-
రక్షణరంగ బడ్జెట్ను మరింత పెంచిన చైనా
చైనా తన రక్షణరంగ బడ్జెట్ను నిరంతరం పెంచుకుంటూ పోతోంది. ఈ ఏడాది చైనా తన రక్షణ బడ్జెట్ను 7.2 శాతం మేరకు పెంచింది. ఈ పెంపుతో ఈ ఏడాది చైనా రక్షణ బడ్జెట్ 1.67 ట్రిలియన్ యువాన్లకు (231 బిలియన్ డాలర్లు.. ఒక బిలియన్ అంటే రూ. ఒక కోటి) చేరుకుంది. చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. అమెరికా తర్వాత రక్షణ బడ్జెట్కు అత్యధిక కేటాయింపులు చేస్తున్న రెండో దేశం చైనా. ఇది భారతదేశ బడ్జెట్ కంటే మూడు రెట్లు అధికం. రక్షణరంగాన్ని ఆధునీకరించే విషయంలో భారత్ కంటే చైనా చాలా ముందున్నట్లు కనిపిస్తోంది. దీనికి కారణం చైనా భారీ రక్షణ బడ్జెట్. 2024కి భారతదేశ రక్షణ బడ్జెట్ రూ. 6,21,541 కోట్లు. ఇది దాదాపు $74.8 బిలియన్లు. అయితే 2024కి చైనా బడ్జెట్ సుమారు $232 బిలియన్లు. ఇది భారతదేశ బడ్జెట్ కంటే అత్యధికం. చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ తన ఆర్మీ పీఎల్ఏను 2027 నాటికి ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే రక్షణ రంగ బడ్జెట్ పెరుగుదలకు కారణం. సైనికుల సంఖ్య పరంగా చైనా సైన్యం అతిపెద్దది. చైనా సైన్యంలో రెండు రాకెట్ దళాలు ఉన్నాయి. ఈ రాకెట్ ఫోర్స్ అణ్వాయుధాల ఆపరేషన్ను నిర్వహిస్తుంది. చైనా తన రాకెట్ బలగాన్నిరహస్యంగా విస్తరిస్తున్నదనే ఆరోపణలున్నాయి. -
దీపావళి తరువాత పసిడి పరుగు: డాలర్ ఢమాల్
దీపావళికి కాస్త దిగి వచ్చి వినియోగదారులను ఊరించిన పసిడి ధర అనూహ్యంగా మళ్లీ పరుగందుకుంది. ముఖ్యంగా అమెరికా ద్రవ్యోల్బణం డేటా విడుదల తరువాత డాలర్ ఇండెక్స్ 10-వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. నవంబర్ 11, 2022 నుండి అతిపెద్ద సింగిల్-డే క్షీణతకు దారితీసింది. ముఖ్యమైన ఆరు కరెన్సీలతో పోలిస్తే డాలర్1.55 శాతం పడి 103.98కి చేరుకుంది. దీంతో బంగారంలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. దేశీయంగా దేశీయంగా నవంబర్ 15న న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,100 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ.61,190గా నమోదైంది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 400 రూపాయలు ఎగిసి ధర రూ.55,950 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రూ.61,040 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర విషయానికి వస్తే మంగళవారంతో పోలిస్తే బుధవారం హైదరాబాదులో కిలో వెండి ఏకంగా రూ.1700 పెరిగి రూ.77,700 పలుకుతోంది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.74,700గా ఉంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్తో గడువు ముగిసే గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ 10 గ్రాముల ధర స్వల్పంగా పుంజుకుని రూ. 60,224 ఇంట్రాడే గరిష్ట స్థాయికి చేరుకుంది. స్పాట్ బంగారం ధర ప్రస్తుతం ఔన్స్కు1,965 డాలర్లకు పెరిగింది. MCXలో వెండి ధర కిలో రూ. 71,794 వద్దకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో, వెండి ధర ఔన్సు దాదాపు 23 డాలర్లుగా ఉంది. రూపాయికి బలం అటు దేశీయ స్టాక్మార్కెట్లు కూడా భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 600పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 188 పాయింట్లు లాభంతో కొనసాగుతోంది. డాలర్ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి కూడా లాభాల్లోఉంది. డాలర్ బలహీనతతో రూపాయి 0.3 శాతం పెరిగి 83.08 వద్ద ట్రేడవుతోంది, సెప్టెంబర్ 8 నుండి దాదాపు రెండు నెలల తరువాత ఇదే అత్యధిక లాభం. -
తిరుపతిలో ఐటీ దాడుల కలకలం
సాక్షి, తిరుపతి: తిరుపతిలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తిరుపతిలో డాలర్స్ గ్రూప్పై ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. డాలర్స్ గ్రూప్ ఆఫ్ ఛైర్మన్ డాక్టర్ సి.దివాకర్రెడ్డి కార్యాలయం పాటు, బంధువుల ఇళ్లల్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. దివాకర్రెడ్డి, కుటుంబ సభ్యుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు.. పత్రాలను పరిశీలిస్తున్నారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు, వారి బంధువుల ఇళ్లలో గురువారం ఉదయం మొదలైన ఐటీ అధికారుల సోదాలు రాత్రి తర్వాత కూడా కొనసాగాయి. గురువారం రాత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఆయన కుమారుడు జయవీర్ నివాసంలోనూ తనిఖీలు చేసి నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే సాధా రణ తనిఖీల్లో భాగంగానే వీరి ఇళ్లలో సోదాలు చేపట్టినట్టు, కొన్ని పత్రాలను ఐటీ అధికారులు పరి శీలించి వెళ్లినట్టు సమాచారం. గురువారం రంగా రెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ ఆర్)కి చెందిన ఇళ్లు, విల్లా, ఫామ్హౌసుల్లో, బాలా పూర్లోని బడంగ్పేట్ మేయర్, పీసీసీ నేత, చిగు రింత పారిజాత నర్సింహారెడ్డి, వారి బంధువులు, అనుచరుల ఇళ్లలో ఐటీ అధికా రులు సోదాలు చేప ట్టిన విషయం తెలిసిందే. కాగా కేఎల్ఆర్ నివాసం,కార్యాలయాల్లో శుక్రవారం మరో సారి తనిఖీలు చేపట్టారు. 15 మంది అధికారులు తుక్కుగూడలోని కేఎల్ఆర్ నివాసానికి చేరుకున్నారు. పలు డాక్యు మెంట్లతో పాటు కేఎల్ఆర్ను వెంటబెట్టుకుని నార్సింగ్ ఎన్సీసీ అపార్ట్మెంట్కు చేరుకున్నారు. గంట పాటు అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడి నుంచి మాదాపూర్లోని కేఎల్ఆర్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. రాత్రి పొద్దు పోయే దాకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. బడంగ్పేట్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి ఇంట్లో గురువారం రాత్రే సోదాలు ముగిశాయి. ఇంట్లో లభించిన రూ.8 లక్షలు సహా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని, ఈ నెల 6న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. తమను రాజకీయంగా దెబ్బ తీసేందుకే ఈ దాడులు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. -
Today Gold and Silver: బంగారం నేలచూపులు, షాకిస్తున్న వెండి
Today Gold and Silver Prices: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరింత దిగివచ్చాయి. గత కొన్ని సెషన్లుగా నేలచూపులు చూస్తున్న పసిడి ధర శుక్రవారం దేశవ్యాప్తంగా సుమారు 300 రూపాయలు క్షీణించింది. మూడు రోజుల్లో దాదాపు వెయ్యిరూపాయలు దిగి వచ్చింది. సెప్టెంబరు 26న రూ. 54,750గా ఉన్న 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర శుక్రవారం నాటికి రూ. 54 వేల స్థాయిని కోల్పోయి 53,650 స్థాయికి దిగి వచ్చింది. మూడు సెషన్లలో 1100 దిగివచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 250 రూపాయలు క్షీణించి రూ. 53,650గా ఉంటే…24 క్యారెట్ల బంగారం ధర రూ.270 తగ్గి రూ. 58,530గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అయితే వెండి మాత్రం వెయ్యి రూపాయలు పుంజుకుంది. దీంతో కిలో వెండి ధర ప్రస్తుతం హైదరాబాద్లో రూ. 77500 ఉండగా, ఢిల్లీలో రూ.74,700 పలుకుతోంది. (బ్యాంకు లాకర్లో రూ.18 లక్షలు చెదల పాలు: లాకర్ కొత్త నిబంధనలు తెలుసా?) కాగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్న సంగతి తెలిసిందే. అలాగే దేశీయంగా కూడా పెళ్లిళ్ల సీజన్లో పుంజుకున్నప్పటికీ, గత కొన్ని వారాలుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అటు దేశీయ స్టాక్మార్కెట్లు పాజటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. -
డాలరు బలం: దిగొచ్చిన పసిడి, వెండి కూడా అదే బాటలో
Today Gold and Silver Prices: దేశీయ మార్కెట్లో వెండి బంగారం ధరలు మళ్లి దిగివస్తున్నాయి. గత కొన్ని సెషన్లుగా లాభ నష్టాల మధ్య బంగారం ధర బుధవారం మరింత పడింది. ద్రవ్యోల్బణం,పెరుగుతున్న వడ్డీ రేట్లు, డాలర్ బలం కారణంగా దేశ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి 280 రూపాయలు క్షీణించి రూ. 59,450 వద్ద ఉంది.అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 250 పతనమై 54,500వద్ద ఉంది. కిలో వెండి ధర 600 రూపాయలు తగ్గి 74, 200 గా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి 59,450 గాను, 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి 54, 500 గాను ఉంది. అలాగే కిలో వెండి రూ. 77వేలు పలుకుతోంది. ఉభయ తెలుగురాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బుధవారం బంగారం ధర 10 గ్రాములకు రూ.58,843 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో, ట్రాయ్ ఔన్స్కు 1,903.35 డాలర్లుగా ఉన్నాయి. వెండి కూడా 71,260 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. డాలర్ ఇండెక్స్లో బలం పుంజుకోవడంతో బంగారం ధరలు నిన్న ఏకంగా 1.59 శాతం నష్టపోయాయి. మరోవైపు గత రెండు సెషన్లుగా బలహీనంగా ఉన్న దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం పాజిటివ్గా ఉన్నాయి. ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గినా కొనుగోళ్లు పుంజుకోవడం లాభాల్లోకి మళ్లాయి. నిఫ్టీ 19700 పైకి, సెన్సెక్స్ 66వేల ఎగువన ట్రేడ్ అవుతున్నాయి. రూపాయి కూడా స్వల్ప లాభాలతో కొనసాగుతోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement