింపు అంశంపై రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై హరీశ్రావు మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్గాం«దీ, ప్రియాంకగాందీతో పాటు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కూడా హామీ ఇచి్చన విషయాన్ని హరీశ్రావు గుర్తు చేశారు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం మోసానికి పరాకాష్టగా పేర్కొన్నారు. యాసంగిలో సాగు చేయని సన్నవడ్లకు బోనస్ ప్రకటించడం రైతుల నోట్లో మట్టికొట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వానాకాలంలో 20 శాతం మాత్రమే సన్నరకం సాగు చేస్తారని, యాసంగిలో 99 శాతం దొడ్డు వడ్లు సాగు చేస్తారన్నారు. ‘భరోసా’రూ.5 వేలేనా? రాష్ట్రంలో దిగుబడి వచ్చే 1.20 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి బోనస్ ఇచ్చేందుకు రూ.6 వేల కోట్లు అవసరమవుతాయని హరీశ్రావు పేర్కొన్నారు. అయితే కేవలం సన్న రకం వడ్లకే బోనస్ ఇచ్చేందుకు రూ.500 కోట్లు సరిపోతాయని, దీనితో రూ.5,500 కోట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ప్రకటించి, గతంలో మాదిరిగా తొలి విడతలో కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారన్నారు. రైతు భరోసా కింద రైతులకు బకాయి పడిన రూ.2,500తో పాటు వానాకాలం సాయం రూ.7,500 కూడా కలుపుకుని జూన్ నెలాఖరులోగా ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలన్నారు. వాస్తవ పరిస్థితిని వివరించేందుకు మీడియా సమావేశంలోనే మెదక్ జిల్లా ముత్తాయికోట నుంచి బెజ్జంకి కేంద్రానికి లోడ్ తీసుకెళ్లిన లారీ డ్రైవర్ ప్రభాకర్రెడ్డితో హరీశ్ ఫోన్లో మాట్లాడారు. -
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సోమవారం అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ఎదుట వర్చువల్గా హాజరు పరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆమె కస్టడీ పొడిగించాలని సీబీఐ, ఈడీ తరఫు న్యాయవా దులు పంకజ్ గుప్తా, జొహెబ్ హొస్సేన్లు కోరారు.కవితతో పాటు మరో నలుగురిపై దాఖ లు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దీనిపై కవిత న్యాయవాది నితీష్ రాణా అభ్యంతరం తెలిపారు. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం రెండు కేసుల్లోనూ జూన్ 3 వరకు కవిత కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. చార్జిషీటుపై ఈడీ వాదనలు: కవితతో పాటు మరో నలుగురిపై ఈడీ దాఖలు చేసిన సప్లి మెంటరీ చార్జిషీటును పరి గణనలోకి తీసుకోవ డంపై దర్యాప్తు సంస్థ ప్రత్యే క కోర్టులో వాదనలు వినిపించింది. న్యాయవాది నవీన్ కుమార్ మట్టా వాదనలు వినిపిస్తూ.. కవిత, చారియట్ ప్రొడ క్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు దామోదర్ శర్మ, ప్రిన్స్కుమార్, చరణ్ప్రీత్ సింగ్, ఇండియా ఎహెడ్ న్యూస్ ఛానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్ల పాత్ర గురించి చార్జిషీటులో ప్రస్తావించినట్లు తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని కవిత కాకుండా మిగిలిన వారి పాత్రపై వాదనలు విన్పించాలని సూచించారు. ఇదే క్రమంలో న్యాయమూర్తి అడి గిన ప్రశ్నలపై సమాధానానికి నవీన్ కుమార్ సమయం కోరారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరా లతో రావాలంటూ న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. -
ప్రశ్నించే గొంతు మండలిలో ఉండాలి
ఖమ్మం సహకారనగర్/ఇల్లెందు/సూపర్బజార్ (కొత్తగూడెం): ‘ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు శాసనమండలిలో ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది. ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. జాబ్ కేలండర్ ఇవ్వలేదు. రూ.400 ఉన్న టెట్ ఫీజు రూ.2 వేలు చేసింది. వీటిపై మండలిలో గళం విప్పి గర్జించాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డిని గెలిపించాలి’’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందులో వరంగల్, ఖమ్మం, నల్లగొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారసభలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏనుగుల రాకేష్రెడ్డి గోల్డ్మెడలిస్ట్ అయితే కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్మెయిలర్ అని, 74 రోజులు జైలులో గడిపారని, అలాంటి వ్యక్తి పట్టభద్రుల ప్రతినిధి అవుతాడా అని ప్రశ్నించారు. విద్యావంతులు ఎన్నుకునే వ్యక్తి వారి తరఫున వకాల్తా పుచ్చుకుని వాదించాలన్నారు. గడిచిన పదేళ్ల కాలంలో దేశంలోని ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణలో జరిగిందని కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో 24 లక్షల మందికి ఉపాధి కల్పించా మని, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని దేశంలో ఎక్కడైనా ఇలా ఇచ్చిఉంటే తాను ఎమ్మెల్యే పద వికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో వెనకబడి.. చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోవటంతో గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ మాయలో పడ్డారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో విజ్ఞులైన పట్టభద్రులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టాల న్నారు. బలమైన ప్రతిపక్షం లేకపోతే సింగరేణిని బీజేపీ, కాంగ్రెస్లు అదానీకి అమ్మేస్తాయని ఆరో పించారు. ఆయా సభల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి ఏను గుల రాకేష్ రెడ్డి, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
డయాగ్నస్టిక్ వ్యవస్థను కుప్పకూల్చడం బాధాకరం: హరీశ్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ.హరీశ్రావు మండిపడ్డారు. డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులకు, సిబ్బందికి ఆరు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరమని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా 36 డయాగ్నస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసి, 134 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చి వైద్య సేవల్లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారు. లక్షలాది నిరుపేద, సామాన్య ప్రజలకు ఆర్థిక భారం లేకుండా చేసి, నాణ్యమైన వైద్య పరీక్షలను అందించిన డయాగ్నస్టిక్ కేంద్రాలు ఇప్పుడు నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి. ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులకు, సిబ్బందికి ఆరు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి. డయాగ్నొస్టిక్ కేంద్రాల ద్వారా అన్ని రకాల పరీక్షలు, వైద్య సేవలు ప్రజలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’అని హరీశ్రావు ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరం.కెసిఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా 36 డయాగ్నస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసి, 134 రకాల వైద్య పరీక్షలను… pic.twitter.com/CwnErdltSu— Harish Rao Thanneeru (@BRSHarish) May 20, 2024
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
వేగంగా బీసీజీ వ్యాక్సినేషన్
గెలుపెవరిదో వారి పాలనే చెబుతుంది!
ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేశాం
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా
వన సంపదకు పెద్ద ఆపద!
ఇజ్రాయెల్పై కొత్త ఒత్తిళ్లు
18అడుగుల ఎత్తులో ఆర్ఆర్ఆర్!
స్ట్రాంగ్ రూమ్కు బ్యాలెట్ బాక్సులు
ఈ పాపం ఎవరిది?
ప్రజాభవన్లో బాంబు కలకలం
తప్పక చదవండి
- JC Diwakar Reddy: వేధించి, ఆపై సంతకాన్ని ఫోర్జరీ చేసి..
- ఈ ఏడాది.. వికసించిన 'మే పుష్పం' ఇదే!
- ప్రమాదమా.. గాయాలేవీ? ఖమ్మం కేసులో ట్విస్ట్
- ఆకాశం నుంచి పడిన వింత వస్తువు
- బ్యాంకాక్లో పీర్జాదిగూడ కార్పొరేటర్లు
- కౌంటింగ్లో అప్రమత్తత అవసరం
- రోహిణి తీవ్రత లేనట్టే!
- 'గోరుముద్ద'కు తాజ్ రుచులు
- స్ట్రాంగ్ రూమ్కు బ్యాలెట్ బాక్సులు
- ‘గొర్రెల’కు మంగళం!
Advertisement