-
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి శామ్ పిట్రోడా బుధవారం(మే8) సాయంత్రం రాజీనామా చేశారు. పిట్రోడా రాజీనామా చేసిన వెంటనే పార్టీ దానిని ఆమోదించింది. భారత్లోని వివిధ ప్రాంతాల వారి శరీర రంగులపై పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా ఉంటారనడంపై దుమారం రేగింది. పిట్రోడా వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. పిట్రోడా వ్యాఖ్యలను ప్రధాని మోదీ కూడా ఎన్నికల ప్రచార సభలో ప్రస్తావించడంతో వివాదం పెద్ద దైంది. మొత్తం వ్యవహారం పిట్రోడా రాజీనామాతో క్లైమాక్స్కు చేరింది. -
జేపీ నడ్డాకు పోలీసుల సమన్లు
బెంగళూరు: రిజర్వేషన్లపై సోషల్ మీడియలో అభ్యంతరకర పోస్టు పెట్టిన కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్యాకు బెంగళూరు పోలీసులు సమన్లు జారీ చేశారు. అభ్యంతరకర పోస్టు పెట్టిన కేసులో తమ ముందు విచారణకు హాజరవ్వాలని సమన్లలో కోరారు. కాగా, ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో సర్క్యులేట్ చేసిన కేసులో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి కూడా ఢిల్లీ పోలీసులు సమన్లు ఇవ్వగా ఆయన తన రాతపూర్వక సమాధానాన్ని న్యాయవాది ద్వారా పంపారు. -
ఓటు హైజాక్ అయ్యిందా? సవాలు చేయండి..
మీ ఓటును వేరేవాళ్లు వేసేశారా? ఏం ఫర్వాలేదు. నేనే అసలైన ఓటరును అని సవాలు చేయండి. టెండర్ ఓటేయవచ్చు!ఎన్నికల్లో ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లే సరికి మీ ఓటు వేరేవారు వేసేశారా? అయితే దిగులుపడాల్సిన అవసరం లేదు. మీకు టెండర్ ఓటు వేసే హక్కును ఎన్నికల సంఘం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) ద్వారా కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటేసే అవకాశం కల్పిస్తారు. టెండర్ బ్యాలెట్ ఓటర్ల వివరాలను ప్రిసైడింగ్ అధికారులు ఫారం–17బీలో రికార్డు చేస్తారు.ఈ ఫారంలోని 5వ కాలమ్లో ఓటరు సంతకం/వేలి ముద్రను తీసుకున్న తర్వాత వారికి బ్యాలెట్ పత్రం అందజేస్తారు. ప్రత్యేక ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ఓటరు బ్యాలెట్ పత్రాన్ని తీసుకెళ్లి తాము ఓటెయదలచిన అభ్యర్థికి చెందిన ఎన్నికల గుర్తుపై స్వస్తిక్ ముద్రను వేయాల్సి ఉంటుంది. ఓటేవరికి వేశారో బయటకు కనబడని విధంగా బ్యాలెట్ పత్రాన్ని మడిచి కంపార్ట్మెంట్ బయటకి వచ్చి ప్రిసైడింగ్ అధికారికి అందజేయాలి. ఆ బ్యాలెట్ పత్రాన్ని టెండర్ ఓటుగా ప్రిసైడింగ్ అధికారి మార్క్ చేసి ప్రత్యేక ఎన్వలప్లో వేరుగా ఉంచుతారు. చాలెంజ్ ఓటు అంటే ..? ఓటేసేందుకు వచ్చిన వ్యక్తి గుర్తింపును అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు రెండు రూపాయలు చెల్లించి సవాలు చేయవచ్చు. ఓటరు గుర్తింపును నిర్ధారించడానికి ప్రిసైడింగ్ అధికారి విచారణ జరుపుతారు. ఓటరు గుర్తింపు నిర్ధారణ జరిగితే ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు. దొంగ ఓటరు అని నిర్ధారణ అయితే సదరు వ్యక్తిని ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు అప్పగించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అనుచితంగా ప్రవర్తిస్తే గెంటివేతే...పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రంలో అనుచితంగా ప్రవర్తించిన లేదా చట్టపర ఆజ్ఞలను పాటించడంలో విఫలమైన వ్యక్తులను ప్రిసైడింగ్ అధికారి బయటకు పంపించవచ్చు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 132 కింద ఈ మేరకు అధికారాలు ప్రిసైడింగ్ అధికారికి ఉన్నాయి. మద్యం లేదా మాదక ద్రవ్యాల మత్తులో ఉన్న వారు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు కానీ... విచక్షణ కోల్పోయి పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించే వ్యక్తులను మాత్రం పోలీసుల సహాయంతో బయటకు పంపించేందుకు నిబంధనలు అనుమతిస్తాయి. -
బీజేపీ ‘ప్యూన్’ వ్యాఖ్యలు.. స్పందించిన అమేథీ అభ్యర్థి
లక్నో: కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార స్పీడ్ను పెంచింది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట స్థానమైన అమేథీ స్థానంలో పోటీ చేస్తున్న కిషోరి లాల్ శర్మ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అమేథీలో రాహుల్ గాంధీ గెలవాలనుకుంటే? కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికి చెందిన ‘ప్యూన్’ను బరిలోకి దించిందని కిషోరి లాల్ను ఉద్దేశించి బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై మరోసారి కిశోరి లాల్ శర్మ స్పందించారు.‘ఇటువంటి వ్యాఖ్యలు వారి నీచమైన విలువకు నిదర్శనం, నా తండ్రి నిరక్షరాస్యుడు. అయినా నా తండ్రి ఎన్నో విలువు నేర్పుతూ పెంచారు. వారి మాటలను నేను ఎక్కువగా స్పందించలేను. ఆ వాఖ్యలను వారికే వదిలేస్తున్నా’అని కిషోరి లాల్ అన్నారు.‘ఈసారి కాంగ్రెస్ నాయకత్వం నాకు ఇచ్చిన బాధత్య చాలా భిన్నమైంది. నేను గతంలో లాగానే ఉన్నా. అయితే పార్టీ అధిష్టానం నిర్ణయాల మేరకు పనిచేస్తా. అమేథీ సెగ్మెంట్ గాంధీ కుటుంబానికి కంచుకోట స్థానం. ఇప్పటీకి ఏదైనా అవకాశం ఉంటే.. ఇక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పోటీ చేయాలి కోరుకుంటా’అని కిషోరి లాల్ తెలిపారు.కాంగ్రెస్కు కంచుకోట స్థానాలైన అమేథీ, రాయ్బరేలీ స్థానాల్లో గెలుపు కోసం ప్రియాంకా గాంధీ అన్నీ ప్రచారం చేస్తోంది. మారథాన్ సమావేశాలు నిర్వహించి.. పార్టీ నేతలు, కార్యకర్తలను ఒక్కతాటిపైకి తీసుకువస్తోంది. పోలింగ్ సమయం వరకు ఈ రెండు స్థానాల్లో ప్రచారాన్ని ఉధృతం చేయాలని ప్రియాంకా గాంధీ సోమవారం నుంచి కార్యకర్తలతో సమావేశాల్లో పాల్గొంటూ దిశా నిర్దేశం చేస్తున్నారు.అమేథి స్థానంలో 3 సార్లు గెలిచిన రాహుల్ గాంధీ 2019లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. మరోస్థానం కేరళలోని వాయ్నాడ్లో గెలుపొందారు. ఈసారి వాయ్నాడ్తో పాటు బార్బరేలీ స్థానంలో రాహుల్ గాంధీ బరిలోకి దిగారు. వాయ్నాడ్ పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. -
పాక్తో రాహుల్కు సంబంధం ఏంటి: స్మృతి ఇరానీ
లక్నో: పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ ప్రశంసల అంశంపై స్పందిసస్తూ.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. మంగళవారం ఓ ర్యాలీలో పాల్గొన్న స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. అమెథీలో ప్రస్తుతం ఏకే 203 రైఫిల్స్ ఫ్యాక్టరీ ఉందని అన్నారు. వాటిని ఉపయోంగించి దేశ సరిహద్దుల వద్ద పాకిస్తాన్ ఉగ్రవాదలను అంతం చేస్తామని తెలిపారు.‘‘పాక్ మాజీ మంత్రి ఆయన దేశం గురించి ఆందోళన పడాలి కానీ, అమేథీ కోసం కాదు. లోక్సభ ఎన్నికల్లో నేను కాంగ్రెస్ నేతతో పోటీ పడుతుంటే.. పాకిస్తాన్ నేత మాత్రం నన్ను ఓడించాలంటున్నారు. పాకిస్తాన్ను పాలించటం చేతకాని వాళ్లు.. అమేథీ గురించి ఆందోళన పడుతున్నారు.నా మాటలు పాక్ మంత్రికి చేరితే.. నేను ఒక్కటి చెప్పదల్చుకున్నా. అమేథీలో ప్రధాని మోదీ ఏకే 203 రైఫిల్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. వాటితో హరిహద్దుల్లో పాక్ ఉగ్రవాదులను అంతం చేస్తాం’’ అని స్మృతి ఇరానీ అన్నారు. పాకిస్తాన్ మాజీ మంత్రి వ్యాఖ్యల రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పాకిస్తాన్తో రాహుల్ గాంధీకి ఉన్న సంబంధం ఏంటని నిలిదీశారు. భారత్లో ఎన్నికలు జరుగుతుంటే కాంగ్రెస్ నేతలు పొరుగు దేశాల మద్దతు కోరుతున్నారని విమర్శించారు. అమేథీలో స్మృతి ఇరానీకి పోటీగా కాంగ్రెస్ పార్టీ కిషోరి లాల్ సింగ్ను బరిలోకి దించిన విషయం తెలిసిందే. -
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
దేశంలోని పేదలలో హిందువులు, క్రైస్తవులు, పార్సీలు అందరూ ఉన్నారని. అందరూ రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందాలని ప్రధాని అన్నారు. అయితే మత ప్రతిపాదికన కాంగ్రెస్ ఒక వర్గానికి మాత్రమే రిజర్వేషన్ కట్టబెట్టేలాని చూస్తున్నట్లు ఆరోపించారు. దీనిపైన కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మాట్లాడుతూ.. మేము భారత రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటామని పేర్కొన్నారు. మత ప్రతిపాదికన రిజర్వేషన్లను కల్పించడాన్ని రాజ్యాంగం కూడా ఒప్పుకోదని అన్నారు. దీని ప్రకారమే మేము మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా పేర్కొన్నామని అన్నారు.రిజర్వేషన్స్ గురించి మాత్రమే కాకుండా.. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేయడం మీద కూడా పవన్ ఖేరా స్పందించారు. కేజ్రీవాల్కు తప్పకుండా న్యాయం జరుగుతుందని తాము ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.#WATCH | Congress leader Pawan Khera says, "As far as we are concerned, there is no controversy at all, we go by the Constitution of India and the Constitution of India does not allow reservations based on religion. Our manifesto is very clear..." pic.twitter.com/R1h3GkvwXM— ANI (@ANI) May 7, 2024 -
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
సాక్షి,కామారెడ్డి: సీఎం రేవంత్ కామారెడ్డి జిల్లాను తీసేయాలని చూస్తున్నాడని, కామారెడ్డి జిల్లా ఉండాలంటే జహీరాబాద్ ఎంపీ సీటు బీఆర్ఎస్ గెలవాలని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం(మే7) కామారెడ్డి జేపీఎన్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్షోలో కేసీఆర్ మాట్లాడారు. ’తెలంగాణకు మోది చేసింది ఏమీ లేదు. బీజేపీ పరిపాలనలో తెలంగాణకు ఎలాంటి న్యాయం జరగలేదు. బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ. బీజేపీ మత విద్వేషాలతో ప్రజల మధ్య చిచ్చు పెడుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన హమీలు నేరేవేర్చే స్దితిలో లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలొ ఎక్కడా చూసినా కరెంట్ కోతలు. వరి బోనస్ ...బోగస్గా మారింది.అసమర్దులు రాష్ట్రాన్ని ఏలుతున్నారు. ఇచ్చిన హమీలు నేరవేర్చడం లేదు. కాంగ్రెస్ పాలనలో ఐదు నెలలకే రాష్ట్రం ఆగమైపోయింది. బీఅర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలన్నింటిని రద్దు చేశారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే’నని కేసీఆర్ స్పష్టం చేశారు. -
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
బెంగళూరు: సంచలనం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్య వీడియోలపై జేడీఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. అభ్యంతరకర వీడియోలున్న 25 వేల పెన్డ్రైవ్లను పంచడం వెనుక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉన్నారని మండిపడ్డారు. తొలుత ఏప్రిల్ 21న బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో ఒక పెన్డ్రైవ్ను రిలీజ్ చేశారన్నారు. వాట్సాప్ ఛానల్ సృష్టించి మరీ వీడియోలు కావాల్సిన వారు ఛానల్ను ఫాలో అవ్వాలని కోరారని చెప్పారు. దీనిపై ఏప్రిల్ 22న తమ పార్టీ పోలింగ్ ఏజెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశాడన్నారు. సిట్తో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదన్నారు. తప్పు చేసిన వారికి చట్టం ప్రకారం పడాల్సిందేనని స్పష్టం చేశారు. వీడియోలు పంచినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పోలీసు అధికారుల సాయంతోనే పెన్డ్రైవ్లను పంచినట్లు తమకు సమాచారం ఉందన్నారు. జేడీఎస్ ఎంపీ అభ్యర్థులు ముగ్గురు ఓడిపోతారన్న సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు గుర్తొస్తే ఇప్పడు అనుమానం వేస్తోందన్నారు. -
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
హర్యానా: లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. హర్యానాలో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మంగళవారం తమ మద్దతును ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు.ఎమ్మెల్యేలు సోంబీర్ సంగ్వాన్, రణధీర్ గొల్లెన్, ధరంపాల్ గొండర్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడం వల్ల.. బీజేపీకి తమ మద్దతు ఇవ్వబోమని పేర్కొన్నారు.హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్ సమక్షంలో రోహ్తక్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఈ విషయాన్ని ప్రకటించారు. రైతుల సమస్యలతో పాటు, ఇతర సమస్యలపై పోరాటడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారు స్పష్టం చేశారు.#WATCH | Rohtak | Independent MLA from Haryana, Randhir Golan withdraws support from the Haryana govt, he says, "For the last 4.5 years, we extended support to the BJP. Today unemployment and inflation are at their highest. Looking at this, we have withdrawn our support (from the… pic.twitter.com/lNqo1NWobw— ANI (@ANI) May 7, 2024 -
సోనియా గాంధీ భావోద్వేగ సందేశం.. వీడియో వైరల్
ఢిల్లీ: ఈ రోజు మూడోదశ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ తరుణంలో సోనియా గాంధీ ఓటర్లకు ఉద్వేగభరితమైన సందేశాన్ని వినిపించారు. దీనికి సంబంధించిన వీడియో కాంగ్రెస్ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో తెగ వైరల్ అవుతోంది.మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి.. నిరుద్యోగం, మహిళలపై నేరాలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలపై వివక్ష తారాస్థాయికి చేరింది. ఇవన్నీ ప్రధాని మోదీ, బీజేపీ నుంచి ఉత్పన్నమయ్యాయి. మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోంది. పేదలు వెనుకబడి ఉండటం నాలో వేదనను నింపుతోందని వీడియోలో సోనియా గాంధీ వెల్లడించారు.ఈ రోజు నేను మరోసారి మీ మద్దతును కోరుతున్నాను. కాంగ్రెస్ హామీల ప్రధాన ఉద్దేశ్యం దేశాన్ని ఏకం చేయడం. భారతదేశంలోని పేదలు, యువత, మహిళలు, రైతులు, కార్మికులు, వెనుకబడిన వర్గాల కోసం పని చేయడం కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది.మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. అబద్ధపు ప్రతిపాదకులను తిరస్కరించండి. అందరికీ ఉజ్వలమైన, సమానమైన భవిష్యత్తు కోసం కాంగ్రెస్కు ఓటు వేయండి. హ్యాండ్ బటన్ను నొక్కండి. అందరి సహకారంతో మరింత ఐక్యమైన భారతదేశాన్ని నిర్మిస్తాం అని సోనియాగాంధీ వీడియోలో భావోద్వేగమైన ప్రసంగం చేశారు.My dear brothers and sisters,Youth unemployment, crimes against women, and discrimination against Dalits, Adivasis, and minorities have reached unprecedented levels. These challenges stem from the ‘niyat’ and ‘niti’ of PM Modi and the BJP which aim for power rejecting… pic.twitter.com/4npHwd8DNW— Congress (@INCIndia) May 7, 2024 -
తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
సాక్షి,హైదరాబాద్: అయిదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతు బంధు నిధులు విడుదలచేయడంపై ఎన్నికల కమిషన్(ఈసీ ఆంక్షలు విధించింది. లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలని ఈసీ ఆదేశించింది. రైతు బంధుపై ఈసీకి ఎన్.వేణు కుమార్ అనే వ్యకి ఫిర్యాదు చేశారు. రైతు బంధు చెల్లింపులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఈసీ రైతుబంధు నిధుల పంపిణీకి బ్రేకులు వేసింది. -
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
భోపాల్: బీజేపీకి 400 సీట్లు ఎందుకు రావాలనేదానిపై ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చారు. ఆర్టికల్ 370ని కాంగ్రెస్ తిరిగి తీసుకురాకుండా ఉండాలంటే, అయోధ్య రామమందిరానికి బాబ్రీ తాళం పడకుండా ఉండటానికి బీజేపీకి ఈ ఎన్నికల్లో 400 సీట్లు రావాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నట్లుగా రాజ్యాంగాన్ని మార్చడానికి తమకు 400 సీట్లు కావాలని అడగడం లేదన్నారు.మధ్యప్రదేశ్లోని థార్లో మంగళవారం(మే7)జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. పార్లమెంట్లో తమకు ఇప్పటికే 400 సీట్లు ఉండటం వల్లే ఆర్టికల్ 370ని రద్దు చేయగలిగామన్నారు. మొదటి దశ లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఓడిపోయాయని, రెండవ దశలో అవి ఏకంగా నామరూపాలు లేకుండా పోయాయన్నారు. మూడవ దశలో మిగిలిందేమైనా ఉంటే తుడిచిపెట్టుకుపోయిందని మోదీ ఎద్దేవా చేశారు. -
బీజేపీపై డింపుల్ యాదవ్ కీలక వ్యాఖ్యలు: పదేళ్లలో..
లక్నో: దేశంలో మూడోదశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటుహక్కును సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా.. రాజకీయ నాయకులు, సినీ తారలు, వ్యాపారవేత్తలు అందరూ ఉపయోగించుకుంటున్నారు. ఈ తరుణంలో ఉత్తరప్రదేశ్లోని సైఫాయ్లో ఓటు వేసిన తర్వాత, సమాజ్వాదీ పార్టీ ఎంపీ.. మెయిన్పురి అభ్యర్థి డింపుల్ యాదవ్ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు.ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలపై బీజేపీని ఉద్దేశించి డింపుల్ యాదవ్ వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీలో భారీ లోపం ఉందని ఆమె ఆరోపించారు. అంతే కాకుండా బీజేపీ ప్రతి వర్గాల ప్రజలు నిర్లక్ష్యంగా భావిస్తున్నారని అన్నారు. బీజేపీ హయాంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ నిరంతరం పడిపోతోంది అన్నారు.10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ఏ పనీ చేయలేకపోయిందని, ప్రభుత్వం తన వైఫల్యాన్ని దేశం మొత్తంలో వ్యాపింపజేసిందని డింపుల్ యాదవ్ పేర్కొన్నారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వం మీద కోపంతో ఉన్నారని అన్నారు. రాజకీయ భావజాలం, రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడాల్సిన అవసరం ఇప్పుడు చాలా అవసరమని అన్నారు. -
ముస్లిం సమాజం మారాలి: ప్రధాని మోదీ విజ్ఞప్తి
ఢిల్లీ: భారతదేశంలో రాజకీయ వేడి రోజురోజుకి పెరుగుతోంది. ఏప్రిల్ 22న రాజస్థాన్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ చేసిన 'చొరబాటుదారుల' వ్యాఖ్యపై.. ఇటు బీజేపీ, అటు ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎట్టకేలకు దీనిపైన ప్రధాని ఓ స్పష్టమైన వివరణ ఇచ్చారు.తాను ముస్లింలకు లేదా ఇస్లాంకు వ్యతిరేకం కాదని, ఆత్మపరిశీలన చేసుకోవాలని, భవిష్యత్తు గురించి ఆలోచించాలని ముస్లిం సమాజాన్ని ప్రధాని మోదీ కోరారు. దీనికి సంబంధించిన వీడియోను మోదీ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.ఈ వీడియోలో.. మేము ముస్లిం లేదా ఇస్లాంకు వ్యతిరేకం కాదు. అది మా పని కాదు. ముస్లిం సమాజం ప్రతిదీ అర్థం చేసుకుంటుంది. ట్రిపుల్ తలాక్ సంప్రదాయాన్ని ముగించినప్పుడు, ఆయుష్మాన్ కార్డు ఇచ్చినప్పుడు లేదా కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు, ముస్లిం సోదరీమణులు మమ్మల్ని నిజమైన మనుషులుగా భావించారు. మేము ఎవరిమీదా వివక్ష చూపమని మోదీ స్పష్టం చేశారు.ముస్లిం సమాజం, వారి విద్యావంతులైన సభ్యులు ఆత్మపరిశీలన చేసుకోవాలని మోదీ కోరారు. దేశం ముందుకు సాగుతోంది. మీ సంఘం వెనుకబడి ఉంటే, దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందారా? అని మోదీ అన్నారు. ఎవరిని అధికారంలో పెట్టాలి, ఎవరిని తొలగించాలి అని ఆలోచిస్తూ.. మీరు మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సమాజం మారుతోంది. మీరు కూడా మారాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు.భవిష్యత్తు గురించి ఆలోచించు. భయాందోళనతో కూడిన వాతావరణంలో ఏ సమాజమూ బానిస జీవితాన్ని గడపాలని నేను కోరుకోవడం లేదుని ముస్లిం సమాజాన్ని ప్రధాని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని, దానిని అగౌరవపరిచే వారికి ఏమీ మాట్లాడే హక్కు లేదని ఆరోపించారు.पहली बार, मैं मुस्लिम समुदाय से आत्ममंथन करने को कह रहा हूं। आप यह सोचते रहेंगे कि सत्ता में किसे बिठाएंगे और किसे उतारेंगे, तो उसमें आप अपने बच्चों का भविष्य ही खराब करेंगे। pic.twitter.com/cOW6v7svAP— Narendra Modi (@narendramodi) May 7, 2024 -
చంద్రబాబుపై బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: చంద్రబాబు నాయుడిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో గనుక చంద్రబాబు గెలిస్తే తన శిష్యుడితో హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేస్తాడని అన్నారు. వినోద్ కుమార్ కరీంగనగర్లో మంగళవారం మీడియాతో మాట్లాడారు.‘హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు దగ్గర పడింది. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకుని హైద్రాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తాడు. బీజేపీ ఆలోచనలు కూడా హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలన్నట్టుగానే సాగుతున్నాయి. పార్లమెంట్లో గళం విప్పాలంటే నేను గెలువాలి. బండి సంజయ్ బీజేపీ కుర్చోమంటే కూర్చుంటూ.. లెమ్మంటే లేచే వ్యక్తి’ అని మండిపడ్డారు. -
LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
updates మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది.11 రాష్ట్రాల్లోని 93 ఎంపీ సీట్లకు పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 50.71 శాతం ఓటింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 63.11 శాతం, మహారాష్ట్రలో అత్యల్పంగా 42.63 శాతం పోలింగ్ నమోదైంది. అదాని గ్రూప్స్ చైర్మన్ గౌతమ్ అదాని ఓటు వేశారు."India is progressing forward, and will continue to advance further", says Gautam Adani after casting his voteRead @ANI Story | https://t.co/hpPbbht3rK#GautamAdani #LokSabhaElection2024 #Gujarat pic.twitter.com/bADv7NlY6t— ANI Digital (@ani_digital) May 7, 2024మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది.భారీగా ప్రజల ఓటు వేయడానికి తరలి వస్తున్నారు.ఉదయం 11 గంటల 25.41 శాతం పోలింగ్ నమోదైంది.అస్సాం-27.34%బీహార్-24.41% ఛత్తీస్గఢ్-29.90% దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ- 24.69% గోవా-30.94% గుజరాత్- 24.35% కర్ణాటక-24.48% మధ్యప్రదేశ్-30.21% మహారాష్ట్ర-18.18% ఉత్తరప్రదేశ్-26.12% పశ్చిమ బెంగాల్-32.82%25.41% voter turnout till 11 am for phase 3 of #LokSabhaElections2024 Assam 27.34% Bihar 24.41% Chhattisgarh 29.90% Dadra & Nagar Haveli And Daman & Diu 24.69% Goa 30.94% Gujarat 24.35% Karnataka 24.48% Madhya Pradesh 30.21% Maharashtra 18.18% Uttar Pradesh 26.12%… pic.twitter.com/GFTTusnfGe— ANI (@ANI) May 7, 2024ఉత్తరప్రదేశ్ఓటు వేసిన అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్,ఆయన భార్య మైన్పూరి ఎస్పీ అభర్థి డింపుల్ యాదవ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఉత్తరప్రదేశ్లోని సైఫై పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.Samajwadi Party (SP) chief Akhilesh Yadav, his wife and SP candidate from Mainpuri Lok Sabha Seat, Dimple Yadav cast their votes at a polling station in Saifai, Uttar Pradesh(Source: Samajwadi Party)#LokSabhaElections2024 pic.twitter.com/3ZccxyCpxv— ANI (@ANI) May 7, 2024 మహారాష్ట్రబారామతి ఎన్సిపీ శరద్ చంద్ర పవార్ పార్టీ అభ్యర్థి సుప్రియా సూలే ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Maharashtra: NCP-SCP candidate from Baramati Lok Sabha seat, Supriya Sule casts her vote at a polling booth in Baramati NCP has fielded Sunetra Pawar, wife of Maharashtra Deputy CM Ajit Pawar from Baramati. #LokSabhaElection2024 pic.twitter.com/PuG30SmrEA— ANI (@ANI) May 7, 2024 పశ్చిమ బెంగాల్జంగీపూర్ పోలింగ్ కేంద్ర వద్ద ఘర్షణ చోటుచేసుకుందిటీఎంసీ బూత్ ప్రెసిడింట్, బీజేపీ అభ్యర్థి ధనుంజయ్ ఘోష్ గొడవపడ్డారుఅక్కడే ఉన్న పోలీసు సిబ్బంది గొడవను అడ్డుకున్నారు #WATCH | Murshidabad, West Bengal: During the third phase of voting for the Lok Sabha Elections, a TMC booth president clashed with BJP candidate Dhananjay Ghosh at a polling booth in Jangipur. #LokSabhaElections2024 pic.twitter.com/RF7U7NX5h3— ANI (@ANI) May 7, 2024 మూడో విడత పోలింగ్ కొనసాగుతోందిభారీగా ప్రజల ఓటు వేయడానికి తరలి వస్తున్నారు ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతాలు.. అస్సాం-10.12%బీహార్-10.03%ఛత్తీస్గఢ్-13.24%దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ- 10.13%గోవా-12.35%గుజరాత్- 9.87%కర్ణాటక-9.45%మధ్యప్రదేశ్-14.22%మహారాష్ట్ర-6.64%ఉత్తరప్రదేశ్-11.63%పశ్చిమ బెంగాల్-14.60%10.57% turnout till 9 am for phase 3 of #LokSabhaElections2024 Assam 10.12%Bihar 10.03%Chhattisgarh 13.24%Dadra & Nagar Haveli And Daman & Diu 10.13% Goa 12.35%Gujarat 9.87%Karnataka 9.45%Madhya Pradesh 14.22%Maharashtra 6.64%Uttar Pradesh 11.63%West Bengal 14.60% pic.twitter.com/YupOzbyDuQ— ANI (@ANI) May 7, 2024 మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది మహారాష్ట్ర లాథూర్లో రితేష్ దేశ్, జెనిలియా దంపతులు ఓటు వేశారుRiteish Deshmukh, Genelia Deshmukh cast their vote in Maharashtra's LaturRead @ANI Story |https://t.co/uCjksBo9b5#RiteishDeshmukh #GeneliaDeshmukh #Vote #Maharashtra #LokSabhaElections2024 pic.twitter.com/nUhRlrO05L— ANI Digital (@ani_digital) May 7, 2024 మధ్యప్రదేశ్మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు#WATCH | Madhya Pradesh Governor Mangubhai Patel and his family cast their votes at a polling booth in Navsari, Gujarat.BJP has fielded its sitting MP CR Paatil from the constituency. He faces Congress' Naishadhbhai Bhupatbhai Desai here.#LokSabhaElections2024 pic.twitter.com/j8SJsiCncb— ANI (@ANI) May 7, 2024 మహారాష్ట్రఎన్సిపీ శరద్ చంద్ర పవార్ చీఫ్ శరద్ పవాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు#WATCH | NCP-SCP chief Sharad Pawar leaves from a polling booth in Baramati after casting his vote. NCP-SCP has fielded Supriya Sule from the Baramati seat. NCP has fielded Sunetra Pawar, wife of Maharashtra Deputy CM Ajit Pawar from Baramati#LokSabhaElection2024 pic.twitter.com/U2mKdkQS67— ANI (@ANI) May 7, 2024 మహారాష్ట్ర:షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థిని, ప్రణితి షిండే, మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే ఓటు వేశారు.#WATCH | Solapur: Congress Solapur Lok Sabha candidate Praniti Shinde and Former Maharashtra CM Sushil Kumar Shinde cast their votes at a polling booth in Solapur. BJP has fielded Ram Vitthal Satpute from Solapur. BJP's Dr.Jaisiddeshwar Shivacharya Mahaswamiji is the sitting MP… pic.twitter.com/6468jda0Af— ANI (@ANI) May 7, 2024కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, ఆయన కుమారుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఓటు వేశారు.#WATCH | Former Karnataka CM BS Yediyurappa and his sons - state BJP chief BY Vijayendra and sitting MP & party candidate from Shimoga, BY Raghavendra - cast their votes at a polling booth in Shivamogga.Congress has fielded Geetha Shivarajkumar and BJP's K.S. Eshwarappa is… pic.twitter.com/U6HQw0J2zU— ANI (@ANI) May 7, 2024ఓటు వేసిన ప్రధాని మోదీప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Prime Minister Narendra Modi shows his inked finger after casting his vote at a polling booth in Ahmedabad, Gujarat#LokSabhaElections2024 pic.twitter.com/OI0LzIJ0dQ— ANI (@ANI) May 7, 2024 అహ్మదాబాద్లోని నిశాన్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో మోదీ ఓటు చేశారు.Prime Minister Narendra Modi casts his vote for #LokSabhaElections2024 at Nishan Higher Secondary School in Ahmedabad, Gujarat pic.twitter.com/5r6Hsm1AZ3— ANI (@ANI) May 7, 2024 బీజేపీ నేత హరనాథ్ సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్లోని ఎటా పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారుBJP leader Harnath Singh Yadav casts his vote at a polling booth in Etah, Uttar PradeshBJP has fielded Rajveer Singh, the son of former Uttar Pradesh CM and BJP leader Kalyan Singh from the Etah Lok Sabha constituency. He is pitted against SP's Devesh Shakya and BSP's Mohammad… pic.twitter.com/8e3f1zIdAu— ANI (@ANI) May 7, 2024 మధ్య ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు ఖజురహో అభ్యర్థి వీడీ శర్మ ఓటు హక్కు వినియోగించుకున్నారు.భోపాల్లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Madhya Pradesh BJP President and candidate from Khajuraho constituency VD Sharma casts his vote at a polling booth in Bhopal. BJP has fielded Alok Sharma from here, Congress has fielded Arun Shrivastava. BJP's Sadhvi Pragya Singh Thakur is the sitting MP from the… pic.twitter.com/34ZA8VRERu— ANI (@ANI) May 7, 2024 కర్ణాటకలోని కలబురిగి పోలింగ్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి డా. ఉమేష్ యాదవ్ ఓటు వేశారు.#WATCH | Karnataka: BJP candidate Dr Umesh Jadhav shows the indelible ink mark on his finger after casting his vote at a polling booth in Kalaburagi.Congress has fielded party chief Mallikarjun Kharge's son-in-law Radhakrishna Doddamani against him from here.… pic.twitter.com/6TQNcePEvq— ANI (@ANI) May 7, 2024ఓటు వేయాలని ప్రధాని మోదీ ట్వీట్..‘నేటి మూడో దశలో రికార్డు స్థాయిలో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీ చురుకైన భాగస్వామ్యం ఖచ్చితంగా ఎన్నికలను ఉత్సాహంగా మారుస్తుంది’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.Urging all those who are voting in today’s phase to vote in record numbers. Their active participation will certainly make the elections more vibrant.— Narendra Modi (@narendramodi) May 7, 2024 లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రారంభమైందిఓటు వేయడానికి ప్రజలు క్యూ లైన్లలో నిల్చుంటున్నారుVoting for the third phase of #LokSabhaElections2024 begins. Polling being held in 93 constituencies across 11 states and Union Territories (UTs) today.17.24 crore voters are casting their votes today. pic.twitter.com/CpQ7gGurNG— ANI (@ANI) May 7, 2024 నేడు లోక్ సభ మూడో విడత ఎన్నికల పోలింగ్ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6వరకు పోలింగ్11 రాష్ట్రాల్లోని 93 ఎంపీ సీట్లకు ఎన్నికలుఎన్నికల బరిలో 1352 మంది అభ్యర్థులుగుజరాత్ , మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ సహ పలు రాష్ట్రాలలో ఎన్నికలుఅహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాఓటు హక్కు వినియోగించుకోనున్న 17.24 కోట్ల మంది ఓటర్లు1.85 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘంఓటు హక్కు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని ఎస్ఎంఎస్ / వాట్సాప్ మెసేజ్ లు పంపుతున్న ఎన్నికల సంఘంమూడో విడత పోలింగ్ రోజున సాధారణ వాతావరణమే ఉంటుందని అంచనాలువడగల్పుల ప్రభావం తట్టుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, నీళ్లు, ఓఆర్ఎస్ ఏర్పాటుచేసిన ఈసీఎన్నికల ను ప్రత్యక్షంగా చూసేందుకు 23 దేశాల ప్రతినిధులను ఆహ్వానించిన ఈసీపరస్పర వివాదాస్పద ఆరోపణలు, ఈసీకి ఫిర్యాదు లతో రాజకీయ పార్టీలు పెంచిన ప్రచారవేడి చల్లారాక నేడు కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశ పోలింగ్కు సిద్ధమైంది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్సభ స్థానాల్లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ దశతో గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్లోని అన్ని స్థానా లకూ పోలింగ్ పూర్తి కానుంది. ఈ రాష్ట్రాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగిన విష యం తెల్సిందే. ఈసారి మూడో దశలో 120 మంది మహిళలుసహా 1,300కు పైగా అభ్యర్థులు పోటీపడు తున్నారు.బరిలో అగ్రనేతలు, ప్రముఖులు కేంద్రమంత్రులు అమిత్ షా(గాంధీనగర్), జ్యోతిరాదిత్య సింధియా(గుణ), మన్సుఖ్ మాండవీయ(పోర్బందర్), పురుషోత్తం రూపాలా(రాజ్కోట్), ప్రహ్లాద్ జోషి (ధార్వాడ్), ఎస్పీ సింగ్ బఘేల్(ఆగ్రా)మధ్యప్రదేశ్ మాజీ సీఎంలు శివరాజ్సింగ్ చౌహాన్(విదిశ), దిగ్విజయ్సింగ్(రాజ్గఢ్), ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై (హవేరీ), బారామతిలో వదినా, మరదళ్లు సునేత్రా పవార్, సుప్రియా సూలే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.283 చోట్ల పోలింగ్ పూర్తిఇప్పటికే గుజరాత్లోని సూరత్ నియోజక వర్గంలో బీజేపీ ఏకగ్రీవంగా గెల్చింది. గతంలో వాయిదాపడిన బైతుల్ నియోజ కవర్గంలో ఈరోజే పోలింగ్ నిర్వహిస్తు న్నారు. మూడోదశలో 11 కోట్లకుపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పశ్చిమబెంగాల్లో ఈరోజు పోలింగ్ ఉన్న నాలుగు స్థానాల్లోనూ ముస్లిం ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. కర్ణాటకలో ఈరోజు పోలింగ్ ఉన్న 14 స్థానాలనూ 2019 ఎన్నికల్లో బీజేపీ క్వీన్స్వీప్ చేసింది. మూడో దశ ముగిస్తే మొత్తం 543 స్థానాలకుగాను ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన స్థానాల సంఖ్య 283కి చేరుకుంటుంది. నాలుగో దశ మే 13న, ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ జూన్ ఒకటో తేదీన నిర్వహిస్తారు. అన్ని స్థానాలకు ఓట్ల లెక్కింపును జూన్ 4న చేపడతారు.రాష్ట్రం సీట్లుగుజరాత్ 25కర్ణాటక 14మహారాష్ట్ర 11ఉత్తరప్రదేశ్ 10మధ్యప్రదేశ్ 9ఛత్తీస్గఢ్ 7బిహార్ 5అస్సాం 4బెంగాల్ 4గోవా 2దాద్రానగర్, హవేలీ, డయ్యూడామన్ 2 -
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
సిమ్లా: దేశంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. కాంగ్రెస్ మేనిఫెస్టోను విదేశీ శక్తులు ప్రభావితం చేస్తున్నాయని అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీకి పాకిస్తాన్ నుంచి మద్దతు లభిస్తుందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ చాలా దిగజారిపోయిందని అన్నారు.సోమవారం హిమాచల్ ప్రదేశ్లోని ఉనా జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్లో వినాశకరమైన వరదలు, వర్షాల సమయంలో చురుకైన పాత్ర పోషించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు.రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తామని, వాయనాడ్ బరిలోకి దిగారు. ఇప్పుడు రాయ్బరేలీ నుండి పోటీ చేస్తున్నారు. రాయ్బరేలీ నుంచి కూడా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఠాకూర్ అన్నారు. తప్పుడు వాగ్దానాలతో ఎన్నికల్లో గెలుపొందడం అనే మూర్ఖుల స్వర్గంలో జీవించడం కాంగ్రెస్ లక్ష్యమని ఆయన అన్నారు. జూన్ 4న విడుదలయ్యే పోలింగ్ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ కలలు చెదిరిపోతాయని పేర్కొన్నారు.అనురాగ్ ఠాకూర్ 2024 లోక్సభ ఎన్నికల్లో హమీర్పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన నాలుగు లక్షల ఓట్ల కంటే ఈసారి మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ 400 సీట్లకు పైగా సొంత చేసుకుంటుందని కూడా అన్నారు. -
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
భువనేశ్వర్: దేశంలో ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో అక్కడక్కడా వర్షం కురుస్తూ బీభత్సం సృష్టిస్తోంది. సోమవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్లో గాలివాన తీవ్రతరమైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఒడిశా ముఖ్యమంత్రి 'నవీన్ పట్నాయక్' హెలికాప్టర్ భువనేశ్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ కాలేదు.ఎన్నికల ప్రచారం ముగించుకుని ఖరియార్ నుంచి తిరిగి వస్తుండగా.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, సీనియర్ బీజేడీ నాయకుడు కార్తిక్ పాండియన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ చేయడానికి సాధ్యపడలేదు. దీంతో హెలికాప్టర్ 30 నిమిషాల పాటు భువనేశ్వర్ విమానాశ్రయంపై తిరుగుతూ ఝర్సుగూడకు బయలుదేరింది.జరిగిన సంఘటన పార్టీ నేతలను ఒక్కసారిగా భయానికి గురిచేసింది. ఝర్సుగూడలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. నవీన్ పట్నాయక్, బీజేడీ సీనియర్ నేత కార్తిక్ పాండియన్ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.#WATCH | Odisha: While returning from Khariar, the helicopter carrying CM Naveen Patnaik and 5T Chairman and BJD leader VK Pandian couldn't land at Bhubaneswar airport due to wind and rain. After hovering over the airport for nearly 30 minutes, the helicopter headed to… pic.twitter.com/B0lyEMQYN4— ANI (@ANI) May 6, 2024 -
మళ్ళీ బీజేపీదే విజయం: యూపీ డిప్యూటీ సీఎం
లక్నో: లోక్సభ 2024 ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో జాతీయ పార్టీల కీలక నేతలు కూడా క్యాంపెయిన్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జాతీయ పార్టీలకు మద్దతుగా ప్రాంతీయ పార్టీల నేతలు కూడా ప్రచారం సాగిస్తున్నారు. ఈ తరుణంలో శ్రావస్తి నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి 'సాకేత్ మిశ్రా'కు మద్దతుగా ఒక సభలో ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి 'కేశవ్ ప్రసాద్ మౌర్య' కీలక వ్యాఖ్యలు చేశారు.లోక్సభ ఎన్నికల్లో కన్నౌజ్ నుంచి పోటీ చేస్తున్న సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీలు ఓడిపోతారని కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. 2019లో కన్నౌజ్ నుంచి అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ ఎలా ఓడిపోయారో.. ఈ సారి కూడా అదే విధంగా ఓడిపోతారని, రాయ్బరేలీ నుంచి రాహుల్ ఓటమిని చవి చూస్తారని అన్నారు.ఎన్నికల్లో బీజేపీ పార్టీ 400 సీట్లకు పైగా గెలుస్తుందని అన్నారు. ఇండియా కూటమి నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. అవినీతి పార్టీలన్నీ ఒకే తాటిపైకి వచ్చాయని ఆరోపించారు. రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు.भारत विरोधी ताकतें नहीं चाहती कि मोदी जी फिर से प्रधानमंत्री बने।#NarendraModi @Saketmisra_ #AbkiBaar400Paar #LokSabhaElections2024#PhirEkBaarModiSarkar#4JuneKo400Paar pic.twitter.com/QZJzb2EEVx— Keshav Prasad Maurya (मोदी का परिवार) (@kpmaurya1) May 6, 2024 -
కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
లక్నో: కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) రెండు రామ ద్రోహులని, వారి డీఎన్ఏలోనే రామ ద్రోహముందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. అయోధ్య రాముడిని దర్శించుకున్నందుకు సొంత పార్టీ నేత రాధికా కేరాను కాంగ్రెస్ అవమానించిందన్నారు.అవమానం భరించలేకే ఆమె కాంగ్రెస్కు రాజీనామా చేసిందన్నారు. ‘కాంగ్రెస్ నిజస్వరూపం దేశ ప్రజలందిరికీ తెలుసు. ఎన్నికలప్పుడు వాళ్లు చేసేదేది నిజం కాదు. కేవలం ప్రజలను మోసం చేయడానికి వాళ్లు ఏదైనా చేస్తారు.ప్రజలు వాళ్ల నాటకాల పట్ల జాగ్రత్తగా ఉంటారు’అని యోగి వార్తా సంస్థతో అన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ రామునికి, సనాతన ధర్మానికి వ్యతిరేకమని, అయోధ్య వెళ్లినందుకే పార్టీ తనను అవమానించిందని ప్రకటించి రాజీనామా చేశారు. -
కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్ఠాత్మక లోక్సభ నియోజకవర్గాలైన రాయ్బరేలీ, అమేథీ నుంచి రాహుల్ గాంధీ, కిశోరీ లాల్ శర్మ ఎన్నికల బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పరిశీలకులుగా కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రులను నియమించింది.రాయ్బరేలీ, అమేథీ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏఐసీసీ సీనియర్ పరిశీలకులుగా భూపేశ్ బాఘెల్, అశోక్ గెహ్లాట్లను నియమించే ప్రతిపాదనకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదం తెలిపినట్లు ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.ప్రియాంక గాంధీ ఇప్పటికే ప్రచారానికి నాయకత్వం వహించారు. సోమవారం నుంచి ఎన్నికలు ముగిసే వరకు రాయ్బరేలీ, అమేథీలలో క్యాంపెయిన్ చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రచారంలో భాగంగా ప్రియాంక ఇంటింటికీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉందిని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, గాంధీ కుటుంబంతో దశాబ్దాలుగా కుటుంబ సంబంధాలు ఉన్న వారితో ఇప్పటికే ఔట్ రీచ్ ప్రారంభమైందని ఆ వర్గాలు తెలిపాయి. రెండు నియోజకవర్గాల్లో డిజిటల్, సోషల్ మీడియా ప్రచారాన్ని కూడా ప్రియాంక గాంధీ పర్యవేక్షిస్తారని సమాచారం.కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వంటి అగ్రనేతల ప్రచార ప్రణాళికలను, షెడ్యూల్ను కూడా ప్రియాంక గాంధీ చూసుకుంటారు. ఈమె ఎన్నికల ప్రచారంలో భాగంగా 200 నుంచి 300 గ్రామాలను కవర్ చేస్తూ.. రెండు నియోజక వర్గాలకు సమయాన్ని కేటాయిస్తుందని సమాచారం.ఫిరోజ్ గాంధీ రాయ్బరేలీలో వేసిన బలమైన పునాదుల కారణంగా అయన భార్య, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1967, 1971, 1980లలో గెలుపొందారు. తరువాత గాంధీ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. అమేథీలో ప్రస్తుత బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ చేతిలో ఉంది. దీన్ని మళ్ళీ హస్తం హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది.#LokSabhaElections2024 | Congress appoints Bhupesh Baghel as AICC Senior Observer to Raebareli and Ashok Gehlot to Amethi. pic.twitter.com/GSJ0EQvwBv— ANI (@ANI) May 6, 2024 -
అమేథీలో ఇలాంటి చర్య మొదటిసారి చూస్తున్నా.. కిషోరి లాల్ శర్మ
లక్నో: ఉత్తరప్రదేశ్లోని అమేథీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై ఆదివారం రాత్రి బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనిని అమేథీ బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి 'కిషోరి లాల్ శర్మ' తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలకు తాము భయపడబోమని శర్మ పేర్కొన్నారు.పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం సమంజసం కాదని, ఇది అమేథీ సంస్కృతికి విరుద్ధమని కిషోరి లాల్ శర్మ వ్యాఖ్యానించారు. ఇప్పటికి అనేకసార్లు ఈ నియోజక వర్గంలో ఎన్నికలు జరిగాయి. కానీ ఎప్పుడూ ఇలాంటి చర్య మాత్రం జరగలేదు. ఇలాంటి చర్యలను మొదటిసారి చూస్తున్నానని ఆయన అన్నారు.బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సిద్ధాంతాలు భిన్నంగా ఉన్నప్పటికీ.. వారి పనితీరును బట్టి ఓట్లు అడగాలి. ఆలా కాకుండా పార్టీ కార్యాలయాల మీద దాడి చేయడం క్షమించరాని నేరమని, నిందితులను పోలీసులు గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.ఈ ఘటనను యూపీ కాంగ్రెస్ ఇన్చార్జి అవినాష్ పాండే ఖండించారు. రాష్ట్రంలో బీజేపీ మూలాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, స్మృతి ఇరానీ తమ ఓటమిని స్పష్టంగా చూస్తున్నారు. అందుకే అమేథీలో హింసాత్మక పరిస్థితిని సృష్టించాలని చూస్తున్నారని ఆయన అన్నారు.అమేథీ కాంగ్రెస్ పార్టీలో జరిగిన సంఘటన గురించి ఎస్పీ అనూప్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. కొంతమంది వ్యక్తులు బయట పార్క్ చేసిన వాహనాల అద్దాలు పగలగొట్టారని, ఆదివారం రాత్రి కాంగ్రెస్ జిల్లా కార్యాలయం నుంచి మాకు ఫోన్ వచ్చింది. సంఘటన గురించి తెలుసుకుని, పోలీసు బలగాలను సంఘటనా స్థలానికి పంపారు. సద్దాం హుస్సేన్ అనే వ్యక్తి తన వాహనాన్ని ధ్వంసం చేశాడని, అతనిపై రాళ్లు రువ్వడం వల్ల ఎఫ్ఐఆర్ను నమోదు చేసి, అవసరమైన చర్యలు తీసుకుంటామని అనూప్ సింగ్ తెలిపారు.यूपी के अमेठी में स्मृति ईरानी और BJP के कार्यकर्ता बुरी तरह डरे हुए हैं।सामने दिख रही हार से बौखलाए BJP के गुंडे लाठी-डंडों से लैस होकर अमेठी में कांग्रेस कार्यालय के बाहर पहुंचे और वहां खड़ी गाड़ियों में तोड़फोड़ की। कांग्रेस के कार्यकर्ताओं और अमेठी के लोगों पर भी जानलेवा… pic.twitter.com/Knv7BBN8bk— Congress (@INCIndia) May 5, 2024 -
బారామతిలో అలాంటి పనులు పనిచేయవు: అజిత్ పవార్
మహారాష్ట్రలో కీలకమై బారామతి పార్లమెంట్ స్థానంలో పవార్ వర్సెస్ పవార్ పోటీ నెలకొంది. మూడో దశలో మే 7(మంగళవారం) బారామతిలో పోలింగ్ జరగనుంది. ఆదివారంతో ఇక్కడ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నేపథ్యంలో పూణె జిల్లాలోని బారామతిలో నిర్వహించిన ఓ ర్యాలీలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ‘వికాస్ పురుష్’అంటూ ప్రశంసలు కురిపించారు. అదే విధంగా ఇటీవల తన మేనల్లుడు రోహిత్ పవార్పై విమర్శలు చేశారు. సిట్టింగ్ ఎంపీ, ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) అభ్యర్థి సుప్రియా సూలే తరఫున ప్రచారం చేస్తూ రోహిత్ పవార్ భావోద్వేగానికి గురైన విషయాన్ని ప్రస్తావించారు.‘నీ భావోద్వేగాలతో కొంతమంది ఆడుకుంటారని చెప్పాను. కానీ, అలాంటి పనులు బారామతిలో పని చేయవు. విమర్శలు చేయడానికి ప్రయత్నం చేయను. అభివృద్ధి కోసం నిరంతరం పని చేయటానికే నా తొలి ప్రాధన్యం. ఇప్పటివరకు చాలా ప్రచార ర్యాలీలో పాల్గొన్నా. కానీ, ఇంత పెద్దసంఖ్యలో అభిమానులు, జనాలను చూడలేదు. ఇదంతా చూస్తే.. మన గెలుపు ఖాయమని అర్థమవుతోంది. రాజకీయాలు నేర్పింది నేనే అని చెప్పే రోహిత్.. ఇప్పడు నాపై విమర్శలు చేస్తున్నాడు. అయినా నేను వాటిని పట్టించుకోను. అభివృద్ధి కోసం పనిచేయటమే నా తొలి ప్రాధాన్యం’ అని అజిత్ పవార్ అన్నారు. అదేవిధంగా ‘ప్రధాని మోదీ భారత దేశానికి వికాస్ పురుష్. ఈ లోక్సభ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. బారామతి గత 15ఏళ్లగా ఎటువంటి నిధులు పొందలేదు. కానీ, ప్రస్తుతం 2499 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు నిధలు అనుమతులు పొందాయి’ అని అజిత్ పవార్ వెల్లడించారు. ఇక.. ఇటీవల సుప్రియా సూలేకు మద్దతుగా ఓ ర్యాలీలో పాల్గొన్న రోహిత్ ప్రవార్ ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘పార్టీ రెండుగా చీలినప్పుడు నేను పార్టీ కార్యకర్తలతో కలిసి శరద్ పవార్ను కలిశాను. మేము, కుటుంబం అండగా ఉంటామని తెలిపాను’’ అని ఒకింత భావోద్వేగంతో మాట్లాడారు. -
అమేథీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్పై దుండగుల దాడి, కార్ల ధ్వంసం
లక్నో: లోక్సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లోని కీలకమైన అమేథీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై ఆదివారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. పార్టీ కార్యాయంలో బయట పార్కింగ్ చేసిన పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడి ఘటన సమాచారం అందుకున్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.यूपी के अमेठी में स्मृति ईरानी और BJP के कार्यकर्ता बुरी तरह डरे हुए हैं।सामने दिख रही हार से बौखलाए BJP के गुंडे लाठी-डंडों से लैस होकर अमेठी में कांग्रेस कार्यालय के बाहर पहुंचे और वहां खड़ी गाड़ियों में तोड़फोड़ की। कांग्रेस के कार्यकर्ताओं और अमेठी के लोगों पर भी जानलेवा… pic.twitter.com/Knv7BBN8bk— Congress (@INCIndia) May 5, 2024పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని దాడికి వ్యతిరేకంగా నిసన తలిపారు. దీంతో కార్యకర్తలను నిరసనను పోలీసులు శాంతింపచేశారు. ఈ దాడిపై దర్యాప్తు చేస్తామని, ఈ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుంటామని పోలీసులు తెలపారు.మరోవైపు.. ఈ దాడిని బీజేపీ చేయించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ‘‘స్మృతి ఇరానీ, బీజేపీ కార్యకర్తలు భయపడుతున్నారు. ఓడిపోతామనే భయంతో బీజేపీ కార్యకర్తలు గూండాల్లా కాంగ్రెస్ పార్టీపై దాడి చేశారు. కార్లను ధ్వసం చేశారు. అక్కడితో కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానికులపై కూడా బీజేపీ రౌడీలు దాడి చేశారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనతో బీజేపీ అమేథీలో దారుణంగా ఓడిపోతుందని అర్థమవుతోంది’’అని కాంగ్రెస్ పార్టీ ‘ఎక్స్’ వేదికగా బీజేపీపై మండిపడింది. బీజేపీ కార్యకర్తల దాడి చేస్తున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని కాంగ్రెస్ నేత సుప్రీయా శ్రీనతే మండిపడ్డారు. -
కంగనా ముంబైకి ముల్లె సర్దుకోవాల్సిందే: మంత్రి విక్రమాధిత్య
సిమ్లా: సినీ నటి, బీజేపీ మండి అభ్యర్థిని కంగనా రనౌత్ దిగుమతి చేసుకున్న నాయకురాలని హిమాచల్ కాంగ్రెస్ మంత్రి విక్రమాధిత్య సింగ్ విమర్శలు చేశారు. ఆమెను మండి ఓటమిపాలైతే.. ముంబైకి సాగనంపే ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాసౌలీలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని విక్రమాధిత్య మాట్లాడారు.‘‘హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తుంది. మండిలో అయితే రాష్ట్రానికి దిగిమంతి చేయబడిన కంగనా రనౌత్ను ముంబైకి సాగనంపడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ ఎన్నికల పోటీలో మేము ముందడుగు వేశాం. మండిలో ప్రతిరోజు రాత్రిపగలు పనిచేస్తున్నాం. హిమాచల్లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని హామీ ఇవ్వగలను’’అని విక్రమాధిత్య అన్నారు.గత నెలలో కూడా విక్రమాధిత్య కంగనా రనౌత్పై తీవ్ర విమర్శలు చేశారు. కంగనా రనౌత్ వర్షం కాలంలో వచ్చే కప్ప లాంటి వారని ఎద్దేవా చేశారు. ‘‘ఎన్నికల ప్రచారం అనంతరం మండి నుంచి ఆమె వెళ్లిపోతుంది. కంగనా హిమాచల్ ప్రదేశ్కు కేవలం టూర్ కోసమే వస్తారు. కంగనా ఈ రోజు ఇక్కడ ఉంటారు.. రేపు మళ్లీ వెళ్లిపోతారు. వర్ష కాలంలో కప్ప మాదిరి కంగనా హిమాచల్కు వస్తూ.. వెళ్తూ ఉంటారు’’ అని విమర్శలు చేశారు. నాలుగు లోక్సభ స్థానాలు.. మండి, సిమ్లా, కాంగ్రా, మహీర్పూర్లలో చివరి విడత జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఫతితాలు జూన్ 4న వెలువడనున్నాయ.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement