ఒక్క అవకాశం ఇవ్వండి | Sakshi
Sakshi News home page

ఒక్క అవకాశం ఇవ్వండి

Published Sun, May 5 2024 3:05 AM

ఒక్క అవకాశం ఇవ్వండి

● బీజేపీ, బీఆర్‌ఎస్‌ వాళ్లు చేసిందేమీ లేదు ● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

చందుర్తి(వేములవాడ): కరీంనగర్‌ ఎంపీగా కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుకు ఒక్క అవకా శం ఇవ్వాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కోరారు. చందుర్తి మండలం మూడపల్లి, మర్రిగడ్డ, జోగాపూర్‌, బండపల్లి, ఎన్గల్‌ గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. రాజేందర్‌రావును గెలి పిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. దేవుళ్ల పేరు చెప్పి ఓట్లు అడిగితే మోసపోవద్దని కోరారు. ఐదేళ్లుగా ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ ఈ ప్రాంత ప్రజలకు చేసిందేమిటో చెప్పి ఓట్లు అడగాలని సవాల్‌ విసిరారు. జెడ్పీటీసీ నాగం కుమార్‌, పార్టీ మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామి, పార్టీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ముస్కు పద్మ, మాజీ జెడ్పీటీసీ లింగారెడ్డి, సనుగుల సింగిల్‌విండో మాజీ చైర్మన్‌ ముస్కు ముకుందరెడ్డి, పులి సత్తయ్య, దూది శ్రీనివాస్‌రెడ్డి, జలపతి పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లోకి ఎన్గల్‌ మాజీ సర్పంచ్‌

ఎన్గల్‌ మాజీ సర్పంచ్‌ లింగంపల్లి సత్తయ్య తన అ నుచరులు 50 మందితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పార్టీ కండువా కప్పారు. గసికంటి ప్రభాకర్‌, లింగయ్య, ఏనుగంటి శంకర్‌, సత్తయ్య, తిరుపతి ఉన్నారు.

బీఆర్‌ఎస్‌, బీజేపీలను పక్కన పెట్టాలి

వేములవాడరూరల్‌: పదేళ్లు పరిపాలించిన బీజేపీ ప్రభుత్వాన్ని పక్కన పెట్టాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కోరారు. వేములవాడరూరల్‌ మండలం బొల్లారం, లింగంపల్లి, హన్మాజిపేట, మర్రిపల్లి, నాగయపల్లి, పోశెట్టిపల్లి గ్రామాల్లో శనివారం రాత్రి ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు బుద్ధి చెప్పి, కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశ్‌గౌడ్‌, ఎంపీటీసీ చెన్నాడి శ్యామల, మాజీ సర్పంచ్‌లు సామ కవిత, తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సంగ స్వామి, బాలసాని శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement