-
సంతోషంగా ఉంది: వసుంధరా రాజే
జైపూర్: తన, తన కుమారుడికి సంబంధించిన కరోనా వైరస్ పరీక్షల ఫలితాల్లో నెగటివ్ అని తేలిందని రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే హర్షం వ్యక్తం చేశారు. బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ లక్నోలో జరిగిన ఓ పార్టీలో వసుంధరా రాజే, ఆమె కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్ను కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన కనికాకు కరోనా సోకినట్లు వెల్లడికాడంతో వీరిద్దరి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది. అంతేగాకుండా దుష్యంత్ సింగ్ వివిధ రాజకీయ నాయకులు, ఎంపీలను కలిసిన క్రమంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కనికా హాజరైన పార్టీకి వెళ్లిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.(ట్రోల్స్కు గట్టి కౌంటర్ ఇచ్చిన కనిక!) ఈ క్రమంలో వసుంధరా రాజే, దుష్యంత్ సింగ్ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ‘‘ కోవిడ్-19 పరీక్ష నిర్వహించిన తర్వాత.. నెగటివ్గా తేలింది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది. అయితే ఫలితాలు నెగటివ్గా వచ్చినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా మేం మరో 15 రోజుల పాటు ఐసోలేషన్లో ఉంటాం’’అని వసుంధరా రాజే ట్వీట్ చేశారు. అదే విధంగా తన కోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక వైద్యుల సూచన మేరకు తాము నిర్బంధంలో ఉంటామంటూ దుష్యంత్ సింగ్ కూడా ట్విటర్లో పేర్కొన్నారు. కాగా వీరితో పాటు పార్టీకి వెళ్లిన ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రికి కూడా కరోనా నెగటివ్గా తేలడంతో అధికార వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంగా కనికా కపూర్పై యూపీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. (మాస్కు ధర రూ. 8, శానిటైజర్ ధర రూ.100) After conducting a #Covid19 test, I’m happy to inform you that the results came back negative. However, as a preventive measure, my son and I will continue to be in isolation for 15 days. — Vasundhara Raje (@VasundharaBJP) March 21, 2020 -
‘ఇంట్లోనే ఉన్నా.. షేక్ హ్యాండ్ ఇవ్వలేదు’
న్యూఢిల్లీ: మహమ్మారి కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ నిబంధనలు ఉల్లంఘించి క్వారంటైన్ నుంచి బయటకు వచ్చారంటూ వార్తలు ప్రచారమవుతున్నాయి. జోర్డాన్లోని అమ్మన్లో జరిగిన ఆసియా- ఓషనియా ఒలంపిక్ క్వాలిఫైయర్స్లో పాల్గొన్న ఆమె ఇటీవలే భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేరీ కోమ్ మార్చి 18న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ క్రమంలో మార్చి 13న స్వదేశానికి చేరుకున్న మేరీ కోమ్.. 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిన నిబంధనను ఉల్లంఘించి నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి భవన్లో ఆమె ఎంపీ దుష్యంత్కు షేక్హ్యాండ్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది.(ట్రోల్స్కు గట్టి కౌంటర్ ఇచ్చిన కనిక! ) ఈ నేపథ్యంలో మేరీ కోమ్ శనివారం మీడియాతో మాట్లాడారు. జోర్డాన్ నుంచి వచ్చిన నాటి నుంచి తాను ఇంట్లోనే ఉన్నానని స్పష్టం చేశారు. కేవలం రాష్ట్రపతి ఇచ్చిన విందుకు మాత్రమే హాజరయ్యానని.. బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్ను తాను కలవలేదని తెలిపారు. తన క్వారంటైన్ ముగిసిందని... అయినప్పటికీ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మరో మూడు నుంచి నాలుగు రోజులు ఇంట్లోనే ఉండటానికి తనకేమీ అభ్యంతరం లేదని పేర్కొన్నారు. కాగా బాలీవుడ్ ప్రముఖ సింగర్ కనికా కపూర్ ఓ పార్టీలో రాజస్తాన్ మాజీ సీఎం వసుంధరా రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లండన్ నుంచి వచ్చిన కనికాకు కరోనా పాజిటివ్గా తేలడంతో ఆమెతో పాటు వీరిద్దరు, వీరిని కలిసిన మరికొందరు ప్రముఖులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన విషయం విదితమే. ఇక ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. (మీ నాయకత్వం అచ్చం అలాగే: పీటర్సన్) MC Mary Kom: I am home since I came back from Jordan. I only attended the President's event and did not meet BJP MP Dushyant Singh or shake hands with him at all. My quarantine after Jordan ends, but I’m going to be at home only for the next 3-4 days. (File pic) #Coronavirus pic.twitter.com/itEfFuzWGO — ANI (@ANI) March 21, 2020 -
కనికా ఎఫెక్ట్: నిర్బంధంలోకి ఎంపీలు, మాజీ సీఎం
న్యూఢిల్లీ: బాలీవుడ్ ప్రముఖ గాయని కనికా కపూర్ వహించిన నిర్లక్ష్యం దేశాన్ని భయపెట్టిస్తోంది. ఆమెకు కరోనా వైరస్ సోకినట్లు శుక్రవారం వైద్యులు నిర్థారించిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీకి హాజరైన వాళ్లంతా భయాందోళనకు గురవుతున్నారు. కనికా పార్టీకి హాజరైన వాళ్లలో బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్, ఆయన తల్లి రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. వీరంతా వైద్యుల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. రాజస్తాన్ ఎంపీ అయిన దుష్యంత్ సింగ్ పార్టీకీ అనంతరం రాష్టపతి రామ్నాథ్ కోవింద్తో సహా పలువురు మంత్రులతో కలిసి విందులకు, సమావేశాలకు కూడా హాజరైయ్యారు. పార్లమెంటులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్, ఎంపీ అనుప్రియా పటేల్లతో సన్నిహితంగా మెలిగారు. దీంతో ఆయన్ని కలుసుకున్న వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. (ప్రముఖ బాలీవుడ్ సింగర్కు కరోనా పాజిటివ్) కనికాకు కరోనా : కేసు నమోదు ఎంపీ ఎవరెవరిని కలిసిశారంటే.. రెండు రోజుల క్రితం దుష్యంత్ సింగ్ ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ ఎంపీలతో కలిసి రాష్టపతి రామ్నాథ్ కోవింద్తో అల్పహార విందులో పాల్గొన్నారు. ఈ విందులో కేంద్ర మాజీ మంత్రి రాజవర్థన్ రాథోడ్, మధుర ఎంపీ హేమమాలిని, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కాంగ్రెస్ నేత కుమారి సెల్జాతో పాటు బాక్సార్, ఎంపీ మేరీ కోమ్ కూడా ఉన్నారు. అంతేగాక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ కూడా రెండు రోజుల క్రితం రవాణా స్టాండింగ్ కమిటీ సమావేశంలో దుష్యంత్ సింగ్తో రెండున్నర గంటలకు పైగా సంభాషించినట్లు ఆయన చెప్పారు. అదే విధంగా ఆమ్ఆద్మీ నేత సంజయ్ సింగ్, కాంగ్రెస్ నాయకుడు దీపేందర్ హూడా కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. (కరోనా మరణ మృదంగం: మృతుల సంఖ్య 11వేలు) అపాయింట్మెంట్స్ రద్దు చేసుకున్న రాష్టపతి ‘కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇతరులకు దూరంగా ఉండాల్సిన సమయం ఇది. సెల్ఫ్ ఐసోలేషన్ అనేది వైద్య పరంగా తప్పనిసరి’ అంటూ రాష్ట్రపతి ట్వీట్ చేశారు. కాగా లక్నోలో జరిగిన ఆ పార్టీకి హాజరైన తర్వాత దుష్యంత్ సింగ్ కలిసిన ప్రతి ఒక్కరినీ ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వసుంధర రాజే ట్వీట్.. దీనిపై దుష్యంత్ సింగ్ తల్లి వసుంధర రాజే ట్వీట్ చేస్తూ.. లక్నోలో ఉన్నప్పుడు నా కొడుకు దుష్యంత్ సింగ్ తన అత్తమామలతో పాటు విందుకు హాజరయ్యాను. అక్కడికి సింగర్ కనికా కపూర్ కూడా అతిథిగా హాజరయ్యారు. తనకు వైరస్ సోకినట్లు తెలిసిన వెంటనే నేను, దుష్యంత్ స్వీయ నిర్భంధంలోకి వెళ్లాము. అలాగే అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము’’ అని చెప్పారు. కాగా వసుంధర రాజే, ఎంపీ దుష్యంత్లు ఇంతవరకూ ఎలాంటి వైద్య పరీక్షలు కానీ కరోనా వైరస్ పరీక్షలు కానీ చేయుంచుకోలేదని వారి వైద్యులు తెలిపారు. అయితే వ్యాధి లక్షణాలు కనిపిస్తే తప్ప వైద్య పరీక్షలు నిర్వహించలేమని వైద్యులు పేర్కొన్నారు. చదవండి: క్వారంటైన్లో ఉండలేం -
కనికా కపూర్కు కరోనా
బాలీవుడ్ ప్రముఖ గాయని కనికా కపూర్కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఏకంగా ఎంపీలు సెల్ఫ్ క్వారంటైన్ విధించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. వివరాల్లోకి వెళితే గాయని కనికా కపూర్ ఇటీవల లక్నోలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్లు పాల్గొన్నారు. ఇప్పుడు కనికా కపూర్కు కరోనా పాజిటివ్ అని తేలడంతో వసుంధర రాజే, దుష్యంత్ సింగ్లు సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. రాజస్తాన్ నుంచి ఎంపీగా ఉన్న దుష్యంత్ పార్లమెంటులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్, ఎంపీ అనుప్రియా పటేల్లతో సన్నిహితంగా మెలిగారు. దీంతో వారివురు కూడా సెల్ఫ్ క్వారంటైన్ విధించుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేగాక మార్చి 18న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన ఉపాహార విందుకు పలువురు ఎంపీలతోపాటు దుష్యంత్ కూడా హాజరయ్యారని, బుధవారం రవాణా, సాంస్కృతిక శాఖలు నిర్వహించిన సమావేశంలోనూ దుష్యంత్ 20 మంది ఎంపీలతో కలిసి ఉన్నారని డెరెక్ వివరించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలను వాయిదా వేయాలని ఆయన కోరారు. -
లోక్సభలో కరోనా కలవరం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి
పోలింగ్ రోజున ‘ర్యాపిడో’ ఉచిత సేవలు
వడివడిగా ఈవీఎం కమిషనింగ్ పనులు
గౌడ అభ్యర్థులను గెలిపించండి
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement