-
IPL 2024 GT VS RCB: అత్యంత అరుదైన క్లబ్లో చేరిన ఫాఫ్ డుప్లెసిస్
ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టీ20ల్లో అత్యంత అరుదైన క్లబ్లో చేరాడు. నిన్న (మే 4) గుజరాత్తో జరిగిన మ్యాచ్లో మెరుపు అర్దసెంచరీతో ఇరగదీసిన ఇతను.. పొట్టి ఫార్మాట్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్న 14వ బ్యాటర్గా, తొలి సౌతాఫ్రికన్ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. టీ20 కెరీర్లో 369 మ్యాచ్లు ఆడిన డుప్లెసిస్.. 134.30 స్ట్రయిక్రేట్తో 32.17 సగటున 10039 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో ఓవరాల్గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. గేల్ 463 మ్యాచ్ల్లో 22 సెంచరీలు, 88 హాఫ్ సెంచరీల సాయంతో 14562 పరుగులు చేశాడు. ఈ జాబితాలో గేల్ తర్వాతి స్థానాల్లో షోయబ్ మాలిక్ (13360), పోలార్డ్ (12900), విరాట్ కోహ్లి (12536), అలెక్స్ హేల్స్ (12319), వార్నర్ (12232), రోహిత్ శర్మ (11482), జోస్ బట్లర్ (11465), ఆరోన్ ఫించ్ (11458), కొలిన్ మున్రో (10961), బాబర్ ఆజమ్ (10620), జేమ్స్ విన్స్ (10451), డేవిడ్ మిల్లర్ (10230), డుప్లెసిస్ ఉన్నారు.ఈ మ్యాచ్లో చేసిన పరుగులతో కలుపుకుని డుప్లెసిస్ మరో ఘనత సాధించాడు. డుప్లెసిస్ ఆర్సీబీ తరఫున నాలుగో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు. ఆర్సీబీకి ముందు సీఎస్కేకు ఆడిన డుప్లెసిస్ ఆ ఫ్రాంచైజీ తరఫున మూడో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు.మ్యాచ్ విషయానికొస్తే.. డుప్లెసిస్ మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో గుజరాత్పై ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఆర్సీబీ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ ఇన్నింగ్స్లో షారుక్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్ (30), రాహుల్ తెవాతియా (35) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మిగతా ప్లేయర్లంతా పెవిలియన్కు క్యూకట్టారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, యశ్ దయాల్, విజయ్కుమార్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కర్ణ్ శర్మ, గ్రీన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. పవర్ ప్లేలో పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోయింది. తొలి ఆరు ఓవర్లలో 92 పరుగులు చేసిన ఆర్సీబీ.. ఆతర్వాత ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయి ఆలౌటయ్యేలా కనిపించింది. అయితే దినేశ్ కార్తీక్ (21 నాటౌట్).. సప్నిల్ సింగ్ (15 నాటౌట్) సాయంతో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. గుజరాత్ బౌలర్లలో జాషువ లిటిల్ 4 వికెట్లతో విజృంభించగా.. నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో భారీ జంప్ కొట్టి చివరి స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. ఈ ఓటమితో గుజరాత్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది. -
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపున్కుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఏడో స్ధానానికి చేరుకుంది. ఈమ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది.19.3 ఓవర్లలో 147 పరుగులకు గుజరాత్ ఆలౌటైంది. గుజరాత్ బ్యాటర్లలో షారూఖ్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్(30), రాహుల్ తెవాటియా(35) పర్వాలేదన్పించారు. ఇక ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, విజయ్ కుమార్, యశ్ దయాల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. గ్రీన్, కరణ్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.ఆర్సీబీ బ్యాటర్లలో ఓపెనర్లు ఫాప్ డుప్లెసిస్(23 బంతుల్లో 64), విరాట్ కోహ్లి(27 బంతుల్లో 42) పరుగులతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత దినేష్ కార్తీక్(21 నాటౌట్), స్వప్నిల్ సింగ్(15) పరుగులతో మ్యాచ్ను ఫినిష్ చేశారు. గుజరాత్ బౌలర్లలో లిటిల్ 4 వికెట్లు పడగొట్టగా.. నూర్ ఆహ్మద్ రెండు వికెట్లు సాధించాడు.No RCB RCB fans will pass without liking this. ❤️🔥💫⭐Vintage RCB | Just RCB is RCBing | Can RCB vs GT | Faf du Plessis | Only RCB #RCBvsGT #GTvsRCB #ViratKohli pic.twitter.com/Ou5XvqxCv1— crazy (@cricrazyNandu) May 4, 2024 -
RCB కెప్టెన్గా అతడు ఉంటే ఏం మాట్లాడగలరు: సెహ్వాగ్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆట తీరుపై విమర్శలు వెల్లుతుతున్నాయి. సొంతమైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో సొంత జట్టు అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే ఐపీఎల్-2024లో కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరే అవకాశం ఉండదని మండిపడుతున్నారు. ఇక ఇప్పటికే భారత టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి సైతం ఆర్సీబీని కొత్త వాళ్లకు అమ్మేయాలంటూ యాజమాన్యం తీరును విమర్శించాడు. జట్టు నిండా స్టార్లు ఉన్నా ఇలాంటి చెత్త ప్రదర్శన ఏమిటని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అదే ఇక్కడ ప్రధాన సమస్య ‘‘జట్టులో 12- 15 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు. కేవలం 10 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. కానీ ఆర్సీబీ కోచింగ్ సిబ్బందిలో దాదాపుగా అందరూ విదేశీయులే ఉన్నారు. అదే ఇక్కడ ప్రధాన సమస్య. ఇక ఆటగాళ్లలో కొంతమంది మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నారు. వీరిలో సగం మందికి ఇంగ్లిష్ పూర్తిగా అర్థమే కాదు. అలాంటపుడు ఆ విదేశీ కోచ్లు వీరిని ఎలా మోటివేట్ చేయగలరు? వారితో ఎక్కువ సమయం ఎలా గడపగలరు? భాష పూర్తిగా రాని ఆటగాళ్లు తమ సమస్యలను కోచ్లకు ఎలా వివరించగలరు? నాకైతే ఆర్సీబీలో ఒక్క ఇండియన్ కోచ్ కూడా కనిపించడం లేదు. కనీసం ఒక్కరైనా అనుభవజ్ఞుడైన కోచ్ ఉంటే బాగుంటుంది కదా! ఆటగాళ్లు ఏది చర్చించాలన్నా అందుకు తగిన వాతావరణం ఉండాలి. కెప్టెన్గా అతడు ఉంటే ఏం మాట్లాడతారు? నాకు తెలిసి చాలా మంది ఆటగాళ్లు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ దగ్గరికి వెళ్లడానికే సంశయిస్తారు. ఎందుకంటే అతడు ఏదైనా అడిగితే వీరు సమాధానం చెప్పలేరు కదా! ఒకవేళ కెప్టెన్ గనుక భారతీయుడైతే.. సదరు ఆటగాళ్లు తాము అనుకుంటున్న విషయాన్ని స్పష్టంగా అతడికి తెలియజేయగలరు. కానీ విదేశీ ఆటగాడితో సరిగా కమ్యూనికేట్ చేయలేక.. ఒకదానికి బదులు ఇంకొకటి మాట్లాడితే తదుపరి మ్యాచ్లో తుదిజట్టులో చోటు దక్కే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఆర్సీబీ సహాయక సిబ్బందిలో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురైనా భారతీయులు ఉండాలి’’ అని క్రిక్బజ్ షోలో సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్-2024లో ఆర్సీబీ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం ఒక్కటి గెలిచి ఆరు ఓడిపోయింది. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఇక ఈ సీజన్లో ఆర్సీబీ హెడ్కోచ్గా ఆండీ ఫ్లవర్ బాధ్యతలు చేపట్టగా.. బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ కోచ్గా టీమిండియా మాజీ ఆల్రౌండర్ శ్రీధరన్ శ్రీరామ్, బౌలింగ్ కోచ్గా ఆడం గ్రిఫిత్(టాస్మేనియా మాజీ క్రికెటర్), ఫీల్డింగ్ కోచ్గా మలోలన్ రంగరాజన్ వ్యవహరిస్తున్నారు. చదవండి: SRH: ‘బాధితులు’ కూడా అసూయ పడేలా.. కమిన్స్ ఏమన్నాడో తెలుసా? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మా కుర్రాళ్లు బాగా పోరాడారు.. అదే మా కొంపముంచింది: ఆర్సీబీ కెప్టెన్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ఏ మాత్రం మారలేదు. ఈ మెగా ఈవెంట్లో ఆర్సీబీ వరుసగా ఐదో ఓటమి చవచూసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో 25 పరుగుల తేడాతో బెంగళూరు ఓటమి పాలైంది. మరోసారి బెంగళూరు బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. తొలుత బౌలింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 287 పరుగుల రికార్డు స్కోర్ను సమర్పించుకుంది. ట్రావిస్ హెడ్(102) ,హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశారు. అనంతరం లక్ష్య చేధనలో ఆర్సీబీ బ్యాటర్లు ఆఖరి వరకు పోరాడారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో దినేష్ కార్తీక్ అద్బుతమైన పోరాటం చేశాడు. కేవలం 35 బంతుల్లోనే 7 సిక్సర్లు, 5 ఫోర్లతో కార్తీక్ 83 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ డుప్లెసిస్(62), విరాట్ కోహ్లి(42) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. ఈ ఓటమితో ఆర్సీబీ ప్లే ఆఫ్ ఛాన్స్లను సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ స్పందించాడు. బౌలింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలైమని ఫాప్ చెప్పుకొచ్చాడు. "ఈ మ్యాచ్లో మేము ఆఖరి వరకు పోరాడినందుకు సంతోషంగా ఉంది. ఈ సీజన్లో మా నుంచి వచ్చిన మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన ఇదే. చిన్నస్వామి వికెట్ సరిగ్గా టీ20 క్రికెట్కు సరిపోతుంది. 280 పైగా టార్గెట్ను ఛేజ్ చేయడం అంత సులభం కాదు. కానీ మేము దగ్గరికి వచ్చి ఓడిపోయాం. ఈ మ్యాచ్లో కొన్ని మార్పులు చేశాము. కొత్తగా కొన్ని విషయాలను ప్రయత్నించాం. ఫాస్ట్ బౌలర్లు ఈ పిచ్పై పూర్తిగా తేలిపోయారు. బ్యాటింగ్ పరంగా మేము బలంగానే ఉన్నాము. మేము ఇంకా కొన్ని విభాగాల్లో ఇంకా మెరుగవ్వాలి. ముఖ్యంగా బౌలింగ్పై ఎక్కువ దృష్టిపెట్టాలి. అదే విధంగా బ్యాటింగ్లో కూడా పవర్ప్లే తర్వాత రన్ రేట్ తగ్గకుండా చూసుకోవాలి. ఈ హైస్కోరింగ్ రన్ ఛేజ్లో మా బాయ్స్ ఆఖరి వరకు మ్యాచ్ను విడిచిపెట్టలేదు. తొలుత బౌలింగ్లో 30-40 పరుగులు ఎక్కువగా ఇచ్చాం. అదే మా కొంపముంచింది. కానీ ఆటలో గెలుపుటములు సహజం. ఓడిపోయినందుకు కచ్చితంగా బాధ ఉంటుంది. కానీ మా మైండ్ను ఫ్రెష్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మా తర్వాతి మ్యాచ్ల్లో ఆడేందుకు సిద్దంగా ఉండాలి కదా" అంటూ పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో డుప్లెసిస్ పేర్కొన్నాడు. -
IPL2024 RCB vs SRH: హై స్కోరింగ్ మ్యాచ్లో ఆర్సీబీ ఓటమి..
IPL2024 RCB vs SRH Live Updates: హై స్కోరింగ్ మ్యాచ్లో ఆర్సీబీ ఓటమి.. ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమి చవిచూసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 25 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. 288 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఆర్సీబీ ఆఖరివరకు పోరాడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో దినేష్ కార్తీక్ అద్బుతమైన పోరాటం చేశాడు. కేవలం 35 బంతుల్లోనే 7 సిక్సర్లు, 5 ఫోర్లతో కార్తీక్ 83 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ డుప్లెసిస్(62), విరాట్ కోహ్లి(42) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కండే రెండు, నటరాజన్ ఒక్క వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఎస్ఆర్హెచ్ ఏకంగా 287 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఆర్సీబీ ఆరో వికెట్ డౌన్ 181 పరుగులు వద్ద ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన మహిపాల్ లామ్రోర్.. కమ్మిన్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో దినేష్ కార్తీక్(36), రావత్(5) పరుగులతో ఉన్నారు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 122/5 13 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఆర్సీబీ విజయానికి 42 బంతుల్లో 128 పరుగులు కావాలి. క్రీజులో దినేష్ కార్తీక్(16), లామ్రోర్(18) పరుగులతో ఉన్నారు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 122/5 ఆర్సీబీ వరుస క్రమంలో మూడు వికెట్లు కోల్పోయింది. 9 ఓవర్ వేసిన మార్కండే బౌలింగ్లో పాటిదార్ ఔట్ కాగా.. అనంతరం కమ్మిన్స్ బౌలింగ్లో డుప్లెసిస్(62), సౌరవ్ చౌహన్ పెవిలియన్కు చేరారు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 122/5 ఆర్సీబీ రెండో వికెట్ డౌన్.. జాక్స్ ఔట్ 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. ఉనద్కట్ బౌలింగ్లో విల్ జాక్స్ రనౌటయ్యాడు. 8 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో ఆర్సీబీ ఫాప్ డుప్లెసిస్(51), పాటిదార్ ఉన్నారు. ఆర్సీబీ తొలి వికెట్ డౌన్.. కోహ్లి ఔట్ 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. మార్కండే బౌలింగ్లో ఔటయ్యాడు. చెలరేగి ఆడుతున్న ఆర్సీబీ ఓపెనర్లు.. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ దూకుడుగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. క్రీజులో ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లి(25), ఫాప్ డుప్లెసిస్(31) పరుగులతో ఉన్నారు. సన్రైజర్స్ విధ్వంసం.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ను ఎస్ఆర్హెచ్ సాధించింది. ఈ మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఎస్ఆర్హెచ్ ఏకంగా 287 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుమందు ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 277 పరుగులు చేసింది. ఈ మ్యాచ్తో తన రికార్డును తానే తిరగరాసింది. అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్స్లు కొట్టిన జట్టుగా సన్రైజర్స్ నిలిచింది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఏకంగా 22 సిక్స్లు బాదారు. ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ డౌన్.. క్లాసెన్ ఔట్ 233 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. హెన్రిచ్ క్లాసెన్(31 బంతుల్లో 67, 7 సిక్స్లు, 4 ఫోర్లు).. ఫెర్గూసన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 18 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ మూడు వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. 16 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 217/2 16 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హెన్రిచ్ క్లాసెన్(27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లు), మార్క్రమ్(9) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ డౌన్.. హెడ్ ఔట్ ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. విధ్వంసకర సెంచరీతో చెలరేగిన హెడ్.. ఫెర్గూసన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 41 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 9 ఫోర్లు, 8 సిక్స్లతో 102 పరుగులు చేశాడు. 14 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్రీజులో హెన్రిస్ క్లాసెన్(39), మార్క్రమ్(2) పరుగులతో ఉన్నారు. ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీ.. ట్రావిస్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో బెంగళూరు బౌలర్లకు హెడ్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై హెడ్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 38 బంతుల్లో హెడ్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 9 ఫోర్లు, 8 సిక్స్లు ఉన్నాయి. 102 పరుగులతో హెడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 12 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి1 57 పరుగులు చేసింది. తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. 108 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన ఆభిషేక్ శర్మ.. టాప్లీ బౌలింగ్లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్(79), క్లాసెన్(1) పరుగులతో ఉన్నారు. దంచి కొడుతున్న ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు.. ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దంచికొడుతున్నారు. 8 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(33), ట్రావిస్ హెడ్(71) పరుగులతో ఉన్నారు. ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ ట్రావిస్ హెడ్ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కేవలం 20 బంతుల్లో 5 ఫోర్లు, 3సిక్స్లతో హెడ్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(23), ట్రావిస్ హెడ్(52) పరుగులతో ఉన్నారు. దంచి కొడుతున్న ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(14), ట్రావిస్ హెడ్(13) పరుగులతో ఉన్నారు. ఐపీఎల్-2024లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గ్లెన్ మాక్స్వెల్, సిరాజ్ ఈ మ్యాచ్కు దూరమయ్యారు. ఆర్సీబీ తుది జట్టులోకి కివీస్ ఫాస్ట్ బౌలర్ లూకీ ఫెర్గూసన్ వచ్చాడు. సన్రైజర్స్ మాత్రం తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. తుది జట్లు సన్రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, సౌరవ్ చౌహాన్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, విజయ్కుమార్ వైషాక్, రీస్ టోప్లీ, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్ -
చాలా బాధగా ఉంది.. అతడే మా కొంపముంచాడు: ఆర్సీబీ కెప్టెన్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీరు ఏ మాత్రం మారలేదు. ఈ మెగా ఈవెంట్లో ఆర్సీబీ మరో ఘోర ఓటమిని చవిచూసింది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో బెంగళూరు పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు అదరగొట్టినప్పటికి.. బౌలర్లు మాత్రం దారుణంగా తేలిపోయారు. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ముంబై సునాయాసంగా కేవలం 15.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో 9వ స్ధానంలో కొనసాగుతోంది. ఇక ఈ ముంబై చేతిలో ఓటమిపై మ్యాచ్ అనంతరం ఫాప్ డుప్లెసిస్ స్పందించాడు. మంచు ప్రభావం తమ కొంపముంచిందని డుప్లెసిస్ తెలిపాడు. "మేము ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా బాధగా ఉంది. ఒక మ్యాచ్లో విజయం సాధించాలంటే బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ రాణించాలి. టాస్ గెలిచింటే పరిస్థితి మరో విధంగా ఉండేదేమో. ఎందుకంటే మేము కూడా తొలుత బౌలింగ్ చేయాలనుకున్నాం. రెండో ఇన్నింగ్స్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. మా బౌలర్లు చాలా ఇబ్బంది పడ్డారు.అయితే దీనిని నేను సాకుగా చెప్పాలనుకోవడం లేదు. వారు బాగా ఆడారు. మాపై ఒత్తిడి తెచ్చారు. బౌలింగ్లో కూడా అద్బుతంగా రాణించారు. ఈ మ్యాచ్లో మేము కూడా చాలా తప్పులు చేశాము. ఇటువంటి వికెట్పై 190 పైగా స్కోర్ను డిఫెండ్ చేసుకోవడం అంత ఈజీ కాదు. పవర్ప్లేలో మేము మరి కొన్ని పరుగులు సాధించింటే బాగుండేంది. సెకెండ్ ఇన్నింగ్స్లో మంచు ప్రభావం ఉంటుందని మాకు ముందే తెలుసు కాబట్టి 250 పైగా పరుగులు చేయాల్సింది. ఆరంభంలో వికెట్లు కోల్పోడం కూడా మమ్మల్ని దెబ్బతీసింది. అయితే పాటిదార్, నేను క్రీజులో ఉన్నప్పుడు పెద్ద స్కోర్ వస్తుందని భావించాను. కానీ ముంబై బౌలర్లు తిరిగి కమ్బ్యాక్ ఇచ్చారు. ముఖ్యంగా బుమ్రా అద్బుతంగా బౌలింగ్ చేశాడు. అతడు డెత్ ఓవర్లలో సూపర్ బౌలింగ్ చేశాడు. అతడికి అద్బుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. బుమ్రాని ఎటాక్ చేసి ఒత్తిడిలోకి నెట్టడం అంత సలభం కాదు. లసిత్ మలింగ గైడన్స్లో జస్ప్రీత్ మరింత మెరుగయ్యాడని నేను భావిస్తున్నాను. అటువంటి క్లాస్ బౌలర్ మా జట్టులో ఉంటే బాగుండేది. మా బౌలింగ్ విభాగం అంత పటిష్టంగా లేదని మాకు తెలుసు. కాబట్టి రాబోయో మ్యాచ్ల్లో బ్యాటింగ్ పరంగా మెరుగ్గా రాణించి భారీ స్కోర్లు సాధించాలని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో ఫాప్ పేర్కొన్నాడు. -
RCB Vs MI: ఫాప్ డుప్లెసిస్ 'నో లూక్' సిక్స్.. వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ అద్భుతమైన షాట్తో మెరిశాడు. డుప్లెసిస్ న్యూ లూక్ షాట్తో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 2వ ఓవర్ వేసిన గెరాల్డ్ కోయిట్జీ ఆఖరి బంతిని డుప్లెసిస్కు 142.3 కి.మీ వేగంతో గుడ్ లెంగ్త్ డెలివరీ సంధించాడు. అయితే ముందుగానే పొజిషన్లో వచ్చిన డుప్లెసిస్.. బంతిని చూడకుండానే ర్యాంప్ షాట్ ఆడాడు. అయితే డెలివరీగా ఎక్కువగా పేస్ ఉండడంతో దెబ్బకు బంతి స్టాండ్స్లో పడింది. దీంతో డుప్లెసిస్ న్యూ లూక్ సిక్స్ చూసిన బౌలర్ కొయిట్జీ ఒక్కసారిగా తెల్లముఖం వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. #MIvsRCB,#RCBvsMI,#FafDuPlessis Fabulous pic.twitter.com/24eiZQQtga — Be Positive 🙂↕️🌝💯 (@Tauqeer__azam) April 11, 2024 -
అతడి వల్లే ఓడిపోయాం.. అలా చేయకుంటే బాగుండేది!
‘‘తొలి ఇన్నింగ్స్లో వికెట్ పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలించలేదు. ఏదేమైనా ఇక్కడ 190 స్కోరు చేస్తే బాగుంటుందని భావించాం. కనీసం ఇంకో 10- 15 పరుగులు చేస్తే ఫలితం బాగుండేది. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. టాస్ గెలిసి తొలుత బౌలింగ్ ఎంచుకోవడం కూడా వారికి సానుకూల ఫలితాలను ఇచ్చింది. మ్యాచ్ సాగుతున్నీ కొద్దీ పిచ్ మీద తేమ కారణంగా బ్యాటింగ్ సులువైంది. విరాట్ ఆఖరి వరకు బాగానే ఆడాడు. ఆఖరి ఓవర్లలో కామెరాన్ గ్రీన్ బ్యాట్ ఝలిపిస్తే బాగుండేది. స్పిన్నర్ల బౌలింగ్లో పరుగులు రాబట్టాలని శాయ శక్తులా కృషి చేసినా సాధ్యం కాలేదు. అదే సీమర్ల బౌలింగ్లో హిట్టింగ్ ఆడగలిగాం. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్థిని తొలి నాలుగు ఓవర్లలో బాగానే కట్టడి చేయగలిగాం. అప్పుడే మ్యాచ్ మలుపు తిరిగింది కానీ ఆరో ఓవర్లో మేము 20కి పైగా పరుగులు సమర్పించుకోవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తర్వాత మాపై క్రమంగా ఒత్తిడి పెరిగింది. ఎక్కువగా కుడిచేతి వాటం బ్యాటర్లే ఉన్నారు కాబట్టి మాక్స్వెల్తో బౌలింగ్ చేయించలేదు. ఇద్దరు రైట్ హ్యాండర్లు క్రీజులో ఉన్నపుడు మా లెఫ్టార్మ్ స్పిన్నర్ హిమాన్షు శర్మను బరిలోకి దించాం. వికెట్లు తీసేందుకు మా ప్రయత్నం చేశాం. జైస్వాల్(లెఫ్టాండర్) అవుటైన తర్వాత కూడా మాక్సీతో బౌలింగ్ చేయించాలని అనుకోలేదు. ఇక ఈ మ్యాచ్లో మా ఫీల్డింగ్ అత్యంత సాధారణంగా ఉంది. తదుపరి మ్యాచ్లో తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తాం’’ అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. ఐపీఎల్-2024లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమి అనంతరం ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.ఘ ఆ ఓవర్లోనే ఆర్సీబీ కొంప మునిగింది లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ను తొలి నాలుగు ఓవర్లలో కట్టడి చేసినా.. మయాంక్ దాగర్ వేసిన ఆరో ఓవర్ నుంచి మ్యాచ్ స్వరూపం మారిపోయిందని డుప్లెసిస్ పేర్కొన్నాడు. ఆ తర్వాత ఏ దశలోనూ రాజస్తాన్ను ఆపలేకపోయామని.. ఫీల్డింగ్ వైఫల్యాల వల్ల కూడా మూల్యం చెల్లించామని తెలిపాడు. కాగా జైపూర్లో శనివారం నాటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 183 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ ఆరంభంలోనే యశస్వి జైస్వాల్(0) వికెట్ కోల్పోయినా.. జోస్ బట్లర్(100- నాటౌట్), సంజూ శాంసన్(69) ఇన్నింగ్స్ కారణంగా విజయఢంకా మోగించింది. కేవలం 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్ను పూర్తి చేసి ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఆర్సీబీ బౌలర్లలో రీస్ టోప్లీ రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన మయాంక్ దాగర్ ఏకంగా 34 పరుగులు ఇచ్చుకున్నాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్లో ఆరో ఓవర్ బౌల్ చేసిన ఈ లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ ఏకంగా 20 పరుగులు ఇవ్వడం ఆర్సీబీ కొంపముంచింది. ఇక ఈ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అజేయ శతకం(113) వృథాగా పోయింది. చదవండి: Virat Kohli: ఇంత స్వార్థమా?.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: ఆర్సీబీ లాంటి జట్లు ఎప్పటికీ ట్రోఫీ గెలవలేవు!
"This is why they have not won the IPL for so many years": రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘స్టార్ల’ వైఫల్యం కారణంగానే ఆర్సీబీ ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదని వ్యాఖ్యానించాడు. కోట్లకు కోట్లు తీసుకునే అగ్ర శ్రేణి అంతర్జాతీయ క్రికెటర్లు మైదానంలో కంటే డ్రెసింగ్ రూంలోనే ఎక్కువగా ఉండటం వల్లే ఆర్సీబీ రాత మారడం లేదని రాయుడు అభిప్రాయపడ్డాడు. కాగా 2008 నుంచి బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్వెల్, ఫాఫ్ డుపెస్లిస్, మహ్మద్ సిరాజ్ వంటి టాప్ క్లాస్ ఆటగాళ్లు ఉన్నా ఆర్సీబీ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. తాజాగా ఐపీఎల్-2024లోనూ పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 28 రన్స్తో ఓడి మూడో ఓటమిని చవిచూసింది. బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి వైఫల్యం కారణంగా సొంత మైదానంలో పరాభవం మూటగట్టుకుంది. A win at home followed by a win away from home for the Lucknow Super Giants! 👏👏 They move to number 4⃣ on the Points Table! Scorecard ▶️ https://t.co/ZZ42YW8tPz#TATAIPL | #RCBvLSG pic.twitter.com/uc8rWveRim — IndianPremierLeague (@IPL) April 2, 2024 స్టార్లు ఒక్కసారైనా రాణించారా? ఈ నేపథ్యంలో అంబటి రాయుడు మాట్లాడుతూ.. ‘‘ వాళ్ల బౌలర్లు ఎల్లప్పుడూ అత్యధికంగా పరుగులు సమర్పించుకుంటూనే ఉంటారు. ఇక బ్యాటర్లేమో స్థాయికి తగ్గట్లు ఆడరు. ఆర్సీబీ కష్టాల్లో ఉన్న సమయంలో.. మేటి బ్యాటర్గా పేరున్న ఒక్క ఆటగాడు కూడా రాణించడం ఇంత వరకు చూడలేదు. అలాంటి జట్లు ఎప్పటికీ టైటిల్ గెలవలేవు. అందుకే ఇన్నేళ్లుగా ఆర్సీబీ ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ సాధించలేకపోయింది. బిగ్ ప్లేయర్లంతా టాపార్డర్లో ఉంటారు. కేక్ తినగా మిగిలిన క్రీమ్ను వదిలేసినట్లు డౌన్ ఆర్డర్లో ఉన్న యువ ఆటగాళ్లపై భారం వేస్తారు. ఒత్తిడిలో యువ ఆటగాళ్లతో పాటు దినేశ్ కార్తిక్ మాత్రమే ఆడటం చూస్తున్నాం. పదహారేళ్లుగా ఆర్సీబీ కథ ఇదే ఒత్తిడిలో మరింత మెరుగ్గా రాణించాల్సిన ఆర్సీబీలోని అగ్ర శ్రేణి అంతర్జాతీయ ప్లేయర్లు ఎప్పుడు బాధ్యత తీసుకున్నారు? వాళ్లంతా ఎక్కువగా డ్రెసింగ్ రూంలోనే ఉంటారు. ఈ ఒక్కరోజు మాత్రమే ఇలా జరగలేదు. పదహారేళ్లు ఆర్సీబీ కథ ఇదే’’ అని అంబటి రాయుడు స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్లు.. కోహ్లి, మాక్స్ వెల్, డుప్లెసిస్, కామెరాన్ గ్రీన్ వంటి ఆటగాళ్లను ఉద్దేశించే రాయుడు ఇలా అని ఉంటాడని భావిస్తున్నారు. ఆ అదృష్టం అందరికీ ఉండదు బ్రో! అయితే, ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం రాయుడు అభిప్రాయంతో విభేదిస్తున్నారు. ఒక్కోసారి అదృష్టం కలిసి వస్తే కూడా ఆరుసార్లు టైటిల్ గెలిచిన జట్లలో భాగమయ్యే ఛాన్స్ ఉందని రాయుడును ఉద్దేశించి సెటైర్లు వేస్తున్నారు. కాగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన అంబటి రాయుడు ఆ జట్లు ట్రోఫీలు గెలిచిన సందర్భాల్లో(మూడేసి సార్లు) జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. గతేడాది సీజన్ తర్వాత ఐపీఎల్కు అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: రూ.11 కోట్లు టైమ్కి తీసుకుంటాడు.. అతడికేమో 17 కోట్లు! మరి ఆట? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: ఆర్సీబీ కెప్టెన్కు ఏమైంది..? చెత్త షాట్ ఆడి మరి? వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. వరుసగా మూడో మ్యాచ్లో డుప్లెసిస్ నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో డుప్లెసిస్ విఫలమయ్యాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో ఓ చెత్త షాట్ ఆడి డుప్లెసిస్ తన వికెట్ను కోల్పోయాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన హర్షిత్ రాణా మూడో బంతి హాఫ్ కట్టర్గా సంధించాడు. కానీ డుప్లెసిస్ మాత్రం హాఫ్ సైడ్ వెళ్లి స్కూప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో షార్ట్ ఫైన్ లెగ్ దిశగా బంతి గాల్లోకి లేచింది. షార్ట్ ఫైన్ లెగ్ ఫీల్డింగ్ చేస్తున్న మిచెల్ స్టార్క్.. ఈజీ క్యాచ్ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. pic.twitter.com/A1wRUMpZLP — Sitaraman (@Sitaraman112971) March 29, 2024 -
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. ఇందులోనైనా ఆర్సీబీ గెలుస్తుందా..?
ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (మార్చి 25) పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని ఆర్సీబీ భావిస్తుండగా.. పంజాబ్ సీజన్లో వరుసగా రెండో విజయంపై కన్నేసింది. ఆర్సీబీ సీజన్ తొలి మ్యాచ్లో సీఎస్కే చేతిలో ఓటమిపాలు కాగా.. పంజాబ్ తమ తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. తొలి మ్యాచ్లో ఆయా జట్ల ప్రదర్శనలపై ఓ లుక్కేద్దాం.. ఆర్సీబీ కంటే పంజాబ్ అన్ని విభాగాల్లో మెరుగ్గా కనిపించింది. ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ పేపర్పై బలంగా కనిపించినప్పటికీ తొలి మ్యాచ్లో స్టార్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. 8 ఫోర్లు బాది డుప్లెసిస్ (35) ప్రమాదకరంగా కనిపించినప్పటికీ.. ఆ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ముస్తాఫిజుర్ అతన్ని పెవిలియన్కు పంపాడు. విరాట్ విషయానికొస్తే.. ఆ మ్యాచ్లో అతని బ్యాటింగ్ నత్త నడకను తలపించింది. అతను 20 బంతులను ఎదుర్కొని కేవలం 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రజత్ పాటిదార్, మ్యాక్స్వెల్ డకౌటై దారుణంగా నిరాశపర్చగా.. కోట్లు పెట్టి అరువు తెచ్చుకున్న కెమారూన్ గ్రీన్ తుస్సుమనిపించాడు. వికెట్కీపర్లు అనూజ్ రావత్ (48), దినేశ్ కార్తీక్ (38 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడకపోయుంటే ఆర్సీబీ 100 పరుగులు చేయడం కూడా కష్టంగా ఉండేది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు కూడా తేలిపోయారు. స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. అల్జరీ జోసఫ్, కర్ణ్ శర్మ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మయాంక్ డాగర్ కాస్త పర్వాలేదనిపించగా.. గ్రీన్ 2 వికెట్లు తీసి నాట్ బ్యాడ్ అనిపించాడు. పంజాబ్తో ఇవాల్టి మ్యాచ్లో ఆర్సీబీ అదనపు పేసర్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. కర్ణ శర్మ స్థానంలో ఆకాశదీప్ తుది జట్టులోకి రావచ్చు. పంజాబ్ విషయానికొస్తే.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చి విజయం సొంతం చేసుకుంది. అర్ష్దీప్ సింగ్, రబాడ, రాహుల్ చాహర్ తమ కోటా ఓవర్లు పూర్తి చేసి పర్వాలేదనిపించగా.. హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీసినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. హర్ప్రీత్ బ్రార్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్లో సత్తా చాటిన సామ్ కర్రన్ ఒకే ఓవర్ బౌల్ చేశాడు. ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు పర్వాలేదనిపించారు. కర్రన్ (63) అర్దసెంచరీతో రాణించగా.. లివింగ్స్టోన్ (38 నాటౌట్), శిఖర్ ధవన్ (22), ప్రభ్సిమ్రన్ సింగ్ నాట్ బ్యాడ్ అనిపించారు. ఆర్సీబీతో ఇవాల్టి మ్యాచ్ పంజాబ్ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఢిల్లీతో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించవచ్చు. ఆర్సీబీ తుది జట్టు (అంచనా): ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్కీపర్), అల్జరీ జోసెఫ్, ఆకాశ్దీప్, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్ పంజాబ్ తుది జట్టు (అంచనా): శిఖర్ ధవన్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, సామ్ కర్రన్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ (వికెట్కీపర్), శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్ -
రచిన్ రవీంద్ర సూపర్ క్యాచ్.. బిత్తరపోయిన ఆర్సీబీ కెప్టెన్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో సీఎస్కే ఆటగాడు రచిన్ రవీంద్ర సంచలన క్యాచ్తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్తో దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ను రవీంద్ర పెవిలియన్కు పంపాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్గా వచ్చిన డుప్లెసిస్ ఆది నుంచే సీఎస్కే బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. తొలి నాలుగు ఓవర్లలో ఫాప్ బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ ఎటాక్లోకి తీసుకువచ్చాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ రెహ్మన్ నాలుగో బంతిని డుప్లెసిస్కు ఫుల్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. డుప్లెసిస్ లాఫ్టెడ్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో డీప్లో ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్ను అందుకున్నాడు. ఇది చూసిన డుప్లెసిస్ బిత్తర పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్లో డుప్లెసిస్(35) పరుగులు చేశాడు. All Happening Here! Faf du Plessis ✅ Rajat Patidar ✅ Glenn Maxwell ✅@ChennaiIPL bounced back & in some style 👏 👏#RCB are 3 down for 42 in 6 overs! Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y#TATAIPL |… pic.twitter.com/tyBRQJDtWY — IndianPremierLeague (@IPL) March 22, 2024 -
IPL 2024: చెన్నై, ఆర్సీబీ మ్యాచ్కు ముందు వాతావరణం, పిచ్ వివరాలు
ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్ ఇవాళ (మార్చి 22) జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే), ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. అక్షయ్ కుమార్, ఏఆర్ రెహ్మాన్లచే ప్రత్యేక కార్యక్రమం.. మ్యాచ్కు ముందు సీజన్ ఆరంభ వేడుకలు జరుగనున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఈవెంట్లో బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సంగీత మాంత్రికుడు ఎఆర్ రెహ్మాన్, సింగర్ సోనూ నిగమ్ పెర్ఫార్మ్ చేయనున్నారు. సీఎస్కే నూతన కెప్టెన్గా రుతురాజ్.. లీగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. నూతన కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ కెప్టెన్ ధోని స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకుని రుతురాజ్కు బాధ్యతలు అప్పజెప్పాడు. వాతావరణం ఎలా ఉందంటే.. సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్కు వేదిక అయిన చెన్నైలో వాతావరణం ఆటకు ఆనువుగా ఉంది. వాతావరణం నుంచి మ్యాచ్కు ఎలాంటి అవాంతరాలు సంభవించవు. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం రాత్రి తేలికపాటి వర్షం పడినప్పటికీ.. ఇవాళ మ్యాచ్ జరిగే సమయంలో (7-11 గంటల మధ్యలో) వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ వేలల్లో ఉష్ణోగ్రతలు 30, 31 డిగ్రీల మధ్యలో ఉండే అవకాశం ఉంది. వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు. పిచ్ ఎవరికి అనుకూలం.. చెపాక్ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండిటికీ అనుకూలిస్తుందని చెప్పాలి. తొలుత బ్యాటర్లకు స్వర్గధామంగా కనిపించే ఈ పిచ్ క్రమంగా స్నిన్కు అనుకూలిస్తూ బౌలర్ ఫ్రెండ్లీగా మారుతుంది. ఈ పిచ్పై ఛేదన కాస్త కష్టంగానే ఉంటుంది. తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. రాత్రి వేళలో తేమ శాతం అధికమైతే స్పిన్నర్లు చెలరేగే అవకాశం ఉంటుంది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. చెపాక్ విషయానికొస్తే.. ఆర్సీబీపై సీఎస్కే సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. ఇక్కడ ఇరు జట్లు 8 మ్యాచ్ల్లో తలపడగా.. సీఎస్కే ఏకంగా ఏడు మ్యాచ్ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. అది కూడా లీగ్ ప్రారంభ ఎడిషన్ అయిన 2008లో. నాటి నుంచి ఇప్పటివరకు ఆర్సీబీ సీఎస్కేపై చెపాక్లో ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదు. తుది జట్లు (అంచనా).. సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్దీప్ -
IPL 2024: ఆర్సీబీపై సీఎస్కేదే ఆధిపత్యం.. పదహారేళ్లలో..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా మార్చి 22న జరుగనుంది. సీజన్ ఓపెనర్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. హెడ్ టు హెడ్ రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. సొంత అడ్డా చెపాక్లో ఏ జట్టుపై అయినా పట్టపగ్గాల్లేని సీఎస్కే.. ఆర్సీబీపై సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. చెపాక్ ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 8 మ్యాచ్ల్లో తలపడగా.. సీఎస్కే ఏకంగా ఏడు మ్యాచ్ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. అది కూడా లీగ్ ప్రారంభ ఎడిషన్ అయిన 2008లో. నాటి నుంచి ఇప్పటివరకు ఆర్సీబీ సీఎస్కేపై చెపాక్లో ఒక్క మ్యాచ్లో కూడా గెలిచింది లేదు. చెపాక్ పిచ్ విషయానికొస్తే.. ఈ మైదానం బ్యాటింగ్, బౌలింగ్ రెండిటికీ అనుకూలిస్తుందని చెప్పాలి. తొలుత బ్యాటర్లకు స్వర్గధామంగా కనిపించే ఈ పిచ్ క్రమంగా స్నిన్కు అనుకూలిస్తూ బౌలర్ ఫ్రెండ్లీగా మారుతుంది. ఈ పిచ్పై ఛేదన కాస్త కష్టంగానే ఉంటుంది. ఇందుకు అక్కడి వాతావరణం కూడా ఓ కారణం. వేసవికాలం రాత్రి వేళల్లో తేమ శాతం అధికంగా ఉండటంతో స్పిన్నర్లు చెలరేగే అవకాశం ఉంటుంది. తుది జట్లు (అంచనా): సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్/వికెట్కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, మతీశ పతిరణ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్దీప్ -
IPL 2024- RCB: విరాట్ కోహ్లి లేకుండానే..
IPL 2024- RCB- బెంగళూరు: ఐపీఎల్ తాజా ఎడిషన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ గురువారం ప్రీ సీజన్ క్యాంప్(శిక్షణా శిబిరం)నకు శ్రీకారం చుట్టింది. అయితే జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కాస్త ఆలస్యంగా శిబిరంలో చేరనున్నాడు. ఫ్రాంచైజీల వ్యవహారాల్ని పరిశీలిస్తున్న బీసీసీఐ ఇందుకు గల కారణాన్ని వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో ఆటకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లి త్వరలోనే జట్టుతో కలుస్తాడని తెలిపింది. కాగా.. తన భార్య అనుష్క శర్మ ప్రసవం నేపథ్యంలో కోహ్లి లండన్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు దూరమైన అతడు.. ‘ఆర్సీబీ అన్బాక్స్’ ఈవెంట్ సందర్భంగా తిరిగి అభిమానుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. కెప్టెన్ వచ్చేశాడు.. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్తో పాటు వెస్టిండీస్ స్టార్ అల్జారీ జోసెఫ్ ప్రీ సీజన్ క్యాంపులో చేరారు. ఇక ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు ఆర్సీబీ పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. కొత్త హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్, క్రికెట్ డైరెక్టర్ మో బొబట్లు జట్టుతో చేరి శిబిరాన్ని పర్యవేక్షిస్తున్నారు. సంతోషంగా ఉంది ఈ నేపథ్యంలో కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. ‘‘ఆండీ ఫ్లవర్ అద్భుతమైన వ్యక్తి. ఇలాంటి కోచ్ మార్గదర్శనంలో ముందుకు సాగడం మా జట్టు చేసుకున్న అదృష్టం. గొప్ప మనసున్న వ్యక్తి’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు. మరోవైపు ఆండీ ఫ్లవర్ సైతం ఆర్సీబీ చరిత్రలోని ఓ నూతన అధ్యాయంలో తాము కూడా భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. కాగా చెపాక్ వేదికగా మార్చి 22న ఐపీఎల్ పదిహేడో సీజన్ మొదలుకానుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ మధ్య తాజా ఎడిషన్ తొలి మ్యాచ్ జరుగనుంది. చదవండి: IPL 2024: షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్ ఆ రెండు జట్ల మధ్య! వైజాగ్లోనూ -
డుప్లెసిస్ ఊచకోత.. సూపర్ కింగ్స్ సంచలన విజయం
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో జోబర్గ్ సూపర్ కింగ్స్ క్వాలిఫియర్-2కు అర్హత సాధించింది. ఈ లీగ్లో భాగంగా బుధవారం పార్ల్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సూపర్ కింగ్స్.. క్వాలిఫియర్-2 బెర్త్ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటైంది. జో బర్గ్ బౌలర్లలో సామ్ కుక్ నాలుగు వికెట్లతో రాయల్స్ పతనాన్ని శాసించగా.. నంద్రే బర్గర్ 3, తహీర్ రెండు వికెట్లతో సత్తాచాటారు. రాయల్స్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్(47) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 139 పరుగుల లక్ష్యాన్ని సూపర్ కింగ్స్ ఒక్క వికెట్ నష్టపోయి కేవలం 13.2 ఓవర్లలో ఛేదించింది. సూపర్ కింగ్స్ ఓపెనర్లు లీస్ డుప్లే, ఫాప్ డుప్లెసిస్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. డుప్లై 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 68 పరుగులు చేయగా.. డుప్లెసిస్ 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 55 పరుగులు చేశాడు. ఫిబ్రవరి 8న జోబర్గ్ సూపర్ కింగ్స్ క్వాలిఫియర్-2లో డర్బన్ సూపర్ జెయింట్స్తో తలపడనుంది. -
టీ20 మ్యాచ్లో బ్యాటర్ల ఊచకోత.. ఏకంగా 412 పరుగులు!
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో జో బర్గ్ సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. జోహన్నెస్బర్గ్ వేదికగా డర్బన్ సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సూపర్ కింగ్స్.. ప్లే ఆఫ్ బెర్త్ను ఖారారు చేసుకుంది. కాగా ఈ మ్యాచ్లో పరుగుల వరద పారింది.ఈ మ్యాచ్లో రెండు జట్లు కలిపి ఏకంగా 412 పరుగులు చేశాయి. ఇరు జట్ల బ్యాటర్లు ఏకంగా 20 సిక్స్లు బాదారు. తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. సూపర్ జెయింట్స్ బ్యాటర్లలో జేజే స్మట్స్(55), ముల్దర్(59) హాఫ్ సెంచరీలతో సత్తచాటగా.. ఆఖరిలో క్లాసెన్(16 బంతుల్లో 40, 3 సిక్స్లు, 3 ఫోర్లు) మెరుపులు మెరిపించాడు. అనంతరం 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే నష్టపోయి ఛేదించింది. సూపర్ కింగ్స్ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్(29 బంతుల్లో 57), లూస్ డిప్లై(57) హాఫ్ సెంచరీతో సత్తాచాటారు. వీరిద్దరితో పాటు మడ్సన్(44 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సూపర్ జెయింట్స్ బౌలర్లలో నూర్ ఆహ్మద్ రెండు, ప్రిటోరియస్ ఒక్క వికెట్ పడగొట్టాడు. -
SA20, 2024: డుప్లెసిస్ ఊచకోత.. 34 బంతుల్లోనే..!
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో జోబర్గ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ విశ్వరూపం ప్రదర్శించాడు. ముంబై ఇండియన్స్ కేప్టౌన్తో జరిగిన మ్యాచ్లో 20 బంతుల్లోనే అజేయ అర్ధశతకం (4 ఫోర్లు, 3 సిక్సర్లు) బాది తన జట్టును గెలిపించాడు. ఫలితంగా సూపర్ కింగ్స్ 34 బంతుల్లోనే ఎంఐ కేప్టౌన్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించి, 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. WHAT A RUN CHASE JOBURG SUPER KINGS 🤯 🔥 JSK chases down 98 runs from just 5.4 overs - Faf Du Plessis 50*(20) & Du Plooy 41*(14) are the heroes in chase against MI Capetown in SA20 - A classic game. pic.twitter.com/XqKwrSU5Xs — Johns. (@CricCrazyJohns) January 29, 2024 వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేప్టౌన్.. కెప్టెన్ కీరన్ పోలార్డ్ (10 బంతుల్లో 33 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగడంతో 3 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. వాన్ డర్ డస్సెన్ (16), రికెల్టన్ (16 బంతుల్లో 23) రెండంకెల స్కోర్లు చేయగా.. లివింగ్స్టోన్ 3 పరుగులకే ఔటయ్యాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ 2, లిజాడ్ విలియమ్స్ ఓ వికెట్ పడగొట్టారు. JOBURG SUPER KINGS 98 RUNS FROM JUST 5.4 OVERS. 🤯 - Madness from Faf Du Plessis & Du Plooy...!!!!pic.twitter.com/M1t9aqaG0x — Johns. (@CricCrazyJohns) January 30, 2024 అనంతరం లక్ష్య ఛేదన సమయంలో వర్షం మరోసారి ఆటంకం కలిగించడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన సూపర్ కింగ్స్ లక్ష్యాన్ని 98 పరుగులకు మార్చారు. లక్ష్యం పెద్దది కావడంతో ఓపెనర్లు డుప్లెసిస్, డు ప్లూయ్ (14 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) తొలి బంతి నుంచే దూకుడుగా ఆడారు. వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సూపర్ కింగ్స్ 5.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. వరుస ఓటములతో సతమతమవుతున్న సూపర్ కింగ్స్కు ఇది ఊరట కలిగించే విజయం. -
సౌతాఫ్రికా టీ20 లీగ్.. తొలి మ్యాచ్ వర్షార్పణం
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024 ఎడిషన్కు వరుణుడు ఘన స్వాగతం పలికాడు. సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య నిన్న (జనవరి 10) జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. గతేడాది ఛాంపియన్ అయిన సన్రైజర్స్ ఈ మ్యాచ్లో ఫేవరెట్గా ఉండింది. సన్రైజర్స్కు ఎయిడెన్ మార్క్రమ్ నాయకత్వం వహిస్తుండగా.. జోబర్గ్ సూపర్ కింగ్స్ డుప్లెసిస్ కెప్టెన్గా ఉన్నాడు. సూపర్ కింగ్స్ గతేడాది సెమీఫైనల్ వరకు చేరింది. ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా టీ20 లీగ్ గత ఎడిషన్లోనే పురుడు పోసుకుంది. తొలి ఎడిషన్ ఫైనల్లో సన్రైజర్స్.. ప్రిటోరియా క్యాపిటల్స్ను ఓడించి ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌట్ కాగా.. సన్రైజర్స్ 16.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్ స్క్వాడ్: ఆడమ్ రోసింగ్టన్ (వికెట్కీపర్), ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), టెంబా బవుమా, డేవిడ్ మలాన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జన్సెన్, సైమన్ హార్మర్, టామ్ ఎబెల్, ఒట్నీల్ బార్ట్మన్, లియామ్ డాసన్, అయాబులెలా గ్కమనే, సరెల్ ఎర్వీ, ప్యాట్రిక్ క్రూగర్స్, బెయర్స్ స్వానోపోల్, ఆండీల్ సైమ్లేన్, కాలెబ్ సలేకా, జోర్డన్ హెర్మన్ జోబర్గ్ సూపర్ కింగ్స్ స్క్వాడ్: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), డోనోవన్ ఫెరీరా (వికెట్కీపర్), రీజా హెండ్రిక్స్, లీస్ డు ప్లూయ్, మొయిన్ అలీ, రొమారియో షెపర్డ్, కైల్ సిమండ్స్, గెరాల్డ్ కొయెట్జీ, లిజాడ్ విలియమ్స్, నండ్రే బర్గర్, ఇమ్రాన్ తాహిర్, వేన్ మాడ్సెన్, ఆరోన్ ఫంగిసో, డేవిడ్ వీస్, డయ్యన్ గేలియం, సిబోనెలో మఖాన్యా, జహీర్ ఖాన్, సామ్ కుక్, రోనన్ హెర్మాన్ -
అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ.. సంకేతాలు ఇచ్చిన దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్, ఆ జట్టు మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వడంపై సంకేతాలు ఇచ్చాడు. వచ్చే ఏడాది (2024) జరగనున్న టీ20 ప్రపంచకప్లో పునరాగమనాన్ని పరిశీలిస్తున్నట్లు ఫాఫ్ స్వయంగా వెల్లడించాడు. ఈ విషయమై దక్షిణాఫ్రికా వైట్ బాల్ కోచ్ రాబ్ వాల్టర్తో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నాడు. తాను అంతర్జాతీయ క్రికెట్కు తిరిగి రాగలనని నమ్ముతున్నానని తెలిపాడు. తన పునరాగమనంపై గత రెండేళ్లుగా చర్చలు జరుగుతున్నాయని.. టీ20 ప్రపంచకప్ సమయానికి జట్టు సమతూకం విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని అన్నాడు. ప్రస్తుతం అబుదాబి టీ10 లీగ్లో ఆడుతున్న ఫాఫ్ అంతర్జాతీయ క్రికెట్లోకి రీంట్రీ ఇచ్చే అంశాన్ని తనే ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. 39 ఏళ్ల ఫాఫ్ ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్లో భీకర ఫామ్లో ఉండిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో అతను శుభ్మన్ గిల్ తర్వాత లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ సీజన్లో అతను 14 ఇన్నింగ్స్ల్లో 730 పరుగులు చేశాడు. ఫాఫ్ తన చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ను 2020 చివర్లో ఆడాడు. అప్పటినుంచి అతను లీగ్ క్రికెట్కు మాత్రమే పరిమితమయ్యాడు. ఫాఫ్ను టీ20 జట్టులో చేర్చుకోవాలని కొత్తగా ఎంపికైన పరిమత ఓవర్ల కోచ్ రాబ్ వాల్టర్ క్రికెట్ సౌతాఫ్రికాపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది. ఫాఫ్ ఫిట్నెస్ పరంగానూ, టెక్నికల్గానూ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాడని వాల్డర్ నమ్ముతున్నాడు. రీఎంట్రీ విషయమై వాల్టర్ మరో దిగ్గజ బ్యాటర్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. రీఎంట్రీ ఇచ్చేందుకు డుప్లెసిస్కు ఆసక్తి ఉన్నా క్రికెట్ సౌతాఫ్రికా అతన్ని అనుమతిస్తుందో లేదో వేచి చూడాలి. ఇదిలా ఉంటే, మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ల కోసం భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లు డిసెంబర్ 10 నుంచి మొదలవుతాయి. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ల కోసం ఇరు జట్లను ఇదివరకే ప్రకటించారు. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ తొలుత టీ20 సిరీస్ ఆడుతుంది. తొలి మ్యాచ్ డర్బన్ వేదికగా డిసెంబర్ 10న జరుగుతుంది. -
IPL 2024: ఆర్సీబీలో భారీ ప్రక్షాళన.. స్టార్ ఆటగాళ్లకు షాక్.. లక్కీ డీకే
ఐపీఎల్ 2024 సీజన్కు ముందు ఆర్సీబీ ఫ్రాంచైజీ భారీ ప్రక్షాళనకు దిగింది. ఆ జట్టు హాజిల్వుడ్, హసరంగ, హర్షల్ పటేల్, బ్రేస్వెల్, పార్నెల్ లాంటి స్టార్లను సైతం వేలానికి వదిలేసింది. అయితే ఆ జట్టు ఎవరూ ఊహించని విధంగా దినేశ్ కార్తీక్ను కొనసాగించింది. కెప్టెన్గా డుప్లెసిస్ను కొనసాగించిన ఆర్సీబీ.. కెమారూన్ గ్రీన్ను ముంబై ఇండియన్స్ను నుంచి ట్రేడింగ్ చేసుకుంది. విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్వెల్ లాంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉండనే ఉన్నారు. ఆర్సీబీ రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే.. వనిందు హసరంగ హర్షల్ పటేల్ జోష్ హాజిల్వుడ్ ఫిన్ అలెన్ మైఖేల్ బ్రేస్వెల్ డేవిడ్ విల్లే వేన్ పార్నెల్ సోనూ యాదవ్ అవినాశ్ సింగ్ సిద్దార్థ్ కౌల్ కేదార్ జాదవ్ ఆర్సీబీ కొనసాగించనున్న ఆటగాళ్లు వీరే.. ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్) గ్లెన్ మ్యాక్స్వెల్ విరాట్ కోహ్లి రజత్ పాటిదార్ అనూజ్ రావత్ దినేశ్ కార్తీక్ సుయాశ్ ప్రభుదేశాయ్ విల్ జాక్స్ మహిపాల్ లోమ్రార్ కర్ణ్ శర్మ మనోజ్ భండగే కెమరూన్ గ్రీన్ (ముంబై నుంచి ట్రేడింగ్) మయాంక్ డాగర్ (ఎస్ఆర్హెచ్ నుంచి ట్రేడింగ్) వైశాఖ్ విజయ్ కుమార్ ఆకాశ్ దీప్ మొహమ్మద్ సిరాజ్ రీస్ టాప్లే హిమాన్షు శర్మ రజన్ కుమార్ -
అప్పుడలా! ఈసారి మాత్రం వరల్డ్కప్ ట్రోఫీ మాదే: సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్
అప్పటి దాకా అదరగొట్టడం... అభిమానుల్లో అంచనాలు పెంచేయడం... మేజర్ ఈవెంట్లలో కీలక సమయంలో చేతులెత్తేయడం.. కనీసం ఫైనల్ కూడా చేరలేక చతికిలపడటం.. మీరు ఊహించిన పేరు నిజమే! ఈ ప్రస్తావన సౌతాఫ్రికా గురించే! 1992 నుంచి వరల్డ్కప్ టోర్నీలో పోటీపడుతున్న దక్షిణాఫ్రికా ఇంత వరకు ఒక్క వన్డే ట్రోఫీ కూడా గెలవలేదు. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లలో విజయం అంచులదాకా వెళ్లి బోల్తా పడటం.. ‘చోకర్స్’ అనే ‘నామధేయం’ తమకు సరిగ్గా సరిపోతుందని మళ్లీ మళ్లీ నిరూపించుకోవడం ప్రొటిస్కు బాగా అలవాటు. ఈసారి ట్రోఫీ గెలుస్తాం అయితే, ఈసారి ఆ అపఖ్యాతిని కచ్చితంగా చెరిపేసుకుంటాం అంటున్నాడు సౌతాఫ్రికా స్పీడ్స్టర్ కగిసో రబడ. ప్రపంచకప్ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా భారత్లో బరిలోకి దిగుతామని పేర్కొన్నాడు. ఇప్పటి వరకు జరగనిది.. ఇప్పుడు చేసి చూపిస్తామంటూ ధీమా వ్యక్తం చేశాడు. ప్రొటిస్ పేస్ దళానికి నాయకత్వం వహిస్తున్న 28 ఏళ్ల రబడ ఈ మేరకు మాట్లాడుతూ.. ‘‘సౌతాఫ్రికా క్రికెట్ గురించి బయట నడుస్తున్న డ్రామా, చర్చల గురించి మేము అస్సలు పట్టించుకోము. నిజమే ప్రపంచకప్ టోర్నీల్లో ఆడుతూ.. ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోతే ఎలా ఉంటుందో తెలుసు. ప్రతి క్రికెటర్ కల అదే! తీవ్రమైన నిరాశ కలుగుతుంది కదా! ఈ విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈసారి దానిని సాధ్యం చేసి చూపించాలని నేను... మేమంతా బలంగా కోరుకుంటున్నాం. వరల్డ్కప్ ట్రోఫీ గెలవడం ఎవరికైనా ఇష్టమే కదా! ప్రతి ఒక్క క్రికెటర్ కల అదే! ఒక్కసారి జట్టును ప్రకటిస్తే.. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే చూస్తారు’’ అంటూ ఆత్మవిశ్వాసం ప్రదర్శించాడు. కాగా ఇప్పటి వరకు నాలుగుసార్లు వరల్డ్కప్ సెమీస్ వరకు చేరుకున్న సౌతాఫ్రికా ఒక్కసారి కూడా ముందడుగు వేయలేకపోయింది. అప్పుడలా.. ఆఖరిగా.. 2019 వరల్డ్కప్లో మాంచెస్టర్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 10 పరుగుల తేడాతో గెలిచి.. విజయంతో టోర్నీని ముగించింది. అయితే, ఈసారైనా కప్ గెలుస్తారంటూ.. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు మాత్రం ఫాఫ్ డుప్లెసిస్ బృందం నిరాశనే మిగిల్చింది. ఇదిలా ఉంటే.. భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్కప్ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే! చదవండి: టీమిండియా క్యాప్ అందుకోవడం ఈజీ అయిపోయింది.. అదే జరిగితే బుమ్రా అవుట్! -
ఐపీఎల్లో ఓ వెలుగు వెలిగిన స్టార్ క్రికెటర్
-
ఐపీఎల్లో ఓ వెలుగు వెలిగిన స్టార్ క్రికెటర్, అక్కడ మాత్రం దయనీయ స్థితిలో..!
ఈ ఏడాది (2023) ఐపీఎల్లో, అంతకుముందు జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్లో మెరుపులు మెరిపించిన సౌతాఫ్రికన్ లెజెండ్ ఫాఫ్ డుప్లెసిస్ ప్రస్తుతం అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) ఇనాగురల్ ఎడిషన్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఎంఎల్సీ-2023లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన డుప్లెసిస్.. తన క్రికెటింగ్ కెరీర్లోకెళ్లా అత్యంత దారుణమైన గణాంకాలు నమోదు చేశాడు. 7 ఇన్నింగ్స్ల్లో 6.57 సగటున 85.18 స్ట్రయిక్రేట్తో కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. లీగ్ క్రికెట్లో ఘన చరిత్ర కలిగిన డప్లెసిస్.. తన 13 ఏళ్ల కెరీర్లో ఇప్పటివరకు ఏ లీగ్లోనూ ఇంత పేలవ ప్రదర్శన కనబర్చలేదు. డుప్లెసిస్ వరుస వైఫల్యాల నేపథ్యంలో అతని ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీ ఆందోళన చెందుతుంది. ఆ జట్టు అభిమానుల బాధ వర్ణణాతీతంగా ఉంది. డుప్లెసిస్ వచ్చే సీజన్లో ఎలాగైనా తమకు ఐపీఎల్ టైటిల్ సాధించిపెడతాడని గంపెడాశలు పెట్టుకున్న ఆర్సీబీ అభిమానులు.. ఫాఫ్ దయనీయ పరిస్థితి చూసి కుమిలిపోతున్నారు. ఇలాగైతే 2024లో కూడా తాము టైటిల్ గెలిచినట్లే అని తలలుపట్టుకుంటున్నారు. ఎంఎల్సీలో చెన్నై సూపర్ కింగ్స్ అనుబంధ ఫ్రాంచైజీ అయిన టెక్సాస్ సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన డుప్లెసిస్.. ముంబై ఇండియన్స్ న్యూయార్క్తో జరిగిన ఆఖరి మ్యాచ్లో 9 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ఆ మ్యాచ్లో సూపర్ కింగ్స్.. ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి లీగ్ నుంచి నిష్క్రమించింది. భారతకాలమానం రేపు (జులై 31) జరుగబోయే ఫైనల్లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్.. సియాటిల్ ఆర్కాస్ను ఢీకొంటుంది. కాగా, టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి, పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కొనసాగుతున్న డుప్లెసిస్.. ఎంఎల్సీ మినహాయించి ఈ ఏడాది టీ20 లీగ్ల్లో మెరుపులు మెరిపించిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో 14 మ్యాచ్లు ఆడిన అతను.. 56.15 సగటున, 153.68 స్ట్రయిక్ రేట్తో 730 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా టీ20 లీగ్లో 11 మ్యాచ్ల్లో 41 సగటున, 147.60 స్ట్రయిక్రేట్తో 369 పరుగులు చేశాడు. -
నిప్పులు చెరిగిన పార్నెల్.. కుప్పకూలిన సూపర్ కింగ్స్
అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ ఆరంభ ఎడిషన్లో సీయాటిల్ ఆర్కాస్ ఫ్రాంచైజీ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆ జట్టు సీజన్లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. టెక్సాస్ సూపర్ కింగ్స్తో ఇవాళ (జులై 22) జరిగిన మ్యాచ్లో ఆర్కాస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టు కెప్టెన్ వేన్ పార్నెల్ నిప్పులు చెరగడంతో (5/20) తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 127 పరుగులకే కుప్పకూలింది. పార్నెల్.. సూపర్ కింగ్స్ పతనాన్ని శాసించగా, ఆండ్రూ టై (2/15), ఇమాద్ వసీం (1/25), గానన్ (1/30) మిగతా పనిని పూర్తి చేశారు. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్లో డ్వేన్ బ్రేవో (39) టాప్ స్కోరర్గా నిలువగా..డేనియల్ సామ్స్ (26), కోడీ చెట్టి (22), డుప్లెసిస్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఔటై డెవాన్ కాన్వే (0) నిరాశపర్చగా.. డేవిడ్ మిల్లర్ (8), మిచెల్ సాంట్నర్ (2) దారుణంగా విఫలమయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్కాస్.. 16 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (53) అర్ధసెంచరీతో రాణించగా.. హెన్రిచ్ క్లాసెన్ (21 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్తో మెరిశాడు. ఆర్కాస్ కోల్పోయిన రెండు వికెట్లలో ఒకటి సాంట్నర్, మరొకటి మొహమ్మద్ మొహిసిన్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో ఆర్కాస్ టేబుల్ టాపర్గా (3 మ్యాచ్ల్లో 3 విజయాలు) నిలువగా.. 4 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించిన సూపర్ కింగ్స్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వాషింగ్టన్ ఫ్రీడం (3 మ్యాచ్ల్లో 2 విజయాలు), శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్ (3 మ్యాచ్ల్లో 2 విజయాలు), ముంబై ఇండియన్స్ న్యూయార్క్ (3 మ్యాచ్ల్లో ఓ విజయం), లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్ (4 మ్యాచ్ల్లో 4 పరాజయాలు) వరుసగా 3 నుంచి 6 స్థానాల్లో ఉన్నాయి.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
డిప్యూటీ సీఎంను చేసి పిఠాపురానికి పంపుతా
"గీతమ్మను గెలిపిస్తే.." పిఠాపురం ప్రజలకి బంపర్ ఆఫర్
మీడియాకు థ్యాంక్స్ చెప్పిన కేరళ గవర్నర్.. ఎందుకంటే?
బాలయ్య బాబు కి బలమైన కౌంటర్లు పిఠాపురం సాక్షిగా దత్తపుత్రుడి పరువు..!
గీతమ్మను, సునీల్ ను ఆశీర్వదించండి..
పిఠాపురంలో దత్తపుత్రుడిపై సీఎం జగన్ పవర్ పంచ్..
కుందనపు బొమ్మలా ప్రియాంకా జైన్ ఫొటోలు
పొరపాటున గెలిస్తే పవన్ కుబుసం విడిచి కాట్లు వేస్తాడు..!
పిఠాపురం: సీఎం జగన్ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)
గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
తప్పక చదవండి
- గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
- బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
- ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- బాబును సీఎం చేసేందుకే ఈ లేనిపోని పెంట వార్తలు: పోసాని
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement