NDA
-
చంద్రబాబు ఎన్డీఏ చైర్మన్ కోరికకు మోదీ నో
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల తర్వాత చంద్రబాబు(Chandrababu) ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కూటమికి చైర్మన్ లేదా వైస్ చైర్మన్ అవ్వాలనుకున్నారని మాజీ ప్రధాని దేవెగౌడ(Devegowda) సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ తిరస్కరించారని.. చంద్రబాబు ప్రతిపాదనను అంగీకరించలేదని దేవెగౌడ వెల్లడించారు. గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో దేవెగౌడ మాట్లాడుతూ, ‘2014, 2019 ఎన్నికల్లో మోదీ 300కు పైగా సీట్లు సాధించారు. 2024 ఎన్నికల్లో ఆయనకు 240 సీట్లొచ్చాయి. వివిధ ప్రాంతీయ పార్టీల నేతలు ఆయనకు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం ఆయనకు దాదాపు 305 సీట్లు ఉన్నాయి. ఇది సభా వేదికపై రుజువైంది. విశ్వాస ఓటు కోరే ప్రశ్నే లేదు. ఎన్డీఏ కూటమికి వైస్ చైర్మన్ను ప్రధాని నియమించలేదు. యూపీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి మాత్రమే కాకుండా కూటమికి పవర్ సెంటర్గా చైర్పర్సన్ కూడా ఉన్నారు. కూటమి చైర్మన్ పవర్ సెంటర్గా ఉంటారు. కానీ.. ప్రధాని మోదీ కూటమిని నడిపించడానికి లేదా ప్రభుత్వంలో జోక్యం చేసుకోవడానికి ఎవరినీ అనుమతించలేదు’ అని అన్నారు.‘ఇప్పుడు 2024లో మోదీ 240 సీట్లు సాధించినప్పుడు చంద్రబాబు వంటి ఇతర ప్రాంతీయ పార్టీలు ఆయనకు మద్దతు ఇచ్చాయి. చంద్రబాబు అన్ని ఎన్డీఏ పార్టీలు ఏర్పాటు చేసిన కూటమికి వైస్చైర్మన్ లేదా చైర్మన్ కావాలని కోరుకున్నారు. కానీ.. మోదీ తిరస్కరించారు. పరిపాలన ఎలా నిర్వహించాలో మోదీకి తెలుసు. ప్రధానిగా, ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న మోదీ ఈ దేశాన్ని ఎలాంటి ఊగిసలాట లేకుండా నడపగల మహోన్నత నాయకుడు. నేను నిజం చెబితే మీరు అంగీకరించాలి. నేను ఏదైనా అవాస్తవం చెబితే మీరు నాపై దాడి చేయవచ్చు’ అని వ్యాఖ్యానించారు.ఖండించిన నడ్డాకాగా.. దేవెగౌడ ప్రసంగం అనంతరం రాజ్యసభలో మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా చంద్రబాబుపై దేవెగౌడ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎన్డీఏలో చంద్రబాబును చైర్మన్ చేయాలన్న ఎలాంటి చర్చ జరగలేదని.. అందరూ కలిసి ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) నేతృత్వంలో అందరి సహకారంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని నడ్డా స్పష్టం చేశారు. -
రైతులు మరియు స్టీల్ ప్లాంట్ పై బీజేపీ మొండి వైఖరి
-
రషీద్ సోదరుడిపై కేసు నమోదు చేయటం దారుణం: అడ్వొకేట్ రోళ్ల మాధవి
-
హరిత హబ్గా విశాఖ: ప్రధాని మోదీ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో విశాఖ ప్రపంచంలోనే కీలక ప్రాంతంగా మారనుంది. ఇక దేశంలో నెలకొల్పుతున్న మూడు బల్క్ డ్రగ్ పార్కుల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు కానుంది. తద్వారా ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయి. ఈ రోజు రూ.2 లక్షల కోట్లకుపైగా విలువైన పెట్టుబడులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. రైల్వే జోన్ ఏర్పాటు కల కూడా నెరవేరుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా అభిమానాన్ని చూపించే అవకాశం వచ్చింది..’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖలోని ఏయూలో బుధవారం జరిగిన ప్రజా వేదిక బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. అంతకుముందు సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ గ్రౌండ్స్ వరకూ ఓపెన్ టాప్ వాహనంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో కలసి ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్ షో నిర్వహించారు. ‘‘ఆంధ్రా ప్రజల ప్రేమ, అభిమానానికి నా కృతజ్ఞతలు. నా అభిమానాన్ని చూపించే అవకాశం ఇప్పుడు లభించింది. సింహాచలం లక్ష్మీ నృసింహ స్వామికి నమస్సులు తెలియజేసుకుంటున్నా..’’ అని తెలుగులో తన ప్రసంగాన్ని ప్రధాని ప్రారంభించారు. మీ ఆశీర్వాదంతో 60 సంవత్సరాల తర్వాత మూడోసారి కేంద్రంలో మన ప్రభుత్వం ఏర్పాటైందని... దేశంతోపాటు ఏపీ కూడా అభివృద్ధి చెందుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల లక్ష్యాలను సాకారం చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఏపీ అభివృద్ధి మా విజన్.. ఏపీ ప్రజల సేవే మా సంకల్పం’ అని పేర్కొన్నారు. ప్రధాని ఇంకా ఏమన్నారంటే...2.5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ...2047 నాటికల్లా ఆంధ్రప్రదేశ్ 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమాన్ని చేరుకునేందుకు ఆంధ్రప్రదేశ్తో కలసి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. సరికొత్త టెక్నాలజీకి రాష్ట్రం కేంద్రంగా మారుతోంది. అందులో ఒకటి గ్రీన్ హైడ్రోజన్. దేశంలో 2023లోనే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కు శ్రీకారం చుట్టాం. 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. దీని కోసం ప్రారంభ దశలో రెండు గ్రీన్ హైడ్రోజన్ హబ్లు ఏర్పాటు చేస్తుండగా అందులో ఒకటి విశాఖలో ఏర్పాటవుతోంది. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ రానుంది. దేశంలో నెలకొల్పే మూడు బల్క్ డ్రగ్ పార్కులలో ఒకటి రాష్ట్రంలో ఏర్పాటు కానుండటం శుభ పరిణామం. ఈ పార్కులో ఉత్పత్తి, పరిశోధనల కోసం అద్భుతమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. తద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించడంతోపాటు ఫార్మా కంపెనీలకు ఎంతో ఉపయోగం కలుగుతుంది. పట్టణీకరణ కలలను సాకారం చేసేందుకు క్రిస్ సిటీకి శంకుస్థాపన చేశాం. చెన్నై – బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఈ స్మార్ట్ సిటీ భాగం కానుంది. దీనివల్ల ఏపీకి రూ.వేల కోట్ల పెట్టుబడులతో పాటు పారిశ్రామిక, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. శ్రీసిటీలో తయారీ రంగం అద్భుతంగా సాగుతోంది. పారిశ్రామిక, తయారీ రంగాలలో ఏపీ దేశంలోనే అగ్రగామిగా నిలవాలి.ఇప్పటికీ విశాఖకు అంతే ప్రాధాన్యం..విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేశాం. ఏపీ అభివృద్ధి దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. చిరకాల స్వప్నం ఈ రోజు నెరవేరబోతోంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యవసాయం, వ్యాపార కార్యకలాపాలు విస్తరించనున్నాయి. పర్యాటకం, స్థానిక ఆర్థిక వ్యవస్థలో కూడా కొత్త అవకాశాలు దక్కుతాయి. రూ.వేల కోట్లతో రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నాం. ఏపీలో 70కిపైగా రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేయడంతో పాటు ఏడు వందే భారత్, అమృత్ భారత్ రైళ్లను నడిపిస్తున్నాం. విశాఖతో పాటు ఏపీలోని తీర ప్రాంతాలు వందల ఏళ్లుగా భారతీయ వాణిజ్యానికి గేట్ వేగా ఉన్నాయి. ఇప్పటికీ విశాఖకు అంతే ప్రాధాన్యం ఉంది. సముద్రతీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవడంలో భాగంగా విశాఖ ఫిషింగ్ హార్బర్ని ఆధునికీకరిస్తున్నాం. అందరికీ అభివృద్ధి ఫలాలు అందించాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. సుసంపన్నమైన ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తుకు మేలు చేయనున్నాయి.మనిద్దరి స్కూల్ ఒకటే సార్..!: సీఎం చంద్రబాబుప్రధాని చేతుల మీదుగా రూ.2,08,545 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం ఏపీ చరిత్రలో తొలిసారి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రజలకు దగ్గరైన వ్యక్తి మోదీ. దేశం కాదు.. ప్రపంచమే మెచ్చిన ప్రధాని మోదీ. భవిష్యత్తులో కూడా ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్, నేను... ఈ కాంబినేషన్ ఉంటుంది. మోదీ ప్రధానిగా దేశ రాజకీయాల్లో కొనసాగుతారు. రేపు ఢిల్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించేది ఎన్డీఏనే. సూపర్ సిక్స్ అమలు చేసే బాధ్యత మాదే. దేశానికి ముంబై ఆర్థిక రాజధాని అయితే విశాఖ ఏపీకి ఆర్థిక రాజధాని. అరకు కాఫీని ప్రపంచ బ్రాండ్గా తీర్చిదిద్దిన ఘనత మోదీదే. మోదీని నిరంతరం స్ఫూర్తిగా తీసుకుంటూ ఎన్నో పాఠాలు నేర్చుకున్నా. మీరు శంకుస్థాపన చేసిన అమరావతిని మీ ఆశీస్సులతో నిర్మించి.. మీ చేతుల మీదుగా ప్రారంభించే రోజు దగ్గర్లోనే ఉంది. పోలవరం, నదుల అనుసంధానం పూర్తి చేసేందుకు మీ సాయం కావాలి. మీ నాయకత్వంలోనే బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు కూడా రాబోతోంది. మీ స్కూల్, నా స్కూల్ ఒకటే సార్..! ఇద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాం. ఇంతకంటే విశాఖకు ఏం కావాలి? ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. మంచి చేసే ప్రభుత్వాన్ని కొనసాగించాలి. మధ్యలో వచ్చే విధ్వంసక పాలకులతో లక్ష్యాల్ని చేరుకోలేం. పటిష్ట భారత్ కోసం ప్రధాని కృషి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్స్వచ్ఛ భారత్, ఆత్మ నిర్భర భారత్, పటిష్ట భారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో కృషి చేస్తున్నారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ని తీర్చిదిద్దిన ఘనత మోదీదే. భారీ పెట్టుబడులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలతో ఏకంగా 7.5 లక్షల ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఏపీని చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. (రూ. 2 లక్షల కోట్లకుపైగా ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తున్నారనేందుకు బదులుగా రూ.2 లక్షల పెట్టుబడులంటూ పవన్ రెండు సార్లు పలికారు)పీపుల్స్ మ్యాన్: నారా లోకేష్, విద్యాశాఖ మంత్రినరేంద్ర మోదీ ప్రధాని అర్థం మార్చారు. పీపుల్స్ మ్యాన్గా మోదీ మార్చారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి ప్రధాని మోదీ ఆక్సిజన్ అందిస్తున్నారు. అమరావతికి రూ.15 వేల కోట్లు, పోలవరానికి రూ.12,157 కోట్ల కేంద్ర సాయం అందించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతే భోగాపురం ఎయిర్పోర్టు పనులు వేగవంతం అయ్యాయి. మోదీ కారణంగా ఈరోజు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. పీఏం అనే పదానికి అర్థం మార్చేసి పీపుల్స్ మ్యాన్గా మోదీ మారారు. ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు..– పూడిమడకలో రూ.1,85,000 కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ – రూ.149 కోట్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ హెడ్క్వార్టర్స్ నిర్మాణం– రూ.1,876 కోట్లతో నక్కపల్లిలో బల్క్డ్రగ్ పార్క్– రూ.2,139 కోట్లతో కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియాలో క్రిస్ సిటీ నిర్మాణం– 465 కి.మీ. పొడవైన రైల్వే లైన్స్ డబ్లింగ్ పనులకు సంబంధించి 3 ప్రాజెక్టులు– 48 కిలోమీటర్లకు సంబంధించి 3 ప్రాజెక్టుల రైల్వే లైన్ల నిర్మాణం– డబుల్ లైన్, 4 లైన్ల నిర్మాణానికి సంబంధించి 294 కి.మీ. మేర 7 ప్రాంతాల్లో రహదారుల విస్తరణ ప్రాజెక్టులు– 28 కిలోమీటర్ల మేర గ్రీన్ఫీల్డ్ బైపాస్ ప్రాజెక్టుల నిర్మాణ పనులు⇒ సభలో ఆద్యంతం ఆర్సిలర్ మిట్టల్ స్టీలు ప్లాంట్ గురించే ప్రస్తావించిన సీఎం చంద్రబాబు విశాఖ స్టీలు ప్లాంటుపై కనీసం మాట మాట్లాడలేదు. ఆ పెట్టుబడులు వస్తే చాలనే అర్థంతో విశాఖ ప్రజలకు ఇంకేం కావాలంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ⇒ విశాఖలో ఏర్పాటు చేసిన హోర్డింగ్లలో కేంద్ర మంత్రితో పాటు ఇన్చార్జీ మంత్రి, స్థానిక మంత్రులు, ఎంపీలకు స్థానం లభించలేదు. రోడ్ షోలో పాల్గొనేందుకు లోకేష్ ఉత్సాహం చూపినప్పటికీ అనుమతి లభించలేదని తెలుస్తోంది.⇒ చంద్రబాబు తన ప్రసంగంలో 2 వేల ఎనిమిది వందల 545 కోట్లతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుగుతున్నాయంటూ తడబడ్డారు. -
మన్మోహన్సింగ్ను ఎన్డీఏ అవమానించింది: రాహుల్
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్(Manmohan Singh) అంత్యక్రియల వేళ ఆయన్ను బీజేపీ తీవ్రంగా అవమానించిందని ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) విమర్శించారు. దేశానికి పదేళ్ల పాటు విలువైన సేవలందించిన ఆయన్ను బీజేపీ నేతృత్వంలోని(BJP-Led NDA) ఎన్డీఏ అవమానించిన తీరు బాధాకరమన్నారు. మన్మోహన్ అంత్యక్రియల్ని నిగమ్ బోధ్ వద్ద నిర్వహించి ఆయన్ని అవమానపరిచారన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ లో రాహుల్ విమర్శలు గుప్పించారు.‘మన్మోహన్ భారతదేశానికి ముద్దుబిడ్డ. సిక్కు కమ్యూనిటీకి తొలి ప్రధాని కూడా. పదేళ్ల పాటు దేశానికి ప్రధానిగా సేవలందించారు. ఆయన హయాంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఆర్థికరంగంలో ఒక సూపర్ పవర్గా భారతదేశం ఎదగడంలో ఆయన సేవలు వెలకట్టలేనివి. ఆయన విధానాల వల్ల ఇప్పటికీ పేదలకు, వెనుకబడిన వర్గాలకు ఎంతో మేలు చేకూరుతుంది. అటువంటి ఆయన్ను అంత్యక్రియల విషయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అవమానించింది. ఇప్పటివరకు దేశానికి ప్రధానులుగా చేసిన వారికి అంత్యక్రియలు అనేవి అధికారిక శ్మశాన వాటికలో జరిగేవి. దీనివల్ల ప్రధానుల అంతిమ సంస్కరాల్లో పాల్గొనే ప్రతీ ఒక్కరికీ ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. మరి మన్మోహన్ సింగ్ విషయంలో మాత్రం ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్( Nigam Bodh Ghat)లో నిర్వహించారు. ఇది ఆయన్ను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అవమానించినట్లే’ అని ధ్వజమెత్తారు. మన్మోహన్సింగ్కు స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తేనే ఆయనకు అత్యంత గౌరవం ఇచ్చిన వారమవుతున్నామన్నారు రాహుల్. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్మారక చిహ్నం నిర్మించాల్సిందేనని రాహుల్ డిమాండ్ చేశారు. भारत माता के महान सपूत और सिख समुदाय के पहले प्रधानमंत्री डॉ मनमोहन सिंह जी का अंतिम संस्कार आज निगमबोध घाट पर करवाकर वर्तमान सरकार द्वारा उनका सरासर अपमान किया गया है।एक दशक के लिए वह भारत के प्रधानमंत्री रहे, उनके दौर में देश आर्थिक महाशक्ति बना और उनकी नीतियां आज भी देश के…— Rahul Gandhi (@RahulGandhi) December 28, 2024 -
పార్లమెంటు ఆవరణలో తన్నుకున్న ఎంపీలు
-
‘జమిలి’కి వేళయిందా?!
మొత్తానికి బీజేపీ చిరకాల వాంఛ నెరవేరటంలో తొలి అడుగుపడింది. దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు ముసాయిదా బిల్లులు మంగళవారం లోక్సభలో ప్రవేశించాయి. అందరూ అనుకున్నట్టే ఈ బిల్లులకు విపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వచ్చినంత వేగంగా రెండు బిల్లులూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు వెళ్లబోతున్నాయి. తరచు జరిగే ఎన్నికల వల్ల పాలనా నిర్వహణలో అస్థిరత నెలకొంటున్నదని, కీలకమైన ప్రాజెక్టుల సాకారంలో అంతులేని జాప్యం చోటుచేసుకుంటున్నదని, ఎన్నికలకు తడిసి మోపెడు వ్యయం అవుతున్నదని ప్రభుత్వ పెద్దలు చాన్నాళ్లుగా వాదిస్తున్నారు. ఎన్నికల నిర్వహణపై స్పష్టత వుంటే పాలన కుంటు పడదని, అధికార యంత్రాంగంపైనా, ఖజానాపైనా భారం తగ్గుతుందని, వోటింగ్ శాతం పెరుగు తుందని వారి వాదన. ఈ విషయమై కేంద్రం మాజీ రాష్ట్రపతి రావ్ునాథ్ కోవింద్ నేతృత్వంలో నియమించిన బృందం సైతం పాలకుల వాదనకు అనుకూలంగా సిఫార్సులు చేసింది. జమిలి ఎన్నికల వల్ల సుస్థిరత ఏర్పడి పెట్టుబడులు పెరుగుతాయని, ఆర్థికాభివృద్ధికి వీలవుతుందని, వనరుల కేటాయింపు సమర్థంగా చేయొచ్చని వివరించింది. మతపరమైన ఉద్రిక్తతలు తగ్గి భద్రతా బలగాల వినియోగం పెద్దగా ఉండబోదన్నది ఆ బృందం అభిప్రాయం. జమిలి ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలోని 83, 172, 324 అధికరణాలను సవరించాల్సి వుంటుంది. అందుకోసమే ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టారు. వోటర్ల జాబితాకు సంబంధించి రాజ్యాంగంలోని 325 అధికరణను సవరించే మరో బిల్లు అవసరమవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆధ్వర్యంలో లోపరహితమైన జాబితా రూపొంది లోక్సభ, అసెంబ్లీల ఎన్నికలు ఏకకాలంలో జరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది. అంటే జమిలి కేవలం ఈ రెండు సభలకు సంబంధించిందే. ఈ ఎన్నికలు పూర్తయిన వందరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలుంటాయి.మొత్తానికి ఎన్నికల జాతర అయిదేళ్లకోసారి మాత్రమే ఉంటుంది. మధ్యలో ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం కుప్పకూలి అసెంబ్లీ ఎన్నికలు తప్పనిసరైతే వాటిని జరుపుతారట. కానీ ఆ కొత్త ప్రభుత్వాల ఆయుష్షు ఆ మిగి లిన సంవత్సరాలకు మాత్రమే పరిమితమవుతుందట. అంటే అయిదేళ్ల కాలానికి ఎన్నికైన ప్రభుత్వం మూడేళ్లకే పతనమైతే... కొత్తగా ఎన్నికలై వచ్చే పాలకులకు కేవలం రెండేళ్లు మాత్రమే పదవీయోగం దక్కుతుందన్నమాట! సారాంశంలో ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ ఆదర్శం కాస్తా అట కెక్కినట్టే అవుతుంది. మరి ఈ బిల్లులు సాధించదల్చుకున్నదేమిటి? ఈ బిల్లులు గట్టెక్కటం అంత సులభమేమీ కాదు. ఏ రాజ్యాంగ సవరణ బిల్లుకైనా మూడింట రెండువంతుల మెజారిటీ తప్పనిసరి. ఆ రకంగా చూస్తే 543 మంది సభ్యులున్న సభలో ఈ బిల్లు లకు మద్దతుగా కనీసం 362 మంది వోటేయాలి. కానీ ఎన్డీయే బలం 293. అంటే మరో 69 మంది మద్దతు అవసరమవుతుంది. రాజ్యసభ వరకూ చూస్తే 163 మంది బిల్లులకు అనుకూలంగా వోటే యాలి. కానీ ఎన్డీయే బలం 121. ఆ తర్వాత రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం కూడా తప్పనిసరి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన చట్టాలు మార్చాలంటే కనీసం సగం అసెంబ్లీలు అందుకు అంగీ కరించాలి. కోవింద్ కమిటీ ముందు 47 రాజకీయ పక్షాలు తమ అభిప్రాయాలు వినిపించాయి. 32 పార్టీలు అనుకూలం కాగా, 15 పార్టీలు ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’కు వ్యతిరేకమని తేలింది. ప్రజాస్వామ్యమంటే కేవలం అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికలు మాత్రమే కాదన్న సంగతి పాలకులు మరిచిపోయి చాన్నాళ్లయింది. ఎన్నికల్లో చెప్పేది ఒకటైతే, గెలిచాక చేసేది మరొకటి.కేంద్రంలో మాత్రమే కాదు... ఏపీలోని ఎన్డీయే పాలన చూసినా ఈ సంగతి ఇట్టే అర్థమవుతుంది. ఏపీలో నదురూ బెదురూ లేకుండా ఇచ్చిన వాగ్దానాలన్నిటికీ ఎగనామం పెట్టారు. ఇక ఎక్కడ ఎన్ని కలు జరిగినా ఈవీఎంలపై అనుమానాలు మొదలవుతున్నాయి. ఏపీలో ఎన్నికలు పూర్తయినవెంటనే ఈసీ ప్రకటించిన ఓట్లకు లెక్కించినప్పుడు అదనంగా మరో పన్నెండున్నర శాతం ఓట్లు వచ్చిచేరాయి. దేశంలో అత్యధిక నియోజకవర్గాల్లో సగటున వెయ్యి ఓట్లు ఇలా అదనంగా చేరినట్టు బయటపడింది. దీనిపై సంజాయిషీ ఇవ్వాలన్న కనీస సంస్కారం ఈసీకి లేకపోగా... ఈవీఎంలలో పోలైన ఓట్లనూ, వీవీ ప్యాట్ స్లిప్లనూ సరిపోల్చాలన్న వినతుల్ని బుట్టదాఖలా చేసింది. పైగా అతి తెలివి ప్రదర్శించి డమ్మీ పోలింగ్ నిర్వహణకు దిగింది! ఏపీకి సంబంధించినంతవరకూ అయితే గడువుకు ముందే వీవీ ప్యాట్ స్లిప్లను ధ్వంసం చేశారు. ఈవీఎంల డేటా తొలగించారు. ఈ వైపరీ త్యాలపై తామేం చేయాలన్న స్పృహ, వివేకం కేంద్ర పాలకులకు లేకపోగా... ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ లోనే దేశ భవిష్యత్తు సర్వం ఆధారపడి వున్నట్టు భూమ్యాకాశాలు ఏకం చేస్తున్నారు.పైగా ఈ మాదిరి ఎన్నికలు ప్రాంతీయ ఆకాంక్షలనూ, అవసరాలనూ పాతరపెడతాయన్న ఆరోపణలకు సరైన జవాబు లేదు. ఈ విధానం దేశ ఫెడరల్ స్వభావాన్ని దెబ్బతీస్తుందన్న విమ ర్శను బేఖాతరు చేస్తున్నారు. అసలు 140 కోట్ల జనాభా... 30 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతా లున్న దేశాన్నీ... లెక్కకు మిక్కిలివున్న పార్టీలనూ ‘జమిలి’ చట్రంలో బిగించి ఒక్క వోటుకి కుదించాలన్న ప్రతిపాదనే వింతై నది. దానిపై బిల్లులు పెట్టేముందు విస్తృతంగా చర్చించి ఏకాభిప్రాయం సాధించాలన్న కనీస ఇంగితజ్ఞానం కొరవడితే ఎలా? అగ్రరాజ్యమైన అమెరికాలోనే నాలుగేళ్లకోసారి అధ్యక్ష ఎన్నికలు జరుపుతూ, రాష్ట్రాల సెనేట్లకూ, స్థానిక సంస్థలకూ, ప్రతినిధుల సభకూ నిర్ణీత కాలంలో విడివిడిగా ఎన్నికలు నిర్వహిస్తుండగా దాదాపు 97 కోట్లమంది వోటర్లున్న ఈ అతి పెద్ద దేశంలో జమిలికి తహతహలాడటంలోని మర్మమేమిటి? -
ON-OP: అదే జరిగితే మళ్లీ కథ మొదటికే!
దేశం మొత్తం ఒకేసారి ఎన్నిక నిర్వహించాలన్న ‘జమిలి బిల్లు’ తొలి గండం గట్టెక్కింది. ఇవాళ లోక్సభలో బిల్లుల కోసం 269-198తో ఆమోదం లభించింది. దీంతో విస్తృత సంప్రదింపులు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు ఈ బిల్లులు వెళ్లనున్నాయి. అయితే అంతకంటే ముందే నిర్దిష్ట గడువులోగా జేపీసీ ఏర్పాటు కావాల్సి ఉంది.శుక్రవారంతో పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి. అంటే ఈలోపే జేపీసీని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ గడువు ఆయనకు ఎంతో కీలకం. ఆయన కమిటీని ఏర్పాటు చేసి.. త్వరగతిన పనిని అప్పగించాల్సి ఉంటుంది. జేపీసీలో రాజ్యసభ ఎంపీలు కూడా ఉంటారు. అధికార సభ్యులే కాకుండా ప్రతిపక్ష సభ్యులకూ జేపీసీలో స్థానం ఉంటుంది. గరిష్టంగా 31 మందిని తీసుకోవచ్చు. ఇందులో లోక్సభ నుంచే 21 మంది ఉంటారు. ఇందుకు సంబంధించి తమ సభ్యుల పేర్లను ప్రతిపాదించాలని ఇప్పటికే పార్టీలకు స్పీకర్ ఛాంబర్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. అయితే బీజేపీ లార్జెస్ట్ పార్టీ కావడంతో ఆ పార్టీకే కమిటీ చైర్మన్ పదవి వెళ్లే అవకాశాలెక్కువగా ఉన్నాయి. ఒకవేళ జేపీసీ ఏర్పాటు గనుక అనుకున్న టైంకి జరగకుంటే.. ప్రక్రియ మళ్లీ మొదటికి చేరుతుంది. అంటే.. మళ్లీ వచ్చే సెషన్లో మళ్లీ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.కాంగ్రెస్ తిరస్కరణమంగళవారం మధ్యాహ్నాం లోక్సభ ముందు జమిలి ఎన్నికల బిల్లులు వచ్చాయి. రాజ్యాంగ సవరణ బిల్లు (ఆర్టికల్ 129), కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టారు. అయితే బిల్లు ప్రవేశపెట్టడానికి అవసరమైన డివిజన్ ఓటింగ్ కంటే ముందు.. సభలో వాడివేడిగా చర్చ నడిచింది. కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఎన్డీయే సభ్య పార్టీలు మాత్రం మద్దతు ప్రకటించాయి. ఆపై విపకక్షాల అభ్యంతరాల నడుమ.. డివిజన్ ఓటింగ్ అనివార్యమైంది. ఈ ఓటింగ్లో బిల్లు ప్రవేశపెట్టడానికే ఆమోదం లభించింది. అయితే ఈ పరిణామం తర్వాత కాంగగ్రెస్ మరోసారి స్పందించింది. ‘ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ విరుద్ధం. ఈ బిల్లును మేము ఏ మాత్రం ఆమోదించం’’ అని స్పష్టం చేసింది.జేపీసీకి డెడ్లైన్ ఉంటుందా?జమిలి ఎన్నికల నిర్వహణపై జేపీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోదు. కేవలం విస్తృత సంప్రదింపుల ద్వారా నివేదికను మాత్రమే రూపొందిస్తుంది. ఇందుకోసం అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుతుంది. కమిటీలో సభ్యులుకానీ ఎంపీలతో అలాగే రాజ్యాంగపరమైన మేధావులు, న్యాయ కోవిదులతో చర్చిస్తుంది. ఎన్నికల సంఘంలో మాజీ అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతుంది. అసెంబ్లీ స్పీకర్లతోనూ చర్చలు జరపొచ్చని తెలుస్తోంది. ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ మాత్రం చేపడుతుంది. ఆపై తుది నివేదికను సమర్పిస్తుంది.జేపీసీకి 90 రోజుల గడువు ఇస్తారు. అవసరమైతే ఆ గడువును పొడిగించే అవకాశమూ ఉంటుంది. ఆపై అవసరమైన రాజ్యాంగ సవరణల కోసం పార్లమెంట్లో బిల్లులపై చర్చ నడుస్తుంది. ప్రధానంగా ఆర్టికల్ 83, ఆర్టికల్ 85, ఆర్టికల్ 172, ఆర్టికల్ 174, ఆర్టికల్ 356లకు సవరణ తప్పనిసరిగా జరగాలి.ఇదీ చదవండి: జమిలి ఎన్నికలు.. వచ్చే ఏడాదే ఓటింగ్ !! -
రాజ్యాంగం కన్నా... అధికారమే మీకు మిన్న
న్యూఢిల్లీ: రాజ్యాంగంపై కొంతకాలంగా అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం పార్లమెంటుకు చేరింది. ఈ విషయమై ఇరుపక్షాల మధ్య మధ్య వాడీవేడి చర్చకు శుక్రవారం లోక్సభ వేదికైంది. రాజ్యాంగ వజ్రోత్సవాలపై లోక్సభ చేపట్టిన రెండు రోజుల చర్చను ప్రభుత్వం తరఫున రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ప్రారంభించారు. కాంగ్రెస్కు ఎప్పుడూ అధికారంపైనే యావ అని, అందుకోసం రాజ్యాంగానికి నిరంతరం తూట్లు పొడుస్తూ వచ్చిందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ తన దశాబ్దాల పాలనలో వ్యవస్థల స్వయం ప్రతిపత్తిని ఎన్నడూ సహించింది లేదు. రాజ్యాంగ విలువలకు, స్ఫూర్తికి పాతర వేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయతి్నంచింది. అలాంటి పార్టీ నోట రాజ్యాంగ పరిరక్షణ వంటి మాటలు వినడం ఎబ్బెట్టుగా ఉంది’’ అంటూ ఎత్తిపొడిచారు. ఆయన విమర్శలకు కాంగ్రెస్ తరఫున నూతన ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా గట్టిగా కౌంటరిచ్చారు. అసలు దేశానికి రాజ్యాంగం కల్పించిన రక్షణ కవచానికి నిలువునా తూట్లు పొడిచిందే మోదీ ప్రభుత్వమంటూ దుయ్యబట్టారు. జడ్జి బి.హెచ్.లోయా మృతిపై తృణమూల్ సభ్యురాలు మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. సభలో ఆద్యంతం ఇరుపక్షాల నడుమ మాటల తూటాలు పేలాయి. నినాదాలు, అరుపులు, కేకల నడుమ రెండుసార్లు సభ వాయిదా పడింది. జేబులో పెట్టుకోవడమే నైజం రాజ్యాంగాన్ని దేశానికి తానిచి్చన కానుకగా కాంగ్రెస్ భ్రమ పడుతోందని రాజ్నాథ్ అన్నారు. రాజ్యాంగ కూర్పులో, అది ప్రవచించిన విలువల పరిరక్షణలో విపక్షాలు, కాంగ్రెసేతర నేతల పాత్రను నిరంతరం తక్కువ చేసి చూపేందుకే ప్రయతి్నంచిందని ఆరోపించారు. 1944లోనే పలువురు దేశభక్త నేతలు స్వతంత్ర హిందూస్తాన్ రాజ్యాంగాన్ని రూపొందించారని నాటి హిందూ మహాసభ ప్రయత్నాలను ఉద్దేశించి రక్షణ మంత్రి వ్యాఖ్యలు చేశారు. ‘‘పండిట్ మదన్మోహన్ మాలవీయ, లాలా లజపతిరాయ్, భగత్సింగ్, వీర సావర్కార్ వంటి నాయకులు రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కాకపోయినా వారి భావజాలాలు రాజ్యాంగంలో అడుగడుగునా ప్రతిఫలిస్తున్నాయి. వారంతా నిత్య స్మరణీయులు. అలాంటి మహా నాయకులపైనా మతవాద ముద్ర వేసిన చరిత్ర కాంగ్రెస్ది! రాజ్యాంగాన్ని హైజాక్ చేసేందుకు, దాని రూపురేఖలనే మార్చేసేందుకు దుస్సాహసం చేసి పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెసే. ఆ లక్ష్యంతోనే తన దశాబ్దాల పాలనలో రాజ్యాంగాన్ని చీటికీమాటికీ సవరిస్తూ వచ్చింది. ఎమర్జెన్సీ విధింపు మొదలుకుని విపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టడం, ఇందిర సర్కారు నిరంకుశత్వానికి అడ్డుకట్ట వేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులనే పక్కకు తప్పించడం దాకా ఇందుకు ఉదాహరణలన్నో! భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు తూట్లు పొడిచేందుకు కాంగ్రెస్కు చెందిన తొలి ప్రధాని నెహ్రూ కూడా ఏకంగా రాజ్యాంగాన్నే సవరించారు! అలాంటి పారీ్టకి చెందిన వాళ్లు నేడు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదం’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘పైగా విపక్ష నేతలు కొందరు కొద్ది రోజులుగా రాజ్యాంగ ప్రతిని జేబుల్లో పెట్టుకుని తిరుగుతున్నారు. చిన్నతనం నుంచీ వారు నేర్చుకున్నది అదే. ఎందుకంటే వారి కుటుంబ పెద్దలు కొన్ని తరాలుగా రాజ్యాంగాన్ని తమ జేబుల్లో పెట్టుకున్న వైనాన్ని చూస్తూ పెరిగారు మరి!’’ అంటూ రాహుల్గాంధీ తదితరులను ఉద్దేశించి రాజ్నాథ్ ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలను ఎన్డీఏ సభ్యులు చప్పట్లతో అభినందించగా విపక్ష సభ్యులు ‘సిగ్గు, సిగ్గు’ అంటూ నిరసించారు. -
కళ్లెదుటి ఫలితాలకు కారణమేంటి?
గడచిన సార్వత్రిక ఎన్నికలు అన్ని పక్షాలనూ సమంగా ఆశ్చర్యపరిచాయి. మునుపటికన్నా ఎక్కువ మెజారిటీ సీట్లు సాధిస్తామని ఆశించిన బీజేపీ కలలు కల్లలుకాగా, అందలం అందుకోవటమే ఆలస్యమన్నట్టు పొంగిపోయిన ఇండియా కూటమికి భంగపాటు తప్పలేదు. ఈ ఫలితాల ఆంతర్యమేమిటి... ఎవరెవరు ఎలా, ఎందుకు దెబ్బతిన్నారన్న అంశాలపై సీనియర్ పాత్రికేయుడు, టీవీ న్యూస్ ప్రెజెంటర్ రాజ్దీప్ సర్దేశాయి వెలువరించిన తాజా పుస్తకం ‘2024 ది ఎలక్షన్ దట్ సర్ప్రైజ్డ్ ఇండియా’. ఈ అసమ సమాజంలో నిత్యం దగా పడుతున్న సగటు మనిషి మౌనంగా, ప్రశాంతంగా ఉన్నట్టు కనబడుతూనే నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా ఇచ్చిన తీర్పు ఇది అంటారు రాజ్దీప్. అందుకే ఈ ఎన్నికల అసలు విజేత సగటు వోటరేనని చెబుతారు.పార్లమెంటరీ రాజకీయాలపై ఎంతో ఆసక్తి ఉన్నవారికి సైతం వెగటుపుట్టించే విధంగా మన ఎన్నికల తంతు తయారైంది. ఇంతటి రణగొణ ధ్వనులమధ్య కూడా నాయకులతో చర్చించటం, సాధారణ పౌరులను కలవటం, ఎవరివైపు మొగ్గు ఉందో అంచనావేయటం వివిధ చానెళ్లు చేస్తున్న పని. దీన్ని ఎంతో నిష్ఠగా, దీక్షగా నెరవేర్చే కొద్దిమంది పాత్రికేయుల్లో రాజ్దీప్ సర్దేశాయ్ ఒకరు.ఉత్తేజాన్నివ్వని హ్యాట్రిక్!రాజ్దీప్ తాజా పుస్తకం ‘2024 ది ఎలక్షన్ దట్ సర్ప్రైజ్డ్ ఇండియా’ 528 పేజీల సమగ్ర గ్రంథం. ఇప్పుడే కాదు... ‘2014 ది ఎలక్షన్ దట్ ఛేంజ్డ్ ఇండియా’ మొదటి పుస్తకంగా, 2019 ‘హౌ మోదీ వన్ ఇండియా’ రెండో పుస్తకంగా వచ్చాయి. తాజా పుస్తకం మూడోది. దీనికి ‘హ్యాట్రిక్ 2024’ అన్న శీర్షిక పెడదామనుకున్నారట. కానీ ఫలితాలు విశ్లేషించాక పునరాలోచనలో పడ్డారట. రచయిత దృక్ప థమేమిటో పుస్తకం శీర్షికే వెల్లడిస్తుంది. స్వతంత్ర భారతంలో నెహ్రూ తర్వాత వరసగా మూడోసారి అందలం అందుకున్నది మోదీ మాత్రమే! ఆ రకంగా ఆయనకైనా, బీజేపీకైనా ఇది ఘనవిజయం కిందే లెక్క. కానీ 272 అనే ‘మేజిక్ మార్క్’ ఎక్కడ? కనీసం దాని దరిదాపుల్లోకి కూడా రాలేక 240 దగ్గరే బీజేపీ ఆగిపోయింది. అందుకే ‘హ్యాట్రిక్’ విజయోత్సవ హోరు లేదు. 2024 ఎన్నికలు అందరినీ సమంగా ఆశ్చర్యపరిచాయి. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అని ప్రధాని నరేంద్ర మోదీ నినాదమిచ్చి తమ శ్రేణుల్ని ముందుకురికించారు.అందరం కలిశాం గనుక, ‘ఇండియా’ అన్న సంక్షిప్తీకరణ పదం దొరి కింది గనుక విజయం ఖాయమన్న భ్రమలో ప్రతిపక్ష కూటమి నాయ కులున్నారు. లాక్డౌన్తో జనం ఆర్థిక అగచాట్లు, వేలాది కిలోమీటర్ల నడక, ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం, పీఎమ్ కేర్స్ ఫండ్, సాగుచట్టాల వ్యతిరేక ఉద్యమం, సీఏఏ, విపక్ష సర్కార్ల కూల్చివేతలు, విద్వేష పూరిత ప్రసంగాలు... ఇవన్నీ ఎన్డీయే ప్రభుత్వంపై ఏవగింపు కలిగించాయని ‘ఇండియా’ కూటమి నమ్మింది. విపక్ష నేతలపై ఈడీ, ఐటీ దాడులు, అరెస్టులు విపక్ష వ్యూహాన్ని ఏదో మేర దెబ్బతీసిన మాట వాస్తవమే. కానీ ఇందుకే మెజారిటీ సాధనలో ‘ఇండియా’ విఫలమైందని చెప్పటం కష్టమంటారు రాజ్దీప్. బిహార్ సీఎం నితీష్కుమార్ను చేజార్చుకోవటం, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ విషయంలో తప్ప టడుగుల వంటివి దెబ్బతీశాయన్నది ఆయన విశ్లేషణ. ఇలాంటివి చోటుచేసుకోనట్టయితే బీజేపీకి ఇప్పుడొచ్చిన 240 స్థానాల్లో మరో 40 వరకూ కోతపడేవని రాజ్దీప్ అభిప్రాయం. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎన్డీయేగా బరిలోకి దిగినా బీజేపీ సొంతంగానే మెజా రిటీ సాధించుకుంది. కేవలం మిత్ర ధర్మాన్ని పాటించి మాత్రమే భాగ స్వామ్య పక్షాలకు పదవులిచ్చింది. ఇప్పుడలా కాదు... నిలకడలేని టీడీపీ, జేడీ(యూ) వంటి పార్టీల దయాదాక్షిణ్యాలపై నెట్టుకురాక తప్పదు.ఒక్కటైన దళిత, ముస్లిం వర్గాలుగతంలో ఇతర వర్గాలతోపాటు వెన్నుదన్నుగా నిలిచిన దళిత ఓటుబ్యాంకు 2024 ఎన్నికల్లో బీజేపీకి దూరమైందని రాజ్దీప్ చెబు తారు. బీజేపీకి భారీ మెజారిటీ వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని ఆ వర్గాలు భయపడ్డాయి. కంచుకోట అనదగ్గ యూపీలో 2022లో ‘బుల్డోజర్ మ్యాండేట్’ వస్తే రెండేళ్లు గడిచేసరికల్లా ‘మండలైజ్డ్ కుల స్పృహ’ పెరిగి దళిత ఓటుబ్యాంకుకు అక్కడ 10 శాతం కోతపడిందని ఆయన విశ్లేషణ. వీరికి ముస్లింల ఓటు బ్యాంకు తోడైందంటారు. 2015–16 నుంచి 2022–23 మధ్య సంఘటిత రంగంలో 63 లక్షలు, అసంఘటిత రంగంలో కోటీ 60 లక్షల ఉద్యోగాలు ఆవిరయ్యాయన్న ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఐఆర్ఆర్) సంస్థ గణాంకాలను రాజ్దీప్ ఉటంకిస్తారు. రాజ్దీప్ పుస్తకం కళ్ల ముందు జరిగిన అనేక పరిణామాల వెనకున్న కారణాలేమిటో, నాయకుల అతి విశ్వాసంలోని అంతరార్థమేమిటో విప్పిజెబుతుంది. మనమంతా చూస్తున్నట్టు ఇప్పుడేలుతున్నది నిజంగా బీజేపీ యేనా? రాజ్దీప్ లెక్కలు చూస్తే క్షణకాలమైనా ఆ ప్రశ్న రాకమానదు. ఈసారి ఎన్నికల్లో ఏకంగా 114 మంది కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన నేతలకు బీజేపీ టిక్కెట్లు వచ్చాయట. బీజేపీ ‘కాంగ్రెస్ ముక్త భారత్’ నినాదం కాస్తా ‘కాంగ్రెస్ యుక్త బీజేపీ’ అయిందంటారాయన. అసలు జాతీయ రాజకీయాల్లో మోదీ ఆగమనానికి ముందే ఒక పార్టీగా కాంగ్రెస్ మతాన్ని పులుముకోవడం, వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడం, నిలదీసిన సొంత పార్టీ నేతలపై సైతం అక్రమ కేసులు మోపి జైళ్లపాలు చేయడం వగైరాలు పెంచింది. ఆ రకంగా మోదీ రాకకు ముందే ‘మోదీయిజాన్ని’ పరిచయం చేసింది. ఆ నొప్పి ఎలా ఉంటుందో దశాబ్దకాలం నుంచి చవిచూస్తోంది.ఫలిస్తున్న ‘ప్రచారయావ’ప్రచారం విషయంలో మోదీ తీసుకునే శ్రద్ధను రాజ్దీప్ వివరి స్తారు. గుజరాత్లో బీజేపీ కార్యక్రమాలపై సింగిల్ కాలమ్ వార్త ఇవ్వ టానికి కూడా మీడియా సిద్ధపడని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా రాష్ట్రంలోని 182 నియోజకవర్గాల నుంచీ ప్రచార రథాలను తరలించి అహ్మదాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించాలని ఆయన ప్రతి పాదించారట. ఇందువల్ల డబ్బు ఖర్చుతప్ప ఒరిగేదేమీ లేదని పార్టీ నాయకులు గుసగుసలు పోగా, ర్యాలీ జరిగిన మర్నాడు ఎప్పుడూ లేనట్టు మీడియాలో అది ప్రముఖంగా వచ్చిందట. ప్రచారం భారీ స్థాయిలో చేయటం అప్పటినుంచీ మోదీకి అలవాటు. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ వెనకా ఈ వ్యూహమే ఉంది.‘గోదీ మీడియా’ ప్రస్తావనఅమిత్ షా, రాజ్నాథ్ సింగ్, రాహుల్ గాంధీ, శరద్ పవార్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ తదితరుల తీరుతెన్నులపై రాజ్ దీప్ వివరంగానే ప్రస్తావించారు. సద్విమర్శలను వ్యక్తిగతంగా తీసు కుని బెదిరించటంలో, అమర్యాదగా ప్రవర్తించటంలో అమిత్ మాల వీయ వంటి కొందరు బీజేపీ నేతల ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పారు. మరోపక్క మీడియా మొత్తాన్ని చాలామంది ఒకే గాటనకట్టి ‘గోదీ మీడియా’గా ముద్రేయటంపై విచారిస్తూనే కొన్ని ప్రధాన చానెళ్ల, పత్రికల తీరుపై ఈ గ్రంథంలో నిశితమైన విమర్శ వుంది. తాను ఈసారి ఎన్డీయే ఓడుతుందని భావించకపోయినా ‘మేజిక్ ఫిగర్’ దాటుతుందని గుడ్డిగా నమ్మిన వైనాన్ని వివరిస్తారు. అదే సమ యంలో ఎప్పుడూ అంచనాలు తప్పని ప్రదీప్ గుప్తా వంటి ప్రఖ్యాత సెఫాల జిస్టు సైతం ఎన్డీయేలో ఒక్క బీజేపీకే 322–340 మధ్య వస్తాయని చెప్పడాన్ని వెల్లడిస్తారు. సుదీర్ఘకాలం ఢిల్లీలో పాత్రికేయు డిగా పని చేసిన అనుభవం, ఉన్నత స్థానాల్లోని వారితో కలిగిన పరి చయాలు పుస్తక రచనలో రాజ్దీప్కు బాగా అక్కరకొచ్చాయి. ‘ఈవీఎంల గారడీ’ ఎక్కడ?అయితే ఒక విమర్శ – ఈవీఎంల వ్యవహారంపై అసోసియేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) ఏకరువు పెట్టిన అంశాల గురించి ప్రస్తావించినా ఆ ఎపిసోడ్ను లోతుగా చర్చించకపోవటం లోటనే చెప్పాలి. వాస్తవానికి దానిపై విడిగా పుస్తకమే రావాలి. మొత్తం 543 నియోజకవర్గాలకుగాను 537 చోట్ల ఈవీఎంలలో పోలైన ఓట్లకూ, లెక్కించిన ఓట్లకూ పొంతన లేదని ఏడీఆర్ బయటపెట్టింది. ‘ఇది కేవలం సాంకేతిక లోపమే... దీనివల్ల అంతిమ ఫలితం తారుమారు కాబోద’ని వాదించటానికి ముందు కనీసం అందుకు హేతుబద్ధమైన సంజాయిషీ ఇవ్వాల్సిన బాధ్యతని ఎన్నికల సంఘం గుర్తించక పోవటం విచారించదగ్గది. మొదలుపెడితే చివరి వరకూ చదివించే శైలితో, ఆశ్చర్యపరిచే సమాచారంతో ఈ పుస్తకం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇలాంటి గ్రంథం ఇంగ్లిష్లో మాత్రమే సరి పోదు. ప్రాంతీయ భాషల్లో సైతం వస్తేనే ప్రజల అవగాహన పెరుగుతుంది.తెంపల్లె వేణుగోపాలరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడుvenujourno@gmail.com -
మహారాష్ట్రలో ఎన్డీయే గెలుపునకు అసలు కారణం అదేనా?
ముంబై: శరద్ పవార్, ఉద్దవ్ థాక్రే వర్గాలకు మరాఠీలు పెద్ద షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఇండియా కూటమి ఘోర పరాభవం చవిచూసింది. మహారాష్ట్రలో మరోసారి ఎన్డీయే పాగా వేయబోతోంది. ఫలితాల వేళ.. మహాయుతి కూటమి శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. మెజారిటీని ఇప్పటికే దాటేయగా.. ప్రభుత్వ ఏర్పాటునకు కసరత్తులు జరుగుతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. రెండు వందలకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది మహాయుతి కూటమి(ఎన్డీయే). ఇందులో బీజేపీ 100+తో అతిపెద్ద పార్టీగా నిలవడం గమనార్హం. అయితే.. మహారాష్ట్రలో ఎన్డీయే ఫ్లస్ అయిన అంశాలను పరిశీలిస్తే.. శివసేన(షిండే), ఎన్సీపీ(శరద్ పవార్).. మరికొన్ని పార్టీలను చేర్చుకుని బీజేపీ మహాయుతి కూటమిగా మహారాష్ట్ర ఎన్నికలకు వెళ్లింది. శివసేన, ఎన్సీపీలో చీలికలతో ఈ ఎన్నికల్లో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ కొనసాగింది. అయితే మహా ప్రజలు మాత్రం మహాయుతికే పట్టం కట్టారు. ఎన్నికల హామీలు, నినాదాలు మహాయుతి కూటమికి కలిసొచ్చాయి. లాడ్లీ బెహనా యోజన పథకం, మహిళలకు రూ.2,100 ఆర్థిక సాయం ఫ్లస్ అయ్యాయి. పథకం కులగణనను వ్యతిరేకిస్తూ మోదీ ఏక్తో సేఫ్ హై నినాదం బాగా పని చేసింది. ఓబీసీలు, ఆదివాసీలను విభజిస్తే నష్టమంటూ చేసిన ప్రచారం బాగా ప్రజల్లోకి వెళ్లిందనే విశ్లేషణలకు నడుస్తున్నాయి. -
ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అక్రమాలు జరిగాయని శివసేన(ఉద్ధవ్) అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) ట్యాంపరింగ్ చేసి మహాయుతి గెలిచిందని మండిపడ్డారు. తమకు దక్కాల్సిన సీట్లను దొంగిలించిందని అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ కూటమి విజయం వెనుక పెద్ద కుట్ర ఉందని తేల్చిచెప్పారు.#WATCH | As Mahayuti has crossed halfway mark in Maharashtra, Shiv Sena UBT leader Sanjay Raut says, "They have done some 'gadbad', they have stolen some of our seats...This cannot be the public's decision. even the public does not agree with these results. Once the results are… pic.twitter.com/Qxx6a0mKsW— ANI (@ANI) November 23, 2024 బిలియనీర్ గౌతమ్ అదానీ సాయంతో ఆ కూటమి నెగ్గిందని విమర్శించారు. అదానీ బీజేపీకి ‘లాడ్లీ భాయ్’గా మారిపోయాడని ధ్వజమెత్తారు. ఎన్నికల ఫలితాలు ప్రజల వాస్తవ తీర్పును ప్రతిబింబించడం లేదని చెప్పారు. ప్రజలు ఏం కోరుకున్నారో తమకు తెలుసని, మహాయుతి పాలన పట్ల వారు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఈ ఫలితాలను ప్రజా తీర్పుగా తాము భావించడం లేదన్నారు. ప్రజలు మహాయుతికి ఆఖండమైన మెజార్టీ కట్టబెట్టారంటే తాము విశ్వసించడం లేదని సంజయ్ రౌత్ తేల్చిచెప్పారు. Mumbai | As Mahayuti has crossed the halfway mark in Maharashtra, Shiv Sena UBT leader Sanjay Raut says, "From what we are seeing, it seems that something is wrong. This was not the decision of the public. Everyone will understand what is wrong here. What did they (Mahayuti) do… pic.twitter.com/COjoVJpfi3— ANI (@ANI) November 23, 2024 -
అట్టుడుకుతున్న మణిపూర్.. సంగ్మా కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: బీజేపీ ఆధ్వర్యంలోని మణిపుర్ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధ్యక్షుడు, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా ఆదివారం(నవంబర్ 17) ప్రకటించారు.‘మణిపూర్లో సంక్షోభాన్ని పరిష్కరించడంలో సీఎం బీరేన్ సింగ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తాజా హింసాత్మక ఘటనల్లో అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి మా మద్దతును తక్షణమే ఉపసంహరించుకుంటున్నాం’ అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాసిన లేఖలో ఎన్పీపీ తెలిపింది. మణిపుర్ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లున్నాయి. వీటిలో 53స్థానాలతో ఎన్డీయే అధికారంలో ఉంది. ఈ 53 సీట్లలో ఎన్పీపీకి ఏడు సీట్లున్నాయి.హింసాత్మక ఘటనల నేపథ్యంలో మణిపుర్ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఆదివారం(నవంబర్ 17)ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో శాంతిస్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహారాష్ట్రలో తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే అమిత్ షా ఈ సమావేశాన్ని నిర్వహించారు. కాగా, మణిపుర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్తోపాటు ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల నివాసాలపై నిరసనకారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. -
Jharkhand Assembly Election 2024: ప్రాంతాల పోరులో... పైచేయి ఎవరిదో!
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ అస్థిరతకు మారుపేరైన జార్ఖండ్ మరోసారి అసెంబ్లీ ఎన్నికల పోరుకు సిద్ధమైంది. ప్రజాకర్షక పథకాల సాయంతో అధికారాన్ని నిలబెట్టుకోవాలని జేఎంఎం సారథ్యంలోని ఇండియా కూటమి ఆశపడుతోంది. జనాభాలో మెజారిటీ అయిన గిరిజనులతో పాటు ముస్లిం మైనారిటీల్లో సీఎం హేమంత్ సోరెన్కు ఉన్న ఆదరణ గట్టెక్కిస్తుందని నమ్ముతోంది. ఎన్డీఏ సారథి బీజేపీ మాత్రం ఐదేళ్లనాడు చేజారిన అధికారాన్ని ఎలాగైనా ఒడిసిపట్టాలని ఉవి్వళ్లూరుతోంది.హేమంత్ తదితరుల అవినీతినే ప్రధానాస్త్రంగా చేసుకుంది. గత ఎన్నికల్లో ముఖం చాటేసిన గిరిజనులను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. వలసలు తదితరాలను ప్రస్తావిస్తూ వారిని ఆకట్టుకునే పనిలో పడింది. 81 అసెంబ్లీ స్థానాల్లో 43 సీట్లకు బుధవారం తొలి విడతలో పోలింగ్ జరగనుంది. మిగతా 38 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరుగుతుంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలెన్ని ఉన్నా జనాభాలో 35 శాతంగా ఉన్న గిరిజనులే మరోసారి ఫలితాన్ని నిర్దేశించనున్నారు.ప్రాంతాలవారీగా చూస్తే గిరిజనులు ఏకంగా 60 శాతముండే కొల్హన్, సంథాల్ పరగణాల్లో జేఎంఎంకు తిరుగులేని పట్టుంది. 25 అసెంబ్లీ స్థానాలున్న కీలకమైన నార్త్ చోటానాగపూర్తో పాటు ఎస్సీ ప్రాబల్య పాలము ప్రాంతంపై బీజేపీ ఆధిపత్యం సాగుతోంది. ఐదో ప్రాంతమైన సౌత్ చోటానాగపూర్లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు కూటములు పోటాపోటీగా తలపడ్డాయి. సంథాల్ పరగణా అత్యంత వెనకబడ్డ జిల్లాలున్న ఈ ప్రాంతం ఇటు బిహార్, అటు పశ్చిమబెంగాల్తో సరిహద్దులు పంచుకుంటుంది. ఇక్కడి 18 అసెంబ్లీ స్థానాల్లో ఏడు ఎస్టీ, ఒకటి ఎస్సీ రిజర్వుడు సీట్లు. ఎస్సీలు 8 శాతముంటే ఎస్టీలు 28, ముస్లింలు 23 శాతమున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో: ఇండియా కూటమి ఏకంగా 13 స్థానాలు గెలుచుకోగా బీజేపీకి 5 మాత్రమే దక్కాయి. లోక్సభ ఎన్నికల్లో: 10 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఇండియా కూటమి ఆధిపత్యం సాగగా 8 బీజేపీని ఆదరించాయి. కొల్హాన్ ఒడిశా, పశ్చిమబెంగాల్తో సరిహద్దులు పంచుకునే ఈ ప్రాంతంలో 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. వాటిలో ఒక ఎస్సీ, 9 ఎస్టీ స్థానాలున్నాయి. ఇక్కడ ఎస్టీలు ఏకంగా 42 శాతం కాగా ఎస్సీలు కేవలం 5 శాతమే ఉంటారు. ముస్లింలు 6 శాతమున్నారు. ఈసారి అధికారం దక్కాలంటే నార్త్ చోటానాగ్పూర్లో ఆదరణను నిలబెట్టుకుంటూ సంతాల్, కొల్హాన్ ప్రాంతాల్లో పాగా వేయడం ఆ పారీ్టకి తప్పనిసరి. ఇందుకోసం ఇటీవలే జేఎంఎం నుంచి వచ్చిన మాజీ సీఎం చెంపయ్ సోరెన్పై బీజేపీ ఆశలు పెట్టుకుంది. అక్రమ వలసల అంశం ఈ ప్రాంతంలో తమకు బాగా కలిసొస్తుందని అంచనా వేస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో: ఇండియా కూటమికి 13 స్థానాలు దక్కగా బీజేపీ పూర్తిగా చతికిలపడింది లోక్సభ ఎన్నికల్లో: ఏకంగా 8 అసెంబ్లీ స్థానాల పరిధిలో బీజేపీకి ఆదరణ దక్కింది. పాలము ఇటు బిహార్, అటు ఛత్తీస్గఢ్తో సరిహద్దులున్న ప్రాంతం. 9 అసెంబ్లీ స్థానాల్లో రెండు ఎస్సీ, ఒక ఎస్టీ సీట్లున్నాయి. 25 శాతం ఎస్సీలుండటం బీజేపీకి కలిసొచ్చే అంశం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో: ఇండియా కూటమికి ఐదు సీట్లు దక్కగా బీజేపీ మూడింటితో సరిపెట్టుకుంది. లోక్సభ ఎన్నికల్లో: ఏకంగా 8 అసెంబ్లీ సీట్ల పరిధిలో బీజేపీ ఆధిపత్యమే సాగింది. నార్త్ చోటానాగ్పూర్ 25 అసెంబ్లీ స్థానాలున్న అతి కీలక ప్రాంతం. బిహార్, పశ్చిమబెంగాల్తో సరిహద్దులున్నాయి. ఈ ప్రాంతంలో ఒక్క ఎస్టీ రిజర్వుడు స్థానం కూడా లేకపోవడం విశేషం. ఇక్కడ బిహార్ తదితర రాష్ట్రాల నుంచి వలస వచి్చన వాళ్లు ఎక్కువ. 17 శాతం ఎస్సీలు, 16 శాతం ముస్లింలుంటే ఎస్టీలు కేవలం 9 శాతమే ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో: బీజేపీ 10, ఇండియా కూటమి 11 సీట్లు గెలుచుకున్నాయి. లోక్సభ ఎన్నికల్లో: ఏకంగా 24 అసెంబ్లీ స్థానాల పరిధిలో బీజేపీ హవాయే సాగింది. ఈ పరిణామం కమలనాథుల్లో హుషారు పెంచింది. సౌత్ చోటానాగ్పూర్ ఛత్తీస్గఢ్, ఒడిషాలతో సరిహద్దులున్న ఈ ప్రాంతం 15 అసెంబ్లీ స్థానాలకు నిలయం. 11 ఎస్టీ, ఒకే ఒక్క ఎస్సీ స్థానమున్నాయి. ఇక్కడ ఎస్టీలు ఏకంగా 51 శాతముంటారు. ముస్లింలు 11 శాతం కాగా ఎస్సీలు కేవలం 5 శాతమున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో: ఇండియా కూటమి 8, బీజేపీ ఐదు సీట్లు గెలుచుకున్నాయి. లోక్సభ ఎన్నికల్లో: బీజేపీకి ఎదురుగాలి వీచింది. ఆ పార్టీ 4 అసెంబ్లీ స్థానాల పరిధిలోనే మెరుగైన ప్రదర్శన చేసింది. మిగతా 11 చోట్లా ఇండియా కూటమి హవాయే సాగింది.67 శాతం రెడ్ అలర్ట్ స్థానాలే! 174 మందిపై కేసులు 235 మంది కోటీశ్వరులుసాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్లో బుధవారం తొలి దశలో పోలింగ్ జరగనున్ను 43 అసెంబ్లీ స్థానాల్లో 29 రెడ్ అలర్ట్ నియోజకవర్గాలున్నాయి! బరిలోని అభ్యర్థుల్లో ముగ్గురు, అంతకంటే ఎక్కువ మందిపై క్రిమినల్ కేసులుంటే వాటిని రెడ్ అలర్ట్ స్థానాలుగా పరిగణిస్తారు. ఇక 174 (26%) మందిపై క్రిమినల్ కేసులున్నట్టు జార్ఖండ్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్) వెల్లడించాయి.వీరిలో ఇందులో 127 (19%) మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. బీజేపీకి చెందిన 36 మంది అభ్యర్థుల్లో 20 మంది (56%), 17 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 11 మంది (65%), 23 మంది జేఎంఎం అభ్యర్థుల్లో 11 (48%) మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 11 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులున్నాయి. అభ్యర్థుల్లో 235 మంది (34%) కోటీశ్వరులు. బీజేపీలో 30 మంది (83%), కాంగెస్లో 18 మంది (78%) కోటీశ్వరులున్నారు. -
Jharkhand Assembly Elections 2024: ఆదివాసీ సీట్లే కీలకం!
ఎన్డీఏ, ఇండియా కూటముల అమీతుమీకి జార్ఖండ్లో సర్వం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల పోరులో భాగంగా 13వ తేదీన తొలి దశలో 43 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. మిగతా 38 సీట్లకు నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు పోలింగ్ జరగనుంది. 23న రెండు రాష్ట్రాల ఫలితాలు ఒకేసారి వెల్లడవుతాయి. జార్ఖండ్లో సంఖ్యాధికులైన ఆదివాసీలే ఈసారి కూడా పార్టీ ల గెలుపోటములను నిర్ణయించనున్నారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాల్లో 28 ఎస్టీ రిజర్వుడు సీట్లే కావడం విశేషం. వాటితో పాటు పలు ఇతర అసెంబ్లీ స్థానాల్లోనూ వారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. దాంతో ఆదివాసీలను ప్రసన్నం చేసుకోవడానికి అధికార ఇండియా కూటమి, విపక్ష ఎన్డీఏ సంకీర్ణ సారథి బీజేపీ పోటీ పడుతున్నాయి. 2019 ఎన్నికల్లో 28 ఎస్టీ స్థానాలకు గాను ఇండియా కూటమి సారథి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఏకంగా 19 సీట్లలో పాగా వేయడం విశేషం. మొత్తమ్మీద 26 ఎస్టీ స్థానాలూ ఇండియా కూటమి ఖాతాలోకే వెళ్లాయి. బీజేపీకి కేవలం రెండే ఎస్టీ స్థానాలు దక్కాయి. అందుకే ఈసారి ఆదివాసీ స్థానాల్లో పాగా వేయడమే ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదలుకుని బీజేపీ అగ్ర నేతలంతా కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. వారిపై వరాల జల్లు కురిపిస్తున్నారు. బంగ్లాదేశీ చొరబాటుదారులకు జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వం ఆదివాసీ హోదా కల్పిస్తూ వారి పొట్ట కొడుతోందని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రధానాస్త్రంగా మలచుకున్నారు. సీఎం హేమంత్ సోరెన్ అవినీతిలో పీకల్లోతున మునిగిపోయారంటూ ఊదరగొడుతున్నారు. బీజేపీని గెలిపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందని ప్రచారం చేస్తున్నారు. ఇండియా కూటమి తరఫున హేమంత్కు దన్నుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్ గాంధీ ప్రచార రంగంలో ఉన్నారు. ప్రియాంక కూడా ఒకట్రెండుసార్లు ప్రచారంలో పాల్గొన్నారు. ఈసారి ఇండియా కూటమిలో జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, వామపక్షాలు 3 చోట్ల పోటీలో ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్యూ), జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం), జేడీ(యూ) కలసి పోటీ చేస్తున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం 30 స్థానాలు గెలిచి ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 25 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్కు 16 దక్కాయి. జేవీఎంకు 3, ఏజేఎస్యూకు 2 సీట్లొచ్చాయి. కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో జేఎంఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బంధువులు, వారసుల జోరు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారసుల హడావుడి మామూలుగా లేదు. ఈసారి ఏకంగా 25కు పైగా స్థానాల్లో నేతల బంధుమిత్రులు బరిలో ఉన్నారు. జేఎంఎంను వీడి బీజేపీలో చేరిన మాజీ సీఎం చంపయ్ సోరెన్ కుమారుడు బాబూలాల్ సోరెన్, మరో మాజీ సీఎం రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమా సాహు, ఇంకో మాజీ సీఎం అర్జున్ ముండా భార్య మీరా, మరో మాజీ సీఎం మధు కోడా భార్య గీత తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. జేఎంఎం నుంచి సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన ఈసారి ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. ఆయన సోదరుడు బసంత్ సోరెన్, వదిన సీతా సోరెన్ కూడా పోటీలో ఉన్నారు. జేఎంఎం నుంచి 15 మంది దాకా నేతల వారసులు రంగంలో దిగారు. వలసదారులే ప్రధానాంశం! నిరుద్యోగం, ధరల పెరుగుదల, సాగు సంక్షోభం, గ్రామీణుల్లో నిరా శా నిస్పృహలు తదితర సమస్యలె న్నో జార్ఖండ్ను పట్టి పీడిస్తున్నాయి. అయితే బీజేపీ వ్యూహాత్మకంగా వలసల అంశాన్ని తలకెత్తుకుంది. వలసదారుల సంక్షోభాన్ని ప్రధాన ఎన్ని కల అంశంగా మార్చేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. జా ర్ఖండ్ జనాభాలో ఏకంగా 35 శాతం మంది వలసదారులే కావడం విశేషం. బంగ్లాదేశ్ నుంచి వచి్చపడుతున్న వలసలు ఆదివాసీల మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని బీజేపీ నేతలంతా గట్టిగా ప్రచారం చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సీఎం అభ్యర్థిపై ఫడ్నవిస్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిస్తే సీఎం పదవి చేపట్టబోయేది ఎవరో బీజేపీ కీలక నేత,డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హింట్ ఇచ్చారు. శివసేనకు చెందిన వ్యక్తే తమ కూటమి తరపునన సీఎం అయ్యే అవకాశాలున్నాయని చెప్పకనే చెప్పారు. బుధవారం(అక్టోబర్16) ముంబయిలో ఎన్డీఏ ప్రభుత్వ రిపోర్డు కార్డు విడుదల చేస్తూ ఫడ్నవిస్ మాట్లాడారు. తమ చీఫ్ మినిస్టర్ ఇక్కడే ఉన్నారని,దమ్ముంటే మహావికాస్అఘాడీ(ఎంవీఏ) కూటమి సీఎం అభ్యర్థిని ప్రకటించాలని ఎన్సీపీ(శరద్పవార్) పార్టీ చీఫ్ శరద్పవార్కు సవాల్ విసిరారు. మాకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రకటించాల్సిన అవసరం లేదు. మా సీఎం ఇక్కడే ఉన్నారు. ఎంవీఏ సీఎం అభ్యర్థిని ప్రకటించడం లేదు ఎందుకంటే వాళ్లకు గెలుస్తామన్న నమ్మకం లేదు. శరద్పవార్కు సవాల్ విసురుతున్నా. ఎంవీఏ కూటమి సీఎం అభ్యర్థిని ప్రకటించండి’అని ఫడ్నవిస్ శరద్పవార్ను కోరారు. కాగా, ఎన్డీఏ కూటమిలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా సీఎం పదవిని ఆశిస్తున్న విషయం తెలిసిందే. నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఇదీ చదవండి: షిండే సీఎం కాదు.. కాంట్రాక్టర్ మంత్రి -
కూటమి ఎంపీలను ఏకిపారేసిన స్టీల్ ప్లాంట్ కార్మికులు
-
ఇదేమి మిత్ర‘ధర్మం’?
సాక్షి, అమరావతి: నామినేటెడ్ పదవుల పంపిణీలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరుపై మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఇదేమి మిత్రధర్మమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మొత్తం 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లను ప్రకటించగా అందులో జనసేనకు 3, బీజేపీకి కేవలం ఒకటి ఇచ్చారు. ప్రకటించిన కార్పొరేషన్లలో ఛైర్మన్లు, ఒక వైస్ ఛైర్మన్తోపాటు కొన్నింటిలో డైరెక్టర్ పదవులుండడంతో వాటినీ భర్తీ చేశారు. డైరెక్టర్లతో కలిసి మొత్తం 99 నామినేటెడ్ పదవులు భర్తీ చేసినట్లు టీడీపీ ప్రకటన విడుదల చేసింది.కీలకమైన కార్పొరేషన్లను చంద్రబాబు తమ పార్టీ వారికే ఇచ్చుకున్నారు. ఆర్టీసీ, ఏపీఐఐసీ, శాప్, హౌసింగ్ బోర్డు, సీడాప్, మారిటైమ్ బోర్డు, మార్క్ఫెడ్, ఏపీటీడీసీ వంటి ప్రధానమైన కార్పొరేషన్లు టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. జనసేనకు ఇచ్చిన మూడు కార్పొరేషన్లు కూడా అప్రాధాన్యమైనవేనని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. పెద్దగా గుర్తింపు లేని, ఎవరూ పట్టించుకోని సివిల్ సప్లైస్ కార్పొరేషన్, టిడ్కో, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్లను జనసేనకు కేటాయించారు. బీజేపీకి 20 సూత్రాల కమిటీ చైర్మన్ పదవి ఒకటే దక్కింది. అది కూడా టీడీపీ పాత నాయకుడు లంకా దినకర్కు ఇవ్వడంతో అది పేరుకు బీజేపీ ఖాతాయే తప్ప పదవి టీడీపీదేనని చెబుతున్నారు.ఒరిజినల్ బీజేపీ నేతలు ఎంతో మంది ఉండగా వారెవ్వరినీ పట్టించుకోకుండా టీడీపీ నుంచి వలస వచ్చిన నాయకుడికి ఇవ్వడంపై ఆ పార్టీలో అసంతృప్తి నెలకొంది. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే బీజేపీ ముఖ్య నాయకులందరినీ పక్కన పెట్టి ఆ పార్టీలో ఉన్న తన శిష్యుడైన లంకా దినకర్కు పదవి ఇచ్చినట్లు చెబుతున్నారు. పొత్తు ధర్మాన్ని విస్మరించి కంటి తుడుపుగా ఒక పదవి ఇవ్వడం ఏమిటని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. లోపించిన సామాజిక సమతూకంమరోవైపు నామినేటెడ్ పదవుల్లో చంద్రబాబు ఓసీలకే ప్రాధాన్యత ఇవ్వడంపై మిగతా సామాజికవర్గాల నేతలు గుర్రుగా ఉన్నారు. 20 పదవుల్లో 9 ఓసీలకే కట్టబెట్టారు. బీసీల పార్టీ అని చెప్పుకుంటున్నా ఏడు పదవులే ఇచ్చారని వెనుకబడిన వర్గాల నేతలు వాపోతున్నారు. ఎస్సీలకు రెండు, ఎస్టీ ఒకటి, మైనారిటీలకు ఒకటి కేటాయించి చేతులు దులుపుకున్నారని ఆ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తాజా పదవుల పంపకంపై టీడీపీ నేతలు సైతం అసహనంగానే ఉన్నారు. పదవులు ఆశించిన ఆలపాటి రాజా, దేవినేని ఉమామహేశ్వరరావు వంటి ముఖ్యమైన నేతలకు మొండి చేయే చూపారు. దీంతో సీనియర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. -
జమిలికి జై
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలు ఈ టర్మ్లోనే ఉంటాయని కొద్ది రోజులుగా స్పష్టమైన సంకేతాలిస్తూ వస్తున్న మోదీ సర్కారు ఆ దిశగా కీలక ముందడుగు వేసింది. దేశమంతటా అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన ’ఒక దేశం ఒకే ఎన్నిక’ ప్రతిపాదనకు జై కొట్టింది. ఈ మేరకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలోని ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫార్సులకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దాంతో మన దేశంలో ఎన్నికల నిర్వహణ తీరుతెన్నుల్లో భారీ సంస్కరణలకు రంగం సిద్ధమైంది. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు అన్ని స్థానిక సంస్థలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేయడం తెలిసిందే. తొలుత దీనికి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం సాధించాలని, ఆ మీదట దశలవారీగా నిర్ణయాన్ని అమలు చేయాలని సూచించింది. ‘కమిటీ సిఫార్సుల మేరకు అన్ని వర్గాలతోనూ సంప్రదింపుల ప్రక్రియ చేపట్టిన అనంతరం కేంద్ర న్యాయ శాఖ బిల్లు ప్రతిని రూపొందించి కేబినెట్ ముందు పెడుతుంది. అనంతరం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతాం‘ అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వచ్చే శీతాకాల సమావేశాలే ఇందుకు వేదిక కావచ్చని చెబుతున్నారు. ఈ మేరకు ఒకే బిల్లు గానీ, అవసరమైతే పలు బిల్లులు గానీ ప్రవేశపెట్టే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు లా కమిషన్ కూడా జమిలిపై త్వరలో నివేదిక సమర్పించనుంది. 2029 నుంచి ఒకేసారి అన్ని ఎన్నికల నిర్వహణ, హంగ్ వచ్చే పక్షంలో ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటు తదితర సిఫార్సులను కమిషన్ చేయవచ్చని సమాచారం. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో జమిలి ఎన్నికలు కీలక వాగ్దానంగా ఉంటూ వస్తోంది. కేబినెట్ నిర్ణయాన్ని బీజేపీ, ఎన్డీయే పక్షాలు స్వాగతించగా కాంగ్రెస్, ఇతర విపక్షాలు మాత్రం ఇది ఆచరణసాధ్యం కాదంటూ పెదవి విరిచాయి. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మోదీ సర్కారు ఆడుతున్న డ్రామాగా దీన్ని అభివర్ణించాయి. త్వరలో అమలు కమిటీ జమిలి ఎన్నికలకు ఇప్పటికే చాలా రాజకీయ పక్షాలు సమ్మతి తెలిపాయని కేంద్రం పేర్కొంది. ఇప్పుడు వ్యతిరేకిస్తున్న పారీ్టలు కూడా వైఖరి మార్చుకుంటాయని ఆశాభావం వెలిబుచ్చింది. దేశ ప్రజల్లో అత్యధికులు ఈ ప్రతిపాదనను సమర్థించిన నేపథ్యంలో ఆ దిశగా వాటిపై అంతర్గత ఒత్తిళ్లు వస్తున్నాయని వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. కేబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. కోవింద్ కమిటీ సిఫార్సులను ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలో ఒక అమలు కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.‘ఈ అంశంపై రానున్న కొద్ది నెలల పాటు ప్రజలు, పార్టీలు, మేధావులు... ఇలా అన్ని రకాల వేదికల్లోనూ లోతుగా చర్చలు జరుగుతాయి. జమిలి ఎన్నికలకు విస్తృత ఏకాభిప్రాయం సాధించేందుకు కృషి చేస్తాం. దీర్ఘకాలంలో దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసే ఇలాంటి కీలక అంశాలపై ఏకాభిప్రాయం కావాలన్నది మా ప్రభుత్వ విశ్వాసం. ఇది మన దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే చర్య‘ అని చెప్పుకొచ్చారు. కమిటీ చేపట్టిన సంప్రదింపుల సందర్భంగా ఏకంగా 80 శాతం మందికి పైగా జమిలికి మద్దతిచ్చారని ఆయన చెప్పారు. ముఖ్యంగా యువత దీన్ని పూర్తిస్థాయిలో సమర్థించిందన్నారు. కాబట్టే జమిలికి ప్రస్తుతం విపక్షాల వ్యతిరేకంగా ఉన్నా.. విపక్షాలపై కూడా వైఖరి మార్చుకుందామంటూ అంతర్గతంగా ఒత్తిడి వస్తోందని ఒక ప్రశ్నకు బదులుగా మంత్రి అభిప్రాయపడ్డారు. వచ్చే శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో జమిలి బిల్లు పెడతారా అన్న ప్రశ్నకు ఆయన సూటిగా బదులివ్వలేదు. మోడీ 3.0 హయాంలోని దీన్ని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే చెప్పారని గుర్తు చేశారు. 1967 దాకా జమిలి ఎన్నికలే స్వాతంత్య్రం వచ్చాక 1951 నుంచి 1967 దాకా దేశమంతటా లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత మధ్యంతరాలు తదితర కారణాలతో జమిలికి తెర పడింది. ఈ నేపథ్యంలో జమిలి కోసం భారీ కసరత్తే చేయాల్సి ఉంటుంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ముందుకు జరపడం, కొన్నింటిని ఆలస్యం చేయడం వంటి చర్యలు అవసరం అవుతాయి. రెండు దశల్లో అమలు కోవింద్ కమిటీ సిఫార్సుకోవింద్ కమిటీ లోక్సభ ఎన్నికలకు ముందు గత మార్చిలో జమిలి ఎన్నికలపై నివేదిక సమర్పించింది. ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ను రెండు దశల్లో అమలు చేయాలని సూచించింది. ‘తొలి దశలో లోక్సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలి. 100 రోజు ల్లోపు రెండో దశలో పంచాయతీలు, మున్సిపాలిటీల వంటి స్థానిక సంస్థలన్నింటికీ ఎన్నికలు జరపాలి‘ అని పేర్కొంది. అన్ని ఎన్నికలకూ ఉమ్మ డిగా ఒకే ఎలక్టోరల్ రోల్ ఉపయోగించాలని పేర్కొంది. ఇందుకు కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల సంఘాల మధ్య సమన్వయం అవసరం. ఎందుకంటే ప్రస్తుతం లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను సీఈసీ, స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్రాల ఎన్నికల సంఘాలు నిర్వహిస్తున్నాయి. -
మోదీ 100 రోజుల పాలన.. రూ.3 లక్షల కోట్లతో ప్రాజెక్టులు: అమిత్ షా
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ఏర్పడి వంద రోజులు దాటింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు ఓ బుక్లెట్ను విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీజేపీ ప్రభుత్వం సాధించిన ప్రగతి పనులను ఇందులో వెల్లడించారు.జాన్లో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి దాదాపు రూ. 15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఇందులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వంరూ. 3 లక్షల కోట్లు కేటాయించిందని, 49,000 కోట్లతో దాదాపు 25,000 గ్రామాలను రోడ్డు నెట్వర్క్లకు అనుసంధానం చేసినట్లు తెలిపారు. 50,600 కోట్లతో దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులను విస్తరించాలని కేంద్రం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. గత పదేళ్లలో ఇళ్లు, టాయిలెట్లు, గ్యాస్ కనెక్షన్లు, త్రాగునీరు, విద్యుత్తు, ఉచిత ఆహార ధాన్యాలు, ఆరోగ్యం అందించినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల వరకు దేశంలోల్లు లేని వారు ఉండకూడదన్న లక్ష్యంతో పనిచేయనున్నట్లు అమిత్ షా తెలిపారు.మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని తీసుకువచ్చిందన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని, ప్రజలు వాటికి సాక్ష్యాలుగా నిలిచినట్లు ఆయన పేర్కొన్నారు. రూ. 76,000 కోట్లతో మహారాష్ట్రలోని వాధ్వన్లో మెగా పోర్ట్ను నిర్మించనున్నారని చెప్పారు. ఇది ప్రపంచంలోనే టాప్ 10 పోర్టులలో ఒకటిగా మారనుందని తెలిపారు. ప్రభుత్వం PM eBus సేవా పథకాన్ని ప్రారంభించిందని, స్టార్టప్ల కోసం ఏంజెల్ పన్ను రద్దు ద్వారా 31% పన్ను భారాన్ని తొలగించిందని, అభివృద్ధి కోసం భారతదేశం అంతటా 12 పారిశ్రామిక జోన్లను గుర్తించిందని పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ గురించి మంత్రి మాట్లాడుతూ.. సైబర్క్రైమ్ను పరిష్కరించడానికి వచ్చే ఐదేళ్లలో 5,000 మంది సైబర్ కమాండోలను నియమించనున్నట్లు చెప్పారు.చదవండి: Atishi Marlena: ఢిల్లీ సీఎం కాబోతున్న ఈ మహిళ ఎవరుయువత కోసం రూ. 2 లక్షల కోట్ల ప్రధానమంత్రి ప్యాకేజీని కూడా ప్రకటించామని కేంద్ర హోంమంత్రి తెలిపారు. ఐదేళ్లలో 4.10 కోట్ల మంది యువత దీని ద్వారా లబ్ధి పొందుతారని, కోటి మంది యువతకు అలవెన్సులు, వన్టైమ్ సహాయంతో పాటు అగ్రశ్రేణి కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలను కూడా అందించాలనితమ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. ‘ఈ 100 రోజుల్లో మధ్యతరగతి వారికి కూడా చాలా ఉపశమనం లభించింది. ఇప్పటి వరకు రూ. 7 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటిపన్ను లేదు. ఒక ర్యాంక్ వన్ పెన్ష మూడవ ఎడిషన్ అమలు చేస్తున్నాం. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్లు మంజూరు చేశాం. వాటిలో 1 కోటి పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల ఇళ్లు నిర్మాణం జరుగుతున్నాయి.పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి, వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం, పశ్చిమ బెంగాల్లోని బాగ్డోగ్రా, బీహార్లోని బిహ్తా విమానాశ్రయాన్ని అప్గ్రేడ్ చేస్తున్నా. అగట్టి, మినికాయ్లో కొత్త ఎయిర్స్ట్రిప్లను కూడా నిర్మిస్తున్నాం. బెంగళూరు మెట్రో, పూణే ప్రాజెక్టులను కూడా చేపట్టాం. ఈ 100 రోజుల్లో మెట్రో, థానే ఇంటిగ్రేటెడ్ రింగ్ మెట్రో అనేక ఇతర మెట్రో పనులు చేస్తున్నాం.వ్యవసాయ రంగంలో, 17వ విడత పిఎం కిసాన్ సమ్మాన్ యోజనలో 9.5 కోట్ల మంది రైతులకు ప్రభుత్వం రూ. 20,000 కోట్లు పంపిణీ చేసింది ఇప్పటి వరకు 12.33 కోట్ల మంది రైతులకు రూ. 3 లక్షల కోట్లు పంపిణీ చేశాం. గుజరాత్లోని సనంద్లో రూ. 3,300 కోట్లతో ప్రభుత్వం సెమీకండక్టర్ యూనిట్ను కూడా ఏర్పాటు చేస్తుంది. యూనిట్ రోజుకు ఆరు మిలియన్ చిప్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. "రాబోయే 10 సంవత్సరాలలో, సెమీకండక్టర్స్లో భారతదేశం ప్రధాన పాత్ర పోషిస్తుంది.’ అని తెలిపారుఇదిలాఉండగా.. మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా వివిధ మంత్రిత్వశాఖలు, పార్టీ నాయకులు వివరణాత్మక ప్రణాళికను రూపొందించాయన్నారు. ఇందులోభాగంగా సేవా పఖ్వాడా అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమాలు మంగళవారం నుంచి అక్టోబరు 2 వరకు కొనసాగుతాయన్నారు. -
రాజ్యసభ: మెజారిటీ మార్క్కి చేరిన ఎన్డీయే.. 12 మంది ఏకగ్రీవం
ఢిల్లీ: రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికల్లో తొమ్మిది మంది బీజేపీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మంగళవారం.. మెజారిటీ మార్కుని చేరుకుంది. బీజేపీ బలం 96కి చేరుకుంది. కూటమిగా చూస్తే ఎన్డీయే బలం 112కి చేరింది. అధికార కూటమికి ఆరుగురు నామినేటెడ్ ఎంపీలతో పాటు ఒక స్వతంత్ర సభ్యుడి మద్దతు కూడా ఉంది.మొత్తం 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా అన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 9 మంది బీజేపీ వారు కాగా, మరో మూడు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి ఒకరు, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నుంచి ఒకరు, ఆర్ఎల్ఎం నుంచి ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.రాజ్యసభలో మొత్తం స్థానాలు 245 కాగా, ప్రస్తుతం ఎనిమిది ఖాళీగా ఉన్నాయి. ఇందులో జమ్మూ కాశ్మీర్ నుంచి 4 ఉండగా, మరో నాలుగు నామినేట్ చేయబడ్డాయి. ప్రస్తుతం రాజ్యసభలో సభ్యుల సంఖ్య 237 కాగా, మెజారిటీ మార్క్ 119. కాంగ్రెస్ బలం 27కి చేరుకోవడంతో ప్రతిపక్షం హోదాను దక్కించుకుంది. ప్రతిపక్ష నేత హోదా పొందాలంటే పార్టీకి కనీసం 25 మంది ఎంపీలు ఉండాలి. -
దారికొచ్చిన ఎన్డీయే సర్కారు!
అలవాటైన పద్ధతిలో వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లును గురువారం లోక్సభలో ప్రవేశపెట్టిన ఎన్డీయే ప్రభుత్వానికి కాసేపటికే తత్వం బోధపడినట్టుంది. విపక్షాల నుంచి ప్రతిఘటన ఎదురుకావటంతో దాన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపటానికి అంగీకరించింది. కారణమేదైనా అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు జేపీసీకి లేదా సెలెక్ట్ కమిటీకి పంపటం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక సంప్రదాయం. కానీ ఎన్డీయే అధికారంలోకి వచ్చాక కేవలం రెండు సంద ర్భాల్లో మాత్రమే పాటించింది. పదేళ్లనాడు గద్దెనెక్కగానే అంతకు కొన్ని నెలలముందు అమల్లోకొచ్చిన భూసేకరణ చట్టం పీకనొక్కుతూ ఆదరా బాదరాగా ఆర్డినెన్స్ తీసుకురావటం ఎవరూ మరిచిపోరు. విపక్షాలు అభ్యంతరం చెబుతున్నా ఆనాడు చెవికెక్కలేదు. ఆర్డినెన్స్ మురిగి పోయిన రెండుసార్లూ దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తూ తిరిగి ఆర్డినెన్సులు తీసుకొచ్చారు. రాజ్యసభలోగండం గడిచేలా లేదని గ్రహించాక ఇక దాని జోలికి పోరాదని నిర్ణయించుకున్నారు. అటుపై సాగు చట్టాల విషయంలోనూ రైతులనుంచి ఇలాంటి పరాభవమే ఎదురయ్యాక వాటినీ ఉపసంహరించుకున్నారు. ఐపీసీ, సాక్ష్యాధారాల చట్టం, సీఆర్పీసీ స్థానంలో వచ్చిన కొత్త చట్టాల తాలూకు బిల్లులపై కూడా సంబంధిత వర్గాలను సరిగా సంప్రదించలేదు. ఎన్డీయే ఏలుబడి మొదలయ్యాక చోటుచేసుకున్న వేర్వేరు ఉదంతాల పర్యవసానంగా ముస్లిం సమాజంలో ఒక రకమైన అభద్రతాభావం ఏర్పడిన నేపథ్యంలో ఈ వివాదాస్పద చర్యకు కేంద్రం ఎందుకు సిద్ధపడిందో తెలియదు. బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని ఎన్డీయే భాగస్వామ్య పక్షం జేడీ(యూ) నేత, కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అంటున్నారు. ఇది పారదర్శకత తీసుకొస్తుందని కూడా ఆయన సెలవిచ్చారు. మంచిదే. మరి ఆ వర్గంతో సంప్రదింపులు జరిగిందెక్కడ? ముస్లిం సమాజానికున్న అభ్యంతరాల సంగతలా వుంచి రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు సైతం ఇది ఎసరు పెడుతోంది. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం భూమి రాష్ట్రాల జాబితాలోనిది.వక్ఫ్ ఆస్తిపై కేంద్ర పెత్తనాన్ని అనుమతించటంద్వారా దాన్ని కాస్తా తాజా బిల్లు నీరుగారుస్తోంది. కనుక ముస్లిం సమాజంతో మాత్రమేకాదు...రాష్ట్రాలతో కూడా సంప్రదించాల్సిన అవసరం లేదా? హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీలకు జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ బిల్లు తెచ్చారని లోక్సభలో విపక్షాలు చేసిన విమర్శలు కాదని చెప్పటానికి ప్రభుత్వం దగ్గర జవాబు లేదు. తన చర్య వెనక సదుద్దేశం ఉందనుకున్నప్పుడూ, బిల్లుపై ఉన్నవన్నీ అపోహలే అని భావించి నప్పుడూ తగిన సమయం తీసుకుని సంబంధిత వర్గాలతో చర్చించటానికేమైంది? ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే హడావిడిగా బిల్లు తీసుకొచ్చి వుంటే అంతకన్నా తెలివి తక్కువతనం ఉండదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ మాదిరి ఎత్తుగడలను జనం ఏవగించు కున్నారని బీజేపీకి అర్థమయ్యే వుండాలి.సవరణ బిల్లు ద్వారా తీసుకొచ్చిన 44 సవరణల పర్యవసానంగా వక్ఫ్ బోర్డుల అధికారాలకు కత్తెరపడుతుందని, ప్రభుత్వ నియంత్రణ పెరుగుతుందని కనబడుతూనేవుంది. అరుదైన సంద ర్భాల్లో తప్ప కలెక్టర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారని ఎవరూ అనుకోరు. ఫలానా ప్రార్థనాస్థలం శతాబ్దాలక్రితం తమదేనంటూ ఆందోళనలు చేయటం, దానికి ప్రభుత్వాలు వత్తాసు పలుకుతుండటం అక్కడక్కడ కనబడుతూనేవుంది. ఇంతకాలం వక్ఫ్ ట్రిబ్యున ళ్లకు ఉండే అధికారం కాస్తా కలెక్టర్లకు ఇవ్వాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.బోర్డుల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించటం, ఆస్తిని విరాళంగా ఇవ్వటంపై ఆంక్షలు సంశయం కలిగించేవే. మతపరమైన, ధార్మికపరమైన కార్యకలాపాల నిర్వహణ కోసం వచ్చిన ఆస్తుల్ని పర్యవేక్షించటానికి ఏర్పడిన బోర్డుల్లో వేరే మత విశ్వాసాలున్నవారిని నియమించటం ఏరకంగా చూసినా సరికాదన్న ఇంగిత జ్ఞానం ఉండొద్దా? అసలు ఒకసారి బోర్డు దేన్నయినా వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తే దాన్ని మార్చటం అసాధ్యమన్న ప్రచారం కూడా తప్పు. ఫలానా ఆస్తి బోర్డుదనుకుంటే సంబంధిత వర్గాలకు నోటీసులిచ్చి వారి వాదనలు పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలని ప్రస్తుత చట్టంలోని సెక్షన్40 చెబుతోంది. అటు తర్వాత వక్ఫ్ ట్రిబ్యునల్దే తుది నిర్ణయం. పైగా విరాళమిచ్చిన దాత కచ్చితంగా ఇస్లాంను పాటించే వ్యక్తే అయివుండాలని, దానంగా వచ్చే ఆస్తి కుటుంబవారసత్వ ఆస్తి కాకూడదని చట్టం నిర్దేశిస్తోంది. ఇప్పటికే ఇన్ని కట్టుదిట్టమైన నిబంధనలుండగా అందుకు భిన్నంగా ప్రచారం చేయటం సబబేనా? ఈ పరిస్థితుల్లో బిల్లు చట్టమైతే వక్ఫ్ ఆస్తుల చుట్టూ వివాదాలు ముసురుకుంటాయనుకునే అవకాశం లేదా? సంకీర్ణంలోని జేడీ(యూ), ఎల్జేపీలు బిల్లుకు మద్దతు పలకగా సభలో టీడీపీ సంకటస్థితిలో పడిన వైనం స్పష్టంగా కనబడింది. ఆ బిల్లుకు మద్దతిస్తుందట...కానీ జేపీసీకి ‘పంపితే’ వ్యతిరే కించబోదట! ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పుట్టుకొచ్చిన బాబు రెండు కళ్ల సిద్ధాంతం ఇంకా సజీవంగా ఉందన్నమాట! టీడీపీది చిత్రమైన వాదన. అలా పంపనట్టయితే వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదించబోమని చెప్పడానికి నోరెందుకు రాలేదు? ఒకపక్క బిల్లు చట్టమైతే పారదర్శకత ఏర్పడుతుందన్న ప్రభుత్వ వాదనను సమర్థిస్తూనే తమ సెక్యులర్ వేషానికి భంగం కలగకుండా ఆడిన ఈ డ్రామా రక్తి కట్టలేదు. జాతీయ మీడియా దీన్ని గమనించింది. మొత్తానికి సవరణ బిల్లు జేపీసీకి వెళ్లటం శుభ పరిణామం. ఎన్డీయే సర్కారు ఈ సంప్రదాయాన్ని మున్ముందు కూడా పాటించటం ఉత్తమం. -
ఇప్పుడు అర్జంటుగా ఎందుకు సార్! ఎన్నికలు లేవు! ప్రధానమంత్రి అభ్యర్థుల లొల్లీ లేదు!
-
డోన్ ఎమ్మెల్యే దుశ్చర్య.. యువకుల్ని చితకబాదిన కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి
కూటమి ప్రభుత్వంలో అరాచకాలు రాజ్యమేలుతున్నాయనేది అనే సంఘటనలు రుజువు చేశాయి. చేస్తూనే ఉన్నాయి. తాజాగా, కర్నూలులో ఎమ్మెల్యే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఇద్దరు యువకుల్ని కర్రలతో చితకబాదిన వీడియో వైరల్గా మారింది.పంచాయితీ పేరుతో డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు చెందిన ఇద్దరు యువకుల్ని చితకబాదారు. తన కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకుని దూషిస్తూ కర్రతో కొట్టారు.వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు యువకులు తప్పు చేశారంటూ పంచాయితీ పెట్టి వారిని కొట్టారు ఎమ్మెల్యే. వాల్మిక సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు యువకుల్ని ఇంత దారుణంగా అవమానించడం పట్ల కులసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు,న్యాయ వ్యవస్థ ఉండగా ఇలా ఎమ్మెల్యేనే తీర్పు చెప్పి దండించడం ఏంటని కులసంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. -
NITI Aayog: నితీశ్ అసంతృప్తి?
నీతిఆయోగ్ భేటీకి విపక్ష ఇండియా కూటమి సీఎంలతో పాటు పాలక ఎన్డీఏ సంకీర్ణంలో కీలక భాగస్వామి అయిన బిహార్ సీఎం నితీశ్కుమార్ కూడా డుమ్మా కొట్టడం విశేషం. ఆయన బదులు ఉప ముఖ్యమంత్రులు సమర్థ్ చౌదరి, విజయ్కుమార్ సిన్హా పాల్గొన్నారు. ఆయన కోరుతున్నట్టుగా బిహార్కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం ఇటీవలే స్పష్టం చేయడం తెలిసిందే. దీనిపై అసంతృప్తితోనే భేటీకి నితీశ్ దూరంగా ఉన్నట్టు భావిస్తున్నారు. అయితే ఆయన గైర్హాజరుకు పెద్ద ప్రాధాన్యమేమీ లేదని జేడీ(యూ) పేర్కొంది. గతంలో కూడా నితీశ్ పలుమార్లు నీతిఆయోగ్ భేటీకి గైర్హాజరయ్యారని గుర్తు చేసింది. కేంద్ర బడ్జెట్లో విపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపారని ఆరోపిస్తూ తెలంగాణ, కర్నాటక తమిళనాడు, కేరళ, పంజాబ్, హిమాచల్ప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్, పాండిచ్చేరి సీఎంలు కూడా భేటీకి దూరంగా ఉన్నారు. ‘‘10 రాష్ట్రాల సీఎంలు భేటీకి రాలేదు. అది ఆయా రాష్ట్రాలకే నష్టం’’ అని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం అన్నారు. ‘‘మమత సమయం పూర్తవగానే రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ మైక్పై తట్టారు. వెంటనే ఆమె మాట్లాడటం ఆపేసి వాకౌట్ చేశారు’’ అని ఆయన వివరించారు. బిహార్ అసెంబ్లీ సమావేశాల కారణంగా నితీశ్ రాలేకపోయారన్నారు. -
బాధ్యత లేని ‘బోగస్’ గెలుపు!
కష్టపడి సంపాదించిన వాడికే డబ్బు విలువ తెలుస్తుందంటారు. విలువ తెలుసు కనుక దానిపట్ల బాధ్యత కూడా పెరుగుతుంది. దొంగ సొత్తుకూ, అక్రమ సంపాదనకూ ఈ సూత్రం వర్తించదు. డబ్బు సంపాదనే కాదు, విజయ సాధన కూడా ఇంతే. అది ఎన్నికల విజయమైనా మరే రకమైన విజయమైనా సరే. పోరాడి గెలిచిన వాడికి తనకు దక్కిన విజయం పట్ల గౌరవం ఉంటుంది. విజయ హేతువుల పట్ల వినమ్రత ఉంటుంది. బాధ్యత ఉంటుంది. అన్ని రంగాల్లోనూ దొడ్డిదారి విజయాలు కూడా ఉంటాయి. ఎన్నికల్లో కూడా ఉంటాయి. పరోక్ష ఎన్నికల్లో ఇటువంటి దొడ్డిదారి విజయాల వికటాట్టహాసం మనకు తెలియనిది కాదు. కానీ ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల తీర్పును ‘దొంగిలించడమ’నే సరికొత్త సాంకేతిక ప్రక్రియ రంగప్రవేశం చేసింది. ఈ పరిణామం పట్ల మనదేశంలోని మేధావుల్లో, ప్రజాస్వామ్య వాదుల్లో, అభ్యుదయ శక్తుల్లో ఆందోళన మొదలైంది. ఇటువంటి ఆందోళనే మహారాష్ట్రలోని కొంతమందిని ఒక దగ్గరకు చేర్చింది. వోట్ ఫర్ డెమోక్రసీ (వీఎఫ్డీ) అనే వేదిక తయారైంది.వీఎఫ్డీ అనే వేదికపైకి కొందరు వ్యక్తులతోపాటు కొన్ని సంస్థలు కూడా చేరుకున్నాయి. దేశంలో జరిగిన మొన్నటి సాధారణ ఎన్నికల ఫలితాలు చాలామందిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ వేదిక కూడా మినహాయింపు కాదు. కానీ వీఎఫ్డీ మాత్రం ఆశ్చర్యంలోనే మునకేసి ఉండకుండా ఒక ముందడుగు వేసింది. ఎన్నికల ప్రక్రియను ఆసాంతం అధ్యయనం చేసి ఒక 225 పేజీల నివేదికను ఈమధ్యనే ఆ సంస్థ విడుదల చేసింది. ఈ నివేదికలో పొందుపరిచిన పలు అంశాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మన ప్రజాస్వామ్య ప్రక్రియ పవిత్రతను సహేతుకంగా శంకిస్తున్నాయి.ఈవీఎమ్ల పనితీరుపైనా, పారదర్శకతపైనా అనుమానాలు, అభ్యంతరాలు పాతవే. వీడీఎఫ్ కేవలం సందేహాలకు మాత్రమే పరిమితం కాకుండా పోలింగ్ సందర్భంగా, కౌంటింగ్ సందర్భంగా జరిగిన అవకతవకలను ఎత్తిచూపింది. ఎన్నికల ప్రక్రియకు ముందు ఎన్నికల సంఘంలో జరిగిన అసాధారణ మార్పులను ఎండగట్టింది. ప్రక్రియ ముగిసేవరకూ ఎన్నికల సంఘం అవలంభించిన ఏకపక్ష ధోరణిని నిర్ధారించింది. ఫలితాల ప్రకటనలోని అసమంజసత్వాన్ని వెలికి తీసింది.సాధారణంగా పోలింగ్ ముగిసిన అనంతరం సాయంత్రం ఏడు లేదా ఎనినిమిది గంటలకల్లా పోలింగ్ శాతాలను ఎన్నికల సంఘం ప్రకటించడం రివాజు. ఎక్కడైనా కొన్ని బూత్లలో పోలింగ్ ఆలస్యంగా జరిగితే అవి కూడా కలుపుకొని రాత్రి ఆలస్యంగా గానీ, అరుదుగా మరుసటిరోజు గానీ తుది పోలింగ్ శాతాన్ని ఈసీ ప్రకటిస్తూ వస్తున్నది. ఈ పెరిగిన ఓటింగ్ శాతం గతంలో ఎన్నడూ కూడా ఒక శాతాన్ని మించిన అనుభవాలు లేవు. ఈసారి మాత్రం ఏడు దశల పోలింగ్లోనూ అసాధారణ పెరుగుదల నమోదైంది. కనిష్ఠంగా 3.2 శాతం నుంచి గరిష్ఠంగా 6.32 శాతం వరకు పెరుగుదల ఈ ఏడు దశల్లో కనిపించింది.గరిష్ఠంగా నాలుగో దశ పోలింగ్లో 6.32 శాతం పెరుగుదల నమోదైంది. ఈ దశలోనే పోలింగ్ జరుపుకున్న ఆంధ్రప్రదేశ్లో 12.54 శాతం, ఒడిశాలో 12.48 శాతం పెరుగుదల కనిపించడంపై వీఎఫ్డీ విస్మయం వ్యక్తం చేసింది. మన చెవుల్లో పెద్దపెద్ద తామర పువ్వులుంటే తప్ప ఈసీ చేసిన ఈ దారుణమైన ఓటింగ్ పెంపును నమ్మడం కష్టం. పోలింగ్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత, తుది పోలింగ్ శాతాన్ని ప్రకటించడం మరింత విభ్రాంతిని కలిగించే విషయం. ఇంత అసాధారణ స్థాయిలో పోలింగ్ శాతాల పెరుగుదలపై వచ్చిన సందేహాలకు ఇప్పటివరకు ఎన్నికల సంఘం సరైన వివరణ ఇవ్వలేదనే సంగతిని దృష్టిలో ఉంచుకోవాలి.ఈవీఎమ్ల ట్యాంపరింగ్ జరిగితేనో, లేక పోలింగ్ జరిగిన ఈవీఎమ్ల బదులు కౌంటింగ్లో కొత్త మిషన్లు వచ్చి చేరితేనో తప్ప ఈ అసాధారణ పెరుగుదల సాధ్యంకాదని వీఎఫ్డీ అభిప్రాయపడింది. కనుక ఈ పెరిగిన ఓట్లను బోగస్ ఓట్లుగా అది పరిగణించింది. ఈవీఎమ్లలో ఏదో ఇంద్రజాలం జరిగిందనడానికి మరో దృష్టాంతాన్ని కూడా వీఎఫ్డీ నిర్ధారించింది. తుది ప్రకటన చేసిన పోలైన ఓట్లకూ, కౌంట్ చేసిన ఓట్లకూ మధ్య భారీ వ్యత్యాసాలు కనిపించాయి. కొన్నిచోట్ల కౌంట్ చేసిన ఓట్లు పెరిగాయి. మరికొన్ని చోట్ల తగ్గాయి. ఇదెలా సాధ్యమవుతుంది? ఆంధ్రప్రదేశ్లోని తొమ్మిది లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 3,500 నుంచి 6,500 వరకు ఓట్లు కౌంటింగ్ సమయానికల్లా తగ్గిపోయాయి. ఇటువంటి నియోజకవర్గాలు దేశవ్యాప్తంగా 174 ఉన్నాయని వీఎఫ్డీ తెలియజేసింది.వీఎఫ్డీ సంస్థ బోగస్గా పరిగణించిన ఓట్ల కంటే తక్కువ తేడాతో ఎన్డీఏ గెలిచిన సీట్లను వాస్తవానికి ప్రతిపక్షాలు గెలవాల్సిన సీట్లుగా వర్గీకరించారు. రాష్ట్రాలవారీగా పెరిగిన బోగస్ ఓట్ల మొత్తాన్ని ఆ రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాలకు సమానంగా విభజించిన అనంతరం ఆ సంఖ్య కంటే తక్కువ తేడాతో ఓడిపోయిన సమీప ప్రత్యర్థిని అసలైన విజేతగా వీఎఫ్డీ లెక్కకట్టింది. ఈ లెక్కన 79 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి ఓడిపోవాల్సింది.వీఎఫ్డీ గణిత సమీకరణం ప్రకారం ఒడిశాలో బీజేడీ, ఆంధ్రలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం పోలైన ఓట్లలో 49 లక్షల పైచిలుకు ఓట్లను బోగస్గా ఆ సంస్థ పరిగణించింది. ఆ ఓట్లను మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల మధ్య సమంగా పంచితే ఇరవై ఎనిమిదవేలవుతుంది. అంతకంటే తక్కువ తేడాతో వైసీపీ ఓడిపోయిన నియోజకవర్గాల సంఖ్య 77. గెలిచిన 11 వీటికి జత చేస్తే మొత్తం 88. అంటే సింపుల్ మెజారిటీ.వీఎఫ్డీ సంస్థ ఆషామాషీగా బోగస్ ఓట్ల సంఖ్యను నిర్ధారించలేదు. అనుమానించడానికి హేతుబద్ధమైన అనేక ఉదంతాలను అది ఉదహరించింది. షెడ్యూల్ ప్రకటనకు కొద్దిరోజుల ముందే అరుణ్ గోయల్ అనే కమిషనర్ ఎందుకు తప్పుకున్నారని ప్రశ్నించింది. షెడ్యూల్ ప్రకటనకు ఒకరోజు ముందు కమిషనర్లుగా ఇద్దరు అధికారులు చేరారు. వీరిలో ఒక అధికారి పూర్వాశ్రమంలో అమిత్షా దగ్గర అధికారిగా పని చేశారనీ, మరొక అధికారి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి వద్ద పనిచేశారని ఆ సంస్థ వెల్లడించింది.పోలింగ్ ముగిసిన వెంటనే పార్టీ ఏజెంట్లకు ఇవ్వాల్సిన 17–సి ఫామ్లను ఎంతమంది ఏజెంట్లకు ఇచ్చారో తెలపగలరా అని ఆ సంస్థ సవాల్ చేసింది. ఈవీఎమ్ల వారీగా ఫామ్ 17–సీ లలో నమోదు చేసిన ఓటింగ్ వివరాలు కౌంటింగ్లో లెక్కించిన ఓట్లతో సరిపోల్చడానికి ఒక స్వతంత్ర అధ్యయనం జరగవలసిన అవసరం ఉన్నదని వీఎఫ్డీ అభిప్రాయపడింది.ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంతవరకు ఈ బోగస్ ఓట్ల బాగోతం ఒక భాగం మాత్రమే. తొలి అంకం వేరే ఉన్నది. కూటమి నేతలు – యెల్లో మీడియా సంయుక్తంగా సాగించిన విష ప్రచారం, కూటమి ఇచ్చిన మోసపూరితమైన హామీలు ఈ భాగం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై ఏపీలో కూటమి చేసింది దుష్ప్రచారమేనని మొన్నటి యూనియన్ బడ్జెట్తో తేలిపోయింది. ఏపీలో ప్రారంభించిన ఈ సంస్కరణ దేశమంతటా జరగాలని కేంద్రం కోరుతున్నది. అందుకోసం రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది.జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, రాష్ట్రం దివాళా తీసిందని, శ్రీలంకలా మారిందని రాసిన రాతలకూ, కూసిన కూతలకూ అంతే లేదు. మొన్న యూనియన్ బడ్జెట్కు ముందురోజు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే జగన్ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణను కొనియాడటంతో యెల్లో కూటమి ముఖాన కళ్లాపి చల్లినట్టయింది. రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పు ఉన్నదని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో 10 లక్షల కోట్లని గవర్నర్ చేత చెప్పించారు. ఈ కుప్పిగంతులనూ, శ్వేతపత్రాల తప్పుడు తంతులనూ చీల్చి చెండాడుతూ వైసీపీ అధ్యక్షుడు ప్రెస్మీట్ పెడితే సమాధానం చెప్పడానికి ఇప్పటిదాకా ఏ యెల్లో మేధావీ ముందుకు రాకపోవడం గమనార్హం.ఇసుక మీద నసిగిన వాగుడెంత?... రాజేసిన రాద్ధాంతమెంత? అప్పుడే మరిచిపోతామా? ఇసుక ధరలు అప్పటికంటే ఇప్పుడే ఎక్కువయ్యాయని ఊరూవాడా గగ్గోలు పెడుతున్నది. ఈ పబ్లిక్ టాక్ను అడ్రస్ చేయడానికి ఒక్క సర్కారీ సిపాయి కూడా ఇంతవరకు సాహసించలేదు. లిక్కర్ పాలసీ మీద వెళ్లగక్కిన ప్రచారం సంగతి సరేసరి. ఇప్పటివరకైతే అదే పాలసీ కొనసాగుతున్నది. దీన్నే కొనసాగిస్తారో, లేదంటే బెత్తెడు దూరానికో బెల్టు షాపు సుగంధాలు వెదజల్లిన తమ పాతకాలపు పాత పాలసీకి వెళ్తారో వేచి చూడాలి.విషప్రచారాల ప్రస్తావనలోకి వెళ్తే దానికి అంతూదరీ ఉండదు. ఇక మోసపూరిత హామీల సంగతి మరో మహేంద్రజాల అధ్యాయం. ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగించడంతోపాటు సూపర్ సిక్స్ పేరుతో ఒక షట్సూత్ర వాగ్దాన మాలను ఓటర్ల మెడలో వేశారు. యువకులందరికీ నెలకు 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. బడికెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి 15 వేల రూపాయలిస్తామన్నారు. ప్రతి రైతుకూ ఏటా 20 వేల ఆర్థిక సాయమన్నారు. 19 నుంచి 59 సంవత్సరాల మధ్యనున్న ప్రతి మహిళకు నెలకు 1500 అందజేస్తామన్నారు. ప్రతి ఇంటికి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమన్నారు. ప్రతి మహిళకూ ఉచిత బస్సు ప్రయాణమని నమ్మబలికారు.ఇప్పటివరకు ఇందులో ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు. ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా తెలియదు. ఇది షట్సూత్ర హామీ కాదు షడయంత్ర ప్రయోగమని తేలడానికి ఎంతోకాలం పట్టలేదు. సాక్షాత్తూ శాసనసభలోనే స్వయంగా ముఖ్యమంత్రే ‘సూపర్ సిక్స్’ తూచ్ అని ప్రకటించారు. పైగా ఇది సాధ్యంకాదనే విషయాన్ని ప్రజల్లో ప్రచారం చేయాలని కూడా ఎమ్మెల్యేలను కోరారు. విష ప్రచారంతో, తప్పుడు హామీలతో ఓట్లడగడం కూడా ఓట్లను దొంగిలించడం కిందే లెక్క. వంచన కిందే లెక్క. రెండు రకాలుగా చోరీ చేసిన ఓట్లతోనే గద్దెనెక్కారు కనుక వారికి ప్రజల పట్ల బాధ్యత లేదనే విషయాన్ని వారే నిరూపించుకుంటున్నారు.బాధ్యతల నుంచి తప్పుకోవడానికీ, హామీల అమలుకోసం జనం వీధుల్లోకి రాకుండా ఉండటానికే రెడ్బుక్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. శాసనసభలో విపక్ష నేతపై సభానాయకుడు వాడుతున్న భాష, వేస్తున్న నిందలు చాలా దిగజారిన స్థాయిలో ఉంటున్నాయి. హామీలు అమలుచేయపోతే ఎక్కడ తిరుగుబాటు వస్తుందోనన్న భయం ఆయన్ను వెంటాడుతున్నట్టు కనిపిస్తున్నది. ‘ఒక్క వేలు చూపి ఒరులను నిందించ వెక్కిరించు నిన్ను మూడు వేళ్లు’ అనే తెలుగు నానుడిని ఆయన గుర్తు చేసుకుంటే మేలు.చంద్రబాబుకు కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామగారు ఎన్టీ రామారావు ఆయన గురించి ఏమన్నారో గుర్తు చేసుకుందామా? ‘‘చంద్రబాబు దుర్మార్గుడు... మేకవన్నె పులి, గాడ్సేనే మించినవాడు, అభినవ ఔరంగజేబు, అతడో మిడత. మూర్తీభవించిన పదవీకాంక్షాపరుడు, ప్రజాస్వామ్య హంతకుడు, కుట్రకు కొలువైనవాడు, గూడుపుఠాణీకే గురువు, మోసానికి మూలస్తంభం, గుండెల్లో చిచ్చుపెట్టినవాడు, గొడ్డుకన్నా హీనం, చీమల పుట్టలో పాములా చేరినవాడు... తమ్ముళ్లారా! చెల్లెళ్లారా! ఇదిగో మీ అన్నగా చెబుతున్నాను.’’ ఇవన్నీ ఎన్టీఆర్ డైలాగులే. ఆన్ రికార్డ్!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
వివక్ష కాదు.. కక్ష.. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై బుధవారం శాసనసభలో చర్చిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిరసనను తెలియజేస్తూ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపిస్తామని చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ అనే పదాన్నే నిషేధించిన కేంద్రం వైఖరిని ఎండగట్టడానికి శాసనసభలో జరిగే చర్చలో అన్ని పార్టీలు పాలుపంచుకోవాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చర్చలో పాల్గొనాలని సూచించారు. ‘కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్షతో కాదు.. కక్ష పూరితంగా వ్యవహరించింది..’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ను కుర్చీ బచావో బడ్జెట్గా అభివరి్ణంచారు. నితీశ్, నాయుడు డిపెండెంట్ అలయెన్స్గా ఎన్డీఏ మారిందని ధ్వజమెత్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ విషయంలో వైఖరిని మార్చుకుని, బడ్జెట్ను సవరించి విభజన హామీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కోరిన అంశాలకు అనుగుణంగా కేటాయింపులు జరపాలని కోరారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. పెద్దన్నలా వ్యవహరించాలని కోరినా.. ‘మా ప్రభుత్వం, మంత్రివర్గ సహచరులు 18 సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్ర హోం మంత్రి,ని ఇతర మంత్రులను కలిశారు. స్వయంగా నేను మూడుసార్లు ప్రధానిని కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని కోరా. రాష్ట్రానికి వచ్చినప్పుడు అభివృద్ధి విషయంలో పెద్దన్నలా వ్యవహరించాలని ప్రధానికి చెప్పాం. కానీ మొత్తం బడ్జెట్లో తెలంగాణ అనే పదం పలకడానికే కేంద్రం ఇష్టపడలేదు. వారి మనసులో తెలంగాణ పట్ల ఇంత కక్ష ఉందని అనుకోలేదు. పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఏపీకి నిధులు కేటాయించిన కేంద్రం, అదే చట్టం ప్రకారం తెలంగాణకు నిధులు ఎందుకు కేటాయించలేదు?..’అని సీఎం నిలదీశారు. వికసిత్ భారత్లో తెలంగాణ భాగం కాదా? ‘బయ్యారం, ఖాజీపేట కోచ్ఫ్యాక్టరీ, పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు, గిరిజన యూనివర్సిటీకి నిధుల ఊసు లేదు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనేది బోగస్ నినాదం. వికసిత్ భారత్లో తెలంగాణ భాగం కాదని ప్రధాని భావిస్తున్నారా? ఇది వికసిత్ భారత్ బడ్జెట్ కాదు.. కుర్చీ బచావో బడ్జెట్. బిహార్, ఏపీకి తప్ప ఇతర రాష్ట్రాలకు నిధులు కేటాయించలేదు. ఇంతటి వివక్ష, కక్షపూరిత వైఖరి ఎప్పుడూ చూడలేదు. బీజేపీని 8 సీట్లలో గెలిపించిన రాష్ట్రానికి ఇంత మోసం చేస్తారా? కేంద్ర వైఖరికి నిరసనగా కిషన్రెడ్డి కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేసి బయటకు రావాలి. ప్రధానిని మేం పెద్దన్నగా భావిస్తే.. ఆయన దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. కేవలం క్విడ్ ప్రో కో విధానంలో కుర్చీ కాపాడుకునేందుకే ప్రధాని బడ్జెట్లో ప్రాధాన్యతనిచ్చారు. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్లో కాంగ్రెస్ నిరసన తెలుపుతుంది. బడ్జెట్ను సవరించి బయ్యారం ఉక్కు కర్మాగారం, ఖాజీపెట్ కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు ప్రాజెక్టు, మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. లేకపోతే బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లినట్లే. కిషన్రెడ్డి మౌనం, బానిస మనస్తత్వంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. మంత్రి పదవి కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ వద్ద తాకట్టు పెట్టొద్దు..’అని రేవంత్ అన్నారు. త్వరలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం ‘ఏపీలో అమరావతికి వేల కోట్లు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం, హైదరాబాద్లో అభివృద్ధి పనులకు, మౌలిక వసతుల కల్పనకు నిధులు ఎందుకు ఇవ్వదు? పోలవరానికి నిధులు ఇచ్చినప్పుడు.. తెలంగాణలో పాలమూరు ఎత్తిపోతలకు ఎందుకు ఇవ్వరు? బిహార్, ఏపీ కోసం బడ్జెట్ పెట్టినట్లు ఉంది. కుర్చీ లాలూచీలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాస్తే ఊరుకోం. పార్లమెంట్లో నిరసనకు బీజేపీ ఎంపీలూ, ఎంఐఎం కూడా కలిసి రావాలి. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోంది. అందుకే త్వరలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నా. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక సీఎంలు ఒప్పుకున్నారు. కేరళ, ఆంధ్రప్రదేశ్ కలిసి వస్తాయో లేదో చూస్తాం. వివక్షతోనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదని కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్నాం.’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చర్చలో కేసీఆర్ పాల్గొనాలి.. ‘బుధవారం ప్రశ్నోత్తరాల తరువాత స్పీకర్ అనుమతితో కేంద్ర బడ్జెట్పై తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి చర్చించాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబుకు సూచిస్తున్నా. ఈ చర్చలో ఎవరు విలీనాల ప్రక్రియలో ఉన్నారో.. ఎవరు చీకటి ఒప్పందాలు చేసుకున్నారో బయటపడుతుంది. తెలంగాణ హక్కులు, నిధులపై జరిగే చర్చలో కేసీఆర్ పాల్గొనాలని సూచిస్తున్నా. లేకపోతే కేసీఆర్ కూడా మోదీకి మోకరిల్లినట్లే భావించాల్సి వస్తుంది..’అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. సమావేశంలో మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏం చేయాలన్నా డబ్బుల్లేవు
సాక్షి, అమరావతి : పనులు చేయడానికి డబ్బుల్లేవని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ముందుగా రోడ్ల గుంతలు పూడుద్దామని చెప్పారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఎన్డీఏ పక్ష ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వచ్చి నెల కాకుండానే అప్పుడే జగన్ విమర్శలు మొదలు పెట్టేశారన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం సరికాదని చెప్పారు. తప్పులు చేయడం, వాటిని పక్క వారిపై నెట్టేయడం జగన్కు అలవాటని అన్నారు.వివేకా హత్యను వేరే వాళ్ల మీదకు నెట్టే ప్రయత్నం చేశారని, వినుకొండలోనూ అదే జరుగుతోందని చెప్పారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యపై జగన్ ఏకంగా రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నారని చెప్పారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ తగలబడటాన్ని అగ్నిప్రమాదంగా చెబుతున్నా, అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఘటన చూశాక పరిపాలన ఎంత పతనమైందో బయటపడిందన్నారు.శాంతిభద్రతల విషయంలో చాలా గట్టిగా ఉంటామని, ఏ పార్టీ వాళ్లనైనా సహించేది లేదని అన్నారు. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిద్దామని, రాజకీయ కక్ష సాధింపులు వద్దని చెప్పారు. ఇసుక విషయంలో చిన్న విమర్శ కూడా రాకూడదని చెప్పారు. క్వారీల్లో ఇసుక తవ్వకం, రవాణా ఖర్చులు, సీనరేజ్ మాత్రమే వసూలు చేస్తామన్నారు. ప్రతి నెలా పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పాల్గొనాలని సూచించారు. పవన్కళ్యాణ్ కోరినట్లుగా డొక్కా సీతమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. చంద్రబాబు నిర్ణయాలకు సహకరిస్తాం : పవన్ జగన్కు ఇంకా తత్వం బోధ పడలేదని ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలతో కుట్రలకు తెరలేపుతున్నారని విమర్శించారు. సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలాలని ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడం ఆయన అహంకార ధోరణికి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను, తన పార్టీ నూరు శాతం సహకరిస్తామని తెలిపారు. ఏపీకి సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకుందామని బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. జగన్ ఇదే ధోరణి కొనసాగిస్తే భంగపాటు తప్పదన్నారు. కూటమిలోని మూడు పారీ్టల మధ్య సమన్వయం అవసరమని అన్నారు. -
బీహార్ కు స్పెషల్ స్టేటస్ పై కేంద్రం క్లారిటీ..!
-
జులై 21న అఖిలపక్ష సమావేశం.. టీఎంసీ డుమ్మా!
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలుఈ నెల 22న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో జులై 21న (ఆదివారం) పార్లమెంట్ ఉభయసభల్లోని అన్నీ రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ సెషన్, సభా వ్యవహారాలపై చర్చించేందుకు కేంద్రం సమావేశానికి ఆహ్వానించింది. జూలై 21న ఉదయం 11 గంటలకు పార్లమెంట్ హౌస్ అనెక్స్లోని ప్రధాన కమిటీ రూమ్లో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్) హాజరు కావడం లేదు. జులై 21న రాష్ట్ర అమరవీరుల దినోత్సవం నేపథ్యంలో ఈ సమావేశానికి హాజరుకావడం లేదని టీఎంసీ ని ర్ణయించుకుంది.కాగా ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరుకావడం ఇదే తొలిసారి కానుంది. ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఈ నెల 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. -
రాజ్యసభలో మరింత కీలకంగా వైఎస్సార్సీపీ!
న్యూఢిల్లీ: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీకి.. రాజ్యసభలో మాత్రం మెజార్టీ తగ్గిపోయింది. నామినేటెడ్ ఎంపీలైన నలుగురు రాకేష్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్సింగ్, మహేష్ జఠ్మలాని పదవికాలం శనివారంతో ముగియడంతో పెద్దల సభలో బీజేపీ బలం 86కు పడిపోయింది. కేంద్ర ప్రభుత్వ సూచనలతో రాష్ట్రపది ద్రౌపది ముర్ము వీరిని నియమించారు. వీరు అనంతరం రాజ్యసభలో అధికార ఎన్డీయే కూటమికి మద్దతుగా నిలిచారు. అయితే నలుగురు ఎంపీల రాజీనామాలతో రాజ్యసభలో బీజేపీ సంఖ్య 86కు చేరగా.. ఎన్డీయే కూటమికి 101 మంది ఎంపీల బలం ఉంది. మొత్తం 245 సభ్యులు కలిగిన పెద్దల సభలో మెజార్టీ మార్కు 113గా ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో 225 మంది ఉన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 87 మంది సభ్యుల మద్దతు ఉంది. ఇందులో కాంగ్రెస్కు 26, తృణమూల్ కాంగ్రెస్కు 13, ఆమ్ ఆద్మీపార్టీ 10, డీఎంకే పార్టీకి 10 మంది సభ్యులు ఉన్నారు. వీరితోపాటు ఇక అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూటమిలో భాగంగా లేని తెలంగాణలోని బీఆర్ఎస్, పలువురు నామినేటేట్ ఎంపీలు, స్వతంత్రులు ఉన్నారుఅయితే ఎగువ సభలో బిల్లులను ఆమోదించడానికి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీయేతర పార్టీలపై ఆధారపడి ఉంది. దీంతో గతంలో ఎన్డీఏకు మిత్రపక్షంగా వ్యవహరించిన తమిళనాడులోని అన్నాడీఎంకే, అంశాలవారీగా పలుమార్లు మద్దతిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇపుడు కీలకంగా మారాయి. ఈ రెండు పార్టీల ఎంపీలనూ ( అన్నాడీఎంకే 4, వైఎస్సార్ సీపీ11) కలిపితే 101 ప్లస్ 15.. మొత్తంగా 116 కావటంతో.. బిల్లులు ఆమోదం పొందడానికి ఈ రెండు పార్టీలూ కీలకంగా మారాయి.గతంలో కూడా పలు సందర్భాల్లో వైఎస్సార్సీపీ(11), అన్నాడీఎంకే (4) పలు బిల్లుల విషయంలో ఎన్డీయేకు మద్దతిచ్చాయి. కానీ ఇటీవల ఎన్నికలకు ముందు గత ఏడాది డిసెంబర్లో అన్నాడీఎంకే ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా టీడీపీ, జనసేనతో కూటమి గట్టి మరీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పోటీ చేసింది. ఈ నేపథ్యంలో అధికార బీజేపీకి ఈ రెండు పార్టీలు మద్దతు ఇస్తాయా లేదా అన్నది సస్పెన్స్గా మారింది. బిల్లులు గట్టెక్కాలంటే వైఎస్సార్సీపీ సపోర్టు ఎన్డీయేకు తప్పనిసరి. ఎందుకంటే 11 మంది సభ్యులున్న వైస్సార్సీపీ... రాజ్యసభలో నాలుగవ అతిపెద్ద పార్టీ కావటం విశేషం. ఇక గతంలో ఎన్డీయేకు మరో మిత్రపక్షంగా ఉన్న ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్కు చెందిన బిజూ జనతాదళ్ కూడా ఎన్నికల ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదని ఇప్పటికే బీజేడీ తేల్చి చెప్పింది. బీజేడీకి తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. వచ్చేవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బిల్లుల ఆమోదానికి వై ఎస్సార్సీపీ , బీజేడీ , బీఆర్ఎస్ మద్దతు కీలకం.ప్రస్తుతం రాజ్యసభలో 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 11 మంది ఎన్నికయ్యేవారు కాగా.. ఈ ఏడాది ఈ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో మహారాష్ట్ర, అస్సాం, బీహార్లలో రెండు, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, త్రిపురలలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని కూటమికి అస్సాం, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, త్రిపుర నుంచి ఏడు చోట్ల గెలిచే అవకాశం ఉంది ఇక మహారాష్ట్రలో మరో రెండు దక్కించుకునే ఛాన్స్ ఉంది. దీంతో బీజేపీకి అదనంగా తొమ్మిది సీట్లు వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటు నామినేటెడ్ సభ్యుల ఓట్లు, వైఎస్సార్సీపీ ఓట్లు కలిపితే బీజేపీకి మెజారిటీ మార్కును దాటేందుకు కావాల్సినంత బలం ఉండనుంది. -
రాజ్యాంగ రక్షణే అత్యవసరం
పదవిని కాపాడుకోవడం కోసం ప్రతిపక్ష నాయకులను ఇందిరాగాంధీ అరెస్టు చేశారు. మీడియా మీద ఆంక్షలు విధించారు. అందుకే ఎమర్జెన్సీ ఎత్తివేయగానే దేశంలో ఒక పౌరహక్కుల ఉద్యమం ముందుకొచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు దేశంలో పౌరహక్కులను కాపాడవలసిన అవసరముందని మాట్లాడాయి. ఆ ఒక్క దశలోనే బీజేపీ నాయకులు కూడా పౌరహక్కుల ఉద్యమాన్ని బలపర్చారు. కానీ ఎమర్జెన్సీ కంటే రాజ్యాంగపు తిరగరాత మరింత ప్రమాదకరమైనది. 2024 ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి. అయితే ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం అప్పుడే పూర్తిగా తొలగిపోలేదు. దేశం మొత్తంగా ఇప్పుడున్న రాజ్యాంగాన్ని రక్షించుకునే చైతన్యం పెరగాలి.18వ లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘అబ్ కీ బార్ 400 పార్’ అని, ఈ ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్లు గెలవాలని నినాదమిచ్చారు. దాని తరువాత ఆయన మోదీ గ్యారెంటీ నినాదమిచ్చారు. ప్రపంచ ఎన్నికల చరిత్రలో పార్టీని పక్కకు పెట్టి వ్యక్తి గ్యారెంటీ మ్యానిఫెస్టో రాయించారు. ఇది మామూలు విషయం కాదు. ఆ వెనువెంటనే ఆరెస్సెస్, బీజేపీ లీడర్లు కొంతమంది 400 సీట్లు రాగానే దేశ రాజ్యాంగాన్ని తిరగ రాస్తామని ప్రకటనలు ఇవ్వడం మొదలు పెట్టారు. అలా తిరగరాత సిద్ధాంతం ఉన్న ఆరెస్సెస్ నాయకులెవరు ఇటువంటి ప్రకటనలను ఖండించలేదు. ఆనాటికి గానీ, ఇప్పుడు గానీ ఎన్డీఏలో ఉన్న పార్టీలవారికి... అనుకున్న 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని తిరగరాసే ప్రక్రియను ఎదుర్కొనే శక్తి లేదు. వారికి అధికారం తప్ప బలమైన సిద్ధాంతం కూడా లేదు. వాళ్ళ పార్టీ అధికారం తప్ప దేశం ఎటుపోయినా ఫర్వాలేదు. ఈ స్థితిలో ఇండియా కూటమి ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణను ప్రధాన అంశాన్ని చేసింది. ఎన్నికల తర్వాత పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపీని, అంబేడ్కర్ బొమ్మనీ బహిరంగ సభల్లో చూపిస్తూ తిరిగారు. ఎన్నికల పోరాటమంతా రాజ్యాంగం చుట్టూ తిరిగే స్థితి మొదటిసారి వచ్చింది. ప్రపంచ పత్రికలు కూడా ఒక దేశం రాజ్యాంగ రక్షణ అంశం ఇంత పెద్దఎత్తున ఏ దేశ ఎన్నికల్లో కూడా చర్చనీయాంశం కాలేదని రాశాయి. టీవీలు, సోషల్ మీడియా మాట్లాడాయి. ఐతే ఎన్నికల సమయంలో ఒక మోదీ తప్ప ఆరెస్సెస్ ప్రధాన నాయకుడైన మోహన్ భాగవత్ సహా రాజ్యంగాన్ని తిరగరాసే ఆలోచన లేదని చెప్పలేదు. మోదీ మాత్రం మేమే ఈ రాజ్యాంగ రక్షకులమని కొన్ని సభల్లో మాట్లాడారు. కానీ ఆరెస్సెస్, బీజేపీ నాయకులంతా సైలెంట్గా ఉన్నారు. దానికి ప్రధాన కారణమేమిటంటే, ఈ రాజ్యాంగం పరిధిలో పార్లమెంట్, ఇతర సంస్థలపై సంపూర్ణ పట్టు సాధించి తరువాత ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేది వారి ఆలోచన. ఈ ఆలోచన ఇప్పటిది కాదు. ఇప్పుడున్న రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండే దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దీనికి మనుధర్మ శాస్త్ర లక్షణాలు ఏ మాత్రం లేవనేది వారి ప్రధాన వాదన. వాళ్ళ అవగాహనలో భారతీయ చట్ట సంస్కృతి అంటే మనుధర్మ శాస్త్ర చట్ట సంస్కృతి. దాంట్లో ప్రధానమైన వర్ణ–కుల వ్యవస్థనీ, స్త్రీ అసమాన జీవితాన్నీ కాపాడటం. సమాజ అసమానతలు భారతీయ సంస్కృతిలో భాగం అని వారి భావన. అదృష్టవశాత్తు బీజేపీకి 240 సీట్లు మాత్రమే రావడం, దానికి రాజ్యాంగ రక్షణ డిబేట్ దోహదపడటం జరిగింది. అయితే రాజ్యాంగ పర చర్చ ప్రజల జీవనంలోకి చొచ్చుకుని పోకుండా ఉండటానికి ఆరెస్సెస్, బీజేపీ ఒక ఎత్తుగడ వేశాయి. అది 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమస్యను ముందుకు తేవడం! ఎమర్జెన్సీలో చాలా అట్రాసిటీలు, అరాచకాలు జరిగిన మాట నిజమే కానీ అది మొత్తం రాజ్యాంగాన్ని మార్చేటటువంటి ప్రమాద ఘట్టం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఎంతోమంది యువకులు ఎమర్జెన్సీలో ఎదురు కాల్పుల పేరిట చంపబడ్డారు. ఐతే రాజ్యాంగానికి వచ్చేవరకు ఆ కాలంలో చేసిన రెండు సవరణలు: ప్రియాంబుల్లో ‘సోషలిజం’ అనే పదం చేర్చడం; రెండవది ఫండమెంటల్ రైట్స్కు కొంత అఘాతం కలిగించే ఫండమెంటల్ డ్యూటీస్ని రాజ్యాంగంలో చేర్చడం. ఆరెస్సెస్, బీజేపీ సోషలిజం అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చడాన్ని వ్యతిరేకించాయి. కానీ ఫండమెంటల్ డ్యూటీస్ని రాజ్యాంగంలో చేర్చడాన్ని బలపర్చాయి. బంగ్లాదేశ్ను పాకిస్తాన్ నుంచి విడగొట్టి, పాకిస్తాన్ను యుద్ధంలో ఓడించినందుకు ఇందిరాగాంధీని దుర్గాదేవిగా వర్ణించిన వారిలో ఆరెస్సెస్, బీజేపీ వారు ఉన్నారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయీకరణ, రాజ భరణాల రద్దు వంటి ఆమె నిర్ణయాలను వ్యతిరేకించారు. ఈ మూడు సిద్ధాంతకర మార్పులు సోషలిస్టు సిద్ధాంత ప్రభావంతో ఇందిరాగాంధీ చేస్తున్నారని వాజ్పేయి, ఎల్కె అద్వానీ వంటి నాయకులు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయీకరణ, రాజ భరణాల రద్దు... శ్రమ జీవులకు, ఉత్పత్తి కులాలకు మేలు చేశాయి. ఈ క్రమంలో ఆమె భూ సంస్కరణల చట్టం చెయ్యడానికి శ్రీకారం చుట్టారు. 1972లో దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక బలమైన భూ సంస్కరణల చట్టం వచ్చింది. ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి 27 ఎకరాల తరి, 57 ఎకరాల ఖుశ్కి భూమి కంటే ఎక్కువ ఉండటానికి వీలు లేదని చట్టం తెచ్చింది ఆమెనే. ఆ చట్టాన్ని ఎమర్జెన్సీలో భూస్వాములపై ఒత్తిడి తెచ్చి కొంత అమలు చేశారు. నేను 1980లో ఈ చట్టం అమలుపై ఎంఫిల్ «థీసిస్ కోసం చాలా గ్రామాల్లో ల్యాండ్ రిఫామ్ ఎలా జరిగిందో పరిశీలించాను. భూస్వాములు భూములను బినామీ పేర్లమీద మార్చి చాలావరకు కాపాడుకున్నప్పటికీ ఎమర్జెన్సీలో కొంత భూమి పంచబడింది. ఆ కాలంలో తన పదవి కాపాడుకోవడం కోసం ప్రతిపక్ష నాయకులను ఇందిర అరెస్టు చేశారు. మీడియా మీద ఆంక్షలు విధించారు. నిజమే. అందుకే ఎమర్జెన్సీ ఎత్తివేయగానే దేశంలో ఒక పౌరహక్కుల ఉద్యమం ముందుకొచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు దేశంలో పౌరహక్కులను కాపాడవలసిన అవసరముందని మాట్లాడాయి. ఆ ఒక్క దశలోనే బీజేపీ నాయకులు కూడా పౌరహక్కుల ఉద్యమాన్ని బలపర్చారు. తర్వాత వాళ్లు పౌరహక్కుల రక్షణ జోలికి పోలేదు. కనుక ఎమర్జెన్సీ అనేది రెండువైపుల పదునున్న కత్తిలా పని చేసింది. కానీ ఆరెస్సెస్, బీజేపీ ఈ రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని నిర్మించాలనుకున్న ఆలోచనలో శూద్రుల, దళితుల, ఆదివాసుల పక్షపాత ఆలోచనలు ఉండే అవకాశం ఏమాత్రం లేదు. వాళ్లు అనుకున్నట్టు నిజంగానే 400 సీట్లు వచ్చి ఉంటే వాళ్లు కొత్త కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీని స్థాపిస్తే దాంట్లో ఎటువంటి మేధావి వర్గం ఉండేవారు? ఆ రాజ్యాంగ పరిషత్ కుల అసమానతలను, అంటరానితనాన్ని, బీదరికాన్ని తొలగించే గట్టి ప్రతిపాదనలు చేసే అవకాశం ఉండేదా! నిజానికి బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దుపై చర్చ జరుగుతున్నప్పుడు ఆరెస్సెస్, బీజేపీ నాయకుల వాదనలు; రాజరిక వ్యవస్థ పట్ల జమీందారీ హక్కుల పట్ల వాళ్లు ఎంత అనుకూలంగా ఉన్నారో తిరిగి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు రాజ్యాంగంలోని ప్రియాంబుల్లో ఉన్న ‘సోషలిజం’ అనే పదాన్ని వాళ్లు తొలగించాలనుకునేది భారతీయ కష్ట జీవుల పక్షాన ఉండటానికా? పెట్టుబడిదారుల పక్షాన ఉండటానికా?2024 ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి. ఐతే ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం అప్పుడే పూర్తిగా తొలగిపోలేదు. చంద్రబాబు, నితీష్కుమార్ వంటి సిద్ధాంత రహిత ప్రాంతీయ నాయకులు కూడా ఈ భవిష్యత్ ప్రమాదం నుండి దేశాన్ని కాపాడలేరు. దేశం మొత్తంగా ఇప్పుడున్న రాజ్యాంగాన్ని రక్షించుకునే చైతన్యం పెరగాలి. ఓటు రాజ్యాంగ రక్షణ ఆయుధాలలో కీలకమైంది. ఐతే దాన్ని ప్రజలు, ముఖ్యంగా యువకులు నిరంతరం ఇప్పుడున్న రాజ్యాంగంతో ముడేసి చూడాలి. ఈ ఎన్నికల్లో రాజ్యంగం పట్ల కలిగిన కొత్త చైతన్యాన్ని తగ్గించేందుకు ఆరెస్సెస్, బీజేపీలు ఎమర్జెన్సీ అంశాన్ని ముందు పెట్టి చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాయి. జూన్ 25న వి.పి. సింగ్ జయంతి సభ ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో జరిగింది. మాట్లాడటానికి నేను ముఖ్య అతిథిగా వెళ్ళాను. అందులోనే చాలా పెద్ద హాలులో రైట్వింగ్ ఆలోచనాపరులు ఎమర్జెన్సీలో జె.పి. మూమెంట్పై మీటింగ్ పెట్టారు. ఎందుకో తెలుసా? రాజ్యాంగ మార్పు కంటే ఎమర్జెన్సీ ప్రమాదకరమని చెప్పడానికి!ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
పార్లమెంట్ రౌండప్.. విపక్షాల వాకౌట్
ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఏర్పడిన తర్వాత జరిగిన తొలి పార్లమెంట్ సమావేశాలు బుధవారం(జులై 3)తో ముగిశాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ రాజ్యసభలో మాట్లాడారు. ప్రధాని మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు ఆందోళన చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో ప్రధాని తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపారు. విపక్షాల వాకౌట్పై ప్రధాని మోదీతో పాటు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు సభా మర్యాదను విడిచి వెళ్లారన్నారు. కాసేపటి తర్వాత ప్రధాని తన ప్రసంగాన్నితిరిగి కొనసాగించారు. ప్రధాని మాట్లాడటం పూర్తయిన తర్వాత రాజ్యసభను చైర్మన్ నిరవధిక వాయిదా వేశారు. లోక్సభ మంగళవారమే నిరవధిక వాయిదా పడటంతో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ముగిసినట్లయింది. కాంగ్రెస్పై మళ్లీ విమర్శల దాడి.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ ప్రధాని మరోసారి కాంగ్రెస్పై విమర్శల దాడి చేశారు. దాదాపు 60 ఏళ్ల తర్వాత దేశంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న పార్టీ వరుసగా మూడోసారి పవర్లోకి వచ్చిందన్నారు. ఇది సాధారణ విషయం కాదన్నారు. మళ్లీ తామే అధికారంలోకి రావడంతో కొందరు అసంతృప్తిగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఓ నేత తమను మూడోవంతు ప్రభుత్వం అని విమర్శిస్తున్నారని ప్రధాని అన్నారు.. ఇది నిజమేనని, తాము మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటామన్నారు. తమ పాలనలో కేవలం మూడవ వంతు మాత్రమే ఇప్పటికి పూర్తయిందన్నారు.ప్రతిపక్షాల హయాంలో రిమోట్ కంట్రోల్ పాలన నడిచిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థవృద్ధిలో భారత్ను ప్రపంచంలో పది నుంచి ఐదో స్థానానాకి తీసుకువచ్చామని, భవిష్యత్తులో మూడో స్థానానికి చేరుస్తామని ప్రధాని చెప్పారు. మణిపూర్, నీట్లపై స్పందించిన ప్రధాని..మణిపూర్, నీట్ అంశాలపై సమావేశాల తొలి రోజు నుంచి విపక్షాలు చర్చకు పట్టుపట్టడంతో ప్రధాని రాజ్యసభలో ఈ అంశాలపై స్పందించారు. మణిపూర్లో శాంతి స్థాపనకు ప్రభుత్వం కృషి చేస్తోందని, దీనిపై రాజకీయాలు చేయొద్దని సూచించారు.నీట్ పరీక్ష పేపర్ లీకేజీపైనా ప్రధాని మాట్లాడారు. నీట్లో అక్రమాలకు పాల్పడినవారిని ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సుధామూర్తికి ప్రశంసలు..దాత, రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి మంగళవారం రాజ్యసభలో చేసిన ప్రసంగంపై ప్రధాని బుధవారం సభలో ప్రశంసలు కురిపించారు. సుధామూర్తి దేశంలో మహిళల ఆరోగ్యానికి సంబంధించి విలువైన సూచనలిచ్చారని కొనియాడారు. తమ ప్రభుత్వం గత పదేళ్లలో మహిళల కోసం ఎన్నో ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని తెలిపారు. -
గత పదేళ్లు ఒక్క లెక్క.. ఈ ఐదేళ్లు మరో లెక్క అనుకోవాల్సిందేనా ?
-
బడులు తెరిచారు.. బరువు మోపారు.. 'వందనమేదీ'!
వెంటనే పిల్లలందరికీ ఇవ్వాలి..నాకు ఇద్దరు పిల్లలు. ఒక పాప ఆరో తరగతి, మరో అమ్మాయి ఐదో తరగతి చదువుతున్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ డబ్బులిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు డబ్బులు రాలేదు. గత ప్రభుత్వంలో స్కూళ్లు తెరవగానే మా ఖాతాలో డబ్బులు జమ చేసేవారు. – పదముత్తం లక్ష్మి, ఏరూరు, చిల్లకూరు మండలం, తిరుపతి జిల్లాసాక్షి, అమరావతి: ‘ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం పథకంఅమలు చేస్తాం. ఒక్కరుంటే రూ.15 వేలు ఇస్తాం. ఇద్దరుంటే రూ.30 వేలు.. ముగ్గురుంటే రూ.45 వేలు నేరుగా ఖాతాల్లోనే జమ చేస్తాం. ఇంకా పిల్లలను కనండి.. పథకాలు అందుకోండి..’ అంటూ ఎన్నికల ప్రచార సభల్లో ప్రతిచోటా చాటింపు వేసిన సీఎం చంద్రబాబు ఒకపక్క పాఠశాలలు పునఃప్రారంభమై నెల కావస్తున్నా ఆ ఊసే పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రుల్లో ఆందోళన రేగుతోంది. మంత్రి నారా లోకేశ్తోపాటు ఎన్డీఏ కూటమిలోని ముఖ్య నాయకులంతా ప్రజలకు బహిరంగంగా ఈ ఇచ్చిన హామీపై నోరు మెదపడం లేదు. రాష్ట్రంలో బడికి వెళ్లే విద్యార్థులు, బడి ఈడు పిల్లలు దాదాపు కోటి మందికి పైగా ఉన్నట్లు అంచనా. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వీరందరికీ ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలంటే ఏటా సుమారు రూ.15 వేల కోట్లు అవసరం. కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ కోటి మంది పిల్లలకు ‘తల్లికి వందనం’ ఇవ్వాలి. ఇప్పటివరకు ఈ పథకంపై ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయకపోగా ఈ హామీని ఎగ్గొట్టేందుకు ఎత్తుగడలు వేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాదంతా కాలయాపన చేసి లబ్ధిదారులను తగ్గించేందుకు పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఏరుదాటాక తెప్ప తగలేయడంలో నిపుణుడైన చంద్రబాబు 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ హామీని నెరవేర్చకుండా కోటయ్య కమిటీ పేరుతో కోతలు విధించిన వైనాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.ఖర్చులు తడిసిమోపెడు..పాఠశాలలు తెరవటమే ఆలస్యం.. పిల్లల ఫీజులు, ఇతర ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ‘అమ్మ ఒడి’ పథకం నాలుగేళ్ల పాటు తల్లిదండ్రులకు నిశ్చింత కల్పించింది. పిల్లలను ఏ పాఠశాలలో చదివిస్తున్నా సరే వంద శాతం పారదర్శకతతో గత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. విద్యార్థులను క్రమం తప్పకుండా బడికి రప్పించడమే లక్ష్యంగా తల్లులు బాధ్యత తీసుకునేలా ప్రోత్సహించింది. ఏటా రూ.6,400 కోట్లు చొప్పున నాలుగేళ్లలో రూ.26 వేల కోట్లకుపైగా అమ్మ ఒడి ద్వారా అందించడం పిల్లల చదువుల పట్ల మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం. భావి పౌరుల భవితవ్యానికి భరోసా కల్పిస్తూ వెలుగులు పంచిన ఈ పథకంపై ఇప్పుడు చీకట్లు అలుముకుంటున్నాయి. ఈ పథకం పేరు మార్చేసి ‘‘తల్లికి వందనం’’ అంటూ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్ హామీ కింద ప్రకటించిన కూటమి సర్కారు స్కూలుకి వెళ్లే విద్యార్థులతో పాటు ప్రతి బిడ్డకూ ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఒక్కో ఇంట్లో నలుగురు ఐదుగురు పిల్లలున్న కుటుంబాలు తమకు రూ.60 వేల నుంచి రూ.75 వేల వరకు లబ్ధి చేకూరుతుందని ఆశపడ్డారు. ఇప్పటికే పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ‘తల్లికి వందనం’పై ఇంతవరకూ కొత్త సర్కారు నోరు మెదపకపోవడంతో ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్న తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక, పుస్తకాల ఖర్చులు తడిసిమోపెడు కావడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కాలయాపన.. కోతలు2014 ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక అనేక కొర్రీలు వేసి లబ్ధి పొందే రైతులను భారీగా తగ్గించేసి అరకొరగా విదిలించారు. ఇప్పుడు తల్లికి వందనంపైనా ఇలాగే ముందుకెళ్లాలని కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఒక్కో బిడ్డకు రూ.15 వేలు చొప్పున ఒక ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికీ పథకం వర్తింప చేస్తామని ఇచ్చిన హామీ ప్రభుత్వ పెద్దల్లో కూటమి సర్కారులో గుబులు రేపుతోంది. ఏటా రూ.15 వేల కోట్ల నిధులు అవసరం కావడం ఇందుకు కారణం. దీంతో వలంటీర్లను గౌరవ వేతనం రెట్టింపు చేసి మరీ కొనసాగిస్తామన్న హామీని గాలికి వదిలేసినట్లే... ‘తల్లికి వందనం’ కూడా లబ్ధిదారుల ఎంపిక పేరుతో ఈ ఏడాది కాలయాపన చేసి అనంతరం రకరకాల నిబంధనలతో కోతలు విధించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. టీడీపీ హయాంలో రైతుల రుణమాఫీపైనా ఇదే విధానం అనుసరించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. అదే జరిగితే తమ పిల్లల చదువులు నాశనమవుతాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. డ్రాప్ అవుట్స్కు అడ్డుకట్ట..బడి ఈడు పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలల్లో ఉండేలా, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం సంస్కరణలు చేపట్టి విద్యారంగాన్ని బలోపేతం చేసింది. పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ను గణనీయంగా తగ్గించాలనే సదుద్దేశంతో అమ్మఒడి పథకానికి విద్యార్థి హాజరును ప్రామాణికంగా తీసుకుంది. పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపి కనీసం 75 శాతం హాజరు ఉండేలా తల్లులు బాధ్యత తీసుకునేలా ప్రోత్సహించింది. 2019– 20, 2020–21 విద్యా సంవత్సరాల్లో మాత్రం కోవిడ్ కారణంగా విద్యార్థులకు 75 శాతం హాజరు నుంచి మినహాయింపునిచ్చారు. జీఈఆర్...2018లో ప్రాథమిక విద్యలో జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) జాతీయ సగటు 99.21 శాతం కాగా ఆంధ్రప్రదేశ్ 84.48 శాతానికే పరిమితమైంది. నాడు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో అట్టడుగు స్థానం ఏపీదే కావడం గమనార్హం. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యారంగంలో తెచ్చిన సంస్కరణలతో నాలుగేళ్లలో జీఈఆర్ వంద శాతానికి పెరిగింది. జీఈఆర్ శాతాన్ని మరింత మెరుగుపర్చేందుకు 10–12వ తరగతుల్లో ఉత్తీర్ణత సాధించని వారు తిరిగి తరగతులకు హాజరయ్యేలా అవకాశం కల్పించడమే కాకుండా వారికి కూడా అమ్మఒడిని గత సర్కారు అందించింది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునేలా ఈ నిర్ణయం నూరు శాతం ఉపయోగపడింది.జూన్లోనే జమకు గత సర్కారు ఏర్పాట్లు..పిల్లలను బడికి పంపే తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న సంకల్పంతో 2019 జూన్లో జగనన్న అమ్మఒడి పథకాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్కూళ్లు తెరిచిన వెంటనే జూన్లోనే అంతకుముందు సంవత్సరం హాజరును బట్టి రూ.15 వేలు చొప్పున అందిస్తూ రూ.వెయ్యి టాయిలెట్ మెయింట్నెన్స్ ఫండ్కి, మరో రూ.వెయ్యి స్కూల్ నిర్వహణ నిధికి జమ చేసింది. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు అమ్మ ఒడి అందించి చదువులకు భరోసా కల్పించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్.. ఇలా ఎక్కడ చదువుతున్నా సరే పథకాన్ని నూరు శాతం పారదర్శకతతో అమలు చేసింది. 2022–23కి సంబంధించి గతేడాది జూన్ 28వ తేదీన 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం జమ చేసింది. ఐదో విడత అమ్మఒడి కింద ఈ ఏడాది జూన్లో నిధులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేసినా కొత్త ప్రభుత్వం రావడంతో సాయం నిలిచిపోయింది. జూలై వచ్చినా తల్లికి వందనంపై కూటమి సర్కారు స్పందించకపోవడంతో తల్లిదండ్రులు ఆర్థిక భారాన్ని తలచుకుని ఆందోళన చెందుతున్నారు.మాట ప్రకారం డబ్బులివ్వాలిగత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద ఏటా సకాలంలో నగదు నా ఖాతాలో జమ చేశారు. పిల్లల చదువుల కోసం అది ఎంతో ఉపయోగపడేది. కూటమి పార్టీలు ప్రతి విద్యార్ధికీ రూ.15 వేలు చొప్పున డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చాయి. బడులు ఇప్పటికే తెరిచినా కొత్త ప్రభుత్వం ఇంత వరకు ఏమీ చెప్పడం లేదు. చేసేదేమీ లేక రూ.15 వేలు అప్పు చేసి పిల్లలకు అవసరమైనవి కొన్నాం. మాట ప్రకారం పిల్లల చదువులకు డబ్బులు ఇవ్వాలి. – పద్మ, విద్యార్థి తల్లి, పుత్తూరు, తిరుపతి జిల్లాపాత వాటికి పేర్లు మార్చారే కానీపిల్లలు స్కూళ్లకు వెళుతున్నా ఏ పథకం అందలేదు. పాత పథకాలకు పేర్లు మార్చారే కానీ లబ్ధిదారులకు ఇంతవరకు ఏ పథకం ద్వారా డబ్బులు ఇవ్వకపోవడం దారుణం. ఇలాగే ఉంటే మా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమే. కొత్త ప్రభుత్వం స్పందించి వెంటనే పథకాలు అందేలా చూడాలి. – సి.జానకి, జల్లావాండ్లపల్లె, చిన్నమండెం మండలం, అన్నమయ్య జిల్లాఎప్పుడూ ఇలా ఆలస్యం కాలేదునా కుమార్తె లిఖిత జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఇంతవరకూ మాకు అమ్మ ఒడి డబ్బులు పడలేదు. గతంలో ఎప్పుడూ ఇలా ఆలస్యం కాలేదు. అసలు డబ్బులు పడతాయో లేదో కూడా తెలియడం లేదు. ఎవరిని అడిగినా మాకు తెలియదంటున్నారు. పిల్లల చదువుల కోసం అప్పు చేయాల్సి వస్తోంది. – మరడాన జ్యోతి, రామభద్రపురం, విజయనగరం జిల్లాబడులు మొదలైనా ఆ ఊసే లేదు గతంలో స్కూళ్లు తెరవగానే అమ్మ ఒడి అందేది. పిల్లల చదువులకు ఎంతో ఉపయోగపడేవి. ఈసారి బడులు ప్రారంభమైనా ఇంతవరకూ ఆ ఊసే లేదు. అసలు డబ్బులు ఇస్తారో లేదో కూడా ఈ ప్రభుత్వంలో స్పష్టత లేదు. గతంలో ఉన్న లబ్ధిదారులందరికీ అమ్మఒడి ఇవ్వాలి. – రమణమ్మ, అంకేపల్లి, మర్రిపూడి, ప్రకాశం జిల్లా పిల్లలను ఆదుకోండయ్యా..! పాఠశాలలు తెరిచి రెండు వారాలు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఏ పథకం అందలేదు. మా పిల్లలను ఆదుకుని పథకాలు వర్తింపచేసేలా ప్రభుత్వం చొరవ చూపాలి. – పి.రామలక్ష్మమ్మ, మల్లూరు, చిన్నమండెం మండలం, అన్నమయ్య జిల్లా -
రాహుల్లా ప్రవర్తించొద్దు!
న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం సభలో అనుచితంగా మాట్లాడారని, ఆయనలాగా ఎవరూ ప్రవర్తించకూడదని, మాట్లాడకూడదని బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ సూచించారు. మంగళవారం ఎన్డీయే పక్షాల ఎంపీల సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటరీ నిబంధనలు, విధివిధానాలను ప్రతి ఒక్కరూ తూ.చా. తప్పకుండా పాటించాలని, సభలో స్రత్పవర్తన కలిగి ఉండాలని తెలిపారు.సభలో అనుసరించాల్సిన ఉత్తమ విధానాల గురించి సీనియర్ ఎంపీల నుంచి నేర్చుకోవాలని కొత్తగా ఎన్నికైన ఎంపీలకు సూచించారు. కాంగ్రెస్సేతర నాయకుడు, అందులోనూ ఒక సాధారణ చాయ్వాలా మూడోసారి ప్రధానమంత్రి కావడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేయాలని, సభకు తప్పనిసరిగా హాజరు కావాలని, నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలను ప్రభావవంతంగా ప్రస్తావించాలని పేర్కొన్నారు.ఏదైనా అంశంపై మీడియాతో మాట్లాడాలనుకుంటే తొలుత దానిపై అధ్యయనం చేయాలని చెప్పారు. నియోజకవర్గాలతో ఎప్పటికప్పుడు అనుసంధానమై ఉండాలని, మనకు మద్దతు ఇచ్చిన ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పడం మన బాధ్యత అని వివరించారు. పార్లమెంట్ సభ్యులుగా దేశ సేవకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి మ్యూజియాన్ని ఎంపీలందరూ సందర్శించాలని, భారత ప్రధానమంత్రుల జీవిత ప్రస్థానం గురించి అక్కడ తెలుసుకోవాలని సూచించారు. -
రాహుల్లా ఎవరూ ప్రవర్తించకండి: ఎన్డీయే ఎంపీలకు మోదీ సూచన
న్యూఢిల్లీ: మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్డీయే పక్షాల ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) తొలిసారి సమావేశమయ్యారు. ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ సమావేశంలో మిత్రపక్ష ఎంపీలను ఉద్ధేశించి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ సమావేశాల్లో రాహుల్ గాంధీ, విపక్షాల దాడి నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన విధానాలపై ఎన్డీయే కూటమి ఎంపీలకు మోదీ దిశానిర్దేశం చేశారు.ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలంతా కచ్చితంగా హాజరుకావాలని ఆదేశించారు. ఎన్డీయే కూటమి ఎంపీలు పార్లమెంట్ నిబంధనలను పాటించాలని, సభలో వారి ప్రవర్తన ఆదర్శప్రాయంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన సభ్యులు నిబంధనల విషయంలో సీనియర్లను అడిగి తెలుసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్, రాహుల్గాంధీపై మోదీ విమర్శలు గుప్పించారు. వరుసగా మూడోసారి కాంగ్రేసేతర పార్టీకి చెందిన నేత ప్రధాని కావడాన్ని విపక్షాలు సహించలేకపోతున్నట్లు విమర్శించారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉండి రాహుల్ గాంధీ సభలో అవమానకర ప్రసంగం చేశారని మండిపడ్డారు. ఆయనలా ఎవరూ ప్రవర్తించొద్దని.. ఎన్డీయే ఎంపీలంతా పార్లమెంటరీ విధి విధానాలను తప్పనిసరిగా పాటించాలని ప్రధాని సూచించారు.సమావేశంలో మోదీ ప్రసంగం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వెల్లడించారు. దేశసేవ చేసేందుకు ఎంపీలంతా పార్లమెంట్కు రావాలని మోదీ సూచించారని తెలిపారు. సభలో ఎలా నడుచుకోవాలో కూడా మార్గనిర్దేశం చేశారని చెప్పారు. తమ నియోజకవర్గానికి చెందిన అంశాలను పార్లమెంట్లో రెగ్యులర్గా ప్రస్తావించాలని, పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించాలని చెప్పినట్లు పేర్కొన్నారు.‘నిన్న పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ ప్రవర్తించిన తీరు అమర్యాదకరం. స్పీకర్ స్థానాన్ని ఆయన అవమానించారు. రాహుల్గా ఎన్డీయే సభ్యులెవరూ ప్రవర్తించొద్దు. కొన్ని దశాబ్దాల పాటు ప్రధాని కుర్చీని ఓ కుటుంబం తన గుప్పిట్లో ఉంచుకుంది. కానీ మా ప్రభుత్వం దేశ నేతలందరికీ సమాన గౌరవం ఇస్తుంది.పార్టీలకు అతీతంగా దేశంలోని ప్రతీ ఎంపీ తమ కుటుంబసభ్యులతో కలిసి ప్రధానమంత్రి సంగ్రహాలయ్ (గతంలోని నెహ్రూ మ్యూజియం)ను సందర్శించాలి. అందులో మాజీ ప్రధాని నెహ్రూ నుంచి మోదీ వరకు ప్రధానుల ప్రయాణాన్ని అందంగా ప్రదర్శించారు. వారి జీవిత విశేషాలను మనమంతా తెలుసుకోవాలి’ అని ప్రధాని ఎంపీలకు సూచించినట్లు రిజిజు తెలిపారు. రాహుల్ గాంధీ ప్రసంగానికి కౌంటర్ మోదీ ఇస్తారని, ఆ సందేశం ప్రతి ఒక్కర్నీ ఉద్దేశించి ఉంటుందని రిజిజు పేర్కొన్నారు. -
NDA ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది
-
ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరిపించండి: కేసీ వేణుగోపాల్
Updatesఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు.లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ.. బీజేపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.బీజేపీలో పాలనలో ఢిల్లీ ఎయిర్ పోర్టు, జబల్పూర్ ఎయిర్పోర్టుల రూఫ్లు కూలిపోయాయని అన్నారు. రాజ్కోట్ ఎయిర్పోర్టు రూఫ్ ధ్వంసం అయింది. అయోధ్యలో రోడ్లు అధ్వానంగాఉన్నాయి. రామ మందిరంలో నీరు లీక్ అవుతోంది. ముంబై హార్బర్ లింక్ రోడ్డుకు పగుళ్లు వచ్చాయి. బీజేపీ పాలనలో బిహార్లో మూడు బ్రిడ్జ్లు కూలిపోయాయి. ఇవాన్ని కూడా ఎన్డీయే ప్రభుత్వంలో చోటు చేసుకున్నాయి. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో విచారణ జరిపించాలని ప్రధాని మోదీకి సవాల్ విసురుతున్నా అని అన్నారు.#WATCH | Delhi: In the Lok Sabha, Congress MP KC Venugopal says, "... Delhi Airport roof collapsed, Jabalpur Airport roof collapse, Rajkot Airport canopy collapse, conditions of roads in Ayodhya is bad, leakage in Ram Mandir, cracks in Mumbai Harbour link road, three new bridges… pic.twitter.com/CtYCzhLp3E— ANI (@ANI) July 2, 2024 లోక్సభ స్పీకర్కు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖతను నిన్న లోక్సభలో మాట్లాడిన ప్రసంగంలో చాలా వ్యాఖ్యలను స్పీకర్ను తొలగించటంపై షాక్కు గురయ్యా.తన మాటాలను పునురుద్ధరించాలని స్పీకర్కు ఓం బిర్లాకు లేఖ రాసిన రాహుల్తన వ్యాఖ్యల రికార్డుల నుంచి తొలగించటం ప్రజాస్వామ్య పార్లమెంట్ సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధమని రాహుల్ లేఖలో పేర్కొన్నారు.Lok Sabha LoP and Congress MP Rahul Gandhi writes to Speaker Om Birla over the remarks and portions from his speech expunged; requests that the remarks be restored. The letter reads, "...Shocked to note the manner in which considerable portion of my speech have been simply… pic.twitter.com/zoD8A0xvlc— ANI (@ANI) July 2, 2024 రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో వైఎస్సాసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు.విశాఖ, చెన్నై కోస్టల్ కారిడార్పై రాజ్యసభలో ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలిఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ కాదు, అది ప్రజల హక్కుఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం టీడీపీకి ఉందిరాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం పార్టీప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ అడగాలిఅన్యాయంగా విభజించడం వల్ల ఏపీ నష్టపోయిందిప్రత్యేక హోదా వల్ల నష్టాన్ని నివారించే అవకాశం ఉందివిభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పూర్తి చేయాలిటీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు వారాల్లోనే వైఎస్సార్సీపీ శ్రేణులపై దారుణంగా దాడులు చేస్తుందిపోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలివైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపివేయాలివిశాఖ స్టీల్ ప్లాంట్ కు తగ్గిన గనులు కేటాయించి లాభాల్లోకి తీసుకురావాలిఏపీలో శాంతిని స్థాపించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలిఏపీలో ఐదేళ్లలో 16 మెడికల్ కాలేజీలను మాజీ సీఎం వైఎస్ జగన్ స్థాపించారు.తక్కువ ఖర్చుతో డాక్టర్లను తయారు చేసే కార్యక్రమం మొదలుపెట్టారుఫ్యామిలీ డాక్టర్ పథకం ప్రవేశపెట్టి పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారురైతులకు గిట్టుబాటు ధరలు అమలు చేయండిగ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో రైతుల పంటలకు తగ్గిన భీమా సౌకర్యం కల్పించాలిరైల్వేలలో ప్రయాణికుల భద్రతకు నిధులను పెంచాలిరైలు ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో వాటి నివారించేందుకు చర్యలు తీసుకోవాలిభద్రత చర్యలను వెంటనే అప్గ్రెడ్ చేయాలిరైల్వే జోన్కు ఇప్పటికే ప్రభుత్వం భూములు కేటాయించిందినడికుడి శ్రీకాళహస్తి ప్రాజెక్టును పూర్తి చేయాలివైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ను వెంటనే పూర్తి చేయాలిభోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వేగంగా పూర్తి చేయాలివిశాఖపట్నం మెట్రో రైలును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించాలి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే వ్యవహరిస్తున్న తీరును ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ తప్పుపట్టారు. ప్రతిసారి రాజ్యసభ ఛైర్మన్ను అగౌరవపరచలేరు. దేశ చరిత్రలో రాజ్యసభ కార్యకలాపాల్లో సభ ఛైర్మన్ పట్ల ఇంత నిర్లక్ష్యం ఎప్పుడూ జరగలేదు.తాను ఎప్పుడూ ప్రతిపక్ష సభ్యుల గౌరవాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తాన్నారు. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది.గత ఎన్నికల ఇండియా కూటమి నైతిక విజయం సాధించింది: ఎంపీ అఖిలేష్ యాదవ్బీజేపీ 400 సీట్ల నినాదం విఫలమైంది.జూన్ 4 నుంచి మత రాజకీయాలకు విముక్తి లభించింది400 సీట్లు గెలుస్తామని ప్రచారం చేసుకున్నారు.వర్షాలు వస్తే ఉత్తరప్రదేశ్లో నగరాలు చెరువులయ్యాయి. 2024 ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచింది.ఎన్డీయే నడిచే సర్కార్ కాదు.. పడిపోయే ప్రభుత్వం: ఎంపీ అఖిలేష్ యాదవ్ #WATCH | Speaking on the paper leaks issue in Lok Sabha, Samajwadi Party MP Akhilesh Yadav says," Why are paper leaks happening? The truth is that this is being done by the government so that it doesn’t have to give jobs to youth." pic.twitter.com/9EC1y8kUgi— ANI (@ANI) July 2, 2024 జులై 1వ తేదీన లోక్సభలో రాహుల్ స్పీచ్ నుంచి కొన్ని వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించినట్లు లోక్సభ సెక్రటేరియట్ వెల్లడించింది. హిందూమతాన్ని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలతో పాటు, బీజేపీ, ఆర్ఎస్ఎస్, అగ్నివీర్, మోదీ, నీట్ పరీక్షల్లో అక్రమాలపై ప్రతిపక్ష నేత అన్న మాటలను తొలగిస్తున్నట్లు లోక్సభ సచివాలయం పేర్కొంది. స్పీకర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూటమి ఎంపీలకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం చేశారు.పార్లమెంట్లో ఎంపీలంతా నిబంధనలను పాటించాలి: మోదీలోక్సభ ఎంపీల ప్రవర్తన ఆదర్శవంతంగా ఉండాలి.లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలా వ్యవహరించవద్దుఎంపీలు అభివృద్దిపై దృష్టి పెట్టాలని మోదీ సూచించారు.సమావేశాలు జరగుతున్నప్పడు ఎక్కువ సమయం సభలోనే ఉండాలిప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీయే ఎంపీలు హాజరయ్యారు.#WATCH | PM Modi welcomed by NDA leaders at the NDA Parliamentary Party meeting in Delhi pic.twitter.com/dRZnJ7yHzv— ANI (@ANI) July 2, 2024 ప్రధాని మోదీ నేతృత్వలో జరిగినే ఎన్డీయే కూటమి పార్లమెంటరీ సమావేశంలో పాల్గొనడానికి పలువురు ఎంపీలు పార్లమెంట్కు చేరుకుంటున్నారు.Delhi | NDA leaders Giriraj Singh, Milind Deora, Kangana Ranaut and Jayant Chaudhary arrive for NDA parliamentary party meeting in Parliament premises pic.twitter.com/eWnafFv0yN— ANI (@ANI) July 2, 2024 ఢిల్లీ: పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ సోమవారం ఉభయ సభల్లో వాడీవేడీగా సాగింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. నీట్, అగ్నిపథ్ వంటి అంశాలపై మోదీ, బీజేపీ వ్యవహరిస్తున్న తీరును తూర్పారపట్టారు. హిందుత్వ, అగ్నిపథ్ పథకాలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అధికారపక్షం తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాహుల్ గాంధీ క్షమాపణలు చేప్పాలని హోంశాఖ మంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. ఇవాళ జరిగే లోక్సభ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై సాయంత్రం మాట్లాడానున్నారు. సోమవారం లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాటల తూటాలు పేల్చడంతో ఇవాళ ధీటైన సమాధానం ఇచ్చేందుకు మోదీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.లోక్సభలో ప్రసంగానికి ముందు ఎన్డీయే కూటమి పార్లమెంట్ పార్టీ సమావేశంలో మోదీ పాల్గొనున్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మీటింగ్లో ఎన్డీయే ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అధికారంలోకి వచ్చాక.. ఎన్డీయే ఎంపీలను ఉద్దేశించిన మోదీ తొలిసారి ప్రసంగించనున్నారు. ఇవాళ కూడా లోక్సభలో వాడీవేడీగా ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య మాటలు యుద్ధం జరగనున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం చేయనున్నారు. -
లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి? ఎన్డీయే ఆలోచన అదేనా!
న్యూఢిల్లీ: లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరనే అంశం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు.. ఆ పదవిని తమ కూటమి సభ్యుడికే ఇవ్వాలని బీజేపీ యోచిస్తుండగా... మరోవైపు విపక్ష కూటమిలో భాగమైన తృణమూల్ కాంగ్రెస్ మాత్రం సమాజ్వాదీ పార్టీకి చెందిన ఫైజాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికైన అవధేశ్ ప్రసాద్కు ఆ సీటు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మద్దతు పలికింది.అయితే డిప్యూటీ స్పీకర్ నియామకంపై ప్రతిష్టంభన కొనసాగుతున్నప్పటికీ.. ఈ విషయంపై కేంద్రం, ప్రతిపక్షాల మధ్య చర్చలు జరిగే అవకాశాలు లేనట్లు సమాచారం, డిప్యూటీ స్పీకర్ పదవి తమకే ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే విమర్శిస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా 2019 నుంచి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. గతంలో ఎక్కువ శాతం ప్రతిపక్షమే ఈ పదవిని కేటాయించారు. అయితే ఇది ఎల్లప్పుడూ కొనసాగదని బీజేపీ చెబుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో ప్రతిపక్ష హోదా ఉండటంతో.. తమ ఎంపీలలో ఒకరికి డిప్యూటీ పదవి దక్కాలని డిమాండ్ చేస్తోంది. కాగా 16వ లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని అన్నాడీఎంకేకు ఇవ్వగా, 17వ లోక్ సభ పదవీ కాలం మొత్తం ఈ పోస్టు ఖాళీగానే ఉంది. భారత పార్లమెంట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఈసారి కూడా . అయితే డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఇంకా అధికారిక షెడ్యూల్ విడుదల కాకపోవడంతో ఆ పదవిపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది.. ఇక స్పీకర్ పదవిపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 48 ఏళ్ల తర్వాత ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్పై ఓం బిర్లా విజయం సాధించి రెండవసారి స్పీకర్ పదవిని చేపట్టారు. -
లోక్సభ నుంచి విపక్షాలు వాకౌట్
ఢిల్లీ: లోక్సభ సమావేశాల్లో సోమవారం ‘నీట్’ మంటలు పుట్టాయి. సభలో ఒకరోజు నీట్పై చర్చజరగాలని విపక్షాలు పట్టుపట్టాయి. నీట్పై చర్చ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇవ్వకపోవటంతో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.లోక్సభ ప్రారంభం అయ్యాక రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను అనురాగ్ ఠాకూర్ ప్రారంభించారు. సభ ప్రారంభమైన తర్వాతే గందరగోళం చోటు చేసుకుంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై చర్చకు విపక్షాల పట్టుపట్టాయి. ఎన్టీఏ వైఫల్యాలపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ స్విచ్ ఆఫ్ చేయటంపై స్పీకర్ ఓం బిర్లా వివరణ ఇచ్చారు. విపక్షాల గొంతు నొక్కుతున్నారన్న విమర్శలపై ఆయన స్పందిస్తూ.. రాజ్యాంగ ప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. స్పీకర్పై ఆరోపణలు చేయటం సరికాదన్నారు.ఒకరోజు నీట్పై చర్చకు అవకాశం ఇవ్వాలన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పీకర్ను కోరారు. ‘విద్యార్థులకు పార్లమెంట్ వేదికగా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక్కరోజు నీట్పై చర్చించాలి. ఇది 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం. రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం తర్వాత అయినా ఒక రోజు నీట్పై చర్చ జరపాలి’ అని రాహుల్ గాంధీ తెలిపారు. రాహుల్ గాంధి చెప్పిన అంశంపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. నీట్ అంశంపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. నీట్పై చర్చకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించకపోవటంతో విపక్షాలు వాకౌట్ చేశాయి.దీనికంటే ముందు కేంద్ర మంత్రి రాజ్నాథ్ మాట్లాడుతూ.. ముందు రాష్ట్రపతి ప్రసంగంపై తీర్మాణంపై చర్చించాలన్నరు. తర్వాత అన్ని అంశాలపై చర్చకు సిద్ధమేనని తెలిపారు. లోక్ సభ రూల్స్ ప్రకారం నడుస్తోందని, రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానం అడ్డుకోవటం సరికాదన్నారు. -
‘బిహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి.. అదే మన ఆశ’
పట్నా: దీర్ఘకాంలంగా ఉన్న బిహార్ ప్రత్యేక ఇవ్వాలనే డిమాండ్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకువెళ్తానని కేంద్రమంతి చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో బిహార్ ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడారు.‘ఇది ఒత్తిడి చేసే రాజకీయం కాదు. ఇది మన దీర్ఘకాల డిమాండ్. బిహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఏ పార్టీ బిహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయదు. ఏ పార్టీ అయినా బిహార్కు ప్రత్యేక హోదా అంగీకరిస్తుందా?. కానీ, మేము బిహార్కు ప్రత్యేక హోదా విషయంలో అనుకూలంగా ఉన్నాం. మేము ఎన్డీయే ప్రభుత్వంలో ఉన్నాం. ..ఎన్డీయే కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీ. ప్రధాని మోదీ మా లీడర్. మేము ఆయనపై నమ్మకం పెట్టుకున్నాం. ప్రధాని మోదీ ముందు ఈ డిమాండ్ను మేము పెట్టకపోతే.. మరి బిహార్కు ప్రత్యేకహోదా ఎవరు అడుగుతారు?. బిహార్ ప్రత్యేక హోదా ఇవ్వాలి. అదే మన ఆశ. బిహార్కు ప్రత్యేక హోదా కల్పించే క్రమంలో మార్చాల్సిన కొన్ని నిబంధనలపై మేము చర్చిస్తాం’ అని అన్నారు.అయితే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రత్యేక హోదా ఇవ్వటం లేని కేంద్రం గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. బీహార్, ఏపీతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఇక.. లోక్సభ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఎన్డీయే కూటమిలో భాగంగా ఐదుస్థానాల్లో పోటీచేసీ ఐదింటిలో విజయం సాధించింది. -
డిప్యూటీ స్పీకర్ ‘ఎస్పీ’కి ఇవ్వండి: తృణమూల్
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఎంపిక పూర్తయింది. ఇక డిప్యూటీ స్పీకర్ ఎవరనే అంశం ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ కూటమికే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ఇండియాకూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మాత్రం సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీకే ఆ పదవి ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు సమాచారం. సమాజ్వాదీ పార్టీకి చెందిన అవధేశ్ ప్రసాద్ ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఫైజాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. స్పీకర్గా బీజేపీకి చెందిన ఓం బిర్లా ఇప్పటికే ఎన్నికైన విషయం తెలిసిందే. -
స్పీకర్ ఎన్నిక: ఓటింగ్కు ఆ ఏడుగురు దూరం!.. ప్రభావమెంత?
ఢిల్లీ: అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఏకాభిప్రాయం కుదరకపోవటంతో 18వ పార్లమెంట్లోని లోక్సభ స్పీకర్ ఎన్నిక అనివార్యం అయింది. ఇవాళ లోక్సభ సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. అయితే రెండురోజులు పాటు పార్లమెంట్లో ఎంపీల ప్రమాణ స్వీకారం జరగ్గా.. మరో ఏడుగురు సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేయలేదు. ఇది ఇవాళ్టి ఓటింగ్పై ప్రభావం చూపబోతుందా? అనే చర్చ నడుస్తోంది. ఎంపీలుగా ప్రమాణం చేయని వాళ్లలో ఇండియా కూటమికి చెందినవారే ఐదుగురు ఉండగా, మిగతా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు. శశిథరూర్, శతృఘ్న సిన్హాలాంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. ఎంపీలుగా ప్రమాణం చేయలేదు కాబట్టి ఇవాళ స్పీకర్ ఎన్నికలో ఈ ఏడుగురు ఓటింగ్కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అయితే.. ఓటింగ్పై ఇది ప్రభావం చూపెట్టే అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు చెబుతున్నారు. సభకు హాజరయ్యే సభ్యుల ఆధారంగనే ఓటింగ్ మెజార్టీని లెక్కగడతారని వారంటున్నారు. అదే సమయంలో.. ఎన్డీయే కూటమి 293 సీట్లతో మెజార్టీలో ఉంది. స్పీకర్ ఎన్నికకు మ్యాజిక్ ఫిగర్ 269గా ఉంది. మరోవైపు బీజేపీ విజ్ఞప్తి మేరకు వైఎస్సార్సీపీ సానుకూలంగానే స్పందించింది. ఇక.. ఇండియా కూటమిలో మొత్తం 232గాను 227 మంది ఎంపీలు ప్రమాణం చేశారు. అంటే ఇండియా కూటమికి మెజార్టీ లేదనే చెప్పాలి. దీంతో స్పీకర్ ఎన్నిక ఎన్డీయే వైపు ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇక.. స్పీకర్ ఎన్నిక కోసం మెజార్టీ ఎంపీలు ఉన్నప్పటికీ బీజేపీ స్పీకర్ ఎన్నికలో 300 ఎంపీల ఓట్ల కోసం టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగానే ఎన్డీయే కూటమిలో లేని పార్టీలను సైతం బీజేపీ మద్దతు కోరింది. స్పీకర్ ఎన్నికకు ఎన్డీయే కూటమి మాజీ స్పీకర్ కోటా ఎంపీ ఓం బిర్లాను, ఇడియా కూటమి కేరళ ఎంపీ కే. సురేష్ను బరిలోకి దింపాయి. ఇవాళ 11 గంటలకు స్పీకర్ ఓటింగ్ జరగనుంది. -
స్పీకర్ పదవికి పోటీ.. ఓం బిర్లా x సురేష్
న్యూఢిల్లీ: పద్దెనిమిదో లోక్సభ స్పీకర్ పదవికి అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఫలితంగా పోటీ అనివార్యమైంది. కీలక నేతలను పాత పదవుల్లో కొనసాగిస్తున్న మోదీ 3.0 సర్కారు దానికి అనుగుణంగానే ఎన్డీఏ అభ్యర్ధిగా ఓం బిర్లాను మంగళవారం స్పీకర్ బరిలో నిలిపింది. ఓం బిర్లా 17వ లోక్సభలో ఐదేళ్లు స్పీకర్గా పనిచేసిన విషయం తెలిసిందే. విపక్ష ఇండియా కూటమి ఆఖరి నిమిషంలో.. కాంగ్రెస్ ఎంపీ కొడైకున్నిల్ సురేశ్ను రంగంలోకి దింపింది. పార్లమెంటరీ సంప్రదాయాలను అనుసరించి విపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తే.. ఓం బిర్లాకు మద్దతు ఇస్తామని ఇండియా కూటమి షరతు పెట్టింది. అయితే బీజేపీ సీనియర్ నేతలు దీనిపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. స్పీకర్ ఎన్నిక తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎంపిక ఉంటుందని, ఆ సందర్భం వచ్చినపుడు చూద్దామని బీజేపీ పేర్కొంది. దీనికి ఇండియా కూటమి నేతలు సమ్మతించలేదు. డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షానికి కేటాయిస్తామని హామీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఎన్డీఏ అభ్యర్థిగా ఓం బిర్లా పేరు ఖరారయ్యాక కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్.. చొరవ తీసుకొని విపక్షాలను సంప్రదించారు. రాజ్నాథ్ ఆఫీసులో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాలతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, డీఎంకే నేత టి.ఆర్.బాలు మంగళవారం సమావేశమయ్యారు. ఇరుపక్షాలు తమ తమ వాదనలకే కట్టుబడి ఉండటంతో ఏకాభిప్రాయం కుదరలేదు. కొద్దిసేపట్లోనే ఈ భేటీ ముగిసింది. వేణుగోపాల్, బాలు అర్ధాంతరంగా సమావేశం నుంచి బయటికి వచ్చేశారు. మూడుసార్లు ఎంపీ అయిన ఓం బిర్లా రాజస్థాన్లోని కోటాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓం బిర్లా తరఫున 10కి పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాలతో పాటు, టీడీపీ, జేడీయూ, జేడీఎస్, ఎల్జేపీ (ఆర్) పార్టీలు ఓం బిర్లా తరఫున నామినేషన్లు దాఖలు చేశాయి. కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దళిత ఎంపీ కే.సురేష్ ఎనిమిదోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. సురేష్ తరఫున మూడుసెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. సంప్రదాయాన్ని పాటించడం లేదు: వేణుగోపాల్ విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చే సంప్రదాయాన్ని ప్రభుత్వం పాటించడం లేదని వేణుగోపాల్ ఆరోపించారు. ఓం బిర్లాపై తమ అభ్యర్ధిని పోటీకి నిలుపుతామని ప్రకటించారు. విపక్షం ఒత్తిడి రాజకీయాలకు దిగుతోందని, షరతులు పెడుతోందని కేంద్ర మంత్రులు పీయుష్ గోయల్, లలన్ సింగ్ (జేడీయూ)లు అన్నారు. డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకునే సమయం వచ్చినపుడు విపక్షాల డిమాండ్ను పరిశీలిస్తామని సీనియర్ మంత్రులు హామీ ఇచ్చినా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యం షరతులపై నడవదని పీయూష్ గోయల్ అన్నారు. ఇండియా కూటమిలోని మిగతా పార్టీలు పోటీకి అంత సుముఖంగా లేనప్పటికీ కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోందని బీజేపీ వర్గాలు తెలిపాయి. మూడోసారి పోటీ స్పీకర్ ఎన్నిక బుధవారం జరుగుతుంది. ఒకవేళ పోటీ అనివార్యమైతే.. లోక్సభ చరిత్రలో స్పీకర్ పదవికి పోటీ జరగడం ఇది మూడోసారి అవుతుంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో 1952, 1967, 1976లలో మాత్రమే స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. 1952లో కాంగ్రెస్ అభ్యర్థి జి.వి.మౌలాంకర్ 394 ఓట్లు సాధించి స్పీకర్గా ఎన్నికయ్యారు. ఆయన ప్రత్యర్థి శాంతారాం మోరేకు కేవలం 55 ఓట్లు మాత్రమే వచ్చాయి. 1967లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవరెడ్డితో తెన్నేటి విశ్వనాథం పోటీపడ్డారు. సంజీవరెడ్డికి 278 ఓట్లు రాగా, విశ్వనాథంకు 207 ఓట్లు పడ్డాయి. 1976లో జరిగిన ఎన్నిక పూర్తిస్థాయి స్పీకర్ పదవికి కాదు. 1975లో ఇందిగాంధీ దేశంలో అత్యయిక పరిస్థితిని విధించారు. ఐదో లోక్సభ ఐదో సెషన్ను ఏడాది పాటు పొడిగించారు. అప్పటి స్పీకర్ జి.ఎస్.ధిల్లాన్ రాజీనామా చేయడంతో.. జనవరి 5, 1976న పొడిగించిన ఏడాది కాలానికి స్పీకర్ ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ నాయకుడు బలిరామ్ భగత్ను స్పీకర్ పదవికి ఇందిరా గాంధీ ప్రతిపాదించారు. జనసంఘ్ నాయకుడు జగన్నాథరావు జోషి బరిలో నిలువడంతో ఎన్నిక జరిగింది. బలిరామ్ భగత్కు 344 ఓట్లు రాగా, జోషికి 58 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం 18వ లోక్సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యులు ఉండగా, ఇండియా కూటమికి 233 (రాహుల్ గాంధీ వయనాడ్కు రాజీనామా చేయడంతో విపక్షాల బలం ఒకటి తగ్గింది) ఎంపీలున్నారు. అంతేకాకుండా ఇండియా కూటమికి ముగ్గురు స్వతంత్ర ఎంపీల మద్దతుంది. సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే ఓం బిర్లా స్పీకర్గా ఎన్నిక కావడం లాంఛనమే. బుధవారం ఓటింగ్ జరిగితే.. పేపర్ స్లిప్పులనే వాడనున్నారు. నూతన సభ్యులు ఎవరెక్కడ కూర్చోవాలో నిర్ణయించే సీట్ల కేటాయింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కాబట్టి ఎల్రక్టానిక్ ఓటింగ్ వ్యవస్థ సిద్ధంగా లేదు. ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికైతే.. రెండు పర్యాయాలు స్పీకర్గా పనిచేసిన ఐదోవ్యక్తి అవుతారు. కాకపోతే గతంలో కాంగ్రెస్ నేత బలరాం జాఖడ్ ఒక్కరు మాత్రమే రెండుసార్లు (ఏడు, ఎనిమిదో లోక్సభల్లో) స్పీకర్గా పూర్తి పదవీకాలాన్ని పూర్తిచేశారు. అది మా హక్కు: సురేష్ ‘గెలుస్తామా, ఓడుతామా అన్నది ముఖ్యం కాదు. అధికారపక్షం నుంచి స్పీకర్ ఉంటే డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇవ్వాలనేది సంప్రదాయం. గత రెండు లోక్సభల్లో మాకు పత్రిపక్ష హోదా లేదని డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వడానికి నిరాకరించారు. ఇప్పుడు మేము గుర్తింపు పొందిన ప్రతిపక్షం. డిప్యూటీ స్పీకర్ పదవి మా హక్కు. కానీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. మంగళవారం 11:50 గంటల దాకా ప్రభుత్వం నుంచి స్పందన కోసం ఎదురుచూశాం. ఎలాంటి సమాధానం రాలేదు’అని కే.సురేష్ అన్నారు. -
తొలిసారి లోక్సభ స్పీకర్ ఎన్నిక.. అభ్యర్థుల నేపథ్యం ఇదే..
ఢిల్లీ: 18వ లోక్సభ స్పీకర్ పదవి కోసం అధికార-ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కోసం మంగళవారం జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఎన్డీయే కూటమి, ఇండియా కూటమి తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. ఎన్డీయే తరఫున గతంలో స్పీకర్గా సేవలు అందించిన కోటా ఎంపీ ఓం బిర్లా, ఇండియా కూటమి తరఫున 8 సార్లు ఎంపీగా గెలిచిన కేరళ ఎంపీ కే. సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో దేశ చరిత్రలోనే.. రేపు(జూన్ 26,2024) తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. స్పీకర్ బరిలో ఉన్న అభ్యర్థులు రాజకీయ నేపథ్యాలు ఇవే..ఇండియా కూటమి అభ్యర్థి కే. సురేష్తిరువనంతపురం జిల్లాలోని కోడికున్నిల్లో కుంజన్, థంకమ్మ దంపతులకు 1962లో సురేష్ జన్మించారు. తిరువనంతపురంలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. అనంతరం ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1989లో మొదటిసారి కేరళలోని అదూర్ లోక్సభ స్థానంలో ఎంపీ గెలిచారు. 1991, 1996, 1999 వరుస సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే స్థానంలో విజయం సాధించారు. అనంతరం మావేలికర లోక్సభ నియోజకవర్గం నుంచి 2009, 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచారు. ఇటీవల జరిగిన 2024 లోక్సభ ఎన్నికల్లో సైతం మావేలికర నుంచి ఆయన విజయం సాధించారు. ఎంపీ సురేష్.. కేరళ పీసీసీ సభ్యునిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా, పీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అనేక పదవులు చేపట్టి పార్టీని ముందుకు నడిపించారు. ఇ ఇప్పటివరకు మొత్తం 8 సార్లు ఎంపీగా గెలిచిన ఆయన ప్రస్తుతం కేరళ పీసీసీ చీఫ్ ఉన్నారు. ఇవాళ ఇండియా కూటమి తరఫున స్పీకర్ ఎన్నికకు నామినేషన్ వేశారు.ఎన్డీయే కూటమి అభ్యర్థి ఓం బిర్లా ఓం బిర్లా 1962లో శ్రీకృష్ణ బిర్లా, శకుంతలాదేవి దంపతులకు జన్మించారు. కోటాలోని ప్రభుత్వ కామర్స్ కళాశాల నుంచి మాస్టర్స్ డిగ్రీ, ఆజ్మీర్లోని మహర్షి దయానంద్ సరస్వతి విశ్వవిద్యాలయం నుంచి కామర్స్ డిగ్రీ పూర్తి చేశారు. రామమందిరం నిర్మాణ ఉద్యమంలో పాల్గొని ఆయన యూపీలో జైలుశిక్ష కూడా అనుభవించారు. అనంతరం ఆయన రాజకీయాల్లో చేరి మొదటిసారి 2003లో కోటా దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంపీగా ఎన్నిక కాకముందు 2013లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2014, 2019లో కోటా లోక్సభ స్థానం నుంచి గెలుపొదారు. 16 లోక్భలో ఓం బిర్లా సామాజిక న్యాయం, సాధికారకత కొరకు ఎనర్జీ, కన్సాల్టేటివ్ స్టాండింగ్ కమిటీలో సభ్యుని పనిచేశారు.2019లో ఎంపీగా గెలిచిన ఆయన 17 లోక్సభకు స్పీకర్గా పనిచేశారు. 2014లో కోటా నుంచి ఎంపీగా గెలుపొందిన ఓం బిర్లా.. లోక్సభ స్పీకర్ ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. -
స్పీకర్ ఎన్నికలో ట్విస్ట్
-
మళ్లీ ఓం బిర్లాకే ఛాన్స్
-
లోక్సభ స్పీకర్ ఎవరు?
-
లోక్సభ స్పీకర్పై ఉత్కంఠ.. ఖర్గే సహా కూటమి నేతలతో చర్చలు
ఢిల్లీ: లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయంపై తీసుకువచ్చేందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు రంగంలో దిగారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల ఇండియా కూటమిని ఒప్పించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఇతర నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.ప్రతిపక్షాల ఇండియా కూటమి లోక్సభ డిప్యూటీ స్పీకర్ కోసం పట్టుపడుతున్న విషయం తెలిసిందే. లోక్సభ స్పీకర్ ఎన్నిక నామినేషన్కు మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు ముగియనుండటంతో ఇరు కూటముల మధ్య ఉత్కంఠ నెలకొంది.మరోవైపు మాజీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈసారి కూడా బీజేపీ ఓం బిర్లాను స్పీకర్గా ఎంపిక చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎన్నికైన లోక్సభ స్పీకర్లు అందరూ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఇక, స్పీకర్ ఎంపికకు ఎన్నిక జరిగితే.. ఇలా ఎన్నిక జరగటం ఇదే తొలిసారి అవుతుంది.డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించటం ఆనవాయితీగా వస్తోంది. 2014లో బీజేపీ తన మిత్ర పక్షం అన్నాడీఎంకే ఎంపీ ఎం తంబిదురైని డిప్యూటీ స్పీకర్గా ఎంపిక చేసింది. ఇక.. 2019 నుంచి ఆ పోస్ట్ ఖాళీగా ఉంది.16,17 లోక్సభల్లో కాంగ్రెస్కు కనీసం ప్రతిపక్షహోదా కూడా దక్కలేదు. కానీ, ఈసారి లోక్సభ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు సాధించి ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ లోక్సభలో డిప్యూటీ స్పీకర్ దక్కించుకోవాలని పట్టుపడుతోంది. -
ప్రజలు అధికారం ఇచ్చింది ఇందుకా ? కూటమిపై జడ శ్రవణ్ కుమార్ ఫైర్
-
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కుట్రలు ప్రారంభించిన ఎన్డీయే సర్కారు
-
లోక్సభ: కౌన్ బనేగా స్పీకర్..?.. ఛాన్స్ ఎవరికో?
లోక్సభ స్పీకర్ పదవి చేపట్టేది ఎవరు..? బీజేపీకే ఆ హోదా దక్కుతుందా? ఎన్డీఏ పక్షాలు ఎగరేసుకుపోతాయా..? ఇండియా కూటమి డిమాండ్కు కేంద్రం తలొగ్గుతుందా.. లేదంటే చరిత్రలో తొలిసారిగా స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహిస్తుందా..? కౌన్ బనేగా స్పీకర్..?పార్లమెంట్ సమావేశాలు సమీపిస్తున్న వేళ.. లోక్సభ స్పీకర్ ఎన్నికపై ఫోకస్ పెట్టింది బీజేపీ. ఎన్డీఏ మిత్రపక్షాలతో సంప్రదింపులు ప్రారంభించింది. రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో కేంద్ర మంత్రులు సమావేశం నిర్వహించారు. బీజేపీపాటు ఎన్డీఏ పక్షాలకు చెందిన సెంట్రల్ మినిస్టర్స్ ఈ భేటీలో పాల్గొన్నారు. స్పీకర్ ఎన్నికపై చర్చించారు.సంకీర్ణ ప్రభుత్వంలో సభాపతి పదవి అత్యంత కీలకం. అందుకే స్పీకర్ పోస్ట్ను తన దగ్గరే అట్టేపెట్టుకోవాలని భావిస్తోంది బీజేపీ. డిప్యూటీ స్పీకర్ పదవిని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఇవ్వాలని యోచిస్తోంది. దీనిపై ఏకాభిప్రాయం కోసమే రాజ్నాథ్ నివాసంలో సమావేశం అయ్యారు కేంద్ర మంత్రులు. డిప్యూటీ స్పీకర్ పదవి ఏ పార్టీకి ఇవ్వాలనే అంశంపైనా కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. బీజేపీ స్పీకర్ అభ్యర్థికి తాము మద్దతిస్తామని ఇప్పటికే స్పష్టం చేసింది జేడీయూ. కాబట్టి స్పీకర్ పదవి కోసం పట్టుబడుతున్న టీడీపీకే డిప్యూటీ స్పీకర్ దక్కొచ్చనే ప్రచారం జరుగుతోంది. లోక్సభ స్పీకర్ బీజేపీ వద్దే ఉంటే, ఓం బిర్లాకే మరో ఛాన్స్ దక్కే అవకాశం ఉందని సమాచారం. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఒడిశాలో బీజేడీ నుంచి బీజేపీలో చేరిన భర్తృహరి మహతాబ్ పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. చివరి నిమిషంలో కొత్త పేర్లు తెరపైకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈ నెల 24 నుంచి పార్లమెంట్ స్పెషల్ సెషన్ ప్రారంభం కానుంది. జూన్ 26న స్పీకర్ను ఎన్నుకోనున్నారు లోక్సభ ఎంపీలు.స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగలేదు. ఏకగ్రీవంగానే సభాపతిని ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి విపక్ష కూటమి తమ అభ్యర్థిని బరిలోకి దించాలని చూస్తోంది. 233 మంది ఎంపీలున్న ఇండియా కూటమి.. డిప్యూటీ స్పీకర్ పదవి కావాలని డిమాండ్ చేస్తోంది. లేదంటే స్పీకర్ ఎన్నిక నిర్వహించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని వ్యూహాలు రచిస్తోంది. అదే జరిగితే స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా స్పీకర్ ఎన్నికకు శ్రీకారం చుట్టినట్టవుతుంది. -
ఎన్డీఏ ఎప్పుడైనా ముక్కలు కావచ్చు: రాహుల్గాంధీ
న్యూఢిల్లీ: కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. కూటమిలో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు.అందులోని కొందరు నేతలు తమతో టచ్లో ఉన్నారని తెలిపారు. తాజాగా ఓ జాతీయ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ కూటమి మనుగడ కోసం ఇబ్బందిపడే అవకాశం ఉందన్నారు. ఎన్డీఏ బలహీనంగా ఉండటంతో ఏ చిన్న సమస్య అయినా ప్రభుత్వాన్ని కూల్చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విద్వేషపు ఆలోచనను ప్రజలు తిరస్కరించారన్నారు. ఎన్నికల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటే ఇండియా కూటమి నిస్సందేహంగా మెజార్టీ దక్కించుకొని ఉండేదన్నారు. తమ చేతులు కట్టేసిన పరిస్థితుల్లోనూ తాము పోరాడామన్నారు. -
Sanjay Raut: టీడీపీ స్పీకర్ పదవికి పోటీ చేస్తే.. ఇండియా కూటమి మద్దతిస్తుంది
ముంబై: లోక్సభ స్పీకర్ పదవికి అధికార ఎన్డీఏ పక్షంలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పోటీ చేస్తే ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలన్నీ మద్దతిచ్చే అవకాశముందని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ చెప్పారు. లోక్సభ స్పీకర్ పోస్టు చాలా కీలకమైందని, ఈ పదవి బీజేపీకి దక్కితే, ప్రభుత్వానికి మద్దతిచ్చే టీడీపీ, జేడీయూలతో పాటు చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరిలకు చెందిన పార్టీలను ముక్కలు చేస్తుందని ఆరోపించారు. బీజేపీని నమ్మి మోసపోయిన అనుభవం తమకు కూడా ఉందని రౌత్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘లోక్సభ స్పీకర్ పదవిని టీడీపీ కోరుతున్నట్లుగా విన్నాను. అదే జరిగితే, ఇండియా కూటమి ఈ విషయాన్ని చర్చిస్తుంది. మా భాగస్వామ్య పక్షాలన్నీ టీడీపీకి మద్దతిచ్చేందుకు ప్రయత్నిస్తాయి’అని చెప్పారు. నిబంధన ప్రకారం ప్రతిపక్ష పార్టీకి డిప్యూటీ స్పీకర్ పోస్టు కేటాయించాలన్నారు. లోక్సభ ఎన్నికల అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అగ్ర నేతలు బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై సంజయ్ రౌత్.. గతంలో బీజేపీ చేసిన తప్పిదాలను ఆర్ఎస్ఎస్ సరిచేయాలనుకోవడం మంచి పరిణామమేనని పేర్కొన్నారు. జూన్ 7వ తేదీన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన భేటీలో ప్రధాని మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పక్షం నేతగా, బీజేపీ పార్లమెంటరీ పార్టీ, లోక్సభలో బీజేపీ నేతగా ఎన్నికయ్యారని రౌత్ అన్నారు. ‘బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రత్యేకంగా జరగలేదు. అలా జరిగిన పక్షంలో నేత ఎవరనే ప్రశ్న ఉదయిస్తుంది, అప్పుడిక పరిణామాలు వేరుగా ఉంటాయి’అని అభిప్రాయపడ్డారు. మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పక్షం నేతగా మాత్రమే ఎన్నికవడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని రౌత్ వ్యాఖ్యానించారు. -
రెడ్బుక్ రాజ్యాంగం చెల్లదు!
ఇండోనేషియాలో లక్షలాదిమందిని ఊచకోత కోసిన సుహార్తో పాలన ఆదర్శంగా కనిపిస్తున్నదా? కాంబోడియాలో నెత్తుటేరులు పారించిన పోల్పాట్ మీకు రోల్మోడల్గా కనిపిస్తున్నాడా? చిలీ ప్రజల ప్రాథమిక హక్కులను తొక్కిపారేసిన ఆగస్టో పినోచెట్ ఉక్కుపాదం మీద మోజుపుట్టిందా? మరెందుకు మీ చేతిలోని ఆ రెడ్ బుక్? ఆ పుస్తకానికి హోర్డింగులెందుకూ... హారతులెందుకు?ఏముందా రెడ్బుక్లో? మీ విధానాలను బలంగా విరోధించే మీ రాజకీయ ప్రత్యర్థుల పేర్లు, మీ విమర్శకుల పేర్లు, మీ అభీష్టానికి అనుగుణంగా వ్యవహరించని అధికారుల పేర్లు... అంతేగా! ఎన్నికలకు ముందు లోకేశ్బాబు జారీ చేసిన హెచ్చరికల తాత్పర్యం ఇదే కదా! ఒక ప్రమాణపూర్వక ప్రతీకార పొత్తానికి వీరపూజలు చేయడం ప్రజాస్వామ్యంలో చెల్లుబాటవుతుందా? ఇటువంటి చర్యల వలన రాజ్యాంగబద్ధ పరిపాలనకు ప్రమాదం దాపురించదా? రాజ్యాంగబద్ధమైన పరిపాలన విఫలమైతే ఏం చేయాలనే విరుగుడు మంత్రం కూడా మన రాజ్యాంగంలో ఉన్న సంగతి తమకు తెలియనిదా?బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో షరీఖైన దగ్గర్నుంచీ తెలుగుదేశం శ్రేణులు చెలరేగిపోతున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎన్డీఏ విధేయ ఎన్నికల సంఘం ఆసరాతో పాలనా యంత్రాంగంపై పట్టు బిగించిన ఆ పార్టీ శ్రేణులు యథేచ్ఛగా ప్రవర్తించిన తీరు కూడా తేటతెల్లమైంది. ఆంధ్రప్రదేశ్ పోలింగ్కు ముందు మూడు దశల ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగాయి. అప్పటికే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి అతి పెద్ద రాష్ట్రాల ప్రజానాడి కూటమి పెద్దలకు అర్థమైపోయింది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి బలమైన బీజేపీ స్థావరాల్లో దాదాపుగా పోలింగ్ ఘట్టం పూర్తయింది. అయినా కనాకష్టంగానే ఎన్డీఏ హాఫ్ మార్క్ను దాటగలుగుతున్నదని నేతలకు రూఢీ అయింది. ఫలితాలు కూడా వారి అంచనాలకు తగినట్టుగానే వచ్చాయి. మూడు దశల్లోని 285 స్థానాల్లో ఎన్డీఏ 150 మార్క్ను దాటలేదు. మిగిలిన నాలుగు దశలు ఎన్డీఏ దశను మార్చాలి. మిగిలిన దశలు అంతగా అనుకూల ప్రాంతాలు కానప్పటికీ కూటమి గట్టెక్కగలిగింది. కానీ మాయమైపోయిన 20 లక్షల ఈవీఎమ్ల గురించి స్పష్టమైన సమాధానం ఇప్పటివరకూ రాలేదు. 140 లోక్సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఎందుకున్నాయనే సందేహాన్ని తీర్చే నాథుడు కనిపించడం లేదు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కూటమి ఇచ్చిన జాబితా ప్రకారం ఎన్నికల సంఘం అధికారుల బదిలీలు ఎందుకు చేసిందో అర్థం కాలేదు.అధికార యంత్రాంగాన్ని కూటమి గుప్పెట్లోకి తీసుకోవడానికీ, తమ కంచుకోటల్లో సైతం వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడానికీ మధ్యన గల సంబంధం ఏమిటో తేలవలసి ఉన్నది. ఈ అంశంపై లోతైన అధ్యయనం జరగాలి. ఈలోగా రెడ్బుక్ స్ఫూర్తితో రాష్ట్రంలో మొదలైన బీభత్స పాలన ఫలితంగా అటువంటి అధ్యయనాలు ఇంకా టేకాఫ్ కాలేదు. కానీ ఆలస్యమైనా అవి జరుగుతాయి. నిజానిజాలను నిగ్గుతేలుస్తాయి. భవిష్యత్తు రాజకీయాలకు పాఠాలను అందజేస్తాయి.ఫలితాలను ప్రకటించి పది రోజులు దాటింది. అయినా రెడ్బుక్ బీభత్స పాలన తగ్గుముఖం పట్టలేదు. ఇళ్లపైనా, కార్యాలయాలపైనా దాడులు జరిగినా, ప్రత్యర్థులను చితక్కొట్టినా, అర్ధనగ్నంగా మార్చి కాళ్లు పట్టించుకుంటున్నా పోలీసులు ఫిర్యాదులు స్వీకరించడం లేదు. ఇకముందు కూడా రెడ్బుక్ రాజ్యాంగమే అమలు కానుందా అనే అనుమానాలకు సాక్షాత్తూ ఉన్నతస్థాయిలోని వారే ఊతమిస్తున్నారు. 1970వ దశకం నాటి బెంగాల్ రాజకీయ పరిణామాలను నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గుర్తుకు తెస్తున్నాయి.1972లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు బూటకపు ఎన్నికల పేరుతో ప్రచారంలోకి వచ్చాయి. పోలీసుల సహకారంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా బూత్లను ఆక్రమించి రిగ్గింగ్ చేసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియలోనూ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఓటమెరుగని జ్యోతిబసు సైతం ఓడిపోయినట్టు ప్రకటించారు. కేవలం 14 మంది మాత్రమే సీపీఎం నుంచి గెలిచినట్టు లెక్క తేల్చారు. దీంతో ఐదేళ్లపాటు ఆ పార్టీ అసెంబ్లీని బహిష్కరించింది. ఈ ఐదేళ్లలో సిద్ధార్థ శంకర్రే ప్రభుత్వం ప్రతిపక్షాల అణచివేతకు తెగబడని దాష్టీకం లేదు. ఇప్పటి మాదిరిగా రెడ్బుక్ను పూజించలేదు కానీ ఇదే తరహా బీభత్స పాలనను ఐదేళ్లూ కొనసాగించారు. పాలక పార్టీ ఫలితాన్ని అనుభవించింది. 1977లో దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో ఇప్పటి దాకా కోలుకోనేలేదు.హింసాకాండతో, భయోత్పాతాలు సృష్టించడం ద్వారా ప్రత్యర్థులను కట్టడి చేయవచ్చనుకునే పాలకులు ఇటువంటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం అవసరం. కానీ అటువంటి లక్షణాలైతే ఈ పది రోజుల్లో కనిపించలేదు. దేశంలోనే సీనియర్ రాజకీయవేత్తల్లో ఒకరైన చంద్రబాబుకు సుదీర్ఘమైన రాజకీయ, పాలనా అనుభవం ఉన్నది. కానీ, గడచిన రెండు మూడు రోజులుగా ఆయన అధికార యంత్రాంగంపై చేస్తున్న వ్యాఖ్యలు, చేపడుతున్న చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారుల మీద, ఉద్యోగుల మీద ఆయన రాజకీయ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు.పోలీస్ స్టేషన్లో నేరస్థుల ఫోటోలు పెట్టినట్టుగా శనివారం నాటి ‘ఈనాడు’ పత్రికలో ఓ పదిహేనుమంది డీఎస్పీల ఫోటోలను వేశారు. వారి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధమైన రాతలు రాశారు. ఉద్యోగుల పనితీరును మదింపు చేయవలసింది ఎవరు? ‘ఈనాడు’కు ఈ బాధ్యతను ఎవరు అప్పగించారు? ఇలా ప్రతిరోజూ ‘ఈనాడు’లో ఓ జాబితా రావడం, దానిపై చర్యలకు పూనుకోవడం జరుగుతుందనుకోవాలా? ఈ విధంగా రాజ్యాంగ, రాజ్యాంగేతర వ్యవస్థలు హద్దులు మీరి వ్యవహారాలు నడిపితే పరిపాలన గాడి తప్పదా? ఆదిలోనే గాడి తప్పుతున్న సూచనలు కనిపించడం శుభసంకేతమైతే కాదు.ఎన్డీఏ కూటమికి పెద్దన్నగా ఉన్న బీజేపీకి గానీ, దాని మాతృసంస్థ ఆరెస్సెస్కు గానీ భారత రాజ్యాంగం పట్ల అంతగా విశ్వాసం లేదన్న అభిప్రాయం ఉన్నది. ముఖ్యంగా రాజ్యాంగ పీఠికలోని ‘సెక్యులర్’, ‘సోషలిస్టు’ పదాలను తొలగించాలన్న తహతహ వారిలో ఉండవచ్చు. మూడింట రెండొంతుల మెజారిటీ కోసం బీజేపీ వెంపర్లాడింది కూడా రాజ్యాంగ సవరణ కోసమేననే వాదన కూడా ఉన్నది. బీజేపీ భావజాలానికి చంద్రబాబు సహజ మిత్రుడని భావించవలసి ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ మరణం తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడుసార్లూ చంద్రబాబు కాషాయ పార్టీ సహకారంతోనే నెగ్గుకొచ్చారు. బీజేపీ ‘మ్యాజిక్’ తోడవకుండా ఎన్నికల్లో గెలిచిన రికార్డు ఆయనకు లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం కోనసీమ జిల్లాకు రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును పెట్టినప్పుడు కొన్ని శక్తులు పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డాయి. ఈ శక్తులకు తోడ్పాటును అందించిన రాజకీయ రూపాలేమిటనేది స్థానిక ప్రజలందరికీ తెలిసిన విషయమే. రాజ్యాంగ రచయిత మీద వీరికి ఉన్న వ్యతిరేకత రాజ్యాంగం మీద ఏమేరకున్నదో తెలియవలసి ఉన్నది. బీజేపీ కోరుకుంటున్నట్టుగా పీఠికలోని సెక్యులర్, సోషలిజం అనే రెండు పదాలను తొలగించినా కూడా మొత్తం రాజ్యాంగ స్వభావంలోంచి వాటి స్ఫూర్తిని తొలగించడం సాధ్యం కాదు. ఎటువంటి వివక్ష లేని స్వేచ్ఛ, సమానత్వాలకు, సమాన అవకాశాలకు రాజ్యాంగం పూచీపడుతున్నది. సమాన అవకాశాలను వినియోగించుకోగలిగే స్థాయికి వెనుకబడిన శ్రేణులను ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయాలని కూడా ప్రభుత్వాలను రాజ్యాంగం ఆదేశిస్తున్నది.ఈ శతాబ్దంలోని ఆధిపత్య రాజకీయ వ్యవస్థలకూ, మన రాజ్యాంగం స్ఫూర్తికీ మధ్యన సైద్ధాంతిక విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న ఆధిపత్య రాజకీయపక్షాల్లో ఎక్కువ భాగం ‘ట్రికిల్ డౌన్’ ఆర్థిక విధానాలను అవలంబిస్తున్నవే. ఈ విధానాలను ఔదలదాల్చడంలో ఛాంపియన్ నెంబర్వన్ బీజేపీ, ఛాంపియన్ నెంబర్ టూ టీడీపీ. అందుకే ఇవి రెండూ సహజ మిత్రపక్షాలు. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు, మెగా రిచ్ వ్యక్తుల అనుకూల విధానాలను ట్రికిల్ డౌన్ ఎకనామిక్స్ ప్రోత్సహిస్తుంది. వీరు ఖర్చు చేయడం ద్వారా అంటే పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతో ఇంతో బతుకుతెరువు అడుగు వర్గాలకు కూడా లభిస్తుంది. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.సంపన్నులు పెట్టుబడులు పెట్టడం కోసం సహజ వనరులను వారి పరం చేయాలి. వారికి శ్రమ శక్తి చౌకగా లభించాలి. వ్యవసాయ రంగం లాభసాటిగా ఉంటే అది సాధ్యం కాదు. విద్య, వైద్య రంగాల్లో కూడా ప్రైవేట్ పెట్టుబడులకే పెద్దపీట వేయాలి. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని స్వయంగా చంద్రబాబు చేసిన ప్రకటనలే మన ముందున్నాయి. ప్రైవేట్ విద్యావ్యవస్థలో నాణ్యమైన చదువు సంపన్న శ్రేణికి మాత్రమే లభిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రకమైన ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే పార్టీలు పేదలకోసం కొన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తాయి. కానీ, అవి సాధికారతకు బాటలు వేసే చర్యలు మాత్రం కాదు.రాజ్యాంగ లక్ష్యాలను అందుకోవడానికి ఎంపవర్మెంట్ ఎకనామిక్స్ అవసరమవుతాయి. వ్యక్తులను సాధికార శక్తులుగా మలచడంతో పాటు వారిలో ఆత్మగౌరవాన్ని ఉద్దీపింపజేయడానికి ఈ విధానాలు అవసరం. అయితే సమాజంలోని ఆధిపత్య వర్గాలు ఈ విధానాలను వ్యతిరేకిస్తాయి. వీటిని ప్రబోధించే రాజకీయ శక్తులను నిరోధిస్తాయి. ఏపీలో జరిగిన ఎన్నికలను ఈ నేపథ్యంలోంచి కూడా పరిశీలించాలి. ఈ విధానాల ఘర్షణను ప్రజలకు వివరించి చెప్పడం అంత సులభసాధ్యమేమీ కాదు. అనేక సామాజిక – సాంస్కృతిక సంక్లిష్టతల కారణంగా నిట్టనిలువునా వర్గ విభజన చేయడం కూడా కష్టమైన పని.నెలకు రెండు లక్షలు సంపాదించేవాడూ, నెలకు పదివేలు సంపాదించేవాడూ కూడా మన దగ్గర మధ్యతరగతిగానే చలామణీ కావడానికి ఇష్టపడతారు. పదివేలవాడు పేదవాడిగా ఒప్పుకోడు. పేదరికం అంటే కూటికి లేకపోవడమనే అభిప్రాయం నుంచి మనం ఇంకా బయటపడలేదు. నాణ్యమైన విద్య దొరక్కపోవడం పేదరికం, సమాన అవకాశాలు లభించకపోవడం పేదరికం, హస్తిమశకాంతరం పెరిగిన ఆర్థిక వ్యత్యాసాల్లో అడుగుభాగాన నిలవడం పేదరికం, కోరుకున్న జీవన గమనాన్ని సాధించుకోలేకపోవడం పేదరికమనే స్పృహ మనకింకా రాలేదు.వెనుకబడిన వర్గాలుగా గుర్తింపు పొందిన వారిలోని క్రీమీ లేయర్ కూడా తన సాటి సామాజిక శక్తులతో జతకూడటానికి బదులు సవర్ణ హిందూ సమాజంతో స్నేహం చేయడాన్నే గౌరవంగా భావించుకుంటారు. గ్రామాల్లో పదిహేనెకరాలున్న ఆసామి కూడా జీవన ప్రమాణాల రీత్యా పేదవాడికిందే లెక్క. కానీ, తన సామాజిక స్థానం దృష్ట్యా తనను తాను పెత్తందారుగా భావించుకునే విచిత్ర పరిస్థితి ఉన్నది. ఈ సంక్లిష్టతలను ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయి.కానీ పరిపాలనా ప్రా«ధమ్యాల వల్ల అనుభవ పూర్వకంగా మిత్రుడెవరో శత్రువెవరో జనం తెలుసుకుంటారు. అన్ని కులాలు, మతాల్లోని ప్రజలంతా తాము పోగొట్టుకున్నదేమిటో గ్రహిస్తారు. ఈ గ్రహింపే సాధికారతను కోరుకునే ప్రజలందరినీ ఏకం చేస్తుంది. సిద్ధాంతరీత్యా, విధానాల రీత్యా చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సాధికారతకు వ్యతిరేకం. కనుక సాధికారతా శక్తులు బలపడకుండా అది బలప్రయోగానికి దిగుతూనే ఉంటుంది. రెడ్బుక్తో బెదిరిస్తూనే ఉంటుంది. కానీ అణచివేతలు, భయోత్పాతాలు అంతిమ విజయాలు సాధించిన దాఖలాలు లేవు. రెడ్బుక్ రాజ్యాంగం చెల్లదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
'ఆఫ్ బీజేపీ' న్యూజెర్సీలో బీజేపీ నేృతృత్వంలోని ఎన్డీఏ గెలుపు సంబరాలు
అమెరికాలో న్యూజెర్సీ రాష్టంలో సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ చారిత్రాత్మక విజయాన్ని భారతీయ అమెరికన్ కమ్యూనిటీ జరుపుకుంది. ఆఫ్ బీజేపీ అమెరికా (OFBJP-USA ) అధ్యక్షుడు డాక్టర్ అడపా ప్రసాద్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఆఫ్ బీజేపీ. నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజెపీ ప్రభుత్వం, దాని మిత్రపక్షాలు వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పట్ల భారత సంతతి అమెరికన్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు 800 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. ఈ వేడుకలో ఉత్సాహభరితమైన డోల్ తాషా ప్రదర్శనలు, ఎన్నారైల నృత్యాలతో ప్రారంభమయ్యింది. బీజేపీ విజయానికి గుర్తుగా ఉత్సాహన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాలన్నీ ఆనందభరితంగా సాగాయి. దీనికి వ్యాఖ్యాతగా జ్యోత్స్న వ్యవహరించారు. ఆఫ్ బీజేపీ అధ్యక్షుడు అధ్యక్షుడు డా. అడపా ప్రసాద్ ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, ఎన్డీఏ కూటమి భాగస్వాములకు అభినందనలు తెలిపారు. ముచ్చటా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ చారిత్రక విజయాన్ని హైలెట్ చేశారు. 1962 తర్వాత తొలిసారిగా వరసగా మూడోసారి ప్రజలు బీజేపీకే అధికారం కట్టబెట్టారని అన్నారు. ఈ మేరకు ఆఫ్ బీజేపీ వాసుదేవ్ పటేల్ మాట్లాడుతూ..కొత్త ప్రభుత్వం తన వేగవంతమైన అభివృద్ధిని కొనసాగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రపంచంలో రెండో ప్రపంచ యుద్ధానంతరం వరుసగా మూడోసారి ఎన్నికైన నాయకుడు నరేంద్ర మోదీనే అని, ప్రతిసారి స్థిరమైన ఓట్ల శాతంతో అంతర్జాతీయ రికార్డుని నెలకొల్పారని కృష్ణారెడ్డి ఉద్ఘాటించారు. టీడీపీ, జనసేన, జేడీయూ, శివసేన, బీజేపీతోపాటు దాని ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల విజయాన్ని ప్రశంసించారు.డా. సుధీర్ పారిఖ్, శ్రీ ఆల్బర్ట్ జెస్సాని,పీయూష్ పటేల్ బీజేపీ ప్రభుత్వ విజయాలపై ప్రసంగించారు. అఫ్ బీజేపీ తెలంగాణ కన్వీనర్ /అధ్యక్షుడు విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ.. తెలంగాణలోని ఎంపీ సీట్ల కోసం అమెరికాలో అన్ని తెలంగాణ ఆఫ్ బీజేపీ కమిటీ చాఫ్టర్లు కలిసి కట్టుగా 12 ఎంపీ జూమ్ కాల్స్, ఫోన్ కాల్ కాంపెయిన్, సోషల్ మీడియాలో వీడియోలు, ఛాయ్ పే చర్చలు, గ్లోబల్ క్యాలాథన్, గ్లోబల్ ఛాయ్ పే చర్చలు, యజ్ఞాలు/హామములు లాంటివి చేసి 17 ఎంపీలలో ఎనిమిది వచ్చేలా కృషి చేశారని వివరించారు. అలాగే రాబోయే 2029లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆశాభావన్ని వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం చరణ్ సింగ్ గారు ఉత్తర ప్రదేశ్ కోసం, అమర్ గోస్వామి గుజరాత్ కోసం కారు ర్యాలీ లాంటివి చేసినట్లు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. సుధీర్ పరేఖ్, జయేష్ పటేల్, పీయూష్ పటేల్, కమ్యూనిటీ నాయకులు, వాలంటీర్లు సహా న్యూజెర్సీ అంతటా భారతీయ ప్రవాసులు పాల్గొన్నారు. కల్పనా శుక్లా, మా రాజ్యలక్ష్మి, దీప్తి జానీ, సంతోష్ రెడ్డి, గణేష్ రామకృష్ణన్, మధుకర్ రెడ్డి, శివదాసన్ నాయర్, జయశ్రీ, గోవిందరాజ్, ఓంప్రకాష్ నక్క, జగదీష్ యలిమంచిలి, ప్రవీణ్ తడకమళ్ల , రఘు రెడ్డి, రామ్ వేముల, శరత్ వేముల, విజయ్ కుందూరు, శ్రీనివాస్ గనగోని, శ్రీకాంత్ రెడ్డి, పృధ్వి, రవి పెద్ది, నాగ మహేందర్, మధు అన్న, భాస్కర్, దాము గాదెల, ప్రవీణ్ గూడూరు, సుధాకర్ ఉప్పల, మృధుల,లక్ష్మీ మోపర్తి, గురు ఆలంపల్లి, గోపి, తదితర కమ్యూనిటీ లీడర్లు పాల్గొన్నారు .(చదవండి: అట్లాంటాలో అట్టహాసంగా ముగిసిన 18 వ ఆటా కన్వెన్షన్) -
రాజధాని అమరావతే.. ఆర్థిక రాజధానిగా విశాఖ: చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పాలన సాగిస్తామని, ప్రతి అడుగు ప్రజల కోసమే వేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజా వేదికలా కూల్చి వేతలు, మూడు రాజధానుల పేరుతో ఆటలు తమ ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్లో మంగళవారం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. ఇందులో ఎన్డీయే శానససభాపక్ష నాయకుడిగా చంద్రబాబు ఎన్నికయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో బాధ్యతాయుతమైన పాజిటివ్ ప్రభుత్వం ఉంటుందని, అశాంతికి తావుండదని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారని, ఆ తీర్పును నిలబెట్టుకునే బాధ్యత ఎమ్మెల్యేలందరిపైనా ఉందన్నారు. ప్రమాదంలో ఉన్న రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని.. ప్రజలు గెలిచారని, రాష్ట్రాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాము ఓడింది కేవలం 11 సీట్లలో మాత్రమేనని, 93 శాతం స్ట్రైక్ రేట్తో 57 శాతం ఓట్లను కూటమి సాధించిందని తెలిపారు. ఇలాంటి విజయం, ఇంతటి సంతోషం ఎప్పుడూ లేదని, ఫలితాలతో ఏపీ ప్రతిష్ట, గౌరవం పెరిగిందని చెప్పారు. తనను జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మద్దతును ఎప్పుడూ మరిచిపోనన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని గతంలో చెప్పారని, జైల్లో తనను కలిసిన అనంతరం పొత్తు ప్రకటించారని తెలిపారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామని, మళ్లీ ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర సహకారం కూడా అవసరమని, ఈ మేరకు కేంద్రం కూడా హామీ ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రం పూర్తిగా శిథిలమైందని, దెబ్బతినని వర్గమంటూ లేదన్నారు. కక్షపూరిత రాజకీయాలు ఉండవురాష్ట్రానికి ఎంత అప్పు ఉందో తెలీదని, ఎక్కడ నుండి తెచ్చారో తెలీదని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని చంద్రబాబు అన్నారు. సాగునీటి వ్యవస్థ నిర్వీర్యం అయిందని, వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో ఉందన్నారు. పదేళ్ల తర్వాత కూడా రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష పూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక రాజయాలు పాటిద్దామని చెప్పారు. పోలవరం డయా ఫ్రం వాల్ కొట్టుకుపోయిందని, మళ్లీ కేంద్రం సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీళ్లందిస్తామని తెలిపారు.రాజధానిగా అమరావతి.. ఆర్థిక రాజధానిగా విశాఖఏపీకి రాజధానిగా అమరావతి, ఆర్థిక రాజధానిగా విశాఖ ఉంటుందని బాబు స్పష్టం చేశారు. న్యాయ రాజధాని కర్నూలు అంటూ మోసం చేశారని, రాయలసీమలో వన్ సైడ్గా ఎన్నికలు జరిగాయని చెప్పారు. ముఖ్యమంత్రి కూడా మామూలు మనిషేనని, తాను సీఎంగా ఉన్నా, పవన్ కళ్యాణ్ ఏ పదవిలో ఉన్నా సామాన్యుల్లా ప్రజల్లో ఒకరిగానే ఉంటామని తెలిపారు. హోదా సేవ కోసం తప్ప పెత్తనం కోసం కాదన్నారు. తమ ప్రభుత్వంలో ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగదని, స్టేట్ ఫస్ట్ నినాదంతో ముందుకు వెళతామన్నారు. కేంద్రంలో రాష్ట్రానికి సముచిత గౌరవం దక్కిందన్నారు. పదేళ్ల మోదీ పాలన దేశ ప్రతిష్టను పెంచిందని, గతంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 5వ స్థానానికి వచ్చిందని తెలిపారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు బాధ్యత తీరిపోయిందనుకోకుండా నిత్యం తమను ఆశీర్వదించి ముందుకు నడపాలన్నారు. తప్పు చేస్తే ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని, కలిసి ముందుకు సాగి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామని కోరారు. తెలుగు జాతి ప్రపంచంలో నంబర్ వన్గా ఉండాలనేది తన కల అని తెలిపారు. నిర్ధిష్ట సమయంలోనే ఏపీని నంబర్ వన్గా చేసుకుందామన్నారు.హామీలన్నీ నెరవేర్చేలా పాలన : పవన్ కళ్యాణ్జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఐదు కోట్ల మందికిపైగా ప్రజలు తమపై నమ్మకం పెట్టుకున్నారని, కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదన్నారు. అన్నింటా బలంగా నిలబడతామని చెప్పి అధికారంలోకి వచ్చామని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు. నాలుగు దశాబ్దాల అనుభవం, అభివృద్ధిపై అవగాహన, పెట్టుబడులు తెచ్చే సమర్థత, ప్రతిభ, విదేశాల్లో ఉండే నాయకుల్ని, వివిధ దేశాధి నేతల దృష్టిని సైతం తెలుగు రాష్ట్రాల వైపు మళ్లించే సమర్ధత చంద్రబాబుకు ఉందన్నారు. చంద్రబాబు ఎంతో నలిగిపోయారని, జైల్లో ఆయన్ని చూశానని, మంచి రోజులు వస్తాయని చెప్పానని, వచ్చాయని తెలిపారు. ఆయన అద్భుతమైన పాలన ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు. కలసికట్టుగా చేసిన కృషితో ఏన్డీయే కూటమి అద్భుత మెజారిటీతో 164 శాసన సభ స్థానాలు దక్కించుకుందన్నారు. ఒక్క ఓటు చీలకుండా అలయెన్స్ ఎలా ఉండాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కలిసి కట్టుగా చూపించారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ.. ఎవరూ ఊహించని విధంగా అనూహ్య విజయం సాధించామన్నారు. ఈ విజయం నుంచి తాము కూడా ఒక గుణపాఠం నేర్చుకోవాలన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ లక్ష్యంతో పని చేయాలని, మూడు పార్టీల కలయిక త్రివేణి సంగమమని తెలిపారు.ఎన్డీయే సభాపక్ష నేతగా చంద్రబాబుఈ సమావేశంలో చంద్రబాబును ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. తొలుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం పవన్ కళ్యాణ్, చంద్రబాబును ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా ప్రతిపాదించగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బలపరిచారు. సమావేశం తర్వాత అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, పురందేశ్వరిలు రాజ్భవన్కు వెళ్లి 164 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబును ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని గవర్నర్ అబ్దుల్ నజీర్కు తెలిపి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. అనంతరం చంద్రబాబు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్తో బుధవారం రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దాదాపు 30 నిముషాల పాటు సమావేశమయ్యారు. తనకు మద్దుతు ప్రకటించిన 163 మంది ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్కు సమర్పించారు. దాంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ అబ్దుల్ నజీర్.. చంద్రబాబును లాంఛనంగా ఆహ్వానించారు. అనంతరం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో బుధవారం ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో గవర్నర్ పదవీ స్వీకార ప్రమాణం చేయించనున్నారు. -
మోదీ హయాంలో బలమైన ప్రతిపక్షం
ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మొదటిసారిగా ఒక అధికార ప్రతిపక్ష నాయకుని హోదా పొందిన విపక్ష నాయకుడు పార్లమెంట్లో కనిపించబోతున్నారు. 2024 ఎన్నికల ఫలితాలు మోదీకి ఇవ్వబోతున్న కొత్త అనుభవం ఇది. గత పది ఏండ్ల పాలనలో అధికారికంగా అసలు విపక్షమే లేకుండా ఏక పక్షంగా సభను నడిపించారు. ఇప్పుడు ప్రధానిగా నరేంద్ర మోదీ మూడో సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీఏ కూటమిలోని చంద్రబాబు, నితీష్ కుమార్ తదితరుల సపోర్ట్తో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ‘ఇండియా’ కూటమి రూపంలో ప్రతిపక్షం... పదేండ్ల తర్వాత అధికార పక్ష వ్యవహారశైలిని సమర్థవంతంగా నియంత్రించే స్థాయికి చేరడం గమనార్హం.కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రవేశించనున్నారు. మోదీకి ఈ విషయం మింగుడు పడనిదే. రాహుల్ విపక్ష నేతగా రావడం లౌకిక, ప్రజాస్వామ్య భారతదేశానికి ఒక మంచి పరిణామంగా పేర్కొనక తప్పదు. రాహుల్ వయసు ఉన్నన్ని సీట్లు కూడా కాంగ్రెస్కూ, ‘ఇండియా’ కూటమికీ రావని ఎద్దేవా చేసిన మోదీకి ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కనువిప్పు కలిగించాయి. కాంగ్రెస్ సొంతంగా 99 సీట్లు, దాని నాయకత్వంలోని ఇండియా కూటమి మొత్తం 234 సీట్లు గెలవడం లౌకికవాదానికి తిరిగి ఊపిరులూదినట్లయ్యింది. ఇద్దరు ఇండిపెండెట్లూ ‘ఇండియా’కు మద్దతు ప్రకటించడంతో ఈ కూటమి బలం 236కు చేరడం గమనార్హం.2024 ఎన్నికల ఫలితంగా మొట్టమొదటిసారిగా మోదీ ముందు అధికార హోదా కలిగిన ప్రతిపక్ష నాయకుడు కూర్చోబోతున్నారు. ఆయన రాహుల్ గాంధీయే అని రాజకీయ విశ్లేషకుల మాట. సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయించిన అనంతరం నిర్వహించే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాహుల్ను పార్టీ సభానాయకునిగా ఎన్నుకోవడం కేవలం లాంఛనప్రాయం అనే భావిస్తున్నారు. కాబట్టి మోదీ, ఆయన పార్టీవారు గేలిచేసిన రాహుల్ గాంధీయే ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా మోదీకి లోక్ సభలో సవాల్ విసరబోతున్నారు. గత పదేళ్లుగా లోక్ సభ సీట్లలో పదిశాతం సీట్లు కూడా గెలవలేదనే నెపంతో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా స్పీకర్ ఇవ్వలేదు. నిజానికి విపక్షంలో అత్యధిక సీట్లు వచ్చిన పార్టీకి పది శాతం సీట్లతో సంబంధం లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఇప్పుడు కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం స్పీకర్కు అనివార్యం. బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే వచ్చాయి. అందువల్ల ఇప్పుడు తన భాగస్వామ్య పక్షాలపై ప్రభుత్వ ఏర్పాటుకు తప్పనిసరిగా ఆధారపడవలసి వచ్చింది. ఫలితంగా మోదీ ఇప్పుడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అవకాశమే లేదు. ప్రతిపక్ష హోదా కూడా లేని ప్రతిపక్షాలను ఉత్సవ విగ్రహాలను చేసి ఆడిన ఆటలు ఇక సాగకపోవచ్చు. మోదీ ఈ ఎన్నికల్లో గెలవడానికి అత్యంత ప్రమాదకరమైన ఉపన్యాసాలు ఇచ్చారు. ‘టైమ్స్’ లాంటి విదేశీ పత్రికలు మోదీని ‘డివైడర్ ఇన్ చీఫ్’ అని అభివర్ణించాయి. మోదీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ ఉపన్యాసం ఒక నేరం అనీ, ప్రతిదానికీ, చట్ట ప్రకారం శిక్ష పడే పరిస్థితి ఉందనీ ప్రముఖ న్యాయ కోవిదుడు ఆశోక్ అరోరా అంటారు. హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలు రేపే ఉపన్యాసాలు (తాళిబొట్లు గుంజుకు పోతారనీ, బర్రెలను తీసుకెళతారనీ), వ్యాఖ్యలూ చేసిన వ్యక్తికి ప్రధాని అయ్యే అర్హత లేదని ఆయన అంటారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతికి లేఖ రాసినట్లు, ఒక వీడియో విడుదల అయ్యింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతిపక్ష కూటమి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రజల ఆశలను, ఆకాంక్షలను వారు వమ్ము చేయబోరని ఆశిద్దాం! ఆకలి, అసమానతలు, నిరుద్యోగం లేని; కుల, మతాలకు అతీతమైన భారతదేశ నిర్మాణం కోసం వీరంతా కృషి చేస్తారని, చేయాలని ఆశిద్దాం! ఎమ్.డి. మునీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ ‘ 99518 65223 -
మొదటి నూరు రోజులు కీలకం
ఆర్థిక మాంద్యం నేపథ్యంలో 1933లో అమెరికాలో గద్దెనెక్కిన రూజ్వెల్ట్ ప్రభుత్వం తొలి వంద రోజుల్లో కొన్ని మేలైన నిర్ణయాలు తీసుకుంది. అప్పటి నుంచీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తొలి వంద రోజుల్లో ఏం చేస్తుందనే ఆసక్తి మొదలైంది. కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాలు ఉపాధి! దేశవ్యాప్తంగా అప్రెంటిస్షిప్ కార్యక్రమం ఒకదాన్ని మొదలుపెట్టడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. చిన్న, సన్నకారు రైతులతోపాటు కౌలు రైతులకూ రుణాలు అందుబాటులోకి తేవాలి. వంద కోట్ల కంటే ఆర్థిక సంపద ఎక్కువగా ఉన్న వారిపై ఒక శాతం పన్ను విధించాలి. దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అంతరాన్ని తగ్గించేందుకు ఈ చర్య ఉపయోగపడుతుంది.కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా తొలి వంద రోజుల్లో ఏం జరుగుతుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త ప్రభుత్వపు ప్రాథమ్యాలు అర్థమయ్యేదిప్పుడే మరి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో కొన్నింటినైనా అమలు చేసేందుకు ఇదే మంచి తరుణం కూడా. తద్వారా కొత్త ప్రభుత్వ కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయి. ప్రజల్లో విశ్వాసమూ నెలకొంటుంది. అలాగే దేశీ, విదేశీ పెట్టుబడిదారుల నమ్మకం చూరగొనడమూ సాధ్యమవుతుంది. స్పష్టమైన మెజారిటీతో గద్దెనెక్కిన ప్రభుత్వం కూడా కొంత సమయం తరువాత ప్రజా విశ్వాసం కోల్పోవచ్చు. కాబట్టి ఈ తొలి రోజులను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి ఈ తొలి వంద రోజుల భావన ఎప్పుడో 1933లో అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్ మొదలుపెట్టారు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో గద్దెనెక్కిన రూజ్వెల్ట్ ప్రభుత్వం తొలి వంద రోజుల్లో కొన్ని మేలైన నిర్ణయాలు తీసుకుంది. రైతులతోపాటు నిరుద్యోగులు, యువత, పరిశ్రమలకు ఉపశమనం కలిగించేలా తక్షణ సాయం ప్రకటించడం, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ఉద్దీపన కార్యక్రమాలు చేపట్టడం వీటిల్లో ఉన్నాయి. ఇదే సమయంలో బంగారంపై ప్రైవేట్ యాజమాన్యాన్ని తొలగించడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు ఈ సమయంలోనే జరిగాయి. మనుగడ సాగించలేని బ్యాంకుల బరువును వదిలించుకునేందుకు బ్యాంకింగ్ హాలిడేను ప్రకటించారు. వాణిజ్య, పెట్టుబడులకు వేర్వేరుగా బ్యాంకింగ్ వ్యవస్థల ఏర్పాటుకు దారితీసిన గ్లాస్–స్టీగాల్ చట్టం ఈ సమయంలోనే అమల్లోకి వచ్చింది. భారత్లో కొత్తగా కొలువైన ప్రభుత్వానికి రూజ్వెల్ట్ తరహాలో ఆర్థిక మాంద్య సమస్య లేదు. పైగా ఆర్థిక రంగం పటిష్టంగానే ఉంది. గత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు చాలామందిని ఆశ్చర్యపరుస్తూ పైకి ఎగబాకింది. అలాగే ద్రవ్యోల్బణం కూడా ఓ మోస్తరు స్థాయిలో మాత్రమే కొనసాగుతోంది. బ్యాంకింగ్ రంగ ఆరోగ్యం కూడా బాగానే కనబడుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు స్థాయిలో రూ.1.4 లక్షల కోట్ల లాభాలు నమోదు చేశాయి. స్టాక్ మార్కెట్ కూడా మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ఈ స్థూల ఆర్థికాంశాలన్నీ బాగా ఉన్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం తొలి వంద రోజుల ప్రాథమ్యాలు ఏముంటే బాగుంటుంది? నాలుగు నిర్దిష్టమైన సూచనలు:కొత్త ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు ఉపాధి కావచ్చు. అంతర్జాతీయ కార్మిక సంఘం, ఇన్ స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ నివేదికల ప్రకారం దేశంలోని నిరుద్యోగుల్లో 83 శాతం మంది 29 ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగిన వారు. ఇదే సమయంలో దేశం మొత్తమ్మీద నైపుణ్యమున్న, అర్ధ నైపుణ్యమున్న ఉద్యోగుల కొరత చాలా తీవ్రంగా ఉంది. కాబటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా అప్రెంటిస్షిప్ కార్యక్రమం ఒకదాన్ని మొదలుపెట్టడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఈ రకమైన కార్యక్రమానికి ప్రస్తుతమున్న వాటి కంటే మెరుగైన చట్టపరమైన మద్దతు అవసరమవుతుంది. ప్రస్తుత కార్మిక చట్టాల ప్రకారం.. అప్రెంటిస్ అయినా, ఇతరులైనా ఆరు నెలలపాటు పనిచేస్తే వారిని శాశ్వత ఉద్యోగులుగా చేయాలి. ఫలితంగా పారిశ్రామిక వేత్తలు అప్రెంటిస్లకు కూడా అవకాశాలిచ్చే అవకాశం తక్కువ అవుతోంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. అప్రెంటిస్ సర్టిఫికెట్ దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యేలా చేయాలి. కేంద్ర ప్రభుత్వ అధికారిక ముద్ర కూడా ఈ సర్టిఫికెట్కు అవసరమవుతుంది. జాతీయ అప్రెంటిస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి పై అంశాలన్నింటినీ చేర్చడం ద్వారా నిరుద్యోగ సమస్య, నైపుణ్యాల లోటు, ఉద్యోగార్హతల సమస్యలను పరిష్కరించవచ్చు. దీంతోపాటు అగ్నివీర్ కార్యక్రమాన్ని ప్రస్తుతమున్న నాలుగేళ్ల నుంచి ఏడు లేదా ఎనిమిదేళ్లకు పెంచడం (షార్ట్ సర్వీస్ కమిషన్ కార్యకాలానికి దగ్గరగా) కూడా నిరుద్యోగ సమస్య సమసిపోయేందుకు ఉపయోగపడుతుంది. ఇక రెండో సూచన... పంట ఉత్పత్తులకిచ్చే కనీస మద్దతు ధరకు చట్టపరమైన రక్షణ కల్పించడం గురించి. కనీస మద్దతు ధర సాఫల్యానికి మార్కెట్ ధరలన్నీ గణనీయంగా తగ్గాలి. అయితే కనీస మద్దతు ధర వల్ల ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశమూ ఉంటుంది. కానీ మొత్తమ్మీద అటు రైతుకు, ఇటు ప్రభుత్వానికి ఉభయ తారకం. కొత్త ప్రభుత్వం కనీస మద్దతు ధరతోపాటు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులపై నియంత్రణలకు దూరంగా ఉంటామన్న సూచన కూడా చేయాల్సి ఉంటుంది. నియంత్రణలు రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి.మూడవ సూచన: చిన్న, సన్నకారు రైతులతోపాటు కౌలు రైతులకూ రుణాలు అందుబాటులోకి తేవాలి. దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో 40 శాతం కౌలు రైతులే పండిస్తున్నారు. భూ యజమానులతో వీరికి నామమాత్రపు ఒప్పందం మాత్రమే ఉంటుంది. ఈ కారణంగా రుణ సౌకర్యం లభించడం కష్టమవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ సమస్యను అధిగమించేందుకు కొన్ని వినూత్న పద్ధతుల ఆవిష్కరణ జరిగింది. ఇలాంటి ప్రయత్నాల మదింపు జరిపి జాతీయ స్థాయి విధానాన్ని రూపొందించి అమలు చేయాల్సిన అవసరముంది. సాధారణంగా పంట రుణాలన్నవి నాలుగు నుంచి ఆరు నెలల కాలానికి అవసరమవుతుంటాయి. ఇంత చిన్న కాలావధి అనేది నిరర్థక ఆస్తుల నిర్వచనం కిందకు రాదు. దీనికి తగిన నమూనా రూపొందించాలి. అలాగే చిన్న, సన్నకారు రైతులు, ఔత్సాహిక చిన్నస్థాయి పారిశ్రామిక వేత్తలకూ రుణ సౌకర్యం పెద్దగా ఉండటం లేదు. అకౌంట్ అగ్రిగేటర్స్ వంటివి అందుబాటులో ఉన్న ఈ కాలంలో కేవలం కొలాటరల్ ఆధారంగా కాకుండా... క్యాష్ ఫ్లో ఆధారంగా రుణాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలి. పైగా... చాలామంది చిన్నస్థాయి పారిశ్రామిక వేత్తలకు ఆర్థికాంశాలపై అవగాహన తక్కువే. ఈ అంతరాన్ని భర్తీ చేసేందుకు గట్టి ప్రయత్నమే జరగాలి. అంతేకాకుండా... చిన్న చిన్న పారిశ్రామికవేత్తలకు వర్కింగ్ క్యాపిటల్ లభ్యత పెరిగేందుకు 2006 నాటి చిన్న, మధ్యతరహా పరిశ్రమల చట్టంలోని 45 రోజుల నిబంధనను కఠినంగా అమలు చేసే ప్రయత్నం జరగాలి. నాలుగో సూచన... ఫైనాన్షియల్ వెల్త్ (స్టాక్స్, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటివి– అన్నీ ‘పాన్’తో అనుసంధానించి ఉంటాయి) విలువ రూ.వంద కోట్ల కంటే ఎక్కువగా ఉన్న వారిపై కొద్దిగా ఒక శాతం పన్ను విధించడం. దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అంతరాన్ని తగ్గించేందుకు ఈ చర్య ఉపయోగపడుతుంది. ఈ పన్ను ద్వారా సేకరించిన మొత్తాలను గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక విద్యాభివృద్ధికి కేటాయించవచ్చు. ఈ నిధులు రాష్ట ప్రభుత్వాలకు కాకుండా... నేరుగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు చేరాలి. ఫైనాన్స్ కమిషన్ ఇప్పటికే ఇలా నేరుగా ఆర్థిక వనరులను అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రొ‘‘ అజీత్ రానాడే వ్యాసకర్త పుణెలోని ‘గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్’ వైస్ ఛాన్స్లర్ (‘ద మింట్’ సౌజన్యంతో) -
‘స్పీకర్ పదవి తీసుకోండి.. లేదంటే మీ పని అంతే!’
ముంబై: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ ఎంపీ స్థానాలు సాధించలేకపోయింది. దీంతో కేంద్రంలో భాగస్వామ్య పార్టీల మద్దతుతో బీజేపీ.. ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరడానికి తెలుగుదేశం(టీడీపీ), జేడీ (యూ)లు కీలకంగా వ్యవహరించి మద్దతు పలికాయి.టీడీపీ, జేడీ(యూ) పార్టీల మద్దతుతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీపై విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఎన్నికవ్వడానికి మద్దతు పలికిన టీడీపీ, జేడీ(యూ) భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా ఉండాలని శివసేన (యూబీటీ) వర్గం నేత ఆదిత్య ఠాక్రే హెచ్చరించారు.If TDP and JDU want to save their party, they should keep Loksabha speaker post with them otherwise BJP will break their parties for sure. — Aditya Thackeray pic.twitter.com/vopynhKkVp— Shantanu (@shaandelhite) June 10, 2024 ‘టీడీపీ, జేడీ(యూ) పార్టీలు.. తమ పార్టీను రక్షించుకోవాలి. అందుకోసం బీజేపీ నుంచి లోక్సభ స్పీకర్ పదవి డిమాండ్ చేసి తీసుకోండి. లేదంటే త్వరలోనే మీ పార్టీలను బీజేపీ చీల్చివేస్తుంది’ అని ఆదిత్య ఠాక్రే ‘ఎక్స్’ వేదికగా అన్నారు.మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ చీలిన విధానాన్ని ఆదిత్య పరోక్షంగా ప్రస్తావించారు. ఎన్డీయే కూటమి ఇంకా లోక్సభ స్పీకర్ పదవిని ఎవరికీ కేటాయించలేదు. భాగస్వామ్య పార్టీలు స్పీకర్ పదవిని కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే వారి డిమాండ్కు బీజేపీ ఒప్పుకోవటం లేదని ఎన్డీయే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
సరికొత్త సంకీర్ణ విన్యాసం
ఆహూతులైన వివిధ దేశాల ప్రభుత్వాధినేతలు, అనేక రంగాల ప్రముఖులు, వేలాది జనం సాక్షిగా, రాష్ట్రపతి భవన్ వేదికగా ఆదివారం రాత్రి నరేంద్ర మోదీ కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. భారత ప్రధాని స్వర్గీయ నెహ్రూ తర్వాత మళ్ళీ వరుసగా మూడుసార్లు ప్రధాని పదవిని చేపట్టిన మరో వ్యక్తిగా మోదీ చరిత్ర సృష్టించారు. ప్రధాన మంత్రి కిసాన్ నిధి నుంచి 17వ విడతగా 9.3 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రూ. 20 వేల కోట్లు పంపిణీ చేసే ఫైలుపై తొలి సంతకంతో సోమవారం ఉదయమే మోదీ పనిలోకి దిగిపోయారు. మొదటి రెండు పర్యాయాలు బీజేపీ సొంత బలంతో ‘మోదీ సర్కార్’గానే పాలన చేసిన కమలనాథులు ఈ మూడోసారి మాత్రం చాలినంత సంఖ్యాబలం లేక, మిత్రపక్షాల అండతో అచ్చమైన ‘ఎన్డీఏ సర్కార్’గా పని చేయాల్సి రావడం కొత్త పాలనలోని పెద్ద మార్పు. గతంలో గుజరాత్ సీఎంగా కానీ, ఆ తరువాత గడచిన పదేళ్ళుగా ప్రధానిగా కానీ తన మాటే శాసనంగా చలామణీ అయిన మోదీ ఇప్పుడు వివిధ ప్రాంతాలు, పార్టీలు, ఆశలు, ఆకాంక్షలకు చెవి ఒగ్గి, ఏకాభిప్రాయసాధనలో ఏ మేరకు విజయం సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. జనరల్ (24), ఓబీసీ (27), ఎస్సీ (10), ఎస్టీ (5), మైనారిటీలు (5)... ఇలా వివిధ వర్ణ శోభితమైన హరివిల్లుగా మొత్తం 71 మంది సహచరులతో మోదీ సారథ్యంలో కొత్త మంత్రి మండలి ఏర్పాటైంది. మొత్తం 81 మంది మంత్రి పదవులకు అవకాశం ఉండగా ఏకంగా 71 మందిని తొలి విడతలోనే తీసుకున్న మోదీ 24 రాష్ట్రాలకు కేంద్రంలో ప్రాతినిధ్యం కల్పించినట్టయింది. అయితే, ప్రమాణ స్వీకారం జరిగిన అనేక గంటల తర్వాత సోమవారం రాత్రికి గాని మంత్రిత్వ శాఖల కేటాయింపు ప్రకటన వెలువడలేదు. ఏకపక్ష నిర్ణయాలు అలవాటైన ప్రభుత్వ పెద్దలు సంకీర్ణ ప్రభుత్వంలో అన్ని పక్షాలకూ సంతృప్తి కలిగేలా వ్యవహరించడంలోని ఇబ్బందిని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నట్టుంది. ఆ మాటకొస్తే ప్రమాణ స్వీకారానికి ముందు, ఆ తరువాత కూడా సంకీర్ణ పక్షాలలో కొన్ని బాహాటంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఒక మంత్రి పదవి... అదీ సహాయ మంత్రి పదవే ఇవ్వడం, అందులోనూ గతంలో క్యాబినెట్ హోదాలో పనిచేసిన ప్రఫుల్ పటేల్కు ఆ స్థాయి తక్కువ పదవి ఇవ్వడం పట్ల అజిత్ పవార్ సారథ్యంలోని జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ప్రమాణ స్వీకారం కన్నా ముందు ఆదివారమే అభ్యంతరం చెప్పింది. మంత్రి పదవిని తిరస్కరించింది. గెలిచిన అనురాగ్ ఠాకూర్ నుంచి, ఓడిపోయిన స్మృతీ ఇరానీ దాకా పలు పాత ముఖాలకు కొత్త సర్కారులో మోదీ మొండిచేయి చూపారు. అదే సమయంలో 33 మందిని మొదటిసారి మంత్రుల్ని చేశారు. ఏపీ నుంచి ముగ్గురికి, తెలంగాణ నుంచి ఇద్దరికీ మంత్రులుగా బెర్తులిచ్చారు. ఆ లెక్కలెలా ఉన్నా, సోమవారం సాయంత్రం తొలిసారిగా కేంద్ర క్యాబినెట్ భేటీ జరిగే లోగా... సంకీర్ణ సర్కారు నుంచి మరిన్ని గొంతులు పైకి లేచాయి. ఏడుగురు ఎంపీలున్న తమ కన్నా తక్కువ సంఖ్యాబలం గల పార్టీలకు క్యాబినెట్ హోదా మంత్రి పదవిచ్చి, తమకు మాత్రం స్వతంత్ర హోదా ఉన్న సహాయ మంత్రి పదవితోనే సరిపుచ్చారంటూ ఏక్నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన అసమ్మతి వ్యక్తం చేసింది. సొంత గూటిలోనూ బీజేపీకి సణుగుళ్ళు తప్పట్లేదు. కేరళలో తొలిసారిగా ఖాతా తెరిచిన కమలం పార్టీ త్రిస్సూర్ నుంచి గెలిచిన సినీ నటుడు సురేశ్ గోపికి మంత్రిమండలిలో స్థానం కల్పించింది. అయితే, సహాయ మంత్రి హోదా ఇచ్చినందుకు కినిసి ఆయన పక్కకు తప్పుకోవడానికి సిద్ధమైనట్టు వార్తలు రావడం, రచ్చ రేగేసరికి ఆఖరుకు ట్విట్టర్లో అలాంటిదేమీ లేదని ఖండించడం చకచకా జరిగాయి. వీటిని బట్టి సంకీర్ణ సర్కార్ నడపడంలోని సవాళ్ళు మోదీకి ఆదిలోనే అర్థమై ఉండాలి. మరోపక్క మరికొద్ది నెలల్లోనే మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్న బీజేపీ అక్కడ మళ్ళీ బలం పుంజుకోవాలని ప్రయత్నిస్తుంది. అలాగే, దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ క్యాబినెట్లో ప్రాతినిధ్యమూ కమలనాథుల ‘మిషన్ సౌత్’ వ్యూహంలో భాగమే. ఇక, వివిధ రాష్ట్రాలకు గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఆరుగురు ఇప్పుడు మోదీ క్యాబినెట్లో ఉన్నారు. స్వయంగా మోదీని సైతం కలుపుకొంటే ఆ సంఖ్య ఏడుకు చేరుతుంది. అంటే పాలనలో అనుభవానికి కొరత లేదు. కాకపోతే, వ్యక్తిగతంగా అధికారంలో శిఖరాలను చూసినవారు కలసికట్టుగా ముందడుగు వేయడంలో అహంభావాలకు తావు లేకుండా చూసుకోగలరా అని విశ్లేషకుల అనుమానం. అయితే, రక్షణ, ఆర్థిక, హోమ్, విదేశీ వ్యవహారాల వంటి కీలక శాఖలను గత ప్రభుత్వంలోని మంత్రులకే కట్టబెట్టారు. ఇది కొత్త సీసాలో పాత సారాగా తోచినా, విధానాల కొనసాగింపు, సుస్థిరత్వానికి పెద్దపీట వేశారనుకోవాలి. వెరసి మోదీ ప్రజల కొత్త తీర్పుతో ఇప్పుడు కొత్త పిచ్ మీద ఆట మొదలుపెట్టారు. ఒకప్పటి వాజ్పేయి సంకీర్ణ సర్కార్లా సక్సెస్ కావాలంటే సహనం, సహానుభూతి పెంచుకోక తప్పదు. సంకీర్ణ సర్కారుకు తోడు బలమైన ప్రతిపక్షమూ ఉన్నందున పించ్ హిట్టింగ్కు అవకాశం లేదు. తిరుగులేని మెజారిటీ ఉన్న గతంలోలా ఇప్పుడు ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండానే పెద్ద నోట్ల రద్దు, దేశవ్యాప్త లాక్డౌన్ లాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం లాంటివి చేయలేరు. వివాదాస్పదమైన ఒకే దేశం – ఒకే ఎన్నిక, ఉమ్మడి పౌరస్మృతి లాంటి సొంత అజెండాను కాషాయధ్వజులు కొన్నాళ్ళు పక్కనపెట్టక తప్పదు. ఆటలో దూకుడుకు అవకాశం లేనప్పుడు అవుటవకుండా ఆత్మరక్షణ ధోరణిలో ఆడక తప్పదు. పదేళ్ళుగా ప్రాంతీయ పార్టీలను సామ దాన భేద దండోపాయాలతో ఆడిస్తున్న పెద్దలకు కచ్చితంగా ఈ సంకీర్ణపు ఆట సరికొత్తదే! అలాగే పెరిగిన బలంతో ఊపిరి పీల్చుకున్న ప్రతిపక్షం సైతం 18వ లోక్సభలో కూటమిగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తేనే ప్రజలకు మేలు. -
మోదీ అనే నేను..
న్యూఢిల్లీ: స్వతంత్ర భారత రాజకీయాల్లో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ ప్రధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఈ ఘనత సాధించిన నాయకునిగా రికార్డులకెక్కారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 73 ఏళ్ల మోదీతో ప్రధానిగా ప్రమాణంచేయించారు. ఆయన దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం రాత్రి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అన్ని రంగాలకూ చెందిన అతిరథ మహారథుల సమక్షంలో కార్యక్రమం 155 నిమిషాల పాటు అత్యంత వేడుకగా జరిగింది.మోదీ సహా 72 మందితో పూర్తిస్థాయి నూతన కేంద్ర మంత్రివర్గం కూడా ఈ సందర్భంగా కొలువుదీరింది. 30 మందితో కేబినెట్ మంత్రులుగా, ఐదుగురితో స్వతంత్ర, 36 మందితో సహాయ మంత్రులుగా రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయించారు. బీజేపీకి పూర్తి మెజారిటీ రాని నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన ఎన్డీఏ మిత్రపక్షాలకు మంత్రివర్గంలో 11 బెర్తులతో సముచిత ప్రాధాన్యం దక్కింది. బీజేపీ నుంచి రాజ్నాథ్సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, ఎస్.జైశంకర్ వంటి అతిరథులతో పాటు మిత్రపక్షాల నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు (టీడీపీ), లలన్సింగ్ (జేడీయూ), చిరాగ్ పాస్వాన్ (ఎల్జేపీ), హెచ్.డి.కుమారస్వామి (జేడీఎస్) తదితరులు ప్రమాణస్వీకారం చేసిన ప్రముఖుల్లో ఉన్నారు.ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జేడీ(యూ) చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యక్రమంలో పాల్గొనగా తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీతో పాటు పలు విపక్షాలు గైర్హాజరవడం విశేషం. 140 కోట్ల మంది భారతీయులకు మరోసారి సేవ చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందని కార్యక్రమం అనంతరం మోదీ పేర్కొన్నారు.‘‘నూతన మంత్రివర్గ సహచరులతో కలిసి ప్రగతి పథంలో దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పని చేస్తా. అనుభవం, యువత కలబోతగా కొత్త మంత్రివర్గం అలరారుతోంది. ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు నిరంతరం శ్రమిస్తాం’’ అంటూ ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. నూతన మంత్రులకు శాఖల కేటాయింపు సోమవారం జరిగే అవకాశముంది. ఆరుగురు మాజీ సీఎంలు మోదీ 3.0 మంత్రివర్గం పలు విశేషాల సమాహారంగా రూపుదిద్దుకుంది. బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఐదేళ్ల విరామం తర్వాత కేంద్ర మంత్రివర్గంలోకి అడుగు పెట్టారు. మాజీ సీఎంలు శివరాజ్సింగ్ చౌహాన్, కుమారస్వామిలకు తొలిసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. వారితో పాటు నూతన మంత్రివర్గంలో 33 మంది కొత్త ముఖాలున్నాయి. శివరాజ్, కుమారస్వామి, రాజ్నాథ్సింగ్, మనోహర్లాల్ ఖట్టర్, సర్బానంద సోనోవాల్, జితిన్రాం మాంఝీ రూపంలో నూతన మంత్రివర్గంలో ఆరుగురు మాజీ సీఎంలుండటం విశేషం! 43 మందికి మూడుసార్ల కంటే ఎక్కువగా కేంద్ర మంత్రులుగా చేసిన అనుభవముంది. యూపీకి అత్యధికంగా 9 బెర్తులు కేంద్ర మంత్రివర్గంలో ఉత్తరప్రదేశ్కు అత్యధికంగా 9 స్థానాలు దక్కాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్న కీలకమైన బిహార్కు ఏకంగా 8 బెర్తులు దక్కాయి! ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రకు కూడా ఆరు బెర్తులు లభించాయి. గుజరాత్కు ఐదు; మధ్యప్రదేశ్, రాజస్తాన్లకు ఐదేసి; హరియాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులకు మూడేసి; ఒడిశా, అసోం, జార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, పశి్చమబెంగాల్కు రెండేసి చొప్పున స్థానాలు దక్కాయి.అయితే యూపీకి ఒకే కేబినెట్ హోదా బెర్తు దక్కగా బిహార్కు ఏకంగా నాలుగు లభించడం విశేషం! గుజరాత్కు కూడా మోదీ, అమిత్ షా, మాండవీ, సీఆర్ పాటిల్ రూపంలో ఏకంగా నాలుగు కేబినెట్ హోదా బెర్తులు దక్కాయి! మధ్యప్రదేశ్, రాజస్తాన్లకు మూడేసి; మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఒడిశాలకు రెండేసి కేబినెట్ మంత్రి పదవులు దక్కాయి. తెలంగాణ, ఏపీలతో పాటు హరియాణా, పంజాబ్లకు ఒక్కో కేబినెట్ హోదా బెర్తు దక్కాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి 13 మందికి మంత్రివర్గంలో చోటు దక్కింది. 37 మందికి ఉద్వాసన మోదీ 2.0 మంత్రివర్గంలో పని చేసిన వారిలో స్మృతీ ఇరానీ, అనురాగ్ ఠాకూర్, నారాయణ్ రాణే సహా ఏకంగా 37 మందికి ఈసారి కేబినెట్లో చాన్స్ దొరకలేదు. వీరిలో పలువురు లోక్సభ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 2.0 మంత్రివర్గంలోని 19 మంతి కేబినెట్ మంత్రులతో సహా మొత్తం 34 మంది తిరిగి చోటు దక్కించుకున్నారు. వీరిలో తమిళనాడుకు చెందిన ఎల్ మురుగన్కు లోక్సభ ఎన్నికల్లో ఓడినా చాన్స్ దక్కడం విశేషం. ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. కొత్త మంత్రుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు చొప్పున 12 మంది రాజ్యసభ సభ్యులున్నారు. 58 మంది లోక్సభ సభ్యులు కాగా రవ్నీత్సింగ్ బిట్టూ, జార్జి కురియన్ ఏ సభలోనూ సభ్యలు కారు. వారు ఆర్నెల్లలోగా పార్లమెంటు సభ్యులుగా ఎన్నికవాల్సి ఉంటుంది. భాగస్వాములకు పెద్దపీట ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు నూతన మంత్రివర్గంలో సముచిత స్థానం దక్కింది. తాజా మాజీ మంత్రివర్గంలో వాటికి ఒక్క కేబినెట్ హోదా, స్వతంత్ర హోదా మంత్రి పదవి కూడా లేదు. ఈసారి మాత్రం కుమారస్వామి (జేడీఎస్), మాంఝి (హెచ్ఏఎల్), లలన్సింగ్ (జేడీయూ), రామ్మోహన్ నాయుడు (టీడీపీ), చిరాగ్ పాస్వాన్ (ఎల్జేపీ–ఆర్వీ) రూపంలో ఏకంగా ఐదు కేబినెట్ హోదా బెర్తులు దక్కాయి! ప్రతాప్రావ్ జాదవ్ (శివసేన), జయంత్ చౌదరి (ఆరెల్డీ)లకు స్వతంత్ర హోదా కూడిన పదవులు లభించాయి. 2.0 మంత్రివర్గంలో సహాయ మంత్రులైన అనుప్రియా పటేల్ (అప్నాదళ్–యూపీ), రామ్దాస్ అథవాలె (ఆర్పీఐఏ–మహారాష్ట్ర)లకు మళ్లీ చాన్సిచ్చారు. వారితో పాటు రామ్నాథ్ ఠాకూర్ (జేడీయూ), పెమ్మసాని చంద్రశేఖర్ (టీడీపీ)లకు సహాయ మంత్రి పదవులు దక్కాయి. కొత్త మంత్రులు 33 మంది మోదీ 3.0 మంత్రివర్గంలో 33 కొత్త ముఖాలకు చోటు దక్కింది. మాజీ సీఎంలు శివరాజ్సింగ్, కుమారస్వామి, మనోహర్లాల్ ఖట్టర్ తదితర దిగ్గజాలతో పాటు తొలిసారి ఎంపీలుగా నెగ్గిన సురేశ్ గోపి తదితరుల దాకా వీరిలో ఉన్నారు. 24 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కేంద్ర మంత్రివర్గంలో 24 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం దక్కింది. గోవా, అరుణాచల్ వంటి చిన్న రాష్ట్రాలను మినహాయిస్తే నలుగురు, అంతకంటే ఎక్కువ మంది లోక్సభ సభ్యులున్న ప్రతి రాష్ట్రం నుంచీ కనీసం ఒక్కరికి మంత్రివర్గంలో స్థానం లభించింది. ఏడుగురు మహిళలు నూతన మంత్రివర్గంలో మహిళలు 10 శాతం కంటే తక్కువే ఉన్నారు. మొత్తం ఏడుగురికి స్థానం దక్కింది. ఇదీ కులాల కూర్పు మోదీ 3.0 మంత్రివర్గంలో 27 మంది ఓబీసీ, 10 మంది ఎస్సీ, ఐదుగురు ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారు. కా>గా ఐదుగురు మైనారిటీలున్నారు. అయితే ముస్లింలు ఒక్కరు కూడా లేకపోవడం విశేషం. ఇంకో 8 మందికి అవకాశం కేంద్ర మంత్రివర్గ గరిష్ట పరిమాణం 81 (543 మంది లోక్సభ సభ్యుల్లో 15 శాతం). దాంతో మరో 9 మందికి మంత్రులుగా అవకాశముంది. అయితే 2019–24 మధ్య మోదీ 2.0 మంత్రివర్గంలో 78 మంది సభ్యులే ఉన్నారు. అత్యంత పిన్న వయసు్కలు రామ్మోహన్, ఖడ్సే నూతన కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు (టీడీపీ), మహారాష్ట్రకు చెందిన రక్షా ఖడ్సే (బీజేపీ) అత్యంత పిన్న వయసు్కలు. వారికి 37 ఏళ్లు. అత్యంత పెద్ద వయసు్కనిగా 79 ఏళ్ల హెచ్ఏఎల్ అధినేత జితిన్రాం మాంఝీ నిలిచారు. బాక్సు నేడు కేబినెట్ తొలి భేటీ మోదీ 3.0 మంత్రివర్గ తొలి సమావేశం సోమవారం జరగనుంది. లోక్ కల్యాణ్ మార్గ్లోని ప్రధాని మోదీ నివాసంలో సాయంత్రం భేటీ ఉంటుందని సమాచారం. నూతన మంత్రివర్గ సభ్యులందరికీ బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆదివారం రాత్రి విందు ఇచ్చారు. -
మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం
న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం(జూన్9) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీతో సరిగ్గా 7 గంటల 23 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయించారు. #WATCH | Narendra Modi takes oath for the third straight term as the Prime Minister pic.twitter.com/Aubqsn03vF— ANI (@ANI) June 9, 2024 నరేంద్ర దామోదర్దాస్ మోదీ అంటూ మోదీ ప్రమాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రమాణ స్వీకారంతో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన రెండో వ్యక్తిగా మోదీ కొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఓత్ ఆఫ్ ఆఫీస్తో పాటు ఓత్ ఆఫ్ సీక్రెసీ ప్రమాణాన్ని మోదీతో రాష్ట్రపతి చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్,శ్రీలంక,మాల్దీవులు,మారిషస్ ప్రధానులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.పలువురు బీజేపీ అగ్ర నేతలకు మళ్లీ చోటు..గతంలో కీలక శాఖలు నిర్వహించిన బీజేపీ అగ్ర నేతలు అమిత్ షా, రాజ్నాథ్సింగ్, పియూష్గోయెల్, నిర్మలాసీతారామన్, నితిన్ గడ్కరీ జితేంద్ర సింగ్ కేబినెట్ మంత్రులుగా మూడోసారి ప్రమాణం చేశారు. బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డాను ఈసారి కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. Amit Shah sworn in as Union minister in Prime Minister Modi's 3.0 CabinetRead @ANI Story | https://t.co/XtFeIoOQz1#AmitShah #Unionminister pic.twitter.com/kba9Jk43u0— ANI Digital (@ani_digital) June 9, 202472 మందితో మోదీ3.0 మంత్రి వర్గం.. 30 మందికి కేబినెట్ హోదామోదీ 3.0 ప్రభుత్వ మంత్రి వర్గంలో మొత్తం 72 మంత్రులున్నారు. వీరిలో 30 మంది కేబినెట్ మంత్రులుకాగా అయిదుగురు సహాయం(ఇండిపెండెంట్), 36 మంది సహాయ మంత్రి పదవులు దక్కాయి. కేబినెట్లో బీజేపీ కాకుండా ఎన్డీఏ మిత్రపక్షాలకు 11 మంత్రి పదవులు దక్కాయి. కేబినెట్లో సామాజిక వర్గాల వారిగా చూస్తే 20 మంది ఓబీసీలకు, కాగా, ఎస్సీలకు10,ఎస్టీలకు 6 మైనార్టీలకు 5 బెర్తులు కేటాయించారు. 30 మంది కేబినెట్ మంత్రులు వీళ్లే... 1.రాజ్నాథ్ సింగ్2.అమిత్ షా3.నితిన్ గడ్కరీ 4.జేపీ నడ్డా 5.శివరాజ్ సింగ్ చౌహాన్ 6.నిర్మలా సీతారామన్ 7.జై శంకర్ 8.మనోహర్లాల్ ఖట్టర్ 9.హెచ్డీ కుమార్ స్వామీ10.పియూష్ గోయల్11.ధర్మేంద్ర ప్రదాన్12.జితిన్ రామ్ మాంజీ13.రాజీవ్ రంజన్ సింగ్14.శర్వానంద్ సోనోవాల్15.వీరేంద్రకుమార్16.కింజరపు రామ్మోహన్ నాయుడు17.ప్రహ్లాద్ జోషి18.జువల్ ఓరం19.గిరిరాజ్ సింగ్20.అశ్వినీ వైష్ణవ్21.జ్యోతిరాధిత్య సింధియా22.భూపేందర్ యాదవ్23.గజేంద్ర సింగ్ షెకావత్24.అన్నపూర్ణాదేవి25.కిరణ్ రిజిజు26.హర్దీప్ సింగ్పూరి27.మన్సుఖ్ మాండవీయ28.జి.కిషన్ రెడ్డి29.చిరాగ్ పాశ్వాన్ 30.సీఆర్ పాటిల్తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి పదవులు..తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి నరసాపురం ఎంపీగా గెలుపొందిన బీజేపీ నేత శ్రీనివాస వర్మ, తెలంగాణ నుంచి కిషన్రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగు దేశం పార్టీ తరపున కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు మంత్రి వర్గంలో చోటు దక్కింది. మోదీ 3.0.. ఏ రాష్ట్రానికి ఎన్ని బెర్తులు.. యూపీ నుంచి 9 మందికి కేంద్ర మంత్రి పదవులు దక్కగా, మహారాష్ట్ర నుంచి ఆరుగురుకి కేంద్రమంత్రి పదవులు దక్కాయి. ఇక గుజరాత్ నుంచి ఐదుగురు, కర్ణాటక నుంచి ఐదుగురు, ఒడిశా నుంచి ముగ్గురు చోటు దక్కించుకున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్లకు నాలుగు చొప్పున మంత్రి పదవులు, జార్ఖండ్ ,బెంగాల్ నుంచి ఇద్దరికి చొప్పున మంత్రి పదవులు, కేరళ, తమిళనాడు, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్లకు ఒక్కో మంత్రి పదవి దక్కింది. -
మహాత్మునికి నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ మూడోసారి దేశానికి ప్రధాని కాబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఆయన ఈరోజు ఉదయాన్నే రాజ్ఘాట్కు వెళ్లారు. అక్కడ జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద పూలమాలలు ఉంచి, నివాళులర్పించారు.మోదీ ప్రమాణాస్వీకారోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పలు చోట్ల దీనికి సంబంధించిన పోస్టర్లు అతికించారు. ఈ కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే లను ఆహ్వానించారు. #WATCH | Delhi: PM-designate Narendra Modi arrives at Rajghat to pay tribute to Mahatma Gandhi, ahead of his swearing-in ceremony, to be held today at Rashtrapati Bhawan.He will take the Prime Minister's oath for the third consecutive term, today at 7:15 PM. pic.twitter.com/L7u5S0uvHo— ANI (@ANI) June 9, 2024 ఇదీ చదవండి: నేడు మోదీ మూడోసారి -
ఎన్డీఏ,‘ఇండియా’ టఫ్ ఫైట్ .. వేలు కోసుకున్న యువకుడు
రాయ్పూర్: ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గెలవడం, ఓడడం సాధారణమే. అయితే ఆయా పార్టీల కరుడుగట్టిన ఫ్యాన్స్కు మాత్రం గెలుపు ఓటములను అంత ఈజీగా తీసుకోరు. ఇలాంటి కోవకే చెందిన బీజేపీ అభిమాని ఒకరు ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్లో తన వేలును కోసి దుర్గామాతకు సమర్పించుకున్నాడు.బలరాంపూర్కు చెందిన దుర్గేష్పాండే బీజేపీ అభిమాని. జూన్4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో తొలి ట్రెండ్స్లో బీజేపీ, ఎన్డీఏ కూటమి ఆశించిన స్థాయిలో లీడ్లోకి రాలేదు. ఒక దశలో ఇండియా కూటమి ఎన్డీఏకు గట్టిపోటీ ఇచ్చింది. దీంతో నిరాశ చెందిన దుర్గేష్ పాండే ఫలితాలు చూడడం ఆపేసి దగ్గర్లోని ఖాళీ మాత గుడికి వెళ్లి మొక్కుకుని వచ్చాడు. చివర్లో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటడంతో ఆనందంతో గుడికి వెళ్లి తన వేలును కోసి ఖాళీ మాతకు సమర్పించుకున్నాడు. గాయం తీవ్రమవడంతో దుర్గేష్ కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. వేలు తెగిపోయి అప్పటికే ఆలస్యమవడంతో డాక్టర్లు దానిని తిరిగి అతికించలేకపోయారు. ప్రస్తుతం దుర్గేష్ ఆరోగ్యం స్థిరంగా ఉంది.ఫలితాల ఆరంభంలో కాంగ్రెస్కు లీడ్ రావడంతో తట్టుకోలేకపోయానని, అందుకే ఖాళీ మాతకు మొక్కుకుని, ఎన్డీఏ గెలిచాక మొక్కు తీర్చుకున్నానని దుర్గేష్ చెప్పాడు. ఎన్డీఏకు 400 సీట్లు వస్తే ఇంకా ఆనందపడేవాడినన్నాడు. -
మోదీ ప్రమాణస్వీకారోత్సవం.. ఢిల్లీలో హై అలర్ట్
న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూన్ 9న సాయంత్రం 7.15 గంటలకు ఆయనతో పాటు కేంద్ర మంత్రివర్గంలో మరికొందరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ స్వీకారోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అయిదు కంపెనీల పారామిలటరీ సిబ్బంది, ఎన్ఎస్జీ కమాండోలు, డ్రోన్లు,స్నిపర్లతో కట్టుదిట్టమైన భద్రత సిబ్బందినిమోహరించనున్నారు.రాష్ట్రపతి భవన్లో మోదీ ప్రమాణ స్వీకారం జరగనుంది. దీంతో ప్రాంగణం లోపల, వెలుపల మూడంచెల భద్రత ఉంటుంది. ఢిల్లీ పోలీసుల SWAT (ప్రత్యేక ఆయుధాలు, వ్యూహాలు), NSG నుంిచి కమాండోలు ఈవెంట్ రోజున రాష్ట్రపతి ఇంటి చుట్టూ, వివిధ వ్యూహాత్మక ప్రదేశాల చుట్టూ మోహరిస్తారు. ఐదు కంపెనీల పారామిలటరీ, ఢిల్లీ సాయుధ పోలీసు (డిఎపి) జవాన్లతో సహా దాదాపు 2500 మంది పోలీసు సిబ్బందిని రాష్ట్రపతి భవన్ చుట్టూ మోహరించనున్నారు. ఈ కర్యాక్రమానికి సార్క్(సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్)దేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో గత సంవత్సరం జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఏర్పాటు చేసిన భద్రతనే కల్పించనున్నారు. ప్రమాణస్వీకారానికి హాజరయ్యే ప్రముఖులకు వారి హోటళ్ల నుంచి వేదిక వద్దకు, తిరిగి వెళ్లేందుకు నిర్దేశిత మార్గాలను కూడా ఏర్పాటు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.ఇప్పటికే ఢిల్లీిలో నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించారు. జూన్ 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు ఆంక్షలు విధించారు. ఢిల్లీలో ఎలాంటి డ్రోన్, పారాగ్లైడింగ్, పారాజంపింగ్, రిమోట్ ఆపరేట్ చేసే ఏ రకమైన పరికరాలపైనా నిషేధం విధించారు. \ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే, దాని మిత్ర పక్షాలు 291 లోక్సభ స్థానాల్లో విజయం సాధించాయి. ఇందులో బీజేపీ 242 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా.. మిత్రపక్షాలతో కలిసి మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
కేంద్రంలో మోదీ 3.0కు రంగం సిద్ధం
-
పదేళ్ల పాలన ట్రెయిలరే...: నరేంద్ర మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏను స్వతంత్ర భారత చరిత్రలోనే అత్యంత బలీయమైన, విజయవంతమైన సంకీర్ణంగా నరేంద్ర మోదీ అభివరి్ణంచారు. ‘‘మా సంకీర్ణం మూడుసార్లు పూర్తికాలం అధికారంలో కొనసాగింది. నాలుగోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఎన్డీఏ కేవలం అధికారం కోసం పుట్టుకొచ్చిన కొన్ని పార్టీల కలయిక కాదు. జాతి హితమే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన కూటమి. మేమెన్నడూ ఓడిపోలేదు. నిన్నా మేమే గెలిచాం. నేడూ మేమే గెలిచాం. భవిష్యత్తులోనూ మేమే గెలుస్తాం. విజయాన్ని ఎలా జీర్ణించుకోవాలో మాకు బాగా తెలుసు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ ఘనవిజయం సాధించినా జూన్ 4 (లోక్సభ ఎన్నికల ఫలితాల) తర్వాత మేం వినమ్రంగా ప్రవర్తించిన తీరే అందుకు నిదర్శనం’’ అన్నారు. మరోవైపు విపక్షాలు కేవలం అధికార దాహంతోనే ఒక్కటయ్యాయంటూ ఇండియా కూటమిపై నిప్పులు చెరిగారు. కేవలం లోక్సభ ఎన్నికల కోసమే కలిశామని అవి స్వయంగా పేర్కొన్నాయని గుర్తు చేశారు. ‘‘ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్నే దెబ్బ తీసేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. ఎన్డీఏ ఎన్నికల విజయాన్ని కూడా ఓటమిగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశాయి. ఫలితాలు వాటికి అనుకూలంగా రాలేదనే అక్కసుతో దేశవ్యాప్తంగా కల్లోలం రేపేందుకు కుట్ర చేశాయి’’ అంటూ మండిపడ్డారు. శుక్రవారం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన కూటమి ఎంపీలను, అనంతరం భాగస్వామ్య పక్షాల అధినేతలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ అవసరం. దేశాన్ని నడిపేందుకు అన్ని విషయాల్లోనూ ఏకాభిప్రాయం మరింత అవసరం. పదేళ్లుగా పార్లమెంటులో నాణ్యమైన చర్చలను ఎంతగానో మిస్సయ్యా. విపక్ష నేతలు ఈసారైనా జాతి ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంటులో అడుగు పెడతారని, అర్థవంతమైన చర్చలు చేస్తారని ఆశాభావంతో ఉన్నా’’ అన్నారు. ‘‘మన మధ్య పరస్పర వ్యతిరేకత ఉండొచ్చు. కానీ జాతి పట్ల వ్యతిరేకత ఉండకూడదు’’ అని విపక్షాలకు సూచించారు. ఎన్డీఏకు కొత్త నిర్వచనం లోక్సభ ఎన్నికల విజయం పట్ల ఎన్డీఏ నేతలను మోదీ అభినందించారు. ఇందుకు కారకులైన లక్షలాది మంది కార్యకర్తలకు తాను అభివాదం చేసి తీరాలన్నారు. కేంద్రంలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి అంశంలోనూ భాగస్వామ్య పక్షాలన్నింటి ఏకాభిప్రాయంతో, జాతి హితమే లక్ష్యంగా సాగుతుందని స్పష్టం చేశారు. ‘‘ప్రజలు మాకు స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టారు. తద్వారా ప్రభుత్వాన్ని నడిపే సదవకాశమిచ్చారు. దీన్ని సది్వనియోగం చేసుకుంటామని, దేశాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి పథంలో నడుపుతామని మాటిస్తున్నా’’ అని చెప్పారు. ‘‘పదేళ్ల పాలనలో వృద్ధి పథంలో దేశాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లేందుకు ఎంతగానో కృషి చేశాం. అదంతా కేవలం ట్రయిలర్ మాత్రమే. ఈ టర్ములో దేశాభివృద్ధి కోసం మరింతగా పాటుపడతాం. మేం కార్య సాధకులమని ప్రజలకు తెలుసు’’ అన్నారు. ‘‘సుపరిపాలనే మా కూటమికి పునాది. ఎన్డీఏ అంటే సరికొత్త (న్యూ), అభివృద్ధి చెందిన (డెవలప్డ్) , ఆకాంక్షల (ఆస్పిరేషనల్) ఇండియా’’ అని కొత్త నిర్వచనమిచ్చారు.కాంగ్రెస్పై చెణుకులు కాంగ్రెస్ పార్టీపై ఈ సందర్భంగా మోదీ చెణుకులు విసిరారు. ఆ పార్టీకి గత మూడు లోక్సభ ఎన్నికల్లోనూ కలిపి కూడా బీజేపీకి తాజా ఎన్నికల్లో వచ్చినన్ని స్థానాలు రాలేదంటూ ఎద్దేవా చేశారు. ఈసారి ఆ పార్టీ కనీసం వంద సీట్లు కూడా నెగ్గలేకపోయిందన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అద్భుత ప్రదర్శన చేసిందంటూ కొనియాడారు. ‘‘దక్షిణాదిన ఎన్డీఏ జెండా ఎగిరింది. కేరళలో తొలిసారి ఖాతా తెరిచాం. ఏపీలో చరిత్రాత్మక విజయం సాధించాం. తమిళనాడులో కూడా ఎన్డీఏ గణనీయమైన ఓట్ల శాతం సాధించాం. కర్ణాటక, తెలంగాణల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అతి తక్కువ సమయంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీకి భారీగా సీట్లు కట్టబెట్టారు. ఇటు ఒడిశాలోనూ దుమ్ము రేపాం. అటు అరుణాచల్ప్రదేశ్లోనూ క్లీన్స్వీప్ చేశాం’’ అన్నారు. మంత్రి పదవులు ఇప్పిస్తామంటూ వచ్చేవారిని, ఫేక్ న్యూస్ను అస్సలు నమ్మొద్దని ఎన్డీఏ ఎంపీలకు మోదీ సూచించారు.ఈవీఎంలపై ఇప్పుడేమంటారు? విపక్షాలకు మోదీ చురకఇండియా కూటమి ప్రగతికి, ఆధునికతకు, టెక్నాలజీకి బద్ధ వ్యతిరేకి అని మోదీ ఆరోపించారు. విపక్షాలన్నీ గత శతాబ్దపు భావజాలంతో కొట్టుమిట్టాడుతున్నాయని, శరవేగంగా అగాథపు లోతుల్లోకి దిగజారుతున్నాయని దుయ్యబట్టారు. ఈవీఎంలపై చేసిన నిరాధార విమర్శలకు ఏం సమాధానమిస్తాయని ఎన్నికల్లో వాటి మెరుగైన ప్రదర్శనను ఉద్దేశించి ప్రశ్నించారు. ‘‘ఈవీఎంలపై, ఎన్నికల సంఘంపై అనుమానాలు రేకెత్తించేందుకు ఎన్నికల ప్రక్రియ పొడవునా విపక్షాలు శక్తివంచన లేకుండా కృషి చేశాయి. సుప్రీంకోర్టులో కేసుల ద్వారా ఈసీ పనితీరును అడ్డుకోజూశాయి. వాటి తీరు చూసి ఫలితాలొచ్చాక ఏకంగా ఈవీఎంల శవయాత్ర చేస్తాయేమో అనుకున్నా! తీరా ఫలితాలు చూశాక విపక్షాల నోళ్లన్నీ మూతబడ్డాయి! ఈవీఎంలు ఇంకా బతికే ఉన్నాయా, చనిపోయాయా అని ఫలితాలొస్తున్న క్రమంలో ఒకరిని నేనడిగాను’’ అంటూ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. దేశాన్ని అంతర్జాతీయంగా కూడా అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయతి్నంచినందుకు విపక్షాలను జాతి ఎన్నటికీ క్షమించబోదన్నారు. -
విలువల జాడేది?!
వేదికలపై గంభీరోపన్యాసాలు చేయడంలో, విలువల గురించి మాట్లాడటంలో మన నాయకులకు ఎవరూ సాటిరారు. ఆ ఉపన్యాసాలకూ, ఆచరణకూ పెద్దగా పొంతనవుండదు. శుక్రవారం జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రసంగాలు ఈ సంగతిని మరోసారి ధ్రువీకరించాయి. అన్ని నిర్ణయాలూ ఏకాభిప్రాయం ప్రాతిపదికనే తీసుకుంటామని మోదీ ప్రకటించారు. మంచిదే. గత అయిదేళ్ల పాలనలో ఏకాభిప్రాయం జాడ ఎక్కడా కనబడకపోగా చాలా నిర్ణయాలు విపక్షాన్ని సభనుంచి గెంటేశాక మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి. ఆ నిర్ణయాలపై తీవ్ర విమర్శలూ వచ్చాయి. ప్రతిఘటన కూడా ఎదురైంది. బహుశా అందువల్లే కావొచ్చు... 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా వచ్చిన మెజారిటీ ఈసారి మాయమైంది. మిత్రపక్షాలపై ఆధారపడక తప్పని స్థితి ఏర్పడింది. రామమందిర నిర్మాణం లక్ష్యంగా ఉద్యమాన్ని నడిపి, దానిమాటున మూడున్నర దశాబ్దాలుగా ఎదుగుతూ వచ్చిన బీజేపీ... తీరా ఆలయ నిర్మాణం కొనసాగుతున్న దశలో కనీస మెజారిటీకి దూరంకావటం, యూపీలో సగంపైగా సీట్లు కోల్పోవటం కేవలం యాదృచ్ఛికమని మోదీ చెప్పగలరా? చివరకు అయోధ్య ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గాన్ని సైతం బీజేపీ కోల్పోవలసి వచ్చిందని ఆయనకు గుర్తుందో లేదో! అయోధ్య ప్రాంతంలోని 9 స్థానాల్లో 5, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ప్రాంతంలోని 12 స్థానాల్లో తొమ్మిదింటిని ఈసారి బీజేపీ చేజార్చుకుంది. బీజేపీ హిందుత్వ ప్రాజెక్టుకు ఈ రెండు ప్రాంతాలూ ఆయువుపట్టు. అంతేకాదు... వివిధ రాష్ట్రాల్లో బీజేపీ 2019 ఎన్నికల్లో 50 శాతంపైగా వోట్లతో 224 స్థానాలు గెల్చుకోగా, ఇప్పుడు ఆ సంఖ్య 156కి పడిపోయింది. బీజేపీ 500 కంటే తక్కువ వోట్లతో గెలిచిన స్థానాలు 30... వేయి కంటే తక్కువ వోట్లతో గెలిచిన స్థానాలు 100 ఉన్నాయి. ఇండియా కూటమి, మరీ ముఖ్యంగా అందులోని సమాజ్వాదీ పార్టీ దాదాపు అన్నిచోట్లా గణనీయంగా కోలుకుంది. తమ గెలుపును ఓటమిగా చిత్రిస్తున్న కాంగ్రెస్ను విమర్శిస్తూ ఇప్పుడూ, గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకొచ్చిన మొత్తం సీట్ల సంఖ్యతో పోల్చినా ఈసారి తమకొచ్చిన స్థానాలు చాలా ఎక్కువని ఎద్దేవా చేయటం బాగానేవుంది. అయితే జరిగిందేమిటో లోతుగా విశ్లేషిస్తే సత్యం బోధపడుతుంది. మోదీ పైకేమి మాట్లాడినా నిరుపేదలూ, మధ్యతరగతి తమకు క్రమేపీ దూరం జరుగుతున్నారని బీజేపీకి అర్థమయ్యే ఉంటుంది. అందుకే ఈసారి ఆ రెండు వర్గాలకూ కొత్తగా సంక్షేమ పథకాలు తీసుకురాబోతున్నట్టు తెలిపారు. పార్లమెంటులో ఏ అంశంపైన అయినా చర్చ జరిగినప్పుడు ఉపన్యాస పోటీలుగా భావించి మాట్లాడటంకాక ఆరోగ్యకరమైన చర్చలకు చోటీయడం ఎంతో అవసరం. ఎన్డీఏ సహజసిద్ధమైన కూటమని, ఇందులో అధికార యావలేదని మోదీ చెప్పటం కూడా వింతగానే ఉంది. ఇప్పుడు ఎన్డీఏకు మద్దతుగా నిలిచిన నితీశ్, చంద్రబాబులిద్దరూ ఊగిసలాటకు పెట్టింది పేరు. నిలకడ తక్కువ, అవకాశవాద రాజకీయం ఎక్కువ. ఏ గట్టున బాగుంటుందనుకుంటే అటు దూకే బాపతు. 2014 ఎన్నికల్లో ఏపీలో బీజేపీతో కలిసి ప్రయాణించిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో హఠాత్తుగా కాడి పారేసి విడిగా ఎందుకు పోటీ చేశారో, అంతకు సంవత్సరం ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో ఎందుకు అంటకాగారో ఎవరైనా చెప్పగలరా? తరచు యూటర్న్లు తీసుకోవటంలో నితీశ్, చంద్రబాబులకు పోటీ పెడితే ఎవరు ప్రథమ స్థానం గెల్చుకుంటారో చెప్పటం కొంత కష్టమే. ఇలాంటివారిని పక్కనబెట్టుకుని ‘ఇది సహజసిద్ధమైన కూటమి, సుపరిపాలన కోసం కలిశాం’ అంటూ పెద్ద పెద్ద మాటలు వల్లిస్తే నమ్మడానికి దేశ ప్రజలు తెలివితక్కువవారు కాదు. మోదీని చంద్రబాబు పొగడ్తలతో ముంచడంమాట అలావుంచి 2014లోనే ‘మీరు పదిహేనేళ్లు అధికారంలో వుంటారని బాబు జోస్యం చెప్పార’ని జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ అనటం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి 2019లో వీరిద్దరూ ఎన్డీఏ నుంచి ఎందుకు బయటకొచ్చినట్టు... ఇప్పుడెందుకు కలిసినట్టు? ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అసత్య కథనాలు ప్రచారంలో పెట్టి, చివరకు కేంద్రమే ప్రతిపాదించిన భూ యాజమాన్య హక్కు చట్టంపై ప్రజానీకాన్ని పక్కదోవ పట్టించి బాబు లాభపడ్డారు. విలువలన్నిటినీ గాలికొదిలి ఏం చేసైనా అధికారంలోకి వచ్చితీరాలన్న పట్టుదలతో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అత్యంత హీనంగా దుర్భాషలాడారు. కేంద్రంలో నరేంద్ర మోదీ తదితరులు ఏం మాట్లాడినా మౌనంగా ఉండిపోవటమో, ఆలస్యంగా స్పందించటమో చేసిన కేంద్ర ఎన్నికల సంఘం పెద్దలను అనుకరిస్తూ ఏపీలో ఏం జరిగినా, బాబు తదితరులు అవాకులూ చవాకులూ మాట్లాడినా ప్రధాన ఎన్నికల అధికారి ఉలుకూ పలుకూ లేకుండా నిమిత్తమాత్రుడిగా మిగిలిపోయారు. ఆఖరికి పోలైన వోట్లకన్నా గెలిచిన అభ్యర్థికి అధికంగా వోట్లు వచ్చిన ఉదంతాలు అక్కడక్కడ బయటపడ్డాయి. ఇలాంటి అక్రమాలతో గట్టెక్కాలనే కాళ్లావేళ్లాపడి మరీ బాబు ఎన్డీఏలోకి లంఘించారు.వేదికలెక్కి విలువల గురించి గంభీరోపన్యాసాలు చేసేముందు మొన్న ఎన్నికల్లో తమ ప్రవర్తన ఎలావుందో, ఏం మాట్లాడామో చూసుకోవటం వారికే మంచిది. పిల్లి కళ్లు మూసుకుని పాలుతాగిన చందాన వేదికలెక్కి విన్యాసాలు చేస్తే జనం నవ్విపోతారని నరేంద్ర మోదీతోపాటు ఎన్డీఏ భాగస్వామ్యపక్ష నేతలు తెలుసుకోవాలి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కానీ ఉన్నన్నాళ్లూ ఏం చేశారో, ఎలా మెలిగారో ప్రజలు గమనిస్తూనే ఉంటారు. -
‘మోదీ మూడో టర్ము’.. భూపేష్ బగేల్ సంచలన వ్యాఖ్యలు
రాయ్పూర్: కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంపై ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బగేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయ్పూర్లో శుక్రవారం(జూన్7) జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో బగేల్ మాట్లాడారు. ‘లోక్సభకు మధ్యంతర ఎన్నికలు రావొచ్చని, కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బగేల్ పిలుపునిచ్చారు. ‘పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండండి. ఆరు నెలలు లేదా ఏడాదిలో మధ్యంతర ఎన్నికలు రావొచ్చు. యోగి ఆదిత్యనాథ్ కుర్చీ కదులుతోంది. రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ కుర్చీ ఊగుతోంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవిస్ ఇప్పటికే రాజీనామా చేస్తానంటున్నారు’అని బగేల్ ఎద్దేవా చేశారు. -
అద్వానీ ఆశీర్వాదం తీసుకున్న మోదీ
ఢిల్లీ: బీజేపీ అగ్రనేత నరేంద్రమోదీ ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్.కే అద్వానీని కలిశారు. ఎన్డీయే నేతగా ఎన్నికైన నేపథ్యంలో నరేంద్ర మోదీ స్వయంగా అద్వానీ నివాసానికి వెళ్లి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. అద్వానీ ఇంటి నుంచి బీజేపీ మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇక.. ఇద్దరు సీనియర్ నేతలను తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు మోదీ.#WATCH | PM Narendra Modi meets Bharat Ratna and veteran BJP leader LK Advani at the latter's residence in Delhi. pic.twitter.com/fZtIlOj5yw— ANI (@ANI) June 7, 2024 #WATCH | PM Narendra Modi meets veteran BJP leader Murli Manohar Joshi at the latter's residence, in Delhi pic.twitter.com/7yuTbEZB54— ANI (@ANI) June 7, 2024 నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. వీరు ఇరువురు కాసేపు ముచ్చటించారు.#WATCH | PM Narendra Modi meets former President Ram Nath Kovind, in DelhiPM Modi was chosen as the leader of the NDA Parliamentary Party today. pic.twitter.com/8GI6p5lwUX— ANI (@ANI) June 7, 2024 మరోవైపు.. నరేంద్ర మోదీని ఎన్డియే పక్ష నేతగా శుక్రవారం ఏకగ్రీవంగా కూటమి ఎంపీలంతా కలిసి ఎన్నుకున్నారు. ఇక.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని రాష్ట్రపతిని సాయంత్రం 7గంటలకు కలిసి.. ఎంపీల జాబితాను ఎన్డియే కూటమి ఇవ్వనుంది. నరేంద్రమోదీ మూడోసారి ప్రధానిగా ఎల్లుండి సాంయత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన మోదీ
న్యూఢిల్లీ: ఎన్డీఎపక్ష నేతగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. పార్లమెంట్లో సెంట్రల్హాల్లో శుక్రవారం(జూన్7) సమావేశమైన ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు, ఎంపీలు మోదీని తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో తొలుత మోదీ పేరును రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించగా చంద్రబాబు, నితిశ్ కుమార్ సహా ఎన్డీఏ ఎంపీలంతా లేచి నిలబడి రాజ్నాథ్ ప్రతిపాదనను బలపరిచారు. ఈ సందర్భంగా మోదీ సహా ఎన్డీఏ ముఖ్య నేతలు మాట్లాడారు.దక్షిణాది ఆదరించింది: మోదీ ఇంత భయంకర ఎండల్లో ఎన్డీఏ పార్టీల కార్యకర్తలు కష్టపడి శ్రమించారువారందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాఎన్డీఏ పార్లమెంటరీ కమిటీ నేతగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు మీకెంతా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఇవి నాకు భావోద్వేగ క్షణాలు మీరు మళ్లీ నాకు నాయకత్వం ఇచ్చారంటే మన మధ్య బంధం బలంగా ఉందని అర్థందేశంలో 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలో ఉంది. భారత దేశ కూటముల చరిత్రలో ఏ ప్రీ పోల్ కూటమి ఎన్డీఏలా విజయవంతమవడవం ఇప్పటివరకు చూడలేదుఈసారి ఎన్డీఏ కూటమిని దక్షిణాది అక్కున చేర్చుకుంది. ప్రభుత్వం నడపడానికి మెజారిటీ అవసరం. కానీ దేశాన్ని నడపడానికి అందరి సహకారం అవసరం. ఎన్డీఏకు దేశమే ముఖ్యంఎన్డీఏ ఒక ఆర్గానిక్ కూటమిఈవీఎంలు బతికున్నాయా...చచ్చాయా..ఈవీఎంలు బతికున్నాయా మరణించాయాప్రతిపక్షాలు మాట్లాడితే ఈవీంఎలు, ఈసీని తిట్టాయిఎన్నికల ఫలితాల తర్వాత ప్రతిపక్షాలు సైలెంట్ అయ్యాయిఇదే ప్రజాస్వామ్యం గొప్పతనంమోదీ ప్రచారం వల్లే కూటమి విజయం.. చంద్రబాబు నాయుడులోక్సభ ఎన్నికల్లో మోదీ ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా ఎన్నికల్లో ప్రచారం చేశారుమోదీ ప్రచారం వల్ల కూటమి విజయం సాధించిందిఏపీ ఎన్నికల్లో అమిత్ షా సభ టర్నింగ్ పాయింట్ అయింది బీజేపీ అగ్ర నేతల ప్రచారం మాలో విశ్వాసాన్ని నింపిందిమోడీ వల్ల ప్రపంచంలో భారత్ ఖ్యాతి పెరిగిందిమోడీ నాయకత్వంలో భారత్ నెంబర్ వన్గా మారుతుందిప్రాంతీయ మనోభావాలు, జాతీయ లక్ష్యాలను బ్యాలెన్స్ చేయాలిఏపీలో కూటమి ఉమ్మడిగా పనిచేసి అద్భుత ఫలితాలు సాధించాం పవన్ కళ్యాణ్, జనసేన చీఫ్ మోదీ అందరిలో ప్రేరణ నింపారుమోదీ 15 ఏళ్ల పాటు ప్రధానిగా ఉంటారన్న చంద్రబాబు మాట నిజమైందిమోదీ వల్లే ఏపీలో 91 శాతం ఫలితాలు సాధించాం -
మోదీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ కమిటీ సమావేశం
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ కమిటీ సమావేశం ఆరంభమైంది. ఎన్డీఏ కూటమి పార్టీల ఎంపీలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈ సమావేశం జరుగుతోంది. ఎన్డీఏ కూటమి నేతగా మోదీని ఇప్పటికే ఎన్నుకున్న విషయం తెలిసిందే.కాగా ఈ భేటీలో మోదీని ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి ఎన్డీయే పక్షాల నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నితిశ్ కుమార్, ఏక్ నాథ్ షిండేలతో పాటు, .బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు,బీజేపీ పార్టీల అధ్యక్షులు, ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు.క్యాబినెట్ కూర్పుపై కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చింనున్నారు. మిత్రపక్షాల నుంచి కీలకశాఖలు కావాలనే డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో గురువారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో అమిత్ షా, రాజ్నాథ్సింగ్, ఇతర సీనియర్ నేతలు సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే.ప్రాథమికంగా జరిగిన చర్చల్లో కీలకమైన రక్షణ, ఆర్థిక, హోం, విదేశీ వ్యవహారాల శాఖలను తమ వద్దే అట్టిపెట్టుకోవాలని బీజేపీ నేతల నిర్ణయించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. బీజేపీకి సొంతంగా 240 సీట్లు (ఎన్డీఏకు 293) మాత్రమే వచ్చినందువల్ల ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ (16 సీట్లు), జేడీయూ (12 సీట్లూ)లపై పూర్తిగా ఆధారాపడాల్సిన పరిస్థితి నెలకొంది.ఈ పార్టీలు నలుగురు ఎంపీలకు ఒక కేబినెట్ మంత్రి పదవిని అడుగుతున్నట్లు సమాచారం. ఈ లెక్కన టీడీపీకి నాలుగు, జేడీయూకు మూడు కేబినెట్ బెర్తులు ఇవ్వాల్సి ఉంటుంది. -
ఎన్డీఏ కూటమి కీలక సమావేశం..
-
ప్రధానమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ... నేడు ఎన్డీఏ ఎంపీల సమావేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
పెద్ద శాఖలు ఇవ్వలేం!
న్యూఢిల్లీ: ఎన్డీఏ నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్న తర్వాత మంత్రివర్గ కూర్పుపై బీజేపీ దృష్టిసారించింది. మిత్రపక్షాల నుంచి కీలకశాఖలు కావాలనే డిమాండ్లు వచి్చన నేపథ్యంలో గురువారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో అమిత్ షా, రాజ్నాథ్సింగ్, ఇతర సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ప్రాథమికంగా జరిగిన చర్చల్లో కీలకమైన రక్షణ, ఆర్థిక, హోం, విదేశీ వ్యవహారాల శాఖలను తమ వద్దే అట్టిపెట్టుకోవాలని బీజేపీ నేతల నిర్ణయించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. బీజేపీకి సొంతంగా 240 సీట్లు (ఎన్డీఏకు 293) మాత్రమే వచి్చనందువల్ల ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ (16 సీట్లు), జేడీయూ (12 సీట్లూ)లపై పూర్తిగా ఆధారాపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పారీ్టలు నలుగురు ఎంపీలకు ఒక కేబినెట్ మంత్రి పదవిని అడుగుతున్నట్లు సమాచారం. ఈ లెక్కన టీడీపీకి నాలుగు, జేడీయూకు మూడు కేబినెట్ బెర్తులు ఇవ్వాల్సి ఉంటుంది. టీడీపీ స్పీకర్ పదవిని కూడా అడుగుతోంది. ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను కూడా కోరుతోంది. ఏడుగురు ఏంపీలున్న శివసేన (షిండే), ఐదుగురు ఎంపీలున్న ఎల్జేపీ (ఆర్వీ) కూడా రెండేసి మంత్రిపదవులు అడుగుతున్నాయి. గత రెండు ప్రభుత్వాల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ మార్కును దాటినందువల్ల మిత్రపక్షాలకు ముఖ్యమైన శాఖలు దక్కలేదు. ఎంపీల సంఖ్య ఆధారంగా మంత్రిపదవులు కేటాయించాల్సిన పరిస్థితిని ప్రస్తుతం బీజేపీ ఎదుర్కొంటోంది. కాబట్టి ఈసారి మిత్రపక్షాలకు మరింత ఎక్కువగా మంత్రిపదవులు దక్కనున్నాయి. మిత్రపక్షాల నుంచి ఎంత ఒత్తిళ్లు వచి్చనా అత్యంత కీలకమైన శాఖలపై బీజేపీ రాజీపడకపోవచ్చని సమాచారం. రక్షణ, ఆర్థిక, హోంశాఖ, విదేశీ వ్యవహారాలతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధితో ముడిపడిన శాఖలను కూడా తమ వద్దే ఉంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. అలాగే సంక్షేమం, యువజన వ్యవహారాలు, వ్యవసాయం తదితర శాఖలను అంత సులువుగా వదులుకునేలా లేదు. పేదలు, మహిళలు, యువకులు, రైతుల ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని ఈ శాఖలను తామే ఉంచుకోవాలని బీజేపీ ఆశిస్తోంది. రైల్వేలు, రహదారుల విషయంలోనూ గడిచిన పదేళ్లలో తాము భారీ సంస్కరణలు తెచ్చామని.. ఈ వేగం మందగించకూడదంటే ఈ శాఖలు తమ వద్దే ఉండాలని పేర్కొంటోంది. సంకీర్ణ ప్రభుత్వాల్లో రైల్వే శాఖ సాధారణంగా మిత్రపక్షాల చేతుల్లో ఉంటూ వచి్చంది. కానీ బీజేపీ గట్టి ప్రయత్నంలో రైల్వే శాఖను తమ ఆ«దీనంలోకి తెచ్చుకుంది. జేడీయూకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. పౌర విమానయాన శాఖ, ఉక్కు శాఖ టీడీపీకి ఇవ్వజూపుతున్నట్లు సమాచారం. భారీ పరిశ్రమల శాఖను ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు ఆఫర్ చేస్తోంది. అయితే ఆర్థిక, రక్షణ తదితర కీలకశాఖల్లో మిత్రపక్షాలకు సహాయమంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా ఉందని చర్చలకు సంబంధించిన విషయాలపై సమాచారం ఉన్న విశ్వసనీయవర్గాలు తెలిపాయి. పర్యాటక, ఎంఎస్ఎంఈ, నైపుణ్యాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, సామాజిక న్యాయ శాఖలను మిత్రపక్షాలకు ఇచ్చే అవకాశముందని సమాచారం. చంద్రబాబు నాయుడు లోక్సభ స్పీకర్ పదవిపై పట్టుబడితే డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వజూపి ఆయన్ను ఒప్పించే ప్రయత్నం చేయవచ్చునంటున్నారు. బీజేపీ సంఖ్యాబలం లేనందున టీడీపీ, జేడీయూలు తమ డిమాండ్లపై పట్టుబడితే.. బీజేపీ ఎంతవరకు తలొగ్గుతుంది, ఎలా బుజ్జగిస్తుందనేది చూడాలి. -
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు గెలుస్తాం: కిషన్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రానున్నరోజుల్లో రాష్ట్రంలో బలమైన రాజకీయశక్తిగా ఎదుగుతామని, అధికారంలోకి వచ్చేందుకు సమష్టిగా కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని, ప్రజలు ప్రత్యామ్నాయశక్తిగా బీజేపీని చూస్తున్నారని తెలిపారు. గురువారం ఢిల్లీలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆరునెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం, బీఆర్ఎస్ ఉనికి కోల్పోయాయని దుయ్యబట్టారు. ప్రజల గుండెచప్పుడై సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి చూస్తే.. ఇప్పటి వరకు బీజేపీ తొలిసారి గణనీయమైన స్థానాలు సాధించిందని తెలిపారు. కాంగ్రెస్ తొండిఆట ఆడింది బీజేపీ మూడోసారి గెలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తారని, రిజర్వేషన్లు తొలగిస్తారని అసత్య ప్రచారం చేసి ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ తొండిఆట ఆడిందని కిషన్రెడ్డి అన్నారు. అమిత్షా వీడియోను మార్ఫింగ్ చేసి దిగజారుడు రాజకీయాలు చేసిందని మండిపడ్డారు. ఇంత చేసినా ప్రజలు బీజేపీ వైపే మొగ్గుచూపారని చెప్పారు. ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే అని అన్నారు. ఆ పార్టీ మోసాలను ఎండగతామని, ఈ దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళతామని తెలిపారు. బెదిరించినా, భయపెట్టినా విజయం సాధించాం లోక్సభ ఎన్నికల్లో సీఎం రేవంత్రెడ్డి బెదింరిపులకు పాల్పడినా, భయపెట్టినా ఆయన సొంత జిల్లాతోపాటు, మల్కాజిగిరిలోనూ బీజేపీ విజయం సాధించిందని కిషన్రెడ్డి తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా, బీఆర్ఎస్కు కంచుకోటలాంటి మెదక్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసినా బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు విజయం సాధించారని చెప్పారు. తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి ఆధిక్యం ప్రదర్శించిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం 39 కాగా.. ఇప్పుడు 40 శాతానికి పెరిగిందని చెప్పారు. ఈ ఎన్నికలు ఆరు నెలల పాలనకు రెఫరెండంగా ప్రకటించుకున్న కాంగ్రెస్ పార్టీ ఒక్క శాతం ఓట్లు మాత్రమే అదనంగా సాధించిందని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో 8 చోట్ల గెలిచి 6 చోట్ల రెండో బలమైన ప్రత్యామ్నాయంగా నిలిచామని చెప్పారు. సికింద్రాబాద్లో కాంగ్రెస్ గుర్తుపై మజ్లిస్ పోటీ చేసినట్టు ఉందని, నాంపల్లి నియోజకవర్గాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని కిషన్రెడ్డి ఆరోపించారు. రామమందిరం రాజకీయఅంశం కాదు దేశంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ఆధారంగానే బీజేపీ ఎన్నికలకు వెళ్లిందని, రామమందిరం రాజకీయ అంశం కాదని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తానని తెలిపారు. భిన్న సంస్కృతులు, భిన్న భాషలకు నిలయమైన దేశంలో హ్యాట్రిక్ విజయం సాధించి మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం చాలా గొప్ప విషయం అన్నారు. ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న మోదీకి కిషన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, పురందేశ్వరిలకు శుభాకాంక్షలు తెలిపారు. -
9న మోదీ ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఏన్డీఏ పక్ష నేతలు సమావేశమై మోదీని తమ నేతగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. కొత్తగా ఎంపికైన 293 మంది ఎన్డీఏ లోక్సభ సభ్యులు శుక్రవారం ఢిల్లీలో సమావేశం కానున్నారు. మోదీని తమ నేతగా ఎన్నుకోనున్నారు. ఈ భేటీ అనంతరం మోదీ తనకు మద్దతు తెలుపుతున్న ఎంపీల జాబితాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయనున్నారు. మోదీతో పాటు కూటమి సీనియర్ నేతలు చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ కూడా రాష్ట్రపతిని కలుస్తారని కూటమి వర్గాలు వెల్లడించాయి. ఎన్డీఏలోని పార్టీల అధ్యక్షులు కూడా మోదీకి మద్దతుగా రాష్ట్రపతికి లేఖలు సమర్పించనున్నారు. ప్రమాణ స్వీకారానికి దేశాధినేతలుబంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, భుటాన్, నేపాల్, మారిషస్, సీషెల్స్ దేశాధినేతలు ఆదివారం మోదీ ప్రమాణస్వీకారానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, నేపాల్ ప్రధాని ప్రచండ, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు, భూటాన్ ప్రధాని తెర్సింగ్ టోబ్గే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్, సీషెల్స్ అధ్యక్షుడు వావెల్ రామ్కలవాన్లకు భారత్ ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. మాల్దీవులతో భారత్ సంబంధాలు బెడిసికొట్టిన నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు మొయిజ్జును మోదీ ఆహ్వానించడం విశేషం. -
కాంగ్రెస్కు ఊపు... మోదీకి మేలుకొలుపు
భారత్ను ‘కాంగ్రెస్ ముక్త్’ చేస్తానన్న మోదీ తన విధానాల ద్వారా అదే కాంగ్రెస్ పునరుద్ధరణకు తన వంతు కృషి చేశారు. ఫలితంగా బీజేపీ మెజారిటీ తగ్గింది. కేంద్రంలో సంకీర్ణం అనివార్యమైంది. ఎన్డీయే ప్రభుత్వ సుస్థిరతకు బలహీనపడిన మోదీ ఏం చేస్తారు? సంకీర్ణాల కంటే ఒకే పార్టీ మెజారిటీ ప్రభుత్వాలే మంచివనే అభిప్రాయం ఉంది. వాస్తవాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి, పేదరికం తగ్గింపు, ఉపాధి పెరుగుదల వంటి అంశాల పరంగా దేశానికి అత్యుత్తమ కాలం 1991 నుండి 2014 వరకు గల పావు శతాబ్దం. పీవీ నరసింహరావు, వాజ్పేయి, మన్మోహన్సింగ్ లాంటి పెద్దమనుషులు అప్పటి సంకీర్ణ ప్రభుత్వాలకు నాయకత్వం వహించారు. మోదీ వారిలా వ్యవహరించగలరా?అమెరికా పౌరహక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్కు ఒక కల ఉండేది. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్కు ఒక కల ఉంది. ఈ ఏడాది లోక్సభ ఎన్నికల ప్రచారానికి వెళుతున్నప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఒక కల ఉండింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయని ఆయన ఊహించారు. ఈ వారం ఆ కల చెదిరిపోయింది. 2014లో బీజేపీని పునరుద్ధరించడం మోదీ చేసిన ప్రధాన రాజకీయ తోడ్పాటు. కాగా, 2024లో ఆయన చేసిన అతిపెద్ద రాజకీయ దోహదం భారత జాతీయ కాంగ్రెస్ పునరుద్ధరణ.నిజానికి, రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’తో తన సొంత గుర్తింపులోకి వచ్చారు. మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీకి పరిణతి చెందిన, వివేకవంతమైన నాయకత్వాన్ని అందించారు. అయితే మోదీ తన రెండవ పాలనా కాలంలో చేపట్టిన విధానాలు, విభజన రాజకీయాలు, అథమ స్థాయి ఎన్నికల ప్రచార సరళి అనేవి టోకున కాంగ్రెస్ అదృష్టాన్ని పునరుద్ధరించడంలో తమ పాత్రను పోషించాయి. భారత్ను ‘కాంగ్రెస్ ముక్త్’గా మారుస్తానని మోదీ 2014 ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 2024 ఎన్నికల ముగింపులో, అదే కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణలో తన వంతు కృషి చేసినందుకు మోదీకి ఆ పార్టీ కృతజ్ఞతలు చెప్పాలి. ఒక దశాబ్ద కాలంగా వెనుకబడి పోయిన దశ నుండి యవ్వన, శక్తిమంతమైన కాంగ్రెస్ ఉద్భవించింది.మోదీ మూడోసారి ప్రధానిగా చరిత్ర సృష్టించబోతున్నారు. ప్రశ్న ఏమిటంటే, ఎన్డీయే ప్రభుత్వ సుస్థిరతకు బలహీనపడిన మోదీ ఏం చేస్తారు? మరీ ముఖ్యంగా, నారా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ వంటి మిత్రపక్షాలపై ఆధారపడబోతున్న ఎన్డీయే ప్రభుత్వ విధానం ఎలా ఉండబోతోంది? మరోసారి ప్రభుత్వ స్థాపన కోసం మోదీ తన ‘హామీలు’ ఇచ్చారు. అధికారం కోసం మోదీ పక్షాన ఉన్నప్పటికీ చంద్రబాబు గానీ, నితీష్గానీ బీజేపీ ఎజెండా వైపు సైద్ధాంతికంగా మొగ్గు చూపడం లేదు. మరి ఈ కలయిక పనిచేస్తుందా?2024 జూన్ చాలావరకు 2004 మే లాగా అనిపిస్తుంది. ప్రతి రాజకీయ విశ్లేషకుడు, ఎన్నికల నిపుణుడు నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ఎన్డీయే విజయం సాధిస్తుందని అంచనా వేశారు. కానీ ఫలితాలు రాగానే స్టాక్ మార్కెట్ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. కొన్ని గంటల్లోనే, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్(యూపీఏ) అనే కొత్త కూటమికి శంకుస్థాపన జరిగింది. లెఫ్ట్ ఫ్రంట్ బయటి మద్దతుతో మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అమిత్ షా... ప్రమోద్ మహాజన్ కావచ్చు గానీ మోదీ మాత్రం వాజ్పేయి కాదు. వాజ్పేయి వెనక్కి తగ్గారు. కానీ మోదీ, షా వెనక్కి తగ్గుతారా? మొత్తానికి ఎన్నికల ప్రచారం ‘మోదీ కి గ్యారంటీ’ గురించే. ఆయన హామీలను నిలబెట్టడానికి ఎన్డీయే ప్రభుత్వం సుముఖంగా ఉంటుందా?చంద్రబాబు, నితీష్లపై దేశం ఒక ముఖ్యమైన బాధ్యతను మోపింది. ఇద్దరూ చిత్తశుద్ధి లేదా దార్శనిక దృష్టి గల వ్యక్తులుగా నిరూపితం కాలేదు. ఇద్దరూ స్వప్రయోజనాలు, అధికారం కోసం తహతహలాడుతున్నారు. అయినప్పటికీ, సాధారణ వ్యక్తుల నుండి హీరోయిజాన్ని డిమాండ్ చేసే విచిత్రమైన మార్గం చరిత్రకు ఉంది. విధి, రాజకీయాలు పీవీ నరసింహారావుకు ఎలాంటి పాత్రను కేటాయించడం జరిగిందో గుర్తుంచుకోండి. రాజకీయ విరమణ అంచున, ఆధ్యాత్మిక మార్గం పట్టడానికి తన బ్యాగులను సర్దుకుంటూన్న పీవీ నరసింహారావును ప్రధానమంత్రిని చేయడమే కాకుండా, దేశ విధిని మార్చే నిర్ణయాలను తీసుకునే బాధ్యతను కూడా చేపట్టేలా చేశాయి. మోదీ, షాల ఆధిపత్యంలో, నియంత్రణలో ఉన్న ప్రభుత్వానికి జూనియర్ భాగస్వాములుగా ఉన్న నితీష్, చంద్రబాబు అలాంటి పాత్ర పోషించగలరా? కష్టమే మరి. ఎందుకంటే ప్రధానమంత్రి ఆదేశం మేరకు అన్ని సంస్థలు ప్రతిరోజూ వారిని అదుపులో ఉంచుతాయి. మోదీ తన జీవిత పర్యంతం కఠినమైన రాజకీయ బేరసారాలను సాగిస్తూ వచ్చారు. సుష్మా స్వరాజ్ను పక్కన పెట్టి, అరుణ్ జైట్లీని తన విశ్వాసంలోకి తీసుకుని, లాల్ కృష్ణ అద్వానీ నుంచి బీజేపీని ఆయన ఎలా లాక్కున్నారో గుర్తు చేసుకోండి. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే... చంద్రబాబు, నితీష్ అలాంటి బేరాలు చేసేంత గట్టిగా ఉండగలరా? సంకీర్ణ ప్రభుత్వాల కంటే ఒకే పార్టీ మెజారిటీ ప్రభుత్వాలే మంచివి అని ఒక సాధారణ అభిప్రాయం ఉంది. కానీ వాస్తవాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. అనేక విధాలుగా, స్వాతంత్య్రానంతర మొదటి దశాబ్దం తర్వాత... ఆర్థికాభివృద్ధి, పేదరికం తగ్గింపు, ఉపాధి పెరుగుదల, ప్రపంచ ప్రొఫైల్ మరియు దేశీయ సామాజిక స్థిరత్వం వంటి అంశాల పరంగా దేశానికి అత్యుత్తమ కాలం 1991 నుండి 2014 వరకు గల పావు శతాబ్దం. ముగ్గురు మేధావులు, అందరినీ కలుపుకొనిపోయే వివేకవంతులైన పెద్దమనుషులు భారతదేశ ప్రధానులు అయ్యారు. పీవీ నరసింహా రావు, అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్ అప్పటి సంకీర్ణ ప్రభుత్వాలకు నాయకత్వం వహించారు. పీవీ విషయంలో కాంగ్రెస్ పార్టీయే స్వయంగా ఒక సంకీర్ణంలా పనిచేసింది. వాజ్పేయి, మన్మోహన్ స్పష్టమైన సంకీర్ణాలకు నాయకత్వం వహించారు. ఖర్గే వంటి మరో ప్రసన్నమైన పెద్దమనిషి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే, అది సుస్థిరతతో పాటు వివేకవంతమైన విధానాలను అందించదని నమ్మడానికి ఎటువంటి కారణమూ లేదు.మోదీ వ్యక్తిత్వం, భావజాలం, ఆకాంక్షల దృష్ట్యా ఆయన మూడవసారి తన అధికార అన్వేషణలో అన్ని ప్రయత్నాలూ చేస్తారు. సంకీర్ణానికి ఆయన ఎలాంటి ప్రధానమంత్రి అవుతారో చూడాలి. తాను ఎలా ప్రవర్తిస్తారు, ఎలా పని చేస్తారు అనేది తన మిత్రపక్షాలు, తన సీనియర్ సహోద్యోగులు, బ్యూరోక్రసీ, జ్ఞానం, ధైర్యంపై ఆధారపడి ఉంటుంది. బ్యూరోక్రసీని వంగమని అడిగినప్పుడు తరచుగా అది పొర్లుదండాలు పెడుతుంది. మోదీ, షా పాలన భారత ప్రజాస్వామ్యంలోని ప్రతి వ్యవస్థనూ నిర్వీర్యం చేసింది. చంద్రబాబు, నితీష్ వారిని అదుపు చేయగలరా?కన్యాకుమారి నుంచి న్యూఢిల్లీకి వెళ్లే విమానంలో మోదీ మూడు కీలకాంశాలను పేర్కొంటూ ఒక వ్యాసం రాశారు. మొదటిది – ఇక మీదట ఇండియా... భారత్ మాత్రమే! అధికారికంగా ఈ మార్పు చేయాలంటే, దానికి రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. దీనిపై ఆయన ముందుకు సాగలేరు. రెండవది– ‘జీవితంలో ప్రతి అంశంలో’ దేశానికి సంస్కరణ అవసరమని సూచించడం ద్వారా మోదీ ‘సంస్కరణ’ అనే పదానికి కొత్త నిర్వచనాన్ని వివరించారు. తాజాగా బలహీనపడిన మోదీ అటువంటి సంస్కరణకు నాయకత్వం వహించగలనని భావిస్తున్నారా? మూడవది– దేశం ‘కొత్త కల’ కనవలసిన అవసరాన్ని ప్రస్తావిస్తూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను మోదీ అనుకరించారు. ఒక దశాబ్దం క్రితం ‘అమెరికన్ డ్రీమ్’లోంచి జిన్పింగ్ ‘చైనా డ్రీమ్’ను ఎక్కువ భాగం అరువు తెచ్చుకున్నారు. కాకపోతే అమెరికన్ స్వప్నం, చైనా స్వప్నం రెండూ ‘మంచి జీవితాన్ని గడపడం’ గురించినవి. దేశ ప్రజలు ‘వికసిత్ భారత్’ కావాలని కల కనాలని మోదీ అంటున్నారు.తదుపరి కేంద్ర ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహిస్తారనే దానితో సంబంధం లేకుండా భారతదేశం ‘వికసిత్’గా ఉంటుంది. కాబట్టి, లోక్సభలో 400కు పైగా స్థానాల మోదీ కల సాకారం కానప్పటికీ, అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే దేశ స్వప్నం మాత్రం కాలక్రమేణా సాకారం అవుతుంది. బీజేపీ, ఇంకా మోదీ విషయానికొస్తే, ఓటర్ల మేల్కొలుపు పిలుపుతో వారి కలలు చెదిరిపోయాయి.సంజయ్ బారు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)