-
ముంబైలో రూ.3 కోట్ల డ్రగ్స్ సీజ్
ముంబై: గత నెల రోజుల వ్యవధిలో రూ.3.25 కోట్ల విలువైన 16 కిలోల డ్రగ్స్ను స్వా«దీనం చేసుకుని, 12 మంది పెడ్లర్లను అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీస్ శాఖ యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్సీ) ఆదివారం తెలిపింది. సహర్ గ్రామం, నల్లసొపార, శాంటాక్రుజ్, కుర్లా, బైకుల్లా తదితర ప్రాంతాలకు చెందిన పెడ్లర్ల నుంచి హెరాయిన్, గంజాయి, ఎండీని స్వా«దీనం చేసుకున్నట్లు వివరించింది. 2023లో 106 కేసుల్లో 229 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసి, రూ.53.23 కోట్ల డ్రగ్స్ను పట్టుకున్నట్లు ఏఎన్సీ వివరించింది. -
Narcotics Control Bureau: తమిళ నిర్మాత సూత్రధారిగా డ్రగ్స్ రాకెట్
న్యూఢిల్లీ: తమిళ సినీ నిర్మాత సూత్రధారిగా ఉన్న భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేసియాల్లో విస్తరించిన డ్రగ్స్ రాకెట్ను ఛేదించినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తెలిపింది. ఢిల్లీలో ఇటీవల జరిపిన సోదాల్లో డ్రగ్స్ తయారీకి వాడే 50 కిలోల సూడో ఎఫెడ్రిన్ రసాయనాన్ని స్వాధీనం చేసుకుని, తమిళనాడుకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. వీరు డ్రగ్స్ను ఓడలు, విమానాల్లో హెల్త్ మిక్స్ పౌడర్, కొబ్బరి పొడిలో డబ్బాలో దాచి రవాణా చేస్తున్నట్లు తేలిందని పేర్కొంది. కిలో రూ.1.5 కోట్లుండే సూడో ఎఫెడ్రిన్తో మెథాంఫెటమైన్ అనే ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్ను తయారు చేస్తారు. న్యూజిలాండ్ కస్టమ్స్, ఆస్ట్రేలియా పోలీసుల సమాచారం మేరకు డ్రగ్స్ రాకెట్పై విచారణ చేపట్టినట్లు ఎన్సీబీ వివరించింది. ఇవి ఢిల్లీ నుంచే రవాణా అవుతున్నట్లు అక్కడి బసాయ్దారాపూర్లోని గోదాం నుంచి వస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. పట్టుబడిన వారిని విచారించగా గత మూడేళ్లలో రూ.2 వేల కోట్ల విలువైన 3,500 కిలోల సూడో ఎఫెడ్రిన్ను 45 దఫాలుగా పంపించినట్లు తేలింది. సదరు నిర్మాత పరారీలో ఉన్నట్లు వివరించింది. అతని కోసం గాలింపు ముమ్మరం చేశామని తెలిపింది. -
జూబ్లీహిల్స్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్: న్యూఇయర్ వేడుకలకు జూబ్లీహిల్స్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్లో ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఈ ముఠాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 100 గ్రాముల ఎండీఎంఏ, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కోసం ప్రత్యేక పరికరాలు న్యూఇయర్ వేళ డ్రగ్స్ విక్రయంపై పోలీసుల ఆంక్షలు విధించారు. డ్రగ్స్ను సేవిస్తే గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలు తెప్పించారు. డ్రగ్స్ తీసుకున్నారన్న అనుమానం వస్తే అక్కడిక్కడే పరీక్షలు నిర్వహించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇదీ చదవండి: Hyderabad: ఇక తెల్లవార్లూ డ్రంక్ అండ్ డ్రైవ్! -
కట్టు తప్పితే కఠిన చర్యలే !
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని, లేనిపక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్లు, ఎస్పీలు/పోలీసు కమిషనర్లకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్ట మైన హెచ్చరికలు జారీ చేసింది. శాసనసభ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఏమాత్రం నిర్లిప్తత, నిర్లక్ష్యంగా ఉండరాదని, మైండ్సెట్ మార్చుకోవా లని తేల్చి చెప్పింది. ఎన్నికల్లో నామమాత్రంగానే డబ్బు, మద్యం జప్తు చేస్తున్నారని, చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని అసహనం వ్యక్తం చేసింది. డ్రగ్స్ రవాణాకు హైదరాబాద్ ప్రధానమార్గంగా మారిందని, గోవా నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, గుజరాత్కు పెద్దఎత్తున డ్రగ్స్ రవాణా జరుగుతుంటే ఎందుకు పట్టుకోవడం లేద ని పోలీస్శాఖను ప్రశ్నించింది. శాసనసభ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించడానికి రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) రాజీవ్కుమార్ నేతృత్వంలో ఎలక్ష న్ కమిషనర్లు అనూప్చంద్ర పాండే, అరుణ్ గోయల్తో కూడిన బృందం బుధవారం రెండోరోజు నగరంలోని ఓ హోటల్లో రాష్ట్రంలోని 33 జిల్లాల కలె క్టర్లు, ఎస్పీలు/పోలీసు కమిషనర్లతో సమీక్ష నిర్వహించింది. గుజరాత్, మహారాష్ట్రలో టన్నుల కొద్దీ డ్రగ్స్ పట్టుపడితే, ఇక్కడ మాత్రం 10, 20 గ్రా ము లే పట్టు బడడం పట్ల అనుమానాలు వ్యక్తం చేసింది. మాఫియాతో కుమ్మక్కయ్యారా? అని సూటి గా ఓ ఎస్పీని ప్రశ్నించినట్టు తెలిసింది. ఇక పై ని ఘా ఉంచి జప్తు చేస్తామని ఆ ఎస్పీ వివరణ ఇచ్చు కున్నారు. ఓటర్లకు బంగారం, వెండి, వస్త్రాలు వంటి కానుకలు పంపిణీ చేస్తున్నట్టు ఆరోపణలున్నా, ఎందుకు జప్తు కావడం లేదని ప్రశ్నించింది. సిద్దిపేటలో నగదు దొరకలేదా ? గత శాసనసభ సాధారణ ఎన్నికల్లో సిద్దిపేట జిల్లాలో ఎలాంటి నగదు జప్తు చేయకపోవడం పట్ల ఎన్నికల సంఘం తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జిల్లాల వారీగా గత ఎన్నికల్లో పట్టుబడిన నగదు, మద్యం, ఇతర కానుకలను పరిశీలించి పెదవి విరిచింది. ఇటీవల జరిగిన కర్ణాటక, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గతంతో పోలి్చతే దాదాపు ఐదారు రేట్లు అధికంగా నగదు జప్తు చేశారని, త్వరలో జరి గే శాసనసభ ఎన్నికల్లో సైతం అలాంటి ఫలితాలు ఆశిస్తున్నామని స్పష్టం చేసింది. ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ ఎందుకు పట్టుకోవడం లేదని ఆబ్కారీ, పోలీస్శాఖను ప్రశ్నించింది. ఇకపై డబ్బులు, మద్యం, ఇతర కానుకల జప్తుపై ప్రతివారం నివేదిక సమర్పించాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో గతంలో జప్తు చేసిన నగదు, మద్యం చాలా తక్కువగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితాలో లోపాలుంటే కలెక్టర్లదే బాధ్యత బుధవారం ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో లోపాలున్నా, ఓట్లు గల్లంతైనట్టు ఫిర్యాదులొచి్చనా కలెక్టర్లదే బాధ్యత అని, తీవ్రమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘం హెచ్చరించింది. శేరిలింగంపల్లిలో పెద్ద సంఖ్యలో బోగస్ ఓట్లు ఉన్నట్టు వచి్చన ఫిర్యాదుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏం చర్యలు తీసుకున్నారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ప్రశ్నించింది. -
మాదాపూర్ డ్రగ్స్ కేసు విచారణలో కీలక సమాచారం
హైదరాబాద్: కొద్దిరోజుల క్రితం మాదాపూర్లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్స్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో అరెస్టైన సినీ ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీ, మురళిలను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు వీరివద్ద నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలిపారు. మాదాపూర్ మాదకద్రవ్యాల కేసులో నిందితుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతినివ్వడంతో బాలాజీ, వెంకట రత్నారెడ్డి, మురళిలను గుడిమల్కాపూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో పలు కీలక విషయాలు బయటపడినట్టు చెబుతున్నారు పోలీసులు. డ్రగ్స్ పార్టీ సందర్భంగా ఫైనాన్షియర్ వెంకట్ నుంచి 18 మందికి డ్రగ్స్ సరఫరా అయినట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి డ్రగ్స్ అందుకున్న వారు పరారీలో ఉన్నారని వారంతా ఫోన్లను స్విచాఫ్ చేసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయినట్లు వెల్లడించారు. మరో నాలుగు రోజుల పాటు ఈ నలుగురిని విచారించనున్నట్లు తెలిపారు పోలీసులు. ప్రాథమిక వివరాలను బట్టి ఆ 18 మందిని కస్టమర్లుగా గుర్తించామని వారికోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. వారితోపాటు పరారీలో ఉన్న ముగ్గురు నైజీరియన్లతో సహా నలుగురు పెడ్లర్స్ కోసం ప్రత్యేక బృందం రంగంలోకి దించినట్లు తెలిపారు. వెంకట రత్నారెడ్డి ఇద్దరు ఢిల్లీ యువతులను సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ తీసుకురాగా వారు కూడా ఆ అపార్ట్మెంట్లోనే పోలీసులకు చిక్కారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్లో కలకలం.. ఒకే రోజు రెండు హత్యలు -
20 ఏళ్ల తర్వాత తొలిసారి మహిళను ఉరితీయనున్న సింగపూర్
మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించిన కేసులో ఇద్దరు దోషులను సింగపూర్ ప్రభుత్వం ఈ వారం ఉరితీయనుంది. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. కాగా గత 20 ఏళ్లలో సింగపూర్లో మహిళను ఉరితీయడం ఇదే తొలిసారి. అయితే ఈ ఉరిశిక్షల అమలును నిలిపివేయాలని అక్కడి హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. స్థానిక హక్కుల సంస్థ ట్రాన్స్ఫర్మేటివ్ జస్టిస్ కలెక్టివ్(టీజేపీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. 50 గ్రాముల హెరాయిన్ను అక్రమంగా రవాణా చేసిన కేసులో దోషిగా తేలిన 56 ఏళ్ల వ్యక్తిని జులై 26(బుధవారం)ఆగ్నేయాసియా నగరమైన చాంగీ జిల్లా జైలులో ఉరితీయనున్నట్లు తెలిపింది. అదే విధంగా 45 ఏళ్ల మహిళ సారిదేవి దామనికి జులై 28న (శుక్రవారం) ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు పేర్కొంది. 30 గ్రాముల హెరాయిన్ను అక్రమంగా తరలించిన కేసులో సారిదేవి దోషిగా తేలడంతో 2018లో ఆమెకు ఉరిశిక్ష విధించారని.. ఉరిశిక్ష అమలు తేదీలపై ఇప్పటికే వారి కుటుంబాలకు నోటీసులు పంపించారని టీజేసీ పేర్కొంది. కానీ దీనిపై జైలు అధికారులు ఏ విధమైన అధికారిక ప్రకటన చేయలేదు. చదవండి: చైనాపై నమ్మకం సన్నగిల్లింది.. అజిత్ ధోవల్ 20 ఏళ్లలో తొలిసారి ఈ ఉరిశిక్ష అమలైతే దాదాపు గత 20 ఏళ్లలో సింగపూర్లో ఓ మహిళను ఉరితీయడం ఇదే తొలిసారి కానుంది. చివరిసారి 2004లో డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో దోషిగా తేలిన 36 ఏళ్ల మహిళా హెయిర్ స్టైలిష్ యెన్ మే వుయెన్కు ఉరిశిక్ష పడినట్లు టీజేసీ కార్యకర్త కోకిల అన్నామలై తెలిపారు. ఇదిలా ఉండగా సింగపూర్లో హత్యలు, కిడ్నాప్ల వంటి తీవ్రమైన నేరాలకు మరణ శిక్షలు విధిస్తారు. అత్యంత కఠిన చట్టాలు మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించేందుకు సింగపూర్లో ప్రపంచంలోనే అత్యంత కఠిన చట్టాలను అమలు చేస్తున్నారు. 500 గ్రాముల కంటే ఎక్కువ గంజాయి, 15 గ్రాముల కంటే ఎక్కువ హెరాయిన్ను అక్రమంగా రవాణా చేసే వారికి మరణశిక్ష విధిస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో రెండేళ్ల పాటు మరణశిక్షల అమలును సింగపూర్ నిలిపి వేసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు 13 మందిని ఉరితీసింది. -
పాకిస్తాన్ అండతో హాజీ సలీం భారీ దందా .. తాజాగా రూ.25 వేల కోట్ల డ్రగ్స్
అతనిది అత్యంత విలాసవంతమైన జీవన శైలి. అడుగు కదిలితే చుట్టూ అత్యాధునిక ఏకే ఆయుధాలతో అంగరక్షకుల భారీ భద్రత. ఎటు వెళ్లాలన్నా ముందే పలు అంచెల తనిఖీలు, దారి పొడవునా మూడో కంటికి అగుపడని రీతిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు. ఇది ఏ దేశాధ్యక్షుని పరిచయమో కాదు. భారత్తో సహా పలు ఆసియా దేశాలకు కొన్నేళ్లుగా కంటిపై కునుకు లేకుండా చేస్తున్న డ్రగ్ కింగ్ హాజీ సలీం జల్సా లైఫ్ స్టైల్! శనివారం కోచి సమీపంలో అరేబియా సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో భారీగా డ్రగ్స్ మోసుకెళ్తున్న ఓ నౌకను పక్కా సమాచారం మేరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అడ్డగించి ముంచేయడం తెలిసిందే. అందులో ఏకంగా 2.5 టన్నుల మెథంఫెటామిన్ దొరకడం అధికారులనే విస్మయపరిచింది. ఇది ఎన్సీబీకి మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ స్మగ్లర్ అయిన హాజీదేనని దాడిలో పట్టుబడ్డ 29 ఏళ్ల పాక్ జాతీయుడు వెల్లడించాడు. భారత్, శ్రీలంక, సీషెల్స్ తదితర దేశాల్లో సరఫరా నిమిత్తం దీన్ని పాక్ దన్నుతో దొంగచాటుగా తరలిస్తున్నట్టు విచారణలో అంగీకరించాడు. మన దేశంలో ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారి! అంతేగాక పలు దేశాల్లో సరఫరా నిమిత్తం అత్యంత భారీ మొత్తంలో డ్రగ్స్ను మోసుకెళ్తున్న మదర్ షిప్ ఎన్సీబీకి చిక్కడమూ ఇదే మొదటిసారి! దాని విలువను రూ.12 వేల కోట్లుగా అధికారులు తొలుత పేర్కొన్నారు. కానీ ఇప్పటిదాకా దొరికిన డ్రగ్స్లోకెల్లా ఇదే అత్యంత హెచ్చు నాణ్యతతో కూడినదని తాజాగా పరీక్షల్లో తేలింది. దాంతో దీని విలువను సవరించి ఏకంగా రూ.25,000 కోట్లుగా తేల్చారు! పాక్ నుంచి ఉగ్రవాదుల చొరబాటుకు హాజీ ముఠా అన్నిరకాలుగా సాయపడుతున్నట్టు కూడా తేలింది. పాక్ అడ్డాగా... పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఉగ్ర సంస్థ లష్కరే తొయిబా అండదండలతో అరేబియా సముద్రంలో హాజీ విచ్చలవిడిగా డ్రగ్స్ దందా నడుపుతున్నాడు. పాక్, ఇరాన్, అఫ్గానిస్తాన్ అతని అడ్డాలు! ఎక్కడా స్థిరంగా ఉండకుండా తరచూ స్థావరాలు మార్చడం హాజీ స్టైల్. అతని ప్రస్తుత అడ్డా పాకిస్తాన్. బలూచిస్తాన్లో మకాం వేసి కథ నడుపుతున్నాడు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతోనూ హాజీకి దగ్గరి లింకులున్నట్టు ఎన్సీబీ అనుమానం. గమ్మత్తైన సంకేతాలు.. తేలు, ఎగిరే గుర్రం, డ్రాగన్, కొమ్ముగుర్రం, 555, 777, 999. ఇవన్నీ డ్రగ్స్ సరఫరాలో హాజీ ముఠా వాడే సంకేతాల్లో కొన్ని. డ్రగ్స్ ప్యాకెట్లపై ఉండే ఈ ప్రత్యేకమైన గుర్తులు వాటిలోని డ్రగ్స్, దాని నాణ్యతకు సంకేతాలు. కొనుగోలుదారులు మాత్రమే వీటిని గుర్తిస్తారు. హాజీ మనుషులు డ్రగ్స్ను ఏడు పొరలతో పటిష్టంగా ప్యాక్ చేస్తారు. నీళ్లలో పడ్డా దెబ్బతినకుండా ఈ జాగ్రత్త. ఇలా డ్రగ్స్ సరఫరా, విక్రయంలో హాజీది విలక్షణ శైలి. హాజీ అప్పుగానే డ్రగ్స్ సరఫరా చేస్తాడు. తనకు హవాలా మార్గంలోనే సొమ్ము పంపాలని చెబుతాడు. వ్యాపారానికి శ్రీలంక పడవలు వాడుతుంటాడు. అవి పాక్, ఇరాన్ సముద్ర తీరాల్లో మదర్ షిప్ నుంచి డ్రగ్స్ నింపుకొని రహస్యంగా భారత్కు చేరుకుంటాయి. క్వింటాళ్ల కొద్దీ ఉన్న నిల్వను చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి గమ్యానికి తరలిస్తారు. -
ఆర్యన్ఖాన్ను వదిలేసేందుకు రూ.25 కోట్లు!
న్యూఢిల్లీ: బాలీవుడ్ బాద్షా షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్ను మాదకద్రవ్యాల కేసులో ఇరికించకుండా ఉండడానికి రూ.25 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై ఎన్సీబీ మాజీ అధికారి సమీర్ వాంఖేడెపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. శుక్రవారం ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్లలో మొత్తం 29 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. 2021, అక్టోబర్ 2న ఒక క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ని సేవించాడన్న ఆరోపణలపై ఆర్యన్ఖాన్ను ఎన్సీబీ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత క్లీన్ చిట్ ఇవ్వడం తెలిసిందే. వాంఖెడే దర్యాప్తు చేసిన ఈ కేసులో తప్పులుతడకలు ఉన్నాయని సిట్ దర్యాప్తులో ఇప్పటికే తేలింది. ఆర్యన్ను కేసు నుంచి వదిలేయడానికి రూ.25 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టింది. వాంఖేడె అడ్వాన్స్ కింద రూ.50 లక్షలు తీసుకున్నారని తమకు సమాచారం ఉందని సీబీఐ అధికారులు తెలిపారు. -
డ్రగ్స్ నేరగాళ్లకు జైలే గతి
న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో భాగస్వాములైన బడా నేరగాళ్లను రాబోయే రెండేళ్లలో కచ్చితంగా జైలుకు తరలిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. డ్రగ్స్ దందాలో సంపాదించిన డబ్బును దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ పాపపు సొమ్ము దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా తయారవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ సమస్యపై బుధవారం లోక్సభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో అమిత్ షా మాట్లాడారు. మాదక ద్రవ్యాల కట్టడికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రగ్స్ వ్యాపారం చేసేవారిపై కేసుల నమోదు అధికారాన్ని బీఎస్ఎఫ్, సీమా సురక్షాబల్, అస్సాం రైఫిల్స్కు కట్టబెట్టామని అమిత్ షా గుర్తుచేశారు. ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. 2014 నుంచి 2022 వరకూ రూ.97,000 కోట్ల విలువైన డ్రగ్స్ను ధ్వంసం చేసినట్లు తెలిపారు. 2006 నుంచి 2013 దాకా రూ.23,000 కోట్ల విలువైన సరుకును స్వాధీనం చేసుకుందని వెల్లడించారు. -
T20 World Cup 2022: అహో హేల్స్...
‘నేను మళ్లీ ప్రపంచకప్ ఆడతానని అనుకోలేదు’... సెమీస్ ముగిసిన తర్వాత అలెక్స్ హేల్స్ వ్యాఖ్య ఇది. బహుశా భారత అభిమానులు కూడా అదే జరిగి ఉంటే బాగుండేదని అనుకొని ఉంటారు! మూడేళ్ల పాటు ఆటకు దూరమై పునరాగమనంలో మళ్లీ చెలరేగుతున్న హేల్స్ కథ కూడా ఎంతో ఆసక్తికరం. ► ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీలలో ఎంత గొప్ప ప్రదర్శన ఇచ్చినా మూడేళ్ల పాటు అతనికి టీమ్లో చోటు దక్కలేదు. ఆ బాధను అధిగమించి అతను ప్రపంచవ్యాప్తంగా టి20 లీగ్లలో ఆడుతూ వచ్చాడు. చివరకు ఈ ఏడాది జూన్లో మోర్గాన్ రిటైర్ అయ్యాడు... సెప్టెంబర్లో హేల్స్కు టీమ్లో స్థానం లభించింది. పాకిస్తాన్ పర్యటనలో ఆకట్టుకున్న అతను వరల్డ్ కప్లో కీలక ఇన్నింగ్స్లతో తానేంటో నిరూపించాడు. ► పాక్ టూర్ తర్వాత కూడా ఇంగ్లండ్ వరల్డ్ కప్ జట్టులో హేల్స్కు స్థానం దక్కలేదు. అయితే బెయిర్స్టో అనూహ్యంగా గాయపడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో హేల్స్ను టీమ్లోకి తీసుకోవాల్సి వచ్చింది. అది ఎంత సరైన నిర్ణయమో ఇంగ్లండ్కు ఇప్పుడు తెలిసింది. ఈ టోర్నీలో నాలుగు ప్రధాన జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, భారత్లతో జరిగిన మ్యాచ్లలో అతను 84, 52, 47, 86 నాటౌట్ పరుగులు సాధించి జట్టును ఫైనల్కు చేర్చాడు. –సాక్షి క్రీడావిభాగం -
విచారణ సమయంలో నిందితుడి ఆత్మహత్య
సాక్షి, చెన్నై: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విభాగం అధికారుల విచారణ సమయంలో ఓ నిందితుడు మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు తెలంగాణ వాసిగా గుర్తించారు. వివరాలు.. తమకు అందిన సమాచారం మేరకు శుక్రవారం చోళవరంలో చెన్నై మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ విభాగం అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో రాయప్పరాజు అనే వ్యక్తిని ఆ విభాగం సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 8 కేజీల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అయపాక్కంలోని ప్రధాన కార్యాలయానికి తరలించి శుక్రవారం రాత్రంతా ప్రశ్నించారు. శనివారం వేకువ జామున రాయప్పరాజు హఠాత్తుగా మూడో అంతస్తులోని విచారణ గది నుంచి బయటకు పరుగులు తీసి అనంతరం కిందకి దూకేశాడు. తీవ్రగాయాలతో పడి ఉన్న రాయప్పరాజును అక్కడి సిబ్బంది ఆవడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలో రాయప్ప రాజు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై తిరుముల్లైవాయిల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో మృతుడు తెలంగాణ రాష్ట్రం రామకృష్ణాపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కుటుంబం పరువు పోతుందనే వేదనతో రాయప్పరాజు ఐటీ సంస్థలో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పుకుంటూ, చెన్నై నుంచి మాదక ద్రవ్యాలను తెలంగాణకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. తాను మాదక ద్రవ్యాలతో పట్టుబడడంతో కుటుంబం తీవ్ర అవమానం పాలవుతుందనే వేదనతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే ఇతని వద్ద పట్టుబడ్డ మాదక ద్రవ్యాలు విమానాశ్రయంలో సీజ్ చేసినవి కావడం గమనార్హం. అక్కడి అధికారులు, సిబ్బంది ఎవరో సీజ్ చేసిన మాదకద్రవ్యాలను ఇతని ద్వారా బయటకు పంపిస్తున్నట్టు తేలింది. దీంతో ఈ కేసును మరింత సమగ్రంగా విచారించేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. మృతుడు 48 కేజీల మేరకు సీజ్ చేసిన మాదక ద్రవ్యాలను తెలంగాణకు తరలించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. (చదవండి: దొంగతనం కోసం వచ్చి ఆత్మహత్య..) -
రూ.120 కోట్ల మెఫెడ్రోన్ స్వాధీనం
ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు తాజాగా రూ.120 కోట్ల విలువైన 60 కిలోల మెఫెడ్రోన్ అనే డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి అంతర్రాష్ట్ర డ్రగ్స్ మాఫియా సూత్రధారి ఎయిరిండియా మాజీ పైలట్ సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నావల్ ఇంటెలిజెన్స్ విభాగం అందించిన సమాచారం మేరకు గుజరాత్లోని జామ్నగర్లో సోమవారం సోదాలు జరిపి 10 కిలోల మెఫెడ్రోన్ను పట్టుకున్నామని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ సింగ్ మీడియాకు తెలిపారు. ఇందుకు సంబంధించి జామ్నగర్కు చెందిన ఒకరు, ముంబైకి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. వీరిచ్చిన సమాచారంతో గురువారం దక్షిణ ముంబైలోని ఎస్బీ రోడ్డులో ఉన్న ఓ గోదాముపై దాడి చేశామన్నారు. 50 కిలోల మెఫెడ్రోన్ను పట్టుకుని, డ్రగ్స్ మాఫియా సూత్రధారి, ఎయిరిండియా మాజీ పైలట్ సహా ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. -
డ్రగ్స్ ముఠాలపై సీబీఐ దాడులు, 175 మంది అరెస్ట్
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో సీబీఐ మాదకద్రవ్యాల ముఠాలపై దాడులు చేసింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఇంటర్పోల్, రాష్ట్రాల పోలీసు యంత్రాంగం సహకారంతో గురువారం పకడ్బందీగా దాడులు నిర్వహించింది. డ్రగ్స్ విక్రేతలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 175 మందిని అరెస్ట్ చేసింది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్న వారి పని పట్టడానికి ఆపరేషన్ గరుడ పేరుతో సీబీఐ ఈ దాడులు నిర్వహిస్తోంది. పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మహారాష్ట్రాలలో మాదకద్రవ్యాల అక్రమ సరఫరా చేస్తున్న 6,600 అనుమానితుల్ని సీబీఐ గుర్తించింది. వారిలో 175 మందిని అరెస్ట్ చేసి, 127 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు సీబీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. -
డ్రగ్స్ విక్రయిస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అరెస్ట్
హైదరాబాద్లొ మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తుంది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గోపీకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్దిరోజులుగా తరుచుగా గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్లో అమ్ముతున్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. హఫీజ్పేట్ గోకుల్ ఫ్లాట్స్లో నిందితుడు గోపీకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 10గ్రాముల డ్రగ్స్, రూ55వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతనితో పాటు డ్రగ్స్ సరఫరా చేస్తున్న అరబిక్ ట్యూటర్ అష్రఫ్ బేగ్ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 13 గ్రాముల కొకైన్, రూ 65 వేల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల ఫోన్స్ను సీజ్ చేశారు. -
అమిత్షా చూస్తుండగా.. 30,000 కిలోల డ్రగ్స్ ధ్వంసం
చండీగఢ్: దేశవ్యాప్తంగా ఒక్కరోజే 30వేల కిలోల డ్రగ్స్ను తగలబెట్టారు అధికారులు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. పంజాబ్ చండీగఢ్లో డ్రగ్ ట్రాఫికింగ్, నేషనల్ సెక్యూరిటీ అంశంపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే సమయంలో అధికారులు ఢిల్లీ, చెన్నై, గౌహతి, కోల్కతాలో మొత్తం 30వేల కిలోల డ్రగ్స్ను ధ్వంసం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'ను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా 75వేల కిలోల డ్రగ్స్ను ధ్వంసం చేయాలని ప్రతిజ్ఞ చేశామని అమిత్షా వెల్లడించారు. ఇప్పటికే 81వేల కిలోల డ్రగ్స్ను తగలబెట్టామని వెల్లడించారు. ఆగస్టు 15నాటికి లక్ష కిలోల డ్రగ్స్ ధ్వంసం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. Visuals of incineration of seized drugs by the NCB. On PM @narendramodi Ji’s call to celebrate #AmritMahotsav, we took a pledge to destroy about 75000 kg of drugs. Glad to share that till today we have already incinerated 82000 kg and will reach the 1 lakh kg mark by 15th Aug. pic.twitter.com/zx1anMJrV4 — Amit Shah (@AmitShah) July 30, 2022 డ్రగ్స్ ధ్వంసం చేసే కార్యక్రమాన్ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో జూన్ 1న మొదలుపెట్టింది. జులై 29నాటికి దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 51,217 కిలోల డ్రగ్స్ను తగలబెట్టింది. తాజాగా అమిత్షా కార్యక్రమంలో మరో 30వేల కిలోల డ్రగ్స్ను నిర్వీర్యం చేసింది. చదవండి: ఐఐటీ మద్రాస్లో విద్యార్థినిపై లైంగిక వేధింపులు! 300 మంది ఫోటోలతో విచారణ -
పొట్ట విప్పి చూడ డ్రగ్స్ ఉండు!
శంషాబాద్: మాదకద్రవ్యాలను క్యాప్సుల్స్ రూపంలో ప్యాక్ చేసి, కడుపులో దాచుకుని స్మగ్లింగ్ చేస్తున్న విదేశీయులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరుసగా పట్టుబడుతున్నారు. గత నెల 21న ఒకరిని టాంజానియా జాతీయుడిని పట్టుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రూ.11.57 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. గత నెల 26న టాంజానియాకు చెందిన మరో వ్యక్తిని పట్టుకున్నామని, ఆరు రోజుల చికిత్స అనంతరం రూ.11.53 కోట్ల విలువైన హెరాయిన్ క్యాప్సుల్స్ రికవరీ చేశామని కస్టమ్స్ అధికారులు బుధవారం ప్రకటించారు. డ్రగ్స్ మాఫియా వాళ్లు 1.38 కేజీల హెరాయిన్ను పారదర్శకంగా ఉండే టేప్తో 108 క్యాప్సుల్స్గా మార్చారన్నారు. టాంజానియాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తిని క్యారియర్గా మార్చుకుని అతడికి భారత్ రావడానికి టూరిస్ట్ వీసా ఇప్పించారని చెప్పారు. అతడితో హెరాయిన్ క్యాప్సుల్స్ను మింగించి ఎథిహాద్ ఎయిర్వేస్కు చెందిన విమానంలో అబుదాబి మీదుగా హైదరాబాద్ పంపినట్లు తెలిపారు. ప్రయాణికుల జాబితా వడపోసి.. కస్టమ్స్ అధికారులు అనునిత్యం విదేశాల నుంచి ప్రధానంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల జాబితాను సేకరించి ప్యాసింజర్స్ ప్రొఫైలింగ్ విధానంతో వడపోస్తారు. గత నెల 26న వచ్చిన ప్యాసింజర్స్ జాబితాను ఇలాగే వడపోయగా టాంజానియా జాతీయుడిపై అనుమానం వచ్చింది. శంషాబాద్ విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్న ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రాథమిక విచారణ చేసింది. తాను హెరాయిన్ క్యాప్సుల్స్ మింగి వస్తున్నానని, రెండు మూడు రోజుల్లో వీటిని తన వద్దకు వచ్చే రిసీవర్లకు అందించాల్సి ఉందని అంగీకరించాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు ఆరు రోజులు ఆస్పత్రిలో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో 108 క్యాప్సుల్స్ బయటకు వచ్చేలా చేశారు. వీటిలో ఉన్న 1.38 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ డ్రగ్స్ ఉత్తరాదికి వెళ్లాల్సి ఉందని కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు. శంషాబాద్ లో గత 15 రోజుల్లోనే మొత్తం రూ.113.47 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. -
ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసుపై సౌత్ హీరో సంచలన వ్యాఖ్యలు
Hero Tovino Finally Open Up On Aryan Khan Drug Case: గతేడాది బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్ సంచలనం సృష్టించింది. 2021 అక్టోబర్ 3న క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ స్వాధీనం కేసులో అరెస్టయిన ఆర్యన్ అక్టోబర్ 30న బెయిల్పై బయటకు వచ్చాడు. అప్పట్లో ఈ కేసు బాలీవుడ్తో పాటు, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్వుడ్లో హాట్టాపిక్గా మారింది. ఈ కేసులో ఎంతో బాలీవుడ్ నటీనటులు, ప్రముఖులు ఆర్యన్, షారుక్లకు మద్ధతుగా నిలిచారు. చదవండి: నన్ను నమ్మినందుకు థ్యాంక్స్, నాకింకా గుర్తుంది.. అది 2012: సమంత కానీ సౌత్ ఇండస్ట్రీలకు చెందిన ఏ ఒక్కరు ఈ కేసుపై నోరు విప్పలేదు. ఈ క్రమంలో తాజాగా ఆర్యన్ కేసుపై మలయాళ హీరో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వివాదం సద్దుమణిగాక, ఈకేసు గురించి సెలబ్రెటీలతో పాటు ప్రజలు కూడా మరిచిపోయారు. ఈ తరుణంగా సౌత్ హీరో టోవినో థామస్ చేసిన వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. దీంతో ఆర్యన్ డ్రగ్స్ కేసు వ్యవహరం మరోసారి వార్తల్లో నిలిచింది. అసలు ఏం జరిగిందంటే.. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ఇటీవల నటించిన మిన్నాళ్ మురళి చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. చదవండి: సుధీర్ ఎంగేజ్మెంట్!, ఇంతకీ ఎవరా అమ్మాయి? పేరేంటి.. ఈ మూవీ సక్సెస్ నేపథ్యంలో చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో టోవినో థామస్ ఆర్యన్ డ్రగ్ కేసుపై స్పందించాడు. ఈ సందర్భంగా టోవినో మాట్లాడుతూ.. ఈ కేసు సమంయలో షారుక్ ఖాన్ పేరును డ్యామేజ్ చేయడానికి రాజకీయంగా కుట్ర జరిగిందని, దీనిని కొంతమంది ప్రజలు కూడా విశ్వసిస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కాగా ఈ కేసులో ముంబై హైకోర్టు ఆర్యన్కు మూడు సార్లు బెయిల్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏకంగా బాలీవుడ్ బడా హీరో షారుక్ ఖాన్ కుమారుడికి బెయిల్ దొరక్కపోవడం ఏంటని అంతా షాక్కు గురయ్యారు. అంటే దీని వెనక ఎదైన కుట్ర జరుగుతుందా? అంటూ నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేశారు. -
హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ సరాఫరా చేస్తున్న ఓ నైజీరియన్తోపాటు 12 మందిని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే డ్రగ్స్ సేవిస్తున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఎమ్డీఎమ్ఏ, ఎల్ఎస్డీ బ్లాట్లతో పాటు గంజాయి, హ్యాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్ నగర్, కార్ఖానా, సికింద్రాబాద్లో ముఠాగా ఏర్పడి డ్రగ్స్ అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను బషీర్ బాగ్ సీపీ కార్యాలయంలో కమిషనర్ సీవీ ఆనంద్ మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. చదవండి: సీబీఐ మరో కట్టుకథ: చంపుతుంటే.. పడుకున్నాడు! -
పాకెట్ మనీ కోసం.. మరో లోకంలో విహరించాలని..
సాక్షి, హైదరాబాద్: ‘సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్కు చెందిన సాయికుమార్, ప్రతాప్రెడ్డి ఇబ్రహీంపట్నంలోని ఓ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. పాకెట్ మనీ కోసం గంజాయి వ్యాపారంలోకి దిగారు. ఒడిశా రాష్ట్రంలోని సీలేరు ప్రాంతంలో మంగళ్ అనే వ్యక్తి నుంచి ఎండు గంజాయిని కిలో రూ.10 వేలకు కొనుగోలు చేసి బస్సుల్లో అక్రమంగా రవాణా చేస్తున్నారు. శివారు ప్రాంతంలో వాటిని 5, 10 గ్రాముల చొప్పున చిన్న ప్యాకెట్లుగా మార్చి.. రూ.150– 200కు విక్రయిస్తున్నారు’ ‘దుస్తుల వ్యాపారం పేరిట మార్క్ ఒవాలోబీ నైజీరియా నుంచి ముంబైకి వచ్చాడు. బిజినెస్ వీసా గడువు ముగిశాక.. ముంబై నుంచి హైదరాబాద్కు మకాం మార్చాడు. ఢిల్లీ నుంచి కొకైన్ను తీసుకొచ్చి నగరంలో విక్రయించడం మొదలుపెట్టాడు. పలుమార్లు జైలుకెళ్లాడు. నేరెడ్మట్కు చెందిన బీకామ్ ఫైనలియర్ విద్యార్థి హర్షవర్ధన్ స్నేహితుడైన అభిషేక్ సింగ్ ఓ చోరీ కేసులో జైలుకెళ్లాడు. అక్కడ మార్క్ ఒవాలోబీతో ఇతగాడికి పరిచయం ఏర్పడింది. బయటికొచ్చాక ఈ ముగ్గురు, మరికొందరు స్నేహితులతో కలిసి ముఠాగా ఏర్పడి.. డ్రగ్స్ వ్యాపారం చేయడం ప్రారంభించారు’ .. ఇలా ఒకటి రెండు సంఘటనల్లోనే కాదు డ్రగ్స్ వినియోగిస్తూ.. విక్రయిస్తూ ఎందరో విద్యార్థులు పట్టుబడుతున్నారు. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన విద్యార్థులు.. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారు. ఫ్యాషన్గా మొదలు పెట్టి డ్రగ్స్ బానిసలుగా మారిపోతున్నారు. జైలులో పెడ్లర్లతో పరిచయాలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో డ్రగ్స్పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సరఫరాదారులే కాదు వినియోగదారులపై కూడా కేసులు నమో దు చేస్తూ అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మూలాలను అంతమొందిస్తే తప్ప డ్రగ్స్ను అరికట్టలేమని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నా.. కేవలం సరఫరాదారులను అరెస్ట్ చేసి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిమాండ్కు తరలించి జైలుకెళ్లిన నిందితులలో సత్ప్రవర్తన రాకపోగా.. జైలులో కొత్త పరిచయాలు ఏర్పరుచుకొని బయటికొచ్చాక సరికొత్త ఎత్తుగడలతో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు వరుసగా వెలుగుచూడటమే ఇందుకు ఉదాహరణ. గంజాయి రవాణాలు రౌడీషీటర్లు, పలు కేసుల్లో నిందితులుగా ఉన్న పాత నేరస్తులు కూడా దిగారు. ప్యాకెట్కు రూ.150– 200.. ►కొకైన్ బంగారం కంటే చాలా ఖరీదైనది, దీన్ని అందరూ కొనుగోలు చేయలేరు. దీంతో గంజాయి విక్రయం, వినియోగం పెరిగింది. కిలో రూ.15– 20 వేలకు కొనుగోలు చేసి.. శివారు ప్రాంతాలలో చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలోకి మారుస్తున్నట్లు పోలీసులు విచారణలో బయటపడింది. ప్యాకెట్ రూ.150– 200కు దొరకుతుండటంతో ఎక్కువ మంది కొనుగోలు చేసే వీలుంటుందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ►ఒడిశా, ఆంధ్రప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువత సొంతూర్లకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో బ్యాగులలో గంజాయిని తీసుకొస్తున్నారు. తాము సేవించడమే కాకుండా తోటి విద్యార్థులకు విక్రయిస్తున్నారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి 5, 10 గ్రాముల చొప్పున చిన్న చిన్న ప్యాకెట్లు చేసి విక్రయిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన లాబా కుమార్ ప్రధాన్, బాపిలను ఇటీవల కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. ►ఇదే తరహాలో ఆదిలాబాద్ నుంచి కిలో గంజాయి రూ.15 వేలకు కొనుగోలు చేసి నగర శివార్లలో ప్యాకెట్ల రూపంలోకి మార్చి విక్రయిస్తున్నట్లు జవహర్నగర్కు చెందిన బొడ్డు అభిషేక్, గాజుల పరమేష్, వడ్డారం ప్రవీణ్, ఆర్ శివలను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. -
Amazon: ఎంతకి తెగించార్రా ! ఇంత పని చేస్తారా ?
న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల విక్రయ లావాదేవీలకు తమ ప్లాట్ఫాం వేదికగా మారిందన్న ఆరోపణలపై ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా అంతర్గతంగా విచారణ చేపట్టింది. కేసు సత్వరం పరిష్కారమయ్యేలా అటు దర్యాప్తు సంస్థలకు కూడా పూర్తి సహకారం అందిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్లోని భిండ్ పోలీసులు ఆన్లైన్ మారిజువానా విక్రయ రాకెట్ను ఛేదించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు 20 కిలోల మారిజువానాను స్వాధీనం చేసుకున్నారు. ఈ–కామర్స్ సంస్థ ద్వారా నిందితులు ఈ రాకెట్ నిర్వహించారని, వచ్చిన లాభాల్లో సంస్థకు మూడింట రెండొంతుల లాభాలు అందినట్టు తెలుస్తోందని అధికారులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాల లావాదేవీలకు వేదికగా నిల్చినందుకు గాను సదరు ఈ–కామర్స్ సంస్థపై కూడా చర్యలు తీసుకునే దిశగా ఆధారాలు సేకరిస్తున్నట్లు వివరించారు. ఎన్సీబీ ఎంక్వైరీకి డిమాండ్ ఈ కామర్స్ వేదికగా నిషేధిత మాదక ద్రవ్యాలు సరఫరా కావడమనేది తీవ్ర నేరమని, మధ్యప్రదేశ్ పోలీసులతో పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణ జరపాలని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ కేంద్రాన్ని కోరింది. అమెజాన్ సీనియర్ మేనేజ్మెంట్ను కూడా అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేసింది. -
ఫోటో ఫ్రేమ్స్ వెనుక డ్రగ్స్ పెట్టి పార్సిళ్లు
-
ఆన్లైన్ వేదికగా వినతులు.. భారత సంతతి వ్యక్తికి ఆగిన ఉరిశిక్ష
సింగపూర్: సింగపూర్లోకి అక్రమంగా మాదకద్రవ్యాలను తెస్తున్నాడనే అభియోగాలతో ఉరిశిక్ష పడిన భారతీయ మూలాలున్న మలేసియన్ నాగేంద్రన్ కె.ధర్మలింగం ఉరిశిక్ష అమలు ఎట్టకేలకు ఆగింది. మానసిక దివ్యాంగుడైన 33 ఏళ్ల నాగేంద్రన్కు విధించిన కఠినశిక్షను తగ్గించాలంటూ ఆన్లైన్ వేదికగా వేలాది మంది మానవహక్కుల కార్యకర్తలు, సంఘాల నుంచి వినతులు వెల్లువెత్తడంతో సింగపూర్ తన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదావేసింది. దాంతో అక్కడి జైలులో నవంబర్ పదో తేదీన అమలుచేయాల్సిన ఉరిశిక్ష అమలు తాత్కాలికంగా ఆగింది. శిక్ష తగ్గింపు, రద్దుకు సంబంధించిన ఒక పిటిషన్ను మంగళవారం ఆన్లైన్లో విచారించాల్సి ఉన్నందున శిక్ష అమలును ప్రస్తుతం ఆపాలని సింగపూర్ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. మంగళవారం నాటి పిటిషన్ను హైకోర్టు కొట్టేస్తే 10వ తేదీనే ఉరిశిక్ష అమలుచేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. -
వాట్సాప్ చెకింగ్ వీడియో వైరల్: క్లారిటీ ఇచ్చిన సీపీ అంజనీ కుమార్
సాక్షి, హైదరాబాద్: ఓ అనుమానితుడిని తనిఖీ చేస్తున్న పోలీసులు అతడి ఫోన్లోని వాట్సాప్ను పరిశీలిస్తున్న వీడియో రెండు రోజులుగా వైరల్గా మారింది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భగ్నమంటూ వాట్సాప్లో కామెంట్లు వచ్చాయి. దీనిపై నగర కొత్వాల్ అంజనీకుమార్ గురువారం స్పందించారు. అనుమానితులను పట్టుకున్నప్పుడు ఆద్యంతం సోదా చేయడం తమ విధుల్లో భాగమని పేర్కొన్నారు. అలా చేయని కారణంగానే ఇటీవల నార్త్జోన్ పరిధికి చెందిన ఓ కానిస్టేబుల్పై నిందితుడు జేబులోని కత్తితో దాడి చేశాడని వివరించారు. చదవండి: వాట్సాప్ గ్రూప్లో గంజాయి ఆర్డర్ మరోపక్క అనుమానితులు, నిందితుల మధ్య సంబంధాలు కనిపెట్టడానికి వాట్సాప్ తదితరాల తనిఖీ తప్పనిసరని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఉన్నప్పటికీ.. మనమంతా వాట్సాప్ యూనివర్సిటీలో విద్యార్థులుగా మారిపోయామని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాను గుడ్డిగా నమ్మవద్దని, వాట్సాప్లో వచ్చే వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. Sir @TelanganaDGP @CPHydCity is this permissible under any law? to stop and check people, their Mobile Phone, chatting, pockets and etc?. Can you do this at Banjara Hills or Hi tech City areas?. This is clear harassment to common and illiterate people. pic.twitter.com/vej4Csxqdm — S.Q.Masood | مسعود (@SQMasood) October 28, 2021 32 కేసులు.. 60 మంది అరెస్టు ఈ నెల 19 నుంచి గురువారం వరకు గంజాయి దందాకు సంబంధించి సిటీలో మొత్తం 26 కేసులు నమోదు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. దీంతో పాటు ఇతర మాదకద్రవ్యాలతో కలిపి 32 కేసుల్లో 60 మందిని అరెస్టు చేశామన్నారు. గంజాయి కేసుల్లో 389 కేజీలు స్వా«దీనం చేసుకున్నామని, చిక్కిన వారిలో ముగ్గురు మహారాష్ట్ర, ముగ్గురు ఏపీకి చెందిన వారూ ఉన్నట్లు పేర్కొన్నారు. నగరంలో ఈ ఏడాది మొత్తం 114 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించామని, వీరిలో 31 మంది గంజాయి, డ్రగ్స్ కేసులకు సంబంధించిన వారన్నారు. మరో 21 మందిపై త్వరలో పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. -
ఆర్యన్ఖాన్ డ్రగ్స్ కేసులో విట్నెస్ కిరణ్ గోసవి అరెస్ట్
-
లెహెంగాల ఫాల్స్లో డ్రగ్స్
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ను తరలించే క్రమంలో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు పెడ్లర్లు కొత్తకొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా కొరియర్ ద్వారా ఆస్ట్రేలియాకు రవాణా చేసేందుకు లెహెంగాల్లోని ఫాల్స్లో కోట్లు విలువ చేసే డ్రగ్స్ పెట్టి కుట్టేశారు. ఈ లెహెంగాలను కార్గోలో పంపేందుకు యత్నించి బెంగళూరు నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులకు చిక్కింది ఓ ముఠా. మూడు లెహెంగాల్లోని ఫాల్స్లో 3 కేజీల మిథిలీన్ డైఆక్సీ మిథాంఫిటమిన్ (ఎండీఎంఏ) డ్రగ్ పెట్టి చెన్నైకి చెందిన పెడ్లర్ హైదరాబాద్లోని ప్రైవేట్ కొరియర్ ఏజెన్సీ ద్వారా కన్సైన్మెంట్ బుక్ చేశాడు. ఎన్సీబీకి సమాచారం అందడంతో ఆ పార్శిల్ను ట్రాక్ చేశారు. బెంగళూరు ఎయిర్పోర్టులో గురువారం స్వాధీనం చేసుకున్నారు. పార్శిల్ను తెరిచి చూడగా మూడు లెహెంగాల్లో్ల ఎండీఎంఏ డ్రగ్స్ దొరికాయి. ఏపీలోని నర్సాపురంలో ఓ తప్పుడు చిరునామా ఉపయోగించి చెన్నైకి చెందిన ఓ పెడ్లర్ దీన్ని బుక్ చేసినట్లు గుర్తించారు. అనంతరం చెన్నైలోని నిందితుడి అసలు అడ్రస్ గుర్తించి, ఎన్సీబీ అధికారులు శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. పార్శిల్ను పంపేందుకు ఈ పెడ్లర్ నకిలీ డాక్యుమెంట్లు వినియోగించినట్లు విచారణలో తేలినట్లు అధికారులు చెప్పారు. మరో కేసులో నలుగురు అరెస్టు మరో కేసులో భాగంగా బెంగళూర్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందాను ఎన్సీబీ చేధించింది. శనివారం బెంగళూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న స్విఫ్ట్ కారును ఎన్సీబీ దేవనహల్లి చెక్పోస్టు వద్ద ఆపి తనిఖీ చేయగా, హై గ్రేడ్ గంజాయితో పాటు ఎండీఎంఏ పిల్స్, మిథాంఫిటమిన్, మెథక్వలోన్ లభ్యమైనట్లు ఎన్సీబీ బెంగళూర్ జోనల్ డైరెక్టర్ అమిత్ గౌవాటే తెలిపారు. కారులో ఉన్న నలుగురి అరెస్టు చేసి విచారించగా, వారిలో ఒకరు విశాఖపట్నానికి చెందిన వ్యక్తిగా, మిగిలిన ముగ్గురు హైదరాబాద్లో నివసిస్తున్న బిహార్కు చెందిన వారని గుర్తించినట్లు వెల్లడించారు. డ్రగ్స్ను వీకెండ్ పార్టీలకు సరఫరా చేసేందుకు వెళ్తున్నారని, హైదరాబాద్లోని పలు పబ్బుల్లోకి ఈ డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు చెప్పారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా బెంగళూరులో కొంత గంజాయితో పాటు ఎండీఎంఏ, ఇతర డ్రగ్స్ తయారీకి సంబంధించిన ముడి పదార్థాలు లభ్యమైనట్లు తెలిపారు. హాట్ స్పాట్లుగా.. విదేశాలకు డ్రగ్స్ రవాణా చేయడంలో హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూర్ నగరాలు హాట్ స్పాట్లుగా మారుతున్నట్లు ఎన్సీబీ పేర్కొంటోంది. ఎవరెవరో వ్యక్తులు హైదరాబాద్, ముంబై ద్వారా ఆస్ట్రేలియాకు డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం ఆందోళన కల్గిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడి పారిశ్రామిక ప్రాంతాల్లో విదేశాలకు చెందిన మాఫియా లోకల్ గ్యాంగ్లతో పెట్టుబడి పెట్టిస్తోందని, ఆ డ్రగ్స్ను ఇలా కొరియర్ల రూపంలో మళ్లీ అక్కడికే తెప్పించుకుంటోందని తేలింది. అయితే ఈ నాలుగు ప్రాంతాల్లో ఉన్న పెడ్లర్లపై దృష్టి పెడితే అసలు వ్యవహారం వెలుగులోకి వస్తుందని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
దేవుడా.. నీవే దిక్కు !
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి
జూన్ 4 తర్వాత వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే
24న డీఈఈ సెట్
యంత్రంలో ఫలితాలు.. బెట్టింగ్ల జోరు
గదులు నిర్మించండి
రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు
బదిలీలతో బరితెగింపు
Lok Sabha Election 2024: బీజేపీ అభ్యర్థుల్లో... నాలుగోవంతు ఫిరాయింపుదారులే
తప్పక చదవండి
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement