-
ఒక్క నిమ్మకాయ ఖరీదు రూ.50 వేలు, స్పెషల్ ఏంటంటే?
అసలే ఎండాకాలం నిమ్మకాయలకు మంచి డిమాండ్ ఉంది. మార్కెట్లో కూడా నిమ్మకాయల ధరలు వేడిగానే ఉన్నాయి. ఒక నిమ్మకాయ పది రూపాయలంటేనే కొనుగోలుదారుడు ఓ అడుగు వెనక్కి వేస్తాడు. కానీ తమిళనాడులో మాత్రం తొమ్మిది నిమ్మకాయలు ఏకంగా రూ.2.36 లక్షలకు అమ్ముడయ్యాయి. ఇంత ధరకు అమ్ముడు పోవడానికి కారణం ఏంటనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని మురుగన్ (సుబ్రమణ్య స్వామి) దేవాలయ నిర్వాహకులు ఉతిరమ్ పండుగ సందర్భంగా నిమ్మకాయలను వేలం వేస్తారు. సంతానం కోసం ప్రయత్నిస్తున్న జంటలు ఈ పండుగ సందర్భంగా ఆలయాన్ని సందర్శించి వేలంలో నిమ్మకాయలను కొనుగోలు చేస్తారు. ఇందులో తొమ్మిది నిమ్మకాయలు రూ.2.36 లక్షలకు అమ్ముడయ్యాయి. తొమ్మిది రోజుల పండుగలో మొదటి రోజున బల్లెముపై ఉన్న నిమ్మకాయ అన్నింటికంటే శక్తివంతమైనదని భక్తులు విశ్వసిస్తారు. ఈ నిమ్మకాయను ఈ సంవత్సరం ఒక జంట రూ.50,500 కి కొనుగోలు చేశారు. ఆ తరువాత కూడా ఆయాల ఉత్సవాల్లో ప్రతి రోజు పూజారులు దేవుడి బల్లెంపై ఒక నిమ్మకాయను ఉంచి పూజిస్తారు. కేవలం బిడ్డలను కనాలని చూస్తున్న వారికే మాత్రమే కాదు, వ్యాపారవేత్తలు కూడా ఈ నిమ్మకాయల కోసం పోటీ పడతారని స్థానిక చెబుతున్నారు. దేవాలయాల్లోని నిమ్మకాలయలను భారీ ధరకు వేలంలో విక్రయించడం ఇదేమీ కొత్త కాదు. 2018లో కూడా తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో టెంపుల్ ఫెస్ట్లో భాగంగా ఒక నిమ్మకాయను 7600 రూపాయలకు విక్రయించారు. -
కిచెన్ టిప్స్: మనకిష్టమైన పదార్థాలను ఇలా కాపాడుకుందాం..!
'సాధారణంగా మనం కిచెన్లో ఉన్న కొన్ని వస్తువులు పాడవకుండా కాపాడడంకోసం నానా తంటాలు పడుతూంటాం. వాటిలో మనకిష్టమైన పదార్థాలంటే.. ఇంకెంతో జాగ్రత్తలను పాటిస్తాం. ఏం చేయాలో తెలియక, చిన్న చిన్న ఉపాయాలు తోచక విసుగు చెందుతుంటాం. ఇకపై అలా జరగకుండా ఈ కొన్ని ట్రిక్స్ మీకోసమే..' ఇలా చేయండి.. తోడు వేయడానికి తగిన మజ్జిగ లేక పెరుగు అందుబాటులో లేకపోతే పాలను గోరువెచ్చగా చేసి అందులో రెండు పచ్చిమిర్చి వేసి మూత పెట్టి.. ఆరేడు గంటలపాటు కదపకుండా పక్కన పెడితే పెరుగు గట్టిగా తోడుకుంటుంది. నిమ్మరసం చేసేటప్పుడు రసంతో పాటు నిమ్మ చెక్కలను కూడా అందులోనే వేసి కాసేపు ఉంచడం వల్ల.. మంచి ఫ్లేవర్, రుచితో పాటు పోషకాలు కూడా ఎక్కువగా అందుతాయి. సాధారణంగా అల్లం పేస్ట్ను ఎప్పటికప్పుడు తాజాగా చేయడంతో పాటు కొంత స్టోర్ చేసి కూడా పెట్టుకుంటూ ఉంటాం. ఇది పాడవకుండా ఉండేందుకు అందులో చెంచా ఆవాల నూనె వేయాలి. ఇలా చేయడం వల్ల అల్లం పేస్ట్ పాడవకుండా ఉంటుంది. ఇవి చదవండి: 'నా ఎదుగుదల మూలాలు మా ఊరిలోనే..' రైతుబడి మాస్టారు! -
ఖర్జూరం ప్రత్యామ్నాయం
భూ నైసర్గిక స్వరూపంతో పాటు సాగునీటి వనరుల దృష్ణ్యా మెట్ట ప్రాంత రైతులకు నిమ్మసాగు అనివార్యమైంది. ధరల ఆటు పోటులతో నష్టాల ఊబిలో కూరుకుపోతున్నా.. ఈ భూముల్లో ప్రత్యామ్నాయ దీర్ఘకాలిక పంట మరొకటి లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఖర్జూరం సాగుకు ఈ ప్రాంత భూములు అనుకూలమేనని వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. దీంతో నిమ్మ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖర్జూరం సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తే సిరులు పండించవచ్చు. గూడూరు (నెల్లూరు): జిల్లాలోని మెట్ట ప్రాంత మండలాలైన గూడూరు, చిల్లకూరు, సైదాపురం, డక్కిలి, ఓజిలి, బాలాయపల్లి, వెంకటగిరి, పొదలకూరు, రాపూరు, చేజర్ల తదితర మండలాల్లో ప్రస్తుతం సుమారు 25 వేల హెక్టార్లలో నిమ్మ పంట సాగవుతోంది. నిమ్మ సాగు చేయాలంటే ఫలసాయం కోసం నాలుగు నుంచి ఐదేళ్ల పాటు వేచి చూడాల్సి వస్తుంది. ఈ క్రమంలో సాగు చేసి, కాపుకొచ్చే సమయంలో ధరలు ఉండక రైతులు అప్పులపావుతున్నారు. కానీ ఈ ప్రాంతాల్లో నీటి వనరులు, భూముల పరిస్థితిని బట్టి ప్రత్యామ్నాయ పంటలు లేక నిమ్మ సాగే అనివార్యమైంది. ఇదే నీటి వనరులు ఉన్న కరువు సీమలైన ఏపీలోని కర్నూలు, తెలంగాణలోని నల్గొండ జిల్లాల్లోని ఎందుకూ, ఏ పంట సాగుకూ పనికిరాని చవుడు భూముల్లో సైతం ఎడారి పంటగా పేరున్న ఖర్జూరం సాగు చేస్తూ రైతులు లాభాల బాటన నడుస్తున్నారు. పెట్టుబడులు అధికమే.. నాలుగేళ్లకే దిగుబడులు నిమ్మ పంటతో పోల్చితే ఖర్జూరం కూడా ఫలసాయం సమయం దాదాపు సమానంగానే ఉంది. టిష్యూ రకం నిమ్మ మొలక సుమారు రూ.10 మాత్రమే ఉంటుంది. కానీ ఖర్జూరం మొక్క అయితే మాత్రం టిష్యూ రకం ఒక్కొక్కటి రూ.3 వేల నుంచి రూ.3,500 వరకూ ఉంటుంది. అదే తరహాలో ఫల సాయం కూడా వస్తున్నట్లు సాగు చేసిన రైతులు చెబుతున్నారు. మొక్కల కొనుగోలుతో పాటు భూమిని చదును చేయడం, డ్రిప్, ఎరువులు, కూలీలు ఇతర ఖర్చులకు ప్రారంభంలో ఎకరాకు రూ.5 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. రెండో సంవత్సరం నుంచి కూడా ఏడాదికి ఎకరానికి సుమారు రూ. లక్ష లోపే ఉంటుంది. నాటిన నాలుగో సంవత్సరం నుంచి ఖర్జూర పంట దిగుబడులు ప్రారంభమవుతాయి. అప్పటి నుంచి కూడా ఎకరానికి ఏడాదికి సుమారు రూ. 4 లక్షలకు పైగానే ఆదాయం 40 నుంచి 50 ఏళ్ల వరకూ ఫలసాయం అందుకోవచ్చని సాగు చేస్తున్న రైతులే అంటున్నారు. ఎకరానికి 60 నుంచి 80 వరకూ మొక్కలు నాటాలి. వాటిలో కనీసం 10 నుంచి 12 మగ ఖర్జూరం మొక్కలుండేలా చూసుకోవాల్సి ఉంది. మూడేళ్ల పాటు జాగ్రత్తగా మొక్కలను నాలుగో ఏట కాపునకు వస్తాయి. ఫిబ్రవరి 15వ తేదీ పైన, మార్చి 15వ తేదీ లోపుగా చెట్లు పూత దశకు వస్తాయి. ఈ క్రమంలో పూతకు నెల ముందుగా నీటిని పెట్టకుండా ఆపేయాలి. అప్పుడే వాడి పూత ఎక్కువగా పూసే వీలుంటుంది. టన్ను ఖర్జూరం రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకూ ఎకరం ఖర్జూరం సాగు చేస్తే నాలుగో సంవత్సరం నుంచి ఎకరానికి కనిష్టంగా 3.5 టన్నుల నుంచి గరిష్టంగా 5 టన్నుల వరకూ దిగుబడి వస్తుంది. దీంతో ఫల సాయం సుమారు ఎకరానికి రూ.4 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పైగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖర్జూరం సాగు చేస్తే హెక్టారుకు రూ. 2 లక్షల రాయితీ ఇస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. చవుడు భూములు ఖర్జూరం సాగుకు అనువే నల్గొండ ప్రాంతంలో ఎందుకూ పనికిరాని చవుడు భూముల్లో కూడా ఖర్జూరం సాగు చేసి రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. చవుడు భూముల్లో ఈత మొక్కలు మొలిచి ఉండడాన్ని గుర్తించిన రైతు, అక్కడి రైతులు కూడా విస్మయం చెందేలా ఫలసాయాన్ని పొందుతూ లాభాల బాటలో పయనిస్తున్నారు. అవగాహన కల్పిస్తే మంచిది నేను 3 ఎకరాల్లో నిమ్మ తోట సాగుచేస్తున్నా. ఈ ఏడాది పెట్టుబడి, నీటి వసతి కోసం బోర్లు వేసేందుకు ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో ఈ ఏడాది రూ.2 లక్షల వరకూ నష్టపోయా. అవగాహన కల్పించి సాగుకు రాయితీలు ఇస్తే ఖర్జూరం సాగు చేస్తాం. – ఎన్.పెంచలయ్య, రైతు, అక్కమాంబాపురం, రాపూరు మండలం ప్రత్యామ్నాయ పంటలే దిక్కు నిమ్మ తోటలకు ప్రత్యామ్నాయ పంట వస్తే నిమ్మ రైతులందరూ ముందుకొస్తారు. మెట్ట ప్రాంతంలో నీటి సమస్య అధికంగా ఉంది. ప్రభుత్వం పూర్తిగా ప్రోత్సాహం అందిస్తే ఖర్జూరం వంటి పంటలు సాగు చేపడుతాం. – కె.పెంచలనరసయ్య, రైతు, చీకవోలు, సైదాపురం మండలం ప్రోత్సాహం అందిస్తే సాగు చేస్తాం డ్రిప్కు రాయితీతో పాటు, బోర్లు వేయడంతో పాటు, ఇతర ఖర్చులకు కూడా ప్రభుత్వం రుణాలు అందజేస్తే ఖర్జూరం సాగుకు సిద్ధమవుతాం. ప్రయోగం చేయాలంటే అది ముందుగా ఉద్యాన శాఖ ద్వారా జరిగితేనే మంచిది. – జి.భాస్కర్రెడ్డి, రైతు, వెడిచర్ల గూడూరు మండలం సాగుకు సిద్ధమైతే రాయితీకి ప్రతిపాదనలు జిల్లాలోని భూములు కూడా ఖర్జూరానికి అనువైనవే. ఎవరైనా రైతులు ఖర్జూరం సాగు చేసేందుకు సంసిద్ధమైతే రాయితీకి ప్రతిపాదనలు పంపుతాం. రైతులు ముందుకు వస్తే శాఖా పరమైన సహకారం అందజేస్తాం. – అనురాధ, ఉద్యాన శాఖ ఏడీ -
9 నిమ్మకాయలు 68 వేల రూపాయలు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని మురుగన్ ఆలయంలో నిర్వహించిన వేలం పాటలో 9 నిమ్మకాయలు రూ. 68,100 పలికాయి. విల్లుపురం జిల్లా ఒట్టనందల్ గ్రామంలోని పురాతన రత్నవేల్ మురుగన్ ఆలయంలో ఏటా 10 రోజుల పాటు కావడి ఉత్సవాలను నిర్వహిస్తారు. 11వ రోజు అర్ధరాత్రి ముగింపు కార్యక్రమంలో పది రోజుల పాటు మురుగన్ వద్ద శూలానికి గుచ్చి ఉంచే 9 నిమ్మకాయలను వేలం వేస్తారు. మంగళవారం జరిగిన ఈ వేలం పాటలో తొలి నిమ్మకాయను రూ. 27 వేలకు ఓ భక్తుడు కొన్నాడు. 2, 3 నిమ్మకాయలు రూ.6 వేలు, నాలుగోది రూ.5,800, ఐదోది రూ.6,300, ఆరోది రూ. 5 వేలు, 7వది రూ. 5,600, ఎనిమిదోది రూ. 3,700, తొమ్మిదోది రూ. 2,700లకు కొనుగోలు చేశారు. ఈ నిమ్మకాయను దక్కించుకున్న వ్యక్తి భార్య మరుసటి రోజు గింజలతో తిన్నట్లయితే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎంపీ గురుమూర్తి తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
పన్నూ హత్యకు కుట్ర.. అమెరికాపై మండిపడ్డ రష్యా
పిఠాపురంలో సీఎం జగన్ ఎన్నికల సభ
10 వరకూ తత్కాల్లో ఇంటర్ ఫీజుకు అవకాశం
అర్ధరాత్రి పచ్చమూకల బరి తెగింపు
ప్రతిభ ఉంటే.. ఉపకారం మీ వెంటే
ఐటీఐలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
సమస్యాత్మక ప్రదేశాల్లో 800 సీసీ కెమెరాలు
ఓటమి భయంతోనే టీడీపీ దాడులు
సజావుగా పోస్టల్ బ్యాలెట్ రీ పోలింగ్
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement