-
సిద్ధార్థ్ మల్హోత్రా, కృతీ సనన్ జంటగా రొమాంటిక్ కామెడీ మూవీ!
సిద్ధార్థ్ మల్హోత్రా, కృతీ సనన్ హీరో హీరోయిన్లుగా హిందీలో ఓ కొత్త సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘దస్వి’ ఫేమ్ తుషార్ జలోట దర్శకత్వం వహిస్తారట. దినేష్ విజన్ నిర్మించనున్నారని టాక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని, ఈ ఏడాదిలో చిత్రీకరణను ప్రారంభించాలని అనుకుంటున్నారని భోగట్టా. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచన చేస్తున్నారట దినేష్ విజన్. మరి... ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో సిద్ధార్థ్, కృతీ సనన్ జోడీగా నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
నా భర్త అలా ఉంటే చాలు.. ఇంకేం అక్కర్లేదు: కృతి సనన్
ఒంటరిగా ఉన్న హీరోయిన్లు చాలామంది గత కొన్నాళ్లలో పెళ్లి చేసేసుకుంటున్నారు. ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసి, వివాహ బంధంలోకి అడుగుపెట్టేస్తున్నారు. మరికొందరు అందుకు తగ్గ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు. అలా ఇప్పుడు కృతి సనన్ కూడా పెళ్లికి రెడీ అయిపోయినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే కాబోయే భర్త ఎలా ఉండాలో హింట్స్ కూడా ఇచ్చేస్తోంది. ఈ మధ్య ఈమె లండన్కి చెందిన కబీర్ బహియాతో అనే వ్యాపారవేత్తతో కలిసి కనిపించడంతో ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ముఖానికి సర్జరీ చేసుకుని షాకిచ్చిన యువ నటి.. ఫొటో వైరల్)'ఏ విషయంలోనైనా మనం ఆశ పెట్టుకుంటే ఒత్తిడితో ఇబ్బంది పడతాం. అందుకే నేను ఎలాంటి ఆశ పెట్టుకోను. ఏం జరిగినా సరే తీసుకోవడానికి రెడీగా ఉంటాను. ఇకపోతే నాకు కాబోయే భర్త నాతో నిజాయతీగా ఉండాలి. నన్ను నవ్వించాలి. నన్ను, నా పనిని గౌరవించాలి. నాతో ఎక్కువ టైమ్ గడపాలి. అన్నింటికి ముఖ్యమైంది నన్ను బాగా చూసుకోవాలి. అలా అని నాతో సరితూగాలనే కోరిక అయితే లేదు' అని కృతి సనన్.. కాబోయే వాడి గురించి చెప్పుకొచ్చింది.కృతి చెప్పిన దానిబట్టి చూస్తుంటే త్వరలో పెళ్లి చేసుకునేలా కనిపిస్తుంది. మరి లండన్ వ్యాపారవేత్తతో ఏడడుగులు వేస్తుందా? లేదంటే ఈమె మనసులో మరెవరైనా ఉన్నారా అనేది క్లారిటీ రావాలి. ఇక సినిమాల విషయానికొస్తే.. 'ది క్రూ' మూవీతో ఈ మధ్య హిట్ కొట్టింది. ప్రస్తుతం హీరోయిన్ కమ్ నిర్మాతగా 'దో పత్తీ' మూవీ చేస్తోంది. (ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్కి హైకోర్టు నుంచి నోటీసులు.. కారణం ఏంటంటే?) -
డెనిమ్ జీన్స్ అవుట్ ఫిట్ తో కృతి సనన్ స్టైలిష్ లుక్స్ (ఫొటోలు)
-
నాభి అందాలతో రాశీ.. చాన్నాళ్ల తర్వాత అలా కనిపించిన తృప్తి!
భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్న కృతి సనన్ మత్తెక్కించేలా చూస్తూ కాక రేపుతున్న 'యానిమల్' బ్యూటీ తృప్తి బాయ్ ఫ్రెండ్ తో 'రానా నాయుడు' బ్యూటీ క్యూట్ పోజులు షాకింగ్ లుక్స్ తో ఆశ్చర్యపరుస్తున్న మెగాడాటర్ నిహారిక చూస్తేనే మతిపోయేల్లాంటి స్టిల్స్ తో ఆకట్టుకున్న పాయల్ రాజ్ పుత్ View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by FAIMA (@faima_patas) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Jasnya Jayadeesh (@jasnya_k_jayadeesh) View this post on Instagram A post shared by prateik patil babbar (@_prat) View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
బాలీవుడ్ పై కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు..!
-
ప్రభాస్ ఆదిపురుష్పై ట్రోల్స్.. డైరెక్టర్ను భయపెట్టారు: నటుడు కామెంట్స్!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరెకెక్కించిన ఈ చిత్రం గతేడాది రిలీజైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపర్చింది. రామాయణాన్ని ఇప్పటి సినీ ప్రియులకు అనుగుణంగా తెరకెక్కించడంలో ఓం రౌత్ సక్సెస్ కాలేకపోయారు. దీంతో ఆదిపురుష్పై పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వచ్చాయి. తాజాగా ఈ మూవీపై వచ్చిన విమర్శలపై ఆదిపురుష్ నటుడు బిజయ్ ఆనంద్ స్పందించారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కళను విమర్శించడం సరికాదని హితవు పలికారు. సినిమా నచ్చకపోతే చూడటం మానేయాలి కానీ..నటీనటులను, చిత్రబృందాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. బిజయ్ ఆనంద్ మాట్లాడుతూ..'మీకు సినిమా నచ్చకపోతే చూడటం మానేయండి. అంతే నటీనటులను విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఒక సినిమా తీయాలంటే అందులో ఎంత కష్టం ఉంటుందో అందరికీ తెలుసు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీయడం అంటే మాటలు కాదు. మీకు నచ్చితేనే సినిమా చూడండి. కొంతమంది కళాకారులను భయపెట్టాలని చూస్తున్నారు. కానీ ఓం రౌత్ అలాంటి భయపడలేదు. ట్రోల్స్ పట్టించుకోకుండా ధైర్యంగా ఉన్నాడు. అందుకే అతను నాకు ఇష్టం' అని అన్నారు. తాజాగా బిజయ్ ఆనంద్ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. కాగా.. బిజయ్ ఆనంద్ ఆదిపురుష్ చిత్రంలో బ్రహ్మ పాత్రలో కనిపించారు. తాజాగా విడుదలైన బడే మియాన్ చోటే మియాన్ సినిమా ప్రమోషన్స్లో ఈ కామెంట్స్ చేశారు. -
హీరోలకు అంత సీన్ లేదు: హీరోయిన్ కృతిసనన్
ఏ సినిమా ఇండస్ట్రీ తీసుకున్నా సరే హీరోలదే హవా. స్టార్ హీరోలు ఉన్నారంటే ప్రేక్షకుడు, థియేటర్ కి వస్తాడనేది చాలామంది బలంగా నమ్మే మాట. ఇప్పుడు ఈ విషయమై 'ఆదిపురుష్' ఫేమ్ కృతిసనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. హీరోలకు అంత సీన్ లేదు అనేలా కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఏంటి విషయం? కృతిసనన్ ఏమంది? (ఇదీ చదవండి: నిద్ర కరువైంది.. మళ్లీ నటిస్తానని అనుకోలేదు: యంగ్ హీరోయిన్) 'పెద్ద హీరో ఉన్నంత మాత్రాన సినిమా చూడటానికి ప్రేక్షకులు పరుగెత్తుకుని వచ్చేయరు. కథ బాగుంటే.. అందులో యాక్టర్స్ ఆడా? మగా? అనేది చూడరు. బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పటికీ చాలామంది నిర్మాతలు.. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ అంటే చిన్నచూపు చూస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. హీరోలు లేనప్పటికీ 'క్రూ' మూవీ బాగా ఆడుతోంది. ఇది చూసైనా సరే ఇండస్ట్రీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను.' పైన కృతిసనన్ చెప్పింది నిజమే. ఎందుకంటే ఒకప్పుడు ప్రేక్షకులు.. హీరోల కోసం సినిమాలకు వచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం కంటెంట్ బాగుందా? ఎంటర్ టైన్ మెంట్ ఉందా? లాంటివి చాలా ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా తన 'క్రూ' మూవీ హిట్టయ్యేసరికి కృతి ఈ వ్యాఖ్యలు చేసింది. ఈమె చెప్పిన దానిబట్టి చూస్తే హీరోలకు అంత సీన్ లేదని అన్నట్లేగా! ఇకపోతే కృతిసనన్.. మహేశ్ 'వన్ నేనొక్కడినే', ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే) -
ఇక్కడ టిల్లు స్క్వేర్.. అక్కడ క్రూ.. రెండింట్లో ఒకటి కామన్!
కంటెంట్ బాగుంటే చాలు.. బడ్జెట్, తారాగణం.. ప్రమోషన్స్.. ఇవేవీ పట్టించుకోరు జనాలు. ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనిపించిందా.. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా లెక్క చేయకుండా పోలోమని థియేటర్లకు వెళ్లిపోతుంటారు. అలా ఈ మధ్య ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచాయి. తెలుగులో డీజే టిల్లుకు సీక్వెల్గా వచ్చిన టిల్లు స్క్వేర్ సైతం సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. రేపటితో వంద కోట్ల క్లబ్బులో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఓన్లీ మ్యాజిక్ టిల్లు స్క్వేర్లో కథ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు.. ఓన్లీ మ్యాజిక్ అంతే! పంచులు, కామెడీ డైలాగులు పటాసుల్లా పేలుతాయి. అలాంటి మ్యాజిక్తోనే బాలీవుడ్లో ఓ సినిమా వచ్చింది.. అదే క్రూ. ఇందులో పెద్దగా ఎమోషన్స్ ఉండవు, సీరియస్ సినిమా కానే కాదు.. కామెడీ ఎంటర్టైనర్. ముగ్గురు ఫ్లయిట్ అటెండెట్లు.. కరీనా, టబు, కృతి పని చేసే ఎయిర్లైన్స్ త్వరలో దివాలా తీస్తుందని ఓ రూమర్. కథేంటంటే? పని ఎక్కువ, జీతాలు తక్కువ, మరోవైపు ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందోనన్న భయం. ఈ ముగ్గురూ ఉన్న ఫ్లయిట్లో ఓరోజు సడన్గా ఓ పెద్దాయన కుప్పకూలిపోతాడు. తన చొక్కా కింద బంగారు కడ్డీలు కనిపిస్తాయి. అవి కొట్టేసి జీవితంలో సెటిలైపోవాలనేది వారి ఆశ. తరువాత ఏమైందన్నదే కథ. ముగ్గురు హీరోయిన్ల మధ్య కామెడీ బాగా వర్కవుట్ అయింది. కలెక్షన్స్ ఎంతంటే? మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు హిందీ బాక్సాఫీస్ వద్ద పోటీ లేకపోవడంతో దూసుకుపోతోంది. రాజేశ్ ఏ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.87 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. చూస్తుంటే త్వరలోనే రూ.100 కోట్లు దాటేసేలా కనిపిస్తోంది. అక్షయ్ కుమార్- టైగర్ ష్రాఫ్ల బడే మియా చోటే మియా, అజయ్ దేవ్గణ్ మైదాన్ ఈ నెల 10న రిలీజ్ కానుంది. అప్పటివరకు క్రూ మూవీ కలెక్షన్స్కు ఎలాంటి ఢోకా లేనట్లే! CREW is flying high with a strong start at the box office with a solid week 1 collection! 🛫#CrewInCinemasNow Book your tickets now: https://t.co/jAZNn6fYMR#Tabu #KareenaKapoorKhan @kritisanon @diljitdosanjh and a special appearance by @KapilSharmaK9 pic.twitter.com/IZJnvt9QIC — BalajiMotionPictures (@balajimotionpic) April 5, 2024 చదవండి: మలయాళంలో రూ.200 కోట్లు వసూలు చేసిన మంజుమ్మల్ బాయ్స్ ఎలా ఉంది? -
Kriti Sanon Latest Photos: ఆ హీరోతో సినిమా.. పగటి కలగానే మిగిలిపోయింది
-
అలాంటి వ్యక్తితో డేటింగ్ చేయడం ఇష్టం : కృతి సనన్
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ వరుస హిట్లతో దూసుకెళ్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ‘తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా'(Teri Baaton Mein Aisa Uljha Jiya) మూవీతో ఓ సూపర్ హిట్ని తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఆమె నటించిన క్రూ(Crew)’ చిత్రం కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఇలా ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ పొడుగుకాళ్ల సుందరీ.. తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. డేటింగ్ కోసం ఓ మగాడు కావాలని, అది భారతీయుడు అయితే మరీ మంచిదని అంటోది ఈ పొడుగు కాళ్ల సుందరి. ‘శ్వేత జాతీయులు హాట్గా ఉండొచ్చు. కానీ నేను ఇప్పటి వరకు ఏ విదేశీయుడికి అంతగా ఎట్రాక్ట్ కాలేదు. నాకు భారతీయ మగాళ్లు అంటేనే ఇష్టం. దేశీ అయిన వ్యక్తితో నేను డేటింగ్కు ఇష్టపడతాను. హిందీ అర్థం చేసుకునే మగాడు అయితే ఒకే. నేను ప్రతిసారి ఇంగ్లీష్లో మాట్లాడలేను. ఇంగ్లీష్ పాటలకు డ్యాన్స్ కూడా చేయలేను. నాతో కలిసి పంజాబీ, హిందీ పాటలకు డ్యాన్స్ చేసే భారతీయ మగాడు కావాలి. అలాంటి వ్యక్తితో డేటింగ్ చేయడానికి నేను ఇష్టపడతాను’ అని కృతి సనన్ చెప్పుకొచ్చింది. కాగా, కృతి సనన్ ఇప్పటికే ఓ వ్యక్తితో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. వయసులో తనకంటే 10 ఏళ్లు చిన్నవాడు, క్రికెటర్ ధోనీకి అత్యంత సన్నిహితుడైన కబీర్ బహియాతో ప్రేమాయణం సాగిస్తుందని బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. -
రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రం.. సడన్గా ఓటీటీలోకి!
బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'తేరీ బాతోన్ మే ఐజా ఉల్జా జియా'. జాన్వీ కపూర్ అతిథి పాత్రలో మెరిసింది. అమిత్ జోషి, ఆరాధన సాహ్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 9న థియేటర్లలో విడుదలైంది. మొదట్లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఆ తర్వాత మంచి వసూళ్లనే రాబట్టింది. దాదాపు రూ.130 కోట్లు రాబట్టి సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. సడన్గా అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. కాకపోతే రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది. ఈ మధ్య చాలా సినిమాలను అమెజాన్ ప్రైమ్ తన ప్లాట్ఫామ్లో ముందుగా అద్దె పద్దతిలోనే తీసుకువస్తోంది. కొన్నాళ్ల తర్వాతే ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతానికైతే ఈ మూవీ చూడాలంటే రెంట్ చెల్లించాల్సిందే! #TeriBaatonMeinAisaUljhaJiya is now available for RENT. Amazon Prime. pic.twitter.com/BMpiUajA55 — Christopher Kanagaraj (@Chrissuccess) March 22, 2024 చదవండి: స్టార్ హీరోహీరోయిన్లు డిప్రెషన్లో.. నాకు అలాంటి లైఫ్ వద్దు! -
నాకు సిగ్గబ్బా.. 25 ఏళ్లవరకు ఎవరినీ ప్రేమించలేదు: హీరో
యాక్షన్ సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు టైగర్ ష్రాఫ్. ఇతడు ప్రస్తుతం బడే మియా చోటే మియా (పెద్దోడు.. చిన్నోడు) అనే మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నాడు. టైగర్ ష్రాఫ్తో పాటు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ యాక్షన్ సినిమా రంజాన్కు రిలీజ్ కానుంది. ఇకపోతే టైగర్ చేతిలో బాఘీ 4 కూడా ఉంది. 25 ఏళ్ల వయసులో లవ్.. ఈ మూవీ థియేటర్లో రిలీజైన తర్వాత అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ గ్రాండ్ ఈవెంట్లో ప్రకటించారు. ఈ వేదికపై టైగర్పై జోకులు పేల్చాడు హీరో వరుణ్ ధావన్. ముందుగా యాక్షన్ హీరో మాట్లాడుతూ.. నేను పెద్దగా ఎవరితో మాట్లాడను, కలిసిపోనని నీకు తెలుసుగా వరుణ్. అందరితో కలివిడిగా ఉండలేను. అందుకే 25 ఏళ్ల వరకు నాకంటూ ఒక గర్ల్ఫ్రెండ్ కూడా లేదు అని చెప్పాడు. ఫస్ట్ లవ్.. ఆమె కాదా? అయితే వరుణ్ మాత్రం.. నిజంగానా? 25 ఏళ్లవరకు నీకు ప్రియురాలే లేదా? అని ఆశ్చర్యపోయాడు. అవును, నాకు పాతికేళ్లు నిండాక.. తొలి సినిమా ఆడిషన్కు వెళ్లినప్పుడు మొట్టమొదటిసారి ప్రేమలో పడ్డాను అని చెప్పుకొచ్చాడు. అంటే నీ ఫస్ట్ మూవీ హీరోయిన్ కృతి సనన్నే కదా నువ్వు మొదటిసారి ప్రేమించింది? అని అడిగాడు. ఆమె పేరు చెప్పగానే షాకైన టైగర్.. కాదు.. ఇంకో పేరు చెప్పు అన్నాడు. దీంతో వరుణ్.. సరే, నేను సరదాగా అన్నాను. ఆమె మంచి స్నేహితురాలు మాత్రమే! ఎవరూ దీన్ని సీరియస్గా తీసుకోకండి అని చెప్పాడు. దిశాతో డేటింగ్- బ్రేకప్ కాగా టైగర్ ష్రాఫ్- దిశా పటానీ ఇద్దరూ రిలేషన్లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ మధ్య విడిపోయారని రూమర్స్ రాగా ఇటీవల మాత్రం ఓ ఈవెంట్లో ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకున్నారు. ఆమె పక్కన కూర్చోవడానికి మాత్రం అతడు నిరాకరించాడు. ప్రేమికులుగా విడిపోయినా స్నేహితులుగా వీరు కలిసే ఉన్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. Tiger talks about Disha and that she is his first gf and how he met her Varun: Kriti Sanon 😒🤣#KritiSanon pic.twitter.com/JSVtwZ3Dg1 — kariti_arab (@aaryan_koki) March 19, 2024 చదవండి: అది జరగాలని కోరుకుంటున్నా.. రజనీకాంత్పై ధనుష్ కామెంట్ -
రామ్ చరణ్ సరసన మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్
-
విమానంలో చోరీ
టబు, కరీనా కపూర్, కృతీసనన్ ప్రధాన పాత్రల్లో, దిల్జీత్ సింగ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ది క్రూ’. కార్పొరేట్ ఏవియేషన్ బిజినెస్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో టబు, కరీనా, కృతీ ఎయిర్హోస్టెస్గా నటించారు. ఓ విమానం హైజాకింగ్, దొంగతనం నేపథ్యంలో ‘ది క్రూ’ సినిమా కథనం ఉంటుందని బీ టౌన్ టాక్ . ఇక బాలీవుడ్లో ‘లూట్కేస్’ సినిమా తీసిన రాజేష్ కృష్ణన్ ఈ సినిమాకు దర్శకుడు. ‘వీరే ది వెడ్డింగ్ (2018)’, ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్(2023)’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ నిర్మించిన రేఖా కపూర్, ఏక్తా కపూర్ ‘ది క్రూ’ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమాలోని ప్రధాన తారాగణం అయిన టబు, కరీనా, కృతీసనన్ల కొత్త పోస్టర్స్ను రిలీజ్ చేశారు మేకర్స్. తొలుత ఈ సినిమాను మార్చి 22న రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత మార్చి 29కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. -
షాహిద్ కపూర్ & కృతి సనన్ తమ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు
-
కృతిసనన్ కిక్ ఇచ్చేలా.. మాళవిక మాత్రం సూపర్ హాట్ షో!
ఆ వీడియో షేర్ చేసిన యాంకర్ అనసూయ నాటీ పోజుల్లో రచ్చలేపుతున్న హీరోయిన్ కృతిసనన్ గ్లామర్ ట్రీట్ ఇచ్చి టాప్ లేపుతున్న సన్యా మల్హోత్రా స్మైల్ తో చంపేస్తున్న 'హనుమాన్' బ్యూటీ అమృతా అయ్యర్ అందాల చూపించి మరీ టెంప్ట్ చేస్తున్న అషూరెడ్డి టైట్ ఫిట్ డ్రస్లో కేతిక శర్మ పిచ్చెక్కిపోయే పోజులు మాళవిక సూపర్ హాట్ షో.. చూస్తే కంట్రోల్ కష్టమే అలాంటి అందాలు చూపిస్తూ కాక రేపుతున్న హనీరోజ్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by SanyaM (@sanyamalhotra_) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) -
చర్మ సౌందర్యం కోసం 'ఆదిపురుష్' హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా?
'వన్ నేనొక్కడినే' సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ముద్దుగుమ్మ కృతిసనన్. ఆ తర్వాత నాగ చైతన్య దోచెయ్ మూవీలో హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమాలు సరిగా ఆడకపోవడంతో బాలీవుడ్కి వెళ్లిపోయిన కృతి అక్కడ వరుస హిట్స్తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇటీవలె ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో సీతగా అలరించింది. సినిమా అంతగా ఆడకపోయినా సీతగా కృతికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉంటే కృతి సినిమాల్లోలాగే బయట కూడా చాలా అందంగా మెరిసిపోతుంటుంది. తన స్కిన్కేర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే ఈ బ్యూటీ తాజాగా ఈమె తన చర్మ సౌందర్యం కోసం ఏం చేస్తుందో రివీల్ చేసేసింది. అంతేకాకుండా తాను స్కిన్కేర్లో ఎటువంటి ప్రొడక్ట్స్ వాడుతుందో కూడా బయటపెట్టేసింది. ఇందులో కొన్ని చాలా తక్కువ ధరకే ఉండటం విశేషం. సాధారణంగా హీరోయిన్లు చాలా బ్రాండెడ్ వస్తువులను, ఖరీధైన మేకప్, స్కిన్కేర్ను ఫాలో అవుతుంటారని అనుకుంటాం. కానీ కృతి రివీల్ చేసిన రొటీన్ చాలా సాధాసీదాగా ఉండటం నెటిజన్లను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మొత్తం 7 స్టెప్స్ను ఎంచుకున్న కృతి తొలుత డబుల్ క్లెన్సింగ్తో మొదలుపెట్టి లిప్బామ్తో ముగించింది. View this post on Instagram A post shared by Kriti (@kritisanon) -
నైట్ పార్టీలో కృతిసనన్ వేసుకున్న డ్రెస్ అన్ని లక్షలా?
బాలీవుడ్ భామ కృతిసనన్.. బీటౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. మహేశ్ బాబు సరసన నేనొక్కడినే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామ ఆ తర్వాత బాలీవుడ్లో వరుస సక్సెస్లతో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఈ ఏడాది తెలుగులో ఆదిపురుష్ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోయినా కృతి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉంటే, తొలుత మోడల్గా కెరీర్ ఆరంభించిన కృతిసనన్ ఆ తర్వాత హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలో మంచి ఫ్యాషన్ సెన్స్ను కనబరుస్తూ ట్రెండీ లుక్స్తో మెస్మరైజ్ చేస్తుంటుంది. తాజాగా ఓ నైట్ పార్టీలో కృతి వేసుకున్న డ్రెస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. చూడటానికి చాలా సింపుల్గా ఉన్న ఈ మినీ డ్రెస్ ధర అక్షరాలా రూ. 1.7 లక్షలు. అలాయా బ్రాండ్కు చెందిన ఈ డ్రెస్కు క్యూట్ బెల్ట్ మరింత ఆకర్షణీయంగా ఉంది.ఇక ఎప్పటిలాగా సింపుల్ అండ్ న్యూడ్ మేకప్ లుక్లో తళుక్కున మెరిసింది మన మిమీ. -
ముక్కుపుడకతో అనసూయ అలా.. కృతిసనన్ని ఇలా చూస్తే మాత్రం!
క్రిస్మస్ సెలబ్రేషన్స్లో యష్ భార్య క్యూట్నెస్ ముక్కపుడకతో వయ్యారాలు పోతున్న అనసూయ మచ్చల పులిలా కేక పుట్టిస్తున్న హీరోయిన్ రాశీఖన్నా మెరుపుల డ్రస్లో దుమ్మురేపుతున్న జిగేల్ రాణి పూజాహెగ్డే అందాల విందు చేస్తున్న 'ఆదిపురుష్' బ్యూటీ కృతిసనన్ విచిత్రమైన హెయిర్ స్టైల్తో ఆశ్చర్యపరిచిన ఆలియా భట్ బ్లాక్ శారీలో మెల్ట్ చేసేస్తున్న హీరోయిన్ జాన్వీ కపూర్ రొమాంటిక్ గ్లామర్ వీడియోతో హీట్ పెంచేసిన ఆషికా రంగనాథ్ View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Aisha (@aishasharma25) View this post on Instagram A post shared by Rukshaar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) -
క్యూట్లుక్తో కట్టిపడేసే కృతి సనన్ ధరించిన గులాబీ రంగు చీర ఎంతంటే..
కృతి సనన్.. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదురయ్యాయి. అయినా ఎక్కడా కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. ఒకవైపు మోడలింగ్ చేస్తూనే సినిమా చాన్స్ల కోసం ట్రై చేశాను, సాధించాను. అందుకే ముందు మనల్ని మనం నమ్మాలి అని చెబుతోంది. ఆమె గ్లామర్కే కాదు అభినయానికీ అంతే ప్రాధాన్యం ఇస్తుంది. అందుకు కనిపించే ఉదాహరణ.. ‘మిమీ’ మూవీ. ఆ తపన, అభిరుచి ఆమె ఫ్యాషన్ స్టయిల్లోనూ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఈ బ్రాండ్సే.. మసాబా గుప్తా... మసాబా.. ప్రముఖ నటి నీనా గుప్తా, క్రికెట్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్ల కూతురు అని తెలుసు కదా! కానీ పేరెంట్స్ పేరుప్రఖ్యాతులను తన కెరీర్కి పునాదిగా మలచుకోలేదు. కేవలం తన క్రియేటివిటీనే పెట్టుబడిగా పెట్టి కీర్తినార్జిస్తోంది. ఇప్పుడున్న టాప్ మోస్ట్ డిజైనర్స్లలో మసాబా గుప్తానే ఫస్ట్. 2009లో ‘హౌస్ ఆఫ్ మసాబా’ పేరుతో బ్రాండ్ను ప్రారంభించింది. సృజన, నాణ్యతే బ్రాండ్ వాల్యూగా సాగిపోతోంది. అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తోంది. ఎందరో సెలబ్రిటీలు ఆమె డిజైన్స్కు వీరాభిమానులు. ధర కాస్త ఎక్కువే. ఆన్లైన్లోనూ కొనుగోలు చేసే వీలుంది. ఇక్కడ కృతి సనన్ ధరించి మసాబా గుప్తా కాస్ట్యూమ్ ధర రూ. 18,000/- కళ్యాణ్ జ్యూయెలర్స్... బంగారు, ముత్యాలు, వజ్రాల వ్యాపారంలో వందేళ్లకు పైగా చరిత్ర గల సంస్థ కళ్యాణ్ జ్యూయెలర్స్. దేశంలోనే కాదు గల్ఫ్, యూరోప్, అమెరికా దేశాల్లోనూ శాఖలను తెరిచింది. స్వచ్ఛత, నాణ్యత, నాజూకైన డిజైన్లే దీని బ్రాండ్ వాల్యూ. ధర ఆభరణాల డిజైన్, నాణ్యత పై ఆధారపడి ఉంటుంది. కళ్యాణ్ జ్యూయెలర్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. దీపిక కొండి (చదవండి: విష్ణు విరానికాల గారాల పట్టి ధరించిన డ్రస్ ధర వింటే షాకవ్వుతారు!) -
గుడ్డిగా నమ్మేశా.. లవర్ మోసం చేశాడు: యంగ్ హీరోయిన్
రవితేజ కొత్త సినిమా 'టైగర్ నాగేశ్వరరావు' విడుదలకు సిద్ధమైపోయింది. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇకపోతే ఈ మూవీతో 'ఆదిపురుష్' ఫేమ్ కృతిసనన్ చెల్లి నుపుర్ సనన్ హీరోయిన్గా పరిచయమవుతోంది. తాజాగా ప్రచారంలో భాగంగా తన ప్రేమ-బ్రేకప్ గురించి నుపుర్ బయటపెట్టింది. ఏడ్చిన సందర్భం గురించి చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: Bigg Boss Elimination: ఆమె కోసం ఈమె బలి? వారంలోనే ఆ బ్యూటీ ఎలిమినేట్!) ఎవరీ నుపుర్? కృతి సనన్ చెల్లి నుపుర్.. తొలుత 2005లో యూట్యూబర్గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత సింగర్గానూ గుర్తింపు తెచ్చుకుంది. అక్షయ్ కుమర్తో రెండు ఆల్బమ్ సాంగ్స్లో యాక్ట్ చేసింది. అవి మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకోవడంతో నుపుర్ బాగా ఫేమస్ అయిపోయింది. అలా ఇప్పుడు రవితేజ సినిమాతో హీరోయిన్గా అదృష్టం పరీక్షించుకోబోతోంది. ఏం జరిగింది? అయితే 'టైగర్ నాగేశ్వరరావు' ప్రచారంలో భాగంగా తను అప్పట్లో ప్రేమలో మోసపోయిన విషయాన్ని నుపుర్ సనన్ బయటపెట్టింది. 'కాలేజీలో ఉన్నప్పుడు ఓ అబ్బాయిని గాఢంగా లవ్ చేశాను. కానీ తను మోసం చేస్తున్నాడని అర్థమయ్యేటప్పటికీ.. నేను అతడిని ఎంత గుడ్డిగా నమ్మేశానో అర్థమైంది. దీంతో ఏడుపు ఒక్కటే తక్కువైంది. ఇంట్లో వాళ్లకు ఎక్కడ తెలిసిపోతుందో అని బాత్రూంలో కూర్చుని మరీ గట్టిగా ఏడ్చాను. ఈ బాధ నుంచి బయటపడటానికి నెలలు పట్టింది' అని నుపుర్ గతం గురించి చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: స్టార్ హీరో షూటింగ్లో ప్రమాదం.. ఆయన మృతి!) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) -
మెల్టింగ్ పోజుల్లో మాళవిక.. వయ్యారంగా హాట్ బ్యూటీ
బ్లాక్ డ్రస్లో మెరిసిపోతున్న కాజల్ అగర్వాల్ ఒంపుసొంపులు చూపిస్తూ రెచ్చగొడుతున్న సాక్షి మాలిక్ జిమ్లో హాట్ బ్యూటీ అన్వేషి జైన్ సెల్ఫీ పోజులు దేశీ ఔట్ఫిట్లో బిగ్బాస్ బ్యూటీ సిరి హన్మంతు వింత పోజుల్లో 'ఆదిపురుష్' కృతి సనన్ ఎల్లో డ్రస్లో 'టైగర్ నాగేశ్వరరావు' బ్యూటీ నుపుర్ నవ్వుతో చంపేస్తున్న 'గుంటూరు కారం' మీనాక్షి View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Sakshi Malik (@sakshimalikk) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Gayatri Bhardwaj (@gayatribhardwaj__) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
దేవరలో మరో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్
-
క్రేజీ గెటప్లో 'ఆదిపురుష్' బ్యూటీ.. అలాంటి పోజులో శ్రియ
చాన్నాళ్ల తర్వాత ఇన్ స్టాలో కనిపించిన నివేతా గ్లామర్ సెగలు రేపుతున్న రంగం బ్యూటీ పియా బాజ్పాయి బ్లాక్ డ్రస్లో 'ఆదిపురుష్' కృతి సనన్ డిఫరెంట్ లుక్ వయ్యారమైన పోజుల్లో రాజశేఖర్ చిన్న కూతురు ఓరకంట చూస్తూ కవ్విస్తున్న హీరోయిన్ శ్రియ సోఫాపై కూర్చుని కిక్కిచ్చే పోజుల్లో శ్రియ బ్యాక్ చూపిస్తూ కవ్విస్తున్న 'అర్జున్ రెడ్డి' భామ చీరలో క్లాస్ లుక్ తో ఆకట్టుకున్న రాశీఖన్నా View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Pia Bajpiee (@piabajpai) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) -
అంత జరిగినా కూడా నేను వెనుకడుగు వేయలేదు: కృతిసనన్
సినిమా రంగంలో రాణించడానికి ప్రతిభ ఉంటే చాలదు. కృషి, శ్రమ, అన్నింటికీ మించి అదృష్టం చాలా ముఖ్యం. అయినా ఒక్కోమెట్టు ఎక్కాలంటే ఎన్నో అవమానాలను, చేదు అనుభవాలు ఎదుర్కోకతప్పదు. ముఖ్యంగా హీరోయిన్లు ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటుంటారు. బాలీవుడ్ నటి కృతిసనన్ ఇలాంటి అవమానాలను ఎదుర్కొందట. దక్షిణాది చిత్రాల్లో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపే ఈ బాలీవుడ్ బ్యూటీ ఇంతకుముందే తెలుగులో మహేష్బాబు సరసన నేనొక్కడినే చిత్రంలో నటించింది. (ఇదీ చదవండి: Jawan Review: 'జవాన్' మూవీ రివ్యూ) ఇటీవల ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ఆదిపురుష్ చిత్రంలో సీతగా నటించింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో కృతిసనన్కు పెద్దగా గుర్తింపు రాకపోయినా ఈమె హిందీలో నటించిన 'మిమి' చిత్రానికిగాను జాతీయ ఉత్తమ నటి అవార్డును తెచ్చిపెట్టింది. అలాంటి నటి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన తొలి రోజులను గుర్తు చేసుకుంది. మొదట్లో మోడల్గా చేస్తూనే నటిగా అవకాశాల కోసం ప్రయత్నించానని చెప్పింది. ఇందుకు చాలా అవమానాలను ఎదుర్కొన్నానని చెప్పింది. 'చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఒక డాన్స్ సన్నివేశంలో నేను పొరపాటు చేయడం వల్ల నృత్య దర్శకుడు చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.. ఒక ఫామ్హౌస్లో షూట్. ఆ ప్రాంతమంతా గడ్డితో పాటు తేమగా ఉంది. అందువల్ల నా హీల్స్ ఆ గడ్డిలో చిక్కుకుపోయాయి. డ్యాన్స్లో సరైన మూమెంట్ రాలేదు. దీంతో డ్యాన్స్ మాస్టర్ ఫైర్ కావడమే కాకుండా చెత్తగా మాట్లాడాడు. ఆ సమయంలో సుమారు 50 మంది మోడల్స్ అక్కడ ఉన్నారు. అలాగని తాను వెనుకడుగు వేయలేదు.' అని నటిగా తన పయనాన్ని పట్టుదలతో కొనసాగించానని పేర్కొంది. ఆ తరువాత ఆ డానన్స్ మాస్టర్తో కలిసి పనిచేసినట్లు చెప్పింది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
కమల్ హాసన్ ఇండియన్-2.. ప్రోమో వచ్చేసింది!
SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్ తల్లికి అర్ష్దీప్ రిక్వెస్ట్ (ఫొటోలు)
బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి
బజాజ్ ఫైనాన్స్తో చేతులు కలిపిన టాటా మోటార్స్.. ఎందుకో తెలుసా?
పచ్చ మందకు వాతలు పెట్టిన కాకాణి
మళ్లీ హానీమూన్కి వెళ్లిన రకుల్.. అనసూయ స్మైలీ పోజులు
అమెరికా ‘సాంత ఫె’లో విహారయాత్ర !
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం!
IPL 2024: చెల్లెలు కాదు.. అక్క! ఈమెను గుర్తుపట్టారా?
తప్పుడు ఆరోపణలపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా
తప్పక చదవండి
- T20 WC: అఫ్గానిస్తాన్ బౌలింగ్ కన్సల్టెంట్గా డ్వేన్ బ్రావో..
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- ‘సీఎం రేసులో ఉన్నానని చెప్పేందుకు ఢిల్లీకి రూ.100 కోట్లు’
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement