ECI: పోలింగ్‌ 65.79 శాతం | Lok Sabha Polls See 65. 79percent Voter Turnout, Postal Ballots Not Included | Sakshi
Sakshi News home page

ECI: పోలింగ్‌ 65.79 శాతం

Published Fri, Jun 7 2024 5:46 AM | Last Updated on Fri, Jun 7 2024 5:46 AM

Lok Sabha Polls See 65. 79percent Voter Turnout, Postal Ballots Not Included

న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 65.79 శాతం పోలింగ్‌ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. పోస్టల్‌ బ్యాలెట్లను ఇంకా ఇందులో కలపని కారణంగా తుది పోలింగ్‌ శాతంలో మార్పులు ఉంటాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ప్రకటించడం తెల్సిందే. 

2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో 67.40 శాతం పోలింగ్‌ నమోదైంది. 2019 ఎన్నికలనాటికి దేశవ్యాప్తంగా 91.20 కోట్ల మంది ఓటర్లు ఉంటే ఆనాడు వారిలో 61.50 కోట్ల మంది మాత్రమే ఓటేశారు. ఇటీవల ముగిసిన 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 96.88 కోట్లకు పెరగడం విశేషం. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి విడివిడిగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు, మొత్తంగా ఓటింగ్‌ శాతాల సమగ్ర వివరాలు తమకు అందాక అందరికీ అందుబాటులోకి తెస్తామని ఈసీ గురువారం విడుదలచేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement