ఖర్గే హెలికాప్టర్‌లో తనిఖీలు.. ‘బీజేపీ నేతలను తనిఖీ చేస్తున్నారా?’ | Congress Says Poll Officials Targeting Opposition Kharge Helicopter Checked Bihar, More Details Inside | Sakshi
Sakshi News home page

ఖర్గే హెలికాప్టర్‌లో తనిఖీలు.. ‘బీజేపీ నేతలను తనిఖీ చేస్తున్నారా?’

May 12 2024 1:41 PM | Updated on May 12 2024 6:28 PM

congress says poll officials  targeting Opposition Kharge helicopter checked Bihar

ఢిల్లీ: లోక్‌సభ  ఎన్నికల ప్రచార సమయంలో ప్రతిపక్షాలను ఎన్నికల అధికారులు టార్గట్‌ చేసి మరీ తనిఖీలు చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే హెలికాప్టర్‌ను బిహార్‌లోని సమస్తిపూర్‌లో పోలింగ్‌ అధికారులు తనిఖీ చేశారు. అయితే ఎన్డీయే కూటమి నేతలను మాత్రం ఎటువంటి తనిఖీలు చేయకుండా  విదిలేస్తున్నారని కాంగ్రెస్‌ ఎన్నికల అధికారులపై విమర్శలు చేసింది. శనివారం మల్లికార్జున ఖర్గే.. సమస్తీపూర్‌, ముజఫర్‌పర్‌లో ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు.

‘‘ఇప్పటికే కేరళలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ హెలికాప్టర్‌ను ఎ‍న్నికల అధికారలు తనిఖీ చేశారు. శనివారం మల్లికార్జన ఖర్గేను బిహార్‌లోని సమస్తీపూర్‌లో అధికారుల చేత తనిఖీ చేయబడ్డారు’’ అని ‘ఎక్స్‌’ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ నేత రాజేష్‌ రాథోడ్‌ అన్నారు. బిహార్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్ ఖర్గే హెలికాప్టర్‌ చెక్‌ చేశారని రాజేష్‌ రాథోడ్‌ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.  వీడియోలో.. హెలికాప్టర్‌  చుట్టూ అధికారులు, పోలిసులు ఉండటం గమనించవచ్చు.

 

‘‘కేవలం కాంగ్రెస్‌ నేతల హెలికాప్టర్లకు మాత్రమే తనిఖీలు చేస్తున్నారా? లేదా బీజేపీకి చెందిన అగ్రనాయకుల హెలికాప్టర్లును కూడా చెక్‌ చేస్తున్నారా? అనే విషయంపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వాలి.  ఈ తనిఖీలు సమాచారాన్ని ఈసీ బహిరంగంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. లేదంటే ప్రతిపక్షాలను అడ్డుకొని, ఎన్డీయే నేతలను ఫ్రీగా వదిలేసినట్లు అర్థమవుతుంది’’ అని రమేష్‌ రాథోడ్‌ అన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారులు నేతల హెలికాప్టర్లను చెక్‌ చేసిన అన్ని వీడియోను బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement