-
Lok Sabha Election 2024: బీజేపీకి సవాలు
నాలుగో విడతలో భాగంగా మధ్యప్రదేశ్లో ఎనిమిది లోక్సభ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. దీంతో రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. 29 స్థానాల్లో మూడు విడతల్లో 21 సీట్లకు ఎన్నిక ముగిసింది. 2019లో బీజేపీ ఏకంగా 28 సీట్లు సొంతం చేసుకోగా కాంగ్రెస్ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి మాత్రం బీజేపీకి గట్టి పోటీ ఇస్తోంది... ఇండోర్ పోలింగ్కు ముందే ఇక్కడ కాంగ్రెస్కు షాక్ తగిలింది. పార్టీ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ నామినేషన్ ఉపసంహరించుకుని బీజేపీలో చేరిపోయారు! దాంతో బీజేపీ సిట్టింగ్ ఎంపీ శంకర్ లల్వానీ విజయం ఖాయమైపోయింది. కంగుతిన్న కాంగ్రెస్ ఇక్కడ నోటాకు ఓటేయాలంటూ ప్రజలకు పిలుపునిస్తోంది! ఎందుకంటే ఇక్కడ బరిలో ఉన్న 14 మంది అభ్యర్థుల్లో కాంగ్రెస్ మద్దతివ్వడానికి స్వతంత్రులెవరూ లేరు. మధ్యప్రదేశ్ వాణిజ్య రాజధాని అయిన ఇండోర్ బీజేపీ కంచుకోట. 35 ఏళ్ల నుంచి ఇక్కడ కాషాయ జెండానే ఎగురుతోంది. 1989 నుంచి 2014 దాకా లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ గెలుస్తూ వచ్చారు. ఎన్నికల వేళ ముగ్గురు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలతో పాటు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తులు కూడా బీజేపీలో చేరారు. ఇక్కడ ఫలితం యువత చేతుల్లోనే ఉంది. 30–39 ఏళ్ల ఓటర్లు 6.71 లక్షలు, 20–29 వయసు వారు 5.26 లక్షల మంది, తొలిసారి ఓటర్లు 62,000 మంది ఉన్నారు.ఉజ్జయిని ఈ ఎస్సీ స్థానంలో గత రెండు ఎన్నికల నుంచి బీజేపీదే విజయం. 2014లో ప్రొఫెసర్ చింతామణి మాలవీయ, అనంతరం 2019లో అనిల్ ఫిరోజియా మూడున్నర లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు! ఫిరోజియాపై కాంగ్రెస్ నుంచి మహేశ్ పర్మార్ తలపడుతున్నారు. బీజేపీ ప్రధానంగా ఇంటింటి ప్రచారాన్నే నమ్ముకుంది. మరోవైపు పర్మార్ మాత్రం ప్రసిద్ధ క్షిప్రా నది కాలుష్యంపై వినూత్న తరహాలో నిరసన చేపట్టారు. నదిలో కలుస్తున్న మురుగునీటి ప్రవాహంలో కూర్చోవడమే గాక అందులో మునకలు వేశారు. కాలుష్యం నుంచి నదిని రక్షించేందుకు తుదికంటా పోరాడతానని ప్రకటించారు. ఇందుకు నియోజకవర్గ ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తుండటం విశేషం.ధార్ ఈ ఎస్టీ స్థానం నుంచి బీజేపీ తరఫున సావిత్రి ఠాకూర్ బరిలో ఉన్నారు. ఆమె 2014లోనూ బీజేపీ అభ్యరి్థగా ఇక్కడ గెలిచారు. కాంగ్రెస్ నుంచి రాధేశ్యామ్ మువెల్ పోటీ చేస్తున్నారు. మువెల్ను మార్చాలని ఓ దశలో పార్టీ భావించినా చివరికి ఆయన్నే కొనసాగించింది. ఈ లోక్సభ స్థానం పరిధిలో 8 అసెంబ్లీ స్థానాల్లో ఐదింట కాంగ్రెసే గెలిచింది. దాంతో ఈసారి బీజేపీ గెలుపు సునాయాసంగా కని్పంచడం లేదు. అందుకే సిట్టింగ్ ఎంపీని కాదని సావిత్రికి బీజేపీ టికెటిచి్చంది. రాహుల్గాంధీ, ప్రధాని మోదీ ఇప్పటికే ఇక్కడ ప్రచారం చేశారు.ఖాండ్వ ఎన్నికల సంఘం రెడ్ అలెర్ట్ ప్రకటించిన స్థానమిది. 11 మంది అభ్యర్థుల్లో నలుగురిపై క్రిమినల్ కేసులున్నాయి. వారిలో బీజేపీ అభ్యర్థి జ్ఞానేశ్వర్ పాటిల్, కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర పటేల్ కూడా ఉన్నారు! 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి నందకుమార్ సింగ్ చౌహాన్ విజయం సాధించారు. 2021లో ఆయన కరోనాతో మరణించారు. ఉప ఎన్నికలో బీజేపీ నేత జ్ఙానేశ్వర్ పాటిల్ గెలిచారు.దేవాస్ దేవాస్ లోక్సభ స్థానంలో ఈసారి భిన్నమైన రాజకీయ వాతావరణం నెలకొంది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ మహేంద్రసింగ్ సోలంకి (40) మరోసారి బరిలో ఉన్నారు. ఆయన సివిల్ జడ్జి పదవికి రాజీనామా చేసి మరీ 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి, పద్మశ్రీ గ్రహీత, ప్రముఖ జానపద గాయకుడు ప్రహ్లాద్ సింగ్ తిపానియా (65)పై ఘన విజయం సాధించారు. ఈసారి కాంగ్రెస్ నుంచి రాజేంద్ర మాలవీయ పోటీ చేస్తున్నారు. ఇక్కడ 2014లోనూ బీజేపీయే గెలిచింది. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.చరిత్ర సృష్టించిన బామ్మ ధార్ నియోజకవర్గం పరిధిలోని 113 ఏళ్ల బామ్మ ఇంటి నుంచే తన ఓటు హక్కు వినియోగించుకుని చరిత్ర సృష్టించింది. ఏకల్దున గ్రామానికి చెందిన భవార్ బాయి ఇంటి నుంచే ఓటు వేసేందుకు ముందే దరఖాస్తు చేసుకోవడంతో.. అధికారులు ఆమె ఇంటికి వెళ్లి ఇందుకు అవకాశం కలి్పంచారు. ఈ నియోజకవర్గ పరిధిలో 85 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న 900 మంది ఓటర్లు, 343 మంది దివ్యాంగులు సైతం ఇంటి నుంచి ఓటేశారు. అంజేరా గ్రామానికి చెందిన సాఫియాన్ జులి్ఫకర్ హుస్సేన్ అనే 109 ఏళ్ల వృద్ధుడు కూడాఈ జాబితాలో ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓటు వేశారు.. డైమండ్ రింగ్ గెలుచుకున్నారు!
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాలలో మంగళవారం మూడో విడత పోలింగ్ జరిగింది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎన్నికల సంఘం పలు చర్యలు తీసుకుంటుంది. ఇదే కోవలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓటర్లను ప్రోత్సహించేందుకు ప్రత్యేక బహుమతులను అందించారు.భోపాల్లోని పలు పోలింగ్ కేంద్రాలలో లాటరీ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ లాటరీ పథకంలో ఉదయం 11 గంటలకు జరిగిన మొదటి డ్రాలో యోగేష్ సాహు డైమండ్ రింగ్ గెలుచుకున్నారు. తరువాత మధ్యాహ్నం 2, 5 గంటలకు మరో రెండు డ్రాలు జరిగాయి. దీని తర్వాత బంపర్ డ్రా కూడా జరిగింది.లోక్సభ ఎన్నికల రెండవ దశలో ఓటింగ్ శాతం తగ్గిన నేపధ్యంలో ఓటర్లను ప్రోత్సహించడానికి భోపాల్లోని పలు పోలింగ్ బూత్లలో ఎన్నికల సంఘం లాటరీ పథకాన్ని ప్రారంభించింది. ఓటు హక్కును వినియోగించుకున్న వారికి ఆకర్షణీయమైన బహుమతిని అందజేస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.భోపాల్ ఎన్నికల చరిత్రలో తక్కువ ఓటింగ్ నమోదవుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో ఇక్కడ ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చొరవ చూపింది. ఈ నేపధ్యంలో 65.7 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఎన్నికల సంఘం నిర్వహించిన లక్కీ డ్రాలో ముగ్గురు ఓటర్లకు వజ్రాల ఉంగరాలు లభించగా, మరికొంతమందికి మిక్సర్లు, వాటర్ కూలర్లు లభించాయి. కొందరు టీ షర్టులను గెలుచుకున్నారు. -
యూనివర్సిటీ వాటర్ ట్యాంక్లో మహిళ మృతదేహం.. పరారీలో భర్త, అత్త? ..?
