-
మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు
సుభాష్నగర్/ సాక్షి, హైదరాబాద్: ఓ భూ వివాదంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఆయన అల్లు డు.. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలపై శనివారం పేట్బషీరాబాద్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. జీడిమెట్ల డివిజన్ సుచిత్ర ప్రాంతంలో సర్వే నంబర్ 82, 83లో తనతో పాటు 8 మందికి ప్లాట్లు ఉన్నాయంటూ కరీంనగర్కు చెందిన శ్రీనివాస్రెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి తాత్కాలికంగా ప్రహరీని ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి.. అనుచరులతో అక్కడికి చేరుకుని ప్రహరీని కూల్చివేశారు. ఆ భూమి తమదని, అక్కడ ప్రహరీ ఎలా ఏర్పాటు చేస్తారని శ్రీనివాస్రెడ్డి తదితరులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పేట్బషీరాబాద్ ఏసీపీ రాములు.. విచారణ అయ్యేంత వరకు ఎలాంటి నిర్మాణాలు, కూల్చివేతలు చేపట్టవద్దని సూచించడంతో ఎమ్మెల్యేలు పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు. మరోవైపు శ్రీనివాస్రెడ్డి అనుచరులు మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. మల్లారెడ్డి, రాజశేఖర్రెడ్డిలను అదుపులోకి తీసుకుని పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించి కేసులు నమోదు చేశారు.మా భూమిని ఆక్రమించారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి ఆరోపించారు. తమ అధీనంలో ఉన్న భూమిలోకి శుక్రవారం రాత్రి 300 మంది అక్రమంగా చొరపడి హద్దులను చెరపి, ఆక్రమణకు పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ మరో బిహార్గా మారబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకోవాల్సిన పోలీసులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని విమర్శించారు. -
కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు.. మహిళతో కలిసి అరాచకం!
సాక్షి, హైదరాబాద్: కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు నమోదైంది. గెస్ట్హౌస్లో ఒకరిని నిర్బంధించడంతో పాటు దాడి చేసి 60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోపిడీ చేసినట్లు అందిన ఫిర్యాదుపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బిందు మాధవి అలియాస్ నందిని అనే మహిళతో కలిసి అరాచకానికి పాల్పడ్డారు. న్యాయం కోసం కన్నరావు వద్దకు వెళ్లిన సాప్ట్ వేర్ ఉద్యోగి విజయవర్ధన్రావు వద్ద నగలు, నగదు ఉన్నాయని తెలుసుకున్న నందిని స్కెచ్ వేసింది. కన్నారావు, శ్యామ్ ప్రసాద్ లతో కలిసి పక్కా ప్లాన్ వేసింది. టాస్క్ ఫోర్స్ అధికారి భుజంగ రావు, ఏసీపీ కట్టా సుబ్బయ్య తమకు క్లోజ్ అంటూ బెదిరింపులకు దిగారు. బాధితుడి ఫిర్యాదుతో కన్నారావుతో సహా ఐదుగురిపై కేసును పోలీసులు నమోదు చేశారు. అప్పటి ఏసీపీ భుజంగ రావు సైతం కన్నారావుకు సహకరించాలని సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఒత్తిడి తెచ్చారు. లేకపోతే ఎన్కౌంటర్ చేస్తానని భుజంగ రావు తనను బెదిరించినట్లు బాధితుడు తెలిపారు. కాగా, గతంలోనూ బిందు మాధురిపై పలు కేసులు ఉన్నాయి. -
కేటీఆర్ పై పోలీస్ కేసు నమోదు
-
కేటీఆర్ పై పోలీస్ కేసు నమోదు
-
టీడీపీ నేత బొండా ఉమాపై కేసు
అజిత్సింగ్నగర్ (విజయవాడసెంట్రల్): తన కుమారుడి మృతిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఆయన అనుచరులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇటీవల మరణించిన నగరంలోని రామకృష్ణాపురానికి చెందిన యువకుడు కైకాల శరణ్ తల్లి అంజలీదేవి శనివారం అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడు గుండెపోటుతో మృతిచెందాడని ఆమె తెలిపారు. తన కుమారుడి మృతికి ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావుకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వెలంపల్లి శ్రీనివాసరావు ఒత్తిడి చేయటం వల్ల తన కుమారుడు మృతిచెందాడని బొండా ఉమా, ఆయన అనుచరులు స్థానికంగా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తమ స్వార్థం కోసం కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించారని పేర్కొన్నారు. తన కుమారుడి మృతిపై తప్పుడు ప్రచారం చేయడంతోపాటు తమ మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించిన బొండా ఉమా, బేతు రామ్మోహన్రావు, ఆల తారక రామారావు, పైడి శ్రీను, చలమలశెట్టి శ్రీను, హనుమంతరావు, విజయ్కుమార్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో కోరారు. ఈ మేరకు అజిత్సింగ్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
సింగర్ చిన్మయి శ్రీపాదపై కేసు నమోదు
-
నటి సామ్యా జానుపై కేసు నమోదు
-
ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం.. పీఏపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై కేసు నమోదైంది. సోదరి నివేదిత ఫిర్యాదుతో పటాప్చెరు పీఎస్లో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 304ఏ కింద లాస్య పీఏ ఆకాశ్పై కేసు నమోదు చేశారు. ఉదయం 5.15 గంటలకు ఆకాశ్ ఫోన్ చేశారని.. ఇద్దరికే దెబ్బలు తగిలాయని లోకేషన్ షేర్ చేశాడని లాస్య సోదరి నివేదిత తెలిపింది. మేం వెళ్లి చూసేసరికి కారు నుజ్జునుజ్జుగా ఉందని ఆమె చెప్పింది. అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని సంగారెడ్డి ఏఎస్పీ సంజీవ్రావు వెల్లడించారు.ముందున్న వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత.. అదుపు తప్పి ఓఆర్ఆర్ పక్కన రెయిలింగ్ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు లాస్య నందిత బతికే ఉంది. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. ప్రమాదంలో లాస్య పీఏ ఆకాష్ కాళ్లు విరిగిపోయాయని ఏఎస్పీ తెలిపారు. ఇదీ చదవండి: లాస్య నందితను వెంటాడిన మృత్యువు -
RFC: నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
సాక్షి, హైదరాబాద్/అబ్దుల్లాపూర్మెట్: హైదరాబాద్ నగర శివార్లలో ఈనాడు అధి నేత చెరుకూరి రామోజీరావు నేతృత్వంలోని రామో జీ ఫిల్మ్ సిటీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్వా హకుల నిర్లక్ష్యం, ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకపో వడం, అత్యవసర సమయంలో వినియోగించడా నికి అంబులెన్స్లు సైతం లేక ఆస్పత్రికి తరలించ డంలో 20 నిమిషాల వరకు ఆలస్యం కావడంతో ఒకరు మృత్యువాత పడ్డారు. అంచెలంచెలుగా ఎది గిన ప్రవాస భారతీయుడు, బహుళజాతి సంస్థ విస్టెక్స్ ఏషియా పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈఓ సంజయ్ షా (56) ప్రాణాలు కోల్పోయా రు. తీవ్రంగా గాయపడిన ఆ సంస్థ ప్రెసిడెంట్ దాట్ల విశ్వనాథ్ రాజు అలియాస్ రాజు దాట్ల (52) ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రమా దం జరిగిన వెంటనే ఘటనా స్థలిలోనే ఉన్న షా సతీమణి అంబులెన్స్, అంబులెన్స్ అంటూ అక్కడ ఉన్న ఫిల్మ్ సిటీ సిబ్బందిని విలపిస్తూ వేడుకోవడం కంటతడి పెట్టించింది. గురువారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనపై సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కలిదిండి జానకిరామ్ రాజు ఇచ్చిన ఫిర్యాదుతో ఫిల్మ్ సిటీ సహా మరికొందరిపై అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబై నుంచి అమెరికా దాకా.. ముంబైకి చెందిన సంజయ్ షా 1989లో అమెరికాకు వలసవెళ్ళారు. అక్కడి లేహై యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. అమెరికాలోనే ప్రైస్ వాటర్ హౌస్ కూపర్, జనరల్ మోటార్స్లతో పాటు జర్మనీలోని సాప్ సంస్థలోనూ ఉన్నత స్థానాల్లో పని చేశారు. తర్వాత సొంత కంపెనీ ఏర్పాటు కోసం ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. 1999లో అమెరికాలోని ఇల్లినాయిస్ కేంద్రంగా విస్టెక్స్ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల్లో విస్తరించింది. దీని వార్షిక టర్నోవర్ రూ.3,500 కోట్లకు పైగా ఉంది. హైదరాబాద్లోని మాదాపూర్లోనూ దీని కార్యాలయం ఉంది. దీనికి కలిదిండి జానకిరామ్ రాజు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. తమ సంస్థ ఏర్పాటు చేసి 25 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని భావించిన యాజమాన్యం రామోజీ ఫిల్మ్ సిటీని వేదికగా ఎంచుకుంది. లైమ్లైట్ గార్డెన్లో.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విస్టెక్స్ కార్యాలయాల్లో ఈ వేడుకలు జరుగుతుండగా.. ప్రతి కార్యక్రమానికీ సీఈఓ సంజయ్ షా, ప్రెసిడెంట్ విశ్వనాథ్ రాజు హాజరవుతున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ లోని తమ ఉద్యోగులు, క్లయింట్లతో కలిసి వేడుకల నిర్వహణకు రామోజీ ఫిల్మ్ సిటీలోని లైమ్లైట్ గార్డెన్ను బుక్ చేసుకున్నారు. రెండురోజుల పాటు జరిగే వేడుకల కోసం గురువారం రాత్రి ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. 20 అడుగుల ఎత్తునుంచి దిగుతూ.. ప్రారంభ కార్యక్రమాన్ని వెరైటీగా నిర్వహించాలని నిర్ణయించారు. కాంక్రీట్ స్టేజీపైన ఉన్న రూఫ్కు తాళ్లు కట్టి, వాటికి వేలాడేలా చెక్కతో ఓ ప్లాట్ఫామ్ తయారు చేశారు. అలంకరించిన ఆ ప్లాట్ఫామ్ మె ల్లగా కిందకు దిగుతుండగా సీఈఓ, ప్రెసిడెంట్లు 20 అడుగుల ఎత్తులో దానిపై నిలబడి.. ఆహుతు లకు అభివాదం చేస్తూ స్టేజీపైకి దిగేలా ఏర్పాట్లు చే శారు. ఇందుకు ఫిల్మ్ సిటీతో పాటు ఈవెంట్ మేనే జర్ల అనుమతి కూడా తీసుకున్నారు. చెక్కతో చేసిన సదరు ప్లాట్ఫామ్కు రెండు వైపులా ఇనుప చువ్వ లు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి 7.40 గంటల సమయంలో ఈ ప్లాట్ఫామ్ పైకి ఇద్దరూ ఎక్కగా.. పైన ఉన్న రూఫ్కు కట్టిన తాళ్ల సాయంతో ప్లాట్ఫామ్ను పైనుంచి కిందకు దింపడం ప్రారంభించారు. అయితే కొద్దిసే పటికే ఒక పక్కన తాడు తెగిపోవడంతో ప్లాట్ఫామ్ పక్కకు ఒరిగి, దానిపై ఉన్న ఇద్దరూ దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి సిమెంట్తో కట్టిన స్టేజీపై వేగంగా పడి పోయారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేవు.. రెస్క్యూ లేదు విస్టెక్స్, ఫిల్మ్ సిటీ ఉద్యోగులు, ఈవెంట్ మేనేజర్లు వెంటనే అక్కడ గుమిగూడారు. విస్టెక్స్ సంస్థ ప్రతినిధులు తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ఏదైనా పెద్ద ఆస్పత్రికి తరలించడానికి సహాయం చేయాల్సిందిగా అక్కడ ఉన్న వారిని కోరారు. ఓ వైపు సరైన భద్రతా ఏర్పాట్ల లోపం కారణంగా ప్రమాదం జరగ్గా.. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించేలా సరైన రెస్క్యూ టీమ్ సైతం ఫిల్మ్ సిటీకి లేకపోవడంతో విలువైన సమయం వృధా అయ్యింది. ఆస్పత్రికి తరలింపు ఆలస్యమైంది. విస్టెక్స్ ప్రతినిధులు, షా భార్య 15 నుంచి 20 నిమిషాలు వేడుకుంటే తప్ప ఫిల్మ్ సిటీ నిర్వాహకులు అంబులెన్స్ను ఏర్పాటు చేయలేదు. అప్పటికే తీవ్ర రక్తస్రావంతో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ఒక అంబులెన్స్లో సంజయ్ షాను హయత్నగర్లోని ప్రైవేట్ ఆస్పతికి తరలించారు. విశ్వనాథ్ రాజును తీసుకువెళ్లడానికి మరో అంబులెన్స్ ఏర్పాటు చేయాల్సిందిగా కంపెనీ ప్రతినిధులు ఎంత వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన్ను సొంత కారులోనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో సంజయ్ షా కన్నుమూశారు. విశ్వనాథ్ రాజును మెరుగైన చికిత్స నిమిత్తం మలక్పేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శరీరంలో అనేక చోట్ల ఎముకలు విరగటంతో పాటు తీవ్ర గాయాలైన ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఫిల్మ్ సిటీపై క్రిమినల్ కేసు నమోదు జానకిరామ్ రాజు తన ఫిర్యాదులో ఫిల్మ్ సిటీలోని భద్రతా లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం తదితర అంశాలను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజ్మెంట్ (ఉషా కిరణ్ ఈవెంట్స్), సీనియర్ ఈవెంట్ మేనేజర్ రితిక్ ఛటర్జీ, సేఫ్టీ డిపార్ట్మెంట్ చీఫ్ మేనేజర్ జి.ఉదయ్ కిరణ్, ఫిల్మ్ సిటీలో స్పెషల్ ఎఫెక్ట్స్ కాంట్రాక్టర్గా ఉన్న ఎస్.సురేష్ బాబు, రోప్ ఆపరేటర్ ఎస్.దుర్గా సతీష్ తదితరులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్లోని 336, 287 రెడ్విత్ 34 సెక్షన్ల కింద వీరిపై ఆరోపణలు చేశారు. భార్య కళ్ల ఎదుటే ప్రమాదం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం జరిగిన సమయంలో విస్టెక్స్ సంస్థ సీఈఓ సంజయ్ షా భార్య కూడా అక్కడే ఉన్నారు. దంపతు లిద్దరూ గురువారం సాయంత్రం తమ సొంత విమానంలో ముంబై నుంచి శంషాబాద్ విమా నాశ్రయానికి, అక్కడి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చారు. స్టేజీ కింద ఆహుతులతో కలిసి సంజయ్ భార్య కూర్చుని వీక్షిస్తుండగానే ఈ ప్రమాదం జరిగింది. దీంతో పరుగున స్టేజీ పైకి వచ్చిన ఆమె.. రక్తపు మడుగులో పడి ఉన్న తన భర్తను ఆస్పత్రికి తరలించండి అంటూ దాదా పు 15 నిమిషాలు అందరినీ వేడుకున్నారు. ఉస్మానియాలో పోస్టుమార్టం.. ముంబైకి మృతదేహం సంజయ్ షా మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో శుక్రవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం భార్యకు అప్పగించారు. అక్కడి నుంచి శవపేటికను మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ప్రత్యేక అంబులెన్స్లో ఎయిర్పోర్టుకు, ఆపై విమానాశ్రయం అంబులెన్స్లో షా విమానం ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్ళారు. కానీ అందులో శవ పేటికను పెట్టడానికి అవకాశం లేకపోవడంతో కార్గో విమానంలో ముంబైకి పంపారు. షా భార్య సహా మిగిలిన వారు సంజయ్ విమానంలోనే ముంబై వెళ్ళారు. తమ స్వస్థలం గుజరాత్ అని, ఏళ్ళ క్రితమే ముంబైకి వలసవచ్చామని సంజయ్ భార్య పోలీసులకు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఇద్దరు కుమార్తెలు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. -
ప్రముఖ రియల్టర్ కార్తికేయ మ్యాడంపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ రాష్ డ్రైవింగ్ కేసు దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. లంబోర్గిని కారు నడిపింది ప్రముఖ రియాల్టర్ కార్తికేయ మ్యాడం అని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ఇటీవల ‘ఎక్స్’ ట్విటర్లో వీడియో పోస్ట్ గుర్తించి పలు సెక్షన్ల కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. కారు రిచ్ మౌంట్ వెంచర్స్ సంస్థ అధినేత కార్తికేయ మీద ఉన్నట్లు తేలడంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రెండు నెలల క్రితం కారు జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్ వైపు కార్తీకేయ కారు నడిపినట్లు విచారణలో వెల్లడింది. ప్రస్తుతం కార్తికేయ దుబాయిలో ఉన్నట్లు సమాచారం. కార్తీకేయ మీద చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం.. ఒకరి మృతి.. కేసు నమోదు -
మాజీ మంత్రుల కార్యాలయాల్లో ద్రస్తాల చోరీ!
సాక్షి, హైదరాబాద్, నాంపల్లి (హైదరాబాద్): మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్పై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మాసబ్ట్యాంక్లోని పశు సంవర్థకశాఖ కార్యాలయంలోనికి అక్రమంగా ప్రవేశించిన కల్యాణ్ బీరువాలో ఉన్న ద్రస్తాలను కారులో తరలించుకునిపోయారు. వాచ్మన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు. నాంపల్లి ఇన్స్పెక్టర్ అభిలాష్ తెలిపిన వివరాల ప్రకారం... మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ శుక్రవారం మాసబ్ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోనికి అక్రమంగా ప్రవేశించారు. అక్కడి సిబ్బంది సహాయంతో బీరువాలో ఉన్న ఫైళ్లను చింపేశారు. అంతటితో ఆగకుండా చించివేసిన ఫైళ్లను తన కారులో తరలించుకుని పోయారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సైతం పనిచేయకుండా చేశారు. దీంతో వాచ్మెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కళ్యాణ్పై కేసు నమోదు చేసినట్లు వివరించారు. అతడికి సహకరించిన కంప్యూటర్ ఆపరేటర్స్ ఎలిజ మోహన్, అటెండర్లు వెంకటేశ్, ప్రశాంత్లపైనా కేసులు నమోదు చేశామని చెప్పారు. ఎస్సీఈఆర్టీ కార్యాలయంలోనూ... హైదరాబాద్ ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) కార్యాలయం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు అధికారిక ద్రస్తాలు ఎత్తుకెళ్లినట్టు ప్రచా రం జరుగుతోంది. ఇక్కడే మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి కార్యాలయం ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. మాజీ మంత్రి కార్యాలయం నుంచి ఒక ఆటోలో కొంతమంది ఫైళ్లు తీసుకెళ్తున్నట్టు తమకు సమాచారం వచ్చిందని అబిడ్స్ పోలీసులు తెలిపారు. కార్యాలయం వాచ్మెన్ వెల్లడించిన ప్రకారం కొన్ని బస్తాల్లో కాగితాలు, ఫైళ్లు తీసుకెళ్ళినట్టు పోలీసులు చెబుతున్నారు. అందులో ఏమున్నాయనేది విచారణ జరిపితే తెలుస్తుందని, అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. వాస్తవానికి రెండో శనివారం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుంది. గేట్ కూడా మూసివేస్తారు. కానీ ఆగంతకులు లోనికెలా వచ్చారు? తాళం ఎలా తీశారు అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ఘటన సెలవు రోజున... అదీ రాత్రి సమయంలో జరగడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఫైళ్లు తీసుకెళ్లిన వ్యక్తి ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా అనుమానిస్తున్నారు. కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. తీసుకెళ్లారని భావిస్తున్న ద్రస్తాలు ఏ శాఖకు సంబంధించినవి? వాటి ప్రాధాన్యం ఏమిటనేది తేలాల్సి ఉంది. ఎస్సీఈఆర్టీ కార్యాలయం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదీనంలో ఉంటుంది. దీనిపై పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేనను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. -
వీడియో కాల్లో డబ్బులు అడుగుతున్నారా?.. ఇది తెలుసుకోండి..
