ముంబైలో రూ.3 కోట్ల డ్రగ్స్‌ సీజ్‌ | Sakshi
Sakshi News home page

ముంబైలో రూ.3 కోట్ల డ్రగ్స్‌ సీజ్‌

Published Mon, Mar 25 2024 5:36 AM

Mumbai police seize Rs 3. 25 crore drugs, arrest 12 peddlers  - Sakshi

ముంబై: గత నెల రోజుల వ్యవధిలో రూ.3.25 కోట్ల విలువైన 16 కిలోల డ్రగ్స్‌ను స్వా«దీనం చేసుకుని, 12 మంది పెడ్లర్లను అరెస్ట్‌ చేసినట్లు ముంబై పోలీస్‌ శాఖ యాంటీ నార్కోటిక్స్‌ సెల్‌(ఏఎన్‌సీ) ఆదివారం తెలిపింది.

సహర్‌ గ్రామం, నల్లసొపార, శాంటాక్రుజ్, కుర్లా, బైకుల్లా తదితర ప్రాంతాలకు చెందిన పెడ్లర్ల నుంచి హెరాయిన్, గంజాయి, ఎండీని స్వా«దీనం చేసుకున్నట్లు వివరించింది.  2023లో 106 కేసుల్లో 229 మంది డ్రగ్‌ పెడ్లర్లను అరెస్ట్‌ చేసి, రూ.53.23 కోట్ల డ్రగ్స్‌ను పట్టుకున్నట్లు ఏఎన్‌సీ వివరించింది.

Advertisement
Advertisement