లక్నో: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఘోరం వెలుగుచూసింది. గౌతమ్ బుద్దా యూనివర్సిటీలోని స్టాఫ్ క్వార్టర్స్ భవనంలోని వాటర్ ట్యాంక్లో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళ తన భర్త, అత్తతో కలిసి అక్కడే నివసించినట్లు పోలీసుల విచారణలో తేలింది. మహిళను భర్త, అత్తే హత్య చేసి అక్కడి నుంచి పరారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ భర్త సమీపంలోని జిమ్స్ ఆసపత్రిలో పనిచేస్తున్నట్లు తేలింది. దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగేవని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఆదివారం రాత్రి కూడా గొడవ జరిగిందని చెప్పారు. ఆ గొడవే మహిళ హత్యకు దారి తీసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతురాలి భర్త, అత్త కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు సీనియర్ పోలీసు అధికారి శివహరి మీనా తెలిపారు. కేసుపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని, త్వరలోనే వాస్తవాలను బయటపెడతామని చెప్పారు. -
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
ఇసుక మాఫియా రోజురుజుకీ రెచ్చిపోతుంది. వారి రాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అక్రమంగా ఇసుక తరలించి సొమ్ము చేసుకోవడం, ఎవరైనా అడ్డొస్తే ప్రాణాలు తీయడం అలవాటుగా మారింది. తాజాగా మధ్యప్రదేశ్లో షాదోల్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు మరో పోలీస్ అధికారి బలయ్యారు. అక్రమ మైనింగ్ను తనిఖీ చేసేందుకు వెళ్లిన పోలీస్ అధికారిని ట్రాక్టర్తో తొక్కి చంపేశారు.ఈ హేమమైన ఘటన మధ్యప్రదేశ్లోని షాడోల్లో చోటుచేసుకుంది. షాడోల్ అసిస్టెంట్ ఎస్సై మహేంద్ర బగ్రీ, ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రసాద్ కానోజి, సంజరు దూబేలతో కలిసి శనివారం ఘటనా ప్రాంతానికి అక్రమ మైనింగ్ తనిఖీకి వెళ్లారు. ఈ సమయంలో వేగంగా వస్తున్న ఓ ఇసుక అక్రమ తరలింపు చేస్తున్న ట్రాక్టర్ను ఆపేందుకు యత్నించగా.. డ్రైవర్ దానిని ఆయనపై నుంచి పోనిచ్చాడు. ఆయనను తొక్కుకుంటూ వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన మహేంద్ర బగ్రీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.ఇద్దరు కానిస్టేబుళ్లు తృటిలో తప్పించుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ట్రాక్టర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఇసుక అక్రమ తరలింపులో ట్రాక్టర్ ఓనర్, ఆయన కుమారుడికి పాత్ర ఉన్నట్లు తేలింది. దాంతో ట్రాక్టర్ ఓనర్ కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ట్రాక్టర్ ఓనర్ కోసం గాలిస్తున్నారు.ఇసుక అక్రమ తరలింపును అడ్డుకునేందుకు వెళ్లిన ఎస్సై మహేంద్ర బాగ్రీని ట్రాక్టర్తో తొక్కించి చంపేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
దిగ్విజయ్ సింగ్ భావోద్వేగ లేఖలో ఏముంది?
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్లో మూడో దశలో పోలింగ్ మే 7న జరగనుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. రాష్ట్రంలోని రాజ్గఢ్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్నారు. తాజాగా ఆయన ఇవి తన జీవితంలో చివరి ఎన్నికలు అని వ్యాఖ్యానించారు.దిగ్విజయ్ సింగ్ తాజాగా సోషల్ మీడియా ‘ఎక్స్’ హ్యాండిల్లో రాజ్గఢ్ ప్రజలకు భావోద్వేగ లేఖ రాశారు. దానిలో ఆయన ‘నేను నా తండ్రి మరణించాక ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకుని రాజ్గఢ్ వచ్చాను. నాడు ఇక్కడి ప్రముఖుడు కస్తూర్ చంద్ జీ కఠారీని కలుసుకున్నాను. అప్పుడు ఆయన నాతో ప్రతీ వ్యక్తి జీవితంలో 12 లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు. కుటుంబాన్ని పోషించేంతటి సంపాదన ప్రతీ వ్యక్తికి అవసరమని, అలాగే పొదుపు చేయాలని, నగలు కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు. సొంత ఇంటిని నిర్మించుకోవాలని, ఇవన్నీ సమకూరితే అదృష్టవంతుడివని, అప్పుడు పేరు సంపాదించుకోవాలని వివరించారు. నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాగే ప్రయత్నించాను. అందులో నేను ఎంతవరకూ సక్సెస్ అయ్యానో నేనే అంచనా వేయలేను. సామాన్యులు మాత్రమే అలా చేయగలరు. ఇవి నా జీవితంలో చివరి ఎన్నికలు. వీటిలో నేను ఎంతవరకు విజయం సాధిస్తానో మీరే నిర్ణయిచాలి’ అని పేర్కొన్నారు.మే 7వ తేదీన రాజ్గఢ్ లోక్సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దిగ్విజయ్ సింగ్ 10 ఏళ్ల పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1980- 90వ దశకంలో రాజ్గఢ్ నుండి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత తన సొంత ప్రాంతం నుంచి ఎన్నికల బరిలో దిగారు. ఈ ఎన్నికలు దిగ్విజయ్ సింగ్ ప్రతిష్టకే కాదు, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ భవిష్యత్తుకు కూడా కీలకం కానున్నాయి. -
పామును పట్టి, డబ్బాలో పెట్టి, నాలుగు రోజులకు తెరవగానే..
పామును చూడగానే చాలామంది భయపడిపోతుంటారు. మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్లో పామును పట్టుకున్న తరువాత విచిత్ర పరిణామం చోటుచేసుకుంది. అది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బుందేల్ఖండ్లోని మక్రోనియా పరిధిలోగల బెటాలియన్ ప్రాంతంలో పాములుపట్టే అఖిల్ బాబా ఇటీవల ఒక నాగు పామును పట్టుకున్నాడు. తరువాత దానిని ఒక పెట్టెలో బంధించాడు. నాలుగు రోజుల తరువాత ఆ పెట్టెను తెరచి చూసి, ఆశ్యర్యంతో నోరెళ్లబెట్టాడు. తన 30 ఏళ్ల అనుభవంలో తొలిసారిగా ఇలాంటి ఘటన జరిగిందని తెలిపాడు. తాను ఒక నాగు పామును పట్టుకుని పెట్టెలో బంధించి ఉంచానని, అయితే నాలుగు రోజుల తరువాత ఆ పెట్టెలో నుంచి ఏవో శబ్ధాలు రావడంతో తెరిచి చూసేసరికి ఆ పాముతో పాటు ఏకంగా 16 పాము గుడ్లు కనిపించాయని తెలిపాడు. వీటిని అటవీశాఖ అధికారులకు అప్పగిస్తానని అఖిల్ బాబా తెలిపారు.నాగుపాము అనేది పాము జాతులలో ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. ఇది భారతదేశంతో సహా అనేక దేశాలలో కనిపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆడ నాగుపాము ఒకేసారి 10 నుండి 30 గుడ్లు పెడుతుంది. వాటి నుంచి 45 నుండి 70 రోజులలో పాము పిల్లలు బయటకు వస్తాయి. -
ఇక్కడ కాంగ్రెస్ ప్రచారం ‘నోటా’కే..
ఇండోర్ (మధ్యప్రదేశ్): లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తమ పార్టీ అభ్యర్థులకు, కూటమి అభ్యర్థులకు ఓటేయాలని అభ్యర్థిస్తున్న కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో మాత్రం నోటాకే ఓటేయాలని ఓటర్లను కోరుతూ ప్రచారం నిర్వహిస్తోంది. ఇక్కడ తాము నిలబెట్టిన అభ్యర్థి చివరి నిమిషంలో పోటీ నుంచి బీజేపీలో చేరడమే ఇందుకు కారణం.ఇండోర్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీకి పోటీగా అక్షయ్ కాంతి బామ్ను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. అయితే ఆయన నామినేషన్ ఉపసంహరణకు చివరి రోజున కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. నామినేషన్ విత్డ్రా చేసుకని కాషాయ పార్టీలోకి చేరారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నియోజకవర్గానికి నాలుగో దశలో మే 13న పోలింగ్ జరగనుంది.“గత మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో ఇండోర్ ఓటర్లు బీజేపీకి భారీ విజయాన్ని అందించారు. అయినప్పటికీ, కాషాయ పార్టీ తమ అభ్యర్థి బామ్ను అన్యాయంగా ప్రలోభపెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఓటర్లు నోటాకు ఓటేసి బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలి’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత శోభా ఓజా పీటీఐతో అన్నారు.తమ పార్టీ ఏ అభ్యర్థికీ మద్దతివ్వదని, బీజేపీని శిక్షించేందుకు ఓటర్లకు నోటా అవకాశం ఉందని ఎంపీ కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ అన్నారు. అయితే నోటాకు ఓటేయాలని ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రజాస్వామ్యంలో 'ప్రతికూల వ్యూహాలను' అవలంభిస్తోందని బీజేపీ అభ్యర్థి లాల్వానీ అన్నారు. -
ఫ్రీగా సినిమా టికెట్లు.. ఓటేసినందుకు కాదు! మరి...
ఇండోర్ (మధ్యప్రదేశ్): ఓటర్లకు ఉచితంగా సినిమా టికెట్లు ఇస్తామంటోంది మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం. అయితే ఇది ఓటేసినందుకు కాదు.. మరి ఎందుకో ఈ కథనంలో తెలుసుకోండి..ఇండోర్ లోక్సభ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మే 4 నుండి మే 8 వరకు ఓటరు స్లిప్లను ఇంటింటికీ పంపిణీ చేసే ప్రక్రియను జిల్లా ఎన్నికల యంత్రాంగం చేపట్టనుంది. నిర్ణీత వ్యవధిలోగా బీఎల్ఓలు ఓటరు స్లిప్ను అందిచకపోతే వాట్సాప్ లేదా టెలిఫోన్లో ఫిర్యాదు నమోదు చేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశీష్ సింగ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.ఓటరు స్లిప్పులు అందని ఓటర్లు తమ అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ వివరాలతో జిల్లా ఎన్నికల హెల్ప్లైన్ వాట్సాప్ నంబర్ 9399338398 లేదా ల్యాండ్లైన్ నంబర్ 0731-2470104, 0731-2470105లో మే 10వ తేదీ వరకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు నిజమైనదని తేలితే బీఎల్ఓపై చర్యలు తీసుకోవడంతోపాటు సరైన సమాచారం ఇచ్చిన ఓటర్లకు బహుమతిగా నగరంలోని సినిమా థియేటర్లో సినిమా చూసేందుకు రెండు సినిమా టిక్కెట్లను ఉచితంగా అందజేస్తారు. -
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
లక్కీ డ్రాలో బహుమతులు గెలుచుకోవచ్చంటే సామాన్యుల కాలు కదలకుండా ఉంటుందా..? మధ్యప్రదేశ్లోని భోపాల్ లోక్సభ స్థానంలో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు ఇలాంటి ఆఫరే ఇస్తున్నారు. మూడో దశలో భాగంగా ఈ నెల 7న భోపాల్లో పోలింగ్ జరుగుతోంది. ఆ రోజున ఓటేసే వారి పేర్లనుంచి ప్రతి మూడు గంటలకు ఒకసారి లక్కీ డ్రా తీయనున్నారు. విజేతలకు వజ్రపు ఉంగరాలు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు తదితర కానుకలిస్తారట! ‘‘నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉదయం 10, మధ్యాహ్నం 3, సాయంత్రం 6 గంటలకు లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులిస్తం. పోలింగ్ మర్నాడు మెగా డ్రా తీసి విజేతలకు మరింత పెద్ద బహమతులిస్తాం’’అని జిల్లా ఎన్నికల అధికారి కౌసలేంద్ర విక్రమ్ సింగ్ ప్రకటించారు. ఓటింగ్ పెంచేందుకే.. మధ్యప్రదేశ్లో ఇప్పటిదాకా జరిగిన రెండు దశల్లో పోలింగ్ 2019తో పోలిస్తే సగటున 8.5 శాతం తగ్గింది. 2019లో భోపాల్లో 65.7 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి ఎండలు విపరీతంగా ఉన్నందున ఓటర్లు పెద్దగా ఇల్లు కదలకపోవచ్చన్న ఆందోళనలున్నాయి. దీంతో ఎలాగైనా ఓటింగ్ను పెంచాలని ఈసీ కృత నిశ్చయంతో ఉంది. భోపాల్ నియోజకవర్గంలో 3,097 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి బూత్ వద్ద ఒక బీఎల్వో, వలంటీర్ను లక్కీ డ్రా కోసం నియమించారు. ఓటేశాక అక్కడి కూపన్ బుక్లెట్లో పేరు, మొబైల్ నంబర్ రాసి రసీదు తీసుకోవాలి. బహమతుల ఖర్చును కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కంపెనీలు భరిస్తున్నాయి. మెగా డ్రా కోసం డైమండ్ ఉంగరాలు, ల్యాప్టాప్లు, ఫ్రిజ్లు ఎనిమిది డిన్నర్ సెట్లు, రెండు మొబైల్ ఫోన్లు రెడీగా ఉన్నాయి. దీంతోపాటు ప్రతి పోలింగ్ కేంద్రంలో తొలి ఓటర్ను గౌరవించేందుకు ప్రత్యేకంగా ఏదైనా చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
భోపాల్: లోక్సభ ఎన్నికల రెండు దశలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇదివరకు నమోదైన విధంగా తక్కువ ఓటింగ్ శాతాన్ని పరిష్కరించడానికి లేదా ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడానికి భోపాల్లోని అధికారులు ఓ కొత్త వ్యూహాన్నిరూపొందించారు. ఓటు ప్రాముఖ్యతను గుర్తించి.. ఓటర్లను ఆకర్శించడానికి (ఓటు హక్కును వినియోగించుకోవడానికి) లక్కీ డ్రా నిర్వహించడానికి అధికారులు కంకణం కట్టుకున్నారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 13 ఎంపీ స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన స్థానాలకు మూడు, నాలుగవ దశల్లో ఓటింగ్ జరగనుంది. ఈ దశల్లో ఓటర్లను ఎక్కువ సంఖ్యలో ఆకర్శించడానికి పోలింగ్ రోజు ప్రతి రెండు గంటలకు ఒక లక్కీ డ్రా నిర్వహించడానికి అధికారులు సంకల్పించారు.లక్కీ డ్రాలో డైమండ్ రింగ్స్, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్ వంటి ఆకర్షణీయమైన బహుమతులు అందించనున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్ అంతటా 8.5 శాతం ఓటింగ్ తగ్గింది. 2019 ఎన్నికలలో కూడా ఓటింగ్ శాతం 65.7% మాత్రమే. ఈ సారి మాత్రం ఓటు హక్కును తప్పకుండా అందరూ ఉపయోగించుకోవాలని అనే నేపథ్యంలో ఈ లక్కీ డ్రా విధానం ప్రవేశపెట్టారు.జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ ఈ లక్కీ డ్రా గురించి మాట్లాడుతూ.. పోలింగ్ రోజు ప్రతి బూట్ వద్ద ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 6 గంటలకు లక్కీ డ్రాలో విజేతలను ప్రకటిస్తాము. ఎన్నికలు పూర్తయిన ఒకటి లేదా రెండు రోజుల్లో వారికి గిఫ్ట్స్ ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఓటరులో చైతన్యాన్ని తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కౌశలేంద్ర పేర్కొన్నారు.భోపాల్ పార్లమెంటరీ నియోజకవర్గం 2,097 పోలింగ్ బూత్లను కలిగి ఉంది. పోలింగ్ రోజున ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఒక వాలంటీర్ను నియమిస్తారు. ఓటు వేసిన తరువాత ఓటరు పేరు, మొబైల్ నెంబర్ రాసి వారి దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత జరిగే లక్కీ డ్రాలో విజేతలను ఎంపిక చేయడం జరుగుతుంది.#SVEEP के अंतर्गत 'राज्य स्तरीय स्लोगन प्रतियोगिता' ▶️प्रविष्टि भेजने की अंतिम तिथि आज ▶️“प्रत्येक वोट जरूरी है” विषय पर लिखें स्लोगन और जीतें आकर्षक पुरस्कार ➡️प्रविष्टि भेजने के लिए विजिट करें 👇https://t.co/ZX4TawpjyZ @rajivkumarec @ECISVEEP @SpokespersonECI pic.twitter.com/f4CSpBaKDK— Chief Electoral Officer, Madhya Pradesh (@CEOMPElections) April 30, 2024 -
ఉజ్జయినిలో విచిత్ర పోటీ.. ఇద్దరు అనిల్లు, ఇద్దరు మహేష్లు!
దేశంలో లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో పలుచోట్ల ఆసక్తికర వైనాలు కనిపిస్తున్నాయి. దీనిలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ఒకటి. ఇక్కడ మే 13న ఓటింగ్ జరగనుంది. ఉజ్జయిని నుంచి మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు బరిలోకి దిగగా, వారిలో ఇద్దరు అనిల్లు, ఇద్దరు మహేష్లు ముఖాముఖీ తలపడటం విశేషం.ఉజ్జయిని నుంచి లోక్సభ ఎన్నికల బరిలో దిగినవారిలో బీజేపీ అభ్యర్థి అనిల్ ఫిరోజియా, కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ పర్మార్, భీమ్ సేన దళ్కు చెందిన డాక్టర్ హేమంత్ పర్మార్, బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ప్రకాష్ చౌహాన్, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా గంగా మాలవ్య, మహేష్ పర్మార్,అనిల్, ఈశ్వర్లాల్, సురేష్, ఈశ్వర్లాల్ ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈసారి లోక్సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా ఒకే పేరుతో ఇద్దరు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం విశేషం.ఉజ్జయిని పార్లమెంటరీ నియోజకవర్గానికి వచ్చిన 11 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన కలెక్టర్, రిటర్నింగ్ అధికారి నీరజ్ కుమార్ సింగ్ సమక్షంలో జరిగింది. దీనిలో తొమ్మిది మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలు ఆమోదం పొందాయి. ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి -
హస్తానికి అందని ద్రాక్షేనా!
హిందీ బెల్టులో కీలక రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. 2009లో 12 స్థానాల్లో గెలిచిన హస్తం పార్టీ 2014లో 2 స్థానాలకు పడిపోయింది. 2019కి వచ్చేసరికి ఒకే సీటుకు పరిమితమైంది. మిగతా 28 చోట్లా కాషాయ జెండాయే ఎగిరింది! గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ దుమ్ము రేపింది. శుక్రవారం రెండో విడతలో రాష్ట్రంలో ఆరు కీలక స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇవన్నీ బీజేపీ కంచుకోటలే. ఇక్కడ బీజేపీని ఎదుర్కోలేక రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ అష్టకష్టాలు పడుతోంది. ఆ స్థానాల్లో బరిలో ఉన్న అభ్యర్థులు, వారి బలాబలాలపై ఫోకస్... ఖజురహో...కాంగ్రెస్ సెల్ఫ్ గోల్బలమైన బీజేపీని దీటుగా ఢీకొట్టాల్సిన వేళ హస్తం పార్టీ ఆదిలోనే ‘చేయి’ కాల్చుకుంది. పోలింగ్కు ముందే ఈ స్థానాన్ని చేజేతులా ‘కమలం’ పువ్వులో పెట్టి మరీ అందిస్తోంది. పొత్తులో భాగంగా ఖజురహోను సమాజ్వాదీ పార్టీకి కాంగ్రెస్ త్యాగం చేసింది. ఇక్కడ బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, సిట్టింగ్ ఎంపీ వీడీ శర్మపై అనామకుడైన మనోజ్ యాదవ్ను ఎస్పీ తొలుత అభ్యర్థిగా ప్రకటించింది. తర్వాత మాజీ ఎమ్మెల్యే మీరా దీపక్ యాదవ్కు సీటిచి్చంది. కానీ నామినేషన్ పత్రాల్లో సంతకం మర్చిపోవడంతో ఆమె అభ్యర్థిత్వాన్ని ఈసీ తిరస్కరించింది. దాంతో కంగుతిన్న కాంగ్రెస్, ఎస్పీ పెద్దగా సోదిలో లేని ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి ఆర్.బి.ప్రజాపతికి మద్దతివ్వాల్సి వస్తోంది. దీంతో ఇక్కడ విజయం బీజేపీకి నల్లేరుపై నడకే కానుంది. 2019లో 4.3 లక్షల పై చిలుకు మెజారిటీతో గెలిచిన శర్మ ఈసారి దాన్ని మరింత పెంచుకుంటారంటున్నారు. ‘‘వీడీ శర్మ చూడ్డానికి సన్నగా కనిపించినా ఆయన నాయకత్వంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొత్త రికార్డులు కొట్టింది’’ అంటూ తాజాగా దామోహ్ ఎన్నికల సభలో ప్రధాని మోదీ ఆకాశానికెత్తారు. హోషంగాబాద్.. కుబేరుడితో సరస్వతీ పుత్రుడు ఢీ!ఇక్కడ బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఉదయ్ ప్రతాప్ సింగ్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యారు. దాంతో ఈసారి ఐదు మాస్టర్ డిగ్రీల వీరుడు, రైతు ఉద్యమకారుడు దర్శన్ సింగ్చౌదరిని బీజేపీ బరిలో దింపింది. నెరిసిన గడ్డం, తెల్లటి తలపాగాతో సౌమ్యంగా కనిపించే ఈయన సరస్వతీ పుత్రుడు. ఫిలాసఫీ, ఇంగ్లి‹Ù, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, సోషియాలజీల్లో ఎంఏ చేశారు. నర్మదా లోయలో పలు రైతు ఉద్యమాలకు సారథ్యం వహించారు. బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడయ్యారు. లోక్సభ ఎన్నికలకు కొత్తే అయినా బాగా గుర్తింపున్న నాయకుడు. కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ శర్మ రాష్ట్రంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తి రూ.233 కోట్లు. హోషంగాబాద్ నియోజకవర్గ పరిధిలోని తెండుఖేడా అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు గెలిచారు. అయితే గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడారు. తికంగఢ్... యమా టఫ్2009లో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంగా మారినప్పటి నుంచీ ఇక్కడ కాషాయ జెండానే ఎగురుతోంది. ఇక్కడ బీజేపీ హ్యాట్రిక్ వీరుడు, కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ ఖటిక్ మళ్లీ బరిలో ఉన్నారు. గతంలో సాగర్ లోక్సభ స్థానంలోనూ నాలుగుసార్లు గెలిచిన రికార్డు ఆయనది. 2009లో తికంగఢ్ స్థానం ఏర్పడ్డప్పటి నుంచీ ఆయనే గెలుస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ ఇక్కడ ప్రతిసారీ అభ్యర్థులను మార్చినా ఫలితం మాత్రం శూన్యం. వీరేంద్ర అంతకంతకూ మెజారిటీ పెంచుకుంటూ పోతున్నారు. ఈసారి పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పంకజ్ అహిర్వార్ రూపంలో యువ నేతను కాంగ్రెస్ బరిలోకి దించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో జతారా స్థానం నుంచి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన తిరుగుబావుటా ఎగరేశారు. దాంతో ఇలా ఎంపీ టికెటిచి్చంది. బాహుబలి వంటి కేంద్ర మంత్రి వీరేంద్రపై పోటీకి నిలపడం పంకజ్ను బలిపశువును చేయడమేనని కాంగ్రెస్ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు! దామోహ్.. లోధీ వర్సెస్ లోధీబడా నేతలెవరూ రేసులో లేకున్నా ఆసక్తి రేపుతున్న నియోజకవర్గమిది. బీజేపీ అభ్యర్థి రాహుల్ సింగ్ లోధీ, కాంగ్రెస్ అభ్యర్థి తర్బార్సింగ్ లోధీ ఇద్దరూ ఒకప్పుడు బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి వీరవిధేయులే! పైగా బంధువులు కూడా. 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇద్దరూ బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. దామోహ్ నుంచి రాహుల్, బాందా నుంచి తర్బార్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. 15 నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడంతో రాహుల్ మళ్లీ బీజేపీ పంచన చేరారు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య పోటీ హోరాహోరీగానే ఉండొచ్చనేది పరిశీలకుల అభిప్రాయం. ఇక్కడ రెండుసార్లు నెగ్గిన సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ గత డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్ర మంత్రి అయ్యారు. సత్నా.. హోరాహోరీనాలుగుసార్లు ఎంపీగా గెలిచిన బీజేపీ బలశాలి గణేశ్ సింగ్పై యువ ఎమ్మెల్యే సిద్దార్థ్ కుశ్వాహను కాంగ్రెస్ బరిలో నిలిపింది. ఐదు నెలల క్రితమే సత్నా అసెంబ్లీ స్థానంలో గణేశ్ సింగ్ను కుశ్వాహ మట్టికరిపించడం విశేషం! దాంతో ఈసారి వారిద్దరి పోటీ ఉత్కంఠ రేపుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి షాకిచి్చన చరిత్ర కుశ్వాహది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ నేత శంకర్లాల్ తివారీని ఓడించి జెయింట్ కిల్లర్గా పేరొందారు.రేవా.. కమలానికే మొగ్గుబ్రాహ్మణ ఓట్లు ఎక్కువగా ఉన్న ఈ స్థానంలో ఇరు పారీ్టలూ ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులనే నిలబెడుతూ వస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీ జనార్దన్ మిశ్రాకే బీజేపీ మళ్లీ టికెటిచ్చింది. ఇక్కడ 2014లో 1.68 లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గిన మిశ్రా 2019లో దాన్ని 3.12 లక్షలకు పెంచుకున్నారు. ప్రతిసారీ అభ్యర్థులను మారుస్తున్న కాంగ్రెస్ ఈసారి మహిళకు టిక్కెట్ ఇచి్చంది. రేవా మేయర్ అభయ్ మిశ్రా భార్య నీలంను రంగంలోకి దించింది. అయితే ఈ ఎంపీ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏడు బీజేపీ గుప్పిట్లోనే ఉన్నాయి. ఈసారీ ఆ పారీ్టకే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: రాచరిక మాంత్రికుడు రాహుల్: మోదీ
హోషంగాబాద్/సాక్షి బెంగళూరు: ఒక్క దెబ్బతో దేశంలోని పేదరికాన్ని నిర్మూలించవచ్చంటూ కాగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ తప్పుపట్టారు. రాహుల్ను రాచరిక మాంత్రికుడిగా అభివరి్ణంచారు. ఆయన వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పారు. ఆదివారం మధ్యప్రదేశ్లో హోషంగాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పిపారియా పట్టణంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘ఒక్కదెబ్బతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించవచ్చని కాంగ్రెస్ రాజకుమారుడు ప్రకటించారు. నిజంగా నవ్వొస్తోంది. ఆ రాజరిక మాంత్రికుడు ఇన్నాళ్లూ ఎక్కడికెళ్లారు. ఆయన నాన్నమ్మ 50 ఏళ్ల క్రితం గరీబీ హఠావో అంటూ నినాదం ఇచ్చారు. పేదరికం మాత్రం పోలేదు. అందుకే ఆ రాజకుమారుడి మాటలను జనం పట్టించుకోవడం లేదు. ఆ కుటుంబ(సోనియా గాం«దీ) సభ్యులు 2014 కంటే ముందు పదేళ్ల పాటు రిమోట్ కంట్రోల్తో ప్రభుత్వాన్ని నడిపించారు. అప్పుడు పేదరికం గుర్తుకురాలేదు. ఇప్పుడు హఠాత్తుగా పేదరికాన్ని నిర్మూలించే మంత్రం కనిపెట్టారు. ఇష్టం వచి్చనట్లు మాట్లాడుతూ నవ్వులపాలవుతున్నారు. పేదరికంపై జోక్లు వేయొద్దని కోరుతున్నా’’ అని మోదీ స్పష్టం చేశారు. -
‘మీకో దండం.. మీ పార్టీకో దండం’.. నేను నా కలెక్టర్ ఉద్యోగం చేసుకుంటా
భోపాల్ : మీకో దండం!!.. మీ పార్టీకో దండం.. నేను నా డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం చేసుకుంటానంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మహిళా నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో డిప్యూటీ కలెక్టర్ హోదాను పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన తనని కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. అసెంబ్లీ, లోక్సభ సీటును నిరాకరించి పార్టీ తనకు ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా గతంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేసిన నిషా బాంగ్రే ఇప్పుడు తన ఉద్యోగాన్ని తిరిగి పొందాలని కోరుతున్నట్లు తెలిపారు. నిషా బాంగ్రే మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహించారు. అయితే డిప్యూటీ కలెక్టర్గా హోదాలో ఉన్నతమైన సేవలందించినందుకు ప్రజలు తనని రాజకీయాల్లోకి రావాలని కోరారు. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బాంగ్రేను సంప్రదించింది. తమ పార్టీలో చేరితే రాజకీయంగా సముచితం స్థానం కల్పిస్తామని ఆశచూపించింది. అధికార ప్రతినిధి పదవిని కట్టబెట్టింది. కాంగ్రెస్ నాయకత్వం ఒప్పుకోలేదు ‘కాంగ్రెస్ నన్ను సంప్రదించింది. అప్పుడే డిప్యూటీ కలెక్టర్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వెళ్లాలనే అనుకున్నాను. నాకు రాజకీయ నేపథ్యం లేదు. ఆర్థికంగా బలమైన కుటుంబం కూడా కాదు. ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్లో చేరాను. చివరకు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. బీజేపీ కావాలంటే నాకు టికెట్ ఇచ్చేది. కానీ స్థానిక రాజకీయాల కారణంగా ఇవ్వలేదు. చదువుకున్న మహిళ రాజకీయాల్లోకి రావడానికి కాంగ్రెస్ బెతుల్ జిల్లా నాయకత్వం భయపడింది’ అని బాంగ్రే అన్నారు . ఫలితాలతో పరిస్థితులు తారుమారు అసెంబ్లీ ఫలితాల తరువాత పరిస్థితులు తారుమారయ్యాయి. కాంగ్రెస్ అన్నీ కమిటీలను రద్దు చేసింది. బాధ్యతలు అప్పగించలేదు. కనీసం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా విలువైనా ఉండేది. లోక్సభ సీటు ఇవ్వలేదు. అందుకే నన్ను తిరిగి ఉద్యోగంలో చేరాలని కుటుంబసభ్యులు ఒత్తిడి చేస్తున్నారు. నా రాజీనామాను కేంద్రం అంగీకరించలేదు. తిరిగి విధుల్లో చేరేందుకు వీలుంది. ఇప్పుడు కాంగ్రెస్కు రాజీనామా చేసి.. డిప్యూటీ కలెక్టర్గా బాద్యతులు చేపట్టాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు. నిషా బాంగ్రే ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీలో చేరే వ్యక్తులు ఎమ్మెల్యే,లోక్సభ టికెట్లు పొందొచ్చు. ఇందుకోసం వారు కష్టపడి పనిచేయాలి. నిషా బాంగ్రేకి అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించాం. రాజకీయాల్లో కెరీర్ను నిర్మించుకోవడానికి సమయం పడుతుంది. ఆమె పార్టీని వదిలి వెళ్లాలనుకుంటే వెళ్లిపోవచ్చు అని కాంగ్రెస్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. -
అందరి దృష్టి ఆ దిగ్గజ నేతల కుమారులపైనే..
రానున్న లోక్సభ ఎన్నికల నేపధ్యంలో యూపీలోని ప్రయాగ్రాజ్పై అందరి దృష్టి పడింది. ఈ స్థానం నుంచి ఇద్దరు దిగ్గజ నేతల కుటుంబాలు తలపడుతున్నాయి. కేశరి నాథ్ త్రిపాఠి, రేవతి రమణ్ సింగ్ల కుమారులు ఎన్నికల బరిలోకి దిగారు. ఒకరు బీజేపీకి చెందిన బలమైన నేత. మరొకరు ఎస్పీకి చెందిన ప్రజాదరణ పొందిన నేత. త్వరలో జరగబోయే ఎన్నికల మహా పోటీలో ప్రజలు ఎవరికి పట్టం కడతారనేదానిపై ఆసక్తి నెలకొంది. ప్రయాగ్రాజ్ నుంచి ఎస్పీ, కాంగ్రెస్ కూటమి తరపున ఎస్పీ సీనియర్ నేత రేవతి రమణ్సింగ్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే ఉజ్వల్ రమణ్సింగ్ బరిలోకి దిగారు . ఇక బీజేపీ సీనియర్ నేత పండిట్ కేసరినాథ్ త్రిపాఠి కుమారుడు, హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్ నీరజ్ త్రిపాఠి ఆ పార్టీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. దివంగత పండిట్ కేసరి నాథ్ త్రిపాఠి, రేవతి రమణ్ సింగ్.. ఇద్దరికీ బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. పండిట్ కేసరి నాథ్ త్రిపాఠి అశోక్ నగర్ నివాసి. ఆయన బీజేపీకి చెందిన శాసనసభ స్పీకర్గా, ఎమ్మెల్యేగా, పశ్చిమ బెంగాల్ గవర్నర్గా కూడా పనిచేశారు. రేవతి రమణ్ సింగ్ కర్చనలోని బరాన్ నివాసి. ములాయం సింగ్ యాదవ్కు అత్యంత సన్నిహితుడు. ఎస్పీ, కాంగ్రెస్ పొత్తు తర్వాత ఉజ్వల్ రమణ్ సింగ్ కాంగ్రెస్లో చేరారు. నీరజ్ త్రిపాఠి బీజేపీలో ఏనాడూ క్రియాశీలకంగా లేరు. దీంతో ప్రయాగ్రాజ్ నుండి నీరజ్ త్రిపాఠి పేరు ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. తండ్రికి ప్రజల్లో ఉన్న ఆదరణ కారణంగా బీజేపీ నీరజ్ త్రిపాఠికి టిక్కెట్ కేటాయించింది. అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి వచ్చాక తన బాధ్యతలు పెరిగాయని, అందుకే పార్టీలో యాక్టివ్గా ఉండలేకపోయానని ఆయన తెలిపారు. ప్రయాగ్రాజ్ ప్రజలు తనను ఎంపీగా ఎన్నుకుంటే, స్థానికంగా మూతపడిన కంపెనీలను పునఃప్రారంభించడంతోపాటు కొత్త కంపెనీలను తీసుకురావడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తానని ఆయన తెలిపారు. -
Lok sabha elections 2024: బీజేపీకి ఎదురుందా!
భౌగోళికంగా భారత్కు గుండెకాయ వంటిది మధ్యప్రదేశ్. ఈ హిందీ బెల్టు రాష్ట్రంలో ఎన్నికల పోరు ఎప్పుడూ జాతీయ పార్టీల మధ్యే. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో దుమ్మురేపిన బీజేపీ ఉరిమే ఉత్సాహంతో లోక్సభ సంగ్రామంలో దూకగా కాంగ్రెస్ కూడా విపక్ష ఇండియా కూటమి దన్నుతో సత్తా చాటేందుకు పావులు కదుపుతోంది... మధ్యప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది. కాకపోతే దాదాపు పాతికేళ్లుగా రాష్ట్రంలో బీజేపీ ఆధిపత్యమే సాగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లతో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించి బీఎస్పీ, స్వతంత్రుల సాయంతో గద్దెనెక్కినా అది మూణ్నాళ్ల ముచ్చటే అయింది. అసంతృప్త కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా 2020లో తిరుగుబాటు చేయడంతో కమల్నాథ్ సర్కారు కుప్పకూలింది. శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలో మళ్లీ బీజేపీ సర్కారే కొలువుదీరింది. మధ్యప్రదేశ్లో 29 లోక్సభ సీట్లున్నాయి. 10 సీట్లను ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 28 సీట్లు కొల్లగొట్టగా కాంగ్రెస్ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ జోరే కొనసాగింది. 230 అసెంబ్లీ సీట్లలో ఏకంగా 163 స్థానాలను ఒడిసిపట్టింది. బీజేపీ ఓబీసీ కార్డు, కాంగ్రెస్ మైనారిటీ జపం మధ్యప్రదేశ్ ఎన్నికల సమీకరణాల్లో కులాలదీ కీలక పాత్రే. అగ్రవర్ణ ఓటు బ్యాంకును పటిష్టపరుచుకుంటూనే ఇతర సామాజిక వర్గాలను కూడా తమవైపు తిప్పుకోవడంపై బీజేపీ దృష్టి సారించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కుల గణన హామీని విస్తృతంగా ప్రచారం చేసినా ఓబీసీ ఓట్లను సాధించడంలో విపలమైంది. 2018తో పోలిస్తే బీజేపీ మరింత మంది ఓబీసీలను, ఆదివాసీలను తమవైపు తిప్పుకోగలిగింది. అనూహ్యంగా యాదవ సామాజికవర్గానికి చెందిన మోహన్ యాదవ్ను సీఎం చేయడం ఓబీసీల ఓట్లు సాధించి పెడుతుందని ఆశిస్తోంది. ఇతర హిందీ బెల్ట్ రాష్ట్రాల్లోనూ కీలకమై యాదవ ఓటు బ్యాంకు తనవైపు మళ్లుతుందని భావిస్తోంది. రాష్ట్రంలో 7 శాతం ఓటు బ్యాంకున్న ముస్లింలతో పాటు ఎస్టీలు కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారు. కాషాయ దళంలో జోష్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు జోష్లో ఉన్న బీజేపీ ఈసారి మొత్తం 29 స్థానాలనూ చేజక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయోధ్య రామమందిర నిర్మాణం, మోదీ, అభివృద్ధి, హిందుత్వ నినాదం ఈసారి కమలనాథులు ప్రచా రా్రస్తాలుగా ఉన్నాయి. సీఎంగా దాదాపు పాతికేళ్లు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన శివరాజ్ సింగ్ ఈసారి విదిశ నుంచి లోక్సభ బరిలోకి దిగుతుండటం విశేషం! కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య గుణ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ సింగిల్గా పోటీ చేస్తోంది. నాలుగు విడతల్లో పోలింగ్ జరుగుతుండగా ఇప్పటికే అభ్యర్థులందరినీ ప్రకటించింది. ప్రధాని మోదీ మధ్యప్రదేశ్లో సుడిగాలి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. తాజాగా మంగళవారం బాలాఘాట్ జిల్లాలో ఎన్నికల ర్యాలీలో విపక్షాలపై పదునైన వాగ్బాణాలు సంధించారు. తాను అభివృద్ధి చేస్తుంటే దూషిస్తున్నారని, దేశ భద్రతకు గ్యారంటీ ఇస్తుంటే బురద జల్లుతున్నారని, అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్నప్పుడూ అనరాని మాటలన్నారని విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్పై పదునైన విమర్శలతో వేడి పుట్టిస్తున్నారు. కాంగ్రెస్ కోలుకునేనా...! అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో మాత్రం చతికిలపడుతోంది. సింధియా వంటి కీలక యువ నేతను చేజార్చుకోవడం ఈసారి హస్తం పార్టీకి మరింత ప్రతికూలంగా మారింది. ఇండియా కూటమి దన్నుతో బీజేపీని ఢీకొట్టి పూర్వ వైభవాన్ని అందుకునేందుకు ప్రయతి్నస్తోంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలను ప్రచారా్రస్తాలుగా మలచుకుంటోంది. కులగణన హామీ ద్వారా ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకులపై కన్నేసింది. రాహుల్ ప్రకటించిన యువతకు 30 లక్షల ప్రభుత్వోద్యోగాల హామీపైనా ఆశలు పెట్టుకుంది. 6 న్యాయాలు, 25 గ్యారంటీల మ్యానిఫెస్టోతో ప్రచారాన్ని మ్మురం చేసింది. సమాజ్వాదీ పార్టీకి ఖజురహో స్థానం కేటాయించి మిగతా 28 చోట్ల పోటీ చేస్తోంది. బీజేపీకే ఓటేస్తున్న సర్వేలు సాధారణంగా మధ్యప్రదేశ్లో ఎన్నికల సరళి జాతీయ ట్రెండ్కు అనుగుణంగా ఉంటుంది. ఆ లెక్కన మొత్తం 29 సీట్లనూ బీజేపీ క్లీన్స్వీప్ చేస్తుందని పలు సర్వేలు అంచనా వేశాయి. మరికొన్ని 27 సీట్లిచ్చాయి. కాంగ్రెస్ గట్టిగా పుంజుకోని పక్షంలో 2 సీట్లకు మించకపోవచ్చన్నది మెజారిటీ ఒపీనియన్ పోల్స్ అంచనా. ‘సరికొత్త భారత నిర్మాణమే నా మిషన్. చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇందుకు ప్రజల దీవెనలు కావాలి. నేను మహాకాలుడి భక్తున్ని. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు’ – మంగళవారం మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో ఎన్నికల ర్యాలీలో మోదీ , – సాక్షి, నేషనల్ డెస్క్ -
5 నెలల్లో 3 పార్టీలు.. 48 గంటల్లో బీజేపీకి రాంరాం.. కాంగ్రెస్ గూటికి ఛలో!
దేశంలో ఎన్నికలు సమీపించగానే అంతవరకూ ఎవరికీ కనిపించని నేతలు సైతం యాక్టివ్ అయిపోతారు. అధికారంలో ఉన్న పార్టీలోకి లేదా తమకు నచ్చిన పార్టీలోకి దూకేస్తారు. మధ్యప్రదేశ్లో లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇలాంటి ఉదంతాలు అనేకం కనిపిస్తున్నాయి. పలువురు నేతలు కాంగ్రెస్ను వీడి బీజేపీలోకి లేదా బీజేపీని వీడి కాంగ్రెస్లోకి చేరిపోతున్నారు. మొరెనా జిల్లాకు చెందిన ఒక నేత ఐదు నెలల్లోనే మూడుసార్లు పార్టీ మారారు. సిద్ధి జిల్లాకు చెందిన ఓ మహిళా నేత 48 గంటల్లోనే బీజేపీని వీడి, తిరిగి కాంగ్రెస్లోకి వచ్చేశారు. సిద్ధి మున్సిపాలిటీ అధ్యక్షురాలు కాజల్ వర్మ 48 గంటల్లోనే బీజేపీపై విరక్తి చెందారు. తిరిగి కాంగ్రెస్లో చేరారు. కాజల్ వర్మకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ బీజేపీ సభ్యత్వం ఇచ్చారు. అయితే తనను బెదిరించి బీజేపీ సభ్యత్వం ఇచ్చారని కాజల్ వర్మ ఆరోపించారు. ఇదేవిధంగా సుమావాలి అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే అజబ్ సింగ్ కుష్వాహా బీజేపీలో చేరారు. ఆయన ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్తో కలిసి హెలికాప్టర్లో సబల్గఢ్కు చేరుకుని, బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. అజబ్ సింగ్ కుష్వాహా బీజేపీలో చేరడం కాంగ్రెస్కు తీరని నష్టంగా పరిణమించింది. మొరెనా షియోపూర్ లోక్సభ నియోజకవర్గంలో కుష్వాహా సామాజికవర్గం పెద్ద సంఖ్యలో ఉంది. అజబ్ సింగ్ కుష్వాహా గత ఐదు నెలల్లో మూడు రాజకీయ పార్టీలు మారారు. తాజాగా ఆయన బీజేపీ పంచన చేరారు. అజబ్ సింగ్ కుష్వాహా తన రాజకీయ యాత్రను బహుజన్ సమాజ్ పార్టీతో ప్రారంభించారు. ఆ తర్వాత బీఎస్పీపై విసిగిపోయి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో ఉండటం కుదరదంటూ ఇప్పుడు బీజేపీలో చేరారు. -
కాంగ్రెస్ బ్యానర్పై బీజేపీ అభ్యర్థి ఫొటో..!!
రాజకీయ నేతల ప్రచారాల్లో అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతుండటం సహజమే. అయితే ఇటువంటివి సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంటాయి. వీటిని చూసిన జనాలు నవ్వుకుంటుంటారు. తాజాగా మధ్యప్రదేశ్లో ఇలాంటి ఉదంతమొకటి చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం మధ్యప్రదేశ్లో పర్యటిస్తున్నారు. సియోని జిల్లాలోని లఖ్నాడన్ అసెంబ్లీలోని ధనోరా గ్రామంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. రాహుల్ రాకకు స్థానిక నేతలు వేదికతో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే ఇంతలో చోటుచేసుకున్న ఒక పొరపాటు పార్టీని ఇబ్బందుల్లో పడేసింది. రాహుల్ గాంధీ సభకు ఒకరోజు ముందు వేదికపై మెయిన్ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్లో కాంగ్రెస్ పార్టీలోని ప్రముఖ నేతల ఫొటోలను ముద్రించారు. ఇక్కడే ఒక పెద్ద పొరపాటు జరిగింది. కాంగ్రెస్ నేతలతో కూడిన ఆ బ్యానర్లో బీజేపీ కేంద్ర మంత్రి, పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థి ఫగ్గన్ సింగ్ కులస్తే ఫొటో ముద్రితమయ్యింది. కొద్దిగా ఆలస్యంగా దీనిని గుర్తించిన స్థానిక కాంగ్రెస్ నేతలు.. ఫగ్గన్ సింగ్ కులస్తే ఫొటోపై మరో కాంగ్రెస్ నేత ఫొటో అతికించి, ఊపిరిపీల్చుకున్నారు. -
‘నా భార్య కాంగ్రెస్.. ఇంటికి వెళ్లను’ ఓ అభ్యర్థి కఠిన నిర్ణయం
భోపాల్: ఈ సార్వత్రిక ఎన్నికలు భార్యాభర్తల మధ్య ఎడబాటును కలిగిస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ లోక్సభ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంకర్ ముంజరే తాత్కాలికంగా ఇంటిని వీడి బయటకు వచ్చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఇంట్లో అడుగు పెట్టను అని కఠిన నిర్ణయం తీసుకున్నారు. తన ఇంటిని విడిచిపెట్టి బయటకు వచ్చేశానని బీఎస్పీ అభ్యర్థి కంకర్ ముంజరే శనివారం తెలిపారు. తన తన భార్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుభా ముంజరే అక్కడ ఉంటున్నారని, ఇద్దరు వ్యక్తులు వేర్వేరు సిద్ధాంతాలను అనుసరిస్తున్నప్పుడు ఒకే పైకప్పు కింద ఉండకూడదని అన్నారాయన. ఏప్రిల్ 19న పోలింగ్ రోజు తర్వాతే ఇంటికి తిరిగి వెళ్తానని మాజీ ఎమ్మెల్యే, ఎంపీ కంకర్ ముంజరే చెప్పారు. "నేను శుక్రవారం నా ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. ఆనకట్ట సమీపంలో ఒక గుడిసెలో నివసిస్తున్నాను. వేర్వేరు భావజాలాన్ని అనుసరించే ఇద్దరు వ్యక్తులు ఒకే పైకప్పు కింద నివసిస్తుంటే, అది మ్యాచ్ ఫిక్సింగ్ అని ప్రజలు భావిస్తారు ” అని ఆయన పీటీఐతో తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన భార్య అనుభా ముంజరే బీజేపీ అభ్యర్థి గౌరీశంకర్ బిసెన్ను ఓడించారు. అయితే తన భర్త నిర్ణయంతో బాధపడ్డానని, పెళ్లి అయి మెట్టినింటికి వెళ్లిన మహిళ చనిపోయే వరకు అక్కడే ఉంటుందని అనుభా ముంజరే చెబుతున్నారు. గతంలో ఆయన ఇక్కడి పరస్వాడ నుండి గోండ్వానా గంతంత్ర పార్టీ అభ్యర్థిగా ఉన్నప్పుడు, తాను కాంగ్రెస్ టిక్కెట్పై బాలాఘాట్ నుండి పోటీ చేసినప్పుడు తాము కలిసే ఉన్నామని తెలిపారు. తాను నమ్మకమైన కాంగ్రెస్ కార్యకర్తనని, బాలాఘాట్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సామ్రాట్ సరస్వత్ విజయానికి కృషి చేస్తానని అనుభా ముంజరే పేర్కొన్నారు. -
మృత ఉద్యోగికి ఎన్నికల డ్యూటీ.. అధికారి సస్పెండ్!
లోక్సభ ఎన్నికల డ్యూటీ కేటాయింపులో వింతవైనం వెలుగు చూసింది. ఈ ఉదంతం మధ్యప్రదేశ్లోని జబల్పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అసిస్టెంట్ కమిషనర్పై వేటు పడింది. వివరాల్లోకి వెళితే జబల్పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న రచయితా అవస్థి.. మరణించిన ఒక మహిళా ఉద్యోగిని ఎన్నికల విధులకు కేటాయించారు. అలాగే ఆమె చేయాల్సిన పనులను కూడా సంబంధిత రిపోర్టులో పేర్కొన్నారు. తరువాత ఎన్నికల ఉద్యోగుల డేటా బేస్ను ఎన్నికల కార్యాలయానికి పంపారు. అయితే దీనిలో చనిపోయిన ఒక మహిళా ఉద్యోగి పేరు కూడా ఉందని జిల్లా ఎన్నికల అధికారి గుర్తించారు. ఈ నేపధ్యంలో ఎన్నికల అధికారులు సంబంధిత అధికారులను విచారించారు. చివరికి ఇది అసిస్టెంట్ కమిషనర్ రచయితా అవస్థి తప్పిదమని తేలింది. దీంతో జిల్లా ఎన్నికల అధికారి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని, అసిస్టెంట్ కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏ విషయంలోనైనా ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి దీపక్ సక్సేనా హెచ్చరించారు. -
Lok sabha elections 2024: ఉత్తమ ఫినిషర్ రాహుల్: రాజ్నాథ్
భోపాల్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెణుకులు విసిరారు. క్రికెట్లో మహేంద్ర ధోనీ మాదిరిగానే దేశ రాజకీయాలకు ఉత్తమ ఫినిషర్ రాహుల్ అని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్లోని సిద్ధిలో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాజ్నాథ్ ప్రసంగించారు. ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ అధికారం నేడు ఏవో రెండు మూడు చిన్న రాష్ట్రాలకు పరిమితం కావడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందుకు కారణాలను ఆయన వివరిస్తూ..క్రికెట్లో బెస్ట్ ఫినిషర్ ఎవరని ప్రశ్నించగా జనం ‘ధోనీ’అని సమాధానమిచ్చారు. భారత రాజకీయాల్లో బెస్ట్ ఫినిషర్ ఎవరని నన్ను ఎవరైనా అడిగితే రాహుల్ గాంధీ అనే బదులిస్తాను. ఎందుకంటే, ఆయన హయాంలోనే కీలక నేతలెందరో ఆ పార్టీని వీడారు’అంటూ రాజ్నాథ్ వ్యాఖ్యానించారు. -
దురదృష్టం అంటే ఈమెదే.. కూటమికి కూడా!
భోపాల్: మధ్యప్రదేశ్లో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కూటమికి చెందిన సమాజ్వాదీ పార్టీ ఖజురహో అభ్యర్థి మీరా యాదవ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఎన్నికల కమిషన్కు అవసరమైన పత్రాలను సమర్పించకపోవడంతో 'సిగ్నేచర్ మిస్సింగ్' అభ్యర్థి పోటీ నుండి నిష్క్రమించడానికి దారితీసింది. రాష్ట్రంలోని నివారి అసెంబ్లీ స్థానం నుంచి 2008లో సమాజ్వాదీ పార్టీ టికెట్పై ఒకసారి గెలిచిన మీరా యాదవ్.. తర్వాత ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి సార్వత్రిక ఎన్నికలలో ఖజురహో లోక్సభ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ తొలుత మనోజ్ యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించింది. తర్వాత ఈ సీటును మీరా యాదవ్కు ఇచ్చింది. దీంతో ఆఖరి రోజున గురువారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అయితే శుక్రవారం నామినేషన్ల పరిశీలన అనంతరం ఈమె నామినేషన్ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే ఆమె పత్రాలను రిటర్నింగ్ అధికారి ధ్రువీకరించారని మీరా యాదవ్ భర్త, ఉత్తర ప్రదేశ్నుంచి రెండుసార్లు సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అయిన దీప్ నారాయణ్ యాదవ్ చెప్పారు. తర్వాత రోజు సవరించిన ఓటరు జాబితాను సమర్పించకపోవడంతో పాటు ఒక చోట అభ్యర్థి సంతకం లేదని అధికారులు చెప్పారని ఆయన వివరించారు. దీనిపై అవసరమైతే హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. కాగా ఈ ఖజురహో స్థానంలో బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర చీఫ్, ప్రస్తుత ఎంపీ వీడీ శర్మను పోటీకి దింపింది. 2019 ఎన్నికలలో ఆయన తన సమీప ప్రత్యర్థిపై 4.92 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. మీరా యాదవ్ నామినేషన్ను తిరస్కరించడం "ప్రజాస్వామ్య హత్య"గా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. -
ప్రాణాలు తీసిన ప్రాంక్.. ఫ్రెండ్ను ఫూల్ చేయబోయి విద్యార్ధి మృతి
సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ప్రాంక్ల హవా బాగా నడుస్తోంది. కుటుంబ సభ్యులు, తెలిసిన వారికి ఏదైనా విషయం గురించి చెప్పి భయపెట్టడం.. తరువాత అదంతా ప్రాంక్ అని చెప్పడం ఫ్యాషన్గా మారింది. అయితే కొన్ని సార్లు ఈ చర్యలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ప్రాంక్ మోజులో పడి అనేక మంది యువత తమ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఏప్రిల్ ఫూల్స్ డే రోజు చేసిన తన స్నేహితుడిని ప్రాంక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది. ఇండోర్లోని మల్హర్గంజ్లో 11వ తరగతి చదువుతున్న అభిషేక్ అనే విద్యార్ధి సోమవారం ఏప్రిల్స్ ఫూల్స్డే రోజు తన స్నేహితుడిని ప్రాంక్ చేయాలని ప్రయత్నించాడు. ఫ్రెండ్కు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు నటించాడు. స్టూల్పై నిల్చొని మెడకు తాడు బిగించి తను చనిపోతున్నట్లు స్నేహితుడిని నమ్మించాడు. ఈ క్రమంలో అనుకోకుండా స్టూల్ జారిపోవడంతో మెడకు తాడు బిగుసుకుపోయి మృతి చెందాడు. ఈ సంఘటనను చూసిన వెంటనే స్నేహితుడు.. అభిషేక్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అదనపు డీసీపీ రాజేష్ దండోటియా తెలిపారు. చదవండి: విషాదం: ఫార్చ్యూనర్ కోసం ‘కరిష్మా’కు భవిష్యత్తే లేకుండా చేశారు గమనిక: దయచేసి ఎవరూ ఇలాంటి ప్రాంక్లు ప్రయత్నించవద్దు. చిన్న చిన్న సరదాలకు పోయి.. నిండు ప్రాణాలను బలితీసుకోవద్దు -
కాంగ్రెస్, బీజేపీలతో ‘రెండున్నర అక్షరాల పార్టీ’ పోరు!
దేశంలో లోక్సభ ఎన్నికల వేడి కొససాగుతోంది. ఈ నేపధ్యంలో పలు వింతలు, విడ్డూరాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో పోటీకిదిగే జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల గురించి అందరికీ ఎంతోకొంత తెలిసేవుంటుంది. అయితే ఎవరికీ అంతగా తెలియని ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ రాబోయే లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఆ పార్టీ పేరు ‘ఢాయీ అక్షర్’ అంటే రెండున్నర అక్షరాలు. ఇంతకీ ఈ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తోంది? భక్త కబీర్ ఒక శ్లోకంలో ఢాయీ అక్షర్ అనే పదాన్ని ప్రయోగించారు. ‘శ్రీరాం’ అనే అర్థంతో కబీర్ దీనిని ఉపయోగించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన రాకేష్ సోంకర్ ‘ఢాయీ అక్షర్’ పార్టీని స్థాపించారు. ఇప్పుడు ఆయన రాబోయే లోక్సభ ఎన్నికల్లో జబల్పూర్ నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఆయన స్థాపించిన ‘రెండున్నర అక్షరాల పార్టీ’ ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్లతో తలపడనుంది. కాగా రాకేష్ 13వ సారి ఎన్నికల బరిలో దిగారు. ఇప్పటి వరకు ఆయన ఆరు అసెంబ్లీ, ఐదు లోక్ సభ, ఒక మేయర్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసారి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగిన రాకేష్ సోంకర్కు ఎన్నికల సంఘం ఆటో గుర్తును కేటాయించింది. అందుకే ఆయన ఇటీవల ఆటోడ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన ఎన్నికల ఫిలాసఫీ కూడా ఎంతో విచిత్రంగానే ఉంది. తాను ఎన్నికలకు ప్రచారం చేయబోనని ఆయన ప్రకటించారు. అయితే ప్రచారం ద్వారా రాకేష్ తన అభిప్రాయాలను ఎవరికీ తెలియజేయనప్పుడు ఆయనకు ఓటు వేసేదెవరని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చని, అందుకే తాను కూడా ఎన్నికల బరిలో దిగానని రాకేష్ చెబుతున్నారు. -
భార్యాభర్తలను విడదీసిన లోక్సభ ఎన్నికలు!
రాబోయే లోక్సభ ఎన్నికలు పచ్చని సంసారాల్లో చిచ్చులు కూడా పెడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కలహాలకు కారణమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితి మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో చోటుచేసుకుంది. బాలాఘాట్ లోక్సభ స్థానానికి జరగబోయే ఎన్నికలు భార్యాభర్తల మధ్య వివాదాలకు కారణంగా నిలిచాయి. ‘ఎన్నికల ప్రచారం అయ్యే వరకు నేను ఒక్కడినే ఇంట్లో ఉంటాను.. లేదంటే నువ్వు ఒక్కర్తివే ఇంట్లో ఉండు. ఇద్దరం ఒకే చోట ఉండటం కుదరదు’ అంటూ బీఎస్పీ నేత, మాజీ ఎంపీ కంకర్ ముంజరే తన భార్య, కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే అనుభా ముంజరేను కోరారు. దీంతో అనుభా ముంజరే దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారు. మాజీ ఎంపీ కంకర్ ముంజరే బీఎస్పీ టికెట్పై లోక్సభ ఎన్నికల బరిలో దిగారు. అతని భార్య అనుభా ముంజరే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్పై పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న సామ్రాట్ సరస్వర్ కోసం ప్రచారం సాగిస్తున్నారు. అనుభ ముంజరే, కంకర్ ముంజరేలు భార్యాభర్తలుగా ఒకే ఇంట్లో ఉంటూ వేర్వేరు పార్టీలకు ప్రచారం చేయడం వారికి సమస్యగా మారింది. మరోవైపు అనుభ ముంజరే బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న తన భర్త కంకర్ ముంజరేకు ప్రచారం చేస్తారా లేక కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తారా? అంటూ పలువురు మరో సమస్యను లేవదీస్తున్నారు. ఈ నేపధ్యంలో భర్త కంకర్ ముంజరే తన భార్యతో ‘ఏప్రిల్ 19వ తేదీన ఇక్కడ లోక్సభ ఎన్నికల ఓటింగ్ ముగిసే వరకు ఇంటికి దూరంగా ఉండు. మీ సోదరి ఇంటికి లేదా వేరే ఎక్కిడికైనా వెళ్లి కాంగ్రెస్ తరపున ప్రచారం సాగించు. ఈ ఇంటిలో ఉంటూ కాంగ్రెస్కు ప్రచారం చేయవద్దు. నువ్వు ఇల్లు వదిలి వెళ్లకపోతే నేను ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి ఎన్నికలకు ప్రచారం చేసుకుంటాను. ఈ విషయంలో నువ్వు ఎలాంటి ప్రశ్నలు వేయవద్దు. ఇది మా పార్టీ విధివిధానాలకు సంబంధించిన విషయం. నేను ఇందులో ఏ మాత్రం రాజీపడను’ అని భార్యతో తెగేసి చెప్పేశాడట.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజకీయ పోరు
ప్రత్యేకతలు
టీడీపీ హయాంలో అన్నీ అవకతవకలే...
No Headline
వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులివీ..
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ
కదంతొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు
పెళ్లి ఫోటోలు డిలీట్.. ఎయిర్పోర్ట్లో మెరిసిన స్టార్ కపుల్!
లోయలోకి దూసుకెళ్లిన ఆటో
జగనన్నతోనే పేదల జీవితాల్లో వెలుగులు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement