-
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ శాతం 65.67గా ఎన్నికల కమిషన్ మంగళవారం(మే14) ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 32 లక్షల మంది ఓటర్లుండగా పోలింగ్లో 2 కోట్ల 20 లక్షల 24 వేల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక కోటి 11 లక్షల 91 వేల మంది ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కోటిమంది పోలింగ్కు దూరంగా ఉన్నా గతంతో పోల్చితే 3 శాతం పోలింగ్ పెరగడం గమనార్హం. అతి తక్కువగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 48.8 శాతం ఓటింగ్ జరిగింది. భువనగిరిలో అత్యధికంగా 76.78శాతం పోలింగ్ జరిగింది.నియోజకవర్గాల వారిగా పోలింగ్ ఇలా.. ఆదిలాబాద్- 74.03 పెద్దపల్లి 67.87 కరీంనగర్- 72.54 నిజామాబాద్- 71.92 జహీరాబాద్- 74.63 మెదక్- 75.09 మల్కాజ్గిరి- 50.78 సికింద్రాబాద్- 49.04 హైదరాబాద్- 48.48 చేవెళ్ల- 56.50 మహబూబ్నగర్- 72.43 నాగర్ కర్నూల్- 69.46 నల్గొండ- 74.02 భువనగిరి- 76.78 వరంగల్- 68.86 మహబూబాద్-71.85 ఖమ్మం - 76.09 -
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
వారణాసి: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి మంగళవారం(మే14) నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తుల వివరాలను ఎన్నికల కమిషన్కు అఫిడవిట్లో సమర్పించారు. తనకు సొంత ఇల్లు, కారు లేదని మోదీ అఫిడవిట్లో తెలిపారు. మొత్తం ఆస్తుల విలువ రూ.3.02 కోట్లని వెల్లడించారు. తన ఆస్తిలో రూ.2.86 కోట్లు స్టేట్ బ్యాంక్ ఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఫిక్స్డ్ డిపాజిట్లుగా ఉన్నాయని తెలిపారు. సేవింగ్స్ ఖాతాలో రూ.80,304, తన చేతిలో రూ. 52,920 నగదు ఉందని పేర్కొన్నారు. ఇవి కాకుండా రూ.2.68 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలున్నట్లు తెలిపారు.2018-19లో రూ.11.14 లక్షలుగా ఉన్నవార్షిక ఆదాయం 2022-23లో రూ.23.56లక్షలకు పెరిగినట్లు తెలిపారు. 1978లో ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, 1983లో గుజరాత్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసినట్లు అఫిడవిట్లో తెలిపారు. జూన్1న తుది దశలో భాగంగా వారణాసిలో పోలింగ్ జరగనుంది. -
నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్
ప్రముఖ సినీ నటి, బీజేపీ అభ్యర్థి 'కంగనా రనౌత్' మండి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకంటే ముందు మీడియాతో మాట్లాడుతూ.. మండి ప్రజలకు నాపైన ఉన్న ప్రేమే ఇంత దూరం తీసుకువచ్చిందని కంగనా పేరొన్నారు.మన దేశంలో మహిళలు ప్రతి రంగంలోనూ ముందుకు సాగుతున్నారు. అయితే మండి ప్రాంతంలో ఇప్పటికి కూడా భ్రూణహత్య ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం మండికి చెందిన మహిళలు విద్య, రాజకీయాల్లో మాత్రమే కాకుండా.. ఆర్మీలో ఉన్నారని కంగనా పేర్కొన్నారు.#WATCH | Himachal Pradesh: Ahead of filing nomination, BJP candidate from Mandi, Kangana Ranaut says "The people of Mandi and their love for me have brought me here. Women in our country are making a mark in every field but incidents of feticide in Mandi were high a few years… pic.twitter.com/MTi9WndTgH— ANI (@ANI) May 14, 2024తన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కంగనా రనౌత్ మాట్లాడుతూ.. ఈ రోజు నేను మండి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసాను. మండి నుంచి పోటీ చేసే అవకాశం నాకు లభించడం గర్వించదగ్గ విషయం. బాలీవుడ్లో విజయం సాధించి, రాజకీయ రంగంలో కూడా విజయం సాధిస్తానని ఆశిస్తున్నానని ధీమా వ్యక్తం చేశారు.#WATCH | Himachal Pradesh: After filing her nomination, BJP candidate from Mandi Lok Sabha constituency, Kangana Ranaut says "Today I have filed nomination from Mandi LS seat. It is a matter of pride for me to have the opportunity to contest from Mandi...I have been successful in… pic.twitter.com/qh1DnIMi0A— ANI (@ANI) May 14, 2024 -
ఇండియా కూటమికి 315.. బీజేపీకి 195: దీదీ
కోల్కతా: దేశంలో నాలుగు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా మూడు దశల్లో వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ జరగాల్సి ఉంది. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. ఇండియా కూటమి 315 సీట్లు గెలుస్తుందని, బీజేపీ గరిష్టంగా 195 సీట్లకు పరిమితం అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు.పశ్చిమ బెంగాల్ నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని బంగావ్ లోక్సభ నియోజకవర్గం ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఢిల్లీలో మోదీ ఉండరు.. కానీ దీదీ ఇక్కడి ప్రజలతోనే ఉంటుందని అన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు.ఇప్పటి వరకు పోలింగ్ బాగా జరిగింది. ఈసారి మోదీ అధికారంలోకి రావడం లేదు. అందుకే కేంద్రంలోని అధికార పార్టీ నేతలు భయపడుతున్నారు. మళ్లీ మోదీ పీఎం కాలేరని గ్రహించారు. 400 సీట్ల గురించి గొప్పగా చెప్పుకోవద్దు అని బెనర్జీ అన్నారు.బొంగావ్ నియోజకవర్గంలో ఆధిపత్యం చెలాయించే మాతువాస్ గురించి బెనర్జీ మాట్లాడుతూ.. "ప్రధానమంత్రికి మాతువాస్ పట్ల అంత ప్రేమ ఉంటే, వారికి పౌరసత్వం ఇవ్వాలి. కానీ సీఏఏ అమలు సరికాదని ఆమె అన్నారు. దీనిని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని కూడా పేర్కొన్నారు.#WATCH | North 24 Parganas, Bangaon: West Bengal CM Mamata Banerjee says, "... Didi will bring the INDIA alliance to power there (at the Centre), we will help from here (West Bengal). The INDIA alliance will win with all of us (parties). As per the calculations we have till… pic.twitter.com/ROccx2dhhD— ANI (@ANI) May 13, 2024 -
హేమంత్ సోరేన్కు కేజ్రీవాల్ తరహా ఊరట: సుప్రీంను కోరిన కపిల్సిబల్
న్యూఢిల్లీ: భూ కుంభకోణంలో అరెస్టయి జైలులో ఉన్న, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్సోరేన్కు త్వరలో ఊరట కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోరేన్ అరెస్టు అక్రమమంటూ దాఖలైన పిటిషన్పై సోమవారం(మే13) జస్టిస్ సంజీవ్ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. సోరేన్ దాఖలు చేసిన పిటిషన్పై మూడు రోజుల్లో స్పందించాలని ఈడీని సుప్రీంకోరింది. లోక్సభ ఎన్నికలు జరుగుతున్నందున పిటిషన్పై విచారణ వేగవంతం చేయాలని సోరేన్ న్యాయవాది చేసిన అభ్యర్థనకు సుప్రీం అంగీకరించింది. లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు కల్పించిన ఊరటనే హేమంత్ సోరేన్కు ఇవ్వాల్సిన అవసరం ఉందని సిబల్ సుప్రీంను కోరారు. అయితే ధర్మాసనం కేసును 20కి వాయిదా వేయబోతుంటే సిబల్ మళ్లీ జోక్యం చేసుకున్నారు. 20కి వాయిదా వేస్తే పిటిషన్ విత్డ్రా చేసుకుంటానని, తన క్లైంట్కు అన్యాయం జరుగుతుందని వాదించారు. దీంతో ధర్మాసనం పిటిషన్ విచారణను 17కు వాయిదా వేసింది. -
తెలంగాణలో పోలింగ్ శాతం పెరిగింది: సీఈవో వికాస్రాజ్
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ రాష్ట్రంలో జరుగుతున్న పోలింగ్పై మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం బాగానే ఉందని తెలిపారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం 50 దాటింది. ఇక హైదరాబాద్లో మాత్రం ఎప్పటిలానే ఈసారి కూడా తక్కువగానే 20 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుగుతుందని వికాస్ రాజ్ వెల్లడించారు.ఇక రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకే తెలంగాణలో 40 శాతానికి పైగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. దీంతో 2019తో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. -
ఈవీఎంల భద్రతపై సుప్రియా సూలే సంచలన ట్వీట్
ముంబై: లోక్సభ ఎన్నికల వేళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెసిన్(ఈవీఎం)ల భద్రతపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే సంచలన ఆరోపణలు చేశారు. తాను పోటీచేసిన బారామతి నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లో సీసీ కెమెరాలు సోమవారం ఉదయం 45 నిమిషాల పాటు నిలిచిపోయాయని తెలిపారు.దీనికి సంబంధించి ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్టు చేశారు. సీసీటీవీ కెమెరాలు ఆగిపోవడం పూర్తి అనుమానాస్పద ఘటన అని సూలే పేర్కొన్నారు.‘బారామతి ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ సీసీ కెమెరాలు సోమవారం ఉదయం పనిచేయలేదు. ఇది పూర్తి భద్రతా ఉల్లంఘనా చర్య. దీనిపై ఎన్నికల అధికారులను సంప్రదిస్తే వారి నుంచి సంతృప్త సమాధానాలేవీ రాలేదు.దీనికి తోడు సీసీకెమెరాలు రిపేర్ చేసే టెక్నీషియన్ కూడా ఆ ప్రాంతంలో అందుబాటులో లేడు’అని సూలే తెలిపారు. -
లోక్సభ ఎలక్షన్స్.. నామినేషన్ దాఖలు చేసిన మిసా భారతి
పాట్నా: భారతదేశంలో నాలుగో దశ లోక్సభ ఎన్నికలు తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఇంకా మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో పాటలీపుత్ర లోక్సభ నియోజకవర్గం నుంచి రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థి 'మిసా భారతి' సోమవారం లోక్సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు.'మిసా భారతి' లోక్సభ ఎన్నికలకు నామినేషన్ వేసిన సమయంలో.. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ బీహార్కు ప్రధాని మోదీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్నారు. కానీ ప్రజలకు చేసినేమీ లేదు. మోదీ దేశం కోసం ఏదైనా చేసి ఉంటే.. ఇప్పుడు రోడ్షో నిర్వహించాల్సిన అవసరం లేదని మిసా భారతి అన్నారు. మోదీ ఎలాంటి అభివృద్ధి పనులు చేశారో జాబితా చేసి చెప్పాలని ఆమె కోరారు.మిసా భారతి 2024 లోక్సభ ఎన్నికల్లో పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రామ్ కృపాల్ యాదవ్పై పోటీ చేయనున్నారు. ఇక్కడ జూన్ 1న ఓటింగ్ జరుగుతుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. మిసా భారతి 2014, 2019 ఎన్నికల్లో రామ్ కృపాల్ యాదవ్ చేతిలో పాటలీపుత్ర నియోజకవర్గంలో ఓటమి చవి చూసారు. 2014కు ముందు రామ్ కృపాల్ యాదవ్.. లాలూ యాదవ్కు అత్యంత సన్నిహితుడు. -
అందరూ ఓటు వేయండి.. ఓటర్లకు ప్రియాంక గాంధీ విజ్ఞప్తి
లక్నో: నాలుగో దశ లోక్సభ ఎన్నికలు ఇండియా కూటమికి అనుకూలంగా ఉంటాయని 'ప్రియాంక గాంధీ వాద్రా' సోమవారం విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు మొదటి మూడు దశలను చూశారు. ఈ దశలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు.దేశంలోని ప్రతి ఒక్క ఓటు రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు అంకితం. కాబట్టి ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. తమ కోసం అవిశ్రాంతంగా పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బయటకు వచ్చి ఓటు వేయాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ఈరోజు సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోని మొత్తం 175 స్థానాలకు మరియు ఒడిశా రాష్ట్ర శాసనసభలోని 28 స్థానాలకు కూడా లోక్సభ ఎన్నికలతో పాటు ఏకకాలంలో పోలింగ్ ప్రారంభమైంది.తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్లోని 25 స్థానాలకు, ఉత్తరప్రదేశ్లో 13, బీహార్లో 5, జార్ఖండ్లో 4, మధ్యప్రదేశ్లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, పశ్చిమ బెంగాల్లో 8 స్థానాలకు పోలింగ్ జరగనుంది. జమ్మూ కాశ్మీర్లో ఒక లోక్సభ స్థానానికి ఓటింగ్ జరుగుతుంది. -
కేజ్రీవాల్కు పిగ్గీ బ్యాంక్ - వీడియో వైరల్
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఓ చిన్న పాప తన పిగ్గీ బ్యాంకును అప్పగించింది. దీనికి సంబంధించిన వీడియో ఆప్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ.. దేశాన్ని నియంతృత్వం నుంచి విముక్తి చేసేందుకు ఓ అమ్మాయి తన మామ కేజ్రీవాల్కు తన పిగ్గీ బ్యాంకును ఇచ్చింది' అంటూ పోస్ట్ చేశారు.నేను 20 రోజుల తర్వాత మళ్లీ జైలుకు వెళ్లాలి. మీరు ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తే.. నేను జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ రోడ్షోలో మాట్లాడుతూ , రాబోయే ఎన్నికల్లో ఆప్ విజయం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఢిల్లీ - ఎన్సీఆర్ కోసం నేను పాఠశాలలు నిర్మించడమే నా తప్పు. నేను మీ కోసం పనిచేశాను కాబట్టి వారు నన్ను జైలుకు పంపారు. ఢిల్లీ ప్రజలకు మంచి జరగటం బీజేపీకి ఇష్టం లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు.నేను ప్రజలకు ఉచిత వైద్యం కోసం సౌకర్యాలు ఏర్పాటు చేసాను, కానీ నేను జైల్లో ఉన్నప్పుడు 15 రోజుల పాటు ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఆగిపోయాయని.. జైల్లో తాను అనుభవించిన పరిస్థితిని గురించి కూడా కేజ్రీవాల్ వెల్లడించారు. నేను మళ్ళీ జైలుకు వెళితే.. ఢిల్లీలో జరుగుతున్న అభివృద్ధి పనులను బీజేపీ ఆపేస్తుందని అన్నారు.ఎవరైనా బాగా పని చేస్తుంటే, మీరు అతనిని అలా చేయనివ్వండి, నేను 500 పాఠశాలలు నిర్మించాను. మీరు దేశానికి ప్రధాని.. కాబట్టి కనీసం 5000 పాఠశాలలు నిర్మించాలని మోదీని ప్రశ్నించారు. బీజేపీ 400 సీట్లు అడుగుతోంది. తమకు 400 సీట్లు ఎందుకు కావాలని అడిగితే ఎందుకు చెప్పడం లేదని ఆప్ చీప్ అన్నారు.పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో కలిసి, కేజ్రీవాల్ మోతీ నగర్లో ఆప్ న్యూ ఢిల్లీ లోక్సభ అభ్యర్థి సోమనాథ్ భారతికి మద్దతుగా రోడ్షో నిర్వహించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆరో దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని.ये प्यार ही तो कमाया है केजरीवाल ने ❤️एक बच्ची ने देश को तानाशाही से मुक्ति दिलाने के लिए अपने केजरीवाल Uncle को दिया अपना Piggy Bank 🙌👇 pic.twitter.com/Aa7sNEsOVx— AAP (@AamAadmiParty) May 13, 2024 -
పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని వర్ధమాన్ - దుర్గాపూర్ లోక్సభ నియోజకవర్గానికి నాలుగో దశ పోలింగ్ సోమవారం ప్రారంభం కాగానే, ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి దిలీప్ ఘోష్.. టీఎంసీ గూండాలు పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదని ఆరోపించారు.నిన్న రాత్రి ప్రిసైడింగ్ అధికారితో సహా పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదని, పరిస్థితి చక్కబడేలా.. ఓటింగ్ సజావుగా జరిగేలా చూడాలని దిలీప్ ఘోష్ అన్నారు. ప్రతి బూత్ దగ్గర పోలీస్ బలగాలు ఉన్నప్పటికీ టీఎంసీ నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అన్నారు.వర్ధమాన్-దుర్గాపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్కు చెందిన కీర్తి ఆజాద్, సీపీఐ(ఎం)కి చెందిన సుకృతి ఘోషల్ పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.2014 లోక్సభ ఎన్నికలలో, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 34 స్థానాల్లో గెలిచింది. అయితే అప్పుడు బీజేపీ కేవలం 2 సీట్లను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. సీపీఐ(ఎం) 2, కాంగ్రెస్ 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ సారి బీజేపీ మరిన్ని స్థానాల్లో గెలుపొందటానికి ప్రయత్నిస్తోంది. -
బీహార్ లోక్సభ ఎలక్షన్.. మోదీ కీలక వ్యాఖ్యలు
పాట్నా: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో రోడ్షో నిర్వహించిన ప్రధాని 'నరేంద్ర మోదీ' కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 లోక్సభ ఎన్నికల కంటే ఈ సారి మరింత గొప్ప విజయాన్ని సాధిస్తామని, ఓడిపోయిన ఏకైక నియోజకవర్గాన్ని కూడా గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.బీహార్ రాష్ట్రంలో గెలుపు ఎన్డీఏ సొంతమని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంతో, ప్రజలతో బలమైన సంబంధాలున్నాయని అన్నారు. నేను తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాను, ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను సందర్శించాను. బీహార్ రాష్ట్రంలో ప్రత్యేకమైన అనుబంధం ఉందని మోదీ అన్నారు.దేశంలో దాదాపు ప్రతి రాష్ట్రానికి వెళ్ళాను.. బీజేపీ (ఎన్డీఏ) 400 సీట్లను గెలుపొందుతుందనే దృఢ విశ్వాసం నాకుందని అన్నారు. బీహార్ ఎన్డీఏకు మాత్రమే కాకుండా ఇండియా కూటమికి కూడా చాలా కీలకం. ఎందుకంటే రాష్ట్రం నుంచి 40 మంది ఎంపీలు పార్లమెంట్కు వెళ్తారు.బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ యునైటెడ్ చీఫ్ నితీష్ కుమార్ మళ్లీ పార్టీ మారడం.. తిరిగి ఎన్డీయేలోకి వెళ్లడంతో ఈ ఏడాది ప్రారంభంలో ప్రతిపక్ష కూటమి కుదేలైంది. 2019 ఎన్నికల్లో బీజేపీ, జనతాదళ్ యునైటెడ్ 17 స్థానాల్లో పోటీ చేయగా, అవిభక్త లోక్ జనశక్తి పార్టీ ఆరింటిలో పోటీ చేసింది. బీజేపీ, ఎల్జేపీ తమ కోటాలో అన్ని స్థానాల్లో విజయం సాధించగా, నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ఒక్క స్థానంలో ఓడిపోయింది. కిషన్గంజ్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ సారి ఈ నియోజక వర్గం కూడా ఎన్డీఏ కైవసం చేసుకుంటుందని మోదీ అన్నారు.ఈ ఏడాది బీహార్ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల ఏర్పాటులో.. బీజేపీ 17 స్థానాల్లో పోటీ చేయగా, జేడీయూ 16 స్థానాల నుంచి, చిరాగ్ పాశ్వాన్లోని లోక్ జనశక్తి పార్టీకి (రామ్ విలాస్) ఐదు సీట్లు, జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా, ఉపేంద్ర కుష్వాహ యొక్క రాష్ట్రీయ లోక్ మోర్చా ఒక్కో స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.బీహార్లో ఇండియా కూటమి విషయానికి వస్తే.. అత్యధికంగా ఆర్జేడీ 26 స్థానాల నుంచి, కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో, సీపీఐ(ఎంఎల్) 3, సీపీఐ, సీపీఎం ఒక్కొక్కటి చొప్పున పోటీ చేస్తున్నాయి. ఈ రోజు జరిగే ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడవుతాయి. -
అక్కడ ఒక్క సీటు కూడా ఓడిపోం: ప్రధాని మోదీ
పట్నా: బిహార్లో గత పార్లమెంట్ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని మోదీ ఓ జాతీయమీడియాతో మాట్లాడారు.‘‘బిహార్లో మా మిత్ర పక్షాలతో మాట్లాడాను. మేము గత 2019 లోక్సభ ఎన్నికల్లో బిహార్ ఒక్క సీటులో ఓడిపోయాం. ఈసారి ఓడిపోయిన ఆ ఒక్క సీటులోను విజయం సాధిస్తాం. బిహార్ రాష్ట్ర ప్రజలతో నాకు బలమైన అనుబంధం ఉంది. సంస్థాగత పనులపై బిహార్లో ప్రాంతాల్లో పర్యటించాను. బిహార్ ప్రాంతం, ఇక్కడి ప్రజలతో చాలా మంచి అనుబంధం ఉంది.దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీయే కూటిమి పార్టీలు అధిక సంఖ్యలో గెలిచి.. 400 స్థానాల లక్ష్యాన్ని చేరుకుంటాం. ఈ కొత్త సంకల్పంతో బిహార్ రంగులతో ఉంది. దానికి బలాన్ని చేకూరుస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న సానుకూల వాతావరణ బిహార్లో అద్దం పడుతోంది’’ అని ప్రధాని మోదీ అన్నారు.40 ఎంపీ సీట్లు ఉన్న బిహార్లో బీజేపీ కూటమి మొత్తం 39 సిట్లను గెలుచకుంది. ఒక్కసీటును కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి గెలుపొందింది. -
నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
దేశంలో నాలుగో దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని మొత్తం 175 స్థానాలకు, ఒడిశా శాసనసభలోని 28 స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతుంది. అన్ని లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.ఎన్నికలు జరుగుతున్న తరుణంలో.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తారని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఇందులో ''నాలుగో దశ లోక్ సభ ఎన్నికలలో పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 96 స్థానాలలో పోలింగ్ జరుగుతుంది.ఈ నియోజక వర్గాలలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారనీ ఓటింగ్ పెరుగుదలకు.. యువ ఓటర్లు మహిళలు దోహదం చేస్తారనీ నమ్ముతున్నాను.రండి ,మనందరం మన కర్తవ్యాన్ని నిర్వర్తించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం''.. అన్నారు.लोकसभा चुनाव के चौथे चरण में आज 10 राज्यों और केंद्र शासित प्रदेशों की 96 सीटों पर मतदान हो रहे हैं। मुझे विश्वास है कि इन सभी सीटों पर लोग भारी संख्या में मतदान करेंगे, जिसमें युवा और महिला वोटर बढ़-चढ़कर हिस्सा लेंगे। आइए, अपने कर्तव्य को निभाएं और लोकतंत्र को मजबूत करें!— Narendra Modi (@narendramodi) May 13, 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను ఉద్దేశించి.. ''ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు,ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు, రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయాలని కోరుతున్నాను. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నాను''... అంటూ మోదీ ట్వీట్ చేశారు.ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు,ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు, రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయాలని కోరుతున్నాను.ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నాను .— Narendra Modi (@narendramodi) May 13, 2024 -
నాలుగో దశ ఎలక్షన్స్.. ఆసక్తికర విషయాలు
2024 లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ మొదలైపోయింది. తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని మొత్తం 175 స్థానాలకు, ఒడిశా శాసనసభలోని 28 స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతుంది. అన్ని లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్లోని 25 స్థానాలకు, ఉత్తరప్రదేశ్లో 13, బీహార్లో 5, జార్ఖండ్లో 4, మధ్యప్రదేశ్లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, పశ్చిమ బెంగాల్లో 8 స్థానాలకు పోలింగ్ జరగనుంది. జమ్మూ కాశ్మీర్లో ఒక లోక్సభ స్థానానికి ఓటింగ్ జరుగుతుంది.నాలుగో దశ ఎలక్షన్స్ 2024 - ఆసక్తికర విషయాలులోక్సభ నాలుగవ దశ ఎన్నికలలో మొత్తం 1,717 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది. పోల్ ప్యానెల్ ప్రకారం, 96 పార్లమెంట్ నియోజకవర్గాలకు మొత్తం 4,264 నామినేషన్లు దాఖలయ్యాయి.తెలంగాణ (1,488) నుంచి అత్యధికంగా నామినేషన్ పత్రాలు అందాయని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో 25 నియోజకవర్గాల నుంచి 1,103 నామినేషన్లు వచ్చాయని ఎన్నికల సంఘం తెలిపింది.ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచినట్లు ఎన్నికల సంఘం ఆదివారం వెల్లడించింది.ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కాశ్మీర్లో ఇది మొదటి ప్రధాన ఎన్నికలు.బీజేపీ నేతృత్వంలోని NDA లోక్సభ ఎన్నికల నాలుగో దశలో పోలింగ్ జరగనున్న 96 స్థానాల్లో 40కి పైగా ఎంపీలు ఉన్నారు.కన్నౌజ్ నుంచి పోటీ చేస్తున్న వారిలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్ (బెగుసరాయ్, బీహార్), నిత్యానంద్ రాయ్ (ఉజియార్పూర్, బీహార్), రావుసాహెబ్ దాన్వే (జల్నా, మహారాష్ట్ర ఉన్నారు.మహారాష్ట్రలోని బీజేపీకి చెందిన పంకజా ముండేతో పాటు పశ్చిమ బెంగాల్లోని బహరంపూర్లో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, తృణమూల్ కాంగ్రెస్కు చెందిన మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ విజయం కోసం పోటీ పడుతున్నారు.నాలుగో దశలో పోలింగ్ జరగనున్న పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, పోలింగ్ రోజున ఈ ప్రాంతాల్లో వేడిగాలులు వీచే పరిస్థితులు ఉండవని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.2024 లోక్సభ ఎన్నికల మొదటి మూడు దశల్లో ఓటింగ్ శాతం వరుసగా 66.14 శాతం, 66.71 శాతం, 65.68 శాతంగా నమోదైంది. -
నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
ఢిల్లీ: ఎన్నికల్లో కొంతమంది పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు కాకుండా.. నోటా గుర్తుకు ఓటు వేస్తుంటారు. ఇటీవల ఇండోర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థి లేకుండా పోయారు.ఇండోర్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి లేకపోవడంతో బీజేపీకి గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. దీంతో ఈ రోజు (సోమవారం) జరుగుతున్న నాలుగో దశ ఎన్నికల్లో కార్యకర్తలు, ప్రజలు నోటా గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నోటాకు ఓటు వేసి బీజేపీకి గుణపాఠం చెప్పాలని అన్నారు.నిజానికి నోటా గుర్తుకు 99 శాతం మంది ఓటు వేసి, ఒక్కరు అక్కని పోటీ చేస్తున్న అభ్యర్థికి ఓటు వేసినా.. ఆ అభ్యర్థే విజేతగా నిలుస్తారని మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్ పేర్కొన్నారు. అయితే ఒక నియోజక వర్గంలో నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు.. అక్కడి అభ్యర్థిని అక్కడి ప్రజలు ఎన్నుకోవడానికి సుముఖత చూపడం లేదని దానిపైన ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని అన్నారు. దీనివల్ల పార్లమెంటు, ఎన్నికల కమిషన్లపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. -
ఏపీలో కాసేపట్లో ప్రారంభం కానున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్
-
Lok sabha elections 2024: ముగిసిన నాలుగో విడత పోలింగ్.. 62.31 శాతం ఓటింగ్ నమోదు
Updatesఢిల్లీ: దేశవ్యాప్తంగా సోమవారం(మే13) లోక్సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు 96 లోక్సభ నియోజక వర్గాల పరిధిలో సగటున 62.31 పోలింగ్ శాతం నమోదయింది. ఆంధ్రప్రదేశ్ -68.04%బీహార్ - 54.14%జమ్మూ-కాశ్మీర్- 35.75%జార్ఖండ్ -63.14%మధ్యప్రదేశ్ - 68.01%మహారాష్ట్ర - 52.49%ఒడిస్సా - 62.96%తెలంగాణ - 61.16%ఉత్తరప్రదేశ్ - 56.35%పశ్చిమ బెంగాల్ - 75.66%ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో 67.99 శాతం పోలింగ్ నమోదయింది. డిషాలోని 28 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో 62.96 పోలింగ్ శాతం నమోదైంది. బిహార్:బిహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఓటు హక్కు వినియోగించుకున్నారు.లాఖీసారాయ్ పోలింగ్ బూత్లో ఓటు వేశారు.#WATCH | Bihar Deputy CM Vijay Kumar Sinha casts his vote for the fourth phase of #LokSabhaElection2024 at a polling booth in Lakhisarai. pic.twitter.com/RgnqvmqvPX— ANI (@ANI) May 13, 2024కొనసాగుతున్న నాలుగో విడత పోలింగ్లోక్ సభ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంటవరకు 40.32% పోలింగ్ శాతం నమోదుఆంధ్రప్రదేశ్ - 40.26 %బీహార్ - 34.44%జమ్మూ-కాశ్మీర్- 23.57%జార్ఖండ్ - 43.80%మధ్యప్రదేశ్ - 48.52%మహారాష్ట్ర - 30.85%ఒడిస్సా - 39.30%తెలంగాణ - 40.38%ఉత్తరప్రదేశ్ - 39.68%పశ్చిమ బెంగాల్ - 51.87%ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో నమోదయిన పోలింగ్ శాతం 36 శాతంఒడిస్సాలో 28 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో నమోదయిన పోలింగ్ శాతం 39.30బిహార్:నార్త్-ఈస్ట్ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారుబెగుసారాయ్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు#WATCH | Bihar: Congress candidate from North-East Delhi, Kanhaiya Kumar casts his vote at a polling booth in Begusarai. The constituency sees the contest between sitting MP-BJP candidate Giriraj Singh and CPI candidate Awadhesh Rai.#LokSabhaElections2024 pic.twitter.com/78holvi5FH— ANI (@ANI) May 13, 2024మధ్య ప్రదేశ్:మాజీ లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఇండోర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Madhya Pradesh: Former Lok Sabha Speaker Sumitra Mahajan casts her vote for the fourth phase of #LokSabhaElections2024 at a polling booth in Indore. pic.twitter.com/E8pffYvjnT— ANI (@ANI) May 13, 2024 ఉత్తర ప్రదేశ్కేంద్రమంత్రి లఖీంపూర్కేరీ బీజేపీ అభ్యర్థి అజయ్ మిశ్రా తేని ఓటు వేశారుబాన్వీర్పూర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు#WATCH | Uttar Pradesh: BJP candidate from Lakhimpur Kheri, Union Minister Ajay Mishra Teni casts his vote at Banveerpur Booth 202 for the #LokSabhaElections2024 Samajwadi Party's Utkarsh Verma and BSP's Anashay Kalra are contesting against him from here. pic.twitter.com/NnagzQ06R3— ANI (@ANI) May 13, 2024నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోందిఉదయం 11 గంటల వరకు 24.87 శాతం పోలింగ్ నమోదైందిఆంధ్రప్రదేశ్- 23.10 శాతంతెలంగాణ- 24.31 శాతంబిహార్- 22.54 శాతంజమ్మూ కశ్మీర్- 14.94 శాతంజర్ఖండ్- 27. 40 శాతంమధ్యప్రదేశ్- 32.38 శాతంమహారాష్ట్ర- 17.51 శాతంఒడిశా- 23.28 శాతంఉత్తరప్రదేశ్- 27.12 శాతంపశ్చిమ బెంగాల్- 32.78 శాతం#LokSabhaElections2024 | 24.87% voter turnout recorded till 11 am, in the fourth phase of elections. Andhra Pradesh 23.10%Bihar 22.54Jammu And Kashmir 14.94% Jharkhand 27.40% Madhya Pradesh 32.38% Maharashtra 17.51% Odisha 23.28% Telangana 24.31% Uttar Pradesh 27.12%… pic.twitter.com/Awy60bMdeG— ANI (@ANI) May 13, 2024జార్ఖండ్:జార్ఖండ్ సీఎం చంపయ్ సోరెన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.జిలింగోరా పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Jharkhand CM Champai Soren shows the indelible ink mark on his finger after voting at a polling booth in Jilingora, Saraikela Kharsawan District.#LokSabhaElections2024 pic.twitter.com/qw6nn60JBf— ANI (@ANI) May 13, 2024 పశ్చిమ బెంగాల్:దుర్గాపూర్: బెంగాల్ ఘర్షణ చోటుచేసుకుంది.బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.అక్కడే ఉన్న పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.#WATCH Durgapur, West Bengal: A clash broke out between BJP and TMC workers in Durgapur.#LokSabhaElections2024 pic.twitter.com/alSiQy6ldv— ANI (@ANI) May 13, 2024 ఢిల్లీ:నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోందిఓటువేయడానికి భారిగా ప్రజలు తరలివస్తున్నారుఉదయం 9 గంటల వరకు మొత్తం 10. 35 శాతం పోలింగ్ నమోదైందిఆంధ్రప్రదేశ్- 9.05 శాతంతెలంగాణ- 9.51 శాతంబిహార్- 10.18 శాతంజమ్మూ కశ్మీర్- 5.07 శాతంజర్ఖండ్- 11. 78 శాతంమధ్యప్రదేశ్- 14. 97 శాతంమహారాష్ట్ర- 6.45 శాతంఒడిశా- 9. 23 శాతంఉత్తరప్రదేశ్- 11. 67 శాతంపశ్చిమ బెంగాల్- 15. 24 శాతం#LokSabhaElections2024 | 10.35% voter turnout recorded till 9 am, in the fourth phase of elections.Andhra Pradesh 9.05%Bihar 10.18%Jammu And Kashmir 5.07%Jharkhand 11.78%Madhya Pradesh 14.97%Maharashtra 6.45%Odisha 9.23%Telangana 9.51%Uttar Pradesh 11.67%West Bengal… pic.twitter.com/tmtjV4Aluw— ANI (@ANI) May 13, 2024 ఉత్తర ప్రదేశ్:యూపీ మంత్రి జితిన్ ప్రసాదా ఓటు హక్కు వినియోగించకున్నారు.షహజాన్పూర్ పోలింగ్ కేంద్రంలో ఓటు చేశారు.#WATCH | Uttar Pradesh Minister Jitin Prasada casts his vote at a polling booth in ShahjahanpurINDIA Alliance has fielded SP's Jyotsna Gond here. She faces BJP's sitting MP & candidate Arun Kumar Sagar & BSP's Dod Ram Verma. #LokSabhaElections2024 pic.twitter.com/a933KBvJWW— ANI (@ANI) May 13, 2024జమ్మూ కశ్మీర్:శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా, వైఎస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Srinagar, J&K: JKNC Chief Farooq Abdullah and JKNC Vice President Omar Abdullah show their inked fingers after casting their votes for the #LokSabhaElections2024 pic.twitter.com/arYMBqgxBm— ANI (@ANI) May 13, 2024 యూపీ:ఉన్నావ్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాక్షి మహారాజ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Uttar Pradesh: BJP MP and candidate from Unnao, Sakshi Maharaj casts his vote at a polling booth in the constituency.Samajwadi Party (SP) has fielded Annu Tandon and BSP has fielded Ashok Kumar Pandey here. #LokSabhaElections2024 pic.twitter.com/gW1oFBrui7— ANI (@ANI) May 13, 2024జమ్మూ కశ్మీర్:శ్రీనగర్లో నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోందిపెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు క్యూలైన్లలో నిల్చున్నారుLok Sabha elections 2024: Polling underway in SrinagarRead @ANI Story | https://t.co/gDgPtt9ffZ#JammuKashmir #Srinagar #LokSabhaElection2024 pic.twitter.com/2B9fFIibHg— ANI Digital (@ani_digital) May 13, 2024తెలంగాణఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డిబర్కత్పూరా పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.నాలుగోవిడత పోలింగ్ కొనసాగుతోందిUnion Minister G Kishan Reddy casts his vote in Telangana's BarkatpuraRead @ANI Story | https://t.co/vmoYK3dewi#GKishanReddy #LokSabhaElection2024 #Telangana pic.twitter.com/Xiwl8pYjcJ— ANI Digital (@ani_digital) May 13, 2024 మధ్యప్రదేశ్మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఉజ్జయినిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Madhya Pradesh CM Mohan Yadav casts his vote at a polling station in Ujjain. #LokSabhaElections2024 pic.twitter.com/FxzdPbdYja— ANI (@ANI) May 13, 2024 ఢిల్లీ:కొనసాగుతున్న నాలుగో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్దేశవ్యాప్తంగా సాధారణ వాతావరణ పరిస్థితులు, హీట్ వేవ్ లేదని వెల్లడించిన ఐఎండిపోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లుపది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు ఎన్నికలుఎన్నికల బరిలో 1717 మంది అభ్యర్థులుప్రతి పార్లమెంటులో సగటున 18 మంది అభ్యర్థులు1.92 లక్షల పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న 17.7 కోట్ల మంది ఓటర్లు85 ఏళ్లు దాటిన ఓటర్లు12.49 లక్షల మంది, 19.99 లక్షల మంది దివ్యాంగ ఓటర్లుఏపీలో 175 అసెంబ్లీ సీట్లు, ఒడిశాలో 25 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలుతెలంగాణలో పోలింగ్ సమయం పెంపు; ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్న 19లక్షల మంది సిబ్బందిఎన్నికల ప్రక్రియలో 364 మంది అబ్జర్వర్లు1016 అంతర్రాష్ట్ర సరిహద్దులు, 121 అంతర్జాతీయ సరిహద్దులలో నిఘాపోలింగ్ కేంద్రాల వద్ద నీళ్లు, షెడ్, టాయిలెట్స్, ర్యాంప్స్ ఏర్పాటు తెలంగాణఓటు హక్కు వినియోగించుకున్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ#WATCH | Telangana: AIMIM candidate from Hyderabad, Asaduddin Owaisi shows his inked finger after casting his vote at a polling booth in Hyderabad. #LokSabhaElections2024 pic.twitter.com/aEg4psMI8A— ANI (@ANI) May 13, 2024 తెలంగాణకేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై సీఈఓ వికాస్ రాజ్కు ఫిర్యాధు చేసిన కాంగ్రెస్ఓటు వేసి మీడియాతో మాట్లాడుతూ మోడీ పేరును ప్రస్తావించినందుకు ఫిర్యాధుపోలింగ్ రోజు వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందన్న కాంగ్రెస్కిషన్ రెడ్డి పై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని ECని కోరిన కాంగ్రెస్ మహారాష్ట్ర:కేంద్ర మంత్రి రావుసాహెబ్ పాటిల్ దాన్వే ఓటు హక్కు వినియోగించుకున్నారు.జాల్నా పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Union Minister and BJP's candidate from Jalna Lok Sabha seat, Raosaheb Patil Danve casts his vote at a polling booth in Jalna, Maharashtra Danve is sitting MP from this seat. INDIA alliance has fielded Congress leader Kalyan Vaijinathrao Kale from this seat.… pic.twitter.com/cRvRTK4B8b— ANI (@ANI) May 13, 2024 జమ్మూ కశ్మీర్:పుల్వామా పోలింగ్ కేంద్రంలో బారులు తీరిన ఓటర్లు#WATCH | Jammu and Kashmir: Voters queue up outside a polling booth in PulwamaNational Conference (NC) has fielded Aga Syed Ruhullah Mehdi from the Srinagar Lok Sabha seat, PDP fielded Waheed-ur-Rehman Para, and J&K Apni Party’s fielded Mohammad Ashraf Mir.… pic.twitter.com/VSgGZs9Vki— ANI (@ANI) May 13, 2024 తెలంగాణ:త్రిపురా గవర్నర్ ఎన్ ఇంద్రసేనా రెడ్డి ఓటు వేశారు.హైదరాబాద్ సలీంనగర్ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ కొనసాగుతోంది#WATCH | Telangana: Tripura Governor N Indrasena Reddy, along with his family, casts his vote at a polling booth in Saleem Nagar, Hyderabad. #LokSabhaElections2024 pic.twitter.com/tdl5oYHbrs— ANI (@ANI) May 13, 2024 తెలంగాణ:ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులుహైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఓటు వేశారు.నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది#WATCH | Telangana: Former Vice President M Venkaiah Naidu and his wife Usha Naidu show the indelible ink mark on their fingers after casting their vote at a polling booth in Jubilee Hills, Hyderabad.#LokSabhaElections2024 pic.twitter.com/gUN3v2Ekf2— ANI (@ANI) May 13, 2024 ఢిల్లీ:ఓటు వేయటం ప్రజాస్వామ్య హక్కు: ప్రధాని మోదీకొనసాగుతున్న నాలుగో విడత పోలింగ్Lok Sabha election: PM Modi calls for 'democracy duty' as voting begins in fourth phaseRead @ANI Story | https://t.co/6N8RRsDrTD#LokSabaElections2024 #PMModi #democracy pic.twitter.com/IhZJO6sRzR— ANI Digital (@ani_digital) May 13, 2024 తెలంగాణ: హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీ లత ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Telangana: BJP candidate from Hyderabad, Madhavi Latha casts her vote at a polling booth in the constituency.She faces sitting MP and AIMIM candidate Asaduddin Owaisi and BRS' Gaddam Srinivas Yadav here. #LokSabhaElections2024 pic.twitter.com/E7sMVEZOrj— ANI (@ANI) May 13, 2024 బిహార్:కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.లఖిసారి పోలింగ్ కేంద్రంలో ఓటు చేశారు.పోలింగ్ కేంద్రానికి ఓటర్లు తరలి వస్తున్నారు.#WATCH | Bihar: After casting his vote in Lakhisari, Union Minister and BJP candidate from Begusarai, Giriraj Singh says, "I want to appeal to the voters of Bihar that they must go out and vote. One vote can cause the fall of the Atal Bihari Vajpayee government and every vote can… pic.twitter.com/X6IiXHe8Qu— ANI (@ANI) May 13, 2024 యూపీ:ఉత్తరప్రదేశ్ మంత్రి సురేష్ ఖన్నా ఓటు హక్కు వినియోగించుకున్నారు.షహజాన్పూర్లో పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేయడానికి ప్రజలు తరలి వస్తున్నారు.ఓటర్లు క్యూలైన్లో నిల్చుంటున్నారు. #WATCH | Uttar Pradesh Minister Suresh Khanna casts his vote at a polling booth in Shahjahanpur. INDIA Alliance has fielded SP's Jyotsna Gond here. She faces BJP's sitting MP & candidate Arun Kumar Sagar & BSP's Dod Ram Verma. #LokSabhaElections2024 pic.twitter.com/fpFLtROJ11— ANI (@ANI) May 13, 2024 ఒడిశా:నాబారంగాపూర్లో ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు.#WATCH | Nabarangpur, Odisha: An eco-friendly polling station has been established at the Dandamunda village in Chandahandi Block of the Nabarangpur Lok Sabha constituency.BJP's Balabhadra Majhi, BJD's Pradeep Majhi and Congress' Bhujabala Majhi are contesting the… pic.twitter.com/tWfKsAon3B— ANI (@ANI) May 13, 2024 ప్రారంభమైన నాలుగో విడత పోలింగ్పది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది.క్యూలైన్లో నిల్చున్న ఓటర్లుVoting for the fourth phase of #LokSabhaElections2024 begins. Polling being held in 96 constituencies across 10 states and Union Territories (UTs) today. 1717 candidates in fray. pic.twitter.com/GXFjsWMsdQ— ANI (@ANI) May 13, 2024 తెలంగాణతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన మాక్ పోలింగ్రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్ సభ17 పార్లమెంటు స్థానాలకు బరిలో నిలిచిన 525 మంది అభ్యర్థులుఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే ముగియనున్న పోలింగ్పోలింగ్ పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించిన ప్రభుత్వంతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 525 మంది అభ్యర్థులు, 475మంది పురుషులు, 50 మంది మహిళా అభ్యర్థులుఎన్నికల విధుల్లో 2లక్షల 80వేల మంది సిబ్బంది విధుల నిర్వహణ160 కేంద్ర కంపెనీల CAPF బలగాలతో బందోబస్తుఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి 20వేల మంది పోలీస్ బలగాలురాష్ట్ర వ్యాప్తంగా 3కోట్ల 32లక్షల 32వేల మంది ఓటర్లుపురుష ఓటర్లు - 1కోటి 65లక్షల 28వేలు, 1కోటి 67లక్షల మహిళా ఓటర్లు18-19 ఏళ్ల వయసు కలిగిన యువ ఓటర్లు 9లక్షల 20వేలు, వికలాంగులు 5లక్షల 27వేలుతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35వేల 808 పోలింగ్ కేంద్రాలుఅత్యధికంగా మల్కాజ్గిరిలో 3226 పోలింగ్ కేంద్రాలు1లక్ష 9వేల 941 బ్యాలెట్ యూనిట్లు, 44906 కంట్రోల్ యూనిట్లుతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 9900 ఉన్నట్లు గుర్తించిన ఈసీజూన్ 4వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు#WATCH | Hyderabad, Telangana: Mock polling begins at the Jubilee Hills Public School polling booth nos. 163, 164 and 165 from Secundrabad Lok Sabha Constituency. BJP's G Kishan Reddy, Congress' Danam Nagender and BRS' T. Padma Rao Goud are contesting elections from here. G… pic.twitter.com/Q50qyruJ3B— ANI (@ANI) May 13, 2024 లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నాలుగో విడత పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. 1717 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రతి పార్లమెంటులో సగటున 18 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 1.92 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 17.7 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 85 ఏళ్లు దాటిన ఓటర్లు12.49 లక్షలు ఉండగా, 19.99 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు, ఒడిశాలో 25 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.తెలంగాణలో పోలింగ్ సమయం పెంచడంతో ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రక్రియలో 19 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో 364 మంది అబ్జర్వర్లను నియమించారు. 1016 అంతర్రాష్ట్ర సరిహద్దులు, 121 అంతర్జాతీయ సరిహద్దులలో ఈసీ నిఘా ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద నీళ్లు, షెడ్, టాయిలెట్స్, ర్యాంప్స్ ఏర్పాటు చేశారు. -
జనస్వామ్యమా! జయీభవ!!
ఏటా వచ్చే వేసవికి అదనంగా ఈసారి ఎన్నికల వేసవిని చవిచూస్తున్నాం. కాకపోతే రెంటి మధ్యా ఒక తేడా ఉంది. సూర్యతాపం ద్విగుణీకృతమవుతున్నకొద్దీ, వోటర్లలోనూ ఎన్నికల సమరోత్సాహం త్రిగుణీకృతమవుతుంది. అదే ప్రజాస్వామ్యంలోని అందమూ, చందమూ, ఆకర్షణా. ప్రజా స్వామ్యం అత్యుత్తమం కాకపోవచ్చుకానీ, ఇప్పటివరకూ అనుభవంలోకి వచ్చిన అన్ని వ్యవస్థల్లో అదే ఉత్తమమని పండితులెందరో తేల్చారు. ప్రజాస్వామ్యానికి ఎన్నికలే వెన్నెముక. తమ కలలు, కాంక్షలతో ముడిపడినవి కనుకే ఎన్నికలు జనానికి మండు వేసవిలోనూ మంచు లేపనమవుతాయి. రాచరికం, సైనిక నియంతృత్వం లాంటి చేదు అనుభవాల దరిమిలా ప్రజాస్వామ్యాన్ని తెచ్చు కున్నామని పొరబడేవారున్నారు. రాజ్యమూ, సామ్రాజ్యమూ ఉనికిలోకి రాకముందే, మనుషులు గుంపు కట్టడం నేర్చిన తొలి దశలోనే అంకురించిన తాత్వికత– ప్రజాస్వామ్యం. కాలికమైన అంతరాలను, అడ్డంకులను దాటుకుని నేటికీ పురివిప్పుతున్న రాజకీయ తాత్వికత అదే. వేట– ఆహార సేకరణ దశలో మనిషి ప్రకృతి శక్తులతో పోరాడుతున్నప్పుడే తోటి మనుషుల తోడు, తోడ్పాటుల విలువ గుర్తించాడు; అభిప్రాయాల కలబోతనూ, ఐక్య కార్యాచరణనూ అలవరచుకున్నాడు. అంద రినీ కలుపుకొనిపోయే నాయకత్వాన్నీ ఆనాడే ప్రతిష్ఠించుకున్నాడు. గణతంత్రం పేరిట సాముదా యికంగా అభివృద్ధి చేసుకున్న సమాజాలతోనే రాజకీయ చరిత్ర ప్రారంభమైందని విజ్ఞులంటారు. గణతంత్రంలో నాయకుడు సమానులలో మొదటివాడే తప్ప అసామాన్యుడూ కాదు, అడ్డు అదుపుల్లేని అధికార శ్రీమంతుడూ కాదు. నేడు ప్రతి వోటుకూ ఒకే విలువ ఉన్నట్టే, నాడు ప్రతి ఒకరికీ ఒకే విలువ. పురాణేతిహాసాల్లో ఇందుకు సాక్ష్యాలు కనిపిస్తాయి. రామాయణంలో దశరథుడు తన పెద్దకొడుకు రాముడికి పట్టాభిషేకం చేయడానికైనా; మహాభారతంలో యయాతి తన చిన్న కొడుకు పూరునికి రాజ్యం కట్టబెట్టడానికైనా పౌర, జానపదుల ఆమోదం తప్పనిసరి. సమష్టి స్థానంలో వ్యక్తి ప్రాధాన్యం పుంజుకున్న దశలోనూ మంత్రి పరిషత్తులో చర్చించే నిర్ణయాలు తీసుకు నేవారు. విభీషణ శరణాగతి ఘట్టంలో రాముడు వానరవీరుల అభిప్రాయాన్ని అడుగుతాడు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నో మలుపులూ, మరకలతోపాటు మెరుపులూ మన చూపుల్ని జిగేలుమనిపిస్తాయి. గణాలు వ్రాతాలుగా, వ్రాతాలు జనాలుగా, జనాలు మహాజనాలుగా మారే క్రమంలోనే సామ్రాజ్యాలు ఉనికిలోకి వచ్చాయి. మనదేశంలో మగధ సామ్రాజ్యావతరణకు ముందున్నది గణతంత్రమే. ఆనాడు దేశం పదహారు జనపదాలుగా ఉండేది. గ్రీస్, మెసపోటేమియాలలో గణతంత్ర రాజ్యాలు ఉండేవి. నాటి గ్రీస్లోని ఎథెన్స్ అధినేత పెరిక్లీస్ ప్రజాస్వామిక అనుభవాన్ని కొత్త పుంతలు తొక్కించి జనతంత్రానికే ఘన చిహ్నమయ్యాడు; సంపన్నుల ప్రతిఘటనకు ఎదురొడ్డుతూ పేదలవైపు నిలబడి కలబడడంలోనూ ప్రజానాయకులకు తొలిమూసై మణిపూస అయ్యాడు. బలవత్తరులైన పర్షియన్ల దాడిని దీటుగా తిప్పికొట్టినా, సాటి గ్రీసు రాజ్యమైన స్పార్టాతో యుద్ధమొచ్చిన దశలో ప్లేగు వాతబడి అతను కన్నుమూయడం ఎథెన్స్ స్వాతంత్య్రానికీ; ప్రజాస్వామ్యానికీ చితిపేర్చింది. ఆ తర్వాత, స్పార్టా సహా గ్రీస్ అలెగ్జాండర్ సామ్రాజ్యంలో, ఆ తర్వాత రోమన్ సామ్రాజ్యంలో చిన్న వలసగా మసకబారిపోయింది. అలా కొడిగట్టిన ప్రజా స్వామ్యం తిరిగి కాంతినీ, క్రాంతినీ తెచ్చుకోవడానికి రెండువేల సంవత్సరాలు పట్టింది. ఎథెన్స్ ప్రభవించిన తాత్విక శిఖరాలే సోక్రటిస్, ప్లేటో, అరిస్టాటిల్! సోక్రటిస్ ప్రజాస్వా మ్యాన్ని వ్యతిరేకించినా; ప్లేటో అన్ని అధికారాలనూ రాజ్యం చేతుల్లో పెట్టి, ఉదారవాద నియంతృత్వమనే ఊహాస్వర్గానికి నిచ్చెన వేసినా; అరిస్టాటిల్ మధ్యేమార్గంగా రాజ్యాంగబద్ధ ఆదర్శ రాజ్యాన్ని నొక్కి చెప్పినా– ముగ్గురూ పశ్చిమ దేశాల రాజకీయ తాత్విక చింతనను ఉద్దీపింపజేసిన వారే. ప్రత్యేకించి అరిస్టాటిల్ ఆధునిక కాలంలో జాన్ లాక్, మాంటెస్క్యూ వంటి ప్రజాస్వామ్య దిశానిర్దేశకులకు ఒరవడి అయ్యాడు. గ్రీకుల బహుళ దేవతారాధనను వ్యతిరేకించినందుకు సోక్ర టిస్ను ఉరితీయడం ఎథెన్స్ ప్రజాస్వామ్య పరిమితిని, అపరిణతిని నొక్కిచెప్పి; భావప్రకటనా స్వేచ్ఛలేనిది ప్రజాస్వామ్యమే కాదన్న నీతినీ బోధించింది. పౌర ప్రాతినిధ్యం నుంచి రాచరిక నియంతృత్వంలోకి జారిపోయిన రోమ్ అనుభవమూ ఇలాంటిదే. వ్యక్తులు ఉత్తములూ, ఉన్నత సంకల్పవంతులూ అయితే చాలదు; వ్యవస్థలను బలోపేతం చేస్తేనే ప్రజాస్వామ్యానికి ఉనికీ, మనికీ అన్నది రోమ్ నేర్పిన గుణపాఠం. యూరప్ అంతటా ప్రజాస్వామ్య వ్యవస్థల సంపూర్ణ పతనం; ప్రజాస్వామ్య పునరుజ్జీవనానికి ఇంగ్లండ్ వేగుచుక్క కావడం; ఫ్రెంచి విప్లవం తిప్పిన మలుపులు; ప్రజాస్వామ్య మార్గంలో అమెరికా వేసిన ముందడుగు– ఇదంతా మరో చరిత్ర. వోటుహక్కు చరిత్రనే తిరగేస్తే, ఎథెన్స్ ప్రజాస్వామ్యంలోనూ బానిసలకు వోటు హక్కు లేదు. ఆ తర్వాతా శ్రామికులకు, స్త్రీలకు వోటు హక్కు లభించడానికి పెద్ద పోరాటాలే జరిగాయి. యూరప్ దేశాలు అనేకం ప్రజాస్వామ్యంలోకి రావడానికి ఇరవయ్యో శతాబ్ది చివరి వరకూ ఎదురుచూశాయి. ఇలాంటి చీకటి వెలుగుల చిత్రపటంలో భారత్ ఉనికే ఉజ్వలమూ, ఉత్తేజవంతమూ! వోటు హక్కును సార్వత్రికం చేసిన తొలి ఘనత మనదే. భారత్ ఒక దేశంగా మారడాన్నే అనుమానించి అవహేళన చేసిన నాటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ సహా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రజాస్వామిక ప్రస్థానంలో ముందడుగు వేస్తూనే ఉన్నాం. బహుళ మతాలూ, భాషల వైవిధ్యం వైరుద్ధ్యం కాదనీ, ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువనీ ప్రపంచానికి చాటి చెప్పాం. భారత ప్రజాస్వామ్యమా! జయతు జయతు! -
ఓటేయండి.. సాక్షి సెల్ఫీ ఛాలెంజ్లో పాల్గొనండి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ, అలాగే తెలంగాణలోనూ లోక్సభ స్థానాలకు ఎన్నికలకు మరికొద్ది గంటల్లో పోలింగ్ జరుగనుంది. ఆయా రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. తమ భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్యంలో ప్రజలంతా సవ్యంగా ఉపయోగించుకోవాల్సిన హక్కు ఓటు హక్కు అని, అందరూ ఓటేయాలని ఇప్పటికే ఈసీ ప్రచారం సైతం చేసింది.అలాగే.. సాక్షి సైతం తన వంతుగా ఓటర్లను చైతన్యం చేస్తోంది. ఈ క్రమంలోనే సెల్ఫీ ఛాలెంజ్ను నిర్వహిస్తోంది. మీరు చేయాల్సిందల్లా ఓటేసిన తర్వాత మీ స్మార్ట్ఫోన్తో సెల్ఫీ తీసుకుని ఈ నంబర్కు (9182729310) వాట్సాప్ చేయడమే. అందులోంచి నాణ్యత ఉన్న ఫోటోలను ఎంపిక చేసి సాక్షి. కామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ‘‘నా ఉనికి ఓటుతోనే.., నా ఓటు వజ్రాయుధం’’ అని మీరు నిరూపిస్తే.. మీ బాధ్యతను మరో నలుగురికి చూపించి ఓటింగ్ శాతం పెంచడం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణకు మా ప్రయత్నం చేస్తాం. -
ఖర్గే హెలికాప్టర్లో తనిఖీలు.. ‘బీజేపీ నేతలను తనిఖీ చేస్తున్నారా?’
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో ప్రతిపక్షాలను ఎన్నికల అధికారులు టార్గట్ చేసి మరీ తనిఖీలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హెలికాప్టర్ను బిహార్లోని సమస్తిపూర్లో పోలింగ్ అధికారులు తనిఖీ చేశారు. అయితే ఎన్డీయే కూటమి నేతలను మాత్రం ఎటువంటి తనిఖీలు చేయకుండా విదిలేస్తున్నారని కాంగ్రెస్ ఎన్నికల అధికారులపై విమర్శలు చేసింది. శనివారం మల్లికార్జున ఖర్గే.. సమస్తీపూర్, ముజఫర్పర్లో ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు.‘‘ఇప్పటికే కేరళలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్ను ఎన్నికల అధికారలు తనిఖీ చేశారు. శనివారం మల్లికార్జన ఖర్గేను బిహార్లోని సమస్తీపూర్లో అధికారుల చేత తనిఖీ చేయబడ్డారు’’ అని ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్ పార్టీ నేత రాజేష్ రాథోడ్ అన్నారు. బిహార్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఖర్గే హెలికాప్టర్ చెక్ చేశారని రాజేష్ రాథోడ్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. వీడియోలో.. హెలికాప్టర్ చుట్టూ అధికారులు, పోలిసులు ఉండటం గమనించవచ్చు.श्री @RahulGandhi जी के बाद अब @INCIndia अध्यक्ष श्री @kharge जी का हेलीकॉप्टर की तलाशी बिहार के समस्तीपुर में सभा के दौरान चुनाव आयोग और पुलिसकर्मियों द्वारा करना चुनाव आयोग का दुर्भावना पूर्ण व्यवहार प्रतिपक्षों के लिए दर्शाता है यह लोकतंत्र की हत्या है l pic.twitter.com/tk1SUqcj5P— Rajesh Rathorre (@RajeshRathorre1) May 11, 2024 ‘‘కేవలం కాంగ్రెస్ నేతల హెలికాప్టర్లకు మాత్రమే తనిఖీలు చేస్తున్నారా? లేదా బీజేపీకి చెందిన అగ్రనాయకుల హెలికాప్టర్లును కూడా చెక్ చేస్తున్నారా? అనే విషయంపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వాలి. ఈ తనిఖీలు సమాచారాన్ని ఈసీ బహిరంగంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. లేదంటే ప్రతిపక్షాలను అడ్డుకొని, ఎన్డీయే నేతలను ఫ్రీగా వదిలేసినట్లు అర్థమవుతుంది’’ అని రమేష్ రాథోడ్ అన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారులు నేతల హెలికాప్టర్లను చెక్ చేసిన అన్ని వీడియోను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఎన్నికల వేళ సినిమా రేంజ్లో పోలీసులు ఛేజింగ్.. భారీగా డబ్బు స్వాధీనం
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేళ భారీ మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సినిమా ఫక్కీలో ఓ ఇన్నోవా కారును ఛేజ్ చేసి డబ్బు తరలిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఖమ్మం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపునకు ఓ ఇన్నోవా వెళ్తోంది. నాయకనగూడెం వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఇన్నోవా కారు ఆపితే ఆగకుండా వెళ్లింది. సిబ్బందికి అనుమానం వచ్చి ఆ కారును చేజ్ చేశారు. పది కిలోమీటర్ల మేర పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో దేవుడి తండా వద్ద ఇన్నోవా వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణం చేసిన ఒకరికి గాయాలు కాగా ఆ వాహనంలో కోటిన్నర రూపాయలు పైగా నగదు బయట పడింది. పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మరోవైపు.. మరికొన్ని గంటల్లోనే పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలో జరిగే అవకాశం ఉంది. డబ్బు తరలించే అవకాశం ఉండటంతో పోలీసులు నిఘా పెంచారు. -
ప్రధాని మోదీకి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కౌంటర్
భువనేశ్వర్: ప్రధాని నరేంద్రమోదీ చేసిన విమర్శలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కౌంటర్ ఇచ్చారు. ఎవరి సాయం లేకుండా ఒడియా భాషలో చెప్పగలరా?. పేర్లే చెప్పలేని వ్యక్తి పేదల బాధలెలా తీర్చగలరు? ప్రజా సమస్యలను ఎలా అర్థం చేసుకోగలరు? అని మోదీ చేసిన వ్యాఖ్యలపై నవీన్ పట్నాయక్ స్పందించారు.‘‘ప్రధాని మోదీ గారు.. ఒడిశా గురించి మీకు ఎంతమేరకు గుర్తుంది. ఒడియా ఒక శాస్త్రీయ భాష. దానిని మీరు మర్చిపోయారు. సంస్కృతం కోసం బడ్జెట్లో రూ. 1000 కోట్లు కేటాయించారు.. కానీ, ఒడియాకు కేటాయింపులు శూన్యం. నేను శాస్త్రీయ ఒడిస్సీ సంగీత గుర్తింపు కోసం ప్రతిపాదలు పంపాను.కానీ, వాటిని మీరు రెండు సార్లు తిరస్కరించారు. ఒడిశాలో అధికంగా లభించే సహజ వనరు బొగ్గు. కేంద్రం బొగ్గును ఒడిశా నుంచి తీసుకుంటోంది. కానీ, గత పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ రాయల్టీ పెంచలేదు. మోదీకి ఎన్నికల సమయంలో మాత్రమే ఒడిశా గుర్తుకు వస్తుంది. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మీరు(మోదీ) ఇచ్చిన హామీలను ఒడిశా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ధరలు తగ్గిస్తాం. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు తగ్గిస్తాం వంటి హామీలను ఒడిశా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. అదే విధంగా ఒడిశాలోని మహానీయులను మోదీ ఎందుకు మర్చిపోయారు. వారికి భారత రత్న వంటి అవార్డులను ఎందుకు ఇవ్వలేకపోయారు. మరో పదేళ్లపాటు బీజేపీ ఒడిశా ప్రజలను మనసులకు గెల్చుకోలేదు’అని సీఎం నవీన్ పట్నాయక్ విమర్శలు చేస్తూ వీడియో విడుదల చేశారు...ఒడిశాలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ సీఎం నవీన్ పట్నాయక్పై తీవ్ర విమర్శలు గుప్పించారు‘‘ ఒడిశాకు ఇన్నేళ్లు సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్కు ఇదే నా సవాల్. ఆయన ఒడిశాలోని అన్ని జిల్లాలు, జిల్లా కేంద్రాల పేర్లను ఏ పేపర్లో చూడకూండా, ఎవరి సాయం లేకుండా ఒడియా భాషలో చెప్పగలరా? పేర్లే చెప్పలేని వ్యక్తి పేదల బాధలెలా తీర్చగలరు? ప్రజా సమస్యలను ఎలా అర్థం చేసుకోగలరు?’’ అని మండిపడ్డారు. -
కెఎస్ఆర్ లైవ్ షో @ 12 May 2024
-
మీరేమైనా ప్రధాని అభ్యర్థినా?.. రాహుల్పై స్మృతి ఇరానీ విమర్శలు
ఢిల్లీ: ఎన్నికల అంశాలపై ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో డిబేట్ చేయడానికి రాహుల్ గాంధీ ఏమైనా విపక్షాల కూటమికి పీఎం అభ్యర్థిగా ఉన్నారా? అని ప్రశ్నించారు. ఆమె ఓ జాతీయా మీడియాతో మాట్లాడారు. ‘మొదటిగా.. తమ కంచుకోట అని భావించే స్థానంలో ఓ సాధారణ బీజేపీ కార్యకర్తపై కూడా పోటీ చేసే ధైర్యం లేనివ్యక్తి ప్రగల్భాలు పలకడం మానుకోవాలి. రెండోది.. ప్రధానిమోదీతో భేటీ అయిన ఆయనతో డిబేట్ చేసే స్థాయి రాహల్ గాంధీకి ఉందా?. నేను సూటిగా అడుగుతున్నా.. రాహల్ గాంధీ ఏమైనా విపక్ష కూటమికి ప్రధాని అభ్యర్థినా?’’ అని స్మృతి ఇరానీ నిలదీశారు.పలు లోక్సభ న్నికల అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో బహిరంగ చర్చ ఆహ్వానానికి తాను సిద్ధమేనని శనివారం రాహుల్ గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘మా పార్టీ విజన్ను ప్రజలు అర్థం చేసుకోవడానికి ఈ డిబేట్ సాయం చేస్తుంది. సరైన సమాచారం ప్రజలకు చేరుతుంది’ అని రాహల్ గాంధీ అన్నారు. ఈ డిబేట్లో తాను లేదా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొనడానికి సిద్ధమని తెలిపారు. ఇక.. ఈ బహిరంగ చర్చకు.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బీ లోకూర్, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏపీ షా, సీనియర్ జర్నలిస్టు ఎన్ రామ్ ఆహ్వానం పలికారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement