-
భారత్లో మోటరోలా ఎడ్జ్ 50 ప్రో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మోటరోలా భారత్లో ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ప్రపంచంలో తొలి ట్రూ కలర్ కెమెరా, 3డీ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. 6.7 అంగుళాల 1.5కే సూపర్ హెచ్డీ పీఓఎల్ఈడీ డిస్ప్లే, ఆన్డ్రాయిడ్ 14 ఓఎస్, 30 ఎక్స్ హైబ్రిడ్ జూమ్, 3 ఎక్స్ ఆప్టికల్ జూమ్తో 50 ఎంపీ ప్రైమరీ ఏఐ కెమెరా, టర్బోపవర్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, 125 వాట్ టర్బోపవర్ వైర్డ్ చార్జింగ్ వంటి హంగులు ఉన్నాయి. ధర రూ.27,999 నుంచి ప్రారంభం. -
ష్నైడర్ ఎలక్ట్రిక్ భారీ పెట్టుబడులు
బెంగళూరు: ఎనర్జీ మేనేజ్మెంట్, ఆటోమేషన్ దిగ్గజం ష్నైడర్ ఎలక్ట్రిక్ దేశీయంగా తయారీపై భారీ పెట్టుబడులకు సిద్ధపడుతోంది. 2026కల్లా తయారీ ప్లాంట్లపై రూ. 3,200 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. తద్వారా దేశ, విదేశాలలో అమ్మకాలకు భారత్ను తయారీ కేంద్రంగా వినియోగించుకోనున్నట్లు పేర్కొంది. ఈ బాటలో స్థానికంగా డేటా సెంటర్లకు అవసరమయ్యే కూలింగ్ సొల్యూషన్స్ను ఉత్పత్తి చేసేందుకు రూ. 100 కోట్లతో ఏర్పాటు చేసిన ప్లాంటును తాజాగా ప్రారంభించింది. ప్రణాళికల్లో భాగంగా గ్రూప్ తయారీ కేంద్రంగా భారత్లో పెట్టుబడులు చేపట్టనున్నట్లు ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ప్రెసిడెంట్, గ్రేటర్ ఇండియా జోన్ ఎండీ, సీఈవో దీపక్ శర్మ వెల్లడించారు. వివిధ ప్రొడక్టులు, సొల్యూషన్ల తయారీకి దేశవ్యాప్తంగా తయారీ ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు కూలింగ్ సొల్యూషన్స్ యూనిట్ ప్రారంభం సందర్భంగా తెలియజేశారు. వెరసి మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, పశి్చమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఒడిషాలలో యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. తాజా యూనిట్తో కలిపి ప్రస్తుతం కంపెనీ దేశవ్యాప్తంగా 30 ఫ్యాక్టరీలను నిర్వహిస్తోంది. -
మిడిల్ క్లాస్ డ్రీమ్ వెహికల్: ఐకానిక్ లూనా సరికొత్తగా! రిపబ్లిక్ డే ఆఫర్
దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పుంజుకుంటోంది. ఈ ట్రెండ్కు అనుగుణంగా దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీలన్నీ తమ మోడళ్లలో ఈవీ వెర్షన్స్ లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒకప్పటి మధ్యతరగతి కలల టూవీలర్ లూనా సరికొత్త అవతారంలో ఈవీగా భారతీయ వినియోగదారులను ఆకట్టుకొనేందుకు భారత్లో లాంచ్ కానుంది. ఈవీలకు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో కెనటిక్ కంపెనీకి చెందిన పాపులర్ లూనా స్కూటర్ను తాజాగా ఈవీ వెర్షన్లో రిలీజ్ చేస్తోంది. అంతేకాదు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. మోస్ట్ ఎవైటెడ్ మల్టీ యుటిలిటీ e2W, కైనెటిక్ గ్రీన్ E-Lunaను వచ్చే నెల (ఫిబ్రవరి 2024) ఆరంభంలో రిలీజ్ చేయనుంది. బుకింగ్లు జనవరి 26న షురూ అవుతాయని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. Kinetic Green వెబ్సైట్లో కేవలం రూ. 500తో ప్రీ-బుక్ చేసుకోవచ్చు. కైనెటిక్ ఇ-లూనా పూర్తిగా మేడ్-ఇన్-ఇండియాగా వస్తోంది. మెట్రో ,టైర్ 1, టైర్-2, టైర్-3 నగరాలు , అలాగే గ్రామీణ యూజర్లును కూడా దృష్టిపెట్టుకుని అత్యాధునిక ఫీచర్లతో లూనా ఈవీ నితయారు చేసినట్టు కైనెటిక్ గ్రీన్ ఫౌండర్, సీఈవో సులజ్జ ఫిరోడియా మోత్వాని తెలిపారు. అంతేకాదు 'చల్ మేరీ లూనా' అంటూ యాడ్ ప్రపంచంలో సంచలనం రేపిన పియూష్ పాండే తిరిగి ఈ బ్రాండ్ కోసం పని చేయనున్నారట. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ లూనాకోసం సంతోషంగా ఉందని ప్రకటించారు పియూష్. నేటి యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని మయూర్ అండ్ టీం దీనికోసం పనిచేస్తోందన్నారు.పీయూష్ పాండే ప్రస్తుతం ఒగిల్వీ ఇండియా గ్లోబల్ క్రియేటివ్ ఛైర్మన్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా ఉన్నారు కాగా కైనెటిక్ 2000 ప్రారంభంలో దాని ఉత్పత్తిని నిలిపివేసింది Unleash the beats, charge up the streets, and ride the rhythm of the future on the Zulu! .#kineticgreen #kineticgreenev #kineticgreen2w #kineticgreenvehicles #kyaboltizulu #kineticgreenjourney #hiphop pic.twitter.com/h3rw3YzSRT — Kinetic Green (@KineticgreenEV) January 17, 2024 కైనటిక్ లూనాఫీచర్లు, అంచనాలు కైనెటిక్ ఇ లూనాకు సంబంధించిన ఫీచర్లను కంపెనీ అధికారికంగా ప్రకటించనప్పటికీ, అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. 16-అంగుళాల వైర్ స్పోక్ వీల్స్, మోపెడ్ ఆపడానికి రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్లు ఉంటాయి. ఈ లూనా టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్బర్లతో వస్తుంది. ఈ లూనా ఒక ‘హై-స్పీడ్’ ఎలక్ట్రిక్ స్కూటర్గా కూడా ఉంటుందని అంచనా. బ్యాటరీ 5 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. గంటకు గరిష్టంగా 60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. పవర్ట్రెయిన్ డిజైన్ ఛార్జ్ టర్న్అరౌండ్ టైమ్లను తగ్గించడానికి మార్చుకునే లేదా రిమూవముల్ బ్యాటరీ ప్యా క్తో డిజైన్ చేసింది. -
టీవీ నుంచి వీడియోల వైపు.. !
న్యూఢిల్లీ: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అన్ని రంగాల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొబైల్ ప్రతిఒక్కరి జీవితంలో భాగమైంది. ఏదైనా కొత్త సినిమా, వెబ్సిరీస్ చూడాలన్నా ఇప్పుడు టీవీలకు బదులుగా మొబైల్, ల్యాప్టాప్లనే వాడుతున్నారు. అందరి ఇళ్లల్లో టీవీలు ఉన్నా క్రమంగా వాటి వాడకం తగ్గుతోంది. ఓటీటీలకు ప్రాధాన్యం పెరుగుతోంది. అందుకు సంబంధించి మీడియా పార్ట్నర్స్ ఏషియా ఆసక్తికర నివేదిక విడుదల చేసింది. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో (ఏపీఏసీ) 2028 నాటికి అత్యధికంగా ఆదాయం నమోదయ్యే టాప్ 6 వీడియో మార్కెట్లలో భారత్ కూడా ఒకటిగా ఎదగనుంది. ఈ జాబితాలో చైనా, జపాన్, కొరియా, ఆస్ట్రేలియా, ఇండొనేషియాలు కూడా ఉన్నాయి. ఆసియా–పసిఫిక్ ప్రాంత వీడియో పరిశ్రమలో ఈ ఆరు దేశాల వాటా ఏకంగా 90 శాతంగా ఉండనుంది. మీడియా పార్ట్నర్స్ ఏషియా (ఎంపీఏ) విడుదల చేసిన ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇక 2023–28 మధ్య కాలంలో అత్యంత వేగంగా ఎదిగే వీడియో మార్కెట్లలో ఒకటిగా భారత్ ఉంటుందని నివేదిక పేర్కొంది. వార్షిక ప్రాతిపదికన 5.6 శాతం మేర వృద్ధి చెందవచ్చని అంచనా వేసింది. 14 మార్కెట్లలో ఉచిత టీవీ చానళ్లు, పే–టీవీలు, వివిధ రకాల వీవోడీలు (వీడియో–ఆన్–డిమాండ్) .. వాటి వినియోగదారులు, ప్రకటనలు మొదలైన అంశాలను అధ్యయనం చేసిన మీదట ఎంపీఏ ఈ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం 2023–28 మధ్య కాలంలో ఏపీఏసీ వీడియో పరిశ్రమ మొత్తం ఆదాయం 2.6 శాతం వార్షిక వృద్ధితో 165 బిలియన్ డాలర్లకు చేరనుంది. చైనా మార్కెట్ 1.7 శాతం వృద్ధితో 2028 నాటికి 70 బిలియన్ డాలర్లకు చేరుకోగలదు. ఆ తర్వాత స్థానాల్లో జపాన్ (35 బిలియన్ డాలర్లు), భారత్ (17 బిలియన్ డాలర్లు), కొరియా (14 బిలియన్ డాలర్లు), ఆస్ట్రేలియా (11 బిలియన్ డాలర్లు) ఉంటాయి. కనెక్టివిటీ దన్ను.. మెరుగైన ఇంటర్నెట్, కనెక్టెడ్ టీవీల వినియోగం పెరగడం, ప్రీమియం లోకల్ కంటెంట్పై ఇన్వెస్ట్ చేస్తుండటం, ప్రీమియం స్పోర్ట్స్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉండటం మొదలైన అంశాల వల్ల ఆసియా–పసిఫిక్ వీడియో పరిశ్రమ క్రమంగా టీవీ నుంచి ఆన్లైన్ వైపు వెడుతోందని నివేదిక తెలిపింది. రాబోయే రోజుల్లో ఆదాయాలు, వీక్షకుల సంఖ్య పెరగడానికి కూడా ఇదే కారణం కాగలదని పేర్కొంది. 2023లో 5.5 శాతం వృద్ధి .. ఏపీఏసీ వీడియో పరిశ్రమ ఆదాయం 2023లో 5.5 శాతం వృద్ధి చెందింది. 145 బిలియన్ డాలర్లకు చేరింది. ఆన్లైన్ వీడియో విభాగం ఇందుకు దోహదపడింది. ఏపీఏసీలో గతేడాది చైనా అగ్రస్థానంలోనే కొనసాగింది. 64 బిలియన్ డాలర్ల మార్కెట్గా నిల్చింది. చైనాను పక్కన పెడితే గతేడాది అతి పెద్ద మార్కెట్లలో జపాన్ (32 బిలియన్ డాలర్లు), భారత్ (13 బిలియన్ డాలర్లు), కొరియా (12 బిలియన్ డాలర్లు), ఆస్ట్రేలియా (9.5 బిలియన్ డాలర్లు), తైవాన్, ఇండొనేషియా ఉన్నాయి. వినియోగదారులు ఆన్లైన్ వైపు మళ్లుతుండటం, కనెక్టెడ్ టీవీలు పెరుగుతుండటంతో టీవీ మాధ్యమంపై ఒత్తిడి పెరుగుతోందని నివేదిక పేర్కొంది. -
కోకా కోలా నుంచి మద్యం.. రేటెంతో తెలుసా?
కూల్ డ్రింక్ అనగానే ఎక్కువ మందికి గుర్తొచ్చే బ్రాండ్ 'కోకా కోలా' (Coca Cola). ఈ కంపెనీ ఇప్పుడు మన దేశంలో తొలిసారిగా మద్యం విభాగంలోకి అడుగు పెట్టింది. కోకా కోలా మద్యం పేరు ఏమిటి? దాని ధరలు ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. థమ్స్ అప్, మ్కా, ఫాంటా, స్ర్పైట్, మాజా, కోకా కోలా జీరో షుగర్, డైట్ కోక్, ష్వెప్స్, ఛార్జ్డ్, కిన్లే, మినిట్ మెయిడ్, స్మార్ట్ వాటర్, రిమ్ జిమ్, హానెస్ట్ టీ, కోస్టా కాఫీ, జార్జియా వంటి వాటితో దూసుకెళ్తున్న కోకా కోలా తాజాగా 'లెమన్ డౌ' (Lemon-Dou) అనే పేరుతో మద్యం తయారు చేయడం మొదలు పెట్టింది. కోకా కోలా 'లెమన్ డౌ' ఇప్పుడు కేవలం గోవా, మహారాష్ట్రలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గోవాలో దీని ధర రూ. 150 కాగా.. మహారాష్ట్రలో రూ. 230 కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ మద్యం భారతీయులను ఆకర్షిస్తుందా? లేదా? అనే టెస్టింగ్ దశలోనే ఉంది. ఆ తరువాత ఇందులో ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తిస్తే.. కంపెనీ దానికి తగిన విధంగా మద్యం తయారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఈ ఏడాది ఎక్కువ గూగుల్ సెర్చ్ చేసిన విషయాలు ఇవే.. 2018లో కోకా కోలా కంపెనీ 'లెమన్ డౌ'ను జపాన్ దేశంలో పరిచయం చేసింది. ఇది చైనా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఇది భారతదేశానికి వచ్చింది. దేశీయ మార్కెట్లో ఈ మద్యం సక్సెస్ అవుతుందా.. లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. -
మూడు నెలల కనిష్ఠానికి చేరనున్న సీపీఐ ద్రవ్యోల్బణం!
భారత గణాంకాల మంత్రిత్వ శాఖ సెప్టెంబర్కు సంబంధించిన వినియోగదారుల ధరల సూచీ డేటాను, ఆగస్టులోని పారిశ్రామిక ఉత్పత్తి డేటాను అక్టోబరు 12న విడుదల చేయనుంది. అందుకు నిపుణులు కారణాలను విశ్లేసిస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో మూడు నెలల కనిష్ఠానికి పడిపోయే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ద్రవ్యోల్బణం ఆగస్టులో 6.83 శాతంగా ఉంది. కానీ సెప్టెంబరు నెలకు అది 5.4 శాతానికి తగ్గుతుందని అంచనా. పారిశ్రామికోత్పత్తి సూచీ జులైలో 5.7తో పోలిస్తే ఆగస్టులో 9.1కు పెరిగినట్లు తెలుస్తుంది. అయితే ఇది గడిచిన 14 నెలల్లో అత్యధికం. సెప్టెంబర్లో టమాటా ధరలు సాధారణ స్థితికి రావడంతో నెలవారీగా ఖర్చుల శాతం తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు. దాంతో పాటు ఇండియన్ మార్కెట్లు జీవితకాలపు గరిష్ఠాల్లో ట్రేడయ్యాయి. అయితే అదే సమయంలో ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్లో ఉల్లి ధరలు 12 శాతం పెరిగాయి. తృణధాన్యాలు, పప్పుల ధరలు పెరిగాయి. సెప్టెంబరులో అంతర్జాతీయ చమురు ధరలు దాదాపు 8.8శాతం పెరిగినప్పటికీ చమురు మార్కెటింగ్ కంపెనీలు మాత్రం ధరలపై ఎలాంటి ప్రభావం చూపకపోవడం కొంత ఊరట కలిగించినట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. అన్ని కారణాల వల్ల ద్రవ్యోల్బణం దాదాపు ఒకటిన్నర శాతం తగ్గుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. -
200 కి.మీ రేంజ్లో కొత్త ఈ-స్కూటర్ : బుకింగ్స్ షురూ! ధర మాత్రం!
Pure EV ePluto 7G Max electric scooter: ప్యూర్ ఈవీ భారతదేశంలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేసింది. 201 కిమీ పరిధితో ePluto 7G మాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసింది. దేశంలో 200 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తున్న 2-వీలర్ EVలలో ePluto 7G మాక్స్ ఒకటిగా నిలిచింది. ఈ వింటేజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. ePluto 7G MAX ఫీచర్లు : AIS-156 సర్టిఫికేట్, స్మార్ట్ BMS , బ్లూటూత్ కనెక్టివిటీతో 3.5 KWH బ్యాటరీని అమర్చింది. స్కూటర్ హిల్ స్టార్ట్ అసిస్ట్, డౌన్హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్ ,స్మార్ట్ AI వంటి ఫీచర్లతో వస్తుంది. ఇవి బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడతాయని కంపెనీ పేర్కొంది. దీని ధర రూ. 1,14,999 (ఎక్స్-షోరూమ్). రాష్ట్ర స్థాయి సబ్సిడీలు , RTO రుసుములను బట్టి ఆన్-రోడ్ ధర మారుతుంది. వచ్చే పండుగ సీజన్ నుండి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈ స్కూటర్ మ్యాట్ బ్లాక్, రెడ్, గ్రే , వైట్ నాలుగు రంగులలో లభించనుంది. (ODI WC 2023 Revenue Prediction: ఆదాయంపై బీవోబీ సంచలన అంచనాలు) అత్యధికంగా అమ్ముడవుతున్న 7G మోడల్ అప్గ్రేడ్ వెర్షన్ రోజుకు 100 కి.మీ డ్రైవ్ చేసే వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్యూర్ EV సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోహిత్ వదేరా తెలిసారు. మరోవైపు కంపెనీ దాదాపు అన్ని ప్రముఖ నగరాలు, పట్టణాలలో తన డీలర్ నెట్వర్క్ను దూకుడుగా విస్తరిస్తోంది, FY24 చివరి నాటికి 300 కంటే ఎక్కువ టచ్పాయింట్లను లక్ష్యంగా చేసుకుంది. -
పండగ సీజన్: అందుబాటులో ధరలో సీఎన్జీ కార్లు
పండుగ సీజన్ దగ్గర పడుతోంది. అందుబాటులో ధరలో సీఎన్జీకారు కోసం చూస్తున్నారా? అయితే ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సరసమైన, పర్యావరణహిత CNG-ఆధారిత కార్లను ఒకసారి పరిశీలిద్దాం Maruti Alto & Alto K10 S-CNG దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి చెందిన కార్లలో సిఎన్జి కార్ సెగ్మెంట్ల ఆల్టో సిరీస్, ఆల్టో ఆల్టో కె10 లాంటి ప్రధానంగా ఉన్నాయి. ఆల్టో 796cc ఇంజన్ 40 bhp, 60 గరిష్టటార్క్ను అందిస్తుంది. వీటి ధరలు ఆల్టో ధర రూ. 5.13 లక్షలు. ఆల్టో కె10 1.0-లీటర్ ఇంజన్ (56 బిహెచ్పి & 82 ఎన్ఎమ్) కలిగి ఉంది. ఈ మోడల్ రెండూ సమర్థవంతమైన పనితీరును అందిస్తాయి. లు ప్రశంసనీయమైన ఇంధన సామర్థ్యంతో సిటీ డ్రైవింగ్కు అనువైనవి. ఆల్టో K10 ధర రూ. 5.96 లక్షలు Maruti S-Presso S-CNG మారుతి ఎస్ ప్రెస్సో 1.0-లీటర్ ఇంజన్. 56 bhp. 82 Nm అందిస్తుంది. ధర: రూ. 5.91-6.11 లక్షలు Maruti Wagon R S-CNG, వ్యాగన్ ఆర్ చక్కటి ఇంటీరియర్ స్పేస్తో ముచ్చటైన కారు ఇది. రోజువారీ ప్రయాణానికి ఆకర్షణీయమైన ఎంపిక. 1.0-లీటర్ ఇంజన్ (56 bhp & 82 Nm) సామర్థ్యంతో వస్తుంది. ధర: రూ. 6.44-6.89 లక్షలు Tata Tiago iCNG టాటా టియాగో టాటా టియాగో iCNG చక్కటి బూట్ స్పేస్తో అందుబాటులోఉన్న CNG హ్యాచ్బ్యాక్ ఇది. 1.2-లీటర్ CNG ఇంజన్ (72 bhp & 95 Nm) , స్పెషల్ ట్విన్ CNG సిలిండర్ సిస్టమ్తో ఉన్నదీనిధర: రూ. 6.54-8.20 లక్షలు. Maruti Celerio S-CNG: మారుతి సెలేరియో 1.0-లీటర్ CNG ఇంజిన్తో బడ్జెట్ధరలో అందుబాటులో ఉన్న కారిది. ధర: రూ. 6.73 లక్షలు టాటా పంచ్ Tata Punch iCNG ఈ కాంపాక్ట్ SUV 1.2-లీటర్ ఇంజన్ 72 bhp మరియు 95 Nm ను అందిస్తుంది. ధర: రూ. 7.09 నుంచి 9.67 లక్షలు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్జీ Hyundai Grand i10 Nios CNG : 1.2-లీటర్ ఇంజన్ 68 బిహెచ్పి, 95 ఎన్ఎంను అందిస్తుంది. ధర: రూ. 7.58-8.13 లక్షలు -
లగ్జరీ బీఎండబ్ల్యూ ఈవీ: గంటల్లోనే హాట్ సేల్, ధర ఎంతంటే?
జర్మనీ లగ్జరీ కార్ మేకర్ బీఎండబ్ల్యూ ఇండియా కొత్తరు కారును లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. BMW iX1 ఎలక్ట్రిక్ ఎస్యూవీని ఇండియాలో ఆవిష్కరించింది. ఫుల్లీ ఎలక్ట్రిక్ BMW iX1 బుకింగ్లు ప్రత్యేకంగా ఆన్లైన్లో తీసుకొచ్చింది. బుకింగ్స్ అలా మొదలు పెట్టిందో లేదో విపరీతమైన డిమాండ్ను నమోదు చేసింది. ఈ హాల్ సేల్లో ఇప్పటికే 2023కి సంబంధించిన మొత్తం యూనిట్లు అందుకుంది. రూ. 66.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధరతో తీసుకొచ్చిన ఈ ఎస్యూవీ డెలివరీలో అక్టోబర్లో ప్రారంభం. లాంచింగ్ రోజే iX1 SUVకి ‘అసాధారణ స్పందన రావడం థ్రిల్లింగ్గా ఉందంటూ BMW ప్రెసిడెంట్ విక్రమ్ పవా సంతోషం ప్రకటించారు. తమకు ఇండియాలో iX1కి గొప్ప అరంగేట్రం అని పేర్కొన్నారు. కానీ ఎన్ని యూనిట్లు సేల్ అయిందీ కచ్చితమైన వివరాలు అందించలేదు. డిజైన్ పరంగా, iX1 ఒక విభిన్నమైన 'I' ఎలక్ట్రిక్ గుర్తింపు,అడాప్టివ్ LED హెడ్లైట్లు LED హెడ్ల్యాంప్లు రన్నింగ్ బోర్డ్లతో పాటు ముందు మరియు వెనుక బంపర్లో బ్లూ యాక్సెంట్లతో దాదాపు చతురస్రాకారంలో గ్రిల్ను అమర్చింది. iX1 66.4kWh బ్యాటరీ ప్యాక్, 80 kms/hr గరిష్ట వేగంతో 5.6సెకన్లలో 100 కి.మీటర్ల వరకు తక్షణ వేగవంతం అందుకుంటుంది. ఇది 313 హెచ్పి పవర్ను గరిష్టంగా 494 ఎన్ఎమ్ల టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 29 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. దాదాపు 6.3 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. ఆల్ఫ్లైన్ వైట్, స్పేస్ సిల్వర్, బ్లాక్ సఫైర్ , స్టార్మ్ బే అనే నాలుగు రంగుల్లో లభ్యం. 10.7-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ను పొందుతుంది. ఇది బ్లూ రింగ్ ఫినిషర్ లోగోతో ఎమ్ స్పోర్ట్ లెదర్ స్టీరింగ్ వీల్, 12 స్పీకర్లతో హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, మసాజ్ ఫంక్షన్లతో కూడిన యాక్టివ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైట్ని కలిగి ఉంది. అలాగే డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్రూఫ్, పవర్ టెయిల్గేట్ మరియు స్టోరేజీతో కూడిన ఫ్లోటింగ్ ఆర్మ్రెస్ట్ ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. -
విడుదలకు సిద్దమవుతున్న ఎలక్ట్రిక్ కార్లు - వివరాలు
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ రోజురోజుకి పెరుగుతున్న వేళ ఇప్పటికే విడుదలైన వాహనాలను కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో టాటా పంచ్ ఈవీ, హ్యుందాయ్ ఎక్స్టర్ ఈవీ, మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఈవీ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 1. టాటా పంచ్ ఈవీ: ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో అత్యధిక భద్రత కలిగిన వాహనాల జాబితాలో ఒకటిగా ఉన్న టాటా పంచ్ త్వరలో ఎలక్ట్రిక్ రూపంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అనేక సార్లు టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ కారు ఈ ఏడాది చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో విడుదలకానున్నట్లు సమాచారం. దేశీయ విఫణిలో ఎంతోమంది వాహన ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో పంచ్ ఈవీ కూడా ఒకటి. ఇది రెండు బ్యాటరీ ఫ్యాక్ ఆప్షన్తో లభించనుంది. అవి 19.2 కిలోవాట్ (65 Bhp / 110 Nm) & 24 కిలోవాట్ (74 Bhp / 114 Nm) బ్యాటరీ ప్యాక్. ఈ ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది. 2. హ్యుందాయ్ ఎక్స్టర్ ఈవీ: ఈ ఏడాది మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త హ్యుందాయ్ ఎక్స్టర్ కూడా ఎలక్ట్రిక్ వెర్షన్ రూపంలో విడుదలకానుంది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారు 2024 చివరి నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. బ్యాటరీ ఇందులో 25 కిలోవాట్ నుంచి 30 కిలోవాట్ మధ్యలో ఉండవచ్చని అంచనా. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: టెక్సాస్ సరిహద్దులో మస్క్ - వీడియో వైరల్ 3. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఈవీ: మారుతి సుజుకి ఫ్రాంక్స్ త్వరలో ఎలక్ట్రిక్ కారుగా విడుదలకానుంది. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కంపెనీ 2030 నాటికి 6 వాహనాలను విడుదల చేయడానికి కంపెనీ సన్నద్ధమవుతోంది. ఇందులో ఒకటి ఫ్రాంక్స్ ఈవీ. ఈ వెర్సన్ గురించి కంపెనీ అధికారిక వివరాలు వెల్లడించనప్పటికీ.. ఇది ఒక సింగిల్ ఛార్జ్తో 400 నుంచి 450 కిమీ రేంజ్ అందించవచ్చని తెలుస్తోంది. Note: ఈ కథనంలో ఉపయోగించిన ఫోటోలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అధికారిక చిత్రాలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
Today Gold and Silver: బంగారం నేలచూపులు, షాకిస్తున్న వెండి
Today Gold and Silver Prices: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరింత దిగివచ్చాయి. గత కొన్ని సెషన్లుగా నేలచూపులు చూస్తున్న పసిడి ధర శుక్రవారం దేశవ్యాప్తంగా సుమారు 300 రూపాయలు క్షీణించింది. మూడు రోజుల్లో దాదాపు వెయ్యిరూపాయలు దిగి వచ్చింది. సెప్టెంబరు 26న రూ. 54,750గా ఉన్న 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర శుక్రవారం నాటికి రూ. 54 వేల స్థాయిని కోల్పోయి 53,650 స్థాయికి దిగి వచ్చింది. మూడు సెషన్లలో 1100 దిగివచ్చింది.హైదరాబాద్ మార్కెట్లో 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 250 రూపాయలు క్షీణించి రూ. 53,650గా ఉంటే…24 క్యారెట్ల బంగారం ధర రూ.270 తగ్గి రూ. 58,530గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అయితే వెండి మాత్రం వెయ్యి రూపాయలు పుంజుకుంది. దీంతో కిలో వెండి ధర ప్రస్తుతం హైదరాబాద్లో రూ. 77500 ఉండగా, ఢిల్లీలో రూ.74,700 పలుకుతోంది. (బ్యాంకు లాకర్లో రూ.18 లక్షలు చెదల పాలు: లాకర్ కొత్త నిబంధనలు తెలుసా?)కాగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్న సంగతి తెలిసిందే. అలాగే దేశీయంగా కూడా పెళ్లిళ్ల సీజన్లో పుంజుకున్నప్పటికీ, గత కొన్ని వారాలుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అటు దేశీయ స్టాక్మార్కెట్లు పాజటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. -
యాప్ట్రానిక్స్ స్టోర్స్లో ఐఫోన్లపై బంపర్ ఆఫర్లు
Offers on iPhone 15 series యాపిల్ ఉత్పత్తుల విక్రయ సంస్థ యాప్ట్రానిక్స్ తాజాగా ఐఫోన్ 15 స్మార్ట్ఫోన్లు, వాచ్లను దేశవ్యాప్తంగా 56 స్టోర్స్లో అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. గుంటూరు, సిద్ధిపేట, విజయనగరం, భీమవరం తదితర నగరాల్లోని స్టోర్స్ కూడా వీటిలో ఉన్నాయి. గుంటూరు, సిద్ధిపేట స్టోర్స్లో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఐఫోన్ 14 లేదా ఐఫోన్ 13లను కొనుగోలు చేసేవారు రూ. 11,000 విలువ చేసే యాక్సెసరీలు ఉచితంగా పొందవచ్చని పేర్కొంది. ప్రత్యామ్నాయంగా రూ. 2,500 ఫ్లాట్ డిస్కౌంటును ఎంచుకోవచ్చని తెలిపింది. అదనంగా యాపిల్కేర్ప్లస్, ప్రొటెక్ట్ప్లస్పై రూ. 2,000 మినహాయింపును, ఫోన్ను ఎక్సే్చంజ్ చేస్తే రూ. 6,000 వరకు బోనస్ వంటివి పొందవచ్చు. మొత్తం మీద గుంటూరు, సిద్ధిపేట కస్టమర్లు 31 శాతం వరకు ఆదా చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. -
ఫెస్టివ్ సీజన్: బంగారం, వెండి ధరలు, ఎన్నాళ్లీ ఒత్తిడి!
Gold and silver prices today : దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో శనివారం 10గ్రాముల పసిడి (22 క్యారెట్లు) ధర రూ. 100 పెరిగి రూ. 54,950కి చేరింది. అలాగే 10 గ్రాముల (24 క్యారెట్లు) బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 59,950 వద్ద ఉంది. అ టు వెండి ధరలు కూడా పుంజుకున్నాయి. దేశంలో కిలో వెండి ధర 300 రూపాయి ఎగిసి రూ. 75,800కి చేరింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 79,300గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో 60వేల మార్క్ను దాటేసిన 10 గ్రాముల గోల్డ్ ధరలో గత కొన్ని రోజులుగా పసిడి ధరల్లో తీవ్ర ఒత్తిడి కొనసాగుతోంది. దీంతో రానున్న ఫెస్టివ్ సీజన్ , దీపావళి పెళ్లిళ్ల ముహూర్తాల నేపథ్యంలో బంగారం కొనాలో, వెయిట్ చేయాలో తెలియని అనిశ్చితి వినియోగదారుల్లో నెలకొంది. ఫెడ్ వడ్డీరేట్లు ప్రస్తుతం యథాతథంగా ఉంచినప్పటికీ ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో మరోసారి వడ్డీ వడ్డన ఉంటుందనే అంచనాల మధ్య పసిడి ధరలపై ఒత్తిడి కొనసాగుతోందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు , జాతీయ అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక పరిస్థితులు, ఫెడ్ వడ్డీరేటు, రూపాయి, డాలరు కదలికలపై భారతీయ మార్కెట్లో పసిడి ధరలు ఆధారపడి ఉంటాయి. అలాగే ప్రపంచ బంగారం డిమాండ్, వివిధ దేశాలలో కరెన్సీ విలువలు, ప్రస్తుత వడ్డీ రేట్లు , బంగారు వాణిజ్యానికి సంబంధించిన ప్రభుత్వ నిబంధనలు వంటి అంశాలు కూడా దోహదం చేస్తాయి. -
ఫెడ్ ఎఫెక్ట్: స్టాక్ మర్కెట్ పతనం, దిగివచ్చిన పసిడి
Today Gold and Silver Prices: బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని సెషన్లుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర గురువారం కాస్త నెమ్మదించింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రా. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 150 తగ్గి రూ. 55,050గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర 180 రూపాయలు ఎ గిసి 60,050 వద్ద ఉంది. మరోవైపు కిలో వెండి ధర హైదరాబాద్లో రూ.78 వేలు పలుకుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. (డేటా భద్రత నిబంధనలు: తేడా వస్తే రూ. 250 కోట్ల వరకు జరిమానా) ముఖ్యంగా ఫెడ్ వడ్డీరేట్లు యధాతథంగాఉంచడంతో డాలర్ బలంపుంజుకుంది. డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్పంగా నష్టపోతోంది. ఇక స్టాక్మార్కెట్ల విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ ఏకంగా 500పాయింట్లకుపైగా కుప్పకూలగా, 147 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 19800 స్థాయిని కూడా కోల్పోయి మరింత బలహీన సంకేతాలందించాయి. అటు ఆయిల్ రేట్లు భగ్గుమన్నాయి. -
పండగ వేళ పసిడి పరుగు, వెండి ఎంత తగ్గిందంటే!
Today Gold and Silver Prices: దేశంలో బంగారం , వెండి ధరలు పైపైకే చూస్తున్నాయి. గతరెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర సోమవారం మరింత ఎగిసింది. అటు వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని సెషన్లుగా పరుగాపక పయనిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ పెరుగుతున్న చమురు, డాలరు బలం బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) (సెప్టెంబర్ 18, సోమవారం నా డు )లో బంగారం, వెండి ధరలు రెండూ పెరిగాయి.అక్టోబర్ 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్ MCXలో రూ. 105 పెరిగి 10 గ్రాములకు రూ.59,098గా ఉంది. అదేవిధంగా, డిసెంబర్ 5, 2023న మెచ్యూర్ అయ్యే వెండి ఫ్యూచర్స్ కూడా రూ. 307 లేదా 0.43 శాతం పెరిగి MCXలో కిలోకు రూ. 72,461 వద్ద ట్రేడవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల పసిడి ధర 140 రూపాయిలు పెరిగి, 10గ్రాములకు 55,050 గా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 150 రూపాయలు పుంజుకుని 60.050పలుకుతోంది. అటు వెండి కిలో స్వల్పంగా 200 రూపాయిలు తగ్గి కిలో వెండి 74,500గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అటు వరస లాభాలకుచెక్ చెప్పిన దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం నష్టాల్లోకి జారుకున్నాయి.మరోవైపు పెరుగుతున్న చమురు ధరల కారణంగా భారత కరెన్సీ రూపాయి డాలరు మారకంలో 83.22 వద్ద రికార్డు కనిష్ట స్థాయికి చేరుకుంది. -
లగ్జరీ కార్ ఫీచర్లతో టాటా నెక్సాన్ ఈవీ కొత్త వెర్షన్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ తాజాగా తమ నెక్సాన్ వాహనానికి సంబంధించి కొత్త వెర్షన్స్ ఆవిష్కరించింది. నెక్సాన్ ఈవీలో కొత్త వెర్షన్ ధర రూ. 14.74–19.94 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంటుంది. ఇది ఒకసారి చార్జి చేస్తే గరిష్టంగా 465 కిలోమీటర్ల రేంజి ఇస్తుంది. అలాగే, నెక్సాన్లో పెట్రోల్, డీజిల్కు సంబంధించి కొత్త వెర్షన్లను టాటా మోటర్స్ ప్రవేశపెట్టింది. (ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ సంపాదన ఎంతో తెలిస్తే!) వీటి రేటు రూ. 8.09 లక్షల (ఎక్స్–షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక నెట్వర్క్ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సంస్థ ఎండీ (ప్యాసింజర్ వెహికల్స్ విభాగం) శైలేష్ చంద్ర తెలిపారు. ప్రస్తుతం టాటా మోటర్స్ ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్ఫోలియోలో నెక్సాన్, టియాగో, టిగోర్, ఎక్స్ప్రెస్–టీ ఈవీ ఉన్నాయి. -
గోల్డ్ లవర్స్కి తీపి కబురు: బంగారం, వెండి ధరలు పతనం
Today Gold and Silver Price పండుగల వేళ బంగారం ప్రియులకు తీపి కబురు. భారతీయ మార్కెట్లో రెండు రోజులు వరుసగా పెరిగిన వెండి బంగారం ధరలు (సెప్టెంబర్ 13, 2023 )బుధవారం దిగి వచ్చాయి. దేశవ్యాప్తంగా వెండి బంగారం ధరలు తగ్గముఖం పట్టాయి.22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.340 మేర తగ్గింది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.380లు తగ్గి 59,450 పలుకుతోంది. వెండి కిలో ఏకంగా వెయ్యి రూపాయిలు క్షీణించింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి 73,500గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో పతనాన్ని నమోదు చేశాయి. అక్టోబరు 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్, రూ. 74 లేదా 0.13 శాతం స్వల్ప తగ్గుదల నమోదు చేసిన తర్వాత, 10 గ్రాములకు రూ. 58,592 వద్ద ఉంది. క్రితం ముగింపు రూ.58,626గా నమోదైంది. అదేవిధంగా డిసెంబర్ 5, 2023న వెండి ఫ్యూచర్స్ రూ. 385 లేదా 0.54 శాతం పతనాన్ని చవిచూశాయి .మునుపటి ముగింపు రూ. 71,934తో పోలిస్తే కిలోకు రూ. 71,750 వద్ద ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్లో కూడా బుధవారం నాడు బంగారం ధరలు పడిపోయాయి. అయితే మునుపటి సెషన్లో రెండు వారాల కనిష్ట స్థాయికి స్వల్పంగా అధిగమించాయి. . అమెరికా మార్కెట్, ద్రవ్యోల్బణ డేటా, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచుతుందా అనే కీలక అంశాలకోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. తాజా మెటల్ నివేదిక ప్రకారం స్పాట్ గోల్డ్ ఔన్స్కు 0.1 శాతం తగ్గి 1,910.87 డాలర్లు వద్ద ఉంది. ఆగస్టు 25 తరువాత నిన్న(మంగళవారం) 1,906.50 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. స్పాట్ సిల్వర్ ఔన్స్కు 0.8 శాతం తగ్గి 22.92 డాలర్ల స్థాయికి చేరుకుంది. మరోవైపు దేశీయ స్టాక్మార్కెట్లు ప్రారంభ నష్టాలనుంచి భారీగా కోలుకున్నాయి.సెన్సెక్స్ ఏకంగా 330 పాయింట్లకు పైగా ఎగియగా, నిఫ్టీ 20090 వద్ద రికార్డు స్తాయిలో కొనసాగుతోంది. -
ఆడి క్యూ8 స్పెషల్ ఎడిషన్, ధర చూస్తే..!
Audi Q8 special edition: పండుగల సీజన్ సందర్భంగా లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి ఇండియా స్పెషల్ ఎడిషన్ను తీసుకొచ్చింది. తాజాగా క్యూ8లో స్పెషల్ ఎడిషన్ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 1,18,46,000 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. మైథోస్ బ్లాక్, గ్లేషియర్ వైట్, డేటోనా గ్రే రంగుల్లో ఇవి లభిస్తాయి. పరిమిత సంఖ్యలోనే ఈ ఎస్యూవీల విక్రయాలు ఉంటాయని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. (10 శాతం జీఎస్టీ?ఇక డీజిల్ కార్లకు చెక్? నితిన్ గడ్కరీ క్లారిటీ) 3.0-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ మోటార్ను పొందుతుంది ఇది కేవలం 5.9 సెకన్లలో సున్నా నుండి 100kmph వరకు వేగవంతం చేస్తుంది మరియు గరిష్టంగా 250kmph వేగాన్ని అందుకోగలదు. ఎక్ట్సీరియర్లో, S-లైన్ ఎక్స్టీరియర్ ప్యాకేజీ , బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీతో Q8 స్పెషల్ ఎడిషన్ను రూపొందించింది. క్యాబిన్ 'ఏరో-అకౌస్టిక్స్'ని కలిగి ఉన్న అధిక-నాణ్యత క్యాబిన్తో, 4 జోన్ ఏసీ, ప్రీమియం సౌండ్ సిస్టమ్, 21 అంగుళాల అలాయ్ వీల్స్, ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఇంటీరియర్స్ మొదలైన ప్రత్యేకతలు ఈ ఎస్యూవీలో ఉన్నట్లు ధిల్లాన్ తెలిపారు. తమ ఉత్పత్తుల పోర్ట్ఫోలియోలో ఇది విశిష్టమైన ఎస్యూవీ అని ఆయన పేర్కొన్నారు. -
క్షీణిస్తున్న బంగారం, వెండి ధరలు: ఈ వివరాలు చూడండి!
Today Gold and Silver Prices పండగ సీజన్లో బంగారం, వెండి ధరలు వరుసగా దిగి వస్తున్నాయి. గత రెండు మూడు సెషన్లుగా వరుసగా తగ్గుతున్న బంగారం నేడు మరింత క్షీణించింది. మరో ముఖ్యమైన మెటల్ వెండి ధర కూడా దిగి వస్తోంది. అంతర్జాతీయ పరిణామాలు, చమురు ధరలు, డాలరు బలం నేపథ్యంలో దేశీయంగా తులం పసిడి ధర రూ. 60 వేల దిగువకుచేరింది. (మోడ్రన్ కార్లలో సెక్స్ నుంచి పాలిటిక్స్ దాకా మొత్తం లీక్: షాకింగ్ రిపోర్ట్) మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో కూడా బుధవారంతో పోలిస్తే నేడు తక్కువగానే ఉన్నాయి. అక్టోబర్ 5 డెలివరీకి సంబంధించిన 10 గ్రా.పసిడి రూ. 59043 వద్ద కొనసాగుతోంది. అలాగే నవంబర్ 30 డెలివరీకి సంబంధించిన MCX సిల్వర్ కిలోకు 72271 వద్ద ప్రారంభమైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి! హైదరాబాద్ మార్కెట్లో గురువారం 10 గ్రా. 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు తగ్గి 54,900వద్ద ఉంది.అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 59,890 గా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల, 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 55050 వద్ద, 60,040 వద్ద ఉన్నాయి. ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్లో ఏకంగా వెయ్యి రూపాయలు పతనమైన 77, 500 వద్ద ఉంది. దాదాపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇదే ధరలు కొనసాగుతున్నాయి. -
సెప్టెంబరులో రానున్న 5G బెస్ట్ ఫోన్లు ఏవంటే?
iQoo Z7 Pro 5g భారత మార్కెట్లో ఐక్యూ జెడ్ 7 ప్రో (ఆగస్టు 31న లాంచ్ అయింది. Z7 లైనప్లో ఈ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో తీసుకొచ్చింది కంపెనీ. బ్లూ లగూన్, గ్రాఫైట్ మ్యాట్ కలర్ ఆప్షన్లలోరెండు వేరియంట్లలో ఇది లభిస్తుంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ధరలు వరుసగా రూ.23,999, రూ.24,999గా నిర్ణయించింది. (30 వేల అడుగుల ఎత్తులో స్పెషల్ రాఖీ వేడుక: వీడియో వైరల్) బ్యాంక్ ఆఫర్ అయితే బ్యాంక్ ఆఫర్ కింద రెండువేల రూపాయల తగ్గింపు అందిస్తోంది. దీని ప్రకారం వీటి ధరలు వరుసగా రూ. 21,999, రూ. 22,999గా ఉంటాయి. అమెజాన్, ఐక్యూ అధికారిక వెబ్సైట్ ద్వారా సెప్టెంబర్ 5, మధ్యాహ్నం 12 నుంచి సేల్ షురూ అవుతుంది. వన్ప్లస్ నార్డ్ CE 3తో పోలిస్తే తక్కువ ధరలో గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. The #iQOOZ7Pro 5G is finally here! 🤩 Get this ultimate, power-packed device at an incredible price of just ₹21,999* at the upcoming sale on @amazonIN & https://t.co/ZK4Krrdztq on Sept 5. 💙📱 Know more: https://t.co/tfsaIl9h3Y#AmazonSpecials #FullyLoaded #iQOOZ7Pro5G pic.twitter.com/BgOHLnjnuC — iQOO India (@IqooInd) August 31, 2023 ఐక్యూ జెడ్7 ప్రో ఫీచర్లు : 6.78 అంగుళాల డిస్ప్లే, MediaTek Dimensity 7200 సాక్ ప్రాసెసర్, 2400x1080 పిక్సెల్స్ రిజల్యూషన్ , 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 64+2 ఎంపీ రియర్ డ్యుయల్ కెమెరాఉంటాయి. చైనా టెక్నో పోవా ఫోన్లు చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ టెక్నో మొబైల్ రెగ్యులర్ స్మార్ట్ఫోన్లకు కాస్త భిన్నంగా ఉండే విధంగా సరికొత్త స్మార్ట్ఫోన్లు పోవా 5, పోవా 5 ప్రో 5జీలను మార్కెట్లోకి విడుదల చేసింది. Tecno Pova 5: పోవా 5 ఫోన్ 6.78 ఇంచెస్ ఫుల్హెచ్డి ప్లస్ 120Hz డిస్ప్లేతో వచ్చింది. మీడియాటెక్ హీలియో G99 6nm చిప్సెట్, 50MP ఏఐ డ్యూయల్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 6000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ 45W స్మార్ట్ ఛార్జ్ టెక్నాలజీ కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 11,999 Tecno Pova 5 Pro 5G 120 Hz రిఫ్రెష్ రేట్తో , 6.78-అంగుళాల టచ్స్క్రీన్ డిస్ప్లే (FHD+) 50-megapixel + VGA రియర్ కెమెరా, 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అలాగే 128GB, 256GB ఇంటర్నల్ స్టోరేజీ ప్రత్యేకత. Tecno Pova 5 Pro నానో-సిమ్ , నానో-సిమ్ కార్డ్ స్లాట్లను కలిగి ఉంటుంది. డ్యూయల్ సిమ్ (GSM ప్లస్ GSM) మొబైల్. ఇది డార్క్ ఇల్యూషన్ , సిల్వర్ ఫాంటసీ రంగులలో అందుబాటులో ఉంది. Tecno Pova 5 Pro 5జి ప్రారంభ ధర రూ. 14,999. సెప్టెంబర్లో లాంచ్ అవుతున్న టాప్ స్మార్ట్ఫోన్లు వీటితోపాటు ఈ సెప్టెంబరులో ఐఫోన్ 15 సిరీస్లో ఐఫోన్ 15, 15 ప్లస్, ఐఫోన్ 15ప్రొ, ఐఫోన్ 15ప్రొ మ్యాక్స్ తదితర ఫోన్లు లాంచ్ కానున్నాయి.ఇంకా హానర్ 90 మొబైల్ తయారీ దారు హానర్ రెండేళ్ల తరువాత భారత మార్కెట్లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. 6.4-అంగుళాల పూర్తి-HD+ డైనమిక్ AMOLED డిస్ప్లే,50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా లాంటి ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఈ (Samsung Galaxy S23 FE) లాంచ్ కానుంది. అలాగే Moto G54 5G స్మార్ట్ఫోన్ ఈనెలలోనే రానుంది. 6.5-అంగుళాల పూర్తి-HD+ డిస్ప్లే, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 50 ఎంపీ కెమెరా లాంటి ఫీచర్లుంటాయని అంచనా. It’s official! Apple will launch the iPhone 15 at the next #AppleEvent on September 12th at 10 a.m. PDT 🚨 Are you excited? pic.twitter.com/6mBEW7Z0Tm — Apple Hub (@theapplehub) August 29, 2023 Samsung Galaxy S23 FE Might Launch in September 2023 Specs: -6.4'' FHD+ 120Hz Dynamic AMOLED display -Snapdragon 8 Gen 2 or Exynos 2200 SoC -50MP Main +8MP UW +12MP Telephoto camera & 10MP selfie -4500mAh battery with 25W charging -One UI 5.1, Android 13#Samsung #GalaxyS23FE pic.twitter.com/Y3N1tH2ky8 — Smartprix (@Smartprix) August 24, 2023 moto G54 5G is launching on September 6, 2023 in India. - 6.55" FHD+ 120Hz IPS LCD - MediaTek Dimensity 7020 - 50MP OIS + 8MP camera - 16MP front - Stereo speakers, Dolby Atmos - 6000mAh battery, 33W charge - Android 13 - 3.5mm, Side FS - 192g, 8.89mm#Motorola #moto #motoG54 pic.twitter.com/TlfViCJcL4 — Oneily Gadget (@OneilyGadget) August 31, 2023 -
అప్రీలియా ఎస్ఆర్ స్టార్మ్ 125కొత్త బైక్: ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!
Aprilia SR Storm 125 వాహన తయారీలో ఉన్న పియాజియో వెహికిల్స్ తాజాగా అప్రీలియా ఎస్ఆర్ స్టార్మ్ 125 స్కూటర్ ప్రవేశపెట్టింది. నాలుగు రంగుల్లో ఇది లభిస్తుంది.స్పోర్టీ స్టైలింగ్తో ఆకర్షణీయంగా ఉంది. ఇంజీన్ 125 సీసీ 3-వాల్వ్ 4-స్ట్రోక్ ఐ-గెట్ ఇంజన్ పొందుపరిచారు. గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని 9.6 సెకన్లలో అందుకుంటుంది. డిస్క్ బ్రేక్స్తో 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్, సెమీ డిజిటల్ క్లస్టర్, గ్రాఫిక్స్తో ట్యూబ్యులార్ స్టీల్ ఫ్రేమ్ వంటి హంగులు ఉన్నాయి. పరిచయ ఆఫర్ ధర ఎక్స్షోరూంలో రూ.1,07,999 ఉంది. -
వామ్మో! హీటెక్కుతున్న బంగారం ధరలు
Today Gold and Silver prices: బంగారం, వెండి ధరలు మళ్లీ మండుతున్నాయి. ఆల్ టై హై నుంచి కొద్దిగా వెనక్కి తగ్గినప్పటికీ, డాలర్ బలంతో మళ్లీ భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా గోల్డ్, సిల్వర్ ధరలు వేగం పుంజకున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.250 పెరిగి రూ.54,750గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 270పెరిగి రూ. 59,670 పలుకుతోంది. అటు వెండి ధర కూడా పెరిగింది. కిలోకు రూ. 200 పెరిగిన వెండి ధర కిలోకు 77. 100గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. MCX మార్కెట్లో వరుసగా రెండో రోజు జంప్ ఆగస్టు 29, మంగళవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం , వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయి. అక్టోబరు 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్, రూ. 90 లేదా 0.15 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.58,949గా ఉంది.అదేవిధంగా, సెప్టెంబరు 5, 2023న మెచ్యూరయ్యే వెండి ఫ్యూచర్లు కూడా రూ. 162 లేదా 0.22 శాతం పెరిగి కిలోకు రూ. 73,700 వద్ద ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధర స్పాట్ గోల్డ్ ఔన్స్కు 0.3 శాతం పెరిగి 1,924.84కి చేరుకుంది, ఆగస్టు 10 నుండి అత్యధికం. అమెరికా బంగారం ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి 1,952.90 డాలర్ల వద్ద ఉన్నాయి. వెండి ఔన్స్కు 0.3 శాతం పెరిగి 24.32 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఫెడ్ సెప్టెంబర్ పాలసీ నిర్ణయం, ఆగస్ట్ లేబర్ మార్కెట్ డేటా ఆధారంగా బంగారం ధరలు కదలాడుతాయని మార్కెట్వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్పంగా నష్టపోయింది. సోమవారం నాటి ముగింపు 82.62 తో పోలిస్తే మంగళవారం 82.70 వద్ద ముగిసింది. -
ఆ ఐకానిక్ బైక్ మళ్లీ వచ్చేసింది.. అదిరిపోయే లాంచింగ్ ఆఫర్ కూడా
Karizma XMR: దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్ సరికొత్త బైక్ను (మంగళవారం, ఆగస్టు 29) లాంచ్ చేసింది. కరిజ్మా XMR 210 పేరుతో ఈ కొత్త బైక్ లాంచ్తో కరిజ్మా బ్రాండ్ను రీలాంచ్ చేసింది. అంతేకాదు ఈ బైక్పై ఆకర్షణీయమైన్ రూ. 10వేల ప్రత్యేక తగ్గింపు అందిస్తోంది. యంగ్ జనరేషన్ బైకర్లను దృష్టిలో ఉంచుకని దీన్ని తీసు కొచ్చినట్టు హీరో మోటోకార్ప్ కంపెనీ వెల్లడించింది. బుకింగ్లను కూడా షురూ చేసింది. రూ. 1,82,900 లాంచింగ్ ప్రైస్గా ఉన్న Karizma XMR 210 ఈ తగ్గింపుతో రూ. 1,72,900 (ఎక్స్-షోరూమ్ ధర ఆల్ ఇండియా) అందుబాటులో ఉంటుంది. నటుడు,బ్రాండ్ అంబాసిడర్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కరిజ్మా XMR 210ని ఆవిష్కరించారు. ఇది ఐకానిక్ ఎల్లో, టర్బో రెడ్ , మ్యాట్ ఫాంటమ్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభ్యం. Karizma XMR 210 ఇంజీన్, ఫీచర్లు 210cc సింగిల్-సిలిండర్, 4V, DOHC , లిక్విడ్-కూల్డ్ యూనిట్ 9250 RPM (కంపెనీ అత్యంత శక్తివంతమైన ఇంజిన్)ను అమర్చింది. RPM వద్ద 20.4 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్ట వేగం గంటకు 140 కి.మీ. అని కంపెనీ తెలిపింది. లిక్విడ్ కూల్ సెటప్ డ్యూయల్-ఛానల్ ABS, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, 6-స్పీడ్ గేర్బాక్స్ ఫ్యాటర్ రియల్ వెక టైర్తో వస్తుంది.ఇంకా ఈ బైక్లో కొత్త ఎల్ఈడీ లైట్లు , ఇండికేటర్లు, స్లీకర్ ఇంధన ట్యాంక్, షార్ప్ లైన్లో, రైడర్కు ప్రొటెక్షన్గా స్నాజీ విండ్స్క్రీన్తో యంగస్టర్స్ను ఆకట్టుకునేలా ఉంది. కాల్ల్స్, ఇతర నోటిఫికేషన్ అలర్ట్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్, ఇంకా టర్న్-బై-టర్న్ నావిగేషన్ కూడా ఉంది. సరికొత్త ఫుల్లీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. ఇది గేర్ పొజిషన్ ఇండికేటర్, తేదీ, సమయం, టూర్, ఓడోమీటర్ రీడింగ్, ఇంధన స్థాయి, టాకోమీటర్ స్పీడోమీటర్ రీడింగ్ల వంటి సమాచారాన్ని అందిస్తుంది. Say hello to the Most Powerful in its Class machine loaded with cutting-edge tech, and a design that's an absolute head-turner. 😎 Introducing the new #KarizmaXMR, at an introductory price of Rs. 1,72,900* (*Ex-showroom price All India). BOOKINGS OPEN https://t.co/Y7zhD7lJTE pic.twitter.com/7NEhA4Fijr — Hero MotoCorp (@HeroMotoCorp) August 29, 2023 -
అభిమానులకు గుడ్న్యూస్: రూ. 999లకే జియోభారత్ ఫోన్ 4జీ సేల్
JioBharat 4G ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఇటీవల లాంచ్ చేసిన JioBharat 4G ఫోన్ అమెజాన్లో కొనుగోలుకు అందు బాటులో ఉంది. రూ.999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా ఇప్పటికీ 2G ఫోన్లను ఉపయోగిస్తున్న వారికి సరసమైన ధరలో, ఇంటర్నెట్ సేవలు అందించే లక్ష్యంతో జియోభారత్ 4G ఫోన్ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 23 భాషలకు మద్దతు ఇస్తుందని విడుదల సందర్బంగా జియో ప్రకటించింది. కార్బన్తో కలిసి తీసుకొచ్చిన ఈ ఫోన్లో 1000mAh బ్యాటరీ , మైక్రో SD కార్డ్ వంటి ఫీచర్లతోపాటు స్విఫ్ట్ 4G ఇంటర్నెట్ కనెక్ట్ సామర్థ్యంతో వచ్చింది. JioBharat 4G ఫీచర్లు 1.77-అంగుళాల TFT డిస్ప్లే 3.5mm హెడ్ఫోన్ జాక్ 0.3MP కెమెరా విత్ LED ఫ్లాష్ 1000mAh బ్యాటరీ ఎక్స్టర్నల్ మైక్రో SD కార్డ్ సపోర్ట్ ద్వారా వినియోగదారులు 128GB వరకు స్టోరేజీని విస్తరించుకోవచ్చు. "భారత్" , వెనుక కార్బన్ లోగోను డ్యూయల్ బ్రాండింగ్తో వస్తుంది. (టాలీవుడ్ మన్మధుడి కళ్లు చెదిరే నెట్వర్త్, కార్లు, ఇల్లు ఈ విషయాలు తెలుసా?) రూ. 123 ప్లాన్ అంతేకాదు ఈఫోన్ లాంచింగ్ సందర్బంగా స్పెషల్గా రూ. 123 ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీ. అపరిమిత వాయిస్ కాల్లు, 14 GB డేటా అందిస్తుంది. డియో స్ట్రీమింగ్ను ప్రారంభించే Jio యాప్లకు యాక్సెస్ని అందిస్తుంది. అయితే, భవిష్యత్తులో ఇతర రిటైల్ అవుట్లెట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందా లేదా అనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. (ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే గిఫ్ట్) -
భారత్లో రూ. 8,000 కోట్ల పెట్టుబడులు - వచ్చే ఐదేళ్లలో..
న్యూఢిల్లీ: హౌసింగ్ సొల్యూషన్స్, గాజు కిటికీలు తదితర ఉత్పత్తుల తయారీ దిగ్గజం సెయింట్ గొబెయిన్ ఇండియా .. భారత్లో రూ. 8,000 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనుంది. వచ్చే అయిదేళ్లలో వివిధ విభాగాల్లో పెట్టుబడులు, కంపెనీల కొనుగోళ్ల కోసం ఈ నిధులను వెచ్చించనుంది. కంపెనీ చైర్మన్ బి. సంతానం ఈ విషయాలు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 8–10 శాతం మేర వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. సెయింట్ గొబెయిన్ గ్లోబల్ వ్యాపారంలో అత్యంత లాభదాయక మార్కెట్లలో భారత్ మూడో స్థానంలో ఉందని ఆయన వివరించారు. ‘వృద్ధి, లాభదాయకత, విస్తరణ, డిజిటల్, నిపుణులు వంటి అంశాల్లో సెయింట్ గొబెయిన్ ఇండియా మెరుగ్గా రాణిస్తోంది. నిర్మాణ రంగంలో కావచ్చు.. పారిశ్రామిక రంగంలో కావచ్చు మా వ్యాపారాలన్నీ బాగున్నాయి‘ అని సంతానం తెలిపారు. ప్రస్తుతం తాము మధ్యప్రాచ్యం, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ తదితర దేశాలకు భారత్ నుంచి ఎగుమతులు చేస్తున్నామని చెప్పారు. భారత్ నుంచి ఇతరత్రా ఉత్పత్తుల ఎగుమతులు మందగించినా తమవి మాత్రం స్థిరంగా 15 శాతం స్థాయిలో వృద్ధి చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఫ్రాన్స్కు చెందిన సెయింట్ గొబెయిన్ ఇటీవలే రాక్వూల్ ఇండియా, ట్విగా సంస్థలను కొనుగోలు చేసింది.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
సమన్వయంతో పనిచేద్దాం: ఎస్పీ
‘12, 13 తేదీల్లో పత్రికా ప్రకటనలపై ముందస్తు అనుమతి తప్పనిసరి’
రూ.707.61కోట్లు ప్రభుత్వ సాయం
12, 13 తేదీల్లో మద్యం బంద్
No Headline
ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశాం: కలెక్టర్
‘ఎన్నికల భారతం’ కవితా సంకలనం ఆవిష్కరణ
ఓటుహక్కు వినియోగించుకుందాం
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం తగదు
ఎస్బీఐ రివార్డు పాయింట్ల పేరిట మోసం
తప్పక చదవండి
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement