-
ఖర్గే హెలికాప్టర్లో తనిఖీలు.. ‘బీజేపీ నేతలను తనిఖీ చేస్తున్నారా?’
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో ప్రతిపక్షాలను ఎన్నికల అధికారులు టార్గట్ చేసి మరీ తనిఖీలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హెలికాప్టర్ను బిహార్లోని సమస్తిపూర్లో పోలింగ్ అధికారులు తనిఖీ చేశారు. అయితే ఎన్డీయే కూటమి నేతలను మాత్రం ఎటువంటి తనిఖీలు చేయకుండా విదిలేస్తున్నారని కాంగ్రెస్ ఎన్నికల అధికారులపై విమర్శలు చేసింది. శనివారం మల్లికార్జున ఖర్గే.. సమస్తీపూర్, ముజఫర్పర్లో ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు.‘‘ఇప్పటికే కేరళలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్ను ఎన్నికల అధికారలు తనిఖీ చేశారు. శనివారం మల్లికార్జన ఖర్గేను బిహార్లోని సమస్తీపూర్లో అధికారుల చేత తనిఖీ చేయబడ్డారు’’ అని ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్ పార్టీ నేత రాజేష్ రాథోడ్ అన్నారు. బిహార్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఖర్గే హెలికాప్టర్ చెక్ చేశారని రాజేష్ రాథోడ్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. వీడియోలో.. హెలికాప్టర్ చుట్టూ అధికారులు, పోలిసులు ఉండటం గమనించవచ్చు.श्री @RahulGandhi जी के बाद अब @INCIndia अध्यक्ष श्री @kharge जी का हेलीकॉप्टर की तलाशी बिहार के समस्तीपुर में सभा के दौरान चुनाव आयोग और पुलिसकर्मियों द्वारा करना चुनाव आयोग का दुर्भावना पूर्ण व्यवहार प्रतिपक्षों के लिए दर्शाता है यह लोकतंत्र की हत्या है l pic.twitter.com/tk1SUqcj5P— Rajesh Rathorre (@RajeshRathorre1) May 11, 2024 ‘‘కేవలం కాంగ్రెస్ నేతల హెలికాప్టర్లకు మాత్రమే తనిఖీలు చేస్తున్నారా? లేదా బీజేపీకి చెందిన అగ్రనాయకుల హెలికాప్టర్లును కూడా చెక్ చేస్తున్నారా? అనే విషయంపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వాలి. ఈ తనిఖీలు సమాచారాన్ని ఈసీ బహిరంగంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. లేదంటే ప్రతిపక్షాలను అడ్డుకొని, ఎన్డీయే నేతలను ఫ్రీగా వదిలేసినట్లు అర్థమవుతుంది’’ అని రమేష్ రాథోడ్ అన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారులు నేతల హెలికాప్టర్లను చెక్ చేసిన అన్ని వీడియోను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సొంత లోక్సభ స్థానం గుల్బర్గాలో బీజేపీ నుంచి మరోసారి గట్టి సవాలు ఎదురవుతుతోంది. కాంగ్రెస్ కంచుకోటగా పేరుగాంచిన గుల్బర్గాలో 2009, 2014ల్లో వరుసగా నెగ్గిన ఖర్గే 2019లో బీజేపీ అభ్యర్థి ఉమేశ్ జాదవ్ చేతిలో ఖర్గే ఓటమి చవిచూసి హ్యాట్రిక్కు దూరమయ్యారు. ఈసారి కాంగ్రెస్ నుంచి ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణిని బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి మరోసారి ఉమేశ్ జాదవ్ పోటీ చేస్తున్నారు. కలబురిగికి చెందిన దొడ్డమణికి పలు విద్యాసంస్థలున్నాయి. ఇంతకాలం ఖర్గే ఎన్నికల ప్రచారం, వ్యూహరచన తదితరాల్లో తెర వెనక దన్నుగా ఉన్నారు. వైద్యుడైన ఉమేశ్ పూర్వాశ్రమంలో కాంగ్రెస్ నాయకుడే. 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీదర్లోని చించోలి నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఖర్గేతో విభేదాల కారణంగా 2019 లోక్సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. తన గురుతుల్యుడైన ఖర్గేపైనే గెలుపొందారు. గుల్బర్గాలోలో 65 శాతం కంటే ఎక్కువ గ్రామీణ ఓటర్లే. మొత్తమ్మీద 20 శాతం మంది ముస్లిం ఓటర్లు, 24 శాతానికి పైగా దళితులున్నారు. వీరి ఓట్లపై కాంగ్రెస్ నమ్మకం పెట్టుకుంది. గుల్బర్గా లోక్సభ స్థానంలో కాంగ్రెస్ కేవలం మూడుసార్లు మాత్రమే ఓడింది. బీజేపీ రెండుసార్లు మాత్రమే గెలిచింది. మూడో విడతలో భాగంగా మంగళవారం ఇక్కడ పోలింగ్ జరుగనుంది. -
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
రాయ్పూర్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రచారంలో శరవేగంగా దూసుకుపోతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి మాత్రం రోజురోజుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పలువురు నేతలు పార్టీలకు రాజీనామా చేయటం తీవ్ర తలనొప్పిగా మారింది.తాజాగా ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నేత రాధికా ఖేరా కాంగ్రెస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు.‘‘అయోధ్యలోని రామమందిరం సందర్శించినందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చాలా తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్నా. ఎన్ఎస్యూఐ నుంచి కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగానికి 22 ఏళ్లుగా నా జీవితం అంకితం చేశా. పార్టీకి చాలా నిజాయితీగా పని చేశా. కానీ, నేను అయోధ్య రామ మందిరానికి మద్దతు తెలిపటం కారణంగా పార్టీలో చాలా వ్యతిరేకతను అనుభవించా. నేను ఒక మహిళను. న్యాయం కోసం, దేశం కోసం పోరాడుతా. కానీ, కాంగ్రెస్ పార్టీలో పోరాడటంలో ఓడిపోయా. ఒక రామ భక్తురాలిగా నేను చాలా బాధించబడ్డాను’’ అని రాధికా ఖేరా తెలిపారు. -
‘పార్టీకి వేయండి.. లేదంటే నా అంత్యక్రియలకైనా రండి’.. ఖర్గే ఎమోషనల్
బెంగళూరు: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓటర్లను భావోద్వేగానికి గురి చేశారు. కర్ణాటక కలబురగి ఖర్గే సొంత జిల్లా. ఈ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజల్ని కోరారు. ఒక వేళ మీరు పార్టీకి ఓటు వేసేందుకు ఇష్టపడకపోతే.. మీకోసం నేను పనిచేశానని భావిస్తే కనీసం మీరు నా అంత్యక్రియలకైనా హాజరు కావాలని ఖర్గే విజ్ఞప్తి చేశారు. 2009, 2014, 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కలబురగిలో మల్లికార్జున్ ఖర్గే ఓడిపోయారు. అయితే ఈ సారి ఎన్నికల్లో కలబురగి నుంచి ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణిని కాంగ్రెస్ అధిష్టానం పోటీకి దింపింది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఉమేష్ జాదవ్ మరోసారి టికెట్ దక్కించుకున్నారు. ఈ తరుణంలో జిల్లాలోని అఫ్జల్పూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఖర్గే పాల్గొన్నారు. ఈసారి మీ ఓటు తప్పితే (కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయకపోతే) నాకు ఇక్కడ స్థానం లేదని, మీ హృదయాన్ని గెలవలేనని అనుకుంటాను' అని ఖర్గే అన్నారు. మీరు మాకు (కాంగ్రెస్కు) ఓటు వేసినా వేయకపోయినా, కలబురగికి నేను మంచి చేశానని మీరు భావిస్తే కనీసం నా అంత్యక్రియలకైనా రండి అని కాంగ్రెస్ చీఫ్ కోరారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఓడించేందుకు తన చివరి శ్వాస వరకు రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. నేను రాజకీయాల కోసమే పుట్టాను. ఎన్నికల్లో పోటీ చేసినా చేయకున్నా.. ఈ దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నా చివరి శ్వాస వరకు కృషి చేస్తాను. రాజకీయాల నుంచి విరమించుకోనని ఖర్గే స్పష్టం చేశారు. -
మోదీ ప్రభుత్వం ఎన్ని హామీలు నెరవేర్చింది.. ఖర్గే ప్రశ్నల వర్షం
ప్రధాని మోదీ గతంలో ఇచ్చిన హామీల్ని ఒక్కటీ నెరవేర్చలేదని, ఈ అంశంపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 19న జరగనున్న తొలిఫేజ్ లోక్సభ ఎన్నికల్లో పుదుచ్చేరి కాంగ్రెస్ అభ్యర్ధి వి.వైతిలింగంకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఖర్గే.. ప్రధాని మోదీ గతంలో ఇచ్చిన హామీలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ.. యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధర పొందడం లేదన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీస్తే ప్రతి వ్యక్తికి రూ.15 లక్షలు అందిస్తామన్న హామీ ఏమైందని అన్నారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు బీజేపీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని ఆరోపించిన ఖర్గే.. ప్రతిపక్ష పార్టీ నేతల్ని వేధించేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజల ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్యానికి రక్షణ కల్పించేందుకు ఈ సారి లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని ఓటర్లను కోరారు. -
బీజేపీ మేనిఫెస్టోపై మల్లికార్జున ఖర్గే విమర్శలు
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ విడుదలచేసిన మేనిఫెస్టోపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. గత పదేళ్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేదల కోస చేసిందేమీ లేదని విమర్శించారు. గత ఎన్నికల సందర్భంగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ఆ హామీని కూడా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. మరోవైపు.. పంటల మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ.. దేశవ్యాప్తంగా రైతులు రోడ్డు ఎక్కి ధర్నా చేశారని విషయాన్ని ఖర్గే గుర్తుచేశారు. ‘యువతకు ఉద్యోగాల కల్పన కోసం ఎదురు చూస్తోంది. మరోవైపు ద్రవ్యోల్బణం పెరుగుతోంది. అయినా ఈ సమస్యలు మాత్రం ప్రధాని మోదీకి పట్టడం లేదు. మోదీ ప్రధానిగా కొనసాగిన ఈపదేళ్ల కాలంలో దేశంలోని ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చే ఒక్క మంచి పని కూడా చేయలేదు. మోదీ దేశ ప్రజలకు ఏం చేయలేదని కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇక.. ఈసారి బీజేపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో నమ్మదగినది కాదు’ అని మల్లికార్జున ఖర్గే విమర్శలు చేశారు. ప్రధాని మోదీ ఇవాళ ‘సంకల్ప పత్ర’ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘‘మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తయ్యే గ్యారెంటీ. 70 ఏళ్లు పైబడిన వారికి ఉచిత వైద్యం అందిస్తాం. పేదల జీవితాలు మార్చడమే మోదీ ఇచ్చే గ్యారెంటీ. ఇచ్చిన ప్రతీ హామీని బీజేపీ నెరవేరుస్తుంది. ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు. ముద్ర పథకం ద్వారా కోట్ల మందికి ఉపాధి దక్కింది. మహిళలను లక్షాధికారులుగా చేయడమే మా లక్ష్యం. వ్యవసాయంలో టెక్నాలజీని పోత్సహిస్తున్నాం’’ అని ప్రధాని మోదీ వివరించారు. -
సైనిక్ స్కూళ్ల ప్రైవేటికరణ: ఖర్గే ఆరోపణలను ఖండించిన కేంద్రం
ఢిల్లీ: దేశంలోని సైనిక్ స్కూల్స్పై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను కేంద్ర రక్షణ శాఖ ఖండించింది. సైనిక స్కూళ్లను ‘ప్రైవేటుపరం’ చేయాలనే కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ఖర్గే చేసిన ఆరోపణలను ఖండించింది. ‘సైనిక స్కూళ్లలోని ఎంపిక విధానంలో రాజకీయ, సిద్ధాంతపరంగా దరఖాస్తు దారులపై ఎటువంటి ప్రభావం చూపించదు. ఈ పథకం లక్ష్యాలు, అమలును రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సైనిక్ స్కూల్స్పై చేస్తున్నవి వక్రీకరించే, తప్పుదారి పట్టించే ఆరోపణలు’ అని రక్షణ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. సైనిక స్కూళ్ల ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇందుకు సంబంధించి చేసుకున్న ఎంఓయులను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతి రాసిన లేఖలో కోరారు. సైనిక్ స్కూల్స్ను కూడా రాజకీయం చేయడానికి ప్రభుత్వం కఠోర ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇక.. ఆర్టీఐ రిపోర్టు ఆధారంగా.. సుమారు 62 శాతం సైనిక్ స్కూల్స్ బీజేపీ, బీజేపీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ నేతలకు చెందినవిగా తెలిపారు. పక్షపాత రాజకీయాలకు దూరంగా సాయుధ బలగాలను వేరుగా ఉంచడం భారత ప్రజాస్వామ్యంలో అనుసరిస్తున్న సంప్రదాయమని, దానిని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని అన్నారు. ఆర్ఎస్ఎస్ వ్యూహంలో భాగంగా సాయుధ బలగాల సహజ స్వభావాన్ని, నైతికతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని అన్నారు. జాతీయ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని సైనిక్ స్కూల్స్ ప్రైవేటీకరణ విధానాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని కోరారు. వాటిపై చేసుకున్న ఎంఓయూలు కూడా చెల్లనివిగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోందని ఖర్గేలో రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. -
PM Narendra Modi: కశ్మీర్ భారత్లో లేదా?
నవడా/జల్పాయ్గురి/జబల్పూర్: కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అచ్చంగా ముస్లిం లీగ్ విధానాలను పోలి ఉందని విమర్శించారు. అది మేనిఫెస్టో కాదు, బుజ్జగింపు పత్రం అని ధ్వజమెత్తారు. ఆదివారం బిహార్లోని నవడా జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. ఆర్టికల్ 370 రద్దు గురించి బీజేపీ నాయకులు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు ప్రస్తావిస్తున్నారన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన భద్రతా సిబ్బంది జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. వారి పారి్థవ దేహాలు త్రివర్ణ పతాకాలతో స్వస్థలాలకు చేరుకున్నాయి. రాజ్యాంగాన్ని జమ్మూకశ్మీర్లో గతంలో ఎందుకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదో ప్రతిపక్ష నేతలు చెప్పాలి. అది దేశంలో అంతర్భాగం కాదా?’’ అని ప్రశ్నించారు. రన్వేపై మా గ్రోత్ ఇంజన్ సిద్ధం దేశాన్ని రెండు విభజించాలన్నదే కాంగ్రెస్ ఆలోచనా విధానమని మోదీ ఆక్షేపించారు. ‘‘ప్రజల విరాళాలతో నిర్మించిన అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ పెద్దలు బహిష్కరించారు. హాజరైన పార్టీ నేతలను బహిష్కరించారు. శ్రీరామనవమి రాబోతోంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేసిన పాపాలను మర్చిపోవద్దు’’ అని ప్రజలకు సూచించారు. తమ పదేళ్ల పాలన ట్రైలర్ మాత్రమేనని, తమ గ్రోత్ ఇంజన్ రన్వేపై సిద్ధంగా ఉందని, ఇక టేకాఫ్ తీసుకుంటుందని అన్నారు. బెంగాల్లోని జల్పాయ్గురిలో ఎన్నికల మెగా ర్యాలీలో, మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో రోడ్ షోలో మోదీ పాల్గొన్నారు. పశి్చమ బెంగాల్లో అవినీతికి, హింసాకాండకు ఉచిత లైసెన్స్ ఇవ్వాలని అధికార టీఎంసీ కోరుకుంటోందని మండిపడ్డారు. -
‘ఖర్గే పొరపాటున మాట్లాడినా.. అది నిజమే!’: జైరాం రమేష్
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంలోని 371వ ఆర్టికల్ను మార్చాలన్న మోదీ-షా గేమ్ ప్లాన్ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అనుకోకుండా బయటపెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. అయితే ఖర్గే 370 ఆర్టికల్ అనాల్సింది.. పొరపాటున ఆర్టికల్ 371 అన్నారని తెలిపారు.అయినప్పటికీ మోదీ- షా అసలు గేమ్ ప్లాన్ బయటపడిందని జైరాం రమేష్ అన్నారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే విరుచుకుపడ్డారు. కానీ నిజం ఏమిటంటే.. నాగాలాండ్కు సంబంధించిన ఆర్టికల్ 371-ఎ, అస్సాంకు చెందిన ఆర్టికల్ 371-బి, మణిపూర్కు సంబంధించిన ఆర్టికల్ 371-సి, సిక్కింకు చెందిన ఆర్టికల్ 371-ఎఫ్, మిజోరామ్కు సంబంధించిన ఆర్టికల్ 371-జిని మోదీ-షా మార్చాలనుకుంటున్నారని ఆరోపణలు చేశారు. అదేవిధంగా ఆర్టికల్ 371-హెచ్ అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించిందని జైరాం రమేష్ అన్నారు. ఆర్టికల్ 371జే పూర్వపు హైరాబాద్-కర్ణాటక ప్రాంతానికి సంబంధించిందని ఆయన గుర్తు చేశారు. Today by a slip of the tongue in his speech in Jaipur, @INCIndia President Mallikarjun Kharge ji mistakenly said that Modi claims credit for abolishing Article 371. Kharge ji clearly meant Article 370. Amit Shah immediately pounced on the Congress President. But the truth is… — Jairam Ramesh (@Jairam_Ramesh) April 6, 2024 అనుకోకుండా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 371పై మోదీ-షా ప్లాన్ను బయటపెట్టడంతో ఆయన వ్యాఖ్యలపై ఒక్కసారిగా అమిత్ షా ఆందోళన పడ్డారని అన్నారు. అందుకే అమిత్ షా.. ఖర్గే మాటలను ఆర్టికల్ 370కి ముడిపెడుతున్నారని జైరాం రమేష్ మండిపడ్డారు. It is shameful to hear that the Congress party is asking, "Kashmir se kya waasta hai?" I would like to remind the Congress party that J&K is an integral part of India, and every state and citizen has the right over J&K, just as the people of J&K have the right over the rest of… pic.twitter.com/cFeO80XBxl — Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) April 6, 2024 మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై హోం మంత్రి అమిత్ షా స్పందించి కౌంటర్ ఇచ్చారు. ‘కాంగ్రెస్ నేతలు చేస్తున్న పొరపాట్లు దశాబ్దాలుగా మన దేశాన్ని వెంటాడుతున్నాయి. ఇటాలియన్ సంస్కృతి కారణంగా ప్రతిపక్ష పార్టీ.. భరత దేశాన్ని సరిగా అర్థం చేసుకోలేదు’ అని అమిత్ షా మండిపడ్డారు. ఖర్గే ఏమన్నారంటే... మల్లికార్జున్ ఖర్గే రాజస్థాన్లోని జైపూర్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించి సభలో మోదీ-షాపై విరుచుకుపడ్డారు. ‘బీజేపీ వాళ్లు రాజస్తాన్ వచ్చి ఆర్టికల్ 371ను రద్దు చేశామని చెబుతున్నారు. ఇక్కడి ప్రజలకు అసలు దానితో సంబంధం ఏమిటీ?. జమ్ము కశ్మీర్కు వెళ్లి అక్కడి ప్రజలకు దానికి గురించి మాట్లాడితే బాగుంటుంది’ అని ఖర్గే అన్నారు. -
మేం తప్పుడు హామీలు ఇవ్వం..బీజేపీపై ఖర్గే కామెంట్స్
జైపూర్ : ప్రధాని నరేంద్ర మోదీలాగా తమ పార్టీ తప్పుడు వాగ్దానాలు ఇవ్వదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ మేనిఫెస్టో అబద్ధాల పుట్టా అంటూ బీజేపీ విమర్శలు చేస్తోంది. ఆ వ్యాఖ్యలపై ఖర్గే పై విధంగా స్పందించారు. జైపూర్లో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ..‘మా పార్టీ అధికారంలోకి వస్తే 25 హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చాం. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం. అంతే తప్పా ప్రధాని మోదీలా అబద్ధాలు చెప్పం’ అని అన్నారు అయితే నేను మిమ్మల్ని (ప్రజల్ని ఉద్దేశిస్తూ.) ఒకేటే అడగాలనుకుంటున్నాను. బీజేపీ ఎన్నో హామీలు ఇచ్చింది. వాటిల్లో ఇప్పటి వరకు ఎన్ని హామీలను నెరవేర్చింది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. అందుకే గత 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి వచ్చింది. మీకు 20 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా లేదా అంటూ వ్యంగంగా మాట్లాడారు. నిరుద్యోగం తగ్గేందుకు బీజేపీ ఏం చేసింది బీజేపీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఏర్పాటైన దేశంలోని పెద్ద పెద్ద సంస్థలు నిర్వీర్యమయ్యాయని, నేడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంపై ప్రజలకు నమ్మకం లేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. దేశంలో నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగం పెరిగిపోతుందని, ఆ నిరుద్యోగాన్ని తగ్గించేందుకు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. "Unlike PM Modi, we don't tell lies...": Congress President Mallikarjun Kharge Read @ANI Story | https://t.co/GBMtRCjHMd#PMModi #MallikarjunaKharge #Congress #BJP #CongressManifesto #LokSabhaElections2024 pic.twitter.com/aYBAzBZ4qw — ANI Digital (@ani_digital) April 6, 2024 -
Nyay Patra-2024: ఐదు న్యాయాలు.. 25 గ్యారంటీలు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందు వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలతో కూడిన ఎన్నికల ప్రణాళిక(మేనిఫెస్టో)ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. యువతకు ఉద్యోగాల కల్పన, నిమ్నవర్గాల సంక్షేమం, సంపద సృష్టి వంటి కీలక హామీలను ప్రకటించింది. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ఆపన్న హస్తం అందిస్తామని వాగ్దానం చేసింది. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, అగ్నిపథ్ పథకం రద్దు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తివేత, దేశవ్యాప్తంగా కుల గణన వంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చింది. శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియా గాందీ, రాహుల్ గాందీ, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ‘న్యాయ్ పత్ర–2024’ పేరిట 45 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా వివిధ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఐదు న్యాయాలను ప్రకటించారు. ఒక్కో న్యాయం కింద ఐదు గ్యారంటీల చొప్పున మొత్తం 25 గ్యారంటీలు ఇచ్చారు. ఐదు న్యాయాలు ఏమిటంటే.. నారీ న్యాయ్ ► మహాలక్ష్మీ పథకం కింద దేశవ్యాప్తంగా పేద కుటుంబాల్లోని మహిళకు ఏడాదికి రూ.లక్ష నగదు బదిలీ ► కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ► ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు రెట్టింపు వేతనం ► మహిళ హక్కుల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘మైత్రి’ అధికారి నియామకం ► మహిళా ఉద్యోగుల కోసం సావిత్రిబాయి పూలే పేరుతో వసతి గృహాలు కిసాన్ న్యాయ్ ► స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస గిట్టుబాటు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత ► రుణమాఫీ కమిషన్ ఏర్పాటు ► పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు ► రైతులు లబ్ధి పొందేలా ఎగుమతి, దిగుమతి విధానం ► వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు యువ న్యాయ్ ► కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో 30 లక్షల ఉద్యోగాల భర్తీ ► యువత కోసం ‘అప్రెంటీస్íÙప్ హక్కు చట్టం’. డిప్లొమా చదివినవారికి లేదా 25 ఏళ్లలోపు ఉన్న గ్రాడ్యుయేట్కు ఏడాదిపాటు అప్రెంటీస్íÙప్ చేసే అవకాశం. వారికి సంవత్సరానికి రూ.లక్ష సాయం. ► ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కఠిన చట్టం ► గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు ► స్టార్టప్ కంపెనీలు ప్రారంభించే యువత కోసం రూ.5,000 కోట్ల నిధి శ్రామిక్ న్యాయ్ ► కార్మికుల కోసం ఆరోగ్య హక్కు చట్టం ► కనీస వేతనం రోజుకు రూ.400. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సైతం వర్తింపు ► పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకం అమలు ► అసంఘటిత రంగాల్లోని కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా వర్తింపు ► ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు రద్దు హిస్సేదారీ న్యాయ్ ► అధికారంలోకి రాగానే సామాజిక, ఆర్థిక కుల గణన ► ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల విషయంలో 50 శాతం సీలింగ్(పరిమితి) తొలగింపు ► ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ అమలుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు ► జల్, జంగల్, జమీన్పై చట్టబద్ధమైన హక్కులు ► గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాలకు షెడ్యూల్డ్ ఏరియాలుగా గుర్తింపు న్యాయ్ పత్రలోని కీలక హామీలు ► సీనియర్ సిటిజన్లు, వితంతువులకు నెలకు రూ.1,000 చొప్పున పెన్షన్ ► రైల్వే ప్రయాణాల్లో వృద్ధులకు రాయితీ ► ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ ఆలోచనకు చెల్లుచీటి.. ► పదో షెడ్యూల్ సవరణ. పార్టీ ఫిరాయించిన నేతల లోక్సభ, అసెంబ్లీ సభ్యత్వాలు రద్దు ► సైన్యంలో నియామకాలకు ఉద్దేశించిన అగ్నిపథ్ పథకం రద్దు ► అన్ని కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యూఎస్) విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం కోటా అమలు. ► జమ్మూకశ్మీర్కు, పుదుచ్చేరికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ► ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థి: రాహుల్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార ఎన్డీయేకు పరాభవం తప్పదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. 2004లో ‘భారత్ వెలిగిపోతోంది’ అంటూ ఎన్నికలకు వెళ్లిన ఎన్డీయే బోల్తా పడిందని, ఈసారి కూడా అదే పునరావృతం కాబోతోందని జోస్యం చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి విజయం ఖాయమని అన్నారు. ఎన్నికల్లో నెగ్గిన తర్వాత తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ఉమ్మడిగా నిర్ణయిస్తామని తెలిపారు. తమ పార్టీ మేనిఫెస్టోను ప్రజలే రూపొందించారని, ఇందులో అక్షరాలను మాత్రమే తాము ముద్రించామని వివరించారు. 99 శాతం మంది ప్రజలు కోరుకున్న అంశాలు మేనిఫెస్టోలో ఉన్నాయని తెలిపారు. అదానీ లాంటి కేవలం ఒకటి, రెండు శాతం మంది బడాబాబులు కోరుకున్న అంశాలు బీజేపీ మేనిఫెస్టోలో ఉంటాయని ఎద్దేవా చేశారు. -
‘పాంచ్ న్యాయ్-పచ్చీస్ గ్యారంటీస్’ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
Live Updates.. ► ‘పాంచ్ న్యాయ్-పచ్చీస్ గ్యారంటీస్’ పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైంది. 48 పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ►మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో 25 గ్యారంటీలు. ► పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని. రైల్వేల ప్రైవేటీకరణను నిలిపివేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ►అలాగే, బీజేపీ ప్రభుత్వం తెచ్చిన అగ్నివీర్ను రద్దు చేస్తామన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ మీద విచారణ. పెగాసెస్,రాఫెల్పై విచారణ. ►అనంతరం, మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. కిసాన్ న్యాయ్ పేరుతో రైతులను ఆదుకుంటాం. దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేస్తాం. విద్యార్థులకు ఏడాదికి రూ.లక్ష అందిస్తాము. పేద మహిలకు ఏడాదికి రూ.లక్ష ఇస్తాము. కనీస మద్దతు ధర చట్టం తీసుకోస్తామని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఐదు గ్యారంటీలు 1. యువతకు జాబ్ గ్యారంటీ, ఏడాదికి లక్ష జీతం 2. ప్రతీ మహిళకు ఏడాదికి లక్ష రూపాయల సాయం 3. కులగణన 4. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దినసరి వేతనం నాలుగు వందలకు పెంపు 5. స్వామి నాథన్ సిఫారసుల మేరకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత. మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు హిస్సేదారి న్యాయ్: 1. సామాజిక, ఆర్థిక కుల గణన 2. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల కల్పనపై 50% సీలింగ్ తొలగింపు 3. ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ కోసం స్పెషల్ బడ్జెట్ 4. జల్ జంగల్ జమీన్పై చట్టబద్ధహక్కులు 5. గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాలో గుర్తింపు కిసాన్ న్యాయ్ : 1. స్వామినాథన్ ఫార్ములా ప్రకారం పంటలకు గిట్టుబాటు ధర చట్టబద్ధత 2. రుణమాఫీ కమిషన్ ఏర్పాటు 3. పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు గ్యారెంటీ 4. రైతులు లబ్ధి పొందేలా ఎగుమతి దిగుమతి విధానం 5. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు శ్రామిక్ న్యాయ్ : 1. రైట్ టు హెల్త్ చట్టం 2. రోజుకు 400 రూపాయల కనీస వేతనం- ఉపాధి హామీ పథకంలో సైతం 3. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు 4. అసంఘటిత రంగ కార్మికులకు జీవిత బీమా, యాక్సిడెంట్ బీమా 5. ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు నిలుపుదల యువ న్యాయ్: 1. కేంద్రాన్ని ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాల భర్తీ 2. యువతకు ఏడాది అప్రెంటిస్ట్ షిప్ - ఏడాదికి లక్ష రూపాయలు నెలకు రూ.8500 చెల్లింపు 3. పేపర్ లీక్ అరికట్టేందుకు కఠినమైన చట్టం 4. గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు 5. యువత స్టార్టప్ కోసం ఐదు వేల కోట్ల నిధి కేటాయింపు నారీ న్యాయ్: 1. ప్రతీ పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు 2. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు 3. ఆశ, అంగన్వాడీ మిడ్ డే మీల్ వర్కర్స్కు డబుల్ శాలరీ కాంట్రిబ్యూషన్ 4. మహిళల హక్కుల రక్షణ కోసం అధికారి మైత్రి ఏర్పాటు 5. వర్కింగ్ విమెన్ కోసం సావిత్రిబాయి పూలే పేరుతో రెట్టింపు హాస్టల్స్ ►కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చిదంబరం, ఇతర కాంగ్రెస్ నేతలు మేనిఫెస్టును విడుదల చేశారు. ►ఇక, శనివారం రాజస్థాన్లోని జైపూర్, తెలంగాణలోని హైదరాబాద్ నగరాల్లో మెగా ర్యాలీలు నిర్వహించనున్నారు. జైపూర్లో జరిగే మెగా ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ మేనిఫెస్టోను ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. ఇక హైదరాబాద్లో జరిగే మెగా ర్యాలీలో రాహుల్ గాంధీ మేనిఫెస్టోను లాంచ్ చేసి ప్రసంగించనున్నారు. #WATCH | Congress Party releases its manifesto for the 2024 Lok Sabha elections, at AICC headquarters in Delhi. #LokSabhaElections2024 pic.twitter.com/lNZETTLDLY — ANI (@ANI) April 5, 2024 -
Lok Sabha Elections 2024: అబద్ధాల సర్దార్ మోదీ: ఖర్గే
జైపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముమ్మాటికీ అబద్ధాల సర్దార్ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మన దేశ భూభాగంలోకి చైనా ప్రవేశిస్తుంటే మోదీ నిద్రపోతున్నారని ధ్వజమెత్తారు. గురువారం రాజస్తాన్లోని చిత్తోర్గఢ్లో ఎన్నికల ప్రచార ర్యాలీలో ఖర్గే మాట్లాడారు. దేశ క్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోని ప్రధానమంత్రి.. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని దూషించడంలో తీరిక లేకుండా ఉంటున్నారని ధ్వజమెత్తారు. 56 అంగుళాల ఛాతీ అని చెప్పుకుంటున్న మోదీ మన దేశ భూభాగాన్ని చైనాకు అప్పగించారని ఖర్గే ఆరోపించారు. మోదీ గ్యారంటీల డ్రామా సార్వత్రిక ఎన్నికల దాకా కొనసాగుతుందని చెప్పారు. ఆ తర్వాత ఏమీ ఉండదన్నారు. ఓటమి భయంతోనే విపక్షాలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. -
భారత్లోకి చైనా చొచ్చుకొస్తుంటే.. మోదీ నిద్రపోతున్నారు: ఖర్గే
న్యూఢిల్లీ: భారత సరిహద్దు విషయంలో చైనాతో వివాదం కొనసాగుతున్న వేళ ఏఐసీసీ చైర్మన్ మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారత భూభాగంలోకి డ్రాగన్ దేశం(చైనా) చొచ్చుకువస్తుంటే ప్రధాని మోదీ నిద్రపోతున్నారని విమర్శించారు. అయితే వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న అరుణాచల్ ప్రదేశ్లోని 30 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టిన విషయం తెలిసిందే. అక్కడి ప్రాంతాలకు డ్రాగన్ ఇలా పేర్లు పెట్టడం ఇది నాలుగోసారి. ఈ క్రమంలోనే మోదీపై ఖర్గే విమర్శలు గుప్పించారు. రాజస్థాన్లోని చిత్తోర్గఢ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్లాగొన్న ఖర్గే.. మోదీని అబద్దాల సర్దార్గా విమర్శించారు. ప్రధాని దృష్టి అంతా సంక్షేమంపై కాకుండా గాంధీ కుటుంభాన్ని దూషించడంపేనే ఉందని దుయ్యబట్టారు. మోదీ దేశం కోసం ఆలోచించడం పక్కకు పెట్టి గాంధీ కుటుంబంపై దుర్భాషలాడటం పనిగా పెట్టుకున్నాడని మండిపడ్డారు. 'నాకు 56 అంగుళాల ఛాతీ ఉంది, నేను భయపడను' అని మోదీ అంటున్నారు. మీకు భయం లేకుంటే మన ప్రాంతంలోని భూభాగాన్నంతా చైనాకు ఎందుకు విడిచిపెట్టారు? వారు భారత్లోకి చొచ్చుకువస్తున్నారు. మీరేమో నిద్రపోతున్నారు. నిద్రమాత్రలు వేసుకున్నారా? దేశ ప్రజలను చిత్రహింసలకు గురిచేసి తన వెంట తీసుకెళ్లాలని అనుకొంటున్నారన్నారు. 1989 నుంచి గాంధీ కుటుంబంల ఎవరూ ప్రధానమంత్రి, మంత్రి పదవిని చేపట్టలేదని, అయినప్పటికీ ప్రధానమంత్రి వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. గాంధీ కుటుంబ సభ్యులు ఈ దేశం కోసం తమ ప్రాణాలనే త్యాగం చేశారన్నారు. ప్రధాని మోదీ విదేశాల్లో పర్యటిస్తారు. ఎన్నికల సమయంలో దేశమంతా తిరుగుతారు గానీ, అల్లర్లతో అట్టుడికిన మణిపుర్కు మాత్రం ఇంతవరకు వెళ్లలేదు’ అని మండిపడ్డారు. కాగా అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని చాలా ఏళ్లుగా చైనా వాదిస్తున్న సంగతి తెలిసిందే. చైనా తీరును గతంలోనే భారత్ పలుమార్లు ఖండించింది. అయినప్పటికీ అరుణాచల్ ప్రదేశ్కు చైనీస్ పేరు, ఈ ప్రాంతం దక్షిణ టిబెట్లో భాగమని బీజింగ్ తెలిపింది. వీటిల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం, కొంత భూభాగం ఉంది. అయితే పేర్లు మార్చినంత మాత్రాన ఆ ప్రాంతాలు భారత్లో భాగం కాకుండా పోవని, నిజాన్ని మార్చలేరని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ తమ దేశ అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. -
ఒక శకం ముగిసింది.. మన్మోహన్పై ఖర్గే ప్రశంసలు
సాక్షి, ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేడు రాజ్యసభ సభ్యుడిగా రిటైర్ కానున్నారు. రాజ్యసభలో తన 33 ఏళ్ల పార్లమెంటరీ ఇన్నింగ్స్ను మన్మోహన్ సింగ్ ముగించారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్పై అన్ని పార్టీలు ప్రశంసలు కురిపించాయి. ఇక, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. మన్మోహన్ సింగ్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సేవలను కొనియాడుతూ ఖర్గే లేఖ రాశారు. ఈ లేఖలో ఒక శకం ముగిసిందని వ్యాఖ్యానించారు. భారత రాజకీయాలకు, దేశానికి మన్మోహన్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ ఎల్లప్పుడూ మధ్యతరగతి, ఆకాంక్ష యువతకు హీరో, పారిశ్రామికవేత్తలకు నాయకుడు మార్గదర్శకుడు అని కొనియాడారు. మన్మోహన్ ఆర్థిక విధానాల వల్ల పేదరికం నుండి బయటపడగలిగిన పేదలందరికీ శ్రేయోభిలాషి అని చెప్పుకొచ్చారు. ఉపాధి హామీ పథకంతో మన్మోహన్ సింగ్ గ్రామీణులకు కష్ట సమయాల్లో ఆదాయం, తలెత్తుకు బతికే అవకాశం కల్పించారని అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో కలిసి మన్మోహన్ సింగ్ వేసిన ఆర్థిక పునాదుల ఫలాలు నేటి సమాజానికి అందుతున్నాయని తెలిపారు. కానీ, నేటి రాజకీయ నాయకులు ఆయన పాత్రను గుర్తించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా క్షమించగలిగే పెద్ద మనసు ఆయన సొంతమని ప్రశంసించారు. మన్మోహన్ రాజకీయ ప్రస్థానం.. ఆర్థిక రంగంలో ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలకు నాంది పలికిన మన్మోహన్ సింగ్ 1991 అక్టోబర్లో తొలిసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన సింగ్ 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా ఉన్నారు. 1991 అక్టోబర్ 1 నుంచి 2019 జూన్ 14 వరకూ అస్సాం నుంచి ఐదు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆ తరువాత 2019 ఆగస్టు 20న రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైయ్యారు. ఏప్రిల్ 3న బుధవారం 91 ఏళ్ల మన్మోహన్ సింగ్ పదవీ కాలం పూర్తి కావస్తుండటంతో ఆ స్థానంలో తొలిసారి రాజస్థాన్ నుంచి సోనియాగాంధీ రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. -
ఆ రెండు పార్టీలు విషం లాంటివి: ఖర్గే కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: దేశంలో లోక్సభ ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగిన ఇండియా కూటమి బహిరంగసభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో బీజేపీ నియంత పాలన సాగిస్తోంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండూ విషం లాంటివి. ఆ విషాన్ని రుచి చూస్తే.. ప్రాణాలు కోల్పోవడం ఖాయమని అన్నారు. బీజేపీ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయకూడదనే ఉద్దేశ్యంతో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. మీకు ప్రజాస్వామ్య పాలన కావాలా? నియంతృత్వ పాలన కావాలా.. మీరే తేల్చుకోవాలి. నియంతృత్వానికి మద్దతిచ్చే బీజేపీ పార్టీని దేశం నుంచి తరిమి కొట్టాలి అని ఖర్గే అన్నారు. సభలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం కోరుకునే వారు చేతులెత్తండి.. అనగానే అంతా చేతులెత్తారు. #WATCH | Delhi: Addressing the INDIA alliance rally at Ramlila Maidan, Congress President Mallikarjun Kharge says, "You have to decide if you want democracy or dictatorship... Those who support dictatorship need to be kicked out of the country... BJP and RSS are like poison. You… pic.twitter.com/wdisE7HQpU — ANI (@ANI) March 31, 2024 -
మోదీ చేసింది సరైన పనేనా?: సునీతా కేజ్రీవాల్
Live Updates.. ప్రతిపక్ష కూటమి మెగా ర్యాలీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కామెంట్లు... ప్రజాస్వామ్యం కావాలో,నియంతృత్వవం కావాలో మీరే(ప్రజలు) నిర్ణయించుకోవాలి నియంతృత్వానికి మద్దతు ఇచ్చేవారిని దేశం నుంచి తరిమిగొట్టాలి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విషం లాంటివి వాటి విషం రుచి చూసినా మరణిస్తాం ప్రతిపక్ష కూటమి మెగా ర్యాలీ: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ కామెంట్లు బీజేపీ భ్రమల్లో ముగినిపోయింది. వారికి నేను వెయ్యేళ్లనాటి కథ, నీతిని తెలియజేస్తున్నా. రాముడు సత్యం కోసం యుద్ధం చేశారు. రాముడికి అధికారం, వనరులు లేవు. రాముడికి కానీసం రథం కూడా లేదు. రావణాసురుడికి రథం, వనరులు, యుద్ధ సైన్యం ఉంది. రాముడి వద్ద సత్యం, నమ్మకం, విశ్వాసం, ఓర్పు, తెగువ ఉందని గుర్తు చేశారు. ఇండియా కూటమి ఐదు డిమాండ్లు చేస్తోంది #WATCH | Delhi: At the Maha Rally at the Ramlila Maidan, Congress General Secretary Priyanka Gandhi Vadra says, "I think that they (BJP) are trapped in illusion. I want to remind them of a thousand-year-old tale and its message. When Lord Ram was fighting for the truth, He did… pic.twitter.com/43vpN9Y107 — ANI (@ANI) March 31, 2024 ఐదు డిమాండ్లు ఇవే... ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల్లో అందరినీ సమానంగా చూడాలి బలవంతంగా ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ , ఐటీ అరెస్ట్లు, దాడులు ఆపేయాలి వెంటనే సీఎం అరవింద్ కేజ్రీవాల్, హెమంత్ సోరెన్ను విడిచిపట్టాలి0 ప్రతిపక్షాల ఆర్థిం వనరులను దెబ్బతీయటం ఆపేయాలి బీజేపీ పొందిన ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సిట్ ఏర్పాటు చేసి వెంటనే దర్యాప్తు జరపాలి #WATCH | Delhi: At the Maha Rally at the Ramlila Maidan, Congress General Secretary Priyanka Gandhi Vadra says, "INDIA Alliance has 5 demands. The Election Commission should ensure equal opportunity in the Lok Sabha elections. Second, the ECI should stop the forceful action… pic.twitter.com/pSUBSFwhvm — ANI (@ANI) March 31, 2024 ప్రతిపక్ష కూటమి మెగా ర్యాలీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కామెంట్లు బీజేపీ 400 సీట్లు గెలుపు నినాదం సెటైర్లు ఈవీఎంలు లేకుండా, మ్యాచ్ ఫిక్సింగ్, సోషల్ మీడియా, మీడియాపకై ఒత్తిడి పెంచకుండా బీజేపీ కనీసం 180 సీట్లు కూడా గెలవలేదు. ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కామెంట్లు ఈడీ, సీబీఐ అండ్ ఐటీ బీజేపీకి చెందిన విభాగాలు. లాలూ ప్రసాద్ యావద్ను చాలా సార్లు వేధించాయి. మాపై వ్యతిరేకంగా కేసులు పెట్టారు. మా కుటుంబంలోని అందరిపై కేసులు మోపారు ఆర్జేడీ నేతలపై తరచూ సోదాలు జరుగుతున్నాయి ఈడీ, ఐడీ సోదాలు జరుగుతునే ఉన్నాయి. మేము ఎప్పడూ భయపడలేదు.. పోరాడుతూనే ఉన్నాం. టీఎంసీ ఇండయా కూటమిలో భాగమే.. ‘టీఎంసీ ఇండియా కూటమిలో భాగమే. ప్రజాస్వామ్యాకి బీజేపీకి మధ్య యుద్ధం జరుగుతోంది’టీఎంసీ నేత డెరెక్ ఒబ్రెయిన్ అన్నారు. #WATCH | INDIA alliance rally: TMC MP Derek O'Brien says, "...All India Trinamool Congress (TMC) is very much was, is and will be part of the INDIA alliance. This is a fight of BJP versus democracy..." pic.twitter.com/5q2YuoHRCO — ANI (@ANI) March 31, 2024 ఇండియా కూటమికి ఆప్ తరఫున మద్దతు తెలుపుతున్నా: సునీతా కేజ్రీవాల్ ఇండియా కూటమి కాదు.. ఇండియా అనేది మనందరి హృదయం అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను చదివి వినిపించారు. ఆరు గ్యారంటీలు.. దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు ఉండవు. దేశవ్యాప్తంగా పేదలకు విద్యుత్ ఉచితం. ప్రతి గ్రామంలో పిల్లలు నాణ్యమైన విద్యను పొందే మంచి పాఠశాల ఏర్పాటు గ్రామంలో మొహల్లా క్లినిక్, ప్రతి జిల్లాకు ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు స్వామినాథన్ నివేదిక ప్రకారం రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వటం. ఢిల్లీ ప్రజలు చాలా ఏళ్లుగా అన్యాయానికి గురవుతున్నారు. మేము అంతం చేస్తాము. ఢిల్లీ ప్రజలకు రాష్ట్ర హోదా పొందుతారు. ఐదేళ్లలో ఈ గ్యారంటీలు అమలుచేస్తాం #WATCH | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and Delhi CM Arvind Kejriwal's wife Sunita Kejriwal at the INDIA alliance rally in Ramlila Maidan, Delhi. pic.twitter.com/ah1WM7RhsH — ANI (@ANI) March 31, 2024 ప్రధాని మోదీ కేజ్రీవాల్ను జైలులో పెట్టారు: సునీతా కేజ్రీవాల్ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి మెగా ర్యాలీ లోక్తత్ర బచావో (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి) ర్యాలీ ర్యాలీ పాల్గొన్న సీఎం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సీఎం కేజ్రీవాల్ పంపిన లేఖలను చదివి వినిపించిన సునీతా కేజ్రీవాల్ ప్రధాని మోదీ కేజ్రీవాల్ను జైలులో పెట్టారు మోదీ చేసింది సరైన పనేనా? సీఎం కేజ్రీవాల్ నిజాయితిపరుడని మీరు నమ్మటం లేదా? కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలా? మీ కేజ్రీవాల్ సింహం లాంటి వ్యక్తి కోట్ల మంది హృదయాల్లో కేజ్రీవాల్ ఉన్నారు #WATCH | INDIA alliance rally: Delhi CM Arvind Kejriwal's wife Sunita Kejriwal says, "Your own Kejriwal has sent a message for you from jail. Before reading this message, I would like to ask you something. Our Prime Minister Narendra Modi put my husband in jail, did the Prime… pic.twitter.com/aZsdXXvJOO — ANI (@ANI) March 31, 2024 రాంలీలా మైదానంలో ఇండియా కూటమి మెగా ర్యాలీ పాల్గొన్న సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ పంపిన లేఖ చదివి వినిపించిన సునీతా కేజ్రీవాల్ దేశం బాధలో ఉందని కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు. ‘ఇండియా కూటమి’మహా ర్యాలీ.. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కామెంట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని రాజకీయ పార్టీలకు కనీస గౌరవం ఇవ్వడాన్ని పూర్తిగా నిరాకరిస్తోంది ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల విషయంలో మరీ దారుణం ఇలాంటి తరుణంలో లోక్సభ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయని ఎలా నమ్ముతాం? దేశంలో ఎన్నికలను బీజేపీ హైజాక్ చేయాలనుకుంటోంది ప్రతిపక్షపార్టీలు, నేతలను బీజేపీ టార్గెట్ చేస్తోంది అందుకే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి మెగా ర్యాలీని నిర్వహిస్తోంది #WATCH | On the INDIA bloc's rally at Ramlila Maidan, Congress MP KC Venugopal says, "Now the Government of India under the leadership of PM Modi is completely refusing to provide a level playing field to political parties, especially the opposition parties. How can you ensure… pic.twitter.com/cw5ZUZoBsl — ANI (@ANI) March 31, 2024 ‘ఇండియా కూటమి’ మెగా ర్యాలీలో పాల్గొనేందుకు అరవింద్ కేజీవాల్ సతీమణి సునితా కేజ్రీవాల్ రాంలీలా మైదానానికి బయల్దేరారు. #WATCH | Delhi: Punjab CM Bhagwant Mann along with Delhi CM and AAP national convener Arvind Kejriwal's wife Sunita Kejriwal leave for Ramlila Maidan to attend the INDIA alliance rally pic.twitter.com/uCYhUes7MN — ANI (@ANI) March 31, 2024 రాజ్యాంగం దాడికి గురవుతోందని కాంగెస్ నేత సుప్రియా శ్రీనతే అన్నారు. రాంలీలా మైదనంలోని మెగా ర్యాలీ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ రాజ్యాంగం దాడికి గురవుతోంది. దేశం మొత్తం రాజ్యాంగ రక్షణకు కలిసికట్టుగా ముందుకువెళ్తోంది. ఇదే విషయాన్ని విషయాన్ని తెలియజేయటానికి ర్యాలీకి హాజరవుతున్నా’ అని అన్నారు. #WATCH | Delhi: On the INDIA bloc's rally at Ramlila Maidan, Congress leader Supriya Shrinate says, "The democracy is being attacked. The whole country is standing in the favour of democracy. And we have come here to give the same message..." pic.twitter.com/WfgEQ8uRtK — ANI (@ANI) March 31, 2024 నియంత, మతతత్వ బీజేపీ పార్టీ విధానాలను ఎండకట్టేందుకు, అరవింద్ కేజ్రీవాల్, హెమంత్ సోరెన్ అరెస్ట్కు వ్యతిరేకంగా రాంలీలా మైదానంలో మహా ర్యాలీలో ప్రజలు. నేతలు పాల్గొంటున్నారని సీఐఎం(ఎం) నేత బృందా కారత్ అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ఉపా చట్టాన్ని ఈడీ, సీబీ దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం సమర్థమంతమైనది కాదనడానికి ఇదే నిదర్శనం అన్నారు. #WATCH | Delhi: On the INDIA bloc's rally at Ramlila Maidan today, CPI-M leader Brinda Karat says, "The message is that people from all over the country have gathered against this dictator and communal government. This Maha rally in Delhi is against Arvind Kejriwal and Hemant… pic.twitter.com/ZmSSr2FjLQ — ANI (@ANI) March 31, 2024 ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’ చేపట్టిన మెగా ర్యాలీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రవాల్ మాట్లాడనున్నారు. రాంలీలా మైదానానికి కూటమి నేతలు చేరుకుంటున్నారు. భారీ సంఖ్యలో ఢిల్లీ ప్రజలు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు చేరుకున్నారు. ఢిల్లీ ప్రజల కోసమే కేజ్రీవాల్ ఆందోళన.. రాంలీలా మైదనం వద్దకు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారని ఢిల్లీ మంత్రి ఆతిశీ అన్నారు. ఆమె మీడియా మాట్లాడారు. ‘ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల జీవితాలను మార్చారని వారికి తెలుసు. ఆయన అరెస్ట్ అయ్యాక కూడా ఢిల్లీ ప్రజల కోసం ఆందోళన పడుతున్నారు’అని మంత్రి అతిశీ అన్నారు. #WATCH | Delhi: On the INDIA bloc's rally at Ramlila Maidan today, AAP Minister Atishi says, "It is 10 am and people have already gathered in huge numbers. People from all over the country have come against the arrest of Arvind Kejriwal. The people of Delhi are aware that Arvind… pic.twitter.com/6XF8mN5WnU — ANI (@ANI) March 31, 2024 ఇండియా కూటమి మెగా ర్యాలీ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా రాంలీలా మైదానంలో మహా ధర్నా కేజీవాల్ జైల్లో ఉన్న ఫొటోలు ఏర్పాటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సహా 13 పార్టీల నేతల హాజరు ఎండ వేడిమి తట్టుకోవడానికి ఏర్పాట్లు మెగా ర్యాలీ వద్ద భారీ భద్రత ఏర్పాటు ప్రశ్నిస్తే జైల్లో వేస్తున్నారు నకిలీ దర్యాప్తు పేరుతో, మన్నల్ని, మా పార్టీని గత రెండేళ్లుగా కేంద్రంలోని బీజేపీ టార్గెట్ చేసిందని ఆప్ జాతీయ అధికప్రతినిధి ప్రియాంకా కక్కర్ అన్నారు. రామ్లీలా మైదానంలో విపక్షాల ఇండియా కూటమి ర్యాలీ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఎటువంటి అధారాలు లేకుండా కొందరి నకిలీ ప్రకటనలతో సిట్టింగ్ సీఎంను అరెస్ట్ చేశారు. ఇది మా పార్టీ గొంతు నొక్కాలనే కుట్రలో భాగం. ఎవరైలే బీజేపీ ప్రశ్నిస్తారే వాళ్లను జైల్లో తోయటమే వారి పని’అని ప్రియాంకా మండిపడ్డారు. #WATCH | Delhi: On INDIA alliance rally at Ramlila Maidan, AAP leader AAP national spokesperson Priyanka Kakkar says, " It can be clearly seen how we are being targeted in the for last 2 years in the name of a fake investigation. Without any proof, just based on a few statements,… pic.twitter.com/7Ne4Kfuxcg — ANI (@ANI) March 31, 2024 ►ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఢిల్లీలో భారీ ర్యాలీ తలపెట్టింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ , కాంగ్రెస్కు ఐటీ నోటీసులపై బీజేపీతో యుద్దానికి ఇండియా కూటమి రెడీ అయ్యింది. ఇందులో భాగంగానే ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నేతలు మెగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ►రామ్లీల మైదానంలో కళ్లకు గంతులు కట్టుకుని కాంగ్రెస్ నేతల నిరసన #WATCH | Delhi: Congress workers organised a blindfold protest at the Ramlila Maidan. pic.twitter.com/5p0C5mwpRn — ANI (@ANI) March 31, 2024 ►ఇండియా కూటమి ర్యాలీకి బయలుదేరిన జార్ఖండ్ సీఎం చంపై సోరెన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియంతృత్వానికి స్వస్థి పలికి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని అన్నారు. #WATCH | Ranchi: Before leaving for Delhi to attend the INDIA Alliance Maha Rally at the Ramlila Maidan today, Jharkhand CM Champai Soren says, "We have to abolish the dictatorship and save the democracy..." pic.twitter.com/kOHI9A0EiV — ANI (@ANI) March 31, 2024 ►ఈ ర్యాలీకి కూటమిలోని 29 పార్టీలూ ర్యాలీలో పాల్గొనబోతున్నాయి. ముఖ్యంగా కేజ్రీవాల్ అరెస్ట్ , కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేయడంపై ఇండియా కూటమి భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. పన్ను ఎగవేత కేసులో రూ.1800 కోట్లు చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. #WATCH | Delhi: INDIA alliance to hold rally against the arrest of Delhi CM and AAP convener Arvind Kejriwal, at Ramlila Maidan from 10 am today (Visuals from the Ramlila Maidan) pic.twitter.com/cahR183k7g — ANI (@ANI) March 31, 2024 కీలక నేతలు హాజరు.. ►ఢిల్లీలో జరిగే ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోసియా గాంధీ, రాహుల్గాంధీ సహా కీలకనేతల పాల్గొనబోతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు అడ్డంగా దుర్వినియోగం చేస్తోందని మండిపడుతున్నాయి విపక్షాలు. ఇవాళ్టి ర్యాలీలో ఇదే అంశాన్ని ప్రధానంగా జనంలోకి తీసుకెళ్లనున్నారు నేతలు. ఇవాళ్టి కార్యక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ మద్యం కుంభకోణం కేసులో జైలుపాలైన నేపథ్యంలో ర్యాలీకి భారీ జనసమీకరణ చేసి సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది. డెరిక్ ఒబ్రియాన్ (టీఎంసీ), తిరుచ్చి శివ (డీఎంకే), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), శరద్ పవార్ (ఎన్సీపీ–ఎస్సీపీ), తేజస్వీ యాద వ్ (ఆర్జేడీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితరులు పాల్గొంటారన్నారు. సునీత కేజ్రీవాల్కు కల్పన సొరేన్ సంఘీభావం ►ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్కు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ సతీమణి కల్పన సొరేన్ శనివారం సంఘీభావం తెలిపారు. కేజ్రీవాల్ నివాసంలో వీరి భే టీ జరిగింది.శక్తిమంతులైన మహిళలు కలవడంతో బీజేపీ భయపడి ఉం టుందని.. వీరిద్దరి సమావేశంపై ఢిల్లీ మంత్రి ఆతీశి ట్వీట్ చేశా రు. కల్పన విలేకర్లతో మాట్లాడుతూ, సునీత కేజ్రీవాల్కు యావత్తు జార్ఖం డ్ ప్రజలు అండగా ఉంటారని, తాము ఒకరి ఆవేదనను మరొకరం పంచుకున్నామని చెప్పారు.తాము కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించామన్నారు. -
నేడు కాంగ్రెస్ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో మిగిలిన 8 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం బుధవారం అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది. ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) మరోమారు భేటీ కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ మాజీ చీఫ్లు సోనియాగాంధీ, రాహుల్తో పాటు కమిటీ సభ్యులు కేసీ వేణుగోపాల్, అంబికాసోనీ, ఉత్తమ్కుమార్రెడ్డి, అలాగే సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు పాల్గొననున్నారు. 8 స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర, జిల్లా నేతలు, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల అభి ప్రాయాలను ఏఐసీసీ స్వీకరించింది. వారిచ్చిన సూచనలు, సలహాల మేరకు ఆశావహుల అభ్యర్థి త్వాలను పరిశీలించి తుది జాబితాను సీఈసీకి పంపింది. ప్రజల్లో బలం, కుల సమీకరణలు, పార్టీకి చేసిన సేవల ఆధారంగా అభ్యర్థుల పేర్లను నేతలు సిఫారసు చేశారు. కాగా సీఈసీ వివిధ సర్వేల నివేదికలు, పార్టీ విధేయత ఆధారంగా అభ్యర్థులపై ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కరీంనగర్ తెరపైకి తీన్మార్ మల్లన్న ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి తొలి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎ.ప్రవీణ్రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నప్ప టికీ, అక్కడే బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్కుమార్ పోటీలో ఉన్న నేపథ్యంలో అక్కడ మరో అభ్యర్థిని పరిశీలించాలని ఏఐసీసీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న పేరును తెరపైకి తెచ్చి నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ, ఇతర రాష్ట్ర నేతలను కలిసిన మల్లన్న కరీంనగర్ నుంచి పోటీకి సానుకూలత వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయన పేరును సీఈసీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. నిజామాబాద్ నుంచి సునీల్రెడ్డి, దిల్రాజు తదితరుల పేర్లు పరిశీలించినా, చివరి కి టి.జీవన్రెడ్డి వైపే నేతల మొగ్గు ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్ నుంచి బీసీ వర్గానికి చెందిన నీలం మధుకే ఎక్కువ అవకాశాలున్నాయని, ఆయనకు సీఎం వర్గం బలమైన మద్దతు ఇస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇక భువనగిరి స్థానానికి అభ్యర్థుల ఎంపిక విషయంలో మాత్రం కొంత సందిగ్ధత కనిపిస్తోంది. ఇక్కడి నుంచి సీనియర్ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డిలు కొన్ని పేర్లను ప్రతిపాదిస్తుంటే, ముఖ్యమంత్రి మాత్రం చామల కిరణ్ కుమార్రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఆయనకే టిక్కెట్ దక్కేలా రేవంత్ ఇప్పటికే ఏఐసీసీ కీలక నేతలను ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇక ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ స్థానాల్లో ఒకరిద్దరు పేర్లను పరిగణనలోకి తీసుకుని విజయావకాశాల ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. గురువారం జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. రేవంత్తో మహేశ్గౌడ్ భేటీ గాంధీభవన్ వేదికగా ఈనెల 29న సాయంత్రం 5 గంటలకు జరిగే టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు, పార్టీ సీనియర్ నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశ ఎజెండాపై చర్చించేందుకు గాను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ సీఎం రేవంత్రెడ్డితో మంగళవారం సమావేశమయ్యారు. పార్లమెంటు ఎన్నికలు, తాజా రాజకీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో సభ తుక్కుగూడలో వచ్చే నెల ఆరో తేదీన భారీ బహిరంగసభ నిర్వహించేందుకు టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ జనజాత ర సభకు రాహుల్, ఖర్గే లాంటి కీలక నేతలు రానుండడం, జాతీయస్థాయి మేనిఫెస్టోను విడుదల చేయనుండడంతో టీపీసీసీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. -
మోడీ సర్కార్ పై మండిపడిన సోనియా, రాహుల్, ఖర్గే
-
డబ్బుల్లేవ్.. ప్రచారం చేసుకోలేకపోతున్నాం: కాంగ్రెస్ ఆవేదన
సాక్షి, ఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టాలు ఎదురువుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింపజేసి ఎన్నికల్లో తమకు డబ్బులు లేకుండా దెబ్బతీయాలని బీజేపీ చూస్తోందని పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై అతి పెద్ద దాడి అని సోనియా గాంధీ అభివర్ణించారు. ఈ సందర్బంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. బీజేపీ పెద్ద ఎత్తున రాజకీయ చందాలు వసూలు చేసింది. కానీ, వారు మా పార్టీ ఖాతాలను స్థంభింపజేశారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. మా బ్యాంకు ఖాతాలను తక్షణమే ఆపరేట్ చేసేందుకు అనుమతించాలి. బీజేపీ అన్ని వనరులపై ఏకఛత్రాధిపత్యం వహిస్తోంది. మాకు డబ్బు లేకుండా చేసి ఎన్నికల్లో దెబ్బతీయాలని చూస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. #WATCH | Congress President Mallikarjun Kharge in Delhi, says "I don't want to mention how the BJP took money from some companies. As SC is probing the matter, I hope the truth will be before us soon. I appeal to the Constitutional institutions that if they want free and fair… pic.twitter.com/M5lj2AEdAA — ANI (@ANI) March 21, 2024 సోనియా గాంధీ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. నెల కిందట కాంగ్రెస్ అకౌంట్లను అక్రమంగా సీజ్ చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా కాంగ్రెస్కు 11 శాతం ఫండ్స్ మాత్రమే వచ్చాయి. ఫండ్స్ను కట్టడి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కేంద్రం తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బయటపడ్డ సమాచారంపై విచారణ జరగాల్సిందే. బీజేపీకి వచ్చిన బాండ్స్పై విచారణ జరగాలి. కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బకొట్టాలని బీజేపీ చూస్తోంది. #WATCH | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi says, "...This issue affects not just Congress, it impacts our democracy itself most fundamentally. A systematic effort is underway by the Prime Minister to cripple the Indian National Congress financially. Funds… pic.twitter.com/HT4dSCuhpc — ANI (@ANI) March 21, 2024 రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్కు సంబంధించిన అన్ని అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. మా దగ్గర ఫండ్స్ లేవు. కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఈసీ దీనిపై స్పందించడం లేదు. దేశంలో 20 శాతం ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారు. 14 లక్షల రూపాయలకు సంబంధించిన లెక్కల వివాదంపై మొత్తం కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింప చేశారు. రూ.200 కోట్లు జరిమానా వేశారు. ఆలస్య చెల్లింపుకు రూ.10వేలకు మించి జరిమానా వేయకూడదు. ప్రధానమంత్రి క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నారు. డబ్బులు లేకపోవడంతో ప్రచారాలు బుక్ చేసుకోలేకపోతున్నాం. మా అభ్యర్థులకు సహాయపడలేకపోతున్నాం. విమాన టికెట్లు కాదు, కనీసం రైల్వే టికెట్లు కొనలేకపోతున్నాం. ఈ అంశంపై దేశంలోని రాజ్యాంగ సంస్థలు, ప్రజలు స్పందించాలి అని కోరారు. #WATCH | On freezing of party accounts ahead of Lok Sabha elections, Congress MP Rahul Gandhi says, "This is a criminal action on the Congress party, a criminal action done by the Prime Minister and the Home Minister...So, the idea that India is a democracy is a lie. There is no… pic.twitter.com/W9SOKyxU4z — ANI (@ANI) March 21, 2024 అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఖాతాల స్తంభన ప్రజాస్వామ్యంపైన దాడి వంటిది. మా ఖాతాలో ఉన్న రూ.285కోట్ల రూపాయలను ఖర్చు చేయలేకపోతున్నాము. ఐదు వారాల నుంచి ఎన్నికల్లో ప్రచారం కోసం ఖర్చు చేయడానికి నిధులు లేకుండా చేశారు. 30ఏళ్ల కిందటి లెక్కలను ఆధారం చేసుకుని ఇప్పుడు మా ఖాతాలను ఎలా స్పందింప చేస్తారు. అన్ని రాజకీయ పార్టీలకు మినహాయింపు ఉన్నట్టు మేము మినహాయింపులు పొందాము. కానీ, సరిగ్గా ఎన్నికల ముందు మా ఖాతాలు నన్ను స్తంభింపచేశారు. ఆదాయం పన్ను చట్టం 230ఎఫ్ ప్రకారం ఆలస్య చెల్లింపులకు 10 వేలకు మించి జరిమానా వేయకూడదు. 210 కోట్ల రూపాయల పెనాల్టీ వేశారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. -
కాంగ్రెస్కు ప్రకాశ్ అంబేద్కర్ ఆఫర్.. ఏడు స్థానాల్లో మద్దతు
ముంబై: సార్వత్రిక ఎన్నికల వేళ వంచిత్ బహుజన్ అఘాడి (వీబీఏ )అధ్యక్షుడు ప్రకాశ్ అంబేద్కర్ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీకి తన పార్టీ మద్దతు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే ఏడు స్థానాల్లో తమ పార్టీ నుంచి పూర్తి మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ప్రతిపక్ష మహారాష్ట్ర వికాస్ అఘాడీ(ఎంవీఏ)కు దూరంగా ఉన్న ప్రకాశ్ అంబేద్కర్.. కాంగ్రెస్ పార్టీకి మత్తతు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష కూటమి (ఎంవీఏ) వీబీఏ మద్దతు లేకుండా ఎన్నికల బరిలో దిగుతామని నిర్ణయం తీసుకున్న తరుణంతో మంగళవారం ప్రకాశ్ అంబేద్కర్.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. అందులో కాంగెస్ పార్టీకి మద్దతను ప్రకటించటం గమనార్హం. అయితే గతంతో మొత్తం 48 సీట్లలో వీబీఏకు నాలుగు సీట్లు కేటాయించగా.. ఆ పార్టీ ఒప్పుకోకుండా 12 సీట్లను డిమాండ్ చేసింది. దీంతో ఎంవీఏ పార్టీని ఒప్పించటంలో ఏంవీఏ కూటమి నేతలు సఫలికృతం కాలేకపోయారు. అయితే.. ఖర్గేకు రాసిన లేఖలో ప్రకాశ్ అంబేద్కర్ ప్రతిపక్ష కూటమిలోని శివసేన(యూబీటీ), శరద్ పవార్(ఎన్సీపీ)పై విమర్శలు చేశారు. ‘పలు సమావేశాల్లో మా పార్టీ అభిప్రాయాలను శివసేన(యూబీటీ), ఎన్సీపీ(శరద్ చంద్రపవార్) పట్టించుకోలేదు. దీంతో ఆ రెండు పార్టీలపై మాకు నమ్మకం పోయింది. మా పార్టీపై అసమానత్వం ప్రదర్శించారు’ అని మండిపడ్డారు ప్రకాశ్ అంబెద్కర్. ఇక.. కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు కావాలనుకుంటే తాము ఏడు స్థానాల్లో పూర్తి మద్దతను ఇస్తామని చెప్పారు. ‘మహారాష్ట్ర వికాస్ అఘాడీ కూటమిలో భాగంగా కాంగెస్ పార్టీ పోటీచేసే ఏడు సెగ్మెంట్లలో మా పార్టీ పూర్తిగా క్షేత్రస్థాయిలో కాంగెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది. భవిష్యత్తులో కూటమి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని స్నేహపూర్వకంగా తమ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది’ అని ప్రకాశ్ అంబేద్కర్ లేఖలో వివరించారు. మహారాష్ట్రలో ఇండియా కూటమిలో భాగం ప్రతిపక్షాల కూటమిలో ఉన్న శివసేన(యూబీటీ)కి-22, కాంగ్రెస్- 16, ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్)-10 సీట్లు కేటాయింపు జరగనున్నట్లు సోమవారం ఎంవీఏ కూటమిలోని నేతలు చర్చించుకుంటున్నారు. -
CWC Meeting: సీడబ్ల్యూసీ భేటీ ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గెలుపు వ్యూహాలను సిధ్దం చేసేందుకు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) భేటీ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం జరుగుతున్న ఈ భేటీలో లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోకు తుది రూపు ఇచ్చి.. ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కీలక నేతలు హాజరయ్యారు. తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు సైతం సాయంత్రం పాల్గొననున్నట్లు తెలుస్తోంది. రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలే లక్ష్యంగా ‘భాగిదారీ న్యాయ్’(భాగస్వామ్య న్యాయం), ’కిసాన్ న్యాయ్’, ’నారీ న్యాయ్’, ’శ్రామిక్ న్యాయ్’,’యువ న్యాయ్’పేరిట ఇప్పటికే తన హామీలను ప్రజల ముందుంచిన కాంగ్రెస్ వాటిపై నేతలకు మార్గనిర్దేశం చేయనుంది. ఇక.. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, రైతులకు వడ్డీలేని రుణాలు, ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న సాయం పెంపు, యువత కోసం 30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ లేక ప్రైవేట్ రంగంలో 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి డిప్లొమా లేక డిగ్రీ హోల్డర్కు అప్రెంటిస్ షిప్ శిక్షణకు రూ.లక్ష సాయం, 30 ఏళ్లలోపు యువత స్టార్టప్లకు నిధులు సమకూర్చడానికి రూ.5,000 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు, పేపర్ లీకేజీల నివారణకు ప్రత్యేక చట్టం, మహిళల కోసం నిరుపేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి రూ.లక్ష సాయం వంటి 25 హామీలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే మేనిఫెస్టో విడుదల మాత్రం తర్వాతే ఉటుందని పార్గీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై సీఈసీ.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే పలు మార్లు భేటీ అయిన కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) మంగళవారం మళ్లీ సమావేశం కానుంది. ఇప్పటికే రెండు విడతలుగా 82 మంది పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. 19న జరిగే భేటీలో తెలంగాణలోని మిగతా స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశాలున్నాయి. భేటీలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమ వారం మధ్యాహ్నం ముంబై నుంచి నేరుగా ఢిల్లీ చేరుకోగా, సీఈసీ సభ్యుడు ఉత్తమ్కుమార్రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ మంగళవారం ఉదయానికి ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది. -
ఎలక్షన్ షెడ్యూల్ బీజేపీ ప్రయోజనం కోసమే!.. మండిపడ్డ విపక్షం
భారత ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన ఏడు దశల ఓటింగ్ ప్రణాళిక అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు 'మల్లికార్జున్ ఖర్గే' పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ షెడ్యూల్ను విమర్శించింది. మేము రాష్ట్రంలో ఒకటి లేదా రెండు దశల లోక్సభ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాము. కానీ ఎలక్షన్ కమీషన్ ఏడు దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ చేపట్టడం వల్ల ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లయిందని ప్రతిపక్షాలు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వచ్చే లోక్సభ ఎన్నికలే చివరి అవకాశం అని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎక్స్(ట్విటర్)లో 2024 లోక్సభ ఎన్నికలు భారతదేశానికి న్యాయ్ తలుపును తెరుస్తాయి. ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని నియంతృత్వం నుంచి రక్షించడానికి ఇది బహుశా చివరి అవకాశం కావచ్చని పేర్కొన్నారు. భారత ప్రజలమైన మనం అందరూ కలిసి ద్వేషం, దోపిడీ, నిరుద్యోగం, ధరల పెరుగుదల, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడదామని ఖర్గే అన్నారు. నేను దాదాపు 12 ఎన్నికల్లో పోటీ చేసాను. అప్పుడు నాలుగు దశలు కూడా లేవు. అయితే ఇప్పుడు ఎలక్షన్ కమీషన్ మోదీ ప్రచారం కోసం ఏడు దశలు పెట్టినట్లు అనిపిస్తోందని అన్నారు. 2024 लोकसभा चुनाव भारत के लिए ‘न्याय का द्वार’ खोलेगा। लोकतंत्र एवं संविधान को तानाशाही से बचाने का शायद ये आख़री मौक़ा होगा। ‘हम भारत के लोग’ साथ मिलकर नफ़रत, लूट, बेरोज़गारी, महँगाई व अत्याचार के ख़िलाफ़ लड़ेंगे। हाथ बदलेगा हालात 2024 Lok Sabha elections will open the… — Mallikarjun Kharge (@kharge) March 16, 2024 -
ఎలక్టోరల్ బాండ్లు.. అతిపెద్ద కుంభకోణం
బెంగళూరు: మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. దర్యాప్తు పూర్తయ్యేదాకా అధికార బీజేపీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీ వేల కోట్ల రూపాయలు నొక్కేసిందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మండిపడ్డారు. నేను తినను, ఇతరులను తిననివ్వనంటూ ప్రగల్భాలు పలికిన మోదీ ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు. పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు బీజేపీకి ఇంత సొమ్ము ఎందుకిచ్చారు? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన కాంట్రాక్టర్లు, అవినీతికి పాల్పడిన బడా వ్యక్తులు ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి, బీజేపీకి సమరి్పంచుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ శుక్రవారం ఆరోపించారు. దర్యాప్తు సంస్థల భయంతో బీజేపీకి లొంగిపోయారని అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల కుంభకోణంపై ప్రజాక్షేత్రంలో వెళ్లి పోరాటం సాగిస్తామని తెలిపారు. ఎలక్టోరల్ బాండ్ల స్కామ్పై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ఈ బాండ్ల వ్యవహారంలో క్విడ్ ప్రో కో చోటుచేసుకుందని, అవకతవకలు జరిగాయని అన్నారు. ఇదొక వసూళ్ల రాకెట్: రాహుల్ ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద బలవంతపు వసూళ్ల రాకెట్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ పథకం కింద వసూలు చేసిన సొమ్మును వివిధ రాష్ట్రాల్లో పారీ్టలను చీల్చడానికి, ప్రభుత్వాలను పడగొట్టడానికి బీజేపీ దుర్వినియోగం చేసిందని రాహుల్ ఆరోపించారు. ఆయన శుక్రవారం మహారాష్ట్రలోని థానేలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ మినహా ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇచ్చిన కాంట్రాక్టులకు, ఎలక్టోరల్ బాండ్లకు మధ్య ఎలాంటి సంబంధం లేదన్నారు. -
కాంగ్రెస్కు కొత్త కష్టాలు.. ఎన్నికల వేళ ఖర్గే ఆవేదన ఇదే..
బెంగళూరు: దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. ఎన్నిక ఏదైనా దాదాపు ఓటమే కాంగ్రెస్కు ఎదరువుతోంది. స్థానిక పార్టీలు, బీజేపీ చేతిలో కాంగ్రెస్ చతికిలపడుతోంది. ఇలాంటి సమయంలో.. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక పరిస్థితిపై పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, తాజాగా మల్లికార్జున్ ఖర్గే ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటోందన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసిందని, ఆదాయం పన్ను శాఖ తమ పార్టీపై భారీ జరిమానాలను విధించిందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీనీ, బీజేపీని తీవ్రంగా విమర్శించారు. ఇదే సమయంలో దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు రానున్న లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలలో ప్రతీ రాజకీయ పార్టీకి సమాన అవకాశాలు ఉండాలని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ఎన్నికల బాండ్ల ద్వారా వేల కోట్లను విరాళాల రూపంలో పుచ్చుకున్న బీజేపీ వాటి వివరాలను మాత్రం వెల్లడించడానికి సిద్ధంగా లేదని ఖర్గే విమర్శించారు. తమ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ ద్వారా స్తంభింపచేసి భారీ జరిమానాలను విధించిందని ఆయన ఆరోపించారు. ప్రజలు విరాళంగా ఇచ్చిన తమ పార్టీ నిధులను బీజేపీ ప్రభుత్వం స్తంభింపచేసిందన్నారు. అలాగే, ప్రస్తుతం ఖర్చు చేయడానికి తమ వద్ద నిధులు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ తప్పుడు పనులు బయటపడతాయన్న భయంతోనే ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడికి జూలై వరకు సమయం కోరుతున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. మరోవైపు.. గుజరాత్లో క్రికెట్ స్టేడియంకు మోదీ పేరు పెట్టడంపై ఖర్గే సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఎవరైనా మరణించిన తర్వాత వారి జ్ఞాపకార్థం వారి పేర్లను పెడతారని, కాని ఒక మనిషి బతికున్నపుడే తన పేర్లను వేటికీ పెట్టుకోడని అన్నారు. అలాగే, బీజేపీ నేతలను మోసగాళ్లుగా అభివర్ణించిన ఖర్గే మోసగాళ్ల చేతిలో మోసపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలంతా ఐక్యంగా ఉండి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని అంబేద్కర్ చెప్పారని, రాజ్యాంగమే లేకపోతే దేశంలో స్వేచ్ఛ, ఐక్యత ఎక్కడ ఉంటాయని ఆయన ప్రశ్నించారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పటిష్ట బందోబస్తు
72 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు
● రామగుండం కమిషనరేట్లో పర్యవేక్షణ కేంద్రం ● మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తం ● నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు
నేడే లోక్సభ పోలింగ్
రంగంపల్లిలో ఓటు వేయనున్న కలెక్టర్
ఉరుములు.. మెరుపులు
బైక్ నడిపి.. చాయ్ తాగి
ఓటరూ.. ఒక్క నిమిషం..!
పకడ్బందీగా సిద్ధం
నేడే లోక్సభ పోలింగ్
తప్పక చదవండి
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
- ఉద్దానానికి ఊపిరి
- పర్యాటకం కళకళ
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement