-
సుప్రీంలో ట్రంప్కు భారీ విజయం
వాషింగ్టన్: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ ఊరట. కొలరాడో ప్రైమరీ బ్యాలెట్ పత్రాల నుంచి ఆయన పేరు తొలగించాలన్న రాష్ట్ర సుప్రీంకోర్టు తీర్పును అమెరికా సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఆయన పేరుండాల్సిందేనంటూ సంచలన తీర్పు వెలువరిచింది. దాంతో కొలరాడోతో పాటు ఇలినాయీ, మెయిన్ వంటి రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్పై పేరు తొలగింపు ముప్పు ఎదుర్కొంటున్న ట్రంప్కు భారీ ఊరట లభించింది. ఆయా రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యరి్ధత్వం కోసం ప్రైమరీల్లో ట్రంప్ పోటీకి మార్గం సుగమమైంది. పార్లమెంట్పైకి మద్దతుదారులను ఉసిగొల్పారన్న ఆరోపణలపై రాజ్యాంగంలోని 14వ సవరణ మూడో సెక్షన్ను ఉపయోగించి ట్రంప్ను ప్రైమరీ నుంచి కొలరాడో సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. అధ్యక్ష అభ్యరి్థపై కోర్టు ఈ సెక్షన్ను వాడటం అమెరికా చరిత్రలో అదే తొలిసారి. 14వ సవరణను వాడే అధికారం పార్లమెంట్కే తప్ప రాష్ట్రాలకు లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇది అమెరికా సాధించిన ఘన విజయంమని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
డొనాల్డ్ ట్రంప్నకు మరో షాక్
పోర్ట్ల్యాండ్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు మరో షాక్ తగిలింది. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న ఆయనకు దారులు క్రమంగా మూసుకుపోతున్నాయి. కొలరాడో రాష్ట్రంలో అధ్యక్ష అభ్యరి్థత్వానికి(ప్రైమరీ ఎన్నికలో) పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడని 2021 జనవరి 6న జరిగిన క్యాపిటల్ హిల్పై దాడి కేసులో కొలరాడో సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కొలరాడో రాష్ట్ర ప్రైమరీ ఎన్నికలో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేసింది. తాజాగా మెనె రాష్ట్రంలోనూ ట్రంప్నకు పరాభవం ఎదురైంది. రాష్ట్రంలో ప్రైమరీ ఎన్నికలో పోటీ చేయకుండా బ్యాలెట్ నుంచి ట్రంప్ పేరును తొలగిస్తున్నట్లు మెనె రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి షెన్నా బెల్లోస్ గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేశారు. ఈ ఉత్తర్వుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాన్ని ట్రంప్నకు కలి్పంచారు. కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మెనె రాష్ట్రంలో ప్రైమరీ ఎన్నికలో ట్రంప్ అభ్యరి్థత్వాన్ని వ్యతిరేకిస్తూ కొందరు అప్పీళ్లు దాఖలు చేశారు. ఆయనకు ఇక్కడి నుంచి ప్రైమరీలో పోటీ చేసే అవకాశం ఇవ్వొద్దని కోరారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న షెన్నా బెల్లోస్ ప్రైమరీ బ్యాలెట్ నుంచి ట్రంప్ పేరును తొలగించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థి పేరును ఒక రాష్ట్రంలో ఇలా బ్యాలెట్ నుంచి తొలగించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
US Elections : ట్రంప్ పోటీ పై కోర్టు సంచలన తీర్పు
వాషింగ్టన్: అమెరికాలోని కొలరాడో సుప్రీం కోర్టు ఆ దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్కు షాక్ ఇచ్చింది. మార్చిలో జరగనున్న కొలరాడో ప్రెసిడెన్షియల్ ప్రైమరీ బ్యాలెట్లో పోటీ చేయకుండా ట్రంప్పై అనర్హత వేటు వేసింది. 2021లో వాషింగ్టన్ క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతు దారులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇందుకుగాను ట్రంప్ను డిస్క్వాలిఫై చేస్తూ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. సిటిజన్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎథిక్స్ గ్రూపు ట్రంప్ను డిస్క్వాలిఫై చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ట్రంప్కు అప్పీల్ చేసుకునే వీలు కల్పిస్తూ తీర్పును తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు కొలరాడో కోర్టు వెల్లడించింది. ఈ డిస్క్వాలిఫికేషన్ తీర్పు మార్చి 5న జరగనున్న ప్రైమరీ బ్యాలెట్కు మాత్రమే వర్తించనుంది. డిస్క్వాలిఫికేషన్ తీర్పుపై అప్పీల్ చేయనున్నట్లు ట్రంప్ కార్యాలయం తెలిపింది. తీర్పుపై అప్పీల్కు జనవరి 4 దాకా కోర్టు అవకాశమిచ్చింది. దేశంలో తిరుగుబాటు చర్యలకు పాల్పడిన వారు రాజ్యాంగ పదవిలో ఉండడానికి వీలు లేదని అమెరికా రాజ్యాంగంలో నిబంధన ఉంది. ఈ నిబంధన ఆధారంగానే కొలరాడో కోర్టు ట్రంప్ను డిస్క్వాలిఫై చేసింది. కొలరాడో కోర్టు తీర్పును ట్రంప్ యూఎస్ సుప్రీం కోర్టులో అప్పీల్ చేయనున్నారు. ట్రంప్ ఉంటేనే పోటీలో ఉంటా : వివేక్ రామస్వామి కొలరాడో ప్రైమరీ బ్యాలెట్లో మాజీ అధ్యక్షుడు ట్రంప్ పోటీలో ఉంటేనే తాను పోటీ చేస్తానని రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వివేక్ రామస్వామి తెలిపారు. వివేక్ రామస్వామి భారత సంతతికి చెందిన ప్రముఖ అమెరికా వ్యాపారవేత్త. ఈయన అమెరికాలో ఫార్మాసుటికల్ వ్యాపారం చేస్తున్నారు. ఇదీచదవండి..ఆవు పేడతో రాకెట్ ప్రయోగం.. జపాన్ ఆవిష్కరణ -
ప్రేతాత్మకు ఆవాసం
చూడటానికి రాచప్రాసాదంలా కనిపించే ఈ పురాతన హోటల్ భయానకమైన కట్టడంగా పేరుమోసింది. మామూలుగా చూస్తే ఇందులో భయపెట్టే వస్తువులేవీ కనిపించవు గాని, ఇది ప్రేతాత్మకు ఆవాసంగా మారిందని జనాలు చెప్పుకుంటారు. స్టీమ్ ఇంజిన్తో నడిచే కారును కనుగొన్న ఫ్రీలాన్ ఆస్కార్ స్టాన్లీ క్షయవ్యాధికి లోనైనప్పుడు కొలరాడోలోని రాకీ పర్వత ప్రాంతంలో ఇల్లు నిర్మించుకున్నాడు. స్వచ్ఛమైన గాలి, ధారాళంగా ఎండ తగిలే ప్రదేశాల్లో ఉంటూ మంచి ఆహారం తీసుకోవడం తప్ప అప్పట్లో క్షయవ్యాధికి పెద్దగా మందులు లేవు. ఇక్కడ ఉంటూ స్టాన్లీ వ్యాధి నుంచి కోలుకున్నాడు. తర్వాత క్షయ రోగులకు ఆవాసంగా ఉపయోగపడేలా ఇక్కడ 1907లో 48 గదుల హోటల్ నిర్మించాడు. తర్వాత హోటల్ను 140 గదులకు విస్తరించాడు. ఈ హోటల్లోనే స్టాన్లీ భార్య మరణించింది. అప్పటి నుంచి ఆమె ఆత్మ ఇందులోనే సంచరిస్తోందని, రాత్రివేళ హోటల్ హాలులో ఉన్న పియానోను వాయిస్తోందని ప్రచారం మొదలైంది. ఈ హోటల్లో దిగిన కొందరు అతిథులు కూడా ఇక్కడ ఆత్మను తాము స్పష్టంగా చూసినట్లు చెప్పడంతో ఇది హాంటింగ్ హోటల్గా పేరుమోసింది. -
ఏకాంతంగా బ్రతకాలనుకున్నారు.. చివరికి...
వాషింగ్టన్: అమెరికాలో ఒక కుటుంబంలోని అక్కాచెల్లెళ్ల తోపాటు వారిలో ఒకరి కుమారుడు.. ముగ్గురికీ ప్రపంచ పోకడ నచ్చక జనాల ఉనికంటూ లేని ప్రదేశానికి వెళ్లి బ్రతకాలనుకున్నారు. చివరికి కొలరాడోలో కఠినాతి కఠినమైన పరిస్థితులకు తాళలేక పస్తులుండి కన్నుమూశారు. గన్నిసన్ కౌంటీ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ముగ్గురి మృతదేహాలను అటాప్సీ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గన్నిసన్ కౌంటీ అధికారి మైకేల్ బార్నెస్ తెలిపిన వివరాల ప్రకారం మృతులను క్రిస్టీన్ వాన్స్(41), రెబెక్కా వాన్స్(42), రెబెక్కా వాన్స్ కుమారుడు(14) గా గుర్తించారు. కొలరాడోలోని ఓహియో సిటీకి 14 కిలోమీటర్లకు దూరంలో వీరు దయనీయ స్థితిలో చనిపోయి ఉన్నారని తెలిపారు. ఆకలి బాధలకి తాళలేక ఇక్కడ వాతావరణాన్ని తట్టుకోలేక చనిపోయి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. విచారణలో భాగంగా రెబెక్కా వాన్స్ బంధువుల్లో ఒకరిని ఆరా తీయగా రెబెక్కాకు ప్రపంచం తీరు నచ్చేది కాదు. తనతోపాటు క్రిస్టీన్ ను తన కుమారుడిని కూడా జనజీవన స్రవంతికి దూరంగా ఎక్కడికైనా తీసుకుని వెళ్లి ఒంటరిగా జీవించాలని చెప్తూ ఉండేదని తెలిపారు. అజ్ఞాతంలోకి వెళ్లి బ్రతకడమెలా అని యూట్యూబ్ వీడియోలు చూసి అరకొర అవగాహనతో నిర్మానుష్య ప్రాంతానికి సరైన సిద్ధపాటు లేకుండా వెళ్లిపోవడం వలననే వారు దయనీయంగా మృతి చెందారని చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: అమెరికా శత్రువులంతా ఒకేచోట.. ఎందుకంటే.. -
షాకింగ్: 560 మంది శరీర భాగాలను అమ్ముకున్న తల్లీకూతుళ్లు!
వాషింగ్టన్: అమెరికాలోని కొలొరాడో రాష్ట్రంలో సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. శ్మశన వాటిక మాజీ ఓనర్ అయిన ఓ 46 ఏళ్ల మహిళకు ఫెడరల్ కోర్టు మంగళవారం 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అంత్యక్రియల కోసం తీసుకొచ్చిన 560 మృతదేహాలకు చెందిన వివిధ అవయవాలను బంధువులకు తెలియకుండానే అమ్ముకున్నట్లు నేరం నిరూపణ అయిన క్రమంలో ఈ మేరకు తీర్పు ఇచ్చింది. మృతుల బంధువులను మోసం చేసి ఫోర్జరీ డోనార్ పత్రాల సాయంతో ‘మేగన్ హెస్’ అనే మహిళ శరీర భాగాలను విక్రయించినట్లు తేలిందని అధికారులు తెలిపారు. గత జులై నెలలో తను చేసిన నేరాన్ని అంగీకరించిందని, ఈ క్రమంలోనే కోర్టు 20 ఏళ్ల శిక్ష విధించినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఆమెకు సహకరించిన తల్లి షిర్లే కొచ్కు 15 ఏళ్ల జైలు శిక్ష పడినట్లు తెలిపింది. ఇదీ జరిగింది.. కొలొరాడో రాష్ట్రంలోని మోంట్రోస్లో ‘సన్సెట్ మెసా’ అనే శశ్మాన వాటిక, అవయవదాన సేవలను నిర్వహించేది మేగన్ హెస్. 69 ఏళ్ల తల్లి షిర్లే కొచ్ ఆమెకు ఈ కార్యక్రమాల్లో సహకరించేది. ఈ క్రమంలోనే ఇరువురు అక్రమంగా మృతదేహాల అవయవాలను విక్రయిస్తూ డబ్బులు సంపాదించటం మొదలు పెట్టారు. బంధువులే అవయవాలను దానం చేస్తున్నట్లుగా నకిలీ పత్రాలను సృష్టించి తమ చీకటి కార్యాన్ని నిర్విగ్నంగా కొనసాగించారు. ఇలా 560 మంది శరీర భాగాలను విక్రయించారు. 2016-2018 మధ్య అమెరికాలో అవయవాల విక్రయాలపై రాయిటర్స్ పరిశోధనాత్మక కథనాలు వెలువడిన క్రమంలో మేగన్ హెస్, ఆమె తల్లి షిర్లే చేసిన దందా బయటపడింది. తల్లీకూతుళ్ల విషయాన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ)కి రాయిటర్స్ సమాచారం అందించడంతో వారి బిజినెస్ కేంద్రాలపై దాడులు చేసింది. అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రాధాన్యం కలిగిన కేసుగా పోలీసులు అభివర్ణించారు. ఇరువురిని అరెస్ట్ చేసి విచారించగా గత జులై నెలలో నేరం అంగీకరించారు. ఈ క్రమంలోనే మేగన్ హెస్కు 20 ఏళ్లు, ఆమె తల్లి షిర్లే కొచ్కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది ఫెడరల్ కోర్టు. నిందితురాలి తల్లి షిర్లే ప్రధానంగా అవయవాలను శరీరం నుంచి వేరు చేసి భద్రపరిచే పనిలో సహకరించేదని తేల్చింది. తల్లీకూతుళ్ల ఆపరేషన్కు 200లకుపైగా కుటుంబాలు బాధితులుగా మారినట్లు తెలిసింది. మరోవైపు.. హెస్ చేసిన చర్యలను సమర్థించారు ఆమె న్యాయవాది. నిందితురాలికి 18 ఏళ్ల వయసులో మెదడు దెబ్బతిన్నదని అందుకే ఇలా ప్రవర్తించిందని చెప్పుకొచ్చారు. కోర్టులో సాక్ష్యం చెప్పిన ఓ బాధితుడు వారి నేరాలపై కీలక విషయాలు బయటపెట్టాడు. తన తల్లికి చెందిన భుజాలు, మోకాళ్లు, పాదాలు విక్రయించారని ఆరోపించారు. అమెరికాలో అవయవాల మార్పిడి కోసం గుండె, కిడ్నీలు వంటి వాటిని విక్రయించడం నేరం. వాటిని ఎవరైనా దానం చేస్తేనే మార్పిడికి ఉపయోగించాలి. చట్టం పరిధిలో లేని తల, భుజాలు, వెన్నెముఖలను సైతం వారు విక్రయించేవారని తేలింది. ఇదీ చదవండి: దేశం విడిచి వెళ్లమని బెదిరింపులు.. నెలకి రూ.1కోటి ఆఫర్: మహిళా కోచ్ -
మోస్ట్ వాంటెడ్ కిల్లర్
అది అమెరికా, ఆరిజోనాలోని గ్లెన్డేల్ నగరం. ఇరవై ఏళ్ల డయానా షా క్రాఫ్ట్.. తన అక్క క్రిస్టీనాతో కలసి ఓ అపార్ట్మెంట్లో ఉంటూ బర్గర్ కింగ్లో ఉద్యోగం చేసేది. వాళ్లది కొలరాడో. ఉద్యోగాల కోసం ఆరిజోనా వచ్చారు.డయానాని వదిలి ఉండలేని తన చిన్ననాటి స్నేహితురాలు పందొమ్మిదేళ్ల జెన్నిఫర్ లూత్..ఆరిజోనా వెళ్తానని తన పేరెంట్స్ని ఒప్పించింది. డిస్కవరీ కార్డ్లో జాబ్ సంపాదించి మరీ డయానా దగ్గరకు వచ్చేసింది. దాంతో ముగ్గురూ కలసి అదే అపార్ట్మెంట్లో ఉండేవారు. 1996 మే 24 సాయంత్రం.. డయానా,జెన్నిఫర్లు కలసి.. త్వరగా వచ్చేస్తామని స్టీనాతో చెప్పి.. సమీపంలోని మినీ–మార్ట్కు వెళ్లారు. అయితే క్రిస్టీనా వాళ్లని చూడటం అదే చివరిసారైపోయింది. రాత్రి 12 దాటినా వాళ్లు తిరిగి రాకపోయేసరికి.. మెమోరియల్ డే వీకెండ్ పార్టీకి వెళ్లారేమోనని సరిపెట్టుకుంది క్రిస్టీనా. మరునాడు ఉదయానికి కూడా వాళ్లు రాకపోయేసరికి కంగారుపడింది. వెంటనే దగ్గర్లోనే ఉంటున్న తన తండ్రి రోడ్జర్ షాక్రాఫ్తో పాటు.. జెన్నీ పేరెంట్స్కి కూడా సమాచారం ఇచ్చింది. వాళ్లందరూ గ్లెన్డేల్కు చేరుకుని పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇవ్వడంతో పోలీసులు రంగంలో దిగారు. విచారణలో.. ఆ అమ్మాయిలు ఒక అజ్ఞాత వ్యక్తితో వెళ్లడం చూశానని చెప్పాడు మినీ–మార్ట్ క్యాషియర్. దాంతో మెక్సికోలో జరిగే మెమోరియల్ డే పార్టీకి వెళ్లారేమో అని పోలీసులతో సహా అంతా భావించారు. కానీ రోజులు వారాలయ్యాయి. వారాలు నెలలు అయ్యాయి. వాళ్లు మాత్రం తిరిగిరాలేదు.ఆగస్ట్ మధ్యవారంలో ఫీనిక్స్కు ఉత్తరాన వంద మైళ్ల దూరంలోని మారుమూల ఎడారిలోకి కొందరు స్థానికులు వేటకెళ్లినప్పుడు.. ఒకదానిపై ఒకటిపడి ఉన్న రెండు మృతదేహాలు వారి కంటపడ్డాయి. అవి ఇరవై–ఇరవై ఐదేళ్లలోపు యువతులవని వాళ్లు పోలీసులకు తెలియజేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ శవాలను పోస్ట్మార్టమ్కి పంపించారు. అవి డయానా, జెన్నీల మృతదేహాలేనని తేలడంతో అంతా షాక్ అయ్యారు. అసలు అంత దూరం వాళ్లెలా వెళ్లారు? ఎవరు తీసుకుని వెళ్లారు? చనిపోకముందే అక్కడికి వెళ్లారా? లేక ఎవరైనా చంపి అక్కడ పడేశారా? వంటివన్నీ సమాధానాల్లేని ప్రశ్నలయ్యాయి. డయానా, జెన్నిఫర్ మాయమైన రోజు అసలేమైంది? అంటూ మరోసారి విచారణ మొదలుపెట్టారు పోలీసులు. ‘క్లియర్గా ఏం జరిగిందో చెప్పు’ అంటూ.. మినీ–మార్ట్ క్యాషియర్ని నిలదీశారు. ఆ రోజు ఆ ఇద్దరమ్మాయిలు సిగరెట్, సోడా ఇక్కడే కొనుక్కుని తాగారని, రెండు గంటల పాటు బయట బెంచ్ మీదే కూర్చుని కబుర్లు చెప్పుకున్నారని, ఆ తర్వాత నీలం రంగు పికప్ ట్రక్లో వచ్చిన ఓ వ్యక్తి వారితో మాట్లాడాడని,కొంతసేపటికి అదే ట్రక్కులో ఎక్కి ఆ ముగ్గురూ వెళ్లిపోయారని చూసింది చూసినట్లుగా చెప్పాడు ఆ క్యాషియర్. అంతేకాదు ఆ వ్యక్తికి ముప్పై నుంచి ముప్పై మూడేళ్ల వయస్సుంటుందని, బ్రౌన్ కలర్ జుట్టు, గడ్డం ఉన్నాయని.. డెనిమ్ జాకెట్ వేసుకున్నాడనీ సమాచారమిచ్చాడు. దాంతో పోలీసులు.. ఆ అజ్ఞాత వ్యక్తి కచ్చితంగా డయానా, జెన్నిఫర్లలో ఇద్దరికీ లేదా ఒకరికి బాగా తెలిసినవాడే అయ్యుంటాడని నమ్మారు.తక్షణమే అనుమానితుడి ఊహాచిత్రాన్ని విడుదల చేశారు. ఈ క్రైమ్ స్టోరీకి పత్రికల్లో, టీవీల్లో విస్తృత ప్రచారం కలిపించారు. ఫీనిక్స్లో డయానా, జెన్నీలు ఎన్నో పార్టీలకు, నైట్క్లబ్లకు హాజరయ్యేవారని తెలియడంతో.. అక్కడే ఆ ఆగంతకుడు వారికి పరిచయం అయ్యుంటాడని భావించారు. ఎక్కడైతే వీరి మృతదేహాలు లభించాయో అక్కడే రెండు సిలువలను పాతి..డయానా, జెన్నిఫర్ల ఫొటోలు పెట్టి,సమాధుల్లా కట్టించారు కుటుంబసభ్యులు. ఆ పరిసరాల్లో పోలీస్ నిఘాని పెంచారు. నాలుగు సంవత్సరాల తర్వాత అంటే 2000 సంవత్సరం,సెప్టెంబర్ 29న సమాధుల దగ్గరున్న ఫ్రేమ్స్లోని ఫొటోలు మాయమయ్యాయి. వాటిని హంతకుడే దొంగిలించి ఉంటాడని చాలామంది నమ్మారు. ఎందుకంటే సాధారణమైన వ్యక్తులు.. చనిపోయినవారి పట్ల చాలా గౌరవంతో ఉంటారని.. అలాంటిది సమాధులపై ఫొటోలు మాయం చేశారంటే అది కచ్చితంగా నేరస్థుల పనేనని భావించారు. ఫొటోలు మాయం చేసింది హంతకుడే అయితే అతడిలో అపరాధ భావన కలిగిందా? లేక ఇన్నేళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకున్నందుకు గర్వపడుతున్నాడా? జెన్నీ,డయానాలే కాకుండా ఇంకా ఎంత మంది ఆడపిల్లలు అతడి చేతుల్లో బలయ్యారో? ఇలా ఎన్నో ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. జెన్నీ మీద దిగులుతో ఆమె తండ్రి రాబర్ట్.. 2014లో జెన్నీ స్మారకదినం రోజునే కన్నుమూశాడు. అపμటికే డయానా తల్లిదండ్రులు కూడా మరణించారు.నిజానికి రాబర్ట్ తన కూతురు జెన్నీ కోసం పెద్ద పోరాటమే చేశాడు. హంతకుడు కచ్చితంగా ఒక్కడు కాదు.. అతనికి సహచరులు ఉండే ఉంటారని అతడు భావించాడు. ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేయించాడు. అయినా ఫలితం లేకపోయింది. 2014లో అతడి మరణం తర్వాత.. అతడి భార్య డెబోరా.. ఇప్పటికీ ఈ పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఆవిడ కొలరాడోలోని లవ్ల్యాండ్లో నివసిస్తూ కోర్టుల చుట్టూ.. అధికారుల చుట్టూ తిరుగుతోంది.ఇప్పటికీ ఆమె తన కూతురు జెన్నీ బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ.. ఆమె జ్ఞాపకాల్లోనే బతుకుతోంది. నేరస్థుడు దొరుకుతాడని.. ఏదో ఒకరోజున నిజం బయటపడుతుందని నమ్ముతోంది. ఆ దుస్సంఘటన జరిగి 26 ఏళ్లు కావస్తున్నా.. ఆ ప్రాణస్నేహితుల్ని చంపిన హంతుకులు ఎవరో బయటపడలేదు. ఆ తల్లి కడుపుకోతకు సమాధానం దొరకలేదు. - సంహిత నిమ్మన -
ట్రక్ డ్రైవర్కు న్యాయం జరిగింది.. 110 ఏళ్ల జైలు శిక్ష పదేళ్లకు తగ్గింపు
ట్రక్ డ్రైవర్కు 110ఏళ్ల జైలు శిక్ష విధించింది ఓ కోర్టు. ఈ తీర్పుపై పెద్దఎత్తున విమర్శలు వెళ్లువెత్తాయి. రోజెల్ అగ్యిలేరా-మెడెరోస్ అనే ఓ వ్యక్తి నడుపుతున్న ట్రక్ 2019లో అమెరికాలోని కొలరాడోలో ప్రమాదవశాత్తు లారీపైకి దూసుకేళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రోజెల్కు కోర్టు భారీ శిక్ష(110 ఏళ్ల కారాగారం) విధించింది. క్యూబా దేశస్తుడైన రోజెల్.. రాకీ పర్వత ప్రాంతంలో కలపను రవాణా చేసే ట్రక్ డైవర్గా పనిచేస్తున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో తను నడుపుత్ను ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని, వాహనాన్ని ఆపడానికి చాలా ప్రయత్నించాని రోజెల్ తెలిపాడు. తను కావాలని లారీని ఢికొట్టలేదని పేర్కొన్నాడు. అయితే అతని వాదనలు కొట్టిపారేసిన కొలరాడో కోర్టు.. 110 ఏళ్ల జీవితా కారాగార శిక్ష విధించింది. అతనికి విధించిన భారీ శిక్ష అన్యాయమని పెద్ద ఎత్తున కొలరాడోలో ర్యాలీలు నిర్వహించారు. ప్రముఖ రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దేషియన్ వెస్ట్ కూడా రోజెల్కు విధించిన శిక్ష తగ్గించాలనే పిటిషన్కు మద్దతు తెలిపింది. అదేవిధంగా కొలరాడోలోని ట్రక్ డ్రైవర్లు అతనికి విధించిన భారీ శిక్షకు వ్యతిరేకంగా ట్రక్లను నడపటం బాయ్కాట్ చేస్తున్నామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా రోజెల్కు విధించిన శిక్ష అన్యాయమని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరిగింది. తీవ్రమైన విమర్శలు వెళ్లువెత్తున్న సమయంలో గురువారం ట్రైయర్ కోర్టు రోజెల్ కేసుపై మరోసారి విచారణ చేపట్టింది. అయితే అతనికి విధించిన 110 ఏళ్ల జైలు శిక్షను పదేళ్లకు తగ్గిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. తాజాగా వెల్లడించిన కోర్టు తీర్పుపై రోజెల్ తల్లి ఆనందం వ్యక్తం చేసింది. -
మెడలో 16 కిలోల బరువు.. రెండేళ్లుగా ‘దుప్పి’ తిప్పలు.. నాలుగుసార్లు మిస్
కొలరాడో: మెడలో టైర్తో పరుగెడుతున్న ఈ దుప్పిని పట్టుకోవడానికి కొలరాడో వన్యప్రాణి సంరక్షణ అధికారులకు చుక్కలు కనబడ్డాయి. కొండల ప్రాంతంలో తిరిగే ఆ దుప్పి మెడలోకి టైర్ ఎలా వచ్చిందో తెలియదు గానీ రెండేళ్లుగా అధికారులు దాని కోసం వెతుకుతున్నారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించి దుప్పిని గత శనివారం పట్టుకుని టైర్ని తొలగించారు. నాలుగున్నర ఏళ్ల వయసు.. 270 కిలోల బరువున్న ఆ దుప్పి గత వారం రోజుల్లో నాలుగుసార్లు చిక్కినట్టే చిక్కి తప్పించుకుపోయిందని పార్క్ అధికారి స్కాట్ ముర్దోచ్ తెలిపారు. తొలుత దుప్పిని పట్టుకుని టైర్ని కట్ చేద్దామని అనుకున్నప్పటికీ సాధ్య పడలేదని పేర్కొన్నారు. పక్కా సమాచారంతో ఐదోసారి దుప్పిని టైర్ మోత నుంచి రక్షించామని అన్నారు. (చదవండి: కూతురు ఆనందం: హే.. నాన్న కూడా నాతో పాటే..!) మట్టి, రాళ్లతో నిండిన ఆ టైర్ బరువు సుమారు 16 కిలోల వరకు ఉంటుందని, దాని వల్ల దుప్పి ఆరోగ్యంపై ప్రభావం పడేదని వెల్లడించారు. అయితే, రెండేళ్లుగా అంత బరువు మోసినా దుప్పి మెడ ఎప్పటిలా మామూలుగా ఉండటం మంచి విషయమని పేర్కొన్నారు. మెడపై చిన్న గాయం మాత్రం ఉందని తెలిపారు. Here is some video of this bull elk over the past two years. pic.twitter.com/R6t9nNPOyb — CPW NE Region (@CPW_NE) October 11, 2021 (చదవండి: వైరల్: అరటి గెల మీద పడటంతో కోర్టుకు.. ఐదేళ్లు పోరాడి విజయం.. రూ.4 కోట్ల నష్ట పరిహారం) -
సిజేరియన్ డాక్టర్ల నిర్వాకం.. పసికందు ముఖంపై 13 కుట్లు
వాషింగ్టన్: అమెరికాలో సిజేరియన్ డాక్టర్ల నిర్వాకం బయటపడింది. ఓ మహిళకు ప్రసవం చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ల కారణంగా పసికందు ముఖంపై గాయమైంది. దాంతో శిశువు ముఖంపై ఏకంగా 13 కుట్లు పడ్డాయి. వివరాలలోకి వెళ్తే.. జూన్ 15 న కొలరాడోలోని డెన్వర్ హెల్త్ హాస్పిటల్లో డమార్కస్ విలియమ్స్ భార్య రిజానా డేవిస్ పడంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. కానీ డెలివరీ సమయంలో తమ బిడ్డ క్యాని విలియమ్స్కు కలిగిన గాయం చూశాక అల్లాడిపోయారు. ‘మొదట మేము నార్మల్ డెలివరీకే యత్నించాం. కానీ, ప్రసవ సమయంలో వైద్యులు పాప హృదయ స్పందన ఖచ్చితం కనుగొనలేకపోవడంతో వెంటనే రిజానాను సి-సెక్షన్లోకి తీసుకువెళ్లారు. సిజేరియన్ తరువాత తల్లీ బిడ్డ క్షేమం అని చెప్పారు. అయితే, మా బిడ్డ ఎడమ చెంపపైన 13 కుట్లు ఉన్నాయి. ఇదేంటని డాక్టర్లను ప్రశ్నించగా సరైన సమాధానం లభించలేదు’ అని డమార్కస్ విలియమ్స్ చెప్పారు. ఇక ఈ విషయం గురించి శిశువు తాతయ్య మాట్లాడుతూ.. ‘చిన్నారి క్యాని రాక మా అందరికీ ఆనందం కలిగించింది కాని అంతే భయం, బాధ కలిగింది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదిని నియమించుకుని ఆస్పత్రిపై దావా వేస్తామని తెలిపారు. చదవండి:విషాదం: ప్రపంచ రికార్డ్ కోసం ఫీట్ చేసి ప్రాణాలు కోల్పోయాడు -
లవర్ ఆహ్వానంపై అసంతృప్తి, ఆరుగురిని చంపిన ప్రియుడు
వాషింగ్టన్: తన కుటుంబంలో జరగాల్సిన బర్త్డే వేడుకుల్లో పాల్గొనాలంటూ పంపిన ప్రియురాలి ఆహ్వానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియుడు బాధితురాలి కుటుంబ సభ్యులపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఆరుగురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. అమెరికా కొలరాడో పోలీసులు కథనం ప్రకారం.. మే 9న కొలరాడోలో సాండ్రా అనే యువతి ఇంట్లో బర్త్డే పార్టీ జరగాల్సి ఉంది. అయితే ఆ బర్త్డే పార్టీకి ఆమె ప్రియుడు మాకియాస్ను ఆహ్వానించింది. కానీ, ప్రియురాలు అందించిన ఆహ్వానంపై అసహనం వ్యక్తం చేసిన మాకియాస్ బాధితురాలి బంధువులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో సాండ్రాతో పాటు మెల్విన్ పెరెజ్(30) పెరెజ్ (33) జోనా క్రజ్(52),జోస్ గుటిరెజ్(21) జోస్ ఇబ్రారా(26) దుర్మరణం పాలయ్యారు. అయితే ఈ కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొలరాడో పోలీస్ అధికారి నిస్కి మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణలో యువతి సాండ్రా, ప్రియుడు మాకియాస్లు సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే వారిద్దరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో సాండ్రా ఇంట్లో జరిగిన పుట్టిన రోజు వేడుకలకు పంపిన ఆహ్వానంపై నిందితుడు కోపానికి గురై కాల్పులు జరిపినట్లు తేలింది. గతంలో నిందితుడిపై ఎలాంటి నేర చరిత్రలేదు. నిందితుడు మాకియాస్ ఈ కాల్పులు ఎందుకు జరిపాడు? నిందితుడు వద్ద ఉన్న 15 రౌండ్ల మ్యాగజైన్ ఎక్కడిది? ప్రియురాలి ఆహ్వానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ కాల్పులు జరిపాడా? లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు నిస్కి మీడియా సమావేశంలో వెల్లడించారు. -
అమెరికాలో మళ్లీ పేలిన తూటా.. 10 మంది మృతి
కొలొరాడో: అమెరికాలో వారం రోజుల వ్యవధిలో మళ్లీ కాల్పులు జరగడం భయభ్రాంతులకు గురి చేసింది. కొలొరాడోలోని ఒక సూపర్ మార్కెట్లో సోమవారం ఒక దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారి సహా 10 మంది మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా గాయపడడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బౌల్డర్ కౌంటీలోని కొలొరాడోలోని కింగ్ సూపర్స్ గ్రోసరీ మార్కెట్లో కాల్పులు జరుగుతున్నాయని సోమవారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందింది. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న అధికారి ఎరిక్ టాలీ (51) ఆధ్వర్యంలోని పోలీసు బృందం సూపర్ మార్కెట్కి తరలివెళ్లింది. సూపర్ మార్కెట్లోకి మొదట అడుగు పెట్టిన ఎరిక్ టాలీ ఆ కాల్పుల్లో మరణించారని బౌల్డర్ కౌంటీ చీఫ్ మారిస్ హెరాల్డ్ కన్నీళ్ల మధ్య చెప్పారు. గత 11 ఏళ్లుగా సేవలు అందిస్తున్న గొప్ప సాహసికుడైన అధికారిని కోల్పోయామని ఆమె అన్నారు. అట్లాంటాలోని ఆసియా మసాజ్లపై జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందిన ఘటన జరిగి వారం రోజులైందో లేదో సూపర్ మార్కెట్లో కాల్పులు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. బౌల్డర్ కౌంటీ చరిత్రలోనే ఇదో చీకటి రోజు అని ప్రత్యక్ష సాక్షులు కొందరు వ్యాఖ్యానించారు. సారా మూన్షాడో అనే మహిళ స్థానిక మీడియాతో మాట్లాడుతూ తాను, తన కుమారుడు స్ట్రా బెర్రీలు తీసుకుంటూ ఉండగా కాల్పుల శబ్ధం వినిపించిందని, వెంటనే తామిద్దరం ప్రాణాలు కాపాడుకోవడానికి బయటకు పరుగులు తీశామని చెప్పారు. బయటకి వచ్చేసరికి పార్కింగ్ స్థలంలో ఒక మృతదేహాన్ని చూశామని, తాము ప్రాణాలతో బయటకు వస్తామని అనుకోలేదని అన్నారు. నిందితుడు కాల్పులు జరపడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
సోడా, చిప్స్ కోసం వెళ్లాను.. అంతలోనే ఘోరం..
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. సోమవారం కొలరాడోలోని ఓ సూపర్ మార్కెట్లోకి ప్రవేశించిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా 10 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరుపుతున్న వ్యక్తిని పట్టుకునే క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ లోపలికి వెళ్లారు. ఈ క్రమంలో దుండగుడు అతనిపై కూడా కాల్పులు జరపగా, పోలీసు అధికారి అక్కడికక్కడే మరణించారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అర్ధ నగ్నంగా సూపర్మార్కెట్లోకి ప్రవేశించిన దుండగుడు కాల్పులకు తెగబడినట్టు జరిపినట్లు సమాచారం. ఇక ఈ ఘటనలో ఉన్మాదికి సైతం గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిగిన సూపర్ మార్కెట్ ప్రాంతాన్ని భద్రత సిబ్బంది ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. కాల్పుల నుంచి బయటపడ్డ ప్రత్యక్షసాక్షి ఒకరు మాట్లాడుతూ...'సోడా, చిప్స్ తీసుకోవడానికి సూపర్ మార్కెట్కి వెళ్లాను. దుండగుడు 8 రౌండ్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో నేను దాదాపు చనిపోతాననుకున్నా. ఒకరికొకరం సహాయం చేసుకుంటూ సూపర్ మార్కెట్ బయటకు పరుగెత్తుకొచ్చాం. కానీ దురదృష్టవశాత్తూ కొందరు షాక్లోనే ఉండిపోయారు' అని పేర్కొన్నాడు. కాల్పుల ఘటనపై కొలరాడో గవర్నర్ జారెడ్ పోలిస్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బౌల్టర్లో చోటుచేసుకున్న ఘటన తీరని విషాదాన్ని కలిగిస్తుంది. దీనిపై మాట్లాడటానికి మాటలు రావడం లేదు. ఈ ఘటన నన్ను కలిచివేస్తుంది అని ట్వీట్ చేశారు. -
కొలరాడోలోని సూపర్ మార్కెట్లో కాల్పులు
-
టాయ్లెట్లో నాలుగడుగుల పాము
కొలరాడో: అమెరికాలోని ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. టాయ్లెట్లో పాము కనిపించడంతో గుండె ఆగినంత పనైంది. కొలరాడోకు చెందిన మిరాండా స్టీవార్ట్ గత బుధవారం తన బాత్రూం గదిలోకి వెళ్లింది. టాయ్లెట్కి వెళ్లిందో లేదో టాయ్లెట్ సీట్లోంచి ఏదో శబ్ధం వినిపించింది. ఏమిటా అని దగ్గరకు మొహం పెట్టి చూసేసరికి అక్కడ బుసలు కొడుతూ పాము తల పైకెత్తి చూడటంతో ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. వెంటనే గావుకేకతో తన బాయ్ఫ్రెండ్ను పిలిచి అపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తిని పిలుచుకురమ్మంది. అనంతరం ఆ గది నుంచి బయటకు పరుగెత్తుకొచ్చింది. మరోవైపు ఆ సిబ్బంది వెంటనే బాత్రూంలోకి చేరుకుని టాయ్లెట్ సీటులో ఉన్న పామును బయటకు తీశాడు. (అర్జంట్ బాత్రూం: 185 కిమీ వేగంతో) అది సుమారు నాలుగు అడుగుల పొడవుంది. కెమెరాలో బంధించిన పాము ఫొటోలను స్టీవార్ట్ ఫేస్బుక్లో పోస్టు చేసింది. "నా జీవితంలో ఇంతగా ఎప్పుడు భయపడలేదు" అని చెప్పుకొచ్చింది. అయితే అది విషసర్పం కాకపోవడంతో పామును పట్టుకున్న సాన్ఫోర్డ్ దాన్ని పెంచుకునేందుకు ముందుకు వచ్చాడు. సాన్ఫోర్డ్ దంపతులు ఆ పాముకు "బూట్స్" అని నామకరణం చేసి ఎంచక్కా ఇంటికి తీసుకు వెళ్లారు. (ప్యాంటులో పాము, రాత్రంతా జాగారం) -
ఈ వార్త చదివితే జన్మలో బీరు తాగరు
కొలరాడో : సంతోషంలో మునిగినా, బాధలో ఉన్నా వాటిని మరిచిపోవాలంటే గొంతులో ‘చుక్క’ పడాల్సిందే. అందులోనూ బీర్లు తాగేవారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక దిక్కు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా వైన్ షాపుల ముందు మందుబాబుల సందడి ఏమాత్రం తగ్గడం లేదు. ప్రపంచంలో ఏ దేశంలో చూసిన వారి హడావిడి మాత్రం మాములుగా ఉండదు. లాక్డౌన్ సమయం కావడంతో మందు కోసం వెంపర్లాడుతున్న మందుబాబులు ఈ వార్త చదివితే నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఎంతో ఇష్టంగా సేవించే బీరులో మూత్రం కలుస్తుందన్న వార్త ప్రస్తుతం వైరల్గా మారింది. (ఇంటర్వ్యూలో అడ్డొచ్చిన కూతురు: పేరేంటమ్మా?) ప్రపంచవ్యాప్తంగా బీర్ల తయారీలో ప్రసిద్ధి పొందిన బడ్వైజర్ బ్రాండ్కు అమెరికాలోని కొలరాడోలో పెద్ద ప్లాంట్ ఉంది. ఆ దేశానికి కావాల్సిన బీరులో అధిక శాతం ఆ ప్లాంటు నుంచే ఉత్పత్తి అవుతోంది. అయితే గత 12 ఏళ్లుగా ఆ ప్లాంట్లో పని చేస్తున్న వాల్టర్ పావెల్( పేరు మార్చారు) అనే వ్యక్తి బీరు ట్యాంకులో మూత్రం పోస్తున్నట్లు పెద్ద బాంబునే పేల్చాడు. ఈ విషయంపై వాల్టర్ను నిలదీయగా అతనిచ్చిన సమాధానం వింటే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. ఆ వ్యక్తి మాట్లాడుతూ.. ' జాయిన్ అయిన మొదటి రెండు సంవత్సరాలు ట్యాంకు కింది భాగంలో నీళ్లు కలిపే పని చేసేవాడిని. ప్లాంట్లో సీనియర్లతో పరిచయం పెరిగిన తర్వాత పైభాగంలో పని చేసే అవకాశం లభించింది. బీర్ ట్యాంకులో మూత్రం ఎందుకు పోశావని నిలదీస్తే మాత్రం నా దగ్గర కచ్చితమైన సమాధానం లేదు. ఆ పని ఎందుకు చేశానో నాకే తెలీదు. బేసిగ్గా నాకు బద్ధకం ఎక్కువ. వాష్ రూమ్ కోసం అంత దూరం వెళ్లాలా? అనిపించేది, ప్రకృతి ఎప్పుడు పిలిచినా ట్యాంకులోనే పని కానిచ్చేవాడిని. ఒక్కోసారి మా ఇంటివాళ్లు బీర్ తెమ్మన్నప్పుడు చాలా భయపడిపోయేవాడిని. అయినా కొలరాడోలోని ఫోర్ట్ కొలిన్స్ ప్లాంట్లో మాత్రమే ఈ పని చేశాను' అంటూ సమాధానమిచ్చాడు. ' పైగా ఈ విషయం ఇప్పుడు మీకు తెలిసిపోయింది కాబట్టి ఇక మీదట నేను అలా చేయను.. ఇప్పటినుంచి బడ్వైజర్ ప్రియులు నాణ్యమైన బీర్ను పొందుతారు ' అంటూ వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా కంపెనీ యాజమాన్యం సదరు వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించకపోవడంపై పలు అనుమానాలకు తావిచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత గాంచిన బడ్వైజర్ కంపెనీలో 12 ఏళ్లుగా ఒక వ్యక్తి బీరు ట్యాంకులో మూత్రం పోయడం సాధ్యమేనా అనే అనుమానాలు కలిగాయి. ఆ వ్యక్తి చెప్పిందంతా నిజమేనా.. కాదా.. అనేది తెలుసుకోవడానికి ఒక సంస్థ దీనిపై అధ్యయనం చేసింది. వీరి అధ్యయనంలో ఇదంతా నిజం కాదని, ఫూలిష్ హ్యూమర్ డాట్ కామ్ అనే వెబ్సైట్ సంస్థ సరదాగా క్రియేట్ చేసిన ఫేక్ న్యూస్ అని తేలింది. కానీ వారు రాసిన ఈ వార్త మాత్రం బీరు ప్రియుల్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ విషయంపై బడ్వైజర్ సంస్థ నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. చదవండి: టిక్టాక్ నిషేధంతో భారీగా నష్టపోయిన చైనా -
చిన్నారిమీదకు దూకిన బుల్డాగ్
-
పరిగెత్తుకొచ్చింది.. పాపపైకి దూకింది!..
కొలరాడో : ఎక్కడినుంచి వచ్చిందో! చర్చి ఆవరణలోకి పరిగెత్తుకొచ్చిందో కుక్క. పాత కక్షలు ఏమున్నాయో తెలీదు కానీ, ఆవేశంతో ఓ చిన్నారిమీదకు దూకి తీవ్రంగా గాయపర్చింది. ఈ విషాదకర సంఘటన అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్ పట్టణంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం అమెరికా కొలరాడో స్ప్రింగ్స్ పట్టణంలోని ఓ చర్చి పార్కింగ్ ఏరియాలోకి ప్రమాదకర జాతికి చెందిన ఓ బుల్డాగ్ పరిగెత్తుకుంటూ వచ్చింది. చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్న ఆ కుక్క తల్లిదండ్రులతో కలిసి నడుస్తున్న చిన్నారిపైకి దూకి కరవటం మొదలుపెట్టింది. ఈ హఠాత్పరిణామంతో పాప తల్లిదండ్రులు మొదట భయపడ్డా.. ఆ వెంటనే కుక్క బారినుంచి చిన్నారిని కాపాడేప్రయత్నం చేశారు. వారితో పాటు అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు కూడా సహాయం చేశారు. వారి తీవ్ర శ్రమకు ఫలితంగా కొద్దిసేపటి తర్వాత కుక్క పాపను విడిచి పారిపోయింది. అయితే పాప మాత్రం తీవ్ర గాయాలపాలైంది. అక్కడి పార్కింగ్ ఏరియాలోని సీపీ టీవీలో రికార్డైన సంఘటనకు సంబంధించిన దృశ్యాలను హ్యూమన్ సొసైటీ తమ ఫేస్బుక్ ఖాతాలో ఉంచింది. దీంతో వీడియో కాస్తా వైరల్గా మారింది. ( చదవండి : ఎవరైనా నన్ను చంపేయండి!.. ) -
గుర్రంపై క్రూరత్వం.. ట్రక్కుకు కట్టి
సాధారణంగా గుర్రం మీద స్వారీ చేస్తూ.. అది వేగంగా పరిగెత్తితే ఆనందపడుతాం. కొంతమంది జంతు ప్రేమికులు గుర్రాలను కూడా చాలా ప్రేమగా పెంచుకుంటారు. కానీ ఓ జంట ఇందుకు పూర్తిభిన్నంగా గుర్రం మీద తమ క్రూరత్వాన్ని ప్రదర్శించారు. వారు వెళ్లే ట్రక్కు వాహనానికి వెనుకభాగంలో బలవంతంగా కట్టేసి.. కారును వేగంగా నడుపుతూ తీసుకువెళ్లారు. ఆ మూగ జీవి ఎంత అరిచినా పట్టించుకోలేదు. అదీ కాక ఆ రహదారి పూర్తిగా మంచుతో కప్పబడి ఉంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కొలరోడోకి చెందిన ఓ జంట ఈ దారుణ ఘటనకు పాల్పడింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పలువురు నెటిజన్లు తీవ్రంగా కామెంట్ల ద్వారా విమర్శిస్తున్నారు. గ్రాండ్లేక్ వద్ద ఆ గుర్రం కిందపడిపోయినట్టు వీడియోలో తెలుస్తోంది. జాన్, అంబర్ సాల్డేట్ దంపతులు గుర్రంపై క్రూరత్వానికి పాల్పడినట్లు గ్రాండ్ కౌంటీ జిల్లా న్యాయవాది ఓ ప్రకటనలో తెలిపారు. గుర్రాన్ని వారి నుంచి తీసుకున్నామని అది ఇప్పుడు క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. జంతువులు, చిన్న పిల్లలకు సంబంధించిన కేసులు చాలా సున్నితమైనవి అంటూ దర్యాప్తు కొంత సమయం పడుతుందని గ్రాండ్ కౌంటీ షెరీఫ్ బ్రెట్ ష్రోట్లిన్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఆ జంట ఇంత మంది ఆ గుర్రం గురించి ఎందుకు బాధపడ్డారో తమకు ఇప్పుడు అర్థం అయిందని.. తాము తప్పు చేశామని ఒప్పుకున్నారు. దీంతో ఈ కేసుకు సంబంధించి ఆ జంట జనవరిలో కోర్టుకు హాజరుకానున్నారు. -
‘నీకు దొంగతనం చేతకాదులే..!’
-
వైరల్: ‘దొంగతనం నీ వల్ల కాదులే..!’
డెన్వర్ : దొంగతనానికి వచ్చే వాడు ఎవరూ గుర్తు పట్టకుడా ఉండేలా ముఖానికి మాస్క్ వేసుకుని.. బెదిరించడానికి ఆయుధాలు తీసుకోని వస్తాడు. చూడ్డానికి గుండేలు తీసిన బంటులా ఉంటాడు. కానీ, ఇప్పుడు మేము చెప్పబోయే దొంగ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటాడు. ఈ దొంగ చేసిన పనిని చూస్తే భయపడడం కంటే ముందు పడి పడి నవ్వుతారు. ఎందుకంటే దోపిడీకి వచ్చిన ఈ దొంగ ఏమాత్రం జాగ్రత్త లేకుండా బెదిరించడానికి తెచ్చుకున్న గన్నే పారేసుకుని.. చివరికి అవతలి వారికి చిక్కకుండా కాలికి బుద్ధి చెప్పి పరారయ్యాడు. కొలరెడోలో చోటుచేసుకున్న ఈ వెరైటీ దొంగతనం వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. వీడియోలో ఉన్న దాని ప్రకారం సదరు దొంగ కొలరెడోలోని ఓ ఈ-సిగరెట్ దుకాణంలో చోరి చేయడానికి వచ్చాడు. అక్కడ ఓ మహిళా ఉద్యోగి పనిచేస్తుంది. దాంతో ఈ దొంగ వెంటనే గన్ తీసి మహిళా ఉద్యోగిని బెదిరించి డబ్బులు వసూలు చేయాలనుకున్నాడు. కానీ అతని ప్లాన్ వర్క్వుట్ కాలేదు . తుపాకీ తీస్తూ ఉండగా అది కాస్తా జారి కౌంటర్లో పడిపోయింది. ఇది గమనించిన మహిళ కౌంటర్లో ఉన్న గన్ తీసుకోవడానికి ప్రయత్నించే లోపలే ఆ దొంగ పరుగు లంకించుకున్నాడు. డోర్ను ఒక్క తన్ను తన్ని.. జారిపోతున్న ప్యాంట్ను ఓ చేతపట్టుకుని పరుగు అందుకున్నాడు. అయితే ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు ఆ షాప్లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. దాంతో దొంగను పట్టుకోవడానికి అరోరా పోలీసులు ఈ ఫుటేజీని ఇంటర్నెట్లో షేర్ చేశారు. ఇలా షేర్ చేసిన 12 గంటల్లోనే వేలాదిమంది ఈ వీడియోను వీక్షించి రకరకాల కామెంట్లు పెట్టారు. కొందరైతే ‘నీకు ఈ దొంగతనాలు సూట్ కావు వేరే పని చూసుకో’’ అంటూ సూచించారు. ప్రస్తుతం ఈ దొంగను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. -
పిచ్చిగా ప్రేమించినందుకు... అతి దారుణంగా
కొలరెడో : మనుషులు ఎంత క్రూరంగా తయారయ్యారో నిరూపించే ఘటన కొలరెడోలో చోటుచేసుకుంది. గర్భిణి అయిన భార్యను, ముద్దులొలికే కూతుళ్లను అత్యంత పాశవికంగా హత్య చేశాడో వ్యక్తి. అనంతరం వారి శవాలను మరుగుతున్న ఆయిల్ ట్యాంకుల్లో పడేశాడు. ఆగస్టు 13న కొలరెడోలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... కొలరెడోకు చెందిన క్రిస్టోఫర్ లీ వాట్స్, షనన్ వాట్స్ దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు బెల్లా(4), సెలస్టీ (3) ఉన్నారు. ప్రస్తుతం షనన్15 వారాల గర్భిణి. అయితే గత సోమవారం నుంచి తన, భార్యా పిల్లలు కనిపించడం లేదని క్రిస్టోఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు క్రిస్టోఫర్పై అనుమానం కలిగింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి వల్లేనా..!? మధ్య తరగతి కుటుంబానికి చెందిన క్రిస్టోఫర్ అనడార్కో పెట్రోలియం కంపెనీలో ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. భర్తతో పాటు షనన్ కూడా ఉద్యోగం చేస్తూ కుటుంబ బాధ్యతలను పంచుకునేది. అయితే గత రెండేళ్లుగా వీరి ఆర్థిక పరిస్థితి దిగజారింది. దీంతో అప్పుల పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే క్రిస్టోఫర్ భార్యా, పిల్లలను హత్య చేసినట్లుగా తెలుస్తోంది. హత్య చేసిన అనంతరం బెల్లి, సెలస్టీల శవాలను తాను పనిచేసే పెట్రోలియం కంపెనీలోని ఆయిల్ ట్యాంకుల్లో కుక్కిన క్రిస్టోఫర్, షనన్ శవాన్ని మరో చోట పడేశాడు. భర్తను పిచ్చిగా ప్రేమించేది.. షనన్, ఆమె పిల్లల హత్యల గురించి ఆమె కుటుంబ సభ్యులు స్పందించారు. ‘షనన్కు భర్త అంటే ఎంతో ప్రేమ. మూడోసారి గర్భవతి అయిందని తెలిసిన తర్వాత ఆమె సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. భర్తతో ఈ విషయాన్ని పంచుకున్న అనంతరం మా అందరికీ ఈ శుభవార్త చెప్పింది. ఇద్దరు కూతుళ్లకు తండ్రి అయిన బెస్ట్ ఫాదర్ క్రిస్టీ ప్రేమ పంచుకునేందుకు నిక్(పుట్టబోయే బిడ్డకు షనన్ పెట్టాలనుకున్న పేరు) కూడా వస్తున్నాడంటూ ఎంత గానో మురిసిపోయింది. కానీ క్రిస్టీ మాత్రం షనన్ పట్ల చాలా దారుణంగా వ్యవహరించాడు. గర్భవతి అనే కనికరం లేకుండా తనని హత్య చేశాడు. ముద్దొలొలికే ఆ చిన్నారుల శవాలు కూడా చూసే వీలు లేకుండా చేశాడని’ వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
కారడవిలో కార్చిచ్చు.. కోట్ల ఎకరాలు ఆహుతి!
అమెరికాలోని కాలిఫోర్నియా, కొలరాడో రాష్ట్రాల్లో ఏర్పడిన రెండు కార్చిచ్చులు అక్కడి స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఈ దావానలం వ్యాపించిన ప్రాంతాలకు సమీపంలో ఉంటున్న వేలాది మందిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అలాగే కొలరాడో కార్చిచ్చుకు బాధ్యుడంటూ ఓ వ్యక్తినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నెల వ్యవధిలో బ్రిటన్లోని ఉత్తర ప్రాంతం అడవుల్లో ఏర్పడిన రెండు కార్చిచ్చులను అక్కడి ప్రభుత్వం అతికష్టం మీద అదుపులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో కార్చిచ్చు గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం... భూకంపం, కరువు, తుపానులు, వరదలు లాంటి ప్రకృతి విపత్తే కార్చిచ్చు. దీన్ని ఇంగ్లిష్లో వైల్డ్ఫైర్, వైల్డ్ల్యాండ్ ఫైర్, బ్రష్ ఫైర్, బుష్ ఫైర్, ఫారెస్ట్ ఫైర్.. తదితర పేర్లతో పిలుస్తారు. సహజసిద్ధంగానో, మానవ చర్యల వల్లనో అడవులు తగలబడటాన్ని కార్చిచ్చుగా చెప్పొచ్చు. వీటి కారణంగా పక్షులు, జంతువులతోపాటు మానవులూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కోకొల్లలు. దాదాపు 420 మిలియన్ సంవత్సరాల కిందటి నుంచే కార్చిచ్చులు ఏర్పడుతున్నట్లు కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా పరిశోధకులు గుర్తించారు. మానవుని చేష్టలతో ఏర్పడేవే ఎక్కువ! కార్చిచ్చులు సహజంగా మెరుపులు ఏర్పడినప్పుడు, పిడుగులు పడినప్పుడు, చెట్లు రాపిడికి గురైనప్పుడు, అగ్నిపర్వతాల పేలుళ్ల సమయంలో ఏర్పడతాయి. కానీ, ప్రస్తుతం మానవ చర్యల వల్లే అధికంగా సంభవిస్తున్నాయి. కొందరు ఆకతాయి చేష్టలతో నిప్పు పెట్టడం, సిగరెట్లు ఆర్పకుండా పడేయడం, అడవులకు సమీపంలో ఏర్పాటుచేసిన విద్యుత్ తీగలు, పట్టణీకరణ, పంట పొలాల తయారీ, యుద్ధాలు.. ఇలాంటి వాటిలో ముఖ్యమైనవి. కెనడా, చైనాలో సంభవించే కార్చిచ్చుల్లో అధిక భాగం మెరుపుల వల్ల ఏర్పడుతుండగా, మిగిలిన దేశాల్లోని వాటికి మాత్రం 90 శాతం మానవ చర్యలే కారణమని ఓ పరిశోధనలో తేలింది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలో అధికం.. అడవులు ఎక్కువగా ఉన్న అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, రష్యా, ఇండోనేషియా, ఆఫ్రికా దేశాల్లో కార్చిచ్చులు అధికం. ఈ దేశాల్లో ఏటా ఎక్కడో ఓ చోట భారీ దావానలం ఏర్పడుతుంటుంది. భారత్లోనూ అప్పుడప్పుడూ అడవులు తగలబడుతుంటున్నప్పటీకీ ఇవంత భారీ స్థాయిలో ఉండవు. ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం, నల్లమల అడవుల్లో , తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇలాంటివే ఏటా ఏర్పడుతుంటాయి. సైబీరియా తైగాలో 4.7 కోట్ల ఎకరాలు ఆహుతి! 2003లో రష్యాలోని సైబీరియాలో ఏర్పడిన కార్చిచ్చు 4.7 కోట్ల ఎకరాల్లోని అడవిని అగ్నికి ఆహుతి చేసింది. తైగా ఫైర్స్గా పిలచే ఈ దావానలం అత్యధిక విస్తీర్ణంలో అడవిని దహించిందిగా చరిత్రలో నిలిచిపోయింది. తర్వాతి స్థానాల్లో .. నార్త్వెస్ట్ టెర్రిటరీస్ ఫైర్–2014 (84లక్షల ఎకరాలు–కెనడా), మనిటోబా వైల్డ్ఫైర్–1989 (81లక్షల ఎకరాలు–కెనడా), బ్లాక్ ఫ్రైడే బుష్ ఫైర్–1939 (50లక్షల ఎకరాలు– ఆస్ట్రేలియా), ది గ్రేట్ ఫైర్–1919 (50లక్షల ఎకరాలు–కెనడా) ఉన్నాయి. ఇక అత్యధిక మంది ప్రాణాలను హరించిన కార్చిచ్చుల జాబితాలో 1918 అక్టోబర్ 15న అమెరికాలో ఏర్పడిన ఫారెస్ట్ ఫైర్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇది వెయ్యిమంది ప్రాణాలను అగ్నికి ఆహుతి చేసింది. 1997, సెప్టెంబర్లో ఇండోనేషియాలో 240 మందిని, 1987 మేలో చైనాలో 191 మందిని, 2009 ఫిబ్రవరి 2న ఆస్ట్రేలియాలో 180 మందిని కార్చిచ్చులు బలితీసుకున్నాయి. వీటికి జంతువులు, పక్షుల సంఖ్య అధికం. కాగా, ఈ ఏడాది మార్చిలో తమిళనాడులోని ఊటీ సమీపంలో కార్చిచ్చు బారిన పడి 8 మంది విద్యార్థులు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆర్పడం అంత సులభం కాదు! అప్పుడప్పుడూ ఊళ్లలో ఏర్పడే చిన్న చిన్న అగ్నిప్రమాదాలను ఆర్పాలంటేనే భారీగా నీళ్లు అవసరమవుతాయి. ఇక వందలు, వేల ఎకరాల్లో చుట్టుముట్టిన అగ్నికీలల్ని ఆర్పాలంటే పెద్ద సాహసమే చేయాలి. మొదట గాలి దిశను, మంటల తీవ్రతను అంచనా వేయాలి. అడవుల్లో ఎక్కడెక్కడ రోడ్లు, కాలువలు, నదులు, చెట్లు లేని ప్రాంతాలు ఉన్నాయో ఎంచుకొని అటువైపు నుంచి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాలి. దీన్నే ఫైర్ రింగ్ అంటారు. ఒకవైపు మంటలు అదుపు చేస్తూనే మరోవైపు వ్యాపించకుండా మధ్యలోని చెట్లను కొట్టేయాలి. ఇవన్నీ చేయడానికి ఫైర్ ఫైటర్లు(అగ్నిమాపక సిబ్బంది) ఉంటారు. వీళ్లు ఫైర్ఫ్రూఫ్ దుస్తులు, ఆక్సిజన్ మాస్కులు ధరించి, మంట ఆర్పే సామగ్రితో రంగంలోకి దిగుతారు. నీళ్లు చల్లుతారు. కొత్తగా ఇప్పడు ఫైలెట్ రహిత విమానాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా మంటలు ఆర్పే రసాయనాన్ని పిచికారి చేస్తారు. నీళ్లనూ చల్లుతారు. అయినప్పటికీ గాలి ఉద్ధృతంగా వీస్తే మాత్రం మంటలు ఆర్పడం అంత సులభం కాదు. దుష్పరిణామాలు కార్చిచ్చులను సకాలంలో అదుపు చేయకపోతే నష్టం భారీ స్థాయిలో ఉంటుంది. వేలు, లక్షల సంఖ్యలో వృక్షాలు బూడిద అవుతాయి. లక్షలాది జంతువులు, పక్షులు ప్రాణాలు కోల్పోతాయి. కార్చిచ్చులు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్లు, కొన్నిచోట్ల ఊళ్లకు ఊళ్లనే స్వాహా చేస్తాయి. అలాగే వాతావరణానికీ తీవ్ర నష్టం కలిగిస్తాయి. అడవులు తగ్గి సకాలంలో వర్షాలు పడవు. భారీగా విడుదలయ్యే పొగ కారణంగా ఓజోన్ పొర దెబ్బతింటుంది. ఈ పొగను పీల్చిన మనుషులకు శ్వాస సంబంధ సమస్యలు చుట్టుముడతాయి. ఆమ్లవర్షాలు కురుస్తాయి. -
ఛాయ్ బిజినెస్తో మిలీనియర్ అయ్యింది
న్యూఢిల్లీ : ఛాయ్ బిజినెస్ ఓ అమెరికన్ మహిళను లక్షాధికారి చేసింది. అదీ కూడా రుచికరమైన భారతీయ టీ. కొలరాడోకు చెందిన బ్రూక్ ఎడ్డీ అనే అమెరికన్ మహిళ 2002లో భారత్ను సందర్శించింది. అనంతరం ఆమె 2006తో తిరిగి తన స్వదేశం అమెరికా వెళ్లిపోయింది. కానీ కొలరాడోలో కేఫ్ల్లో ఎక్కడ కూడా.. ఆమెకు అచ్చం భారత్లో దొరికిన మాదిరి రుచికరమైన టీ లభించలేదు. దీంతో ఆమెనే భారత భక్తి ఆదర్శాలతో ఓ ఛాయ్ వ్యాపారం చేపట్టాలని నిర్ణయించింది. అనుకున్నదే తడువుగా వెంటనే 2007లో భక్తి ఛాయ్ పేరుతో ఛాయ్ వ్యాపారం ప్రారంభించేసింది. ఈ ఛాయ్ వ్యాపారమే ఇప్పుడు ఏడు మిలియన్ డాలర్ల రెవెన్యూ కంపెనీగా అవతరించింది. ఈ ఛాయ్కి రుచిమరిగిన అమెరికన్లు, ఆ కంపెనీ టీ తాగకుండా ఉండలేకపోతున్నారు. బ్రూక్ ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. రోజురోజుకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెద్ద ఎత్తున్న చేకూరుతోంది. అమెరికన్ వీక్లీ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 2002లో భారత్ సందర్శించినప్పుడు తాను తాగిన టీ ఎంతో ఇష్టమని బ్రూక్చెప్పింది. ప్రతీసారి తాను ఏదో ఒక కొత్తదాన్ని ప్రవేశపెడుతుంటానని, ఇది కూడా అలాంటిదేనని పేర్కొంది. ఈ ఛాయ్ వ్యాపారం ప్రారంభించిన ఏడాది తర్వాత భక్తి ఛాయ్ తన తొలి వెబ్సైట్ కూడా లాంచ్ చేసింది. అలా తన వ్యాపారాలను వృద్ధి చేసుకుంటూ వచ్చింది. బ్రూక్ ప్రస్తుతం ఇద్దరు కవలలకు, సింగిల్ మదర్. ఫుల్-టైమ్ జాబ్కు గుడ్బై చెప్పి మరీ బ్రూక్ ఈ ఛాయ్ వ్యాపారంతో సామాజికంగా, పర్యావరణంగా మార్పు తీసుకొస్తోంది. 2014లో బ్రూక్ ఎడ్డీ, ఎంటర్ప్రిన్యూర్ మేగజైన్స్ ‘ఎంటర్ప్రిన్యూర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులో టాప్-5 ఫైనలిస్ట్. -
నాడు దెయ్యాల కొంప.. మరి నేడు..?
ఒకప్పుడు అక్కడ ప్రజలు అడుగు పెట్టాలంటే వణుకు. అక్కడ దెయ్యాలు ఉండేవని స్థానికులు భ్రమపడేవారు. కానీ వందేళ్ల తర్వాత అక్కడ పరిస్థితి మారిపోయింది. దానికి కారణం అక్కడి వాతావరణాన్ని పూర్తిగా ఫేమస్ టూరిస్ట్ స్పాట్గా మార్చేయడమే. ఈ బిజీ బిజీ లైఫ్లో ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి అదొక మంచి ప్రదేశంగా మారడమే. ఇలా మార్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని నిర్వాహకులు క్రిష్టినా రోసి తెలిపారు. 1880 కాలంలో ఇక్కడ ప్రజలు నివసించేవారు. వారంతా బంగారం, వెండి తవ్వుకుంటూ జీవనం సాగించేవారు. కానీ 1919 వచ్చేసరికి ఏమైందో ఏమో కానీ జనసంచారం తగ్గి ఎడారిలా మారింది. కారణం అక్కడ ఓ భవనంలో దెయ్యాలున్నాయని ప్రచారం జరగడం. దీంతో ఓ శతాబ్దకాలం మూగబోయినట్లున్న ఆ ఏరియా ఇప్పుడు పర్యాటకులతో నిండిపోయింది. మొత్తం 1600 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిసార్ట్లో 200 ఎకరాల్లో దాదాపు 12 లాగ్ క్యాబిన్లను నిర్మించారు. వాటికి పూర్వీకుల పేర్లు, ఆ ప్రాంత చరిత్రను సూచించేలా పేర్లు పెట్టారు. ఒక్కోటి అధునాతన హంగులతో తీర్చిదిద్దారు. ఇంకా అక్కడికి తరలివస్తున్న పర్యాటకులకు ఫిషింగ్, హార్స్ రైడింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. కాకపోతే ఇవి కొంచెం ఖర్చుతో కూడుకున్నవి. ఇక్కడ ఒక్కరికి ఒక్క రాత్రికి 630- 2100 డాలర్లు అవుతుంది. ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడో చెప్పలేదు కదూ... కొలరెడోలోని డంటన్ హిల్స్టేషన్ ప్రాంతం.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సంతోషంలో కావ్యా మారన్.. కేన్ విలియమ్సన్ను పలకరించి మరీ! (ఫొటోలు)
‘విద్య వాసుల అహం’ మూవీ రివ్యూ
'నా కొడుకు రాహుల్ని మీకు అప్పగిస్తున్నాను': సోనియా గాంధీ
అమెరికాలో ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలంగాణ యువకుడు
చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..
అంతకంతకూ పెరిగిపోతున్న ఆస్తులు.. రిచ్లిస్ట్లో రిషి సునాక్ దంపతులు
మంచు విష్ణు ప్రాజెక్ట్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
అలా ప్రవర్తించినందుకు పిల్లలు తిట్టారు, ఏడ్చారు.. నాకూ దుఃఖమాగలేదు!
ఆ నాలుగు ఎంపీ స్థానాల్లో విజయంపై బీఆర్ఎస్ ధీమా..
తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం
తప్పక చదవండి
- ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ హిట్ మూవీ.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- లాలూ యాదవ్ కూతుళ్ళ పేర్ల వెనుక ఇంత హిస్టరీ ఉందా?
- ఏలియన్స్ ఉన్నట్లా? లేనట్లా?.. ఇంతకీ మస్క్ ఏమన్నారంటే?
- జెరోధా ట్రేడర్లకు అలెర్ట్.. అదిరిపోయే ఫీచర్తో
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
- ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్
Advertisement