తిరువనంతపురం: ఇటీవలి కాలంలో డీప్ ఫేక్ టెక్నాలజీతో కొందరు కేటుగాళ్లు వీడియో కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో తన స్నేహితులు, కుటుంబ సభ్యులుగా ఫోన్స్ చేస్తూ మోసం చేస్తున్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో ఫ్రెండ్స్ ఫేసులతో వీడియో కాల్స్ చేసి డబ్బులు కాజేస్తున్న కేసులు పెరుగుతున్నాయి. ఇక తాజాగా, కేరళలో తొలి డీప్ ఫేక్ కింద కేసు నమోదు అయ్యింది. వివరాల ప్రకారం.. కేరళలోని కోజికోడ్కు చెందిన ప్రభుత్వోద్యోగి రాధాకృష్ణన్ డీప్ ఫేక్ మోసంలో చిక్కుకొని రూ.30 వేలు పోగొట్టుకున్నారు. ఇక, ఆయన ఫిర్యాదుతో కేరళలో తొలి డీప్ఫేక్ మోసం కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే, రాధాకృష్ణన్ కోల్ఇండియా సంస్థలో పని చేసి రిటైరయ్యారు. కాగా, ఆయన పనిచేస్తున్న సమయంలో వేణుకుమార్ అనే మరో వ్యక్తిగా విధులు నిర్వర్వించారు. ఈ క్రమంలో కేటుగాళ్లు వేణుకుమార్ ఫొటో సాయంలో డీప్ ఫేక్ మోసానికి పాల్పడ్డారు. అయితే, వేణుకుమార్ పేరుతో ఇటీవల రాధాకృష్ణన్కు వాట్సాప్లో వీడియో కాల్ చేసి.. తాను దుబాయి ఎయిర్పోర్ట్లో ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఇంతలోనే ఇండియాలో తన సోదరి ఆపరేషన్ కోసం రూ.40 వేలు అత్యవసరంగా కావాలని రిక్వెట్ చేశాడు. దీంతో, మరో ఆలోచన లేకుండా వీడియోలో వేణుకుమార్ ముఖం కనిపించడంతో రాధాకృష్ణన్ వెంటనే డబ్బులు పంపించారు. Kerala Police has managed to arrest a man involved in #deepfake scam from gujarat (with assistance from Gujarat Police) who defrauded a man in Kozhikode, Kerala. @VishKVarma follow up coming in English?🤭 pic.twitter.com/3qoANpASag — Sapna Singh (@AdvSapna_) November 9, 2023 ఇదిలా ఉండగా.. కొద్దిసేపటి తర్వాత రాధాకృష్ణన్కు వేణుకుమార్లాగా మళ్లీ ఫోన్ చేసి మరో రూ.30 వేలు కావాలని కోరారు. దీంతో, రాధాకృష్ణన్కు అనుమానం వచ్చింది. వెంటనే తేరుకున్న రాధాకృష్ణన్.. తన స్నేహితుల సాయంతో వేణుకుమార్ ఫోన్ నెంబరును తెలుసుకున్నాడు. అనంతరం, అతడికి కాల్ చేసి.. వివరాలు అడిగాడు. ఈ క్రమంలో వేణుకుమార్.. తాను ఏపీలో ఉన్నానని, ఫోన్ చేయలేదని చెప్పటంతో ఒక్కసారిగా షాకయ్యాడు. ఈ ఘటనపై రాధాకృష్ణన్.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు గుజరాత్కు చెందిన షేక్ మర్తుజ్మియాగా గుర్తించి అరెస్ట్ చేసినట్టు సీపీ రాజ్పాల్ మీనా తెలిపారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు కుశాల్షా పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. -
శ్రీకాళహస్తి టిడిపి ఇంఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డిపై కేసు నమోదు
-
టీడీపీ నేత మాగంటి బాబు పై కేసు నమోదు
హైదరాబాద్ : టీడీపీ నేత మాగంటి బాబు పై కేసు నమోదు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించారన్న సెక్షన్ పై కేసులు. కోకాపేట్ ORR నియో పోలీస్ వద్ద పోలీసులపై దౌర్జన్యం. Orrపై వెళ్లకుండా టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబుతో పాటు మరికొంత మందిని అడ్డుకున్న పోలీసులు. పోలీస్లను తోసేసి అనుచరులతో నానా హంగామా చేసిన మాజీ ఎంపీ మాగుంటబాబు. ఎస్సై, సిఐలను మీ అంతుచూస్తానని బెదిరింపులు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన TDP నేతలు. నార్సింగ్ పిఎస్ లో IPC సెక్షన్ 353 కింద కేసు నమోదు -
విద్యార్థుల ఎదుటే టీచర్కు తలాక్ చెప్పిన భర్త
బారాబంకీ: తరగతి గదిలో పాఠాలు చెబుతున్న టీచర్కు ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో, సదరు ఉపాధ్యాయినితోపాటు విద్యార్థులు షాక్కు గురయ్యారు. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో ఆగస్ట్ 24న ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్తపై కేసు నమోదు చేశారు. బారాబంకీకి చెందిన బాధితురాలికి ఫిరోజాబాద్ జిల్లాకు చెందిన మహ్మద్ షకీల్తో 2020లో వివాహమైంది. కొంతకాలం తర్వాత షకీల్ సౌదీ అరేబియా వెళ్లిపోయాడు. అత్తింటి వారు కట్నం తేవాలంటూ వేధించి ఆమెను బలవంతంగా పుట్టింటికి పంపారు. పుట్టింట్లో ఉంటూ ఆమె ఓ ప్రైవేట్ స్కూలులో టీచర్గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 28న సౌదీ అరేబియా నుంచి సొంతూరుకు చేరుకున్న షకీల్.. జూలై 10న బాధితురాలి వద్దకు వచ్చాడు. తనతో రావాలని కోరాడు. వెంటనే రాలేనని చెప్పడంతో ఆరు రోజుల అనంతరం తిరిగి సొంతూరుకు వెళ్లిపోయాడు. ఆగస్ట్ 24న తరగతి గదిలో ఉండగా వచ్చి విద్యార్థుల ఎదుటే తనకు మూడు సార్లు తలాక్ చెప్పారని బాధితురాలు పోలీసులకిచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కొత్వాలీ సిటీ పోలీసులు షకీల్పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. 2019లో కేంద్రం ట్రిపుల్ తలాక్ ఆచారం చట్ట విరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించిన విషయం తెలిసిందే. -
మహిళలపై దాడి చేసినా పట్టించుకోరా?
ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ నడి బొడ్డున టవర్ సర్కిల్లో ఇద్దరు మహిళలపై నలుగురు హత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై పోలీసుల నిర్లక్ష్యం విమర్శలపాలవుతోంది. బాధితులు ఫిర్యాదుపై కనీసంగా పట్టించుకోకపోవడం, నలుగురు నిందితులను కనీసం విచారించకుండా వదిలేయడం వివాదాస్పదమవుతోంది. ఆర్మూర్ పట్టణంలోని నిజాంసాగర్ కెనాల్పై నివాసం ఉండే శివరాత్రి అరుణ, వింజ శోభ వరసకు అక్కా చెల్లెళ్లు. వీరిద్దరూ ఇళ్లలో కూలీ పనులు ముగించుకుని నడుచుకుంటూ తమ ఇళ్లకు వెళ్తుండగా వారి సామాజిక వర్గానికే చెందిన సంపంగి రమేష్, సంపంగి గణేశ్, సంపంగి బబ్లు, సంపంగి నాగమణి రాళ్లతో దాడి చేశారు. పాత కక్షల నేపథ్యంలో జరిగిన దాడిలో అరుణ తల పగిలి రక్తం కారడంతో తల్లి యాదమ్మ సహాయంతో ఆర్మూర్ పోలీస్ స్టేషన్కు పరిగెత్తుకొని వెళ్లారు. వెంటనే పోలీసులు బాధిత మహిళలిద్దరినీ చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించి ఘటనా స్థలానికి వెళ్లి దాడికి పాల్పడిన నలుగురిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. కానీ ఆ తర్వాత వారిని వదిలి వేయడంపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని తిరిగి పోలీస్ స్టేషన్కు బాధిత మహిళలు వచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. గత రెండు రోజులుగా తిరుగుతున్నా పట్టించుకోకపోగా.. ఇదే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్సై ఏకంగా మీపైనే కేసు పెడతాం అంటూ తమనే బెదిరించారని బాధిత మహిళలు చెబుతున్నారు. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ప్రచారం చేస్తుండగా ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో మాత్రం నిరుపేద మహిళలపై దాడి చేసిన వారిని కేసులు పెట్టడానికి కూడా పోలీసులు మీనమేషాలు లెక్కించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆలస్యంగా ఎఫ్ఐఆర్ ఎందుకంటే: సురేష్ బాబు, ఎస్హెచ్వో, ఆర్మూర్ ’’ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఇతర కేసుల ఒత్తిడిలో ఇద్దరు మహిళలపై దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆలస్యం అయింది. దాడి చేసిన నలుగురిపై శుక్రవారం రాత్రి 324 సెక్షన్ కేసు నమోదు చేశాము. బాధిత మహిళలపై సైతం కౌంటర్ కేస్ ఫైల్ చేశాము.’ -
ముదివేడు పీఎస్ లో చంద్రబాబుపై కేసు నమోదు
-
అన్నమయ్య జిల్లా: చంద్రబాబుపై కేసు నమోదు
సాక్షి, అన్నమయ్య జిల్లా: ముదివేడు పీఎస్లో చంద్రబాబుపై కేసు నమోదైంది. ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో అంగల్లులో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. ‘ఒళ్లు దగ్గర పెట్టుకోండి. నాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. తమాషాలు చేస్తున్నారా, చూసుకుందాం రండి రా.. నా కొడకల్లారా.. వాళ్లను తరమండిరా..’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు పోలీసులపైకి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. ప్రాజెక్టుల పర్యటన పేరుతో గత శుక్రవారం ఆయన అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరు, పూతలపట్టులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, పోలీసులను ఇష్టానుసారం మాట్లాడారు. డీఎస్పీ కేశప్పను ఉద్దేశిస్తూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఆ బట్టలు తీసేయండయ్యా. అందరూ పెయిడ్ ఆర్టిస్టులే. గాడిదలు కాస్తున్నారా’ అంటూ నోరుపారేసుకున్నారు. చదవండి: పుంగనూరు ఘటన: పరారీలోనే కీలక సూత్రధారి, టీడీపీ నేత చల్లా బాబు కాగా, పుంగనూరులో పోలీసులపై తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల దాడి కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్కు తరలించారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ల సంఖ్య 74కు చేరింది. పలమనేరు డీఎస్పీ సుధాకర్రెడ్డి, పుంగనూరు సీఐ అశోక్కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ అల్లరి మూకలపై ఐదు కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రధాన సూత్రధారి అయిన నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చల్లా బాబు పరారీలో ఉన్నారు. ఆయన పీఏ గోవర్ధన్రెడ్డి పోలీసులకు చిక్కాడు. పథకం ప్రకారమే పోలీసులపై దాడులు చేశామని అతడు తెలిపినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. -
కృష్ణలంక పీఎస్ లో పవన్ పై కేసు నమోదు
-
'ది కేరళ స్టోరీ' సినిమా చూసొచ్చి.. బాయ్ఫ్రెండ్పై కేసు పెట్టిన మహిళ
ది కేరళ స్టోరీ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఎట్టకేలకు ఏదోలా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఏదో ఒక నెపంతో సినిమా బ్యాన్ చేయడం, థియేటర్ల ప్రదర్శించకుండా నిషేధించడం వంటి కష్టాలు చుట్టుముట్టాయి. అయినప్పటికీ ఆ సినిమా ఐ డేంట్ కేర్ అంటూ మంచి కలెక్షన్లు రాబడుతూ ప్రభంజన సృష్టించింది. ఐతే తాజాగా ఈ సినిమా ఓ ప్రేమ జంట నడుమ చిచ్చు పెట్టి..పోలీసు కేసులు పెట్టుకునేంత వరకు వెళ్లింది. ఏం జరిగిందంటే..పోలీసులు తెలిపన కథనం ప్రకారం..మధ్యప్రదేశ్ ఇండోర్లో 23 ఏళ్ల వ్యక్తిని పోలీసులు ఓ మహిళ ఫిర్యాదుపై అరెస్టు చేశారు. వారిద్దరు ఇటీవలే ది కేరళ స్టోరీ చూశారు. ఏమైదో ఏమో ఆ సినమా చూసొచ్చాక ఒక్కసారిగా ఆమెలో చైతన్యం కట్టుతెంచుకుంది. తనను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి, అత్యాచారం చేశాడంటూ బాయ్ఫ్రెండ్పై కేసు పెట్టింది. ప్రస్తుతం అతనితో కలిసి జీవిస్తున్నట్లు పేర్కొంది సదరు మహిళ. తనను మతం మారాలని మానసికంగా ఏడిపిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేశారు. ఇటీవలే తాము ది కేరళ స్టోరీ సినిమా చూశామని, ఆ తర్వాత తమ మధ్య వాగ్వాదం తలెత్తిందని పోలీసులకు తెలిపింది. తదనంతరం తనపై దాడి చేసి పరారయ్యాడని వాపోయింది సదరు మహిళ. ఈ మేరుకు ఆమె 19న పోలీసులను ఆశ్రయించి బాయ్ఫ్రెండ్పై కేసు పెట్టినట్లు తెలిపారు పోలీసులు. కాగా, నిందితుడు 12వ తరగతి చదువుకున్న నిరుద్యోగి కాగా, బాధిత మహిళ ఉన్నత విద్యావంతురాలు, ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. నాలుగేళ్లక్రితం కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు ఆ వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు పోలీసు అధికారి దినేష్ వర్మ పేర్కొన్నారు. తాము ఆరోపణలను క్షణ్ణంగా పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. (చదవండి: రూ.2 వేల నోట్లు వెనక్కి.. ఏ పత్రాలు అవసరం లేదు.. కేంద్రం తెలివి తక్కువ పని.. చిదంబరం సెటైర్లు) -
వీడియో: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు పెట్టిన సొంత కూతురు
-
ఏసీబీకి చిక్కిన సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్
కర్నూలు: కర్నూలు కృష్ణానగర్లోని డివిజనల్ కోఆపరేటివ్ కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్న పి.సుజాతపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ఆమె నివాసం ఉంటున్న కర్నూలు శ్రీరామ్నగర్లోని నాగులకట్ట వద్దనున్న ఇంటితో పాటు బంధువుల ఇళ్లు, కోఆపరేటివ్ కార్యాలయంలో మొత్తం ఆరు చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు తేజేశ్వరరావు, కృష్ణారెడ్డి, శ్రీనాథ్రెడ్డి, కృష్ణయ్య, ఇంతియాజ్ బాషా, వంశీనాథ్ తదితరులు బృందాలుగా ఏర్పడి మంగళవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే దాకా విస్తృతంగా సోదాలు జరిపారు. వీటిలో అక్రమ స్థిర, చరాస్తులను గుర్తించారు. కర్నూలుకు చెందిన సుజాత 1993 డిసెంబర్ 9న జూనియర్ ఇన్స్పెక్టర్ హోదాలో కోఆపరేటివ్ శాఖలో ఉద్యోగంలో చేరారు. 1999లో సీనియర్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది కర్నూలు, ఆత్మకూరు ప్రాంతాల్లో పనిచేశారు. 2009లో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా పదోన్నతి పొందారు. ఆత్మకూరుతో పాటు కలెక్టరేట్లోని డీసీవో కార్యా లయంలో విధులు నిర్వర్తించారు. గత ఆరేళ్లుగా కర్నూలు కృష్ణానగర్లోని డివిజనల్ కోఆపరేటివ్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. సోదాల్లో గుర్తించిన అక్రమాస్తులు ఇవే.. కర్నూలులోని శ్రీరామ్ నగర్లో జి+2 ఇల్లు, అశోక్ నగర్లో జి+1 ఇల్లు, కస్తూరి నగర్లో ఒక ఇల్లు, బుధవారపేటలో జి+1తో పాటు సమీపంలోనే మరో వ్యాపార దుకాణం, కర్నూలు మండలం సుంకేసులలో 2.53 ఎకరాల వ్యవసాయ భూమి, కర్నూ లు చుట్టుపక్కల 8 ఇళ్ల స్థలాలు, బ్యాంకు లాకర్లో 40 తులాల బంగారు నగలు, టాటా విస్టా కారు, హోండా యాక్టివా స్కూటీతో పాటు ఖరీదైన ఎల క్ట్రానిక్ గృహోపకరణాలు, రూ.8.21 లక్షల నగ దుతో పాటు కొన్ని ప్రామిసరీ నోట్లు గుర్తింపు. డాక్యుమెంట్ ప్రకారం వీటి విలువ రూ.1.80 కోట్లు కాగా బహిరంగ మార్కెట్లో అక్రమాస్తుల విలువ రూ.10 కోట్ల పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. దర్యాప్తు అనంతరం సుజా తను కర్నూలులోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చ నున్నట్లు డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. పటమట సబ్ రిజిస్ట్రార్ ఇంట్లోనూ సోదాలు సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పటమట సబ్ రిజిస్ట్రార్ అజ్జా రాఘవరావు కార్యాలయం, నివాసంతోపాటు మరో నాలుగు ప్రదేశాల్లో ఉన్న ఆయన బంధువుల నివాసాల్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయనికి మించి ఆర్జించిన స్థిర, చరాస్తులు ఆర్జించారన్న పక్కా సమాచారంతో ఈ సోదాలు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి వరకు నిర్వహిస్తున్న సోదాలు బుధవారం కూడా కొనసాగనున్నాయి. అనంతరం తాము గుర్తించిన ఆదాయానికి మించిన ఆస్తుల వివరాలను వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. -
టీడీపీ శ్రేణులపై పోలీసులు కేసులు నమోదు
-
కుప్పం పోలీస్స్టేషన్లో అచ్చెన్నాయుడిపై కేసు నమోదు
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్స్టేషన్లో అచ్చెన్నాయుడిపై కేసు నమోదైంది. నిన్న కుప్పం బహిరంగ సభలో పోలీసులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కుప్పం ఎస్ఐ శివకుమార్ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, యువగళం పాదయాత్ర మొదటరోజే తేలిపోయింది. దాదాపు రెండు నెలలుగా ఆహా..ఓహో.. అంటూ ఊదరగొట్టినా.. జనాలను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. శనివారం టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు స్పందన అంతంతమాత్రంగా కనిపించింది. ఆయన కుప్పంలోని లక్ష్మీపురం నుంచి పాదయాత్ర ప్రారంభించగా.. సాయంత్రం కమతమూరు సమీపంలో జరిగిన బహిరంగ సభ జనాలు లేక వెలవెలబోయింది. చదవండి: లోకేశ్ పాదయాత్ర: ఎక్కడికక్కడ గొడవలకు దిగండి.. చంద్రబాబు కుయుక్తులు? -
కందుకూరు ఘటనపై ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు
సాక్షి, అమరావతి: గత నెల 28న నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రోడ్ షోలో ఎనిమిదిమంది మృతిచెందిన ఘటనపై జాతీయ మానవహక్కుల సంఘం (నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ – ఎన్హెచ్ఆర్సీ) కేసు నమోదు చేసింది. జనాలు ఎక్కువమంది వచ్చారని చూపించుకోవడం కోసం ఉద్దేశపూర్వకంగా ఇరుకైన వీధుల్లో రోడ్షో ఏర్పాటు చేసి తొక్కిసలాటకు తావిచ్చారని, దీంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ విజయవాడకు చెందిన వైద్యుడు అంబటి నాగరాధాకృష్ణ యాదవ్ ఎన్హెచ్ఆర్సీకి గత నెల 29న ఫిర్యాదు చేశారు. ఇరుకైన వీధుల్లో జనాలు పోగైతే డ్రోన్ షాట్స్ బాగా వస్తాయని, వీటిని పార్టీ పబ్లిసిటీ కోసం వినియోగించుకోవచ్చని నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా రోడ్ షోకు ప్రణాళిక రచించారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు పబ్లిసిటీ కోసం చేసిన చర్యల ఫలితంగా తొక్కిసలాట జరిగి 29 మంది మృతిచెందారని ఫిర్యాదుదారుడు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కందుకూరు ఘటనపై నిష్పక్షపాతంగా విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తన ఫిర్యాదుపై ఈ నెల 10వ తేదీన కమిషన్ కేసు నమోదు చేసిందని రాధాకృష్ణ ‘సాక్షి’ తో చెప్పారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల? వంగా గీత రియాక్షన్
మిమిక్రీ చేసే పక్షులు!
హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
ఎమిరేట్స్ విమానం ఢీ.. 40 ఫ్లెమింగో పక్షులు మృతి
భారత హెడ్కోచ్ సెలక్షన్.. అతడిని ఒప్పించే బాధ్యత ధోనీదే!
బుల్లితెరపై శ్రీమద్ రామాయణం.. మిస్ట్ కాల్తో బహుమతి గెలవండి!
స్మోక్ పాన్: 12 ఏళ్ల బాలిక దుస్థితి తెలిస్తే జన్మలో దాని జోలికెళ్లరు
మహీంద్రా ఫైనాన్స్ సీఆర్ఓగా 'మహేష్ రాజారామన్'
ఎల్లో మీడియాపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా
ప్రపంచకప్ జట్టులో దక్కని చోటు.. రింకూ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- ‘సీఎం రేసులో ఉన్నానని చెప్పేందుకు ఢిల్లీకి రూ.100 కోట్లు’
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- IPL 2024: ధోనిని అవమానించిన ఆర్సీబీ ప్లేయర్లు!.. తప్పు ‘తలా’దేనా?
- కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
- T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్కు మరోసారి!
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement