-
పౌర సమాజం మేల్కోవాలి !
దేశంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వైరి పక్షాల మధ్య మాటల యుద్ధం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది . కానీ మన రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండగా.. చంద్రబాబు కోసం కొన్ని పత్రికలు, ఛానళ్లు ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగి తెలుగుదేశం కంటే కూడా ఎక్కువగా చావో రేవో అన్నట్లుగా వైఎస్సార్సిపి మీద తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. నిత్యం నీతులు వల్లించే రామోజీ ఇప్పుడు విలువలను విడిచి చంద్రబాబు కోసం గారడీలు చేయడం దీనికి పరాకాష్ట.నిజానికి రామోజీ మొదటి నుండీ వైయస్ కుటుంబానికి వ్యతిరేకంగా పని చేస్తూనే ఉన్నాడు, కాకపోతే పాతరోజుల్లో నగ్నంగా కనిపించకుండా ముసుగు వేసుకొని టీడీపీకి కొమ్ముకాసేవాడు. ఇప్పుడు ఈ ముసుగులన్నీ తొలగించి నగ్నంగానే విచ్చలవిడిగా అన్ని కట్టుబాట్లు గాలికొదిలేసి పుఖానుపుంఖాలుగా విషం చిమ్ముతున్నాడు. ఈనాడు పత్రికను చూస్తే.. అవసానదశలో కూడా రామోజీ ఎంత నీచ స్థాయికి దిగజారిపోయాడో అని ఆశ్చర్యంగా ఉంది. అంతెందుకు, నా సొంత అనుభవాన్నే తీసుకోండి. ఎటువంటి ఆధారాలూ లేకుండా "సీబీఐ వెతుకుతున్న నిందితుడు" అనే హెడ్లైన్ పెట్టి ఈనాడులో మూడ్రోజులు అడ్డమైన రాతలు రాయడం .. రామోజీ దిగజారుడు తనానికి పరాకాష్ట. విచిత్రంగా అసలు కేసు ఏమిటి? అది నిజంగా ఇంకా వుందా లేదా? ఒకవేళ ఉంటే ఏ స్థాయిలో వుంది? నోటీసులు ఇచ్చారా లేదా? ఇస్తే ఏ రకమైన నోటీసులు ఇచ్చారు? ఆ నోటీసులు ఇంకా అమల్లో ఉన్నాయా? ఇలాంటివేవీ ఆ మూడ్రోజుల రాతల్లో ఎక్కడా కనిపించలేదు. కనీసం కేసు తాలూకు వివరాలు తెలుసుకొనే ప్రయత్నం కూడా చేయలేదు .లుక్ అవుట్ అంటే ఏమిటి ? ఇంటర్పోల్ అంటే ఏమిటి? అవి ఏ ఏ దేశాలలో ఏ విధంగా పనిచేస్తాయో అన్న కనీస అవగాహన లేకుండా .. ఏదో అంతర్జాతీయ ఉగ్రవాది కేసు చేధించినట్లు పెద్ద పెద్ద అక్షరాలతో ప్రధాన వార్తగా అచ్చేశాడంటే .. రామోజీ ఎంత అభద్రతా భావంలో బ్రతుకుతున్నాడో తెలుస్తుంది. పేరు మార్చానంట... వేషం మార్చానంట. సినిమా వాళ్ళు కూడా ఇంత పకడ్భందిగా స్టోరీ అల్లలేరు. ఎవరో ఇచ్చిన స్టోరీని కనీసం నిజానిజాలు నిర్దారించుకోకుండా యధాతధంగా అచ్చేసి రామోజీ శునకానందం పొందటం తప్పితే ఇందులో ఎలాంటి నిజాలు లేవు.పుట్టినప్పుడు తల్లితండ్రులు పెట్టిన పేరుతోనే వున్నాను, వయస్సుతో వచ్చిన మార్పులు తప్పితే వేషంలో కూడా ఎలాంటి మార్పులు లేవు. జుట్టు ఊడిపోతే విగ్గురాజు లాగా విగ్గు ఎందుకులే అని స్టయిలిష్గా ఫుల్ షేవ్ చేస్తాను . నన్ను వ్యక్తిగతంగా ఎరిగిన ప్రతీ ఒక్కరికీ ఈ విషయాలు తెలుసు. నా మీద ఎలాంటి కేసులు లేవు, ఎలాంటి నోటీసులు లేవు . గుండుతో ఉంటే ఎయిర్పోర్టులో వదిలేస్తారా ? రామోజీకి మన వ్యవస్థల మీద ఎంత చిన్న చూపు వుందో అర్థం చేసుకోండి.నా మీద వార్త రాస్తున్న సమయంలోనే ప్లాన్ లో భాగంగా నా ఫేస్బుక్ అకౌంట్ మీద రిపోర్టులు కొట్టించి 24 గంటలు బ్లాక్ అయ్యేలా కుట్ర పన్నారు. పైగా "చూశారా, అకౌంట్ కూడా క్లోజ్ చేసాడని" అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు . నేను ఫేస్బుక్కి ఛాలెంజ్ ఆప్షన్ పెట్టి అకౌంట్ను వెనక్కి తెచ్చుకొని పోస్ట్ పెట్టేవరకూ యెల్లో మీడియా అంతా చెలరేగిపోయింది.చిన్నప్పటి నుండీ పత్రికల్లో రాతలకి, రోత రాజకీయాలకి , ఎన్నికలప్పుడు ప్రచారం చేసే పుకార్లకు అన్నిటికీ అలవాటు పడ్డవాళ్ళం కాబట్టి రామోజీ రాతలు చూసి మనకేదో పబ్లిసిటీ వచ్చిందిలే అని నవ్వుకున్నాం కానీ ... అదే నా స్థానంలో గీతాంజలి లాంటి అభాగ్యులు వుంటే అలాంటి వార్తలకు ఎంతమంది తట్టుకొని నిబ్బరంగా ఉండగలరు.? ఒకపక్క సోషల్ మీడియాలో వచ్చే నెగెటివ్ వార్తలకే ప్రాణాలు తీసుకొంటుంటే .. ఈనాడు లాంటి ప్రధాన పత్రికలో మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో కధనాలు వస్తే ఎంతమంది తట్టుకొని నిలబడగలరు?ఇదే విషయమై మొన్న ఈనాడులో పనిచేసిన పాతతరం జర్నలిస్టులు కలిసినప్పుడు చర్చకి వస్తే వాళ్ళు చెప్పిన గత సంగతులు వింటే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే! వాళ్ళు చెప్పిన దాని ప్రకారం .. రామోజీ మాట వినని ప్రభుత్వ అధికారులమీద , వివిధ వ్యవస్థలలో ఉన్న అనేకమంది ప్రముఖుల మీద , ఆఖరికి సొంత వ్యవస్థలో పనిచేసే వాళ్ళ మీద కూడా ఇలాంటి దొంగ వార్తలు రాసి దారికి తెచ్చుకొనేవాడట . అలా తన దారికి రానివాళ్ళమీద మరింత విషపూరితంగా రాసి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడట. ఇది రామోజీ దగ్గర అనేక సంవత్సరాలుగా దగ్గరగా పనిచేసిన సీనియర్ జర్నలిస్టులు చెప్పిన సంగతులు.రామోజీ ఇంత నీచస్థాయికి దిగజారటానికి కారణాలు ఏమిటి ?తరచి చూస్తే కారణాలు సుస్పష్టం. రామోజీ తన జీవితపు అవసాన దశలో ఉన్నాడు. నిజానికి ఈ వయస్సులో ఎవరైనా మరింత హుందాగా గౌరవం పొందాలని .. శత్రువులతో కూడా మంచి అనిపించుకోవాలని తాపత్రయపడతారు. నలభై ఏళ్లుగా తన టక్కుటమారా విద్యలతో ఒంటికి తెల్లని బట్టలు ముసుగుగా తొడిగి మీడియాని అడ్డం పెట్టుకొని వ్యవస్థలన్నిటినీ చెరబట్టాడు, అధికారం అండతో చెలరేగిపోయాడు. ముఖ్యంగా తనకి ఎదురు తిరిగిన ఎన్టీఆర్ ని దించి చంద్రబాబుని ఎక్కించటంలో సఫలీకృతుడు అవ్వటంతో ఇక తనకి ఎదురే లేదని, తానే సర్వాంతర్యామి అనే స్థాయికి చేరుకున్నాడు.చంద్రబాబు వెన్నుపోటు దిగ్విజయం అవ్వటంతో తాను తలచుకుంటే ముఖ్యమంత్రులను దించేయగలననీ .. అనుకుంటే ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయగలనని భయపెట్టగలిగాడు. చంద్రబాబు హయాంలో రామోజీకి ఎదురు లేకుండా పోయింది. ఫిలింసిటీకి రూపకల్పన చేసి వేల ఎకరాలని దోచుకొని ఆఖరికి రాష్ట్రం విడిపోవటానికి బీజాలు కూడా వేసాడు. విడిపోయిన రాష్ట్రానికి తన మనిషి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వటం .. ఆ ఊపులోనే దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ రావటంతో ఇక తనకి తిరుగే లేదని .. తాను దేవేంద్రుడంతటి వాడినని తనకో రాజధాని కావాలనే ఉద్దేశ్యంతో దానికి అమరావతి పేరు పెట్టి ' ఇది మారాజ్యం / మా ఏలుబడిలో ఉన్న రాజ్యం ' అని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలనే కుఠిల బుద్ధితో ఎన్నో అరాచకాలు చేసారు.2019 ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు ఈడ్చికొట్టడం, ఆ తరువాత మార్గదర్శి కేసులో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో రామోజీకి కళ్లు బైర్లు కమ్మినట్టయింది. మార్గదర్శి ఫైనాన్సియల్ మీద ఎంక్వయిరీ జరుగుతుండడంతో తన మోసాలు బట్టబయలు అవ్వటం ఖాయమని నిర్దారించుకున్నాడు రామోజీ. మార్గదర్శిలో అక్రమంగా డిపాజిట్లు సేకరించటమనేది కేసులో ఒక పార్శం మాత్రమే. వాస్తవానికి నిజమైన డిపాజిట్ దారులు 10 శాతం మంది మాత్రమే, మిగతా డబ్బంతా చంద్రబాబు బినామీదారులే... నల్ల డబ్బుని .. ఎల్లయ్య, పుల్లయ్య పేరులతో డిపాజిట్ దారులుగా రికార్డులు సృష్టించి మార్గదర్శిలో దాచుకున్నారు. అందుకే ఫిర్యాదు ఇచ్చే వాళ్లు కనిపించరు. ఎందుకంటే అక్కడ ఉన్నది 90 శాతం ఫేక్ డిపాజిట్ దారులే. కేసు ముందుకి వెళ్లే కొద్దీ ఈ అసలైన ఈ విషయం బయటకొస్తుంది. వీటన్నిటి నుండి రామోజీ తప్పించుకోవటం అసంభవం.రామోజీకి ఇప్పుడు 88 ఏళ్ళు. జీవితపు అవసాన దశలో ఉన్నాడు. కీర్తి ప్రతిష్టలు పతాక స్థాయిలో ఉన్నప్పుడు మరణిస్తే శాశ్వత కీర్తి వస్తుంది. ఎవరైనా అదే కోరుకొంటారు. కానీ రామోజీ విషయంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది . అందుకే రామోజీ కంపించిపోతున్నాడు. కేసులలో తనకి శిక్ష పడటం ఖాయమని.. సమాజానికి తన నిజ స్వరూపం బట్టబయలు అవ్వటంతో పాటుగా కేంద్రం ఇచ్చిన పద్మవిభూషణ్ కూడా తిరిగి తీసుకుంటారని .. ఇది దేశంలో మరెవ్వరికీ జరగని ఘోరమైన అవమానమని రామోజీ భయకంపితులవుతున్నాడు. అవమానభారంతో మరణిస్తే ఇన్ని రోజులు తన టక్కుటమారా విద్యాలతో నిర్మించిన సామ్రాజ్యం , సంపాదించిన పేరు ప్రఖ్యాతలు అన్నీ కుప్పకూలిపోవటం ఖాయమని , రామోజీ అనేది ఒక విషపురుగుగా చరిత్ర గుర్తు పెట్టుకుంటుందనే ఆందోళనలో రామోజీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు .ఇదంతా తప్పించుకోవాలంటే రామోజీ ముందున్న ఏకైక మార్గం మళ్ళీ చంద్రబాబుని ముఖ్యమంత్రి చెయ్యటం . అదొక్కటే రామోజీ ముందున్న పరిష్కారం . అందుకోసమే ఎన్నడూ లేనంతగా దిగజారి విషం చిమ్ముతున్నాడు . రాజకీయపార్టీల కంటే కూడా స్వయంగా తానే పోటీ చేస్తున్నట్లు భావిస్తూ పేపర్ మొత్తాన్ని విషంతో నింపేస్తున్నాడు. గడచిన కొద్ది నెలలుగా ప్రధాన శీర్షికలని గమనించండి. ఒక్కటంటే ఒక్క అక్షరం కూడా నిజం లేకుండా ప్రభుత్వం మీద మీద ఊహించనంత స్థాయిలో విషం చిమ్ముతూ తాను ఎంత ఆందోళనలో ఉన్నాడో చెప్పకనే చెప్తున్నాడు. విషయం చిన్నదా, పెద్దదా? నిజమా, అబద్దమా? అనే దానితో నిమిత్తం లేకుండా ఏదో రకంగా ఎదుటి పక్షానికి నష్టం చేయాలి .. ఈనాడు పరువుపోయినా ఫరావాలేదు .. కొద్దిమంది నమ్మినా అంతే చాలు .. అనే తరహాలో సిగ్గు విడిచేసి పుంఖానుపుంఖాలుగా వార్తలని వండి వారుస్తున్నాడు .అందుకే పౌర సమాజం మేల్కోవాలి , నిజాలని గ్రహించి సమాజపు భవిష్యత్ గురించి ఆలోచన చేయాలి. దానికి ఒక తేదీ ఉంది. జూన్ 4, 2024.శివ అన్నపురెడ్డి, అమెరికా -
చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?
-
అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
పెళ్లి ముహూర్తం రెండ్రోజులే వుంది.. పీటలమీద ఇవ్వాల్సిన కట్నం కానుకలకు రావాల్సిన డబ్బు రాలేదు... ఇస్తానన్నవాడు పత్తాలేకుండాపోయాడు. వాణ్ని నమ్ముకుని ముహూర్తం పెట్టుకున్నాం... ఇప్పుడెలా ? డబ్బు లేకుంటే పెళ్లి ఆగిపోతుంది. నాన్న ఆపరేషన్కు పది లక్షలు ఇస్తే తప్ప కత్తెర పట్టేదిలేదన్నాడు డాక్టర్.. టైం ముంచుకొచ్చింది... డబ్బులు రాలేదు. ఇప్పుడెలా ? ఆపరేషన్ చేయకుంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే.అబ్బాయికి అమెరికా చదువుకు వీసా వచ్చింది.. కానీ అక్కడి కాలేజీ వాళ్ళు డబ్బు డిపాజిట్ చేయమన్నారు.. కట్టేస్తాం అని రెడీ అయ్యాం...టిక్కెట్స్ తీసేసాం... లగేజ్ సర్దేసామ్ కానీ చివరలో డబ్బు రాలేదు.. ఎలా మరి..చదువు ఆగిపోవాల్సిందేనా ? ఇలా ఉంటుంది డబ్బు పరిస్థితి... అవసరానికి అందకపోతే వారి మానసిక పరిస్థితి కూడా దారుణంగా ఉంటుంది..తొలివిడతగా ఇచ్చిన డబ్బులు ఈ నెలన్నర రోజుల ప్రచారంలో ఖర్చయిపోయాయి ...మున్ముందు ఇంకా ఇస్తాం అని హామీ ఇచ్చినవాళ్లు చివరలో చేతులు ఎత్తేసారు..దీంతో టీడీపీ ఎంపీ అభ్యర్థులు డైలమాలో పడ్డారు.. రెండ్రోజుల్లో ఎన్నికలు ఉండగా దాదాపు ఏడుగురు చిన్న ఎంపీలు ( అంటే ఓ మోస్తరు స్తొమత ఉన్నవాళ్లు ) చేతిలో డబ్బుల్లేక గిలగిలా కొట్టుకుంటున్నారు.బిగ్ షాట్స్ ...శ్రీభరత్ వంటివాళ్ళు ఏదోలా నెట్టుకొస్తున్న... చోటామోటా ఎంపీ అభ్యర్థులు మాత్రం డబ్బుల్లేక ఇటు క్యాడర్కు ఎమ్మెల్యే అభ్యర్థులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. ముందు మీదగ్గర ఉన్నది ఖర్చు చేయండి ..ఢిల్లీ పెద్దలు ఎలాగు మనతోనే ఉన్నారు కాబట్టి ఎక్కణ్ణుంచయినా డబ్బు తెచ్చుకోవచ్చు. మనల్ని ఎవరూ ఆపరు..ఆపలేరు... అనే చంద్రబాబు భరోసాతో ఎంపీ టిక్కెట్లు పొందిన కొందరు టీడీపీ అభ్యర్థులు తమ దగ్గర ఉన్న డబ్బును ఇన్నాళ్లూ ఖర్చు చేసారు. దీంతోబాటు తమ పరిధిలోనే ఏడుగురు ఎమ్మెల్యేలకు సైతం డబ్బు సర్దుబాటు చేసే బాధ్యత వాళ్ళకే ఉండడంతో ఇబ్బందిపడుతున్నారు.గతంలో లేనట్లు దాదాపు ఎన్నికలకు .నోటిఫికేషన్కు ఎక్కువ టైం ఉండడంతో ఖర్చులు కూడా అమాంతం పెరిగాయి. డబ్బు వస్తుంది అనుకున్న మార్గాలు వివిధ కారణాలవల్ల మూసుకుపోవడంతో సప్లై ఆగిపోయింది... అలాంటి పనులకోసం పనికొస్తారనుకున్న ఢిల్లీ పెద్దలు ఇప్పుడు 'అలాంటివేం కుదరదు.. అంతా ఈసీ పరిధిలో వుంది మీ చావు మీరు చావండి.." అని చావు కబురు చల్లగా చెప్పడంతో ఏమి చేయాలో తోచడం లేదు.ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ తమ వాళ్లకు పరిచయస్తులకు ఫోన్లు చేసి ఓ రెండు, మూడుట్లు ఉంటే సర్దు గురూ అని అడుగుతున్నా ఈ రోజుల్లో అలాంటివి కష్టం అని వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మధ్యతరగతి ఎంపీ అభ్యర్థులు ఈ చివరి రోజుల్లో చేతులు నలుపుకుంటున్నారు.ఇన్నాళ్లూ ఖర్చుపెట్టింది ఒక ఎత్తు.. ఈ చివరి మూడు రోజులూ ఇంకో ఎత్తు. ఓటర్లకు పంచడమే కాకుండా ఎన్నికల పనుల్లో ఉండే మండల గ్రామ స్థాయి క్యాడరుకు డబ్బును నీళ్ల మాదిరి పారిస్తే తప్ప మాట వినరు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో కిందికి కాళ్ళు అందాకా పైకి చేతులు అందాకా తాటిచెట్టు ఎక్కుతూ మధ్యలో ఉండిపోయిన పిల్లాడి పరిస్థితి అయిపొయింది. ఇటు క్యాడర్ మాత్రం డబ్బు వస్తుంది... రెచ్చిపోదాం అని ఆశగా ఎదురుచూస్తున్నారు. -సిమ్మాదిరప్పన్న -
పేదల బతుకులతో ఆడుకుంటున్న టీడీపీకి ఓటేయ్యాలా?: మంత్రి బొత్స
సాక్షి, విజయనగరం జిల్లా: పేదవాళ్ల బతుకులతో ఆటలాడుతున్న కూటమికి ఓటు వేయాలా? అంటూ ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పేదల పట్ల చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నీచమైన ఆలోచనలతో ఈసీకి ఫిర్యాదు చేశారని ధ్వజమెత్తారు.‘‘చంద్రబాబు కూటమికి అవ్వాతాతల ఉసురు తగులుతుంది. రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ అందకుండా చేశారు. ఈబీసీ నేస్తం, విద్యా దీవెన డబ్బులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఓటమి భయంతో చంద్రబాబుకు నిద్రపట్టడం లేదు. ఈసీ నిర్ణయం ధర్మం కాదు.. మేము వ్యతిరేకిస్తున్నాం. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం ధర్మమా?’’ అంటూ మంత్రి బొత్స ఆవేదన వ్యక్తం చేశారు.‘‘మీ భూమి మీది కాదు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రామోజీ రావుకి ప్రజల పట్ల బాధ్యత లేదా?. డబ్బులు ఇస్తే గడ్డి కరుస్తారా? ఈనాడు ప్రకటనలో ఏ మాత్రమైనా వాస్తవం ఉందా?. ఈ 40 ఏళ్ల ఇంత దరిద్రమైన రాజకీయాలు చూడలేదు.’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. -
ఏపీకి మళ్లీ జగనే సీఎం: KCR
-
చంద్రబాబు అరువు మేనిఫెస్టో.. ఆ రాష్ట్రాల్లో పరిస్థితి ఇదే..
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెలుగుదేశం కూటమి అబద్దాలకు అంతు లేకుండా పోతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఇక అసత్యాలే గత్యంతరం అన్నట్లుగా ప్రచారాన్ని పెంచాయి. టీడీపీ భారీ ఎన్నికల వాగ్దానాలు చేసినా, జనం వాటిని నమ్మడం లేదు. అందుకే లాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ పచ్చి మోసపూరిత ప్రచారానికి కూటమి దిగింది. ఫుల్ పేజీ ప్రకటనలే కాకుండా, అవే అబద్దాలతో ఈనాడు మీడియా పెద్ద ఎత్తున కథనాలు కూడా వండివార్చింది.దీనికి ఒకటే కారణం కనిపిస్తుంది. సూపర్ సిక్స్ అంటూ టీడీపీ, జనసేనలు ఇచ్చిన హామీలు అయ్యేవి, పోయేవి కాదని ప్రజలు నిశ్చితాభిప్రాయానికి రావడమే. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్నాటక వంటి రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికల సందర్భంగా దాదాపు ఇవే తరహా వాగ్దానాలు చేసి, అధికారంలోకి వచ్చినా వాటిని అమలు చేయలేక సతమతమవుతున్నాయి. ఆ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఇచ్చిన మానిఫెస్టోలలోని వాగ్దానాలతో పాటు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న నవరత్నాలలోని అంశాలను జోడించి చంద్రబాబు కాపీ మానిఫెస్టోని తయారు చేసుకున్నారు. జగన్ ఇచ్చే స్కీముల కన్నా ఇంకా ఎక్కువ ఇస్తామని చెబుతున్నారు. అందుకు అయ్యే వ్యయం ఎంతో మాత్రం టీడీపీ చెప్పడం లేదు.ఆరు గ్యారంటీల అమలు సంగతేంటి?ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ హామీలు ఎన్ని అమలు అవుతున్నాయో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. విశేషం ఏమిటంటే హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం బీఆర్ఎస్ స్వీప్ చేస్తే, గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ స్వీప్ చేసింది. తద్వారా అవసరమైన మెజార్టీకన్నా కాంగ్రెస్కు కొద్దిగా ఎక్కువ సీట్లు వచ్చాయి. ఫలితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలలో చాలావరకు అమలు చేశామన్న అభిప్రాయం ప్రజలలో కలిగించడానికి గట్టి కృషి చేస్తున్నారు. రేవంత్ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తదితరులు, అలాగే బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటివారు కార్నర్ చేస్తున్నారు.నోరు జారిన రాహుల్కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నిర్మల్లో జరిగిన సభలో మాట్లాడుతూ.. మహిళలకు ప్రతి నెల ఇస్తామని చెప్పిన 2500 రూపాయల హామీని అమలు చేసినట్లు చెప్పారు. దీనిపై కేసీఆర్ మండిపడ్డారు. నిజానికి కాంగ్రెస్ ఇచ్చిన మానిఫెస్టోలో అనేకం ఆచరణ సాధ్యం కానివని అప్పట్లో అందరూ గుర్తించినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. అందుకు ప్రధాన కారణం కేసీఆర్ అనుసరించిన అహంభావ పూరిత ధోరణి అన్నది ఎక్కువ మంది రాజకీయ విశ్లేషకుల అబిప్రాయం. పలు అబియోగాలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేలకు కూడా టిక్కెట్లు ఇచ్చి ఆయన నష్టపోయారు. అది వేరే కథ.ఏపీలో తెలుగుదేశం కూటమి అనేక వాగ్దానాలు చేసి ప్రజలను ఓట్లు అడుగుతోంది. జనం వాటిని నమ్మకపోవడంతో కొత్తగా లాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అబద్దాలను సృష్టించి టీడీపీ కేసులలో చిక్కుకుంది. అయినా వదలకుండా అదే అంశంపై ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ స్త్రీలకు ఉచిత బస్ ప్రయాణం హామీని అమలు చేసింది. దీనివల్ల ఆర్టీసీకి వచ్చే నష్టాల సంగతి ఎలా ఉన్నా, అమలు వరకు ఓకే. కానీ దీని ఫలితంగా ఆటోలపై ఆధారపడి బతుకుతున్న లక్షలాది మంది చాలా నష్టపోయారు. మొదట వ్యక్తం అయినంత ఆశాభావ స్థితి ఇప్పుడు ఉన్నట్లు లేదు. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్లకు సబ్సీడీ వంటి స్కీములు అమలు చేసినట్లు చెబుతున్నా, ఎంతమందికి అవి అందుతున్నది చెప్పడం కష్టమే.వంద రోజుల్లో వాగ్దానాలు అమలు.. ఎన్నికల ఫలితాలు వచ్చాక 2023 డిసెంబర్ తొమ్మిదిన రైతుబంధు నిధులను ఎక్కువ చేసి మరీ చెల్లిస్తామని పీసీసీ అధ్యక్ష హోదాలో ప్రకటించారు. ఆ తేదీన చెల్లించలేదు. ఎవరైనా అడిగితే ఇప్పుడేగా ప్రభుత్వం ఏర్పడిందని కాంగ్రెస్ నేతలు దబాయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని, కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల సుడిగుండంలోకి నెట్టేసిందని చెప్పేవారు. అయినా వంద రోజుల్లో అన్ని వాగ్దానాలు అమలు చేస్తామని అనేవారు. ఆ వంద రోజులు దాటిపోయింది. కానీ చాలా వాగ్దానాలు అలాగే ఉండిపోయాయి. ఉదాహరణకు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అంశం తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలలో రాజకీయ పార్టీల మధ్య వాద, ప్రతివాదాలకు కారణం అవుతోంది.రాజీనామాల సవాల్మాజీ మంత్రి హరీష్ రావు ఈ హామీలు అమలు చేశారని రుజువు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాలు చేశారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ బదులు ఇస్తూ రుణమాఫీని ఆగస్టు పదిహేనులోగా చేస్తామని, హరీష్ రాజీనామాకు సిద్దంగా ఉండాలని అంటున్నారు. నిజంగా దీనికి అయ్యే వేల కోట్లు సిద్దం చేసుకుని అమలు చేస్తే రేవంత్కు రైతులలో మంచిపేరే వస్తుంది. కానీ చేయలేకపోతే ఎన్నికల కోసం చెప్పినట్లవుతుంది. కేసీఆర్ రైతు బంధు ఎకరాకు పదివేలు ఇస్తుంటే దానిని పదిహేను వేలు చేసి ఇస్తామని రేవంత్ ప్రకటించారు. కానీ ఆ ప్రకారం ప్రభుత్వం ఇవ్వలేకపోతోంది.విమర్శల వెల్లువకొంతమందికి పాత రైతు బంధు ప్రకారం డబ్బులు జమ అయినా, కాంగ్రెస్ చెప్పినట్లు మాత్రం జరగడం లేదు. అలాగే రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు చొప్పున ఇస్తామన్నది కాంగ్రెస్ వాగ్దానం. ఏఐసీసీ ప్రకటించిన లక్ష రూపాయల సాయానికి ఇది అదనమని రాహుల్ అన్నారు. అక్కడితో ఆగకుండా 2500 రూపాయల చొప్పున స్త్రీలకు చెల్లిస్తున్నట్లు రాహుల్ చెప్పడం విమర్శలకు దారి తీసింది. కేసీఆర్ దీనిని అందుకుని రాహుల్ మాటల వీడియోని జనానికి వినిపించి విమర్శలు గుప్పిస్తున్నారు. రైతుభరోసా కింద రూ.15 వేలు ఇవ్వకపోగా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రూ.పది వేలు కూడా ఇవ్వకుండా రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నదని, అందరికీ రైతుబంధు జమ చేశామని ఒకసారి, ఇక నాలుగు లక్షల మందికే ఇవ్వాల్సి ఉన్నదని మరోసారి చెబుతూ కాలయాపన చేస్తున్నదని బీఆర్ఎస్ చెబుతోంది.స్పష్టత ఇవ్వలేని అయోమయంఎన్నికల తరుణంలో కొంతవరకు ఈ డబ్బు వేసినట్లు తాజాగా అంటున్నారు. మరి రైతు రుణమాఫీని ఎలా చేస్తారు? ఎవరెవరికి వర్తింపజేస్తారు? విధివిధానాలేమిటి? అనే అంశాలపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేని అయోమయం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏ ఊరి వెళ్తే ఆ ఊరి దేవుళ్లు, దేవతల మీద ఒట్టు మీద ఒట్టు పెడుతూ రైతులను నమ్మించేందుకు నానా తంటాలు పడుతున్నారని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. రైతులు పండించిన పంటలకు రూ.500 బోనస్ హామీ బోగస్ ముచ్చటగా మిగిలిందని విపక్షం వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామంటూ ప్రియాంకాగాంధీ చేత యూత్ డిక్లరేషన్ ప్రకటింపజేసి అధికారంలోకి రాగానే మాట మార్చింది. అసలు తాము నిరుద్యోగ భృతి హామీయే ఇవ్వలేదంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరుద్యోగ యువతను వెక్కిరించారు.ఒట్టుల సీఎం..రైతు రుణమాఫీపై రోజుకో దేవుడిపై ఒట్టు పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం నిర్మల్ జనజాతర సభలో మాట్లాడుతూ.. ఇంద్రవెల్లి అమరవీరుల సాక్షిగా ఒట్టు పెట్టారు. ఎర్రవెల్లి జనజాతరలో మాట్లాడుతూ.. జోగుళాంబ అమ్మవారి సాక్షిగా ఒట్టు పెట్టారు. ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ, ఈ నెల 9 లోపు రైతు భరోసా అందజేస్తామని చెప్పారు. ఇప్పటికే ఐదు గ్యారెంటీలను అమలు చేశామని, రాబోయే రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం పరిశీలిస్తే అవి అర్ధ సత్యాలేనని తేలుతుంది. వృద్దులకు పెన్షన్ నాలుగువేల రూపాయలు చేస్తామని కాంగ్రెస్ తెలిపింది. కాని ఆ దిశగా ఇప్పటికీ అడుగులు పడలేదు. దళితులకు కేసీఆర్ పది లక్షల చొప్పునే ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే పన్నెండు లక్షల చొప్పున ఉపాది కల్పన స్కీము కింద ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. ప్రస్తుతం ఆ ఊసే రావడం లేదు.కర్ణాటకలోనూ ఇదే పరిస్థితికర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారు ఇచ్చిన పలు హామీల పరిస్థితి ఇలాగే ఉంది. అధికారం కోసం ఎన్నికలలో ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత కళ్లు తేలేయడం ఎక్కువ రాజకీయ పార్టీలకు అలవాటైంది. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు దేశంలోనే ఒక రికార్డు సృష్టించారని చెప్పవచ్చు. 2014 ఎన్నికలలో లక్ష కోట్ల రైతుల రుణాలు, డ్వాక్ర మహిళల రుణాలు మాపి చేస్తామని చెప్పి ,చివరికి అరకొరగా చేసి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకున్నారు. అప్పట్లో కాపు రిజర్వేషన్లతో సహా 400 పైగా హామీలు ఇచ్చి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పదే,పదే గుర్తు చేస్తోందని మానిఫెస్టోని టీడీపీ వెబ్ సైట్లో నుంచి తొలగించారు.వాగ్దానాల హామీ పూర్తి2019లో విశ్వసనీయత దారుణంగా దెబ్బ తినడంతో చంద్రబాబు ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నారు. అదే సమయంలో 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ముఖ్యమంత్రి అయి తాను ఇచ్చిన నవరత్నాల వాగ్దానాలను పూర్తిగా అమలు చేయడం ద్వారా ప్రజల ఆదరణ చూరగొన్నారు. వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు బరోసా కేంద్రాలు, వృద్దుల ఇళ్లకే పెన్షన్లు, చేయూత, ఆసరా, విద్యా దీవెన తదితర పెక్కు హామీలను అమలు చేసి చూపించారు. పోర్టులు, మెడికల్ కాలేజీలు, ఉద్దానం బాదితులకు రక్షిత నీటి పథకం వంటివి నిర్మించారు.99 శాతం హామీలను తాను అమలు చేశానని, మీకు మంచి జరిగి ఉంటేనే తనకు మద్దతు ఇవ్వండని ధైర్యంగా జగన్ చెబుతున్నారు.చంద్రబాబుకు పవన్ సరెండర్అదే చంద్రబాబునాయుడు 2014 నుంచి 2019 వరకు బాగా పాలించానని, ఫలానా రకంగా వ్యవస్థలు మార్చానని, సంక్షేమం అందించానని చెప్పలేకపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మాత్రం కొత్త, పాత మానిఫెస్టోలను చూపుతూ ప్రజల ముందుకు దైర్యంగా వెళ్లగలుగుతున్నారు. చంద్రబాబు అలా చేయలేకపోతున్నారు. చంద్రబాబుకు పూర్తిగా సరెండర్ అయిపోయిన పవన్ కల్యాణ్ తన పార్టీ తరపున ఒక మానిఫెస్టోని కూడా తయారు చేసుకోలేకపోయారు. టీడీపీ మానిఫెస్టోనే భుజాన వేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ అయితే టీడీపీ, జనసేనల మానిఫెస్టోని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. చంద్రబాబు ఆచరణ సాద్యం కాని హామీలు ఇచ్చినందునే తాము ఆ మానిఫెస్టోలో భాగస్వాములు కాలేదని బీజేపీ సీనియర్ నేత యడ్లపాటి రఘునాధ బాబు తెలిపారు.చంద్రబాబువి అన్నీ అబద్దాలేప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు ఏపీలో ప్రచారం చేసినా, టీడీపీ, జనసేనల మానిఫెస్టోకి మద్దతు ఇవ్వలేదు. అసలు ఆ ప్రస్తావనే తేలేదు. ముస్లిం రిజర్వేషన్ల వంటి అంశాలలో టీడీపీ మానిఫెస్టోలో క్లారిటీ ఇవ్వలేకపోయింది. తెలంగాణ, తదితర రాష్ట్రాలలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెప్పిన బీజేపీ, ఏపీలో మాత్రం ఆ ప్రస్తావన తేకుండా జాగ్రత్తపడుతూ డబుల్ గేమ్ ఆడుతోంది. మరో వైపు జగన్ తాను గతంలో ఇచ్చిన హామీలనే కొద్దిపాటి మార్పులతో కొనసాగిస్తామని ధైర్యంగా చెప్పారు. దీంతో చంద్రబాబు ఇచ్చిన మానిఫెస్టోకి అసలు విలువ లేకుండా పోయింది. చంద్రబాబు అన్నీ అబద్దాలే చెబుతారన్న అభిప్రాయానికి ప్రజలు ఎక్కువ శాతం వచ్చారు.అసత్యాల ప్రచారంతో రాజకీయ లబ్దితెలంగాణ, కర్నాటకలలో కాంగ్రెస్ వాగ్దానాలు అమలు చేయడం విఫలం అవుతున్న మాదిరే ఏపీలో చంద్రబాబు కూడా అవేవి చేయలేడన్న స్పష్టమైన అభిప్రాయానికి ప్రజలు వచ్చారు. అందుకే రాష్ట్రంలొ చంద్రబాబు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద చల్లి, అసత్యాలు ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు. కానీ సోషల్ మీడియా వచ్చిన ఈ రోజులలో ఏ రాష్ట్రంలో ఏమి జరుగుతున్నదో ప్రజలు తెలుసుకుంటున్నారు .దాంతో చంద్రబాబు వంటివారి పప్పులు ఉడకడం లేదు. అందుకే చివరి అస్త్రంగా అబద్దాల మీదే చంద్రబాబు, పవన్ కల్యాణ్, రామోజీ, రాధాకృష్ణలు ఆధారపడే దైన్య స్థితికి వచ్చారు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు -
నేనంటే భయమెందుకు బాబు
-
మంగళగిరి మారుమోగింది.. ‘జై జగన్.. సీఎం జగన్’
గుంటూరు, సాక్షి: అది మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్.. కాస్త ఎండపూట ఇసుకేస్తే రాలనంత జనం చేరారు. సంక్షేమ సారథికి మద్దతు పలికేందుకు అశేషంగా తరలివచ్చిన జన సునామే అది. ఆ అభిమానం ఇంతటితో ఆగలేదు.. సీఎం జగన్ ప్రసంగించే సమయంలో సీఎం సీఎం.. జై జగన్.. జయహో జగన్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగేలా చేశారు. మంగళగిరిలో పచ్చ బ్యాచ్ మొదటి నుంచి ఒకరమైన ప్రచారంతో ముందుకు పోతోంది. బీసీ జనాభా అత్యధికంగా ఉండే చోట.. అగ్ర కులానికి, అందునా గత ఎన్నికల్లో ఓడిన తమ చిన్నబాస్ నారా లోకేష్ను బరిలోకి దింపింది. బీసీ కులాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను సైతం చంద్రబాబు పట్టించుకోలేదు. కానీ, సీఎం జగన్ సామాజిక న్యాయం పాటించారు. గత ఎన్నికల్లో గెలిచిన ఆర్కే(ఆళ్ల రామకృష్ణారెడ్డి)ని తప్పించి మరీ.. బీసీ సామాజిక వర్గానికి, అందునా ఒక మహిళను వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నిలబెట్టారు. మురుగుడు లావణ్య ప్రచారానికి వెళ్లిన చోటల్లా.. ప్రజలు ఆదరించడం మొదలుపెట్టారు. అదే సమయంలో నారా లోకేష్కి ఆదరణ కరువు కావడంతో.. టీడీపీకి ఏమాత్రం మింగుడు పడలేదు.దీంతో మంగళగిరిలో నారా కుటుంబం ప్రచారాన్ని.. ఐటీడీపీ అండ్కో పేజీలు సోషల్మీడియాలో జాకీలు పెట్టడం ప్రారంభించారు. అక్కడా ప్రతికూల కామెంట్లే వినిపించాయి. అప్పటికీ కూడా మంగళగిరిలో టీడీపీ జెండానే ఎగురుతుందంటూ లోకేష్ అండ్ కో ప్రచారం చేస్తూ వచ్చాయి. ఈలోపే..సీఎం జగన్ మంగళగిరి ప్రచార సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు#MemanthaSiddham, #YSJaganAgain. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు.. జయజయధ్వానాలు పలికారు. ఎటుచూసినా జన సమూహంతో పండగ వాతావరణం కనిపించింది. ‘‘చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలు పంచుతున్న నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ.. మీ అందరి ఆప్యాయతలకు మీ బిడ్డ, మీ జగన్ రెండు చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు..’ అంటూ ప్రసంగం ప్రారంభంలో సీఎం జగన్ చెప్పిన మాటలు.. ఆపై కొనసాగిన స్పీచ్ మంగళగిరి ప్రజల్లో ఉత్సాహం నింపింది. ఫ్యాన్ గుర్తుకు తమ ఓటేసి.. కూటమి నేతలను తిప్పికొడతామంటూ తమ నినాదాలతో స్పష్టం చేశారు మంగళగిరి వాసులు. ..‘‘14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని ఈ పెద్దమనిషి అంటుంటాడు, ఆ యన పాలనలో ఏనాడైనా ఇన్ని స్కీములు ఇచ్చా డా? ఇప్పటి మాదిరిగా ఏనాడైనా అవ్వాతాతలకు ఇంటింటికీ పింఛన్ ఇచ్చాడా? రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? ఈ పెద్దమనిషి చంద్రబాబు పేరు చెబితే పేదలకు చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా?’’.. అంటూ సీఎం జగన్ అడిగిన ప్రశ్నలకు లేదూ.. లేదూ.. అంటూ రెండు చేతులు ఊపుతూ ప్రజలు మద్దతు తెలిపారు. ఈ ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో తెచ్చిన పథకాలు గురించి వివరిస్తున్నప్పుడు అవునూ.. అవునూ.. అంటూ ప్రజలు పెద్దఎత్తున మద్దతు పలికారు. స్థానికంగా ఉండే లావణ్యమ్మ(మురుగుడు లావణ్య)కు ఓటేయాలన్నప్పుడు కూడా ప్రజల నుంచి.. సిద్ధం అనే సమాధానమే వినిపించింది. మొత్తంగా.. గ్రాఫిక్స్ అనే వాళ్ల గూబ గుయ్యి మనేలా.. కూటమి వెన్నులో వణుకు పుట్టేలా.. మంగళగిరి ‘జై జగన్’ నినాదాలతో మారుమోగింది. -
టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే, రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు క్రియేట్ చేసి దిగజారుడు రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. ఏదో జరిగిపోతుందని ప్రజల్లో భయభ్రాంతులు కల్పిస్తున్నారు. చంద్రబాబు అండ్ ముఠా అత్యంత దిగజారుడు రాజకీయం చేస్తోంది. 2019 జూలై 29వ తేదీన టీడీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు మద్దతిచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టే సమయంలో టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చింది?.యాక్ట్పై ప్రజలను భయపెట్టేలా.. చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. భయభ్రాంతులు సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. వీళ్లు అసలు మనుషులా? పిశాచాలా?. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెత్త అని బీజేపీతో చెప్పించగలరా?. ఇదంతా వైఎస్సార్సీపీకి ప్రజలు ఓటు వేయవద్దని చంద్రబాబు కుట్ర. ఎన్నికలకు ముందు అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన టీడీపీ.. ఇప్పుడు ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తోంది. శాసనసభ, శాసన మండలిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు టీడీపీ మద్దతు ఇచ్చి ఇప్పుడు అడ్డంగా బుక్కైంది. గత 15 రోజులుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ విష ప్రచారం చేస్తోంది.బాబు.. పేపర్లు చించేయగలరా?ఈ-స్టాంపింగ్ విధానం చంద్రబాబు హయాంలోనే ప్రారంభమైంది. తన హయాంలో ప్రారంభమైన ఈ-స్టాంపింగ్ విధానాన్ని చంద్రబాబు జిరాక్స్ కాపీలు అంటున్నారు. చంద్రబాబు హయాంలో తెల్గీ కుంభకోణం తర్వాత స్టాంపింగ్ విధానాన్ని కేంద్రం మార్చాలని నిర్ణయించింది. స్టాంపింగ్ విధానాన్ని కేంద్రం మార్చాలని నిర్ణయించింది. ఈ-స్టాంపింగ్ పత్రాలు జిరాక్స్ కాపీలు అయితే వాటిని చంద్రబాబు చించేయాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని మోదీ, అమిత్ షాతో ఎందుకు చెప్పించలేదు?. చంద్రబాబు ఇరకాటంలో పెట్టిన చుక్కల భూములు, ఇనామ్ భూములు సమస్యను సీఎం జగన్ పరిష్కరించారు. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ కూడా భూములు కొన్నారు. మరి పత్రాలు జిరాక్స్ కాపీలేనా?. ప్రజలు భయపెట్టి నాలుగు ఓట్లు దండుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. భూముల సమగ్ర సర్వే మొత్తం పూర్తి అయ్యాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ తర్వాత భూమికి ప్రభుత్వం పూచీ ఇస్తుంది’ అని కామెంట్స్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారుఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారుఏదో జరిగిపోతుందని ప్రజల్లో భయబ్రాంతులు కల్పిస్తున్నారుచంద్రబాబు అండ్ ముఠా అత్యంత దిగజారుడు రాజకీయం చేస్తోందిజనాల్లో భయబ్రాంతులు సృష్టించి, దాని ద్వారా లబ్ధి పొందాలని చంద్రబాబు కుట్రల్యాండ్ టైటిలింగ్ చట్టం పెట్టే సమయంలో టీడీపీ ఎందుకు మద్దతిచ్చింది?2019 జులై 29న టీడీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు మద్దతిచ్చిందివీళ్లు అసలు మనుషులా? పిశాచాలా?ల్యాండ్ టైటిలింగ్ తర్వాత భూమికి ప్రభుత్వం పూచీ ఇస్తుందివిపక్షంగా ఉన్న టీడీపీ ఈ బిల్లుకు పూర్తిగా మద్దతిచ్చిందిల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెత్త అని బీజేపీతో చెప్పించగలరా?ఇదంతా వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఓటు వేయొద్దని చంద్రబాబు కుట్ర ఎన్నికల ముందు అసెంబ్లీలో మద్దతిచ్చిన టీడీపీ, ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేస్తోంది15 రోజులుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం చేస్తోందిఅప్పుడు ఆమోదించి, ఇప్పుడు వ్యతిరేకించి టీడీపీ అడ్డంగా బుక్కైంది పవన్ ఫిబ్రవరిలో ఆస్తి కొన్నారు.. మరి ఆ ఆస్తి ఏం అయ్యింది?మరి ఎవరైన అక్కడికి వెళ్లి జెండా పాతితే వదిలేస్తారా?ఏపీలో ఈ-స్టాంప్ కలెక్షన్ 2016-2017 నుంచి ప్రారంభమైందిఅప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీనే ఈ-స్టాంపింగ్ విధానం చంద్రబాబు హయాంలోనే ప్రారంభమైందితన హయాంలో ప్రారంభమైన ఈ-స్టాంపింగ్ విధానాన్ని చంద్రబాబు జిరాక్స్ కాపీలు అంటున్నారుచంద్రబాబు హయాంలో తెల్గీ కుంభకోణం తర్వాత స్టాంపింగ్ విధానాన్ని కేంద్రం మార్చాలని నిర్ణయించిందిఈ-స్టాంపింగ్ పత్రాలు జిరాక్స్ కాపీలు అయితే వాటిని చంద్రబాబు చించేయాలిబాలకృష్ణ, పవన్ కల్యాణ్ భూములు కొన్నారు.. మరి ఆ పత్రాలు జిరాక్స్ కాపీలేనా?భూముల సమగ్ర సర్వే మొత్తం పూర్తకయ్యానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తుందిచంద్రబాబు ఇరకాటంలో పెట్టిన చుక్కల భూములు, ఇనామ్ భూముల సమస్యను జగన్ పరిష్కరించారుప్రజల్ని భయపెట్టి నాలుగు ఓట్లు దండుకోవాలని చంద్రబాబు చూస్తున్నారుగత ఎన్నికల్లో వారం ముందు పసుపు-కుంకుమ అని చంద్రబాబు చెక్కులు ఇచ్చినా ఈసీ పట్టించుకోలేదు -
వాళ్లు గొంతు నొక్కేది మీ బిడ్డ ప్రభుత్వానిది మాత్రమే కాదు.. : సీఎం జగన్
గుంటూరు, సాక్షి: రాజకీయాల్లో.. పట్టపగలే ఇంతదారుణంగా ప్రజల్ని మోసం చేస్తున్న పరిణామాలను చూస్తున్నామని, సరిగ్గా ఎన్నికల వేళ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కుట్రలకు తెర తీశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళగిరి ప్రచార సభలో అన్నారు.‘‘ఎవరైనా దొంగతనం చేస్తే దొంగోడు అని కేసు పెడతాం. మోసం చేస్తే చీటింగ్ కేసు పెడతాం. మరి మేనిఫెస్టో పేరుతో మోసగించే చంద్రబాబు లాంటి వాళ్ల మీద ఎలాంటి కేసులు పెడదాం?. వీళ్ల కుట్రలు ఏ స్థాయిలో ఉందంటే.. జగన్కు ఎక్కడ మంచి పేరు వస్తుందనో.. అన్ని వర్గాలు ఎక్కడ జగన్ను తమ వాడిగా భావిస్తున్నాయో అని అసూయతో కుట్రలకు తెర తీశాయి... అవ్వాతాలకు పెన్షన్ రాకుండా చేసిన దౌర్భాగ్యులు వీళ్లు. వీళ్ల కుట్రలు ఇంకా ఏ స్థాయిలో ఉన్నాయంటే.. రెండు నెల కిందట బటన్ నొక్కితే ఎన్నికల కోడ్ పేరుతో అక్కచెల్లమ్మలకు డబ్బు వెళ్తాయో అని దానిని కూడా అడ్డుకున్నారు. వీటి మీద స్వయంగా ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్లారంటే.. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థం చేసుకోవాలి.ఇదీ చదవండి: ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్.. మీ బిడ్డ జగన్ ఏదీ ఎన్నికల కోసం చేయలేదు. మీ బిడ్డ పాలనలో అలాంటి దాఖలాలూ లేవు. మొదటి రోజు నుంచి ప్రతీ నెలా క్యాలెండర్ ఇస్తూ ఈ నెలల రైతు భరోసా, ఈ నెలలో ఈ పథకం ఇస్తాం అంటూ సంవత్సరం క్రమం తప్పకుండా అందరికీ మంచి చేస్తూ వస్తున్నాడు. కానీ, ఎన్నికలకు ముందే కుట్రలు, కుతంత్రాలకు తెర తీశారు... మన ప్రజాస్వామ్యంలో ఐదేళ్ల కోసం ప్రభుత్వం ఎన్నుకుంటున్నారు. 57 నెలలకే ఈ ప్రభుత్వం గొంతు పిసికేయాలని చూస్తున్నారు. ఇది కేవలం ప్రభుత్వం గొంతు పికసడం మాత్రమే కాదు. అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మలు, రైతులు, పేద విద్యార్థుల గొంతుల్ని నొక్కడమే అని గమనించండి. మళ్లీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి?.. బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అక్కడ అవ్వ మన గుర్తు ఫ్యాన్ మర్చిపోకూడదు, చెల్లెమ్మా మన గుర్తు ఫ్యాన్, అక్కడ చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాన్.. అన్నా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడుండాలి.. ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి.. ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి.. సింకులోనే ఉండాలి.నా చెల్లిని పరిచయం చేస్తున్నా. లావణ్యమ్మ(మురుగుడు లావణ్య) మీలో ఒకరు. మంగళగిరి సీటు బీసీల సీటు. వెనుక బడిన వర్గాల సీటు. నేను గతంలో ఆర్కేకు ఇచ్చా. ఇప్పుడు ఆర్కేను త్యాగం చేయమని చెప్పి.. బీసీకి ఇప్పించా. కానీ, అవతల నుంచి పెద్ద పెద్ద నేతలు వచ్చి.. డబ్బు వెదజల్లుతున్నారు. మీ బిడ్డ దగ్గర పెద్దగా డబ్బు లేదు. బటన్లు నొక్కి పంచిపెట్టడమే ఉంది. చంద్రబాబు పాలనలో అంతా దోచుకోవడం.. పంచుకోవడమే. కాబట్టి చంద్రబాబు మాదిరి మీ బిడ్డ దగ్గర డబ్బు లేదు. అందుకే ఆయన గనుక డబ్బు ఇస్తే వద్దు అనకండి తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మన దగ్గరి నుంచి దోచుకుందే. కానీ, ఎవరి వల్ల మంచి జరిగింది.. ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అనేది ఆలోచన చేయండి. ప్రతీ ఒక్కరూ ఓటేయండి. అలాగే ఎంపీ అభ్యర్థిగా రోశయ్య నిలబడుతున్నారు. మీ ఆశీస్సులు రోశయ్యపై కూడా ఉంచాల్సిందిగా కోరుతూ.. ఓటేయమని కోరుతున్నా అని సీఎం జగన్ ప్రసంగం ముగించారు. -
ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్
గుంటూరు, సాక్షి: సాధ్యంకాని హామీలతో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారు. కానీ, మేం 99 శాతం హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు ఒక విశ్వసనీయత తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా మేనిఫెస్టో ఆధారంగానే ఎన్నికల్లో ఓటేయమని అడుగుతున్నాం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గుంటూరు మంగళగిరిలో శుక్రవారం ఉదయం వైఎస్సార్సీపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార భేరీలో ఆయన ప్రసంగించారు.‘‘మంగళగిరి సిద్ధమేనా? దేవుడి దయతో వాతావరణం కాస్త చల్లగా ఉంది. మీ చిక్కటి చిరునవ్వుల నడుమ, ఇందరి ప్రేమానురాగాలు, ఇందరి ఆప్యాయతలు, ఇందరి ఆప్యాయతల నడుమ మీ అందరికి కూడా.. నా ప్రతి అక్కకూ, నా ప్రతి చెల్లెమ్మకి, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ .. మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి , హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.జరగబోయే ఎన్నికలు.. కేవలం మూడు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతున్న ఎన్నికలు కావు. ఈ జరగబోయే ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. మళ్లీ ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటమే. ఇదే.. ఇదే.. చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలకు అర్థం. ప్రతీ ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. పొరపాటును చంద్రబాబుకి ఓటేయడం అంటే.. కొండచిలువ నోట్లో తల పెట్టడమే అని గుర్తు పెట్టుకోవాలి. అందరికీ ఈ విషయాలు చెబుతూ.. నా మాటలపై ఆలోచన చేయండి. గత 59 నెలల మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ఏకంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు వివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కితే నేరుగా నా అక్కచెల్లమ్మల ఖాతాల్లోకి, వాళ్ల చేతుల్లోకి జమ అవుతున్నాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. మీ బిడ్డ బటన్నొక్కడం.. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లడం. మీ బిడ్డ రాక మునుపు, మీ బిడ్డ పాలనకు మునుపు ఈ విధంగా బటన్లు నొక్కడం, నేరుగా ఖాతాల్లోకి వెళ్లడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఆలోచన చేయండి.ఏకంగా.. గతంలో ఎప్పుడూ చూడని విధంగా 2లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ పాలనలోనే వచ్చాయి. దశాబ్దాలుగా ఉన్న ఉద్యోగాలు 4 లక్షలు. కేవలం 59 నెలల పాలనలోనే రెండు లక్షల ఉద్యోగాలిచ్చాం. గత చరిత్రలో ఇది ఎప్పుడూ జరగలేదని సగర్వంగా చెబుతున్నా. ఇందులో లక్షా 35 వేల మంది మన కళ్లముందు సచివాలయాల్లో కనిపిస్తున్నారు.ఇంతకుముందు అంతా ఎన్నికల మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు వస్తారు. రంగురంగుల కాగితాలతో, రంగురంగుల ఆశలకు అబద్ధాలకు రెక్కలు కట్టి చెప్పేవారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే పరిస్థితి. కనీసం వెతికినా దొరికేది కాదు. ఆ సంప్రదాయాన్ని మార్చి, గతంలో ఎప్పుడూ చూడని విధంగా దేశంలోనూ ఎక్కడా చూడని విధంగా.. ఏకంగా 99% హామీలు నెరవేర్చి, ఆ మేనిఫెస్టోను నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకే పంపించి, మీ బిడ్డ పాలనలో ఇవన్నీ జరిగాయా? లేదా? మీరే టిక్కు పెట్టండి, మీ జగన్ ఇవన్నీ చేశాడు.. మీరే మీ బిడ్డకు ఆశీస్సులు ఇవ్వండి అంటూ మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ బిడ్డ పాలనలోనే. ఆలోచేన చేయండి.. ఇది మీ బిడ్డ పాలనలో కాదా?.ఇప్పుడు నేను గడగడా కొన్ని పథకాల పేర్లు మచ్చుకు చెబుతాను.. ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈ పథకాలన్నీ మీకు అందాయా అని మీరే ఆలోచించండి. గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్లు, ఇంగ్లీష్ మీడియం నుంచి ఐబీ దాకా ప్రయాణం, టోఫెల్ క్లాసులు, బైలింగువల్ టెక్స్ట్ బుక్లు మన పిల్లల చేతుల్లోనే కనిపిస్తున్నాయి.బడులు తెరిచేసరికే విద్యాకానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ చరిత్రలో ఎప్పుడూ జరగని రీతిలో ఓ అమ్మ ఒడి.. గతంలో ఉన్నాయా? గతంలో జరిగిందా?. పూర్తి ఫీజులతో...ఏ అక్కా...ఏ చెల్లెమ్మా తన పిల్లల చదువుల కోసం అప్పులపాలు అవ్వకూడదని, పెద్ద చదువుల కోసం పూర్తి ఫీజులతో ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన.. ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుతున్న వాళ్లు 93 శాతం ఫీజు రియంబర్స్మెంట్ పొందుతున్నది ఈ 59 నెలల కాలంలోనే. ఇంటర్నేషనల్ యూనివర్సిటీలతో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులను డిగ్రీ స్థాయిలో.. ఇలా చదువుల్లో మీ బిడ్డ తెచ్చిన విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయండి. 15 ఏళ్ల తర్వాత.. ఐబీ సర్టిఫికెట్ పదో తరగతి పాసైతాడు. మరో మూడేళ్లకు డిగ్రీ చేసి.. అంతర్జాతీయ యూనివర్సిటీల నుంచి కోర్సులతో పట్టా పుచ్చుకుంటాడు. అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ.. ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది. పేదల భవిష్యత్తు మారాలి.. అందుకు మీ బిడ్డ అడుగులు వేయడం ఎంత అవసరమో ఆలోచన చేయండి.గతంలో ఎన్నడూ జరగని విధంగా, చూడని విధంగా.. నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, అక్కచెల్లెమ్మలకు.. ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమంతో పాటు అందులో 20 లక్షల ఇళ్లు కడుతున్న కార్యక్రమం కూడా చేపట్టాం. అక్కచెల్లెమ్మల కోసం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం..మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూసారా?నా అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా?. ఇంటి వద్దకే రేషన్. ఇంటి వద్దకే పౌర సేవలు. ఇంటి వద్దకే పథకాలు రావడం.. గతంలో ఎప్పుడైనా జరిగాయా?. రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతున్నాను. రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ.. సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు, పక్కనే తోపుడు బళ్లలో ఉన్నవాళ్లకు, ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు, శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ చేదోడు, ఓ తోడు అనే పథకం అందిస్తున్నాం. లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా పేదలకు తోడుగా ఉంటూ.. స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా?. ఈ పథకాలు గతంలో ఉండేటివా?..ఏ పేదవాడు అప్పులు పాలవ్వకూడదని.. ఏ పేదవాడు వైద్యం అందక ఇబ్బంది పడకూడదు.. వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆరోగ్యశ్రీని విస్తరించాం. ఏ పేదవాడికి అయినా వైద్యం కోసం 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. రెస్ట్ పీరియడ్లో పేదవాడికి ఆరోగ్య ఆసరా. పేదవాడికి అండగా గ్రామంలోనే విలేజ్ క్లినిక్. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్. ప్రతీ ఇంటిని జల్లెడ పడుతూ.. ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇంతగా ఆరోగ్యం మీద దృష్టి పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందా?.వీటన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్లినా కూడా.. 600 రకాల సేవలు అందించే సచివాలయం. ఏ గ్రామానికి వెళ్లినా.. 60-70 ఇళ్లకు ఒక వలంటీర్తో కూడిన వ్యవస్థ. నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ విలేజ్ క్లినిక్. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడు ద్వారా బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి. గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలోనే డిజిటల్ లైబ్రరరీ. ఇవన్నీ కాక గ్రామంలోనే నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మహిళా పోలీస్. అక్కచెల్లెమ్మల ఫోన్లో దిశ యాప్. ఈ పథకాలు, ఈ మార్పులు, ఈ లంచాలు.. వివక్ష లేని పాలన గతంలో జరిగిందా?.. అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు అండగా నిలిచిన పాలన ఇది. ఆలోచన చేయండి.మరో పక్క చంద్రబాబునే గమనించండి. పద్నాలుగేళ్లు సీఎంగా చేసిన వ్యక్తి.. ఆయన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా పథకం లేదు. ఆయన పాలన ఎలా ఉండేదో గమనించండి. చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు. అధికారం తప్పితే.. ఆయన మాయలు, ఆయన మోసాలు ఎలా ఉంటాయో. ఈ పాంప్లెట్ గుర్తుకు తెచ్చుకోండి. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు.. ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడ్డాడు. ఈ ఫాంప్లెట్ను ముఖ్యమైన హామీలంటూ స్వయంగా సంతకం పెట్టి పంపించాడు. 2014-19 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈ పాంప్లెట్లో చెప్పినవి ఒక్కటైనా జరిగాయా? నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి.రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ అయ్యాయా? రెండో హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నారు. మరి రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాల్లో.. ఒక్క రూపాయైనా మాఫీ చేశారా?. ఆలోచన చేయండి. మూడో హామీ.. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. నేను అడుగుతున్నా.. రూ.25 వేల కథ దేవుడెరుగు.. ఏ ఒక్కరి అకౌంట్లలో అయినా ఒక్క రూపాయి అయినా వేశారా?. నాలుగో ముఖ్యమైన హామీ.. ఇంటింటికీ ఉద్యోగం.ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నారు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చారా?. ఐదో హామీ.. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. మీ అందరినీ కూడా నేను అడుగుతున్నాను. ఇన్ని వేల మంది ఇక్కడున్నారు కదా. చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రూ.10,000 కోట్లతో బీసీ సబ్ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా?. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా? సింగపూరుకు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా? ఒక్కటంటే.. ఒక్క హామీ నెరవేరిందా?. పోనీ ప్రత్యేక హోదా అయినా ఇచ్చాడా? దాన్నీ అమ్మేశాడు. మరి నేను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్లను నమ్మొచ్చా? ఆలోచన చేయండి.మళ్లీ.. కొత్త మేనిఫెస్టో డ్రామా. మళ్లీ ఇదే ముగ్గురూ. మళ్లీ చంద్రబాబూ.. సూపర్ సిక్స్ అంట. నమ్ముతారా?, సూపర్ సెవెన్ అంట. నమ్ముతారా?. ఇంటింటికీ కేజీ బంగారం అంట. నమ్ముతారా?. ఇంటింటికీ బెంజికారు అంట. నమ్ముతారా?. మరి ఆలోచన చేయమని అడుగుతున్నా అని సీఎం జగన్ ప్రసంగించారు. -
సీఎం జగన్ పై ఐటీ ఉద్యోగులు ప్రశంసలు
-
కాల యముళ్లు
-
పేదలను ముప్పుతిప్పలు పెడుతున్న చంద్రబాబు
-
ఎంపీ ఆర్ కృష్ణయ్యపై టీడీపీ మూకల రాయి దాడి
-
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది.. అందుకే ఇలా..!
సాక్షి, అమరావతి: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. దళిత మహిళ అయిన హోంమంత్రి తానేటి వని తపై దాడులకు దిగటం సిగ్గుచేటని అన్నారు.విజయవాడలో బోండా ఉమ అనుచరులు వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేస్తున్న మహిళలపై దాడులకు పా ల్పడ్డారని, మాచర్ల నియోజకవర్గంలోని శిరి గిరిపాడులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమపై దాడి చేయడం దారుణమన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా తన ప్రవర్తన మార్చుకోవాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లిస్తారన్నారు. హోంమంత్రి తానేటి వనితపై దాడిని మహిళా లో కం సీరియస్గా తీసుకుందని, మహిళలంతా ఏకమై ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చె ప్పేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించటం ఖాయమని పోతుల సునీత చెప్పారు.మహిళలపై టీడీపీ దాడులు దుర్మార్గం..ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే మహిళలపై టీడీపీ కూటమి నేతలు దుర్మార్గంగా దాడులకు పాల్పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి అన్నారు. రాష్ట్రంలోని పలు చోట్ల మహిళలపై దాడులకు పాల్పడిన టీడీపీ నేతలమీద చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఆమె గురువారం లేఖ రా శారు.ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితపై దాడికి ప్రయత్నించడంతో దళితులు, మహిళలు భ యాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. విజయవాడలో టీడీపీ అభ్యర్థి బొండా ఉమా కుమారుడు మహిళలపై దాడి చేయడం దారుణమన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలిపై, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై టీడీపీ నేతలు దాడులకు దిగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. -
ఒక వైపే చూడకు.. పచ్చిగా అబద్ధాలాడకు!
సాక్షి, అమరావతి: ఒకసారి తప్పు చేస్తే పొరపాటు...పదే పదే ఆ తప్పులనే పునరుక్తం చేస్తుంటే అది అలవాటు...గ్రహపాటు...దురలవాటు..అలాంటి దురలవాటును ఈనాడు ఆనవాయితీగా మార్చుకుంది..అబద్ధాలనే రాయడానికే కంకణం కట్టుకున్నానన్నట్లుగా ఉంది ఆ పత్రిక వక్రీకరణల ధోరణి...గతంలో కౌలురైతుల సాయంపై అడ్డగోలుగా వక్రీకరిస్తే అది తప్పని ...వాస్తవమేంటని గణాంకాలతో రుజువు చేసినా... మూర్ఖపు రాతలతో మళ్లీ రాసిన తప్పులనే రాస్తూ... తన అజ్ఞానాన్ని, తానేం చేసినా చెల్లిపోతుందన్న అహంకారాన్ని రామోజీ నిరూపించుకుంటున్నట్లుగా ఉంది.. ఇప్పటికే ఈనాడు దుష్టరాతల తలంపును పాఠకులు అర్థం చేసుకున్నారు..ఒక నిజాన్ని ఎన్నిసార్లు అబద్ధంగా చూపాలనుకున్నా అది అవాస్తవంగా మారదన్న వాస్తవం రామోజీకి బోధపడినట్లు లేదు... రైతులకు ఆపన్నహస్తమందిస్తున్నదే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం... ఈ రోజు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు కొండంత ఊతంగా నిలుస్తూ... వ్యవసాయాన్ని పండగ చేసి చూపిస్తున్నదే జగన్ ప్రభుత్వం... రైతులే కాదు...వారితో సమానంగా కౌలు రైతుల భుజంపైనా భరోసా చెయ్యేసి... వారిని అక్కున చేర్చుకుంటున్నదే ఈ ప్రభుత్వం...ఆ నిజాన్ని అబద్ధం చేయాలని రామోజీ తహతహలాడిపోతూ.. గురువారం ఈనాడులో ..‘ధీమా లేదు...బీమా రాదు’... శీర్షికన ప్రచురించిన కథనం ఒక బోగస్. నిజాలేమిటో సవివరంగా గణాంక సహితంగా చెప్పడానికే ఈ ఫ్యాక్ట్చెక్...గతంలో ఎన్నడూ లేనివిధంగా కౌలు రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. గత ప్రభుత్వాలు ఆలోచనే చేయని పంట సాగు హక్కు దారుల చట్టం–2019ను తీసుకురావడమే కాదు..సీసీఆర్సీల ఆధారంగా భూ యజమానులతో సమానంగా కౌలు రైతులకూ సంక్షేమ ఫలాలు అందిస్తోంది. ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇస్తోంది. పండించిన పంటలను ఆర్బీకేల ద్వారా రైతులు మద్దతు ధరకు సులువుగా అమ్ముకోగలుగుతున్నారు. వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, ఉచిత పంటల బీమా, పంట నష్టపరిహారంతో పాటు దురదృష్టవశాత్తూ చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం ఈ ప్రభుత్వం అందిస్తోంది.అబద్ధం: పెట్టుబడి సాయానికి అర్హులు కారట..వాస్తవం: బాబు హయాంలో కౌలురైతులకు కాదు కదా అటవీ, దేవదాయ భూ సాగుదారులకు పైసా విదల్చ లేదు. తద్భిన్నంగా ...నేడు దేశంలోనే తొలిసారిగా ఏపీలో మాత్రమే కౌలు రైతులకు జగన్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు అటవీ, దేవదాయ భూమి సాగుదారులకూ రూ.13,500 చొప్పున మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అందిస్తోంది.మెజార్టీ కౌలుదారులు సొంత భూమినీ కలిగి ఉన్నారు. వీరందరికీ భూ యజమానిగా వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందుతోంది. సీసీఆర్సీ కార్డులు పొందిన సెంటు భూమిలేని కౌలు రైతులకు భూ యజమానులతో సమానంగా పెట్టుబడి సాయాన్ని ఈ ప్రభుత్వం ఇస్తోంది. ఇలా గత ఐదేళ్లలో 5.57 లక్షల మంది కౌలు రైతులకు రూ.751.42 కోట్లు, 4.01 లక్షల అటవీ భూములు (ఆర్వో ఎఫ్ఆర్) సాగు చేసే గిరిజనులకు రూ.541.58 కోట్లు కలిపి మొత్తం 9.58 లక్షల మందికి రూ.1293 కోట్ల మొత్తాన్ని పెట్టుబడి సహాయంగా అందించింది. అంటే ఏటా సగటున 1.92 లక్షల మందికి రూ.259 కోట్ల చొప్పున పెట్టుబడి సాయం ప్రభుత్వం ఇచ్చింది. అయినా ఈనాడుకు మాత్రం 1.07 లక్షల మందికి మాత్రమే పెట్టుబడి సాయం అందించినట్టుగా కని్పంచింది.అబద్ధం: కౌలురైతులకు అందని సంక్షేమ ఫలాలు..వాస్తవం: కౌలుదారులకు సంక్షేమ ఫలాలు అందడం లేదనడంలో ఎంతమాత్రం వాస్తవం లేదు. వైఎస్సార్ రైతు భరోసాతో సహా భూ యజమానులకు వర్తింçపచేసే సంక్షేమ ఫలాలన్నీ భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులకూ ఈ ప్రభుత్వం వర్తింప చేస్తోంది. సీసీఆర్సీ కార్డు ఉన్నా లేకున్నా ఈ సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈనాడుకు మాత్రం సున్నా వడ్డీ రాయితీ పొందిన వారే కని్పంచలేదు. ఈ ఐదేళ్లలో 3,54,878 మందికి రూ.731.08 కోట్ల పంటల బీమా పరిహారం, 3,67,903 మందికి రూ.424 కోట్ల పంట నష్ట పరిహారం (ఇన్పుట్సబ్సిడీ) పంపిణీ చేస్తే, ఈనాడుకు మాత్రం ఐదేళ్లలో పెట్టుబడి రాయితీ పొందిన వారు 48,290 మంది, పంటల బీమా పరిహారం పొందిన వారు 88,619 మంది మాత్రమే కని్పస్తున్నారంటే ఈ ప్రభుత్వం చేసిన సాయాన్ని తక్కువ చేయాలన్న దుష్టతలంపేనని ఇట్టే అర్థమవుతోంది.అబద్ధం: కౌలు రైతులకు పంట రుణాల్లేవు..వడ్డీ రాయితీకి సున్నా..వాస్తవం: వాస్తవ సాగు దారులందరికీ పంట రుణాలివ్వాలన్న సంకల్పంతో పీఏసీఎస్లను ఆర్బీకేలతో ప్రభుత్వం అనుసంధానం చేసింది. సీసీఆర్సీ కార్డులున్న వారికి రుణాలు అందిస్తున్నారు. సీసీఆర్సీ పొందలేని కౌలు రైతులను గుర్తించి, వారితో జాయింట్ లయబలిటీ గ్రూపు (జేఎల్జీ)లను ఏర్పాటు చేస్తోంది. ఈ గ్రూపుల ద్వారా కౌలుదారులకు పెద్ద ఎత్తున రుణాలు అందేలా చేస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు 14.75 లక్షల మంది కౌలుదారులకు రూ.8,642.40 కోట్ల రుణాలను ఈ ప్రభుత్వం అందించింది. ఈనాడుకు మాత్రం ఐదేళ్లలో రుణాలు పొందిన వారు 1.68 లక్షల మందే కని్పంచారు. ఈ –క్రాప్ ఆధారంగా లక్ష లోపు పంట రుణాలు పొందిన 30 వేల మందికి రూ.6.26 కోట్ల సున్నా వడ్డీ రాయితీని జగన్ ప్రభుత్వం అందించింది. -
ఆ ముసలోడికి ఏం రోగం..కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్..
-
చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్
-
టీడీపీ మేనిఫెస్టోపై భరత్ సెటైర్లు..
-
చంద్రబాబు ఉచిత ఇసుకలో ఉచితం లేదు
-
Fact Check: చంద్రబాబుకోసమే... రామోజీ నేలబారు రాతలు!
అసలింతకీ రామోజీరావుకు ఏం కావాలి? పోలవరం ప్రాజెక్టు పూర్తికావటమా... లేక ఎక్కడికక్కడ పనులు ఆగిపోవటమా? దీనికి ఆగిపోవటమే ఆయనకు కావాలన్న సమాధానం తేలిగ్గానే వచ్చేస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచి్చన దగ్గర్నుంచీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రామోజీరావు ‘ఈనాడు’లో అచ్చోసిన దుర్మార్గపు కథనాలు అన్నీఇన్నీ కావు. ఇంకేముంది ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు పడే అవకాశం లేదని కొన్నాళ్లు...కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇచ్చే అవకాశం లేదని కొన్నాళ్లు... ఎత్తు తగ్గించి కట్టేస్తున్నారని కొన్నాళ్లు... ఇలా పదేపదే విషాన్ని చిమ్ముతూనే వస్తున్నారు.చిత్రమేంటంటే... రామోజీ అంచనాలకు భిన్నంగా పోలవరం వేగంగా ముందుకెళుతోంది. చంద్రబాబు వీసమెత్తయినా పట్టించుకోని పునరావాసాన్ని కూడా వైఎస్ జగన్ భుజాలకెత్తుకుని ప్రాజెక్టును నడిపిస్తున్నారు. కేంద్రాన్ని పదేపదే అభ్యఆర్థికస్తూ... రావాల్సిన నిధుల్ని రాబట్టుకుంటున్నారు. ఇదిగో... ఇదే ‘ఈనాడు’ కడుపు మంటను పెంచేస్తోంది. కాంట్రాక్టరుగా తన వియ్యంకుడిని తప్పించేసి మరీ ప్రాజెక్టును పూర్తి చేస్తుండటాన్ని రామోజీరావు జీరి్ణంచుకోలేకపోతున్నారు. ‘పోలవరం నిధుల కోసం... జగన్ నేల చూపులు– బేల మాటలు’ అంటూ సోమవారం ప్రచురించిన కథనం కూడా ఇలాంటిదే!!. మరి దీన్లో నిజానిజాలెంత? ఏది నిజం?ఏది నిజం..?ఈనాడు ఆరోపణ: పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చేది ఇక రూ.12,911.15 కోట్లనేనని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కేంద్ర కేబినెట్లో 2017లో ఆమోదించిన మొత్తానికి అదనంగా... రూ.12,911.15 కోట్లే ఇస్తామని పేర్కొంది. దీనికన్నా పైసా ఎక్కువరాదు.వాస్తవం: వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్ శక్తి, ఆఆర్థికక శాఖ మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, నిర్మలాసీతారామన్లను కలుస్తూనే ఉన్నారు. కలిసిన ప్రతి సందర్భంలోనూ పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం కేంద్ర జలసంఘం ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి.. ఆ మేరకు నిధులు ఇవ్వాలని కోరుతున్నారు.ఈ క్రమంలోనే గతేదాది జనవరి 3న ప్రధాని మోదీతో సమావేశమైనపుడు... ప్రాజెక్టు తొలి దశను సత్వరమే పూర్తి చేసి, రైతులకు ముందస్తు ఫలాలు అందించడానికి తాత్కాలికంగా రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. దీనికి మోదీ సానుకూలంగా స్పందించి... జల్ శక్తి, ఆర్థిక శాఖలకు తగు ఆదేశాలిచ్చారు. కేంద్ర జల్ శక్తి శాఖ సూచన మేరకు తొలి దశ పూర్తికి రూ.10,911.15 కోట్లు అవసరమని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.వాటిని జల్ శక్తి శాఖ ఆమోదించింది. అయితే చంద్రబాబు ఘోర తప్పిదం వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దడానికి, ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చటానికి రూ.2 వేల కోట్లు ఖర్చవుతుందని గత మార్చి 5న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తేల్చింది. దాంతో తొలి దశ పూర్తికి రూ.12,911.15 కోట్లు (10,911 ప్లస్ 2వేలు) విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ పంపిన ప్రతిపాదనకు కేంద్ర ఆఆర్థికక శాఖ జూన్ 5న అంగీకరించింది. అదీ కథ.వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు 2013–14 ధరల ప్రకారం.. 2014, ఏప్రిల్ 1 నాటికి ఇరిగేషన్ కాంపొనెంట్ ఖర్చులో మిగిలిన మొత్తం అంటే రూ.15,667.9 కోట్లకు మించి ఇచ్చేది లేదని, ఆ తర్వాత పడే అదనపు భారంతో కేంద్రానికి సంబంధం లేదని 2017 మార్చి 15న కేంద్రం ఒక తీర్మానాన్ని ప్రతిపాదించగా... దాన్ని కేబినెట్ ఆమోదించింది కూడా.జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16,128.78 కోట్లు ఖర్చు చేయగా.. కేంద్రం రూ.14,418.39 కోట్లు రీయింబర్స్ చేసింది. అంటే 2017, మార్చి 15న కేంద్ర కేబినెట్ ఆమోదించిన ప్రకారం పోలవరానికి ఇక విడుదల చేయాల్సింది రూ.1249.51 కోట్లే. ఈ నేపథ్యంలో... తొలి దశ పూర్తిచేయడానికి అవసరమైన రూ.12,911.15 కోట్లు విడుదల చేయాలంటే.. 2017, మార్చి 15 నాటి కేబినెట్ తీర్మానాన్ని సవరించాలి.ఆ మేరకు ప్రతిపాదన పంపాలని కేంద్ర జల్ శక్తి శాఖకు కేంద్ర ఆఆర్థికక శాఖ సూచించిందే తప్ప ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇవ్వబోమని గానీ.. ఇచ్చేది ఇక ఇంతేననిగానీ ఆర్థిక శాఖ నోట్లో ఎక్కడా లేదు. రామోజీరావు మాత్రం ఇచ్చేది ఇక ఇంతేనని కేంద్ర ఆఆర్థికక శాఖ నోట్లో పేర్కొన్నట్లు తప్పుడురాతలు రాసేశారు. చంద్రబాబులా రామోజీది కూడా చంద్రబాబు తరహా బ్రీఫ్డ్ మీ ఇంగ్లీషే అయితే.. ట్యూషన్ పెట్టించుకోవాలి గానీ తనకు అర్థమైనదే వాస్తవమన్న రీతిలో రాసేస్తే ఎలా? అజా్ఞనంతో తప్పుడురాతలు అచ్చేస్తే ఎలా?ఈనాడు ఆరోపణ: పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులివ్వబోమని కేంద్రం చెప్పినా సీఎం వైఎస్ జగన్ నోరెత్తడం లేదు. లోక్సభలో బీజేపీకి కావాల్సినంత బలం ఉన్నా రాజ్యసభలో లేదు. రాజ్యసభలో ఉన్న రాజకీయ బలాన్ని పోలవరం నిధులు, ప్రత్యేక హోదా సాధనకు సీఎం వైఎస్ జగన్ ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు?వాస్తవం: విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని కేంద్రమే నిరి్మంచాలి. కానీ.. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కమీషన్ల కోసం రాష్ట్రానికి హక్కుగా దక్కిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ... దాని నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని 2014, జూన్ నుంచి 2016, సెపె్టంబరు 6 వరకూ నాటి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. చివరకు కేంద్రం మంజూరు చేశాక యనమల రామకృష్ణుడు బావమరిదికి, రామోజీరావు వియ్యంకుడికి ఈ కాంట్రాక్టు పనులు నామినేషన్పై కట్టబెట్టేశారు. భారీగా కమీషన్లు దండుకున్నారు.రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న క్రమంలో చంద్రబాబు చేసిన ఇంకో ఘోరమైన తప్పిదమేంటంటే... 2013–14 నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని 2016, సెపె్టంబరు 7న అంగీకరించడం. మరి ఆ మూడేళ్లలో ధరలు పెరిగి ఉండవా? ఆ మాత్రం ఇంగితజ్ఞానం లేకుంటే ఎలా?2016, సెపె్టంబరు 26న పోలవరానికి నాబార్డు నుంచి రూ.1981.54 కోట్ల రుణాన్ని విడుదల చేస్తూ.. ఇకపై బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు రుణం రూపంలోనే నిధులు విడుదల చేస్తామని.. 2018, డిసెంబర్లోగా ప్రాజెక్టును పూర్తి చేయలేకపోతే.. విడుదల చేసిన నిధులను రుణంగా పరిగణిస్తామంటూ కేంద్రం పెట్టిన మెలికకు సైతం చంద్రబాబు తల ఊపేశారు.2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆఆర్థికక శాఖ.. కేంద్ర జలశక్తి శాఖకు పంపిన మెమొరాండంలో 2014, ఏప్రిల్ 1 నాటికి నాటికి పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకు అయ్యే (ఇరిగేషన్ కాంపొనెంట్) వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని పునరుద్ఘాటించింది.ఆ తర్వాత ఐదున్నర నెలలకు 2017, మార్చి 15న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో.. 2014, ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టు పనుల్లో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకయ్యే వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని.. అది ఎంతన్నది పోలవరం ప్రాజెక్టు అథారిటీ మదింపు చేస్తుందని.. ఆ ప్రకారమే నిధులిస్తామని స్పష్టం చేసింది. ఆ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి నోరు మెదపలేదు.2014, ఏప్రిల్ 1 నాటికి నీటిపారుదల విభాగం వ్యయంలో మిగిలిన మొత్తాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని.. అంతకంటే అంచనా వ్యయం పెరిగితే .. దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని 2017, మే 8న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి శాఖ లేఖ రాసినా సరే... చంద్రబాబు స్పందించలేదు.2016, సెపె్టంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమొరాండం ప్రకారం... 2014, ఏప్రిల్ 1 నాటి ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను సీడబ్ల్యూసీకి పంపామని.. వాటిని ఆమోదించి.. నిధులిస్తే ప్రాజెక్టును పూర్తి చేస్తామని 2018, జనవరి 12న నాటి సీఎం చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు.2013–14 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ ఆమోదించిన నీటిపారుదల విభాగం వ్యయం రూ.20,398.61 కోట్లు. ఇందులో ఏప్రిల్ 1, 2014 నాటికి చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లను మినహాయిస్తే కేవలం రూ.15,667.9 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసినా.. చంద్రబాబు దానికి అంగీకరించారు. 2017–18 ధరల ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయమే రూ. 33,168.23 కోట్లు. అలాంటిది కేవలం రూ.15,667.9 కోట్లు ఇస్తే పోలవరాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు ఎలా అంగీకరించారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.నిజానికి ఎలాంటి ప్రాజెక్టు అయినా... ఎంత ప్రతిష్టాత్మకమైనది అయినా కాలం గడుస్తున్న కొద్దీ ముందుగా వేసిన అంచనా వ్యయం పెరుగుతుంది. అది నాగార్జున సాగర్కైనా.. శ్రీశైలానికైనా కూడా!!. పోలవరానికైనా అంతే. 2013–14లో ఉన్న ధరలు ఇప్పుడెందుకు ఉంటాయి? అన్నిరకాల సామగ్రి, లేబర్ చార్జీలు అప్పటితో పోలిస్తే రెట్టింపుకన్నా ఎక్కువే పెరిగాయి. కానీ చంద్రబాబు నాయుడు నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని ఏకంగా లేఖ రాసేయటంతో... ఇప్పుడు తాజా ధరల ప్రకారం నిధులడిగిన ప్రతిసారీ కేంద్రం సవాలక్ష కొర్రీలు పెడుతోంది. అసలు చంద్రబాబు ఇలా ఎందుకు చేశారంటే... ఆయనకు కమీషన్లు వస్తే చాలనుకున్నారు కనక.చంద్రబాబు నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నిధుల కొరత ఎదురవుతోందన్నది నిజం. ç2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి.. నిధులు విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ, జల్ శక్తి శాఖ మంత్రులను సీఎం వైఎస్ జగన్ కోరుతూ వస్తున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ.. పోలవరం ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్తోపాటు సీఎం వైఎస్ జగన్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించడానికి కేంద్ర కేబినెట్ కార్యదర్శి, కేంద్ర ఆర్థిక, జల్ శక్తి శాఖ అధికారులతో కమిటీ వేశారు. ఆ కమిటీ చర్చల వల్ల 2014–15 నాటి రెవెన్యూ లోటు రూ.10,421 కోట్లను ఇటీవల కేంద్రం విడుదల చేసింది. పోలవరం తొలి దశ పూర్తికి అవసరమైన రూ.12,911.15 కోట్లను విడుదల చేయడానికి అంగీకరించింది. ప్రత్యేక హోదాను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు సీఎం వైఎస్ జగన్ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశంపై అటు లోక్సభ, ఇటు రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీలు పోరాటం చేస్తున్నారు. ఇవేవీ కని్పంచడం లేదా రామోజీ?ఈనాడు ఆరోపణ: రెండో దశ పునరావాసానికి రాష్ట్రం ఏమీ చేయలేదని సీఎం స్వయంగా ప్రకటించారు. రాష్ట్రం నిధులు ఇచ్చే పరిస్థితుల్లో లేదని చెప్పారు.వాస్తవం: కొత్తగా నిర్మించే ఏ ప్రాజెక్టులోనైనా నీటిని నిల్వ చేయాలంటే.. ఐఎస్(ఇండియన్ స్టాండర్డ్) ఆపరేషన్ ఆఫ్ రిజర్వాయర్స్ గైడ్ లైన్స్, కేంద్ర జలసంఘం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ప్రాజెక్టు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒకేసారి గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేయకుండా.. మూడు దఫాలుగా నిల్వ చేసుకుంటూ పోవాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తొలి ఏడాది 41.15 మీటర్ల వరకూ నీటిని నింపి.. ప్రాజెక్టులో అన్ని భాగాలను పరిశీలిస్తారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుతారు.ఆ తర్వాత 44 మీటర్ల కాంటూర్ వరకూ నీటిని నింపి, లోటుపాట్లు ఏవైనా ఉత్పన్నమైతే వాటిని సరిదిద్దుతారు. ఆనక 45.72 మీటర్లలో అంటే గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తారు. ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ పలు మార్లు శాసనసభ వేదికగా స్పష్టం చేశారు. తొలుత 41.15 మీటర్ల వరకూ నిర్వాసితులకు పునరావాసం కలి్పస్తామని.. ఆ తర్వాత దశలవారీగా పునరావాసం కల్పించి 45.72 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేస్తామని ఉద్ఘాటించారు.ప్రాజెక్టు ఎత్తు ఏమాత్రం తగ్గదని.. కావాలంటే పూర్తయ్యాక టేపు తెచ్చుకుని కొలుచుకోవాలని చంద్రబాబు, రామోజీరావు ఎల్లో మీడియాకు సవాల్ విసిరారు. ఇదే అంశంపై అటు లోక్సభ, ఇటు రాజ్యసభలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పందిస్తూ.. పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుంచి ఒక్క ఇంచు కూడా తగ్గదని, నిర్వాసితులు అందరికీ పునరావాసం కల్పించే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు.ఇటీవల నిర్వహించిన లైడార్ సర్వేలో పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్ పరిధిలో అదనంగా 36 గ్రామాలు ముంపునకు గురవుతాయని తేలటంతో ఆ గ్రామాల ప్రజలకూ పునరావాసం కల్పించడానికి రూ.5,122 కోట్ల నిధులివ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అభ్యఆర్థికంచారు. దీనికీ కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారు. దీన్ని బట్టి చూస్తే ప్రాజెక్టు, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని స్పష్టమవుతుంది. అయినా సరే.. రామోజీరావు పదే పదే విషం చిమ్ముతున్నారు.ఇదే అంశాన్ని నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ శాసనసభలో పలు మార్లు ఎత్తిచూపుతూ.. భూసేకరణ చట్టం 2013 ప్రకారం పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లని.. అలాంటిది కేంద్రం ఇస్తామన్న రూ.15,667.9 కోట్లతో ఎలా పూర్తి చేస్తారని నిలదీస్తే.. నాటి సీఎం చంద్రబాబు వాటిని తోసిపుచ్చుతూ వచ్చారు. అంటే చంద్రబాబుకు కావాల్సింది కమీషన్లు తప్ప ప్రాజెక్టు పూర్తవటం కాదు.అందుకే రాష్ట్రమే చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరుతూ... ప్రత్యేక హోదా అడగబోమని తాకట్టుపెట్టేశారు. అంచనా వ్యయాన్ని సవరించకున్నా నోరు మెదపలేదు. ఆఖరికి పునరావాసం ఊసెత్తకుండా కేవలం ఇరిగేషన్ కాంపొనెంట్ మాత్రమే ఇస్తామన్నా... సై అనేశారు.అసలు పునరావాసం లేకుంటే ప్రాజెక్టు ఉంటుందా? ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే పేదలకు సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి, వారికి తగిన పరిహారం ఇవ్వకుంటే వారు అక్కడి నుంచి వెళతారా? వారు వెళ్లకపోతే ప్రాజెక్టు పూర్తి చేసినా నీటిని నిల్వ చేయగలరా? నీటిని నిల్వ చేసే పరిస్థితి లేనపుడు ఎంత ఎత్తు కడితే లాభమేంటి? మరి పునరావాస నిధుల ఊసెత్తకుండా చంద్రబాబు ఎందుకు నోరుమూసుకున్నారు? -
అభివృద్ధి లేదంటూ అసత్య ప్రచారం.. కారణం ఇదే..
ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 2019 దాకా కనపడని ఎన్నో అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు ఆ తర్వాత ఒకటొకటిగా కళ్లకు కడుతున్నాయి. కరోనా లాంటి అనూహ్య ఉత్పాతం దాదాపు రెండేళ్ల కాలాన్ని మింగేసినా.. కేవలం మూడేళ్ల కాలంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, కొన్ని కొనసాగుతుండగా కొన్నింటిని పూర్తి చేయడం జరిగింది. అయినప్పటికీ తెలుగుదేశం ఆ పార్టీ మద్దతుదారులు ‘అభివృద్ధి లేదు’ అనే మాటనే గోబెల్స్ను తలదన్నేలా ప్రచారం చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి?ఏ ప్రభుత్వం మీదనైనా పోరాటం చేయాలంటే పేదల సమస్యలనే ప్రతిపక్షాలు తలకెత్తుకోవడం సర్వసాధారణం. పేదరికం పెరిగిందనో..పేదలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేకపోయిందనో, పేదల బ్రతుకులు దుర్భరంగా మారాయనో..విమర్శలతో ఇరుకునపెట్టడం సహజం. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు ఆ పనికి బదులు.. అభివృద్ధి లేదు అంటూ సరికొత్త రాగం ఆలపించడానికి కారణం.. ఈ పాలనలో పేదలకు అన్యాయం జరిగింది అంటే నమ్మేవారు లేకపోవడం.ఇప్పుడు బడుగువర్గాల నుంచి జగన్ ప్రభుత్వంపై ఎటువంటి ఫిర్యాదులు రాకపోవడం, పథకాలు అందడం లేదనో, పక్కదారి పడుతున్నాయనో, ఇబ్బందుల్లో ఉన్నామనో ఉద్యమాలు, ఆందోళనలు వారు చేపట్టకపోవడం.. అడగకుండానే అన్నీ అమర్చిపెడుతున్న వైఎస్ జగన్ పాలన నిరుపేదలకు ఎక్కడ లేని భరోసా ఇచ్చింది. దీంతో పేదల్ని వంచించే, మాటలతో రెచ్చగొట్టి ప్రభుత్వంపై ఉసిగొల్పే ప్రయత్నాలు ఫలించవని ప్రతిపక్షాలకు పూర్తిగా అర్ధమైంది. తత్ఫలితంగానే అభివృద్ధి లేదు అంటూ ఈ ఆరున్నొక్కరాగాలు.నాడు ‘కట్టుబట్టలతో’ కల్లబొల్లి కబుర్లు తప్ప అభివృద్ధి ఏదీ..ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు పాలించిన కాలం ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆ సమయంలో ఎప్పుడు చూసినా ఆయన నోటి వెంట వచ్చే కొన్ని రొడ్డకొట్టుడు వ్యాఖ్యల్లో ‘లోటుబడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని మనకు ఇచ్చారు.. మనల్ని కట్టుబట్టలతో తరిమేశారు. మనకు రాజధాని లేదు. ఇప్పటికి 26 సార్లు ఢిల్లీకి వచ్చాను అయినా ఫలితం లేదు’. ఇవేగా ఆయన తాను ఇచ్చిన రైతు రుణమాఫీ, నిరుద్యోగభృతి.. వగైరా హామీల్ని ఎగవేయడం కోసమే ముందస్తుగా ఇలాంటివన్నీ పాడిందే పాట అన్నట్టు వినిపించేవారు.అలాంటి అబద్ధాలతోనే ఐదేళ్ల పాటు పనికిరాని పాలన సాగించారు. తన హయంలో దాదాపుగా 2.50లక్షల కోట్ల అప్పులు చేసి కూడా ఇచ్చిన హామీల్లో పావుశాతం కూడా అమలు చేయలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమం పూర్తి చేసిందీ లేదు. కొత్త రాజధాని పేరుతో రకరకాల డ్రామాలు ఆడారే తప్ప రాజధాని కాదు కదా అక్కడ ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేకపోయారు.చంద్రబాబులా ఏడుపులు పెడబొబ్బలు లేవు..ఖాళీ ఖజానాకి తోడు రూ.లక్షల కోట్ల రుణభారం ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు తన తదుపరి ముఖ్యమంత్రికి అందించి వెళ్లారు. తొలిసారి ముఖ్యమంత్రిగా అంత పెద్ద బాధ్యతలు తలకెత్తుకున్నా.. తొణకకుండా బెణకకుండా వైఎస్ జగన్ పాలనను పరుగులు పెట్టించారు. గద్దెనెక్కిన కొన్ని నెలలకే కరోనా మహమ్మారి వచ్చి మీద పడింది. అయినా ఎక్కడా అదరలేదు బెదరలేదు. ఎందరు శ్రేయోభిలాషులు చెప్పినా కరోనా సమయంలో కూడా పథకాలను ఆపలేదు. కట్టుబట్టలతో వచ్చాం, మన పరిస్థితి బాగోలేదు అంటూ చంద్రబాబులాగా ఏ రోజూ రాష్ట్ర ప్రజలను భయపెట్టేలా మాట్లాడలేదు. చుట్టూ సమస్యల్ని ఎదుర్కుంటూనే ఇచ్చిన ప్రతీ హామీని తూచా తప్పకుండా అమలు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగారు.ఓ వైపు సరికొత్త శైలి సంక్షేమ పధాన్ని అనుసరిస్తూనే మరోవైపు మూలాల నుంచి అభివృద్ధికి బాటలు వేశారు. ఇప్పుడు వైఎస్ జగన్ పాలనా ఫలాలు ప్రతీ చోటా కళ్లకు కడుతున్నాయి. గ్రామసెక్రటేరియల్స్ కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, వైద్య కళాశాలలు కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు.. చంద్రబాబు పాలనలో కనపడని ఎన్నో అభివృద్ధి సూచికలు ఆంధ్రప్రదేశ్లో కళ్లకు కడుతున్నాయి.పదేపదే అదే మాట అందుకే..ఓం భూం హాం ఫట్ అంటే ప్రత్యక్షమైపోవడానికి పైన పేర్కొన్నవేవీ ఇంద్రజాల టక్కుటమార ఫలితాలు కావు. ఎంతో దూరదృష్టితో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రజల మేలు కోసం కళ్ల ముందుకు తెచ్చిన బంగారు భవిష్యత్తు దీపికలు. అయినప్పటికీ అభివృద్ధి లేదనే పాచిపాట ఎందుకు పాడుతున్నారంటే.. పల్లెల్లో జరిగే అభివృద్ధి పనులు కావచ్చు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు కావచ్చు.. ఇవన్నీ కళ్లారా చూసి పాలనను బేరీజు వేసుకునేంత తీరిక ఓపిక ప్రజలకు ఉండదని సో.. చంద్రబాబు అండ్ ఎల్లో మీడియా ప్రచార ప్రభావానికి వీరు లోనవుతారనేదే ఈ అభివృద్ధి లేదనే ప్రచారం వెనుక దాగున్న కుయుక్తి.అయితే గతంలోలాగ ఏది పడితే అది నమ్మే అవసరం, పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రజల్లో రాజకీయాలపై, నేతల పాలనా దక్షతపై అవగాహన పెరిగింది. ప్రతీ అంశాన్నీ నిశితంగా పరిశీలిస్తున్నారు. చంద్రబాబు– వైఎస్ జగన్ పాలనలోని వ్యత్యాసాలను బేరీజు వేసుకునేందుకు వీలుగా వారికి ఇప్పుడు ఎన్నో రకాల మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. అవే చంద్రబాబు నాయుడు అండ్ ఎల్లో మీడియా గోబెల్స్ ప్రయత్నాలను నీరుగారుస్తున్నాయి. నిజాలను నిర్ద్వంద్వంగా గెలిపించనున్నాయి.–సత్యార్థ్. -
"కూటమి కట్టినా ఓటమి తప్పదు"
-
పట్టించుకోవట్లేదని ఏడుస్తున్న బాబు
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రుబెల్లాపై గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి
స్పైస్జెట్కు రూ.60 వేల జరిమానా
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే పింఛన్ల పెంపు
నేడు ప్రధానమంత్రి రోడ్ షో
ఓటింగ్ శాతం పెంచాలి
ఉమ్మరకోట్ సొంతం!
సీ్త్ర, పురుష నిష్పత్తిలో తేడా తగ్గించాలి
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
సమన్వయంతో పనిచేద్దాం: ఎస్పీ
‘12, 13 తేదీల్లో పత్రికా ప్రకటనలపై ముందస్తు అనుమతి తప్పనిసరి’
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement