Congress Party
-
టీఎంసీ ఓటమిపై కాంగ్రెస్ సంబురాలు.. రాహుల్ చురకలు
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. కేరళంలో అధికారం తప్పించి మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపెట్టలేదు. అయితే సింగిల్ డిజిట్ సీట్లతో తమిళనాడులో అధికారంలో భాగం అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇటు బెంగాల్లో రెండు సీట్లు గెలవడం కంటే.. టీఎంసీ ఓటమిపైనే హస్తం శ్రేణులు ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. ఈ పరిణామంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఓటమితో కొందరు కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకున్నట్లు రాహుల్ గాంధీకి సమాచారం వెళ్లింది. దీంతో సొంత పార్టీ నేతల తీరుపైనే ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘ టీఎంసీ ఓటమిని చూసి కొందరు కాంగ్రెస్ నేతలు మురిసిపోతున్నారు. ఇది ఎంత మాత్రం సరికాదు. బెంగాల్, అసోంలో ప్రజల తీర్పును అపహరించడం అనేది భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే క్రమంలో బీజేపీ వేసిన మరో అడుగు.. .. ఇది ఓ పార్టీకో, మరో పార్టీకో చెందింది కాదు. ఇది దేశం గురించి.. చిల్లర రాజకీయాలు పక్కన పెట్టండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా అన్ని పార్టీలు కలిసికట్టుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది’’ అని రాహుల్ హితవు పలికినట్లు సమాచారం. అంతకు ముందు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. కేరళలో కాంగ్రెస్ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూనే.. మరోవైపు బెంగాల్, అస్సాం విషయంలో బీజేపీపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దీదీకి మద్దతుగా.. బెంగాల్లో ఓట్ల చోరీ జరిగిందన్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ ఏకీభవించారు. బెంగాల్తో పాటు అస్సాంలోనూ ఓట్లను బీజేపీ దోచుకుందని అన్నారాయన. ‘‘బెంగాల్లో వందకు పైగా స్థానాలు అన్యాయంగా బీజేపీ ఖాతాలోకి వెళ్లాయి. ఎన్నికల ప్రక్రియలో సీసీటీవీ కెమెరాలు ఆపివేయడం, కౌంటింగ్ సెంటర్లలో అనుమానాస్పద కదలికలు జరిగాయి. ఇది ఒక పెద్ద “ఎలక్షన్ మేనిప్యులేషన్ ప్లేబుక్”లో భాగమని ఆయన ఆరోపించారు. -
అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విక్టరీ
గువాహటి: రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్న కమలదళానికి అస్సాం ఓటర్లు మరోసారి పట్టంకట్టారు. దశాబ్దకాలంగా సవ్యంగా పరిపాలన సాగిస్తున్న బీజేపీయే మరో సారి తమను పరిపాలించాలని అస్సాం ఓటర్లు ఖాయం చేసుకున్నారు. సోమవారం అస్సాం శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని తన అధికారాన్ని పదిలపర్చుకుంది. అస్సాంలో బీజేపీకి ఇది హ్యాట్రిక్ విజయం. కాంగ్రెస్ను వీడి కమలతీర్థం పుచ్చుకున్ననాటి నుంచి అహర్నిశలు పార్టీ కోసం, ప్రజల కోసం పాటుపడుతున్న బీజేపీ రాష్ట్ర దిగ్గజనేత హిమంత బిశ్వ శర్మకు అస్సామీలు మరోసారి జైకొట్టారు. అస్సాం అసెంబ్లీలోని 126 స్థానాలకు ఏప్రిల్ 9వ తేదీన ఒకే దఫాలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 82 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 19 స్థానాలతో సరిపెట్టుకుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి పార్టీ అయిన బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్) 10 చోట్ల గెల్చింది. అసోం గణ పరిషద్ 10 చోట్ల విజయం సాధించింది. ఏఐయూడీఎఫ్, రాయ్జోర్ దళ్ పార్టీలు చెరో రెండు స్థానాల్లో గెలిచాయి. తృణమూల్ కాంగ్రెస్ ఒకే ఒక్క నియోజకవర్గంలో నెగ్గింది. మహిళా మంత్రి అజంతా నియోగ్ మొదలు పిజూశ్ హజారికా, రనోజ్ పెగూ దాకా హిమంత కేబినెట్ మంత్రుల్లో చాలా మంది గెలిచారు. జలుక్బారీ నియోజకవర్గంలో కాంగ్రెస్ మహిళా అభ్యర్థి బిదిషా నియోగ్ కంటే ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వేల ఓట్లు అధికంగా సాధించి గెలుపుబావుటా రెపరెపలాడించారు. జలుక్బారీ నుంచి హిమంత వరసగా ఆరో సారి విజయం సాధించడం విశేషం. పాతికేళ్లుగా జలుక్బారీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న హిమంత 2001లో ఇక్కడ తొలివిజయం రుచిచూశారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్కు బై చెప్పి కమలదళంలో చేరిన కాంగ్రెస్ సీనియర్ మాజీ మంత్రి ప్రద్యూత్ బోర్డోలాయ్ సైతం దిస్పూర్ నియోజకవర్గంలో విజయకేతనం ఎగరేశారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మీరా బోర్ఠాకూర్ గోస్వామి కంటే ప్రద్యూత్ 49,667 ఓట్లు ఎక్కువ సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత గౌరవ్ గొగోయ్ జొర్హాట్ స్థానంలో ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి హితేంద్రనాథ్ గోస్వామి చేతిలో గొగోయ్ ఓడిపోయారు. జాగిరోడ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి íపీయూష్ హజారికా సమీప కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ బుబుల్ దాస్పై ఏకంగా 93,584 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జాగిరోడ్లో హజారికాకు ఇది వరసగా నాలుగోవిజయం. ఎన్డీ ఏ కూటమి పార్టీ అసోం గణ పరిషద్ అధ్యక్షుడు అతుల్ బోరా సోమవారం బోకాఖాట్లో రాయ్ జోర్ దళ్ అభ్యర్థి హరిప్రసాద్ సైకియాపై 60,537 ఓట్ల మెజారీ్టతో గెలిచారు. బిన్నాఖండీలో అస్సాం జాతీయ పరిషద్ అభ్యర్థి రీజౌల్ కరీం చౌదరి కంటే ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) నేత మొహమ్మద్ బద్రుద్దీన్ అజ్మల్ 35 వేల ఓట్ల మెజారీ్టతో విజయం సాధించారు. సంబరాల్లో మునిగిన శ్రేణులు పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించిందన్న వార్త తెల్సి రాష్ట్రంలో బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గువాహటిలో అస్సాం బీజేపీ రాష్ట్ర కార్యాలయం(వాజ్పేయీభవన్) వద్ద పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు చేరుకుని సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. బీజేపీ కార్యాలయం బయట వైష్ణవభక్తి ఉద్యమ కళాకారులు నగర సంకీర్తన చేశారు. కార్యకర్తలు హిమంతకు అనుకూలంగా నినాదాలుచేశారు. భారత్మాతాకీ జై అని నినదించారు. పార్టీ ఘనవిజయంపై అస్సాం బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియా సంతోషం వ్యక్తంచేశారు. ఐదేళ్ల క్రితం పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చిన కారణంగానే ఓటర్లు మళ్లీ తమకే అధికారం కట్టబెట్టారు. రాష్ట్రంలో 55 ఏళ్ల కాంగ్రెస్ అరాచక పాలనను మా పదేళ్ల అద్భుత పాలనతో పోల్చుకుని చివరకు మావైపే ఓటర్లు నిలబడ్డారు’’అని సైకియా విశ్లేíÙంచారు. ‘‘ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి హిమంత ప్రజలకు అనుకూలంగా చేపట్టిన పథకాలతో ఈ విజయం సాధ్యమైంది. ఈ గెలుపు ముమ్మాటికీ ప్రజలదే. ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. ఇవి నిజమైన ఆనందభాష్పాలు’’అని బీజేపీ అధికార ప్రతినిధి మిటానాథ్ బోరా ఏడుస్తూ చెప్పారు. -
దీదీ పతనం.. కాంగ్రెస్కు ఊపిరి
పశ్చిమ బెంగాల్ తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారాయి. పైపైన చూస్తే ఇది అధికార తృణమూల్ కాంగ్రెస్పై భారతీయ జనతా పార్టీ సాధించిన అద్భుత విజయంగా మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈ ఫలితాల లోతుల్లోకి వెళితే ఒక ఆసక్తికరమైన రాజకీయ కోణం దాగి ఉంది. దశాబ్ద కాలంగా బెంగాల్లో నామమాత్రంగా మిగిలిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు మళ్లీ ప్రాణం పోశాయి. మమతా బెనర్జీ ఓటమి కాంగ్రెస్కు శుభవార్తగా మారిందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చగా మారింది.శూన్యం నుంచి.. మళ్లీ మొదలైన ప్రస్థానం2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక చతికిలపడిన కాంగ్రెస్ పార్టీ ఈ తాజా ఎన్నికల్లో కనీసం రెండు నియోజకవర్గాల్లోనైనా జెండా ఎగురవేయగలిగింది. ముర్షిదాబాద్ జిల్లాలోని ఫరక్కా, రాణినగర్ స్థానాల్లో కాంగ్రెస్ సాధించిన అనూహ్య విజయం కేవలం అంకెల పరమైన పెరుగుదల మాత్రమే కాదు. ఫరక్కాలో కాంగ్రెస్ అభ్యర్థి మోతాబ్ షేక్ 63,050 ఓట్లు సాధించి, తన సమీప బీజేపీ అభ్యర్థిపై 8,193 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ ఒకప్పటి బలమైన అధికార పార్టీ టీఎంసీ 47,256 ఓట్లతో ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది.ముక్కోణపు పోటీలో.. ఆశ్చర్యకరమైన ఫలితాలురాణినగర్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి జుల్ఫికర్ అలీ హోరాహోరీ పోరులో టీఎంసీపై 2,701 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ సీపీఐ(ఎం) మరింత వెనుకబడగా, బీజేపీ ఏకంగా నాలుగో స్థానానికి పరిమితమైంది. ముర్షిదాబాద్ జిల్లాలో ఒకప్పుడు కేవలం టీఎంసీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఉన్న ద్విముఖ పోరు.. ఇప్పుడు బహుముఖ పోటీగా మారిందని ఈ రెండు స్థానాల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మైనారిటీలు, గ్రామీణ ఓటర్లపై టీఎంసీకి ఉన్న పట్టు సడలడమే ఈ పరిణామాలకు ప్రధాన కారణం.ఓట్ల చీలికతో.. కాంగ్రెస్కు కలిసొచ్చిన కాలంటీఎంసీ ఓటు బ్యాంకు చీలిపోవడం కాంగ్రెస్కు పరోక్షంగా లాభించింది. అధికార పార్టీకి దూరమైన ఓట్లన్నీ నేరుగా బీజేపీకే వెళ్లిపోలేదు. ఆ ఓట్లు విడిపోయి, స్థానికంగా సంస్థాగత బలం ఉన్న చిన్న పార్టీలకు, ముఖ్యంగా కాంగ్రెస్కు మళ్లాయి. దీనిని కాంగ్రెస్ వైపు వీచిన గాలి అనడం కంటే, టీఎంసీ పతనంతో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేసే ప్రక్రియ అనడం వాస్తవం. అధికార పార్టీ బలహీనపడటం వల్ల బీజేపీ విస్తరణకు మార్గం సుగమం అయినప్పటికీ, ఏకకాలంలో కాంగ్రెస్కు కొన్ని చోట్ల అనుకూల వాతావరణం ఏర్పడింది.అధిర్ రంజన్ ఇలాకాలో.. అనూహ్య పరిణామంరాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఓటు శాతం కేవలం 3 శాతానికి అటూఇటుగా ఉన్నప్పటికీ, మైనారిటీ ప్రాబల్య ప్రాంతాల్లో ఆ పార్టీ ప్రభావం తీవ్రంగా కనిపించింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరికి కంచుకోటగా ఉన్న బహరంపూర్లో బీజేపీ నిర్ణయాత్మక విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవగా, టీఎంసీ మరింత బలహీనపడి కిందకు పడిపోయింది. చౌదరికి ఇది వ్యక్తిగతంగా పెద్ద ఎదురుదెబ్బ అయినప్పటికీ, అధికార వ్యతిరేక ఓటును ఆకర్షించడంలో కాంగ్రెస్ ద్వితీయ ప్రత్యామ్నాయంగా నిలిచిందని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.‘ఇండియా’ కూటమిలో.. మమతకు తగ్గిన పట్టుపశ్చిమ బెంగాల్లో టీఎంసీ పతనం కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాలేదు, ‘ఇండియా’ కూటమిలోని అంతర్గత సమీకరణలను కూడా సమూలంగా మార్చేసింది. బీజేపీని ధీటుగా ఎదుర్కోగలిగేది ప్రాంతీయ పార్టీలేనని, ప్రతిపక్షాలకు నాయకత్వం వహించే సత్తా కాంగ్రెస్కు లేదని ఇన్నాళ్లూ మమతా బెనర్జీ బలంగా వాదిస్తూ వచ్చారు. అయితే తన సొంత నియోజకవర్గం భవానీపూర్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీకి ఎదురైన పరాభవం కూటమిలో ఆమె ప్రభావాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.పునర్వైభవం కాదు.. మనుగడకు మార్గంమమత పరాజయంతో ఇండియా కూటమిలో నాయకత్వ పోరు తగ్గుముఖం పట్టి, కూటమి పగ్గాలపై కాంగ్రెస్కు పరోక్షంగా మరింత స్వేచ్ఛ లభించింది. అయితే, బెంగాల్ ఫలితాలను కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి పునర్వైభవంగా భావించడానికి వీల్లేదు. రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ పతనంతో లబ్ధి పొంది బీజేపీ ప్రధాన ప్రత్యామ్నాయంగా స్థిరపడింది. అయితే, ముర్షిదాబాద్లో లభించిన విజయాలు కాంగ్రెస్ ఉనికికి ఊపిరిపోశాయి. బెంగాల్ రాజకీయ చిత్రం నుంచి దాదాపు కనుమరుగైపోయిన ఒక జాతీయ పార్టీకి, ఫరక్కా, రాణినగర్ ఫలితాలు లబ్ధి చేకూర్చాయని నిపుణులు అంటున్నారు.ఇది కూడా చదవండి: కామ్రేడ్లకు భారీ షాక్.. చివరి కోట పతనం! -
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు దిశగా టీవీకే విజయ్
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు దిశగా టీవీకే చీఫ్ విజయ్ అడుగులు వేస్తున్నారు. పార్టీ అభ్యర్థులకు విజయ్ కీలక ఆదేశాలు ఇచ్చారు. అభ్యర్థులంతా చెన్నై రావాలని పిలుపు ఇచ్చారు. ట్రెండ్ ప్రకారం మ్యాజిక్ ఫిగర్ 118కి చేరువలో టీవీకే ఆగిపోనుంది.సోమవారం రాత్రి 8 గంటల నాటికి 70 స్థానాల్లో గెలిచి మరో 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ మార్క్ రాకపోతే ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నదానిపై విజయ్ చర్చలు జరుపుతున్నారు. విజయ్కు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్, పీఎంకే సిద్ధంగా ఉన్నాయి. తమిళనాడులో అతిపెద్ద పార్టీగా విజయ్ టీవీకే అవతరిస్తోంది. మరోవైపు, కాసేపట్లో తమిళనాడు సీఎం స్టాలిన్ గవర్నర్ను కలవనున్నారు. సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. కాంగ్రెస్ ఇప్పటికే విజయ్కు మద్దతు ఇస్తామన్న సంకేతాలు పంపింది. అలాగే టీవీకే పార్టీతో అధికారాన్ని పంచుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని విజయ్ తండ్రి చంద్రశేఖర్ సూచించారు. ఎన్నికల ముందు దశలో టీవీకే.. ఎఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ, డీఎంకే రెండింటితోనూ కూటములను పూర్తిగా తిరస్కరించింది.అయితే, మెజారిటీ మార్కు దాటేందుకు టీవీకేకు చిన్న ద్రావిడ పార్టీల మద్దతు అవసరం కావచ్చు. తమిళనాడుకు ఎంజీఆర్ వంటి సినీ తారలను నాయకులుగా ఎన్నుకున్న దీర్ఘ చరిత్ర ఉంది. ఇప్పుడు ఆ జాబితాలో విజయ్ కూడా చేరారు. -
కేరళ సీఎం ఎవరు?.. శశి థరూర్ షాకింగ్ ఆన్సర్
కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ‘ఎన్డీటీవీ’తో సంచలన విషయాలు పంచుకున్నారు. కేరళ ఓటర్లు స్పష్టమైన మార్పు కోరుకున్నారని, ఏప్రిల్ 9న జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ అస్తవ్యస్త పాలనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారని ఆయన పేర్కొన్నారు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) సునాయాసంగా మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. కేరళకు కాబోయే తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఉత్కంఠ రేపుతున్న సీఎం రేసుతదుపరి ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారన్న ప్రశ్నకు థరూర్ చాలా ఆసక్తికరమైన రీతిలో బదులిచ్చారు. ‘నిజం చెప్పాలంటే ఆ విషయంపై నాకు ఎలాంటి క్లూ లేదు. మా పార్టీలో సీఎం ఎంపికకు ఒక పద్ధతి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు పంపే పరిశీలకులు.. ముందుగా గెలిచిన ఎమ్మెల్యేలతో చర్చిస్తారు. ఆ తర్వాతే కాంగ్రెస్ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుంది. మా వద్ద సమర్థులైన నేతలు చాలా మంది ఉండటం పార్టీకి శుభపరిణామం’ అని థరూర్ అన్నారు.అధికార పార్టీపై తీవ్ర ప్రజా వ్యతిరేకతపాలక పక్షంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని థరూర్ పేర్కొన్నారు. ‘కొందరు మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా జనాదరణ కలిగి ఉన్నప్పటికీ, ప్రజలు వారిని తిరస్కరించారు. మళ్లీ వారికి ఓటేస్తే పాత తప్పుడు పాలనే కొనసాగుతుందని ప్రజలు గ్రహించారు. ఇది ఓటర్ల పరిపక్వతకు నిదర్శనం. ఊహించిన దానికంటే ఎంతో మెరుగైన ఫలితాలు వచ్చాయి’ అని ఆయన హర్షం వ్యక్తం చేశారు.99 సీట్లతో కాంగ్రెస్ చారిత్రక రికార్డ్కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మెజారిటీ దిశగా దూసుకుపోతోందని థరూర్ ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 99 స్థానాల్లో యూడీఎఫ్ ఆధిక్యంలో కొనసాగుతోందని, చాలా కాలం తర్వాత కేరళలో ఈ స్థాయి భారీ విజయం దక్కడం ఒక ‘అద్భుతమైన ఫలితం’ అని ఆయన పేర్కొన్నారు. ఈ విజయంపై అధికారిక ప్రకటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని థరూర్ పేర్కొన్నారు. -
అస్సాంలో కాంగ్రెస్ అలర్ట్.. ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నం?
డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంట్డౌన్ సమీపిస్తున్న తరుణంలో రాజకీయ రసవత్తర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మే 4న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో, తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కొట్టిపారేస్తూ, అస్సాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని ధీమా వ్యక్తం చేస్తోంది. బీజేపీ వల నుంచి అభ్యర్థులను కాపాడేందుకు ట్రబుల్ షూటర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ సహా సీనియర్ నేతలను హుటాహుటిన రంగంలోకి దించింది.కాంగ్రెస్ క్యాంపులోకి బీజేపీ వల?ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బీజేపీ తమ అభ్యర్థులను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తోందని డీకే శివకుమార్ ఆరోపించారు. శనివారం గౌహతిలో జరిగిన ఆరు పార్టీల ప్రతిపక్ష కూటమి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు మార్పు కోరుకున్నారని, తమ అభ్యర్థులను కాపాడుకోవడానికి తాము పూర్తి అప్రమత్తంగా ఉన్నామని స్పష్టం చేశారు. బీజేపీకి గెలుపుపై నమ్మకం ఉంటే తమ నేతలను ఎందుకు సంప్రదిస్తుందని ఆయన సూటిగా ప్రశ్నించారు.ఎగ్జిట్ పోల్స్ అబద్ధం.. 75 సీట్లు మావే!ఎన్డీఏ కూటమికి 88 నుంచి 100 స్థానాలు వస్తాయన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఎగ్జిట్ పోల్స్ కేవలం అధికారులపై, ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చేందుకేనని విమర్శించారు. ప్రతిపక్ష కూటమి కచ్చితంగా 70 నుంచి 75 స్థానాలు (మొత్తం 126 సీట్లలో) గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ రోజున అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున, ఢిల్లీ, గౌహతిలలో ప్రత్యేక లీగల్ సెల్స్ ఏర్పాటు చేసినట్లు శివకుమార్ తెలిపారు.సీఎం రేసులో గౌరవ్ గొగోయ్?అస్సాం ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించారని, రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ తేల్చి చెప్పారు. మరోవైపు, రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ మాట్లాడుతూ.. కూటమికి 70కి పైగా సీట్లు వస్తాయని, గౌరవ్ గొగోయ్ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ఎన్డీఏ గ్రాఫ్ పడిపోతోందని అస్సాం జాతీయ పరిషత్ అధ్యక్షుడు లూరిన్జ్యోతి గొగోయ్ సైతం వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్కు మళ్లీ అధికారం కల్ల
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో భూ కుంభకోణాలు, అరాచకాలు మినహా ప్రజలకు చేసిందేమీ లేదు. ఆ పార్టీ అరాచకాలు చూసి ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ప్రజలు వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేసే అవకాశం లేదు. ఆ పార్టీ మరో 20 ఏళ్ల వరకు అధికారంలోకి రావడం కల్ల’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి అడ్డగోలుగా పెరిగిపోయింది. అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కమిషన్లు, కాసుల కక్కుర్తి కోసమే చూస్తుంది. మంత్రులే స్వయంగా రంగారెడ్డి జిల్లాలో భూముల ఆక్రమణతోపాటు మైనింగ్ కుంభకోణాలకు పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది. అడ్డగోలుగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలను మోసం చేసింది’అని దుయ్యబట్టారు. శనివారం నందినగర్లోని తన నివాసంలో ఉమ్మడి రంగారెడ్డిజిల్లా నేతలతో కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలతోపాటు పార్టీని బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణ, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎక్కడికక్కడ నిరసనలు: ‘ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ విధంగా ఉంటే, మరోవైపు కేంద్రంలోని బీజేపీ అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోంది. వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా రూ.వెయ్యి పెంచింది. అడ్డగోలుగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ వస్తున్న బీజేపీ నిర్వాకం వల్ల ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ అడ్డగోలు నిర్ణయాలపై బీజేపీకి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. మరోసారి ఈ ధరలు పెంచకుండా ఉండేందుకు ప్రజలను జాగృతం చేయాలి’అని కేటీఆర్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం త్వరలో జరగనున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, తర్వాత జరిగే కమిటీల నిర్మాణంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను కేటీఆర్ పార్టీ నేతలకు వివరించారు. ‘రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో బీఆర్ఎస్ చురుకైన పాత్ర పోషించబోతోంది. కాంగ్రెస్, బీజేపీ చేసే అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది. ప్రతీ ఒక్క యువతీ, యువకుడికి ఓటు హక్కు కల్పించాలి. కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు నమోదు చేయకుండా చూడాలి. కాంగ్రెస్, బీజేపీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఓట్లు తొలగించే ప్రమాదం ఉంది. ప్రజల ఓటు హక్కుకు బాధ్యతగా భరోసాగా నిలవాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు త్వరలో మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఆ ఎన్నికలకు సమాయత్తం కావాలి’అని కేటీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. -
జనంపై ‘ఎన్నికల బిల్లు’
న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల ధర పెంపుపట్ల కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అధికార పార్టీకి ఎన్నికల సమయంలో మాత్రమే సామాన్య ప్రజలు గుర్తుకు వస్తారని, ఆ తర్వాత వారి మానాన వారిని వదిలేస్తారని మండిపడింది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర పెంపు ఒక ‘ఎన్నికల బిల్లు’అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. తరువాతి బాదుడు పెట్రోల్, డీజిల్పై ఉంటుందన్నారు. ఎన్నికల తర్వాత ద్రవ్యోల్బణం వేడి తగులుతుందని తాను ముందే హెచ్చరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘ఈ రోజు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర రూ.993 పెరిగింది. అతిపెద్ద పెంపు ఇదే. ఇది ఒక ఎన్నికల బిల్లు. కేవలం మూడు నెలల్లో రూ.1,380 పెరిగింది, ఇది 81% పెరుగుదల. టీ స్టాళ్లు, ధాబాలు, హోటళ్లు, బేకరీలు, స్వీట్ షాపులు, రెస్టారెంట్లు ప్రతి వంటగదిపై భారం పెరిగింది. ఇది అనివార్యంగా సాధారణ ప్రజలపై ప్రభావం చూపుతుంది’అని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ధరలు పెంచబోమని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోయారని ఎద్దేవా చేశారు. వాణిజ్య సిలిండర్లపై దాదాపు రూ.1000 భారీ పెంపు, జీవనాధారం కోసం చిన్న భోజనశాలలపై ఆధారపడే కోట్లాది మంది భారతీయులను ప్రభావితం చేస్తుందని, కోట్లాది మంది ఈ పెంపు భారాన్ని మోయవలసి వస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందన్నారు. ఏప్రిల్ 29న అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని రాహుల్ గాంధీ ముందే హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉండటాన్ని ప్రభుత్వం సొమ్ము చేసుకుందని, ధరలు పెరుగుతున్నందున ఇప్పుడు ఆ భారాన్ని ప్రజలపై మోపాలని చూస్తోందని ఆయన విమర్శించారు. ‘ఎన్నికల ఉపశమనం ముగిసింది. ద్రవ్యోల్బణం వేడి రాబోతోంది! ఏప్రిల్ 29 తర్వాత జాగ్రత్త – పెట్రోల్, డీజిల్, ప్రతీదీ ఖరీదైపోతుంది. ముడిచమురు చౌకగా ఉన్నప్పుడు మోదీ ప్రభుత్వం లాభాలను జేబులో వేసుకుంది. ఇప్పుడు అది ఖరీదై, ఆ భారాన్ని మీపై మోపుతుంది’అని రాహుల్ గాంధీ మంగళవారం ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. -
ఇది మోదీ మేడే గిఫ్ట్, కుంభకర్ణుడిలా రేవంత్..: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్లు కార్మికుల సంక్షేమాన్ని విస్మరించాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. మే డే సందర్బంగా శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రూపాయి విలువ పాతాళానికి.. గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. హోటల్ కార్మికులకు మే డేన మోదీ ఇచ్చిన గిఫ్ట్ ఇది. 80 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కమర్షియల్ సిలిండర్ల ధరలు పెంచారు. ఎన్నికలయ్యాక ధరలు పెంచడం మోదీ ప్రభుత్వానికి అలవాటేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కార్మికుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల కోసం మంచి చేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డికి ఏ కోశాన కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు దానవీర శూరకర్ణ.. ఎన్నికల తర్వాత కుంభకర్ణ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి మొద్దునిద్ర పోతున్నారు. సిగాచి ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే.. బాధిత కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదు. హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నిస్తే.. దిగజారి బూతులు మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు జేమ్స్ బాండ్ లెక్క బాండు పేపర్లు ఎందుకు రాశారు? అంటూ రేవంత్ సర్కార్పై కేటీఆర్ ధ్వజమెత్తారు. -
‘రీయింబర్స్మెంట్’లో కీలక మార్పు
సాక్షి, హైదరాబాద్: పోస్టు మెట్రిక్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో కీలక మార్పు చోటు చేసుకుంది. ఇప్పటివరకు కాలేజీల బ్యాంకు ఖాతాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని జమ చేస్తున్న ప్రభుత్వం.. ఇకపై ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్(ఏపీబీఎస్) ద్వారా నేరుగా విద్యార్థి వ్యక్తిగత బ్యాంకు ఖాతాకే డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) విధానంలో ఫీజు మొత్తాన్ని బదిలీ చేయనుంది. వాస్తవానికి 2024–25 విద్యా సంవత్సరం నుంచే ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేర డీబీటీ పద్ధతిలోనే ఫీజును చెల్లిస్తుండగా..తాజాగా ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగ విద్యార్థులకు కూడా డీబీటీ పద్ధతిలోనే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ ఉత్తర్వులు (జీఓఎంఎస్ నం.7) జారీ చేశారు. కొత్త విధానాన్ని 2026–27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులకు వైఎస్ భరోసా.. పేదరికం కారణంగా విద్యార్ధులు ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో 2008లో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే విద్యార్థికి ఇచ్చే మొత్తాన్ని కాలేజీ బ్యాంకు ఖాతాలో జమ చేసేలా అప్పట్లో అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. తద్వారా కాలేజీ యాజమాన్యాల నుంచి విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి పడకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ నిబంధన విధించారు. అంతేకాకుండా ఫీజుల విషయంలో కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వ అజమాయిషీలో ఉంటాయని భావించారు. విద్యార్థి ఖాతాలోనే వేయాలన్న కేంద్రం కాలక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను తొలగించాలని, విద్యార్థి ఖాతాలోనే ఫీజును జమ చేయాలని సూచించింది. అప్పుడే తమ వాటా నిధులు వాటా విడుదల చేస్తామనే మెలిక పెట్టింది. కానీ గత ప్రభుత్వం ఈ నిబంధనకు ఒప్పుకోలేదు. దీంతో దాదాపు 4 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్ నిలిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ వాటాను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో తొలుత ఎస్సీ విద్యార్థులకు డీబీటీ పద్ధతిలో ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం పలు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని నేరుగా విద్యార్థులకే ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది.ప్రతి కాలేజీలో ప్రత్యేక నోడల్ అధికారి – విద్యార్థుల ప్రోగ్రెస్ ట్రాకింగ్ కోసం ఈపాస్లో ప్రత్యేక మాడ్యూల్ రూపొందించాలి. – స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కోసం ప్రతి కాలేజీలో ఒక నోడల్ అధికారిని నియమించాలి. – ఆధార్ ఆధారిత హాజరు వ్యవస్థను తప్పనిసరిగా అమలు చేయాలి. – ఆన్లైన్ దరఖాస్తు తర్వాత విద్యార్థులు హార్డ్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. డాక్యుదమెంట్లు డిజిటల్గా అప్లోడ్ చేయాలి. బకాయిల చెల్లింపు పాత విధానంలోనే.. – జిల్లా సంక్షేమ అధికారి డిజిటల్ వెరిఫికేషన్ తర్వాత స్కాలర్షిప్ మంజూరు చేస్తారు. – డీబీటీ అమలు కారణంగా అడ్మిషన్ సమయంలో కాలేజీలు ఫీజులు డిమాండ్ చేయకూడదు. విద్యార్థి డీబీటీ పద్ధతిలో వచ్చిన డబ్బుతో ఫీజు చెల్లించాలి. – ఈ మార్గదర్శకాలు 2026–27 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా అడ్మిషన్ పొందిన వారికి వర్తిస్తాయి. – 2025–26 వరకు ఉన్న బకాయిలు పాత విధానంలోనే చెల్లిస్తారు. – సంబంధిత సంక్షేమ శాఖల కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు ఈపాస్, ఐఎఫ్ఎంఐఎస్, పీఎఫ్ఎంఎస్ వ్యవస్థల్లో అవసరమైన మార్పులు చేయాలి. ఫీజుల చెల్లింపుపై అస్పష్టత ⇒ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నిబంధనల్లో మార్పులతో ఇకపై విద్యార్ధి తాను చదువుతున్న కోర్సు ఫీజును నేరుగా చెల్లించాల్సి ఉంటుంది. డీబీటీ పద్ధతిలో విద్యార్ధి ఖాతాకు ఫీజు మొత్తం జమ అయిన తర్వాత.. ఆ మొత్తాన్ని కాలేజీలో చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఈ విషయంలో కాలేజీల యాజమాన్యాలు ఎలాంటి ఒత్తిడి చేయొద్దని స్పష్టం చేసింది. అయితే ఫీజు డబ్బులను ప్రభుత్వం ఎప్పటిలోగా విద్యార్ధి ఖాతాకు జమ చేస్తుందో అనే అంశంపై స్పష్టత లేదు. వాస్తవానికి కోర్సు ప్రారంభ సమయంలోనే కాలేజీలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు అందిన తర్వాత చెల్లిస్తానంటే యాజమాన్యం అనుమతించే పరిస్థితి ఉంటుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తాజా మార్పులు విద్యార్ధిని గురి చేస్తాయా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆటోమేటిక్ రెన్యువల్.. ⇒ ఆధార్ లింక్ చేసిన విద్యార్థి బ్యాంక్ ఖాతాకే స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం ఏ పీబీఎస్ ద్వారా డీబీటీ పద్ధతిలో జమ చేయాలి. ⇒ దరఖాస్తు సమయంలో ఆధార్ వివరాలు ఈకేవైసీ ద్వారా ధ్రువీకరించాలి. ఏదైనా లోపం ఉంటే విద్యార్థి సరిచేయాలి. ⇒ ఈపాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేస్టేషన్ కోసం బయోమెట్రిక్ ధ్రువీకరణ తప్పనిసరి. ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతా మాత్రమే సమర్పించాలి. ⇒ బ్యాంక్ ఖాతా వివరాలు ఎన్పీసీఐ ద్వారా ధ్రువీకరించాలి. లోపాలుంటే వెంటనే సరిచేయాలి. ⇒ కులం, ఆదాయం, నివాస ధ్రువపత్రాలు మీసేవ ద్వారా ఆధార్తో లింక్ చేయాలి. ⇒ రెన్యువల్ అప్లికేషన్లు ఆటోమేటిక్గా కొనసాగుతాయి. కాలేజీలు ధ్రువీకరించి జిల్లా అధికారులకు పంపాలి. -
రామంతాపూర్లో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
మేడ్చల్ జిల్లా: రామంతాపూర్లో శ్రీ శ్రీ శ్రీ మహాంకాళమ్మ దేవాలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది విగ్రహా ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి గారు హాజరయ్యారు.ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారుకార్యక్రమంలో దేవాలయం కమిటీ సభ్యులు భీష్మ గౌడ్ గారు,సంజీవ్ రెడ్డి గారు,నాగేందర్ గారు,తాఫిక్,రఫీక్,వాళ్ళపు శ్రీకాంత్ యాదవ్,,గణేష్ నాయక్,అరుణ్ పటేల్,సందీప్,భాస్కర్ షాగా శ్రీధర్,ముత్యాల బాబు,ఎస్ జంగయ్య,కృష్ణ,ఎం జంగయ్య,ముత్యాల బాబు,సత్తి అన్న,సచిన్,నయీం,యోగి విశాల్,పాల్గొన్నారు -
ఈ ఎన్నికలతో బీజేపీ పతనం మొదలైంది
-
అస్సాంలో మరోసారి బీజేపీదే అధికారం
డిస్పోర్: అసోం అసెంబ్లీ ఎన్నికలపై యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేసింది. ఈ ఎగ్జిట్స్ పోల్స్లో మరోసారి బీజేపీ అధికారంలోకి రానున్నట్లు తెలిపింది. యాక్సిస్ మై ఇండియాతో పాటు ఇతర సర్వే సంస్థలన్నీ బీజేపీకే పట్టం కట్టాయి. బీజేపీ-ఏపీజీ-బీపీఎఫ్ కూటమి 88 నుండి 100 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పోల్స్ సూచించాయి. ఇందులో బీజేపీ 70-80 స్థానాలు, ఏజీపీ 7-9 స్థానాలు, బీపీఎఫ్ 9-11 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఎన్డీఏ మొత్తం ఓటు శాతం 48శాతంగా అంచనా వేయబడింది. బీజేపీకి 37శాతం, ఏజీపీకి 7శాతం,బీపీఎఫ్కికి 4శాతం ఓట్లు లభించే అవకాశం ఉందని పోల్స్ తెలిపాయి.కాంగ్రెస్ కూటమి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి 24 నుండి 36 స్థానాలకు పరిమితం అవుతుందని అంచనా.కాంగ్రెస్ పార్టీకి 22-30 స్థానాలు వచ్చే అవకాశం ఉంది.మిగతా మిత్రపక్షాలు: రైజోర్ దల్ 1-4 స్థానాలుఏజీపీ 1-2 స్థానాలుసీపీఐ(ఎం) 0-1 స్థానాలుఐఎన్డీ0-2 స్థానాలుఎన్డీఏలో బీజేపీ 90 స్థానాలు, ఏజీపీ 26 స్థానాలు, బీపీఎఫ్ 11 స్థానాలు పోటీ చేసింది.కాంగ్రెస్ 99 స్థానాలు, రైజోర్ దల్ 13 స్థానాలు,ఏజీపీ 10 స్థానాలు పోటీ చేశాయి.ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏ మరోసారి అసోంలో అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. తుది ఫలితాలు విడుదల తర్వాతే అధికారం ఎవరిదనేది తేలనుంది. -
వివాహేతర సంబంధం.. పోక్సో కేసుతో చిక్కుల్లో ఆనంద్ నాయుడు
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ నాయకుడు రెచ్చిపోయారు. తన ప్రేయసి.. పిల్లలపై(మైనర్లు) సదరు కాంగ్రెస్ నేత దాడి చేసిన విషయంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో, ఆమె భర్త.. ఈ విషయమై పోలీసులను ఆశ్రయించడంతో పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతోంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు ఉత్తర జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ప్రధాన కార్యదర్శి ఆనంద్ నాయుడు.. గత మూడు, నాలుగు సంవత్సరాలుగా ఒక వివాహితతో సంబంధంలో ఉన్నాడు. వీరిద్దరి సంబంధంపై ఆమె పిల్లలు వారిని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆగ్రహంతో రగిలిపోయిన ఆనంద్.. వారిని చితకబాదాడు. ఇనుప రాడ్తో పిల్లలపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో, వారికి గాయాలయ్యాయి.అనంతరం, ఇంటికి వచ్చిన ఆమె భర్త.. పిల్లల గాయాలు చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. దీంతో, ఆనంద్, తన భార్య మధ్య ఉన్న సంబంధం బహిర్గతమైంది. వెంటనే తేరుకున్న బాధితులు.. స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఆనంద్ నాయుడు.. తన పిల్లల కాళ్లు, చేతులు, శరీరంలోని ఇతర భాగాలపై రాడ్లతో కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడి ఆరోపణలను పిల్లలు కూడా ధృవీకరించినట్లు సమాచారం. అనంతరం, పోలీసులు పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా తన అనుమతి లేకుండా తన భార్య, నాయుడు ఆస్తిని బదిలీ చేశారని బాధితుడు ఆరోపించారు. దర్యాప్తు అధికారులు కేసులోని అన్ని కోణాలను పరిశీలిస్తున్నారని తెలిపారు.Congress MLA assaults minors with rod for questioning his extra-marital affair in KarnatakaAnand Naidu, the general secretary of Bengaluru North District Congress Committee, has been booked under the POCSO Act for allegedly assaulting two minors with a rod. pic.twitter.com/Bnq6WukHmZ— monkey. D. luffy (@luffy_735) April 29, 2026 -
ఏ ఒక్క ఐపీఎస్ అధికారిని వదిలిపెట్టం: హరీష్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకే తమ ఫోన్లు ట్యాపింగ్, తమ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలు హ్యాకింగ్ చేస్తున్నారని అన్నారు. హ్యాకింగ్కి పాల్పడుతున్న ఏ ఒక్క ఐపీఎస్ అధికారిని వదిలిపెట్టమని హరీష్ హెచ్చరించారు.మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లీగల్గా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తున్నందుకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చాకా విచారణ జరిపిస్తాం. హ్యాకింగ్కి పాల్పడుతున్న ఏ ఒక్క ఐపీఎస్ అధికారిని వదిలిపెట్టం. చట్టానికి లోబడి ఫోన్ ట్యాపింగ్ చేయండి. కొంతమంది పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి దగ్గర అవ్వాలని, పదోన్నతులు పొందాలని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రధాని మోదీ ఇక్కడ సభలు పెట్టడం కాదు.. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టులను ప్రకటించాలి’ అని డిమాండ్ చేశారు.ఇక, అంతకుముందు.. తెలంగాణలో పంటల కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ బహిరంగ లేఖ రాశారు. అందులో..‘ఎన్నికల వేళ చెప్పిందొకటి.. అధికారంలోకి వచ్చాక చేసేదొకటి. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్. తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి.. వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి చూడు. కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా ఇంకా కొనుగోళ్లు ఎందుకు మొదలుపెట్టలేదు?. మిల్లుల దగ్గర కూడా బస్తాకు కిలో, రెండు కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఎండలో రైతులు మాడిపోతున్నా ప్రభుత్వానికి సోయి లేదా?. మాట ఇచ్చిన ప్రకారం సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ వెంటనే ధాన్యం డబ్బులతో పాటే ఇవ్వాలి అని పేర్కొన్నారు. -
ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం..!
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్న సైన్యంగా పని చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్ల కవ్వింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు.కాప్రా సర్కిల్ కు చెందిన సీనియర్ బాబురావును ఆయన నివాసం కందిగూడలో పరమేశ్వర్ రెడ్డి గారు పరామర్శించారు.సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతోనే ఉప్పల్ నియోజకవర్గానికి కావాల్సిన నిధులను తెస్తూ అభివృద్ధి పనులను చేపడుతున్నట్టుగా ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గానికి నిధులు తెచ్చినా, అభివృద్ధి పనులను చేపట్టినా ఆ ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందన్నారు. కొందరు అభివృద్ధి పనుల విషయంలో వారి ఉనికి కోసం చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని ,కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు చెప్పాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సింగి రెడ్డి ధన్పాల్ రెడ్డి గారు,స్వర్ణరాజ్ శివమణి గారు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొత్త అంజి రెడ్డి గారు,రాజేందర్ గారు,డివిజన్ అధ్యక్షులు నాగ శేషు గారు,జిల్లా కార్యదర్శి దండళ్ల మురళి గారు,పవన్ గారు,అజీజ్,తన్నీరు శ్రీహరి,మల్ల రెడ్డి,నాగరాజు,తోటకూర శ్రీకాంత్,శ్రీకాంత్ గౌడ్,సత్యనారాయణ,పూర్ణ యాదవ్,రాజు,లింగం,టిల్లు యాదవ్,రాజన్,గుణశేఖర్ గారు,రోకేష్ యాదవ్,శివ,రమాకాంత్ రెడ్డి, ముర్తుజా,షేక్ చోటు బై,షాబుద్దీన్,ఆరిఫ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు -
దక్షిణాదికి ద్రోహం చేసిన విపక్షాలు
‘‘నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ. ఇది ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడానికీ, ప్రతి పౌరుడి ఓటుకు సమాన విలువను కల్పించడానికీ ఉద్దేశించినది. జనాభా మార్పులకు అనుగుణంగా ప్రజల గొంతుక పార్లమెంటులో బలంగా వినిపించాలంటే డీలిమిటేషన్ అవసరం. ఏ ఒక్క రాష్ట్రానికి, ముఖ్యంగా జనాభా నియంత్రణలో ఆదర్శంగా నిలిచిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వబోం. సమాఖ్య స్ఫూర్తిని కాపాడుతూనే, మహిళలకు రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యం.’’ పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేసిన స్థిర సంకల్పం ఇది. కానీ ఏం జరిగింది? మోదీని ఓడించామన్న వికృతానందం కోసం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలు ఓడించాయి. వారు చెప్పింది దక్షిణాదికి అన్యాయం జరగకుండా చేశామని! వాస్తవంలో దక్షిణాదికి అన్యాయం చేశారు. జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరిగితే దారుణంగా నష్టపోయేది దక్షిణాదినే. ఏ మాత్రం నిష్పత్తి తగ్గకుండా, పార్లమెంట్ సీట్లు పెంచే 50 శాతం ఫార్ములాను కాలదన్నిన కాంగ్రెస్ తీరుతో దక్షిణాది సమస్యలను ఎదుర్కోబోతోంది. భారతదేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేయగల ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు గతంలోనే పార్లమెంటులో ఆమోదం పొందింది. ఇప్పుడు మళ్లీ ఎందుకని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆనాటి బిల్లులో లోక్సభ సీట్ల పునర్విభజన తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ఉంది. అప్పటివరకూ ఆగకుండా ముందుగానే దక్షిణాదికి న్యాయం చేస్తూ డీలిమిటేషన్ ద్వారా 2029లోనే మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే నియోజకవర్గాల పునర్విభజన అనివార్యమని చట్టం చెబుతోంది. ఈ ప్రక్రియను వివాదాస్పదం చేయడం ద్వారా విపక్షాలు దక్షిణాది గొంతు కోస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సంక్షోభంలో ప్రాతినిధ్య వ్యవస్థభారత ప్రజాస్వామ్య సౌధానికి పునాది వంటి ప్రాతినిధ్య వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 1973లో 31వ రాజ్యాంగ సవరణ ద్వారా ఖరారైన 543 లోక్సభ స్థానాల సంఖ్యను నాటి 54.8 కోట్ల జనాభా అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. అప్పట్లో సగటున ప్రతి 10 లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహించేవారు. గత ఐదు దశాబ్దాల్లో దేశ జనాభా దాదాపు మూడు రెట్లు పెరిగి 145 కోట్లకు చేరుకున్నా, పార్లమెంటులోని సీట్ల సంఖ్య స్తబ్ధుగా ఉండిపోయింది. దీనివల్ల నేడు ఒక్కో ఎంపీ సుమారు 26.70 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించాల్సి వస్తోంది. ప్రపంచంలోని మరే ఇతర ప్రజాస్వామ్య దేశంలోనూ ఒక ప్రజా ప్రతినిధిపై ఇంతటి జనాభా భారం లేదు. ఇది ఓటరుకు, ప్రతినిధికి మధ్య ఉండాల్సిన సాన్నిహిత్యాన్ని తగ్గించడమే కాకుండా, ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని కూడా నీరుగారుస్తోంది. 1976లో ఎమర్జెన్సీ కాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సీట్ల సంఖ్యను 2001 వరకు మార్చకూడదని స్తంభింపజేశారు. జనాభా నియంత్రణ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రాలు నష్టపోకూడదనేది నాటి ప్రధానఉద్దేశ్యం. ఆ తర్వాత 2002లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ గడువును మరో 25 ఏళ్లు పొడిగించి 2026 వరకు మార్చకూడదని నిర్ణయించారు. ఈ సుదీర్ఘ కాలంలో అనేక కొత్త జిల్లాలు, పట్టణాలు రూపుదిద్దుకున్నా, నియోజకవర్గాల సరిహద్దులు పెరిగిన జనాభాకు అనుగుణంగా విస్తరించకపోవడం వల్ల ఓటు విలువలో భారీ వ్యత్యాసాలు తలెత్తాయి. ఒక నియోజకవర్గంలో 15 లక్షల మంది ఓటర్లు ఉంటే, మరో చోట 30 లక్షల మంది ఉండటం ప్రాతినిధ్య సమానత్వానికి విరుద్ధం. ఈ స్తబ్ధతను బద్దలు కొట్టాల్సిన చారిత్రక ఆవశ్యకత ఏర్పడింది. 2026తో ఈ గడువు ముగియనుండటంతో, కొత్త జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన అనివార్యం. ఇది సీట్ల పెంపు మాత్రమే కాదు, ప్రజాస్వామ్య పునర్నిర్మాణ ప్రక్రియ.దక్షిణాదికి న్యాయం జరగాలంటే...మహిళా రిజర్వేషన్లు చట్టసభల్లో ఆమోదం పొందితే సరిపోదు. అవి క్షేత్రస్థాయిలో ఆచరణాత్మకంగా అమలు కావాలంటే శాస్త్రీయమైన పునర్విభజన ప్రక్రియ కీలకం. రాజ్యాంగంలోని 128వ సవరణ స్పష్టంగా చెబుతున్నట్లుగా, ఈ రిజర్వేషన్లు అమల్లోకి రావాలంటే ముందుగా జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి కావాలి. ఆ తర్వాతే డీలిమిటేషన్ కమిషన్ నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించాలి. ఏయే నియోజకవర్గాలను మహిళలకు రిజర్వ్ చేయాలి, వాటిని రొటేషన్ పద్ధతిలో ఎలా మార్చాలి అనే అంశాలు ఊహాజనితంగా కాకుండా, జనాభా లెక్కల ఆధారంగానే జరగాల్సి ఉంటుంది. ఈ క్రమానుగత ప్రక్రియను విస్మరించి రిజర్వేషన్లు అమలు చేయాలని చూడటం రాజ్యాంగబద్ధమైన చిక్కులకు దారితీస్తుంది. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాల్లోనే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే విపక్షాల వాదన ఆకర్షణీయంగా అనిపించినా, అది ఆచరణలో సమస్యలను సృష్టిస్తుంది. భారత సమాఖ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య సమతుల్యతను కాపాడటం, జనాభా నియంత్రణలో ఆదర్శంగా నిలిచిన రాష్ట్రాల ప్రయోజనాలను రక్షించడం ఇప్పుడు దేశం ముందున్న అతిపెద్ద సవాలు. ప్రస్తుతం మన పార్లమెంటులో సీట్ల కేటాయింపు 1971 జనాభా లెక్కల ఆధారంగా జరుగుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం, కేవలం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే, అది దక్షిణాది రాష్ట్రాల పాలిట రాజకీయ మరణ శాసనంగా మారుతుందనడంలో సందేహం లేదు. జనాభా విస్ఫోటనాన్ని అరికట్టడంలో విఫలమైన రాష్ట్రాలకు పార్లమెంటులో అధిక సీట్లు కేటాయించడం అంటే, క్రమశిక్షణతో వ్యవహరించిన దక్షిణాదిని శిక్షించడమే అవుతుంది. ఈ అసమానతను తొలగించడానికి 50 శాతం పెంపు ఫార్ములా ఏకైక పరిష్కార మార్గం. ఈ విధానం ప్రకారం, జనాభా పెరుగుదలతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సీట్లను నేరుగా 50 శాతం పెంచుతారు. దీనివల్ల రాష్ట్రాల మధ్య పొలిటికల్ రేషియో ఏమాత్రం మారదు. జనాభా లెక్కల ప్రకారం వెళ్తే తీవ్రంగా నష్టపోయే ఆంధ్రప్రదేశ్ (+13), తెలంగాణ (+9), తమిళనాడు (+20), కర్ణాటక (+14), కేరళ (+10) రాష్ట్రాలకు ఈ ఫార్ములా ద్వారా గణనీయమైన అదనపు సీట్లు లభిస్తాయి. ఇది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ అస్తిత్వానికి అసలైన రక్షణ కవచం. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కావాలన్నా ఈ పునర్విభజన ప్రక్రియ పూర్తి కావడం సాంకేతికంగా అవసరం. సీట్ల సంఖ్యను పెంచకుండా రిజర్వేషన్లు అమలు చేస్తే అది మరిన్ని చిక్కులకు దారితీస్తుంది. సీట్ల సంఖ్యను పెంచి, అందులో మహిళలకు సీట్లు కేటాయించడం ద్వారా అందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తర్కాన్ని అర్థం చేసుకోకుండా రాజకీయ విద్వేషంతో విపక్షాలు పునర్విభజనను అడ్డుకున్నాయి. జనాభా నియంత్రణ అనే దేశభక్తిని పాటించినందుకు దక్షిణాదికి రాజకీయ శిక్ష పడకుండా అడ్డుకోవాల్సిన చారిత్రక బాధ్యతను కాంగ్రెస్, డీఎంకే లాంటి పార్టీలు విస్మరించాయి.ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి వ్యాసకర్త బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు -
కవిత కొత్త పార్టీపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్ : కొత్త పార్టీని పక్కన పెట్టండి. ఉన్న పార్టీ ఉంటుందో.. ఊడుతుందో. బీఆర్ఎస్కు గతం ఉంది.. భవిష్యత్తు లేదు. కేసీఆర్ నా రాజకీయ ప్రత్యర్థి.. నాకు శత్రువు కాదు’ అని అన్నారు సీఎం రేవంత్రెడ్డి. రాష్ట్రంలో ఇటీవల రాజకీయ పరిణామాలపై ఆయన సోమవారం మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఆ చిట్చాట్లో మాజీ ఎమ్మెల్సీ కవిత ఏర్పాటు చేసిన కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్), బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కొత్త పార్టీ పక్కన పెడితే.. ఉన్న పార్టీ ఉంటుందో.. ఊడుతుందో. బీఆర్ఎస్కు గతం ఉంది. భవిష్యత్తు లేదు. ఇప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ నడుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నా రాజకీయ ప్రత్యర్ధి. శత్రువు కాదు’ అని వ్యాఖ్యానించారు. ప్రతి పనికి పర్సస్ ఉంటుంది.. పర్పస్ అయిపోయాక దాంతో పనేముండదు. కేసీఆర్ పార్టీ మనుగడ ముగిసింది. చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా మనిషి లేచి రాడు. బీఆర్ఎస్ పార్టీ చనిపోయిన శవంతో సమానం. బీఆర్ఎస్కు గతం ఉంది.. భవిష్యత్ లేదు.. ఉండదు. తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినా చెల్లింది. దాడులు చేసినా, అవమానించినా పడ్డారు.. ఇప్పుడు కూడా అలా ఉంటామంటే కుదరదు. పదేళ్ల అధికారంలో ఆహంభావం, అధికారం తలకెక్కింది.అహంకారం పెరగడంతో 2023లో బీఆర్ఎస్ను ఓడగొట్టారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్తో ప్రజలకు సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు పడే తాపత్రయం అంతా కుటుంబం కోసమే. కుటుంబ పంచాయితీల్లో వచ్చిన కొత్త సంస్థలను మాపై రుద్దకండి. ఒక్క చెరువు నుంచి వచ్చిన నీటికి రంగు రుచి మారదు. కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు అనగానే పరామర్శించా. అసెంబ్లీకి కేసీఆర్ వస్తే యోగక్షేమాలు కనుక్కున్నది నేను. హిందూ సమాజంలో కుటుంబ పెద్ద చనిపోతే వారసులకు వారసత్వం వస్తుంది. ఔరంగజేబు వారసత్వం కోసమే అందరినీ చంపేశాడు. ఒకరు చనిపోవాలని నేను ఎందుకు కోరుకుంటా. వాళ్లు చనిపోతే ఆ పార్టీ, ఆపార్టీ ఆస్తులు నాకు రావు. కేసీఆర్ నా రాజకీయ ప్రత్యర్థి. నాకు శత్రువు కాదు. 2023 నుంచి అన్నీ ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించాను. కేసీఆర్ మీద నాకు గెలుపు కొత్తకాదు’అని అన్నారు. -
ఏం జరగాలో అది జరుగుతోంది
బెంగళూరు: ఎప్పుడు ఏమి జరగాలో అది జరుగుతోంది, ఇకపై రాజకీయాల గురించి మీడియాతో మాట్లాడను, సమయం వచ్చినపుడు అదే తెలుస్తుంది అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఆయన ఆదివారం బెంగళూరులో సదాశివనగరలో నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘మాలో ఎలాంటి సమస్య లేదు. ఏ రాజకీయం కూడా లేదు. ఏమేమి తీర్మానం అయ్యాయో అవి అమల్లోకి వస్తాయి. ఎప్పుడు ఏమి చేయాలో దానిని పార్టీ చేస్తుంది. పార్టీపై విశ్వాసముంది’ అని అన్నారు. ముఖ్యమంత్రి పదవిలో చెరి సగం కాలం ఉండాలని సిద్దరామయ్య, తన మధ్య ఒప్పందం కుదిరిందని, దానిని అమలు చేయాలని డీకే డిమాండ్ చేస్తుండడం తెలిసిందే. డీకే మాటలను బట్టి సీఎం కురీ్చని మార్చడానికి హైకమాండ్ సిద్ధమైనట్లు సమాచారం. హైకమాండ్ మాట పాటిస్తాం ముఖ్యమంత్రి కుర్చీ మార్పుపై స్పందించిన ఆయన, మీకు ఈ విషయంలో గందరగోళంగా ఉండవచ్చు. హైకమాండ్ చెప్పినదానిని పాటిస్తామని నేను, సీఎం చెప్పాం. అదే ప్రకారంగా నడచుకొంటామని తెలిపారు. మే 15న తన పుట్టిన రోజుకు ఎవరూ కూడా ఫ్లెక్స్, బ్యానర్లను వేయరాదని కోరారు. రోడ్ల సౌందర్యాన్ని నాశనం చేయరాదని, అలాంటివారిపై జరిమానా విధించాలని కమిషనర్కు సూచించానని తెలిపారు. అంతర్గత రిజర్వేషన్లకు పరిష్కారం ఎస్సీ అంతర్గత రిజర్వేషన్లను తాము చెప్పినట్లు చేశామని బీజేపీ విమర్శల గురించి డీకే పేర్కొన్నారు. మాల, మాదిగ సముదాయాల్లో ముందు ఎవరికి, ఆ తరువాత ఎవరికి అనే ప్రశ్న గతంలో ఉండేది. దానిని పరిష్కారానికి దారిని కనిపెట్టామన్నారు. మాదిగ, మాల, లంబాణి, భోవి వర్గాలందరికీ న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం చేసిందన్నారు. 30, 40 ఏళ్ల నుంచి ఉన్న సమస్యను పరిష్కరించామని చెప్పారు. -
ప్రజా‘వాణి’ వినాలి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజలకు నమ్మకంగా ఉండేలా ప్రజావాణి సేవలు అందించాలి. ప్రతి ఫిర్యాదును నమోదు చేయాలి. సంబంధిత విభాగాలకు పంపించాలి. పరిష్కార పురోగతిని అర్జీదారునికి తెలియజేయాలి’అని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువు ఉండాలని, ఆలస్యం జరగకూడదని చెప్పారు. ఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్, పరిష్కారానికి ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫాం అభివృద్ధి చేయాలన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రియల్ టైమ్ మానిటరింగ్ ఉండాలని సూచించారు. డ్యాష్బోర్డ్ ద్వారా పరిష్కార పురోగతి తెలుసుకునే వీలుండాలని, ఎక్కడైనా ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని చెప్పారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీఎంఓ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఇకపై రెవెన్యూ డివిజన్ స్థాయికి, తర్వాత దశలో మండల స్థాయికి విస్తరించాలన్నారు. దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు, జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని చెప్పారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని స్థాయిల్లో అధికారులకు పూర్తి అధికారాలు ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుసటి రోజు 2023 డిసెంబర్ 8న మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో రాష్ట్ర స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. నాటి నుంచి ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. అన్ని శాఖల అధికారులు అక్కడికక్కడే ప్రజల అర్జీలు, దరఖాస్తులను స్వీకరించి వేగవంతంగా వాటిని పరిష్కరించే చర్యలు చేపడుతున్నా రు. జిల్లా స్థాయిలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతివారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు. పైఅధికారికి ఫిర్యాదు ఆటో ఎస్కలేషన్.. ప్రతిస్థాయిలో ప్రజావాణికి ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ, ప్రతి శాఖలో ప్రత్యేక ప్రజావాణి విభాగాలు ఏర్పాటు చేయాలన్నారు. ఒకస్థాయిలో పరిష్కారం కాకపోతే, పైస్థాయి అధికారికి అర్జీ అందేలా ఆటో ఎస్కలేషన్ వ్యవస్థను అమలు చేయాలని చెప్పారు. అవసరమైతే అప్పీల్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పెండింగ్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆలస్యమైతే అధికారులదే బాధ్యత అని చెప్పారు. ప్రజావాణి సేవలను వికేంద్రీకరించటంతో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో పెండింగ్ అర్జీల సంఖ్య తగ్గుతుందని, కింది స్థాయిలోనే కొన్ని పరిష్కరించే వీలుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. -
‘రేవంత్ పేరు చెప్పాలంటేనే మొహం తిప్పుకుంటున్నారు’
సాక్షి,హైదరాబాద్: దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు అంతా ముందుకు వస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆదివారం హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి పలువురు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో హుజూర్ నగర్లో భారీగా ఓట్లు వచ్చాయి. దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు అంతా ముందుకు వస్తున్నారు. హుజూర్నగర్లో గతంలో ఎమ్మెల్యే పార్టీ మారినా కార్యకర్తలు మారలేదు. కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. హుజూర్ నగర్ నియోజకవర్గంలో అనామకుడైన సైదిరెడ్డిని గెలిపించాం. 2023 శాసన సభ ఎన్నికల్లో ఓడిపోగానే పార్టీని వదిలిపెట్టి పోయారు. హుజూర్ నగర్లో దుర్మార్గమైన కాంగ్రెస్ వైఖరీని బీఆర్ఎస్ శ్రేణులు పోరాట స్పూర్తితో ఎదుర్కొంటున్నారు. సైదిరెడ్డి ఆయన సొంత ఊరులో సర్పంచ్ని గెలిపించుకోలేక పోయారు. ఆనాడు జలదృశ్యంలో గులాబీ జెండా ఎగిరింది. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగిరి 25 యేండ్లు పూర్తి చేసుకొని 26 వసంతంలోకి అడుగుపెడుతోంది. దేశంలో ఏ పార్టీకి లేని విశిష్టత ఒక్క బీఆర్ఎస్ పార్టీకే ఉంది.సీఎం రేవంత్రెడ్డికి ఐడెంటిటీ క్రైసిస్ ఉంది.. అందుకే కేసీఆర్ను విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి పేరును ఎవరూ గుర్తు పెట్టుకోవడం లేదు. రేవంత్ పేరు చెప్పాలంటేనే మొహం తిప్పుకుంటున్నారు. గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది. ఒక్కొక్క కాంగ్రెస్ నేత కమల్హాసన్ను మించి యాక్టింగ్ చేస్తున్నారు. వంద రోజుల్లోనే గ్యారెంటీలు అమలు చేస్తామని నమ్మించారు. బాండ్లు పేపర్లు రాసి, దేవుడి మీద ఒట్టు వేశారు. 420హామీలు, 13 డిక్లరేషన్లు ఏమయ్యాయి?. మాటలు ఆకాశన్నంటాయి.. చేసింది మాత్రం సున్నా.. కాంగ్రెస్కు ఓటేసి తప్పు చేశామని నల్గొండ రైతులు చెబుతున్నారు’అని తెలిపారు. -
‘దీదీ రాజ్యంలో ప్రజాస్వామ్యం ఖూనీ’.. రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో ఒక కాంగ్రెస్ కార్యకర్త హత్యకు గురికావడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదని, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) గూండారాజ్ నడుస్తోందని ఆరోపించారు.దారుణ హత్య.. ఆవేదనలో రాహుల్అసన్సోల్లో కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న దేబ్దీప్ ఛటర్జీ అనే కార్యకర్తను పోలింగ్ అనంతరం కొందరు దుండగులు దారుణంగా కొట్టి చంపారు. ఈ ఉదంతంపై ‘ఎక్స్’ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ.. ఇదొక అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. ఛటర్జీ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన, అధికార టీఎంసీ పార్టీకి చెందిన గూండాలే పక్కా ప్రణాళికతో ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపించారు. कांग्रेस के कार्यकर्ता देबदीप चटर्जी की चुनाव बाद TMC से जुड़े गुंडों द्वारा की गई हत्या बेहद निंदनीय है। शोकाकुल परिवार के प्रति मेरी गहरी संवेदनाएँ।पश्चिम बंगाल में आज लोकतंत्र नहीं, TMC का गुंडा राज चल रहा है। वोट के बाद विरोधी आवाज़ों को डराना, मारना, मिटाना - यही TMC का… https://t.co/kQn4T9deL0— Rahul Gandhi (@RahulGandhi) April 26, 2026ప్రజాస్వామ్యం కాదు.. గుండారాజ్బెంగాల్లో ప్రజాస్వామ్యం కనుమరుగైందని, కేవలం టీఎంసీ గూండాల రాజ్యమే నడుస్తోందని రాహుల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటింగ్ ముగిశాక ప్రత్యర్థుల గొంతు నొక్కడం, దాడులు చేయడం, భయభ్రాంతులకు గురిచేయడమే టీఎంసీ నైజంగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ హింసను ప్రోత్సహించలేదని, తాము రాజ్యాంగబద్ధమైన మార్గంలోనే నడుస్తామని అన్నారు. ఇదే తమ వారసత్వం, సంకల్పం అని ఆయన పేర్కొన్నారు.కఠిన శిక్ష పడాల్సిందేఈ హత్యాకాండకు పాల్పడిన దోషులను తక్షణమే అరెస్టు చేసి, అత్యంత కఠినంగా శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు. బాధితుని కుటుంబానికి పూర్తి భద్రత కల్పించడంతో పాటు తగిన నష్టపరిహారం చెల్లించాలన్నారు. అసన్సోల్ నార్త్ అభ్యర్థి ప్రసేన్జిత్ పుటండికి అత్యంత సన్నిహితంగా పనిచేస్తున్న దేబ్దీప్పై టీఎంసీ అనుబంధ దుండగులే ఈ దారుణ దాడికి పాల్పడ్డారని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. భారతదేశ అహింసా సిద్ధాంతానికి మచ్చ తెస్తున్న ఇటువంటి నీచ రాజకీయాలకు తాము తలొగ్గేది లేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ఎన్నికల వేళ.. ప్రధాని మోదీ గుడ్న్యూస్ -
‘హెచ్–1బీ’ కష్టాలు
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలో స్థిరపడాలనే భారతీయ టెక్నాలజీ నిపుణుల ఆశలపై నీళ్లు చల్లేలా అగ్రరాజ్యం కీలక అడుగులు వేస్తోంది. వీసా వ్యవస్థ ప్రక్షాళన పేరుతో నూతన హెచ్–1బీ వీసాల జారీపై మూడేళ్ల పాటు నిషేధం విధించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అమెరికా చట్టసభలో ప్రవేశపెట్టిన ‘హెచ్1బీ అబ్యూజ్ యాక్ట్–2026’ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ పార్టీ సభ్యులే.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన రిపబ్లికన్ పార్టీ సభ్యుడు ఎలీ క్రేన్ ‘హెచ్–1బీ వీసా అబ్యూజ్ యాక్ట్–2026’బిల్లును అమెరికా చట్టసభ(కాంగ్రెస్)లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు మరో ఏడుగురు రిపబ్లికన్ చట్టసభ సభ్యులు బ్రియన్ బాబిన్, బ్రాండన్ గిల్, వెస్లీ హంట్, కీత్ సెల్ఫ్, ఆండీ ఓగ్లెస్, పాల్ గోసర్, టామ్ మెక్క్లింటాక్ మద్దతుగా నిలిచారు. సహ ప్రాయోజకులుగా(కో–స్పాన్సర్లుగా) సంతకాలు చేశారు. అసలు ఉద్దేశం ఏమిటి? హెచ్–1బీ వీసా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, స్థానిక అమెరికన్ల ఉద్యోగాలను పరిరక్షించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని ప్రతిపాదకులు చెబుతున్నారు. అమెరికన్ల స్థానంలో తక్కువ వేతనాలకు పని చేసే విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి కార్పొరేట్ సంస్థలు హెచ్–1బీ వీసా వ్యవస్థను దురి్వనియోగం చేస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ‘అమెరికన్లకు ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటే, వారినే నియమించుకోవాలి’అని డిమాండ్ చేస్తున్నారు. విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని అరికట్టేందుకు మూడేళ్ల పాటు హెచ్–1బీ వీసాల జారీని పూర్తిగా నిలిపివేసి, ఆ తర్వాత కఠిన నిబంధనలు అమలు చేయాలని బిల్లులో ప్రతిపాదించారు. ఈ నిబంధనల ద్వారా అమెరికా పౌరులకు ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యత దక్కేలా చేయడమే బిల్లు లక్ష్యమని చట్టసభ సభ్యుడు ఎలీ క్రేన్ స్పష్టం చేశారు. హెచ్–1బీకి కొత్త నిబంధనలు ⇒ ప్రతిఏటా జారీ చేసే 65,000 హెచ్–1బీ వీసాల పరిమితిని ఏకంగా 25 వేలకు తగ్గించడం. ⇒ వీసా దక్కించుకునే విదేశీ నిపుణుల కనీస వార్షిక వేతనం 2 లక్షల డాలర్లుగా ఉండాలి. ⇒ ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ విధానాన్ని రద్దు చేసి, ఎక్కువ వేతనం ఇచ్చే ఉద్యోగాల ఆధారంగా(వేజ్–బేస్డ్) ఎంపిక ప్రక్రియ చేపట్టాలి. ⇒ హెచ్–1బీ వీసాదారులు తమ కుటుంబ సభ్యులను (డిపెండెంట్లు) అమెరికాకు తీసుకురావడాన్ని నిషేధించాలి. ⇒ విదేశీ విద్యార్థులు చదువు పూర్తయ్యాక అక్కడే ఉండి ఉద్యోగం వెతుక్కునేందుకు, పని చేసుకునేందుకు వెసులుబా టు కల్పించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) విధానాన్ని రద్దు చేయాలి. ⇒ హెచ్–1బీ వీసాపై వచి్చన వారిని గ్రీన్ కార్డు (శాశ్వత నివాసిత హోదా) పొందేందుకు అనర్హులుగా మార్చాలి. ఈ వీసాలను కేవలం తాత్కాలిక అవసరాల కోసమే పరిమితం చేయాలి. ⇒ థర్డ్–పార్టీ స్టాంఫింగ్ ఏజెన్సీల ద్వారా ఉద్యోగులను తీసుకోవడాన్ని నిరోధించాలి. భారతీయులపైనే అధిక ప్రభావంఅమెరికా ప్రభుత్వం ఏటా జారీ చేసే హెచ్–1బీ వీసాల్లో సుమారు 70 శాతానికి పైగా భారతీయులకే దక్కుతున్నాయి. తాజా బిల్లు ఆమోదం పొందితే, ప్రధానంగా భారతీయ టెక్నాలజీ నిపుణులపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొత్తగా అమెరికాలోని ఐటీ కంపెనీల్లో చేరాలనుకునే నిపుణులకు కొన్నేళ్ల పాటు అవకాశాలు ఉండవు. అక్కడే ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగాలు సాధించాలన్న లక్ష్యంతో ఉన్న వేలాది మంది భారతీయ విద్యార్థుల కలలకు ఆటంకం ఏర్పడుతుంది.కంపెనీల నిర్వహణ వ్యయం పెరుగుదలహెచ్–1బీ వీసాల జారీ నిలిచిపోతే అమెరికాలోని టెక్ కంపెనీలు సైతం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల కొరత ఏర్పడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో స్థానికులనే అధిక వేతనాలకు నియమించుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ప్రాజెక్టుల నిర్వహణ వ్యయం పెరిగి సంస్థలపై ఆర్థిక భారం పడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికన్ కంపెనీలు తమ కార్యకలాపాలను భారత్ లాంటి దేశాల్లో మరింతగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
అధికారంపై కవిత ధీమా, సీఎం కర్కోటకుడు అంటూ విమర్శలు
-
రైతు భరోసా సగమే… మిగిలిన డబ్బులు ఎప్పుడో?
వికారాబాద్: రైతుల ఎదురు చూపులు ఫలించి ఎట్టకేలకు సాగు సాయం డబ్బులు ఖాతాల్లో జమ కాగా, ఆ సంతోషం సగం వద్దే ఆగిపోయింది. గడిచిన యాసంగి సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం డబ్బులు ఖాతాల్లో జమవడం ప్రారంభమై నెల గడుస్తున్నా ప్రక్రియ పూర్తికాలేదు. ఇప్పటి వరకు కేవలం అరవై శాతం భూమికే సాగు సాయం అందింది. మరో నలభై శాతం భూమికి సంబంధించిన రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తొలి విడతగా ప్రతీ రైతుకు ఎకరానికి డబ్బులు జమ చేసిన ప్రభుత్వం, మూడు రోజుల క్రితం రెండెకరాలలోపు వారందరికీ నగదు వేసింది. రెండు విడతల్లో కలిపి రెండెకరాల వరకు 2,82,509 మంది రైతులకు రూ.231.82 కోట్ల నిధులు జమయ్యాయి. మిగిలిన వారికి ఎప్పుడో? జిల్లాలో మొత్తం రైతు భరోసాకు అర్హులైన రైతులు 3,27,561 మంది ఉండగా, వీరు 6,45,145 ఎకరాల వ్యవసాయ భూమి కలిగి ఉన్నారు. ఇందులో ఒక్కో రైతుకు రెండెకరాల వరకు డబ్బులు అందాయి. మరో 2.8 లక్షల మందికి రూ.155.25 కో ట్లు జమ కావాల్సి ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో మూడు నెలలైనా ప్రక్రియ పూర్తయ్యే అవకాశం లేదు. అప్పటికీ ఖరీఫ్ పంటల సాగు కూ డా పూర్తవుతుందని కర్షకులు ఆవేదన వ్యక్తంచేస్తు న్నారు. ఇదిలా ఉండగా అర్హులైన వారందరికీ చెల్లించాల్సిన మొత్తంపై బిల్లులు పూర్తి చేసిన వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ట్రెజరీకి పంపించారు. ముంచుకొస్తున్న ఖరీఫ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఈ పథకాన్ని అమలు చేయగా ప్రస్తుత గవర్నమెంట్ దీన్ని రైతు భరోసాగా మార్చింది. సర్కారు ఏదైనా పంటలు సాగు చేసే సమయంలో రైతులకు సాయం అందడం లేదు. ఖరీఫ్ సమీపిస్తున్నా రబీ డబ్బులే రాలేదు.. ఖరీఫ్ సాయం అందే సరికి ఇంకెంత కాలం పడుతుందోనని విమర్శిస్తున్నారు. -
తెలంగాణ సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు
-
శంకర్ గౌడ్ ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..
-
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మా నాన్న మృతి
-
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మా నాన్న మృతి.. శంకర్ గౌడ్ పిల్లల ఆవేదన
-
మేలో నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీ పూర్తి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్న నామినేటెడ్, పార్టీ సంస్థాగత పదవుల భర్తీ ప్రక్రియ మేలో పూర్తికానుందని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వ పనితీరుతోపాటు కులగణన తదితర కీలక అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను వెల్లడించారు. పార్టీ కేడర్కు గుర్తింపు.. పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని మహేశ్గౌడ్ తెలిపారు. అందులో భాగంగానే టీపీసీసీ పూర్తిస్థాయి కార్యవర్గ నియామకంతోపాటు వివిధ కార్పొరేషన్లు, బోర్డులకు సంబంధించిన నామినేటెడ్ పదవుల భర్తీపై రాహుల్ గాందీతో విస్తృతంగా చర్చించినట్లు చెప్పారు. ఈ నియామకాల ప్రక్రియను మేలో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని.. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య మెరుగైన సమన్వయం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మహేశ్గౌడ్ చెప్పారు. ఏఐసీసీ ఓబీసీ భేటీ హైదరాబాద్లో జరపాలి.. బీసీల సాధికారతపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని దేశవ్యాప్తంగా చాటేలా రాబోయే ఏఐసీసీ జాతీయ ఓబీసీ సలహా మండలి సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించాలని రాహుల్ గాంధీని కోరినట్లు మహేశ్గౌడ్ తెలిపారు. దేశవ్యాప్తంగా బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి తెలంగాణ వేదికగా మరింత మద్దతు కూడగట్టేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ రిజర్వేన్ల అంశాన్ని కూడా జోడించాలని రాహుల్కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, ఏ దశలోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేసీఆర్లా ఒక్కరోజు సర్వే కాదు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేపై ప్రతిపక్షాల విమర్శలను మహేశ్గౌడ్ ఖండించారు. సర్వే ప్రక్రియలో ఎక్కడా లోపం జరగలేదని.. అత్యంత శాస్త్రీయంగా వివరాల నమోదు జరిగిందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హడావుడిగా ఒక్క రోజులోనే సర్వే చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయలేదని.. ఎన్యూమరేటర్లు నేరుగా ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి క్షుణ్ణంగా వివరాలు సేకరించారని వివరించారు. ఈ వాస్తవ డేటా ఆధారంగానే భవిష్యత్తులో బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అవసరమైన విధానాలను రూపొందిస్తామని ఆయన చెప్పారు. సమాజంలో ప్రతి వర్గానికి సామాజిక న్యాయం దక్కాలన్న రాహుల్ గాంధీ ఆశయాన్ని తెలంగాణలో 100 శాతం అమలు చేసి తీరుతామని మహేశ్గౌడ్ ఉద్ఘాటించారు. -
బీజేపీ ‘మహిళా ఆగ్రహ యాత్ర’
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నందుకు నిరసనగా గురువారం రాష్ట్ర బీజేపీ ‘మహిళా ఆగ్రహ యాత్ర’(జన ఆక్రోష్ పాదయాత్ర) నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో మహిళలు, పార్టీనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్తోపాటు ’ఇండి’ కూటమి పక్షాల మహిళా వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ ఈ యాత్ర సాగింది. కాంగ్రెస్ కొన్నేళ్లుగా మహిళా రిజర్వేషన్లను అడ్డుకుంటోందంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. గగన్మహల్లోని ఏవీ కాలేజీ వద్ద నుంచి పెద్దసంఖ్యలో మహిళలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలు చేతబూని పాదయాత్రగా ఇందిరాపార్కుకు చేరుకున్నారు. ఈ పాదయాత్రలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి సతీమణి కావ్యారెడ్డి, మహిళా నేతలు బంగారు శ్రుతి, బండారు విజయలక్ష్మీ, జూటూరు కీర్తిరెడ్డి, ప్రభాగౌడ్, జీహెచ్ఎంసీ మహిళా కార్పొరేటర్లు, బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, కేంద్రమంత్రులు జి.కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీ డా.కె.లక్ష్మణ్, బీజేఎల్పినేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ముందుండి నడిచారు. ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ఇతర ముఖ్యనేతలు పాల్గొని మహిళా లోకానికి సంఘీభావాన్ని ప్రకటించారు. బీజేపీ మహిళా మోర్చా, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద సభ నిర్వహించారు. పల్లెపల్లెనా ఎండగట్టాలి: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మహిళా రిజర్వేషన్ల బిల్లును కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏకమై అడ్డుకోవడం ఆ పార్టీల మహిళా వ్యతిరేక వైఖరికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. ఈ అప్రజాస్వామిక ధోరణిని పల్లె పల్లెనా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు , మహిళా సంఘాలు ఏకమై కాంగ్రెస్ కపట బుద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. మహిళా లోకానికి అన్యాయం చేయాలని చూసిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాం«దీ, రేవంత్ రెడ్డితోపాటు మిత్రపక్షాల నేతలు స్టాలిన్, అసదుద్దీన్ ఒవైసీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. రేవంత్... మహిళాద్రోహి : బండి సంజయ్ మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడంతోపాటు వారికిచ్చి న హామీలను అమలు చేయకుండా మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ముమ్మాటికీ మహిళా ద్రోహి అని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. మహిళా బిల్లును అడ్డుకున్న రేవంత్ను గద్దె దించాలన్నారు. రాబోయే ఎన్నికల్లోపే మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఆ పార్టీలు మహిళా వ్యతిరేక శక్తులు: రాంచందర్రావు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మహిళా వ్యతిరేక శక్తులని బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు మండిపడ్డారు. రాజకీయ ఉనికి కోసం మహిళా బిల్లును అడ్డుకుంటూ.. ఈ అంశాన్ని ఉత్తర–దక్షిణ భారతాల మధ్య విభజన రాజకీయంలా మార్చడం దారుణమన్నారు. పార్లమెంటులో మహిళా బిల్లుపై కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరును చూస్తుంటే మహాభారతంలోని కౌరవుల సభ గుర్తుకు వస్తోందన్నారు. -
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ హెల్త్ బులిటెన్ విడుదల
సాక్షి, వరంగల్: నర్సంపేట ఆర్టీసీ డిపోలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిపై వరంగల్ ఎంజీఎం వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.శంకర్ గౌడ్ పరిస్థితి నిలకడగా ఉంది. 60 నుండి 80 శాతం కాలిన గాయాలయ్యాయి. మంటల వల్ల ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యాయి. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నాం. ఒళ్ళంతా మంటల వల్ల ఎడిమా వచ్చింది. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నాం. మాట్లాడే పరిస్థితి లేదు, చికిత్సకు స్పందిస్తున్నారు’ అని ఎంజీఎం ఆర్ఎం డాక్టర్ అశ్విన్ తెలిపారు. నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తతనర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. అప్రమత్తమైన తోటి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్ శంకర్కు అంటుకున్న మంటల్ని ఆర్పేశారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శంకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతలు దారితీస్తోంది. తమ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వానికి, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఈ చర్చల్లో పురోగతి కనిపించలేదు. ఈ క్రమంలో నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న శంకర్ మానకిక ఒత్తిడికి గురయ్యారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. -
ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్ర: రామచందర్ రావు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకి వెళ్లడం సరికాదన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు. ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా భగీరథ మహర్షి చిత్ర పటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు నివాళులు అర్పించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ..‘ఆర్టీసీ, కార్మికుల నాయకులను ప్రభుత్వం పిలిచి వారి డిమాండ్లను ఒప్పుకోవాలి. 41 రోజుల ముందే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. అయినా ప్రభుత్వం స్పందించకుంటే ఆర్టీసీ జేఏసీ తరపున సమ్మె తలపెట్టారు. ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకి వెళ్లడం సరికాదు. 2017 నుంచి రావాల్సిన పీఆర్సీ బకాయిలు.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని న్యాయమైన కోరికలు అడుగుతున్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. అందుకే ప్రైవేట్ వ్యక్తులతో ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ 63 మంది కార్మికుల మరణానికి కారణమైంది. గతంలో ఆర్టీసీ సమ్మెకు రేవంత్ రెడ్డి మద్దతు ఇచ్చిన వీడియోను అందరూ చూడండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో విలీనం చేస్తానన్ని మూడేళ్లు అయ్యింది. రాష్ట్రంలో కొత్త బస్సులు లేవు, ఉన్న బస్సులను ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోంది. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుంది. బీజేపీ నేతలు ఎక్కడిక్కడ ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపి అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్న. రెండు పార్టీలు ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాయి’ అని మండిపడ్డారు. -
సంస్థాగతం.. ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత నిర్మాణ ప్రక్రియ ముమ్మరమైంది. పార్టీ మండల, బ్లాక్, మున్సిపల్ కమిటీల నియామకం కోసం రాష్ట్రవ్యాప్తంగా కసరత్తు జరుగుతోంది. పీసీసీ ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో జరుగుతున్న ఈ ప్రక్రియ ఈనెల 25వ తేదీలోపు ముగియనుంది. ఈ కమిటీల కూర్పులో డీసీసీ అధ్యక్షులకు సహకరించేందుకు గాను రాష్ట్ర స్థాయి సమన్వయకర్తలను కూడా నియమించారు. ఏఐసీసీ నిబంధనలు, పీసీసీ సూచనల మేరకు శనివారం నాటికి ఈ కమిటీల నియామకాలు పూర్తి కానున్నాయి. బూత్ స్థాయి నుంచి.. సంస్థాగత నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో కమిటీలను నియమిస్తోంది. పోలింగ్ బూత్ స్థాయి నుంచి ఏజెంట్ల నియామకంతో పాటు మండల, బ్లాక్, మున్సిపల్ కమిటీలను ఏర్పాటు చేసుకుంటోంది. ఈ కమిటీల్లో అధ్యక్షుడితో పాటు కనీసం 11–21 మంది కార్యవర్గంలో ఉండేలా నియామకాలు జరుగుతున్నాయి. ప్రతి కమిటీలో కనీసం 60 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకివ్వాలని పీసీసీ ఆదేశించింది. దీంతో పాటు మండల, బ్లాక్, మున్సిపల్ అధ్యక్ష పదవుల కోసం కనీసం మూడేళ్ల పాటు పార్టీలో పనిచేయాలన్న నిబంధన కూడా విధించింది. ఈ మేరకు పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్న డీసీసీ అధ్యక్షులు గడువులోపు కమిటీలను ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. అయితే, ఈ కమిటీల కూర్పులోనూ సమస్యలు వస్తున్నాయని గాం«దీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలున్న చోట్ల పాత, కొత్త.. అనే సమస్యలు వస్తున్నాయి. బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల్లో పలు హోదాల్లో పనిచేసి కాంగ్రెస్లోకి వచ్చిన వారికి తగిన గౌరవం ఇవ్వాలని, పార్టీలో కీలక పదవులు ఇవ్వాలని ఆ ఎమ్మెల్యేలు కోరుతుంటే, ఏళ్ల తరబడి పార్టీ జెండా మోస్తున్న వారికే ప్రాధాన్యతనివ్వాలని స్థానిక నాయకత్వం కోరుతోంది. ఈ పరిస్థితుల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సమస్యల్లేని కమిటీలన్నింటినీ ఫైనల్ చేయాలని, సమస్యలు వచ్చిన చోట పీసీసీ పరిష్కరిస్తుందని, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో ఈ కమిటీలను పూర్తి చేస్తారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే పంపుతాం.. మండల, బ్లాక్, మున్సిపల్ కమిటీలను ఏర్పాటు చేయాలని, బూత్ స్థాయి ఏజెంట్లను కూడా నియమించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ నుంచి ఆదేశాలు వచ్చాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీలు, ఇతర ముఖ్య నేతల తో మాట్లాడి కమిటీలకు రూపకల్పన చేస్తున్నాం. అన్ని కమిటీలకు సంబంధించిన ప్రతిపాదనలు అందాయి. ఈ ప్రతిపాదనలపై పీసీసీ అధ్య క్షుడు, పార్టీ ముఖ్య నేతలతో చర్చించి ఫైనల్ చే స్తాం. ఈ కమిటీల నియామకం విషయంలో సమస్యలున్న నియోజకవర్గాలకు సంబంధించిన తుది నిర్ణయం పీసీసీనే తీసుకుంటుంది. – పున్నాౖకైలాశ్ నేత,నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు -
హైకోర్టు తీర్పు సర్కార్కు చెంపపెట్టు
సాక్షి న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. భారీ అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ, వాటిని చట్టపరంగా కోర్టు ముందు సమర్థవంతంగా ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం వెంటనే అవినీతి కేసుల్లో చట్టబద్ధమైన, పారదర్శకమైన చర్యలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ‘ఎన్నికల హామీలు ఎందుకు అమలు కాలేదు? అవినీతి కేసుల్లో చర్యలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? మీ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వాలే కాబట్టి.. దొంగలుదొంగలు కలిసి తెలంగాణను దోచుకోవడంలో పోటీపడుతూ రాష్ట్రాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారా? అనే అంశాలపై ప్రజలకు వివరణ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా, కేసీఆర్ కుటుంబంపై కానీ, గత ప్రభుత్వ అక్రమాలపై కానీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ‘నేను గిచ్చినట్లు చేస్తా.. నువ్వు ఏడ్చినట్లు చెయ్యి’అన్న చందంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. అధికారంలోకి రాగానే.. కేసీఆర్, వారి కుటుంబ సభ్యులు, మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్రెడ్డి పెద్ద పెద్ద హామీలిచ్చారన్నారు. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తికావొస్తున్నా.. ఏ ఒక్క అవినీతి, అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టలేదు, చర్యలు తీసుకోలేదని కిషన్రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. -
‘కుంగింది కాళేశ్వరం కాదు.. కేసీఆర్పై చేసిన కుట్రలు’
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలు చేసిన వారికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు’’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇవాళ గెలిచింది తెలంగాణ ప్రజలు, రైతులు.. కుంగింది కాళేశ్వరం కాదు.. కేసీఆర్పై చేసిన కుట్రలు. కక్ష కట్టినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర ప్రచారం చేసింది. ఎన్ని కమిషన్లు వేసి కుట్రలు చేసినా, ఎన్నిక అబద్ధాలు చెప్పినా.. తెలంగాణలో పారుతున్న ప్రతి నీటి చుక్క కేసీఆర్ ఇచ్చిందే’’ అని కేటీఆర్ తేల్చి చెప్పారు.‘‘అది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదు.. పీసీసీ ఇచ్చిన రిపోర్ట్. కాళేశ్వరం మహత్యాన్ని కనబడకుండా దాచలేరు. మాపై బురదచల్లారు కానీ.. నిప్పులాంటి నిజం బయటకు వచ్చింది. మేడిగడ్డపై కూడా సీఎం రేవంత్రెడ్డి కుట్ర చేశారు. రెండేళ్లలో ఎన్నో డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. 2014లో ఆనాడు సాగునీటి విస్తీర్ణం ఎంత? ఇప్పుడు ఎంత?. ఎల్అండ్టీపై కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేశారు. ఆగమేఘాల మీద ఎస్ఎల్బీసీ పనులు చేపట్టడం నిజం కాదా?. కమీషన్లకు కక్కుర్తిపడి ఎస్ఎల్బీసీ పనులు చేపట్టారు...ఎస్బీసీ కూలి.. కార్మికులు చనిపోతే ఇప్పటివరకు బయటకు తీయలేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోతే మాట్లాడరు?. కరీంనగర్లో చెక్డ్యాంలు పేలిస్తే ఎందుకు చర్యలు ఉండవు. కేసీఆర్పై కోపంతో రైతులను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. రైతులకు కరెంట్, రైతుబంధు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు’’ అని కేసీఆర్ హితవు పలికారు. -
చిల్లర రాజకీయాలు మానుకో.. రేవంత్ పై హరీష్ ఘాటు వ్యాఖ్యలు
-
సీఎం సిద్దరామయ్యపై చేతబడి జరిగిందేమో?
బెంగళూరు: కాంగ్రెస్లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సీఎం సిద్దరామయ్యపై చేతబడి జరిగిందేమో అని అనుమానం కలుగుతోందని మాజీ మంత్రి కేఎన్.రాజణ్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంగళవారం బెంగళూరు నగరంలో మాట్లాడిన కేఎన్.రాజణ్ణ.. సీఎం ఇంత అసహాయకుడిగా ఉండటం చూస్తే అతడిపై ఎవరైనా చేతబడి చేశారా అనిపిస్తుందని.. దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. సీఎం సైలెంట్గా ఉన్నారని ఎవరైనా చెబితే అది నిజమే అనిపిస్తుందన్నారు. చేతబడి ఎవరు చేశారు అనే దానిపై విచారిస్తానని హామీ ఇచ్చారు. గతంలో తాను ఎన్నికల్లో నిలబడినప్పుడు పాత ఇంటి చుట్టూ పసుపు నీరు చల్లి చేతబడి చేశారని గుర్తు చేశారు. అయినా దానిని పట్టించుకోలేదని.. ఎన్నికల్లో గెలుపొందినట్లు పేర్కొన్నారు. మే నెలలో కొన్ని రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవచ్చన్నారు. సీఎం చేతగాని వ్యక్తి కాదని.. రానున్న రోజుల్లో అన్ని సర్దుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. -
అదే కాంగ్రెస్కు పెద్ద శాపంగా మారనుందా?
తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కె.చంద్రశేఖరరావులు ఇద్దరూ ఒకే రోజున బహిరంగ సభలు నిర్వహించి మాటా మాటా అనుకోవడంతో రాష్ట్రం మొత్తమ్మీద రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనతోపాటు రైతు భరోసా నిధుల విడుదల సందర్భంలో రేవంత్ రెడ్డి.. సీనియర్ కాంగ్రెస్ నేత, టి.జీవన్రెడ్డి బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా రేవంత్, కేసీఆర్లు ఇద్దరూ ఈ బహిరంగ సభలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో మినహా ఇద్దరు ప్రధాన నేతలు ఒకే రోజు బహిరంగ సభలు పెట్టుకోవడం చాలా అరుదు. దీన్నిబట్టి చూస్తే వీరి మనసుల్లో ఏదో తెలియని ఆందోళన, సందేహాలు నిండి ఉండాలని అనిపిస్తుంది. అదే సమయంలో ఇరువురు నేతల ప్రసంగాల్లో స్పష్టమైన తేడా ఒకటి కనిపిస్తుంది. ఒకరు సెంటిమెంట్ రేకెత్తిస్తే.. ఇంకొకరు ఎదుటి పక్షాన్ని రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారు. కాళేశ్వరం వెళుతున్నానని తెలిసి జీవన్ రెడ్డి సభ పెట్టుకున్నాడని, రేవంత్.. జగిత్యాలలో తమ సభ ఉందని తెలిసి రేవంత్ కాళేశ్వరం వెళ్లాడని జీవన్ రెడ్డి ఆరోపణలు చేసుకున్నారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీని వీడటం కాంగ్రెస్కు నష్టమే. బహశా అందుకే రేవంత్ ఆయన పేరు ప్రస్తావించి ఉండాలి. ‘‘బానిస బతుకు బతికేందుకు బీఆర్ఎస్లోకి వెళ్లాడు’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. 1984లో ఎన్టీఆర్కు నమ్మక ద్రోహం చేశారని, దళితుడికి మంత్రి పదవి ఇస్తే ఓర్వలేకపోయాడని, పాపాల భైరవుడి పార్టీలో చేరారని రేవంత్ ద్వజమెత్తారు. జీవన్ రెడ్డి కూడా తక్కువేమీ మాట్లాడలేదు. రేవంత్ను ఏకంగా తెలంగాణకు పట్టిన శని అని ఆరోపించారు. విశేషం ఏమిటంటే నలభై ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ మద్దతుతో టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చి నాదెండ్ల భాస్కరరావు ఏర్పాటు చేసిన కేబినెట్లో జీవన్రెడ్డి మంత్రిగా పనిచేయడం. రేవంత్ ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసి ఉండవచ్చు. కానీ ఈ క్రమంలో అప్పట్లో కాంగ్రెస్ చేసిన పనిని కూడా తప్పు పట్టినట్లు అయ్యింది. ఆ మాటకు వస్తే టీడీపీలో ఉండగా రేవంత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎంత తీవ్రంగా దుయ్యబట్టింది అందరికి తెలిసిందే. జీవన్ రెడ్డి కాంగ్రెస్లో చేరి ఐదుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి అయ్యారు. లోక్సభ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన రెండుసార్లు కేసీఆర్పైనే పోటీ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపాలైనా ఆ తర్వాత గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై కాంగ్రెస్కు ఊపిరి పోశారు.ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికలలో సొంతంగా తన కేడర్ను రంగంలో దింపి సత్తా చాటుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనతోనే అవగాహనకు వచ్చి మున్సిపాల్టీని కైవసం చేసుకుంది. ఆ సందర్భంలో తన అభ్యర్ధికి అవకాశం ఇవ్వకపోవడం జీవన్ రెడ్డిలో మరింత అసంతృప్తి రాజేసింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆవేదన ఆయనలో ఉంది. అయినా ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలలో జీవన్ రెడ్డికి అవకాశం ఇచ్చి ఉంటే ఈ వివాదం ఉండకపోయేదేమో!. రేవంత్ తన సన్నిహితుడు వేం నరేంద్రరెడ్డికి ఇచ్చారు. దాంతో తనను అవమానిస్తున్నారని భావించిన జీవన్ రెడ్డి కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. దీని ప్రభావం పార్టీపై పెద్దగా పడకుండా ఉండడానికి రేవంత్ ఆయనపై విమర్శలు చేసినట్లు అనిపిస్తుంది. అయితే.. ఈ పరిణామం బీఆర్ఎస్కు మాత్రం కొంత ఉత్సాహం తెచ్చే విషయమే. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల గడువు ఉండగానే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ను వీడడం కార్యకర్తలలో ఆలోచనకు దారి తీస్తుంది. అలాగే ప్రజలలో కాంగ్రెస్ దెబ్బతింటున్నదేమో అనే భావన కలగవచ్చు. ఈ నేపథ్యంలో అటు కేసీఆర్ను, ఇటు జీవన్ రెడ్డిని కలిపి రేవంత్ విమర్శించారని చెప్పాలి. ఆ క్రమంలో రేవంత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు ప్రయోజనమో చెప్పలేం. కాంగ్రెస్ కేడర్ లో అపనమ్మకం కలగకుండా ఉండడానికి రేవంత్ ఇలా చేసి ఉండవచ్చు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కేసిఆర్ ధీమా వ్యక్తం చేస్తే 2029లో ఆ పార్టీకి విపక్ష హోదా దక్కనివ్వబోమని రేవంత్ అన్నారు. గత లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇది వాస్తవమే అయినప్పటికీ దానినే ప్రమాణికంగా తీసుకోలేం. ఉదాహరణకు రేవంత్ 2018 శాసనసభ ఎన్నికలలో ఓటమి చెంది, 2019 లోక్సభ ఎన్నికలలో మేడ్చల్ నుంచి విజయం సాధించారు. అదే ఆయన రాజకీయ జీవితంలో పెద్ద మలుపు అయింది. కేసీఆర్ను పాపాల భైరవుడని.. ఆయన చేసిన తప్పులకు ఉరి వేయాలని.. దమ్ముంటే రా కేసిఆర్ ..ఇలాంటి డైలాగులు చెప్పడం కేవలం రెచ్చగొట్టడమే అనిపిస్తుంది.రాజకీయాలలో ఇదొక వ్యూహంగా చెప్పవచ్చు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాగే తన రాజకీయ ప్రత్యర్దులపై పరుష వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆయనకు శిష్యుడుగా భావించే రేవంత్ కూడా దానినే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. ఇక కేసీఆర్ ప్రసంగం చూస్తే ఆయన ఒకటిరెండు అభ్యంతరకర పదాలు వాడినా సెంటిమెంట్ పండించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కడా రేవంత్ పేరు కాని, ఇతర కాంగ్రెస్ నేతల పేర్లు కాని తీయకుండా విమర్శలు చేయడం ప్రత్యేకతగా కనిపిస్తుంది. కాంగ్రెస్ గత ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రస్తావించి వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని,కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, తాను ఆనాడే ఈ విషయం చెప్పానని, గోసపోతారని హెచ్చరించానని చెప్పడానికి యత్నించారు. పెన్షన్లు నాలుగు వేలు చేస్తామని, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ చేసిన వాగ్దానాలను ఆయన గుర్తు చేసి అవి అమలు అయ్యాయా? అని ప్రజలను అడిగారు. తాను సీఎంగా ఉండగా కరెంటు సరఫరాలో కాని, రైతులకు మేలు చేయడంలో కాని, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో కాని ఎక్కడా అశ్రద్ద చేయలేదని, అలాంటిది ఇప్పుడు ఏమి రోగం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీల గురించి కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు రేవంత్ జవాబు ఇచ్చినట్లు అనిపించదు. కాళేశ్వరం లోని మూడు పిల్లర్లు కుంగిన అంశానికే ఎక్కువగా పరిమితం అయినట్లు అనిపిస్తోంది. రేవంత్ తీసుకువచ్చిన ఈ ప్రస్తావనకు కేసీఆర్ జవాబు ఇవ్వలేదు. ఇది ఈయన బలహీనత అయితే హామీల అమలులో వైఫల్యాలు రేవంత్ వీక్నెస్గా కనిపిస్తుంది. తెలంగాణలో కలకలం రేపుతున్న హైడ్రా ను తాము అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామని కేసీఆర్ ప్రకటించడం కొత్త విషయంగా ఉంది. హైడ్రా వల్ల కాంగ్రెస్కు కొంత లాభం, మరికొంత నష్టం కలుగుతోంది. చెరువులలో నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించినప్పుడు ప్రభుత్వానికి మంచిపేరే వస్తోంది. కాని అదే టైమ్ లో పేదల ఇళ్లు కూల్చుతున్నారన్న విమర్శ, రాజకీయ ప్రేరేపితంగా ఇది పనిచేస్తోందన్న డౌట్లు రేవంత్ సర్కార్ ను ఆత్మరక్షణలో నెడుతున్నాయి. హైకోర్టు కూడా ఈ హైడ్రా పనితీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసి, కూల్చివేతలకు అడ్డుపడడం ప్రభుత్వానికి మైనస్ కింద లెక్క. ఉదాహరణకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నంతకాలం ఆ ప్రాంతంలో కూల్చివేతలు పెద్దగా జరగలేదట. ఆయన తిరిగి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపగానే హైడ్రాను ప్రయోగించారన్నది ఒక విమర్శగా ఉంది. ఇందులో నిజంగానే ఆక్రమణలు ఉండవచ్చు. కానీరాజకీయ లక్ష్యాలతో పనిచేసినట్లు,బ్లాక్ మెయిల్ కు వాడుతున్నారన్న భావన జనంలో కలిగితే.. అన్యాయంగా తమ ఇళ్లను కూల్చారన్న అభిప్రాయం పెరిగితే.. అది కాంగ్రెస్కు పెద్ద శాపంగా మారే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ తగ్గుముఖం పట్టడం తదితర విషయాలు కూడా కేసీఆర్ లేవనెత్తారు. కాగా కేసీఆర్ రాజకీయ పునరేకీకరణ అనే వ్యాఖ్య చేయడం విశేషం. భవిష్యత్తులో బీజేపీతో పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉందా? అనే చర్చకు అవకాశం ఇచ్చారు. అయితే కాంగ్రెస్,ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరడానికి సిద్దంగా ఉన్నారని.. అదే పునరేకీకరణ అని బీఆర్ఎస్ నేతలు వివరణ ఇస్తున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ నిజానికి తన పూర్తి స్థాయి స్టైల్ లో ప్రసంగించలేదు. అయినా లాగూలు పగిలేదాక.. అంటూ కొన్ని పదాలు వాడకుండా ఉంటే బాగుండేది. తన చావు ను కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారంటూ ప్రజలలో సెంటిమెంట్ ను తీసుకురావడానికి కేసీఆర్ యత్నించారు. తన ప్రభుత్వం ఓడిపోయాక ,తెలంగాణ ఆగమైందని చెప్పడానికి కేసీఆర్ కృషి చేస్తే, తనది ప్రజాపాలన అని నమ్మించడానికి రేవంత్ ప్రయత్నించారు. రెండు సభలను పోల్చి చూస్తే కేసీఆర్ కొంతమేర పైచేయి అయినట్లు అనిపిస్తుంది. ఈ సభ ప్రభావం పరిమితం చేయడానికి రేవంత్ కాళేశ్వరం యాత్రను పెట్టుకున్నారన్న అభిప్రాయం కలుగుతోంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మోదీ ఓ ఉగ్రవాది!
చెన్నై: బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. దీంతో ఖర్గే, కాంగ్రెస్లపై బీజేపీ విమర్శల వర్షం కురిపించింది. ఈ విమర్శల దుమారానికి తమిళనాడు ఎన్నికల ప్రచారపర్వం వేదికగా నిలిచింది. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న ఖర్గే మంగళవారం చెన్నైలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘పెరియార్ ఈవీ రామస్వామి, సీఎన్ అన్నాదురై సిద్ధాంతాలను నమ్మే అన్నాడీఎంకే నేతలు ఇప్పుడు ప్రధాని మోదీ పంచన చేరారు. అన్నాడీఎంకే నేతలు అసలు ఎలాంటి వాళ్లో ఇప్పుడు అందరికీ తెల్సివచ్చింది. అన్నాదురై ఫొటో పట్టుకుని ప్రచారంచేసే అన్నాడీఎంకే నేతలు ఏకంగా మోదీతో ఎందుకు పొత్తుపెట్టుకోవాల్సి వచి్చంది? మోదీ ఒక ఉగ్రవాది.ఆయనకు సమానత్వం అంటే అస్సలు గిట్టదు. సమానత్వం, న్యాయం అంటే బీజేపీకి సుతరామూ ఇష్టం ఉండదు. అలాంటి బీజేపీ నేతలతో అన్నాడీఎంకే నేతలు పొత్తుకు సై అన్నారు. అన్నీ తెల్సి పొత్తుకు సిద్ధపడ్డారంటే వీళ్లంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చాలని కంకణం కట్టుకున్నట్టే లెక్క’’అని ఖర్గే అన్నారు. ‘‘ఆరో, ఏడో నంబర్ ఈసీ దరఖాస్తుల ద్వారా ఓటర్ల జాబితాను బీజేపీ తిమ్మినిబమ్మిని చేస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ను మోదీ తన జేబులో వ్యక్తిలా మార్చుకున్నాడు. బీజేపీకి అనుబంధ కార్యాలయంగా ఈసీ తయారైంది. తమిళనాడులో ఎన్నికల ప్రచారం చివరిదిశలో మోదీ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.రాజకీయ పార్టీల కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకు సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలను రంగంలోకి దింపుతున్నారు. ఎన్నికలప్పుడు ఐటీ, ఈడీ దాడులు ఎందుకు ఎక్కువవుతున్నాయి? అందులోనూ ఎంపికచేసిన వ్యక్తుల మీదనే ఎందుకు ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయి?’’అని ప్రశ్నించారు. తమిళనాడులో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్కు, రాహుల్గాందీకి మధ్య మనస్పర్థలున్నాయనే వార్తలను ఖర్గే కొట్టిపారేశారు. ‘‘వాళ్లిద్దరూ సొంత అన్నదమ్ముల్లా కలిసి ఎన్నికల్లో పనిచేస్తున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా, మణిపూర్ నుంచి ముంబైదాకా అన్ని ప్రాంతాల ప్రజలను రాహుల్ కలుపుకొని పోతున్నారు.కాంగ్రెస్, డీఎంకేలు సొంత లక్ష్యాల విషయంలో విభిన్నంగా ఆలోచిస్తాయికానీ దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు ఉక్కు సంకల్పంతో కలిసి ముందడుగేస్తాయి’’అని ఖర్గే అన్నారు. ‘‘మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశం బీజేపీకి లేదు. ఒకవేళ ఉద్దేశం ఉంటే సీట్లు పెంచిన తర్వాతే ఇస్తామనడం ఏంటి? ఇప్పుడే, 543 సీట్లలోనే 33 శాతం అమలుచేయవచ్చుకదా?’’అని సూటి ప్రశ్నవేశారు. ‘‘జనాభా నియంత్రణను సాధిస్తూ ప్రగతిపథంలో ముందుకెళ్తున్న దక్షిణాది రాష్ట్రాలను అణగదొక్కేందుకే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో మోదీ దక్షిణభారత రాష్ట్రాలకు అన్యాయంచేయాలని కుట్ర పన్నారు’’అని ఆరోపించారు. మండిపడిన బీజేపీమోదీనుద్దేశించి ఖర్గే చేసిన ‘ఉగ్రవాది’వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ‘‘దేశ ప్రధాని పట్ల విపక్ష కాంగ్రెస్ వైఖరి ఏస్థాయిలో ఉందో ఖర్గే మాటలతో స్పష్టమైంది. ఖర్గే పొరపాటున మోదీని ఉగ్రవాది అనలేదు. ఉద్దేశపూర్వకంగానే రాహుల్గాంధీ సూచనలమేరకే ఉగ్రవాది అని సంబోధించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు సాహసించామనే అక్కసుతోనే మోదీపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలుచేస్తున్నారు.ఇలాంటి నేతలు, పార్టీకి ఓటర్లు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారు’’అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. బీజేపీ ఘాటుగా స్పందించడంతో ఖర్గే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ‘‘ప్రధాని మోదీ ఎప్పడూ మమ్మల్ని బెదిరిస్తుంటారు. ఆదాయ పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి కీలక సంస్థలన్నీ మోదీ చేతుల్లో ఉన్నాయి. మోదీని ఉగ్రవాది అని నేను నేరుగా అనలేదు. విపక్ష పార్టీలను మోదీ బెదిరించి, భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే అర్థంలోనే ఆ పదం ఉపయోగించా’’అని ఖర్గే అన్నారు. -
కేసీఆర్ స్టేట్స్మన్.. రేవంత్ స్ట్రీట్మన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాల కోసం జగిత్యాల సభలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు రాజనీతిజు్ఞడి (స్టేట్స్మన్)లా ప్రసంగిస్తే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాటారం బహిరంగ సభలో చిల్లర మనిషి (స్ట్రీట్మన్)లా మాట్లాడారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మంగళవారం హరీశ్రావు బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు కేసీఆర్ ప్రసంగించే సమయానికే మైకు పట్టుకొని రేవంత్ తన సంకుచిత బుద్ధిని బయటపెట్టుకున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా 36 లక్షల మంది వీక్షిస్తే రేవంత్రెడ్డి ప్రసంగాన్ని 4 లక్షల మందే చూడటం బీఆర్ఎస్ అధినేతకు ఉన్న ప్రజాభిమానానికి అద్దం పడుతోందన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి పేరును కూడా ప్రస్తావించకుండా హుందాగా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడితే రేవంత్ మాత్రం రంకెలు వేస్తూ బీఆర్ఎస్పై ఏడవడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. కేసీఆర్ సూచనలు స్వీకరించి తప్పులు సరిదిద్దుకుంటే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు దక్కుతాయన్నారు. రేవంత్రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ఢిల్లీకి ‘కేసీఆర్ ఆదేశాల మేరకు సీనియర్ న్యాయవాదులను కలిసేందుకే నేను, ఎంపీ రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్ కుమార్ బహిరంగంగా శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు, మే 6న హైకోర్టులో జరిగే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు కోసం సీనియర్ లాయర్లను సంప్రదించాం. అందులో దాపరికం లేకున్నా రేవంత్ మీడియాలో లీకులిస్తూ డ్రామాలు ఆడాడు. రేవంత్రెడ్డి ముద్దాయిగా ఉన్న ఓటుకు నోటు కేసు బుధవారం మధ్యాహ్నం 3:30కు సుప్రీంకోర్టులో విచారణకు వస్తోంది. హోంమంత్రిగానూ ఉన్న రేవంత్ ప్రభుత్వం తరఫున నామమాత్రపు లాయర్లను పెట్టి వ్యక్తిగతంగా తన తరఫున ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూత్రా లాంటి ఖరీదైన లాయర్లను పెట్టుకున్నాడు. ఈ కేసులో బీఆర్ఎస్ తరఫున జగదీశ్రెడ్డి, డాక్టర్ సంజయ్, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ ఇంప్లీడ్ అయ్యారు. నాలుగున్నర ఏళ్లుగా రేవంత్ స్టేను అడ్డుపెట్టుకొని కాలం గడుపుతున్నారు. స్టే వెకేట్ అయితే సీఎం సీటు ఊడటంతోపాటు జైలుకు వెళ్లడం ఖాయం’అని హరీశ్రావు చెప్పారు. కేసీఆర్ గర్జిస్తారనే భయంతో రైతు భరోసా ‘రెండు వ్యవసాయ సీజన్లలో రైతు భరోసా ఎగవేసిన రేవంత్.. జగిత్యాల సభలో కేసీఆర్ గర్జిస్తారనే భయంతో ఒక ఎకరం కిస్తీ రైతుల ఖాతాల్లో వేశాడు. రైతులకు ఇంకా రూ. 4 వేల కోట్లు రావాలి. వచ్చే ఏడాది కరువు వస్తుందనే హెచ్చరికల నేపథ్యంలో కాళేశ్వరం కూలిపోయిందని ప్రచారం చేసిన రేవంత్.. ఇప్పుడు మేడిగడ్డ మరమ్మతు గురించి మాట్లాడుతున్నాడు. ఎల్లంపల్లి ప్రాజెక్టు శంకుస్థాపన శిలాఫలకంపై నా పేరు ఉందనే విషయం తెలియక వారే కట్టినట్లు రేవంత్ చెబుతున్నాడు. మళ్లీ గెలుస్తామని ప్రచారం చేసుకుంటున్న రేవంత్రెడ్డి.. ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలో జవాబు చెప్పాలి. ఎన్ని డ్రామాలాడినా రేవంత్కు రాజకీయంగా నూకలు చెల్లాయి’అని హరీశ్రావు అన్నారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీలు ఎల్. రమణ, దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీ ప్రసాద్రావు పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమ్మెకు కౌంట్డౌన్ స్టార్ట్
-
కేసీఆర్ కాస్కో..
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘కేసీఆర్ కాస్కో.. 2029 ఎన్నికల్లో నువ్వో నేనో తేల్చుకుందాం. నీకున్న ఈ ప్రతిపక్ష హోదా కూడా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా. రాష్ట్రంలో 2034 వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది. అసలు ఈ చట్టాలే లేకుంటే, అటవిక రాజ్యమే అయితే మిమ్మల్ని చెట్టుకు ఉరేసినా తప్పులేదు. కాంగ్రెస్ కార్యకర్తల తరఫున సవాల్ చేస్తున్నా..వచ్చే ఎన్నికల్లో వంద మీటర్ల లోతున పాతరేస్తాం..’అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. కొందరు స్వార్థపర నాయకులు ప్రజాపాలన పోయి పాపాల భైరవుల పాలన రావాలని కోరుకుంటున్నారని, అలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సోమవారం సీఎం.. మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, డి.శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్ గౌడ్ తదితరులతో కలిసి జేఎస్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయంలో పూజలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన, మేడిగడ్డ బరాజ్ పరిశీలన తర్వాత కాటారం మండలం నస్తూరిపల్లిలో మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. రెండో విడత రైతుభరోసా రూ.5,700 కోట్లు ఆన్లైన్లో విడుదల అనంతరం మాట్లాడారు. జై కాంగ్రెస్ అంటూ ప్రసంగాన్ని మొదలెట్టిన ఆయన ‘తోడేలు బయటకు వెళ్లింది. ఈ సభ చూసి వారి గుండెలు అదరాలి..’అంటూ మాజీమంత్రి జీవన్రెడ్డి, జగిత్యాలలో కేసీఆర్ సభను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఎవరి పాలన కావాలో ప్రజలు ఆలోచించాలి ‘రైతు ఆత్మగౌరవం కోసం, ప్రజా సంక్షేమం కోసం పథకాలు అమలు చేసిన కాంగ్రెస్ ప్రజాపాలన కావాలో.. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాపాల భైరవుడు కేసీఆర్ పాలన కావాలో పార్టీ మారిన ఆ పెద్దమనిషితో పాటు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఈ దేశానికి వెన్నెముకైన రైతును ఆదుకోవాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు పోతోంది. రైతు సంక్షేమం అనేది కాంగ్రెస్ నినాదం కాదు విధానం. ఆ దిశలోనే ఆనాడు శాశ్వత ప్రాతిపదికన నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టులను కట్టి సాగునీరు అందించడం చరిత్ర పుటల్లో లిఖితమయ్యింది. నాడు వ్యవసాయం దండగ అన్న ప్రభుత్వాలకు చరమగీతం ఆత్మహత్యల వైపు పయనిస్తుంటే వారి ఆత్మగౌరవం నిలబెట్టాలని గిట్టుబాటు ధర కల్పన చట్టం తీసుకరావడమేగాక పంటల అధిక ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచేలా కాంగ్రెస్ ప్రభుత్వాలు దోహదపడ్డాయి. వ్యవసాయం దండగ అని కరెంటు ఇవ్వని ప్రభుత్వాలకు చరమగీతం పాడుతూ వైఎస్సార్ పాదయాత్ర చేసి దేశంలోనే మొదటిసారి చేవెళ్ల వేదికగా ఉచిత కరెంటు అమలు చేసి రైతుకు బాసటగా నిలిచారు. రైతులు అప్పులు తీర్చలేక ఆత్మహత్యల వైపు పయనిస్తున్నారని నాటి పీఎం మన్మోహన్సింగ్ 72 వేల కోట్ల రైతులకు రుణమాఫీ చేసి వారిని రుణ విముక్తుల్ని చేసిన ఘనత చరిత్రలో నిలిచింది. దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నాం.. తెలంగాణలో ప్రజాపాలన ఏర్పాటు కోసం రాష్ట్రంలో ఇరువైపులా నేను, సమ్మక్క సారలమ్మ సాక్షిగా బాసర టు భద్రాది వరకు భట్టి విక్రమార్క పాదయాత్ర చేసి ఇచ్చిన మాట మేరకు రూ.2 లక్షల రుణమాఫీని దశల వారీగా నేరవేరుస్తున్నా ప్రతిపక్షాలు ఉనికి కోసం రాద్ధాంతం చేస్తున్నాయి. నాడు తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. 25.35 లక్షల మంది రైతులకు రుణ విముక్తి కలిగించాం. నేడు రైతు భరోసా కింద రూ.5,300 కోట్లు ఖాతాల్లో వేస్తున్నాం. వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించుకునే దిశలో సాగునీటి ప్రాజెక్టుల పునర్నిర్మిస్తున్నాం. 3.15 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం. ఇలాంటి తరుణంలో ప్రజాపాలన పోవాలో.. పాపాల భైరవుడు కేసీఆర్ పాలన కావాలో పార్టీ మారుతున్న పెద్దమనిషి ఆత్మవిమర్శ చేసుకోవాలి..’అని సీఎం అన్నారు. జీవన్రెడ్డి అర్హత ఏంటో తేలింది.. ఫామ్హౌస్లో పడుకున్న పెద్దాయనకు పాలన మళ్లీ ఎందుకని ప్రశ్నించకుండా, కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం రక్తమోడ్చి జెండాలు మోసిన కార్యకర్తలు, నాయకుల శ్రేయస్సు విస్మరించి ప్రజాపాలన వచ్చే ముందు జగిత్యాలో ఓడిన జీవన్రెడ్డి అర్హత ఏంటో తేలింది. ఇక ఆ పెద్దమనిషి పుట్టు పూర్వోత్తరాలు చెప్పక తప్పదు. 1983లో తుమ్మల నాగేశ్వర్రావు సాక్షిగా ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా టికెట్టు ఇచ్చి గెలిపించడమే గాక ఎక్సైజ్ మంత్రి పదవి ఇస్తే ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి నాదెండ్లతో జట్టు కట్టినా దిక్కులేక కాంగ్రెస్లో చేరడం నిజం కాదా? కాంగ్రెస్లో 14 సార్లు ఎమ్మెల్యే బీఫామ్ ఇస్తే, ఓడినా గెలిచినా మద్దతు పలికితే సంయమనం పాటించకపోవడం అప్రజాస్వామికం కాదా? జగిత్యాల ప్రజలు నీకు ఊడిగం చేసింది వాస్తవం కాదా? ఈ వయస్సులో రాజకీయ నీతి విస్మరించి శత్రువు చేతిలోచేరి ప్రజాపాలన పోవాలి...పాపాల భైరవుడు కేసీఆర్ పాలన రావాలనడం సిగ్గు చేటు..’అంటూ సీఎం ధ్వజమెత్తారు. కుట్ర రాజకీయాలకు తావు లేదు.. ‘గతంలో వైఎస్సార్, డీఎస్ కాంబినేషన్ మాదిరి నేను, మహేశ్కుమార్గౌడ్ కలిసి పార్టీని అధికారంలోకి తెస్తాం. దళిత బిడ్డలు, బీసీలు, ఆదివాసీలను మంత్రులు చేసిన ప్రజాపాలన పోవాలనే కుట్ర రాజకీయాలకు తెలంగాణలో తావులేదు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ రాజ్యమే తప్ప మరొకటి రాదు. చరిత్ర పునరావృతం చేసేలా హైదరాబాద్ను మహానగరం చేస్తూ, పాలమూరు వంటి ప్రాజెక్టులకు పూర్తి చేస్తూ ఎవరు అడ్డొచ్చినా తొక్కుతూ ముందుకు పోతాం..’అని రేవంత్ అన్నారు. దేశంలో అత్యధిక మెజారిటీతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే గాక రాహూల్ను ప్రధాని చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్రావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపీలు వంశీకృష్ణ, వేం నరేందర్రెడ్డి, బలరాంనాయక్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావ.. ఏం అనుకుంటున్నావో’ : కేసీఆర్
సాక్షి,జగిత్యాల: మీరు చావాలనుకుంటే నేను చావను. చివరి శ్వాస వరకు తెలంగాణకు సేవ చేస్తానని’ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఈ సభలో కేసీఆర్ మాట్లాడారు. పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని కోరుకుంటుంటున్నారు. పిల్లి శాపానికి ఉట్టి తెగదు మీరు చావాలనుకుంటే నేను చావను. మీరు వెయ్యి జన్మలెత్తినా నేను చావను. చివరి శ్వాస వరకు తెలంగాణకు సేవ చేస్తా. వడ్డించిన విస్తరిలా మీకు తెలంగాణను అప్పగించాం. అన్నీ రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్గా నిలిపి మీకిచ్చాం. మా హయాంలో తెలంగాణ ఎలా ఉంది. మీ హయాంలో తెలంగాణ ఎలా ఉంది అని ప్రశ్నించారు. ఇప్పుడు అవినీతి, స్కాం, భూకబ్జాలు తప్ప అభివృద్ధి లేదు. సివిల్ సప్లై, సింగరేణిలో దోచుకుంటున్నారు. ఏ రైతును పలకరించినా తప్పు జరిగిందని బాధపడుతున్నారు. రాష్ట్రమంతా ఖాళీ, అంతా దోచుకున్నారు. హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్లో నిడ్రా, జగిత్యాలలో జిడ్రానా, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడడ్రాను తొలగిస్తాం. మొదటి సంతకంతోనే హైడ్రాను తొలగిస్తాం. పేదల ఇండ్లు కూలగొట్టడం ఏంటి? ఇది మూసీ సుందరీకరణ కోసం కాదు,రియల్ ఎస్టేట్ కోసం. ప్రజల కోసం ఒక్క స్కీం తీసుకురాలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను తీసేస్తాం’ అని వ్యాఖ్యానించారు. -
‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’
సాక్షి,జగిత్యాల: ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగం జీవన్ రెడ్డి గుండె ధైర్యమున్నోడు40ఏళ్ల నుంచి జీవన్రెడ్డి,నేను స్నేహితులం భిన్న రాజకీయ సిద్ధాంతాలతో వేర్వేరు పార్టీలో పనిచేశాంతెలంగాణ రాష్ట్ర భవిష్యత్ కోసం బీఆర్ఎస్లో చేశారుజగిత్యాల ప్రాంతం కోసం ప్రాణం పెట్టి పనిచేశారుఎమ్మెల్యేగా,మంత్రిగా చిత్తశుద్ధితో పనిచేశారుతన ప్రాంత అభివృద్ధి కోసం జీవన్ రెడ్డి ఏదైనా చేస్తారుజీవన్ రెడ్డి ప్రజా జీవితం ఎంతో మందికి ఆదర్శంపదవులు జీవన్రెడ్డికి కొత్తకాదుబీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జీవన్రెడ్డి నియామకంసభలో ప్రకటించిన కేసీఆర్ఒకే కుటుంబంలో అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దామని జీవన్రెడ్డికి చెప్పామేం అధికారంలోకి రాగానే జీవన్రెడ్డికి మంచి పదవి కల్పిస్తాకరీంనగర్ జిల్లాకే కాదు.. పక్క జిల్లాల్లో కూడా జీవన్రెడ్డి పని చేయాలితెలంగాణ రాకముందు ఎంత కష్టం ఉండేదిఆనాడు చంద్రబాబు భయంకరంగా కరెంట్ ఛార్జీలు పెంచారుఛార్జీలు తగ్గించాలని నిరసన చేస్తే పట్టపగలు కాల్చి చంపారుపక్షిలాగా రాష్ట్రం మొత్తం తిరిగితే..ఉద్యమం బలపడిందితెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో అని ముందుకు సాగాంఐదేళ్లలో మిషన్ బగీరథ పూర్తి చేసి ఓట్లు అడిగాంపదేళ్లలో ఎంత అభివృద్ధి చేశామో ప్రజలకు తెలుసుమా హాయంలో మిషన్ భగీరథలో వచ్చిన నీళ్లు ఇప్పుడు ఎందుకు రావడం లేదునూటి నూరుశాతం మళ్లీ బీఆర్ఎస్సే వస్తుందిజీవన్ రెడ్డిని మంచి పదవిలో చూస్తారుజీవన్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించిన కేసీఆర్ఇవాళ తెలంగాణా అగమ్యగోచరంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉందివినయ్ భాస్కర్ ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడితే తెలంగాణా అనొద్దని నాడు దాడి చేసిన్రుచంద్రబాబు నాడు కరెంట్ ఛార్జీలు పెంచితే నేను ఉత్తరం రాశాతెలంగాణా ఉద్యమం చేస్తానని హెచ్చరించాబషీర్ బాగ్లో రైతులపై కాల్పులు జరిపిన బాబు పాలనపై ధ్వజమెత్తి ఉద్యమాన్ని ఆరంభించానురోశయ్య 14 ఎఫ్ అని ఓ జీవో తెచ్చి తెలంగాణా వారికి ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నాడుఆనాడే ఆమరణ దీక్షకు బయల్దేరాచిదంబరం ప్రకటన తర్వాత హైడ్రామా క్రియేట్ చేశారువచ్చిన తెలంగాణాకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు క్లిష్టమైన విషయంబిహార్లో పని చేస్తున్న జీఆర్ రెడ్డి అనే చొప్పదండి ఇంజనీర్ను పిలిపించుకుని ప్రణాళిక రూపొందించుకున్నాంమిషన్ కాకతీయ వంటి అద్భుతమైన పథకాలు తీసుకొచ్చాంమిషన్ భగీరథ పూర్తి చేయకుంటే ఓట్లడగనని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా.. నేను తప్ప.. ?మాజీ మంత్రి జీవన్రెడ్డి.. బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో జీవన్రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. దీనిలో భాగంగా జీవన్రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన భారీ సభకు ఇరువురు విచ్చేసిన అనంతరం జీవన్రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. జీవన్రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు కేసీఆర్. 40 మంది అనుచరులతో పాటు బీఆర్ఎస్లో చేరారు జీవన్రెడ్డి. ఇటీవల తన 40 ఏళ్ల కాంగ్రెస్ ప్రస్థానానికి జీవన్రెడ్డి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్పై అసంతృప్తిలో బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపారు జీవన్రెడ్డి. జీవన్ రెడ్డి చేరికతో జగిత్యాలలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీఆర్ఎస్లో చేరికతో అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది. జగిత్యాల సభతో గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఊపందుకుంది. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.ముందుగా జీవన్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్పై ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంలో అభివృద్ధికి రాజకీయాలు లేవంటూ మండిపడ్డారు. 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని 23 జిల్లాలుగా చేసిన ఘనత కేసీఆర్ది అంటూ కొనియాడారు. కేసీఆర్ ఆలోచన, దూరదృష్టితోనే తెలంగాణలో జిల్లాలు పెరిగాయన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతోనే జగిత్యాలకు మెడికల్ కాలేజ్ వచ్చిందన్నారు. రైతాంగానికి 24 గంటల విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్దేనన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. -
కేసీఆర్ నన్ను అక్కున చేర్చుకున్నారు: జీవన్ రెడ్డి
సాక్షి, జగిత్యాల: జగిత్యాల బీఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నాటి జగిత్యాల జైత్రయాత్రను తలపించేలా బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ కూడా ఉండబోతోందన్నారు. రాజకీయంగా తాను విభేదించినా కేసీఆర్ మాత్రం తనను అక్కున చేర్చుకున్నారని తెలిపారు. ఈ విషయంలో తాను ఎంతో ఆనందంగా ఉన్నట్టు జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా సాక్షి టీవీతో మాట్లాడుతూ..‘మేడిగడ్డ ప్రాజెక్టుతో మాత్రమే తెలంగాణ రైతాంగానికి మేలు జరుగుతుంది. తుమ్మిడిహట్టి కట్టాలని నేను డిమాండ్ చేసిన మాట వాస్తవమే. కానీ, కాళేశ్వరంతో పెద్ద సంఖ్యలో రైతాంగానికి మేలవుతుంది. మళ్లీ తుమ్మిడిహట్టి నిర్మాణం కావాలన్నా కేసీఆర్ రావాల్సిందే. మేడిగడ్డ మీద ఎన్డీఎస్ఎఫ్ రిపోర్ట్ ఇచ్చి ఏడాదైతే గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారా?. ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి ఏం చేయబోతున్నాడు. పునరుద్ధరణ ఎప్పుడు పూర్తి అవుతుంది? అని ప్రశ్నించారు.అలాగే, నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కొంతకాలం నా రాజకీయ భవిష్యత్తుపై మనస్థాపం చెందాను. రాజకీయంగా నేను విభేదించినా కేసీఆర్ పెద్ద మనసులో నన్ను అక్కున చేర్చుకున్నారు. ఇవాళ నేను సంతోషంగా ఉన్నాను. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమైన తెలంగాణా పరిస్థితులపై ఈరోజు సభ ఉండబోతోంది. జగిత్యాల బీఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. జగిత్యాల బీఆర్ఎస్ సభపై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. తనను బీఆర్ఎస్ నేతలు క్రాస్ బ్రీడ్ అని సంబోధించడంపై మండిపడ్డారు. తాజాగా సంజయ్ కుమార్ సాక్షితో మాట్లాడుతూ..‘జగిత్యాల సభతో ఒరిగేదేమీ లేదు. కేసీఆర్, కేటీఆర్ను వందల సార్లు తిట్టిన జీవన్ రెడ్డి చేరికపై ప్రజలందరికీ స్పష్టత ఉంది. బీఆర్ఎస్ సభకు నాకు ఆహ్వానం లేదు. నేను మేడిగడ్డకు ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్తున్నాను. నా చివరి అంకం వరకు ఇక కాంగ్రెస్తోనే నా ప్రయాణం’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఎన్నికల వేళ డీఎంకే, కాంగ్రెస్లకు షాక్
తమిళనాడులో మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. డీఎంకే, కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఇన్కమ్టాక్స్ అధికారులు సోదాలు చేపడుతున్నారు. అయితే ఈ దాడులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల (ఏప్రిల్ మొదటి వారంలో) సేలంలోని పలువురు డీఎంకే నేతల ఇళ్లు మరియు కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాలు సుమారు 5-8 గంటల పాటు కొనసాగాయి. కాగా ప్రస్తుతం మరో సారి ఐటీ రైడ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీశ్ ఇంట్లోనూ ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఆయన కూమారుడి ఇల్లు, ఆఫీసుల్లో అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. క్రిప్టో మనీలాండరింగ్ కేసులో భాగంగా బెంగళూరులో ఎమ్మెల్యేకు సంబంధించిన 17 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా తమిళనాడు అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23 గురువారం రోజున ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం మే 4న ఫలితాలు వెలువడుతాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులపై నిఘా సంస్థల తనిఖీలు పెరిగాయి. -
హిట్టా.. వికెట్టా?
సాక్షి, హైదరాబాద్: మైనార్టీ సంక్షేమం, ప్రభుత్వరంగ సంస్థల మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ భవితవ్యం ఏంటన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అటు అసెంబ్లీ, ఇటు మండలిలో సభ్యుడు కాని ఆయన మంత్రిగా ప్రమాణం చేసి ఈనెలాఖరుతో ఆరు నెలలు పూర్తి కానుంది. చట్టసభల నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా ఆయన రెండు సభల్లో ఏదో ఒక సభ సభ్యునిగా నియామకం కావాల్సి ఉంది. కానీ, ఏప్రిల్ 30తో ఆరు నెలల గడువు ముగుస్తున్నప్పటికీ ఆయనను ఎమ్మెల్సీగా సిఫారసు చేస్తూ పంపిన ప్రతిపాదనకు ఇంకా గవర్నర్ ఆమోదం లభించలేదు. దీంతో ఈ నెలాఖరులోగా గవర్నర్ నిర్ణయం రాకపోతే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడనున్నాయి. అదే జరిగితే రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ చరిత్రలో ఈ పరిణామం నిలిచిపోతుందని రాజకీయ వర్గాలంటున్నాయి. గవర్నర్పై గంపెడాశలు వాస్తవానికి, రాష్ట్రంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ వివాదాస్పదమైంది. గత ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, కె. సత్యనారాయణ (జూలై, 2023లో)ను ఈ కోటాలో ఎమ్మెల్సీలుగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించి ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు పంపింది. కానీ, ఈ ప్రతిపాదనలను ఆమె తిరస్కరించారు. ఈలోపు ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరిలో ప్రొ.కోదండరాం, ఆమేర్ అలీఖాన్లను ప్రతిపాదిస్తూ మంత్రివర్గం సిఫారసు చేసింది. దీన్ని దాసోజు శ్రవణ్ హైకోర్టులో సవాల్ చేయడంతో ఈ ఇద్దరి ప్రతిపాదనలను కోర్టు కొట్టివేసింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చి ఆ ఇద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసేందుకు వెసులుబాటు కల్పించింది. కానీ, తుది తీర్పునకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆ ఇద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. అయితే, ఈ కేసులో 2025, ఆగస్టు 13న తుది తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు కోదండరాం, ఆమేర్ అలీఖాన్ సభ్యత్వాలను రద్దు చేసింది. అనంతరం ఆగస్టు 30న మళ్లీ మంత్రివర్గం సమావేశమై కోదండరాంతోపాటు ఆమేర్ అలీ ఖాన్ స్థానంలో ప్రస్తుత మంత్రి అజహరుద్దీన్ పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో గత అక్టోబర్ 31న (జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు) అజహరుద్దీన్ రాష్ట్రమంత్రిగా ప్రమాణం చేశారు. కానీ, ఆయన మండలి సభ్యత్వానికి గవర్నర్ ఆమోదం లభించలేదు. ఈ నేపథ్యంలో ఆయన 2026 మే 1వ తేదీలోపు ఆయన ఎమ్మెల్సీగా నియామకం కాకుంటే మంత్రివర్గంలో స్థానాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. దీంతో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తీసుకునే సానుకూల నిర్ణయంపై అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ పార్టీ గంపెడాశలు పెట్టుకున్నాయి. నిర్ణయం తీసుకోండి... ఈ అంశంలో గవర్నర్ నిర్ణయం తీసుకునేందుకు గత ఫిబ్రవరిలోనే సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. కానీ ఆ తర్వాత జిష్ణుదేవ్వర్మ బదిలీ కావడంతో మార్చిలో శివప్రతాప్ శుక్లా గవర్నర్గా వచ్చారు. ఇప్పుడు ఈ పది రోజుల్లోపు శుక్లా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదివారం అనూహ్యంగా గవర్నర్ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ శనివారం ఆలస్యంగా హైదరాబాద్కు చేరుకున్నారు. ఉదయాన్నే లోక్భవన్కు వెళ్లి గవర్నర్ను కలిశారు. వీరి భేటీలో అనేక అంశాలతోపాటు అజహరుద్దీన్, కోదండరాంలను ఎమ్మెల్సీలుగా నియమించే అంశం చర్చకు వచ్చినట్టు గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వీలైనంత త్వరగా ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ శుక్లాను రేవంత్ కోరారని, క్షుణ్ణంగా పరిశీలించి వీలున్నంత త్వరగా నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారని ఆ వర్గాలు చెబుతున్నాయి. కాగా, శనివారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి గవర్నర్ను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పరిపాలన, న్యాయ అంశాలపై జరిగిన చర్చలో భాగంగా అజహరుద్దీన్ ఫైలు గురించి కూడా వీరు చర్చించినట్టు తెలుస్తోంది. వెంటనే సీఎం రేవంత్ కూడా గవర్నర్ను కలిసి కోరడంతో అజహరుద్దీన్ విషయంలో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ సానుకూల నిర్ణయం తీసుకుంటే అజహరుద్దీన్ యథాతథంగా మంత్రిగా కొనసాగనుండగా, ఏ నిర్ణయం తీసుకోకపోయినా, ప్రతికూల నిర్ణయం తీసుకున్నా ఆయన మంత్రి పదవిని కోల్పోనున్నారు. ఒకవేళ అదే జరిగితే మంత్రిగా అజహరుద్దీన్ మరోమారు ప్రమాణం చేయాల్సి ఉంటుందని, మళ్లీ ఆయన పేరును మంత్రివర్గం సిఫారసు చేయాల్సి ఉంటుందని రాజకీయ వర్గాలంటున్నాయి. మరి ఏం జరుగుతుందో... అజహరుద్దీన్ భవితవ్యం ఏమవుతుందో వేచి చూడాల్సిందే! -
రామంతాపూర్ పాఠశాలల అభివృద్ధికి పరమేశ్వర్ రెడ్డి హామీ
రామంతాపూర్: నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విద్యా శాఖ అధికారులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఉప్పల్ కాంగ్రెస్ ఇన్చార్జి మందముల పరమేశ్వర్రెడ్డి అన్నారు. శనివారం రామంతాపూర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ పాఠశాలలో తాగునీటి సమస్య మధ్యాహ్నం భోజనం, వంట గదితో పాటు ఇతర మౌలిక సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. స్కూల్ ఆవరణలో బోరు పంపు ఏర్పాటు పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం స్కూల్లో నెలకొన్న పలు సమస్యలపై హెచ్ఎం లత ఆయనకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మహ్మద్ రఫీక్, శ్రీకాంత్ యాదవ్, ప్రజావాణి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అజారుద్దీన్కు కష్ట కాలం. మంత్రి పదవి ఉంటుందా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మాజీ క్రికెటర్, ప్రస్తుత మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆయన మంత్రి పదవికి సంకట పరిస్థితి వచ్చింది. మంత్రి పదవి ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన గడువుపై ఆధారపడి ఉంది. ఈనెల 30తో అజారుద్దీన్ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు కానుంది. దీంతో ఈనెల 30 లోపు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ కాకుంటే.. మంత్రి వర్గం నుంచి ఆయనను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.ఈ నేపథ్యంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం ఫైల్పై గవర్నర్ను సంతకం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరనున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈరోజు ఉదయం 11 గంటలకు లోక్భవన్కు వెళ్లి గవర్నర్తో భేటీ కానున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై చర్చించనున్నారు. ఈ క్రమంలో గవర్నర్, సీఎం భేటీపై ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) ప్రకారం ఒక వ్యక్తి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆరు నెలల లోపు అసెంబ్లీ లేదా మండలికి ఎన్నిక కావాలి. అత్యవసర పరిస్థితుల్లో లేదా పరిపాలనా సౌలభ్యం కోసం, అనుభవజ్ఞులను ప్రభుత్వంలోకి తీసుకోవడానికి ఈ వెసులుబాటు కల్పించబడింది. కాగా, అంతకుముందు అజారుద్దీన్ అక్టోబర్ 31, 2025న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఆయన ఆరు నెలల గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30వ తేదీలోపు ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణం చేయకపోతే, సాంకేతికంగా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.ఎందుకు ఈ పరిస్థితి.. కాగా, రేవంత్ ప్రభుత్వం ఆయన పేరును గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదించింది. అయితే.. గతంలో గవర్నర్ కోటా నామినేషన్లపై కోర్టులో వివాదాలు నడవటం, ఆ తర్వాత కొత్త గవర్నర్ రాక వంటి పరిణామాల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్తో చర్చలు జరిపి ఈ అడ్డంకిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ గవర్నర్ కోటా క్లియర్ కాకపోతే.. ఖాళీగా ఉన్న ఏదైనా ఇతర ఎమ్మెల్సీ స్థానం.. స్థానిక సంస్థలు లేదా ఎమ్మెల్యే కోటా ద్వారా ఆయన్ని మండలికి పంపాల్సి ఉంటుంది. ఇది కూడా ఫలించని నేపథ్యంలో అజారుద్దీన్ మంత్రి బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. -
మహిళలు క్షమించరు.. కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారు..
-
జగిత్యాల.. ‘జంగ్’ సైరన్!
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నేత జీవన్రెడ్డి పార్టీని వీడటం, అందుకు దారి తీసిన పరిస్థితులు అధికార కాంగ్రెస్లో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. జగిత్యాల వేది కగా చోటు చేసుకున్న ఈ పరిణామం ఎటు తిరిగి ఎటు వెళుతుందోనన్న ఉత్కంఠ ఆ పార్టీ ముఖ్య నేతల్లో కనిపిస్తోంది. అంతర్గత ప్రజాస్వామానికి పెట్టింది పేరయిన పార్టీలో ఎవరు, ఎప్పుడు, ఎలాంటి బాంబు పేలుస్తారో.. ఎన్నికలు సమీపించే కొద్దీ జగిత్యాల అలజడి ఎలాంటి అసమ్మతి సుడిగుండాలను సృష్టిస్తుందోనన్న గుబులు అంతర్గతంగా వ్యక్తమవుతోంది. జిల్లాకు ఒకరిద్దరు..!: కాంగ్రెస్లో అసంతృప్తులు, అసమ్మతులు సహజం. అయితే రాష్ట్రం పార్టీ అధికారంలో ఉండడం, భవిష్యత్తుపై ఆశలు ఉండడంతో చాలామంది నేతల్లో వివిధ కారణాలతో అసమ్మతి ఉన్నా పంటి బిగువున నెట్టుకొస్తున్నారనే వాదన ఉంది. తమ భవిష్యత్తు ప్రస్తుతానికి గందరగోళంగా ఉన్నా కొంత కాలం తర్వాత అంతా సర్దుకుంటుందనే ఆశతో పార్టీలో ఉండలేక, వెళ్లలేక, సతమతమవుతున్నారు. ఇలాంటి నేతలు జిల్లాకు కనీసం ఒకరిద్దరున్నారని గాం«దీభవన్ వర్గాలే అంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చామని చెప్పుకుంటున్న నియోజకవర్గాల్లోని నేతలందరిదీ దాదాపు ఇదే పరిస్థితి. సింగాపురం ఇందిర, పి.విజయారెడ్డి, పొదెం వీరయ్య, భిక్షపతి గౌడ్, భీంభరత్, సరితాయాదవ్, కాట శ్రీనివాస్గౌడ్, కస్తూరి రాజేందర్ లాంటి నాయకులంతా గందరగోళ పరిస్థితుల్లోనే ఉన్నారు. వీరితో కనీసం మాట్లాడే వారు, సర్దిచెప్పేవారు కూడా లేరని అంటున్నారు. పదేళ్ల పాటు పార్టీని అంటి పెట్టుకుని ఉన్నామని, ఇప్పుడు ఏం చేయాలో కూడా పాలుపోవడం లేదని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎన్నికల నాటికి తమ దారి తాము చూసుకుంటామనే హెచ్చరికలతో కూడిన అభిప్రాయాలను బయటకు చెప్పకపోయినా అంతర్గతంగా వ్యక్తం చేస్తున్నారు. తమ విషయంలో పార్టీ, నాయకత్వ వ్యవహారశైలిపై నిట్టూరుస్తూనే ఉన్నారు. ఆత్మహత్య చేసుకోవాలనిపించిందన్న చిన్నారెడ్డి సీనియర్ నేత చిన్నారెడ్డిది కూడా జీవన్రెడ్డి లాంటి పరిస్థితే. తనకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందనే స్థాయిలో ఆయన తన అసంతృప్తిని వెలిబుచ్చినా పార్టీ నాయకత్వం ఏ మాత్రం సీరియస్గా తీసుకోలోదనే విమర్శలున్నాయి. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఆశించి భంగపడినవారు, పోటీ చేసి ఓడిపోయిన వారు, నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నేతలు... ఇలా అనేకమందిలో అసమ్మతి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరిని సముదాయించేందుకు డీసీసీ అధ్యక్షులుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించినా లోలోన అసమ్మతి సెగలు మాత్రం అలాగే ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా సమన్వయ లేమి కారణంగానే నాగం జనార్ధన్రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య లాంటి నేతలను దూరం చేసుకున్నామంటూ నెమరువేసుకుంటున్నారు. జీవన్రెడ్డితో అధిష్టానం చర్చించి ఉంటే బాగుండేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించడం, ఎంపీ మల్లు రవి కూడా ఆయన వెళ్లిపోవడం బాధాకరమే అన్న రీతిలో మాట్లాడటం గమనార్హమని చెబుతున్నారు. టేకిటీజీగా తీసుకున్నారా? వాస్తవానికి జీవన్రెడ్డి చాలా రోజులుగా అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. 42 సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్న తనను కాదని, కనీసం తనకు చెప్పకుండా, తనపై గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకున్నప్పుడే ఆయన భగ్గుమన్నారు. అప్పటి నుంచీ సందర్భమెప్పుడొచ్చినా ఆయన అసమ్మతి గళం వినిపిస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల పంచాయతీ నడుస్తూనే ఉంది. చివరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాం«దీభవన్కు వచ్చి పార్టీ సమావేశంలో పాల్గొనడం, మున్సిపల్ ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలు, ఫలితాల అనంతరం పార్టీ తీసుకున్న నిర్ణయం లాంటివి జీవన్రెడ్డి సీనియారిటీ, సిన్సియారిటీపై ప్రశ్నలు లేవనెత్తేలా చేశాయనే భావన వ్యక్తమైంది. అయితే జీవన్రెడ్డి గురించి పార్టీలో అంతర్గతంగా చాలా చర్చ జరిగింది. ముఖ్య నేతలు కలిసినప్పుడు, కరీంనగర్ రాజకీయాలు మాట్లాడినప్పుడు, పీఏసీ సమావేశాల్లోనూ ఆయన గురించి ప్రస్తావనలు వచ్చాయి. కానీ ఆయనే సర్దుకుంటారులే అన్న ధీమాతో పాటు ఇప్పుడు బయటకెళ్లి ఏం చేస్తారులే అనే అభిప్రాయమే చివరివరకు కొనసాగింది. పీసీసీ చీఫ్, సీఎం ఇద్దరూ టేకిటీజీ ధోరణిలోనే వెళ్లారనే భావన కొందరు వ్యక్తం చేయడం గమనార్హం. ఏతావాతా జీవన్రెడ్డికి సరైన భరోసా లభించలేదు. జగ్గారెడ్డి, మల్లు రవి మాదిరిగానే చివరి నిమిషంలో మంత్రి శ్రీధర్బాబు కూడా జీవన్రెడ్డిని వెళ్లనివ్వకుండా ఆపాలని పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. చాలామంది నేతలు జీవన్రెడ్డిని పార్టీ విడిచిపెట్టదనే అనుకున్నారు. కానీ జీవన్రెడ్డి నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని వదులుకున్నారు. ఇది బాధాకరమే అయినప్పటికీ తప్పడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చివరకు బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. -
బాధాకరమే.. పరాజయం కాదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ మహిళా వ్యతిరేకి అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేయడానికి తాము చేసిన ప్రయత్నాలను ఆ పార్టీ ఆడ్డుకుందని విమర్శించారు. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మహిళలకు వారి న్యాయమైన హక్కును కల్పించే ప్రయత్నాలు కొనసాగుతాయని స్పష్టంచేశారు. కిరణ్ రిజిజు శనివారం మీడియాతో మాట్లాడారు. బిల్లు ఆమోదం పొందకపోవడం బాధాకరమే అయినప్పటికీ దీన్ని తాము పరాజయంగా భావించడం లేదన్నారు.మహిళల హక్కులను హరించివేసిన కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటోందని, అందుకు మహిళలు ఆ పార్టీకి తగిన గుణపాఠం నేర్పిస్తారని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ అసలు రంగు బయటపడిందన్నారు. మహిళలకు హక్కులను దూరం చేసి, అది విజయంగా భావించడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక మనస్తత్వం బట్టబయలైందని, అది ఆ పార్టీకి ఒక నల్ల మచ్చ అని వ్యాఖ్యానించారు. ఆడబిడ్డల మనోభావాలను కాంగ్రెస్ గాయపర్చిందని మండిపడ్డారు. దేశంలో మహిళలకు గౌరవం ఇవ్వాలని, వారికి సాధికారత కల్పించాలని తాము కోరుకుంటున్నట్లు స్పష్టంచేశారు. మహిళల బాగు కోసం తమ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని బలవంతం చేయలేం రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేయడానికి ప్రభుత్వం, అధికార కూటమి తీవ్రంగా ప్రయత్నించాయని.. చివరకు సఫలం కాలేకపోయాయని కిరణ్ రిజిజు చెప్పారు. ఒక బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలంటూ ప్రతిపక్షాన్ని భౌతికంగా బలవంతం చేయలేమన్నారు. పార్లమెంట్లో బిల్లులపై ఓటింగ్ ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతుందని తెలిపారు. ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో లోక్సభలో 12 బిల్లులు, రాజ్యసభలో ఒక బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు. లోక్సభ ఉత్పాతకత 93 శాతం, రాజ్యసభ ఉత్పాదకత 110గా నమోదైందని అన్నారు. -
బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి
జగిత్యాల: పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చి నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సైతం ఎంపీ వ్యాఖ్యలను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. ఈ నెల 20న కేసీఆర్ నాయకత్వంలో జీవన్రెడ్డి బీఆర్ఎస్లో చేరనున్న సందర్భంగా జగిత్యాలలో నిర్వహిస్తున్న సభాస్థలి ఏర్పాట్లను కేటీఆర్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ బీజేపీ ఎంపీలు క్షమాపణ చెప్పాల్సిందిపోయి వెనుకేసుకొస్తున్నారని, కేసీఆర్ నాయకత్వంలో నాలుగు కోట్ల మంది ప్రజలు ఒక్కటై తెలంగాణను సాధించుకున్నారన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే ఘాటైన జవాబు ఇచ్చేవారని, రాజ్యసభలో ముగ్గురు ఎంపీలు ఉంటే కేంద్రమంత్రి కాళేశ్వరం ప్రాజెక్ట్పై మాట్లాడితే దీటైన జవాబు ఇచ్చారని పేర్కొన్నారు. లోక్సభలో కాంగ్రెస్ 8, బీజేపీ 8 మంది ఎంపీలు ఉంటే కనీసం పల్లెత్తు మాట మాట్లాడలేదని, దిష్టి»ొమ్మల్లా ఉన్నారని చెప్పారు. తెలంగాణను కించపరిచేలా మాట్లాడితే సీఎం రేవంత్రెడ్డి కనీసం స్పందించకపోవడం శోచనీయమన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదని, పార్లమెంట్లో 2/3 మెజారిటీ ఉంటేనే బిల్ పాస్ అవుతుందని, మెజారిటీ లేకున్నా ప్రవేశపెట్టి దేశంలోని మహిళలకు అన్యాయం చేశారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ దొందూదొందేనని, ఒకవైపు మహిళాబిల్లుపై కాంగ్రెస్ మద్దతివ్వలేదని, కాంగ్రెస్ నాయకుల ఇళ్లు ముట్టడించాలని బీజేపీ నాయకులు పిలుపునిస్తే.. సీఎం రేవంత్రెడ్డి మాత్రం కేంద్రమంత్రి శ్రీనివాస్వర్మ ఇంటికి వెళ్లి బ్రేక్ఫాస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి పార్లమెంట్లో మహిళాబిల్లు, లోక్సభ సీట్ల పెంపు విషయంలో హైబ్రిడ్ విధానాన్ని తీసుకొచ్చారు...కానీ మహిళాబిల్లు విషయంలో సైతం మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలో జీవన్రెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్నారని, ఆయన చేరిక ఉత్తర తెలంగాణలో బలం ఇస్తుందని, విలువలతో రాజకీయం చేసే నాయకుడు జీవన్రెడ్డి అని పేర్కొన్నారు. నాలుగు కోట్ల ప్రజల నుంచి వస్తున్న మాట రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి అన్నదే వినిపిస్తోందన్నారు. దానికి సంకేతమే బీఆర్ఎస్లో జీవన్రెడ్డి చేరిక అన్నారు. సింహం బయటకు వస్తే గుంటనక్కలు భయపడుతున్నాయిబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్సింహం బయటకు వస్తే గుంటనక్కలు భయపడుతు న్నాయని కాంగ్రెస్ నాయకులనుద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ జగిత్యాలలో సభ నిర్వహిస్తుంటే సీఎం రేవంత్రెడ్డి మేడిగడ్డలో నిర్వహిస్తారట...రెండేళ్ల తర్వాత మేడిగడ్డ గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. జగిత్యాలలో హైబ్రిడ్ ఎమ్మెల్యే అని, ఏ పార్టీలో ఉన్నాడో ఆ ఎమ్మెల్యేకే తెలియదని సంజయ్కుమార్నుద్దేశించి అన్నారు. జగిత్యాల నుంచే జైత్రయాత్ర ప్రారంభమవుతుందని, కాంగ్రెస్ నాయకుల్లో భయం పట్టుకుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటి సైతం అమలు చేయలేదని, కేసీఆర్ సభను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా పార్టీ సమష్టిగా పనిచేసి ముందుకెళ్తామన్నారు. చాలాకాలం క్రితం జగిత్యాలలో సభ నిర్వహించామని, జీవన్రెడ్డి చేరికను అందరూ ఆహ్వానిస్తున్నారని తెలిపారు. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని, జగిత్యాల నుంచే మళ్లీ పునర్వైభవం సాధించేందుకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం కోసం జగిత్యాల ప్రజల ఆశీర్వాదంతో కదం తొక్కుతూ ముందుకెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యేలు రాజేశ్వర్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, సంజయ్, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జ్లు పాల్గొన్నారు. -
ఎన్డీయేతో పొత్తు.. కాంగ్రెస్తో గమ్మత్తు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ముసుగు రాజకీ యం మరోసారి చర్చనీయాంశమైంది. అవసరానికి తగ్గట్లుగా ఊసరవెల్లిలా రంగులు మార్చడంలో ఆరితేరిన ఆయన ఇప్పుడు ఎన్డీయేతో పొత్తులో ఉండి తెరచాటున కాంగ్రెస్తో సంబంధాలు నెరుపుతున్నట్లు తేలిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్భంగా ఆయన ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు నటిస్తూనే మరోవైపు కాంగ్రెస్ పెద్దలతో లోపాయకారీగా మంతనాలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా పార్లమెంటులో టీడీపీ ఎంపీలు, నేతలతో కాంగ్రెస్కు చెందిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తదితర నేతలు రేవంత్రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీడీపీకి చెందిన ఓ మంత్రి ఆహ్వానం మేరకు ఎన్డీయే ఇచ్చిన విందుకు రేవంత్రెడ్డి హాజరయ్యారు. దీన్నిబట్టి సీఎం చంద్రబాబు ఎన్డీయేలో ఉంటూనే రేవంత్రెడ్డి ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో గుట్టుగా దోస్తీ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.2024 ఎన్నికల్లో కాంగ్రెస్తో రహస్య స్నేహం..తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. 2024 ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు కాంగ్రెస్కి అనుకూలంగా వ్యవహరించారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి తెరచాటున విశ్వప్రయత్నాలు చేసినట్లు బయటపడింది. ఏపీలోనూ ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. బయటకు మాత్రం ఎన్డీయేతో పొత్టు పెట్టుకుని అవసరాన్ని బట్టి మాత్రం కాంగ్రెస్తో సంబంధాలు నెరిపారు. ప్రస్తుతం తెలంగాణ సీఎంతో టీడీపీ మంత్రులు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుండడం బహిరంగ రహస్యమే. వారు తరచూ ఆయనతో విందు భేటీల్లో పాల్గొంటున్నట్లు బహిరంగ రహస్యం. చంద్రబాబు కూడా రేవంత్కు అనుకూలంగా పనిచేస్తున్నట్లు తేలిపోయింది. ఎందుకంటే.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తాను కోరిన మీదటే చంద్రబాబు నిలిపివేసినట్లు స్వయంగా రేవంత్రెడ్డి అక్కడి అసెంబ్లీలో చెప్పిన విషయం తెలిసిందే. దీన్నిబట్టే చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాల కంటే తన స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమని అప్పట్లో తేటతెల్లమైంది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలోనూ ఆయన ఎన్డీయేలో ఉండి తెరవెనుక కాంగ్రెస్తో రాయబారాలు నడిపినట్లు తెలుస్తోంది. 2011లో చీకట్లో చిదంబరాన్ని కలిసిన బాబు..మరోవైపు.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సైతం చంద్రబాబు కాంగ్రెస్తో రహస్య బంధం కొనసాగించారు. 2011 ఆగస్టులో ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన తన రాజకీయ అవసరాల కోసం రాత్రి వేళ అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరాన్ని కలిసినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఆయన యూపీఏ ప్రభుత్వంతో లోపాయకారీగా పలు వ్యవహారాలు నడిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించేందుకు అన్ని విధాలా సహకరించారు. అప్పట్లో కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే అది వీగిపోయేందుకు సహకరించి ఆయన ప్రభుత్వాన్ని నిలబెట్టారు. 2011–2013 మధ్య కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో తెరచాటున కలిసి పనిచేశారు. రాష్ట్ర విభజనలోనూ కాంగ్రెస్తో స్నేహం..ఆ సమయంలోనే ఆంధ్రా ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగేలా రాష్ట్ర విభజన జరుగుతున్నా చంద్రబాబు కాంగ్రెస్కే అనుకూలంగా వ్యవహరించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకుని తన అవకాశవాదాన్ని చాటుకున్నారు. ఇక 20014–19 మధ్య కూడా ఎన్డీయేతో పొత్తులో ఉండి కాంగ్రెస్తో రహస్యం బంధాన్ని కొనసాగించారు. 2018లో ఆ ముసుగును తీసేసి ఎన్డీయే నుంచి బయటకొచ్చి యూపీఏతో స్నేహం చేశారు. అదే ఏడాది తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి ఎన్నికల ప్రచారం కూడా చేశారు. అనంతరం.. 2019 ఎన్నికల్లో యూపీఏతో అవగాహన కుదుర్చుకున్నారు. అయితే, ఆ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే యూపీఏను వదిలేసి ఎన్డీయేకి జైకొట్టారు...ఇలా తన రాజకీయ అవసరాన్ని బట్టి రంగులు మార్చడం చంద్రబాబుకే చెల్లింది. ఇదే క్రమంలో తాజాగా ఎన్డీయేతో కలిసి ఉంటూనే బీజేపీకి అనుకూలంగా అన్నీ చేస్తున్నట్లు నటిస్తూ తెర వెనుక మాత్రం కాంగ్రెస్తో సంబంధాలు కొనసాగించడంపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. -
బిల్లు వీగిపోవడమంటే బీజేపీ ఓడిపోవడమే: రేవంత్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: విపక్షాల ఐక్యతతో కేంద్రం ఓడిపోయిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిన్న సవరణతో మహిళా రిజర్వేషన్లు పెంచవచ్చు. సీట్లు పెంచడానికి మహిళా రిజర్వేషన్లు ముసుగు వేశారని మండిపడ్డారు. బీజేపీ విధానాలకి ఓటమి ఇది అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘దక్షిణ భారతానికి జరిగే అన్యాయాన్ని అడ్డుకున్నాం. మహిళా బిల్లు చాటున డీలిమిటేషన్ బిల్లును తెచ్చారు. ఎన్డీయే నిజాయితీగా బిల్లును తీసుకురాలేదు. బిల్లు వీగిపోవడం అంటే బీజేపీ ఓడిపోవడమే. బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని కాలరాయాలని చూసింది. ప్రధాని మోదీ కుట్రలను కాంగ్రెస్ సమర్థవంతంగా అడ్డుకుంది. దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలను కాంగ్రెస్ ఎండగట్టింది. ఇది రాజకీయ విధానాల ఓటమి కాదు.. బీజేపీ విధానాల ఓటమి. రాజ్యాంగం మార్చడానికి, రిజర్వేషన్లు రద్దు చేసేందుకు అబ్ కీబార్ చార్ సౌ అన్నారు బీజేపీకి 400 సీట్లు ఇచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేవారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువస్తే రేపే మద్దతు ఇస్తాం. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ కోటా పెట్టాలి. హైబ్రిడ్ మోడల్లో డీలిమిటేషన్ జరగాలి అని వ్యాఖ్యలు చేశారు. 2023 మహిళా బిల్లును యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎంతో మంది మహిళా నేతలను కాంగ్రెస్ తయారుచేసింది’ అని చెప్పుకొచ్చారు. -
సీఎం రేవంత్ ఇంటి వద్ద ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు భారీ ఎత్తున తరలి రావడంతో టెన్షన్ వాతవరణం నెలకొంది. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి నాయకత్వంలో వందలాది మంది మహిళా కార్యకర్తలు నిరసన ప్రదర్శనగా రేవంత్ రెడ్డి ఇంటి వైపు దూసుకెళ్లారు.ఈ క్రమంలో బీజేపీ మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, అక్కడ స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం, మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు జూబ్లీహిల్స్ రోడ్లన్నీ బారికేడ్లతో మూసివేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విడతల వారీగా వచ్చిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.మరోవైపు.. బీజేపీ నేతలను అడ్డుకోవడంపై రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మండిపడ్డారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘పక్ష నేతల తీరుకు నిరసనగా సీఎం ఇంటి ముట్టడికి బయలుదేరితే అడ్డుకున్నారు. మహిళా రిజర్వేషన్ అడ్డుకున్నారు. మా ముట్టడి అడ్డుకున్నారు. నిన్న దేశానికి ఎమర్జెన్సీ కంటే చీకటి రోజు. ఇండియా కూటమి మహిళలకు వ్యతిరేకం. కేవలం మైనార్టీ, కుటుంబ ప్రాతినిధ్యం కోసమే తప్ప సామాన్య మహిళ కోసం కాంగ్రెస్ మాట్లాడదు. కామన్ ఉమెన్ చట్ట సభలోకి రావొద్దని కాంగ్రెస్ తీరు ఉంది. రిజర్వేషన్ రాబోతుందని మహిళలు ఎంతో సంతోషపడ్డారు. హైబ్రిడ్, ఉత్తరాది, దక్షిణాది కేవలం మహిళ రిజర్వేషన్ వ్యతిరేకించే అంశాలు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు అన్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన పని క్షమించరానిది. మహిళా రిజర్వేషన్ అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీనే. మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు అంటూనే.. వ్యతిరేకంగా ఓట్లు వేశారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
చంద్రబాబు తప్పు చేస్తున్నావ్ శిక్ష అనుభవిస్తావ్ జాగ్రత్త
-
విపక్షాలన్నీ ఏకమైతే ప్రభుత్వానికి ఓటమి తప్పదు: ప్రియాంక గాంధీ
సాక్షి, ఢిల్లీ: డీలిమిటేషన్ వెనుక ఉన్న బీజేపీ కుట్రను అడ్డుకున్నామని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తెలిపారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో విపక్షంపై బురద జల్లే కుట్ర చేసిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి ఇది మొదటి దెబ్బ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తాజాగా ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘కేంద్రం తెచ్చిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ప్రజాస్వామ్యం గెలిచింది. కేంద్ర ప్రభుత్వానికి ఇది మొదటి ఎదురుదెబ్బ. విపక్షాలన్నీ ఏకమైతే ప్రభుత్వానికి ఓటమి తప్పదని నిరూపితమైంది. ఇతర అంశాలతో మహిళా బిల్లును కలపొద్దు. 543 సీట్ల నుంచే మహిళలకు 33 శాతం ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అమిత్ షా మాటలను ప్రజలు నమ్మడం లేదు. బీజేపీ తీరును ప్రజలు గమనిస్తున్నారు. తమ మాటలు నమ్మాలని కేంద్రం పదేపదే చెబుతున్నా ప్రజలు మాత్రం నమ్మడం లేదు. దేశం మారింది.. ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకుంటున్నారు. #WATCH | Delhi: Congress MP Priyanka Gandhi Vadra says, "Our stand is very clear. The entire INDIA alliance has made its stand very clear, and this vote has made it even clearer that, in our understanding, this bill that was introduced and the three-day discussion was not about… pic.twitter.com/6GkCRVtPXK— ANI (@ANI) April 18, 2026భారత్ మేల్కొనడాన్ని కేంద్ర ప్రభుత్వం నమ్మలేకపోతోంది. కేంద్ర ప్రభుత్వం మహిళలను తప్పుదోవ పట్టించకూడదు. వారికి తమ హక్కులను వెంటనే కల్పించాలి. మా వైఖరి అత్యంత స్పష్టం. ఇండియా కూటమి మొత్తం వైఖరిని చాలా స్పష్టంగా తెలియజేసింది. ప్రవేశపెట్టిన ఈ బిల్లు, దానిపై జరిగిన మూడు రోజుల చర్చ మా అవగాహన ప్రకారం మహిళా రిజర్వేషన్లకు సంబంధించినవి కాదు. కేవలం నియోజకవర్గాల పునర్విభజనకు మాత్రమే సంబంధించింది. ఇదే విషయం ఓటింగ్ ద్వారా మరింత స్పష్టం చేసింది. ఈ విషయంపై మేమందరం మా అభిప్రాయాలను చాలా నిర్ద్వంద్వంగా వ్యక్తం చేశాం’ అని చెప్పుకొచ్చారు. -
దక్షిణాది ప్రాతినిధ్యానికి కోత దేశద్రోహమే: రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ: డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకు మోదీ సర్కారు కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘కేవలం అధికారంలో కొనసాగడం కోసం దక్షిణాది, ఈశాన్య ప్రాంతాలకు, చిన్న రాష్ట్రాలకు లోక్సభలో ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్రం తలపెట్టిన డీలిమిటేషన్ నిజానికి దేశ ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చే కుట్ర. ఇది ముమ్మాటికీ దేశద్రోహ చర్యే’’అంటూ దుయ్యబట్టారు. రాజ్యాంగ (131వ) సవరణ, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల బిల్లులపై శుక్రవారం లోక్సభలో జరిగిన చర్చలో రాహుల్ సుదీర్ఘంగా మాట్లాడారు. సవరణ బిల్లును ‘చాలా ప్రమాదకరమైనది’గా అభివర్ణించారు. ‘‘మోదీ సర్కారు పూనుకున్న ఈ దేశ వ్యతిరేక చర్యకు విపక్షాలు మద్దతిచ్చే ప్రసక్తే లేదు. సవరణ బిల్లును ఓడించి తీరతాయి’’అని పేర్కొన్నారు. అది ఆమోదం పొందదని బీజేపీకి కూడా తెలుసన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను, ప్రధాని మోదీ తీరును ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా ఎండగట్టారు. దళితులు, ఓబీసీలకు అన్యాయం కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది అసలు మహిళా బిల్లు కానే కాదని రాహుల్ కొట్టిపారేశారు. ‘‘నిజమైన మహిళా బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. దాన్ని పదేళ్ల తర్వాత అమలు చేస్తామని బీజేపీ చెబుతోంది. ఇది కేవలం మహిళల మాటున దాక్కుని దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేందుకు చేసిన సిగ్గుమాలిన చర్య! జమ్మూకశ్మీర్లో, అస్సాంలో బీజేపీ ఇదే పని చేసింది. దాన్నిప్పుడు దేశమంతటా అమలు చేసే పనిలో పడింది. వారికి దమ్ముంటే పాత బిల్లును ఇప్పుడే తేవాలి. దాన్ని ఈ క్షణం నుంచే అమలు చేసేలా విపక్షాలన్నీ మద్దతిస్తాయి’’అని సవాలు చేశారు. ఓబీసీలు, దళితులకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించకుండా వారిని అధికారానికి దూరం చేయడమే బీజేపీ ఉద్దేశమని రాహుల్ ఆరోపించారు. అందుకే కులగణనకు ముందే హడావుడిగా బిల్లు తెచ్చిందని ఆక్షేపించారు. ‘‘బీజేపీ నేతలు ఓబీసీలను, దళితులను హిందువులని పిలుస్తారు. కానీ దేశ అధికార నిర్మాణంలో వారికి కనీస స్థానమివ్వరు! కార్పొరేట్ రంగంలో, న్యాయవ్యవస్థలో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో, మీడియాలో దళితులు, ఓబీసీలు ఎక్కడున్నారు?’’అంటూ నిలదీశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ ’మనువాదాన్ని’తీసుకురావాలని చూస్తున్నారని ఆరోపించారు. దక్షిణాది, ఈశాన్య ప్రజలకు అండగా కాంగ్రెస్ దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాలకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందని రాహుల్ అన్నారు. ‘‘అక్కడి సోదరసోదరీమణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత సమాఖ్యలో మీరంతా సమాన భాగస్వాములే. లోక్సభలో మీ ప్రాతినిధ్యాన్ని తాకే సాహసం చేయడానికి బీజేపీని అనుమతించబోం’’అని చెప్పారు. ‘‘గతంలో ఇందిరాగాం«దీ, వాజ్పేయి వంటి ప్రధానులు కూడా డీలిమిటేషన్ సవాలును ఎదుర్కొన్నారు. కానీ దానివల్ల దేశానికి జరిగే ప్రమాదాన్ని గుర్తించి వెనక్కి తగ్గారు’’అని ఆయన గుర్తు చేశారు. ‘16’లోనే అంతా దాగుంది! ప్రసంగం సందర్భంగా దేశ ప్రజలకు రాహుల్ గాంధీ ఒక పజిల్ ఇచ్చారు. ‘‘నిన్న లోక్సభలో ప్రధాని ప్రసంగాన్ని జాగ్రత్తగా గమనించా. ఆయనలో ఉత్సాహమే లేదు. ఎందుకంటే ఈ బిల్లు పాస్ కాదని ఆయనకు తెలుసు. అంతలో తేదీ చూసి ఆశ్చర్యపోయా! అది ఏప్రిల్ ‘16’. అసలు మర్మమంతా అందులోనే దాగుంది! మీ సమస్యలన్నింటికీ సమాధానం ‘16’లోనే దొరుకుతుంది. అదేమిటో ఎవరికైనా అర్థమైతే ఎక్స్లో నాకు మెసేజ్ చేయండి’’అంటూ సభికుల్లో ఆసక్తి రేకెత్తించారు. మోదీ ఓ మాంత్రికుడు! ప్రధాని మోదీపై లోక్సభలో రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయనను బాలకోట్, సిందూర్, పెద్ద నోట్ల రద్దు మాంత్రికునిగా అభివర్ణించి సభలో కలకలం రేపారు. ‘‘ఒక బడా వ్యాపారవేత్తతో మోదీ కుమ్మక్కయ్యారు. ఈ మాంత్రికుని చరిత్ర, ప్రధాని అయ్యేదాకా జరిగిన ప్రతి విషయమూ ఆ బడా వ్యాపారవేత్తకు పూర్తిగా తెలుసు. ఆ రహస్యాల సాయంతోనే ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు. అమెరికాతో పలు ఒప్పందాలు కూడా ప్రధానిగా మోదీ రాజీ పడటం వల్లే జరిగాయి’’అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. అభ్యంతరకర పదాలు వాడినందుకు ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలని మంత్రులు రాజ్నాథ్సింగ్, కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. బాలాకోట్, సిందూర్ ప్రస్తావనతో సాయుధ దళాలను రాహుల్ అవమానించారని దుయ్యబట్టారు. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. మోదీకి, నాకు భార్య బాదరబందీ లేదు లోక్సభలో నవ్వులు పూయించిన రాహుల్ మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లుపై ప్రసంగం సందర్భంగా ప్రధాని మోదీని, తనను ఉద్దేశించి రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తామిద్దరికీ భార్య తాలూకు బాదరబందీ లేదంటూ సభలో నవ్వులు పూయించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు చేసిన సరదా వ్యాఖ్యలు ఇందుకు నేపథ్యమయ్యాయి. ‘‘కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్రాం మేఘ్వాల్ ఆయన భార్యపై అందమైన కవిత అల్లారు. దాంతో నా భార్య తనకోసం నేనలా కవిత చెప్పలేదని నాపై అలిగింది’’అని రిజిజు చెప్పుకొచ్చారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ, ‘‘జాతి నిర్మాణంలో మహిళలే ప్రధాన చోదక శక్తి. మగవాళ్లను వాళ్లెంతగానో ప్రభావితం చేస్తారు. తల్లి, సోదరి, భార్య నుంచి ఎంతో నేర్చుకుంటాం. అయితే ప్రధానికి, నాకు భార్య బాదరబందీ లేదనుకోండీ! కాకపోతే తల్లి, సోదరి ఉన్నారు’’అనడంతో సభికులంతా గొల్లున నవ్వారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపైనా ఈ సందర్భంగా రాహుల్ సరదా వ్యాఖ్యలు చేశారు. ‘‘గురువారం సభలో నా సోదరి ప్రియాంక గొప్పగా ప్రసంగించింది. ఆ క్రమంలో 20 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను సాధించలేని దాన్ని తను కేవలం ఐదే నిమిషాల్లో చేసి చూపించింది. అదేమిటో తెలుసా? అమిత్ షాను నవ్వించడం!’’అనడంతో సభంతా మరోసారి నవ్వుల్లో మునిగిపోయింది. ఏమిటా ‘16 పజిల్’? లోక్సభలో ప్రసంగం సందర్భంగా రాహుల్ పేర్కొన్న ‘16 పజిల్’ఏమై ఉంటుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు మర్మమంతా 16 సంఖ్యలోనే దాగుందని, అదేమిటో ఎవరికైనా అర్థమైతే చెప్పాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పలు ఊహాగానాలకు తెర తీశాయి. బహుశా అధికార ఎన్డీఏ కూటమికి చెందిన 16 మంది టీడీపీ లోక్సభ సభ్యులు రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తారన్నది ఆయన ఉద్దేశం కావచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. 16 సంఖ్య ‘ఎప్స్టీన్’లా ధ్వనిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేసింది. తద్వారా, ఆ సెక్స్ కుంభకోణానికి సంబంధించి విడుదలైన 16 నిమిషాల వీడియో టేప్ను ఉద్దేశించి రాహుల్ ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని సంకేతమిచ్చింది. -
నిస్సిగ్గుగా వ్యతిరేకిస్తున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మహిళా రిజర్వేషన్లను ప్రతిపక్షాలు నిస్సిగ్గుగా వ్యతిరేకిస్తున్నా యని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు సీట్లు పెరగడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని ధ్వజమెత్తారు. మహిళల హక్కులకు ఎవరు అ డ్డుపడుతున్నారో దేశ ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో మహిళలే వారికి బుద్ధి చెబుతారని స్పష్టంచేశారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఓటర్ల హేతుబద్దీకరణకు వీలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాలలో దాదాపు 40 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. అన్ని స్థానాల్లో ఓటర్ల సంఖ్య దాదాపు సమానంగా ఉండేలా చేయడం డీలిమిటేషన్తో సాధ్యమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై శుక్రవారం లోక్సభలో జరిగిన చర్చకు అమిత్ షా సమాధానమిచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గాల పునర్విభజన హక్కును ప్రజలకు దక్కకుండా చేసిందని, ఇప్పటికీ అదే పని చేస్తోందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లను ప్రజలు ముక్తకంఠంతో స్వాగతిస్తుండగా, విపక్ష ‘ఇండియా’కూటమి మాత్రం వ్యతిరేకిస్తోందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణను ఎవరూ అడ్డుకోలేరని తేల్చిచెప్పారు. కాలానుగుణంగా నియోజకవర్గాల పునర్విభజనకు రాజ్యాంగం వీలు కల్పిస్తోందని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీల జనాభా పెరుగుదలకు తగ్గట్టుగా వారికి సీట్లను పెంచే నిబంధనలు కూడా ఉన్నాయని తెలిపారు. డీలిమిటేషన్ను వ్యతిరేకించడం ద్వారా ఎస్సీ, ఎస్టీల సీట్ల పెంపును కూడా విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. అమిత్ షా ఇంకా ఏం మాట్లాడారంటే.. పారదర్శకంగా పునర్విభజన ‘‘ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు గల కారణాలపై సభలో చాలామందికి అనుమానాలు ఉన్నాయి. 2026 తర్వాత నిర్వహించే జనగణన అనంతరం జరిగే పునర్విభజనలో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ‘నారీశక్తి వందన అధినియం’లో పేర్కొన్నాం. 1971లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు డీలిమిటేషన్ను నిలిపివేశారు. నిలిపివేసిన సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా మాత్రమే ‘నారీశక్తి వందన అధినియం’ను అమలు చేయగలం. అందుకే ఈ బిల్లు తీసుకొచ్చాం. 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న లోక్సభ స్థానాలు 127 వరకు ఉన్నాయి. ఇది ‘ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒక విలువ’అనే సూత్రానికి విరుద్ధం. కొన్నిచోట్ల 45 లక్షల ఓటర్లకు ఒక ప్రతినిధి ఉండగా, మరికొన్ని చోట్ల 6 లక్షల ఓటర్లకు ఒక ప్రతినిధి ఉన్నారు. దీనివల్ల ప్రతి ఓటు విలువ సమానంగా లేదు. తెలంగాణలోని మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో ఏకంగా 48 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఒక్క ఎంపీ ఇంత భారీ జనాభా ఆకాంక్షలను ఎలా నెరవేర్చగలరు? ఈ అసమానతలను తొలగించి మహిళా రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయాలంటే పునర్విభజన అనివార్యం. పునర్విభజన ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంది. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లిఖితపూర్వకంగా హామీ ఇస్తాం కుల గణనను ఆలస్యం చేయడానికి ప్రభు త్వం కుట్ర పన్నిందని, అందుకే హడావుడిగా మూడు బిల్లులు తీసుకొచ్చిందన్న విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి నష్టం జరుగుతుందన్న ప్రచారంలో నిజం లేదు. ప్రతి రాష్ట్రంలో 50% సీట్లు పెంచాలన్న ప్రతిపక్షాల డిమాండ్పై లిఖితపూర్వకంగా హామీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. సభను గంటసేపు వాయిదా వేస్తే ఇప్పుడే ఆ సవరణ చేస్తాం. మతపరమైన రిజర్వేషన్లకు తావులేదుమతం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చే ప్రసక్తే లేదు. రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు తావులేదు. ‘ఇండియా’కూటమి బుజ్జగింపు రాజకీయాల కోసమే ముస్లిం రిజర్వేషన్ల డిమాండ్ను తెరపైకి తెస్తోంది. దేశంలో ఓబీసీలకు అతిపెద్ద వ్యతిరేక పార్టీ కాంగ్రెస్సే. మండల్ కమిషన్ను ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. మోదీ ప్రభుత్వంలో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారు. జాతీయ ఓబీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధత కల్పించిన ఘనత మాదే. మహిళా సాధికారతకు బీజేపీ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తోంది. గ తంలో సుష్మా స్వరాజ్, ఆనందిబెన్ పటేల్ లాంటి వారికి సీఎంలుగా అవకాశం ఇచ్చాం. పీవీని కాంగ్రెస్ సొంత మనిషిగా చూడలేదు దేశంలో మహిళలకు రిజర్వేషన్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో ప్రారంభించిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుదే. 1992లో 72, 73వ రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి పీవీ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. పీవీ కాంగ్రెస్ నేత అయినప్పటికీ, ఆ పార్టీ ఆయనను ఏనాడూ సొంత మనిషిగా అంగీకరించలేదు. ఆయన మరణానంతరం భౌతికకాయానికి అవమానం జరిగింది. కాంగ్రెస్ పీవీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వలేదు. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చిన మహనీయుడు పీవీ పేరును గర్వంగా చెప్పండి. కాంగ్రెస్ ఆయనను విస్మరించడం శోచనీయం’’అని అమిత్ షా ఆక్షేపించారు. -
నారీ.. సారీ
న్యూఢిల్లీ: మోదీ సర్కారుకు పార్లమెంటులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేసేందుకు, లోక్సభ స్థానాల సంఖ్యను 816 పెంచేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు లోక్సభలో వీగిపోయింది. ముందునుంచీ ఊహించినట్టుగానే బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని అధికార పక్షం సాధించలేకపోయింది. శుక్రవారం సాయంత్రం లోక్సభలో చేపట్టిన కీలక ఓటింగ్లో మొత్తం 540 మంది సభ్యులకు గాను 528 మంది పాల్గొన్నారు.బిల్లు ఆమోదానికి 352 ఓట్లు రావాల్సి ఉండగా 298 మంది మాత్రమే అనుకూలంగా ఓటేశారు. 230 మంది విపక్ష సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. దాంతో సవరణ బిల్లు వీగిపోయినట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. దానితో పాటుగా ప్రవేశపెట్టిన డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను కూడా వెనక్కు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. ఆ రెండు బిల్లులూ రాజ్యాంగ సవరణ బిల్లుతోనే ముడిపడి ఉన్నందున వాటిని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో పార్లమెంటులో ఒక బిల్లు వీగిపోవడం ఇదే తొలిసారి! ఈ నేపథ్యంలో మోదీ సర్కారు లోక్సభ స్థానాల పెంపు యత్నాలకు తాత్కాలికంగా తెర పడినట్టే. సవరణ బిల్లువీగిపోయినంత మాత్రాన నిరాశ చెందబోమని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల సత్వర అమలుకు తమ ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంటుందని రిజిజు పేర్కొన్నారు. కాంగ్రెస్, తృణమూల్, సమాజ్వాదీ, డీఎంకే తదితర పక్షాలు ఎంతటి మహిళా వ్యతిరేకులో ఈ ఉదంతం మరోసారి రుజువు చేసిందంటూ కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు దుయ్యబట్టారు. మహిళా బిల్లు ముసుగులో స్వీయ రాజకీయ లబ్ధి కోసం లోక్సభ నియోజకవర్గాలను పెంచుకోవాలన్న బీజేపీ కుట్రలకు అడ్డుకట్ట పడిందని కాంగ్రెస్ తదితర పార్టీలు చెప్పుకొచ్చాయి. 2029 లోక్సభ ఎన్నికల్లోనే గాక దేశవ్యాప్తంగా ఇకపై జరగబోయే అన్ని ఎన్నికల్లోనూ విపక్షాలు మహిళల ఆగ్రహ జ్వాలలను చవిచూడక తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. సవరణ బిల్లును విపక్షాలు ఓడించడాన్ని బీజేపీ మహిళా ఎంపీలు తీవ్రంగా నిరసించారు. శుక్రవారం సాయంత్రం లోక్సభ వాయిదా పడ్డ అనంతరం పార్లమెంటు ఆవరణలో వారు ధర్నాకు దిగారు. ‘మహిళలకు జరిగిన అవమానాన్ని భారత్ సహించబోదు’ అంటూ ప్లకార్డులు చేబూని నినాదాలు చేశారు. కేంద్ర మంత్రులు శోభా కరంద్లాజె, అన్నపూర్ణా దేవి, రక్షా ఖడ్సే, ఎంపీ కంగనా రనౌత్ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. విపక్షాల తీరును నిరసిస్తూ బీజేపీ మహిళా ఎంపీల నినాదాలు పార్లమెంటు ప్రత్యేక భేటీ మహిళా రిజర్వేషన్ల సత్వర అమలుకు వీలుగా ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ చట్టానికి మోదీ సర్కారు కీలక సవరణలు చేపట్టింది. అందుకోసం రూపొందించిన మూడు బిల్లుల ఆమోదానికి పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచింది. రాజ్యాంగ (131వ సవరణ), డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట (సవరణ) బిల్లులను గురువారం లోక్సభలో ప్రవేశపెట్టింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేయాలని, అందుకోసం లోక్సభ స్థానాల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి 816కు పెంచాలని, అందుకు 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని రాజ్యాంగ సవరణ బిల్లులో కీలక ప్రతిపాదనలు చేసింది. మూడు బిల్లులపై గురువారం నుంచి శుక్రవారం సాయంత్రం దాకా లోక్సభలో 18 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ జరిగింది. 130 మందికి పైగా ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. అనంతరం శుక్రవారం సాయంత్రం రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును సభ ఓటింగ్కు చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు విపక్ష నేత రాహుల్గాంధీ కూడా సభలో ఉన్నారు. బిల్లు వీగిన అనంతరం రిజిజు మాట్లాడుతూ ఇది పూర్తిగా విపక్షాల పాపమేనన్నారు. దేశ మహిళలను గొప్పగా గౌరవించుకునే సువర్ణావకాశాన్ని అవి కోల్పోయాయంటూ ఆక్షేపించారు. ‘‘కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి. దేశ మహిళలు ఆ పార్టీని ఎప్పటికీ క్షమించరు’’ అంటూ దుయ్యబట్టారు. మహిళలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేదాకా తమ ప్రభుత్వం విశ్రమించబోదని మంత్రి చెప్పారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచే బిల్లును ఓడించి కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, సమాజ్వాదీ పార్టీలు సంబరాలు చేసుకోవడం దారుణమని అమిత్ షా ఆక్షేపించారు. మహిళల పట్ల వారి వివక్షకు ఇది అద్దం పట్టిందన్నారు. రాజ్యాంగంపై మోదీ సర్కారు తలపెట్టిన దాడిని మాత్రమే తాము ఓడించామని లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ స్పష్టం చేశారు. ఎన్డీఏకు ‘ఐదు’ అదనం ‘ఇండియా’కు 3 తక్కువ మహిళా చట్ట సవరణ బిల్లుపై చేపట్టిన ఓటింగ్లో అధికార ఎన్డీఏ కూటమికి దాని పూర్తి బలం కంటే 5 ఓట్లు అదనంగా రావడం విశేషం. అదే సమయంలో విపక్ష ఇండియా కూటమికి మొత్తం బలం కంటే 3 ఓట్లు తగ్గాయి. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలన్నింటికీ కలిపి 293 మంది, ఇండియా కూటమి పార్టీల్లో 233 మంది ఎంపీలున్నారు. అయితే ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లొచ్చాయి. వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. -
కాంగ్రెస్ ఎమ్మెల్యేకి జీవితఖైదు
బెంగళూరు: కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వినయ్ కులకర్ణికి జీవితఖైదు విధించింది ప్రజాప్రతినిధుల కోర్టు. బీజేపీ నేత యోగేష్గౌడ్ హత్య కేసులో వినయ్ కులకర్ణిని దోషిగా నిర్ధారించిన కోర్టు.. జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. 2016లో యోగేష్ గౌడ్ హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘ విచారణల అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణితో పాటు మరో 16 మందికి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం యావజ్ఝీవ కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో ఇప్పటికే దోషిగా వినయ్ కులకర్ణిని నిర్ధారించిన కోర్టు.. శిక్షా కాలాన్ని శుక్రవారం ఖరారు చేసింది. ఈ ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ శిక్షా కాలాన్ని ఖరారు చేశారు. ఈ కేసుకు సంబంధించి వినయ్ కులకర్ణి, మరో 16 మందిపై హత్య (సెక్షన్ 302), నేరపూరిత కుట్ర (సెక్షన్ 120బి) నేరాలకు పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధారించింది.ఈ హత్య కేసులో పదవిలో ఉన్న శాసనసభ్యుడి ప్రమేయం ఉన్నందున సమాజానికి గట్టి సందేశం పంపే శిక్ష విధించాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శివానంద పెర్ల , ఎస్. హేమహద్లు వాదించారు. యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని తమ వాదనలు వినిపించారు. అయితే వినయ్ కులకర్ణి న్యాయబృందం మాత్రం ఆయనకున్న కనికరం చూపి శిక్ష తగ్గించాలని అ భ్యర్థించిన ప్పటికీ నేరం యొక్క తీవ్రతను బట్టి యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది కోర్టు.యోగేష్ గౌడ్ హత్య ఇలా..2016, జూన్ 15న బీజేపీ ధార్వాడ్ జిల్లా పంచాయత్ సభ్యుడైన యోగేష్గౌడ గౌడర్ను ధార్వాడ్లోని ఆయన జిమ్లో దారుణంగా నరికి చంపారు. మొదట్లో స్థానిక పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఈ కేసును స్థానిక పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేశారు. అప్పటి జిల్లా ఇన్చార్జ్ మంత్రి కులకర్ణి అప్పటి జిల్లా ఇన్చార్జ్ మంత్రి కులకర్ణి.., ఎదుగుతున్న రాజకీయ ప్రత్యర్థిని అణచివేసేందుకు ఈ హత్యను చేయించారనే ఆరోపణలు వచ్చాయి. అయితే 2016లో హత్య జరిగితే 2019లో ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారు. -
రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో హైటెన్షన్
సాక్షి, రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో హైటెన్షన్ నెలకొంది. మూడేళ్ల ముందే ఇబ్రహీంపట్నంలో ఎన్నికల వేడి ముదిరింది. తాజా, మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్ల పర్వం తీవ్రస్థాయికిచేరాయి. ఇవాళ చర్చకు రావాలని మల్రెడ్డి రంగారెడ్డికి మంచిరెడ్డి కిషన్రెడ్డి సవాల్ విసిరారు. మేడిపల్లిలో చర్చ కోసం బీఆర్ఎస్ శ్రేణులు టెంట్లు ఏర్పాటు చేసింది. సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించడంతో పోలీసులతో బీఆర్ఎస్ నేతలు.. వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ శ్రేణులు గ్రామంలో భారీగా తరలిరావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఫార్మా భూముల విషయంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య వివాదం సాగుతోంది. ‘‘అన్నీ నా హయాంలో జరిగిన పనులే.. కొత్తగా తెచ్చింది ఏముంది?" అంటూ మల్రెడ్డి లెక్కలను మంచిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు మేడిపల్లి భూముల వద్దకు చర్చకు రావాలని మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అక్రమ కబ్జాలు తేలాలంటే ఇబ్రహీంపట్నం బస్ డిపో వెనుక ఉన్న 45 ఎకరాల దగ్గరకు రావాలని మల్రెడ్డి డిమాండ్ చేశారు.ఫార్మా భూముల్లో భారీ స్కామ్ జరిగిందన్న ఎమ్మెల్యే ఆరోపణలతో ఇరుపార్టీల నేతలు.. వ్యక్తిగత దూషణలకు దిగారు. ఇద్దరు నేతలు వేర్వేరు ప్రాంతాల్లో సవాళ్లు విసురుకోవడంతో నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. పొలీసులు భారీగా మోహరించారు. సవాళ్ల పర్వం ఉద్రిక్తతకు దారితీసింది. -
కర్ణాటకలో బిగ్ ట్విస్ట్.. సిద్దరామయ్యకు ఎదురుగాలి!
సాక్షి, బెంగళూరు: కొన్ని నెలలుగా కన్నడ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కుర్చీ గురించి రగడ జరుగుతూనే ఉంది.. సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ మధ్య పోరాటంతో ప్రభుత్వంలో, పార్టీలో వర్గాలు ఏర్పడ్డాయి. అంతఃకలహాలు అధికం కావడంతో ఆధిక్యం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. కొన్నిరోజులుగా సీఎం సిద్ధరామయ్య శిబిరంపై దాడులు జరుగుతున్నాయి. పలువురు సిద్ధరామయ్య సన్నిహితులు పదవులు కోల్పోయేలా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శిబిరం చేయగలిగింది. వరుస ఎదురుదెబ్బలతో సీఎం సిద్ధరామయ్య డైలామాలో పడిపోయారు. రాజణ్ణ నుంచి షురూ సీఎం ఆప్తుడు మంత్రి కేఎన్ రాజణ్ణ.. రాహుల్ గాంధీ మీద నోరు జారడంతో వెంటనే పదవి నుంచి తొలగించారు. దావణగెరె ఉప ఎన్నికలు వచ్చాక సిద్దరామయ్యకు ఎదురుగాలి అధికమైంది. అక్కడ తిరుగుబాటు అభ్యర్థికి మద్దతిచ్చారని సీఎం రాజకీయ కార్యదర్శి పదవి నుంచి నజీర్ అహ్మద్ సస్పెండ్, మైనారిటీ నేత అబ్దుల్ జబ్బార్ను పదవితో పాటు పార్టీ సభ్యత్వం నుంచి తీసేయడం కలకలానికి కారణమైంది. సిద్ధరామయ్య కూడా సన్నిహితులను కాపాడుకోవడానికి ఎక్కువ పోరాటం చేయడం లేదు. ఈ సమయంలో కేపీసీసీ చీఫ్గా డీకే శివకుమార్ పోరును తీవ్రం చేశారు. భవిష్యత్ కష్టమే.. భవిష్యత్తులో మరింత మంది సిద్ధరామయ్య వర్గీయులకు ఎదురు దెబ్బలు తగిలినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది. నోటీసులు, క్రమశిక్షణ చర్యల హెచ్చరికలు కాకుండా నేరుగా పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు కొనసాగుతాయని తెలుస్తోంది. తాను ముఖ్యమైన పదవిలో ఉండడంతో పాటు పార్టీ పరిమితుల దృష్ట్యా సిద్ధరామయ్య మౌనం వహిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు తన పదవిని కాపాడుకోవడం చాలా ముఖ్యమని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు పలువురు సీనియర్లు పేర్కొన్నారు. త్వరలో బెంగళూరుకు ఓ చెందిన ఓ మంత్రిని కూడా పార్టీ హైకమాండ్ తప్పించవచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. మునుముందు ఏం జరుగుతుందనేది సస్పెన్స్గా ఉంది. బెంగళూరు విమానాశ్రయంతో ప్రధాని మోదీ, సిద్దరామయ్య చెవిలో మంతనాలు జరపడం దేనికి సంకేతమని తీవ్ర చర్చనీయాంశమైంది. -
వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు
మూడు కీలక బిల్లులకు సంబంధించి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో నేడు ఓటింగ్ ప్రక్రియ.. -
చాణక్యుడు బతికి ఉంటే.. బీజేపీ చాతుర్యానికి ఆశ్చర్యపోయేవాడు
న్యూఢిల్లీ: చాణక్యుడు ఇప్పుడు గనుక బతికి ఉంటే బీజేపీ నాయకుల రాజకీయ చాతుర్యం చూసి ఆశ్చర్యపోయేవాడని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. గురువారం మూడు బిల్లులపై జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తోందని, దేశ సమగ్రతపై అతిపెద్ద దాడి ప్రారంభించిందని ఆరోపించారు. ఒకవైపు మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూనే మరోవైపు ఓబీసీల హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. చిన్న రాష్ట్రాల ప్రాబల్యాన్ని తగ్గించి, ప్రజాస్వామ్యాన్ని ముక్కలు చేసి, వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. తన మాటలకు అమిత్ షా నవ్వుతున్నారని, ఈ స్కీమ్ వెనుక ఆయనే ఉన్నారని చెప్పారు. అమిత్ షా నవ్వుతున్నారంటే తన వ్యాఖ్యలతో ఆయన ఏకీభవించినట్టేనని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో ఏకైక చాంపియన్గా మారాలన్నది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోందని అన్నారు. పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు కల్పించిన ఘనత కాంగ్రెస్దేనని ప్రియాంక తేల్చిచెప్పారు. ‘ఒక ఓటు, ఒక పౌరుడు, ఒకే విలువ’అనే విధానాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చిందన్నారు. దీనివల్ల దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే మహిళలకు ఓటు హక్కు లభించిందన్నారు. అమెరికాలో ఓటు హ క్కు కోసం మహిళలు 150 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడున్న స్థానాల ఆధారంగానే రిజర్వేషన్లు కేవలం అధికారం కోసమే మహిళా రిజర్వేషన్ల అంశాన్ని వాడుకుంటున్నారని మోదీ ప్రభుత్వంపై ప్రియాంక నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించినట్లయితే దేశంలో ప్రజాస్వామ్యం ఉనికిలో లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. మహిళా కోటా చట్టాన్ని డీలిమిటేషన్తో ఎందుకు ముడిపెట్టారో చెప్పాలని నిలదీశారు. లోక్సభలో ప్రస్తుతం ఉన్న స్థానాల ఆధారంగానే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. -
తెలంగాణ బలిదానాలకు కాంగ్రెస్సే కారణం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమంపై లోక్సభలో చెలరేగిన దుమారంపై కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి ఘాటుగా స్పందించారు. దశాబ్దాల తెలంగాణ ఉద్యమంలో జరిగిన బలిదానాలకు ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీయే కారణమని విరుచుకుపడ్డారు. గురువారం లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో కిషన్రెడ్డి జోక్యం చేసుకొని వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రజలను కానీ పవిత్రమైన తెలంగాణ ఉద్యమాన్ని కానీ అవమానించే ఉద్దేశం తేజస్వీ సూర్యకు లేదన్నారు. ఒకవేళ అలా మాట్లాడి ఉంటే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటామని స్పష్టం చేశారు. తేజస్వీ సూర్య వ్యాఖ్యల వెనుకున్న అసలు ఉద్దేశాన్ని సభకు సవివరంగా తెలియజేశారు. కాంగ్రెస్ తప్పుడు విధానాలు, మోసపూరిత వైఖరి వల్లే తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. -
మహిళా రిజర్వేషన్ బిల్లు: కంగనా రనౌత్ ఏమన్నారంటే?
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరించే బిల్లును ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ గురువారం బాలీవుడ్ సినిమాలోని ఒక డైలాగ్ ఉపయోగించారు. మూడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం ఈ సమస్యను ఎందుకు పరిష్కారం చేయకుండా వదిలేసిందని ఆమె ప్రశ్నించారు.మహిళా కోటాకు సంబంధించిన మూడు బిల్లులపై లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా, హిమాచల్ ప్రదేశ్లోని మండికి చెందిన నటి-రాజకీయవేత్త బాలీవుడ్ చిత్రం దిల్ వాలే దుల్హనియా లే జాయేంగేలోని 'జా సిమ్రాన్, జీ లే అప్నీ జిందగీ' డైలాగ్ ప్రస్తావించారు . దేశంలోని మహిళలు స్వేచ్ఛగా తమ జీవితాలను గడపాలని ప్రధానమంత్రి పరోక్షంగా చెబుతున్నారని ఆమె అన్నారు.రానౌత్, అంతకుముందు ముందు రోజు ఒక పాడ్కాస్ట్లో ఒక మహిళా ఇంటర్వ్యూయర్తో జరిగిన సంభాషణను కూడా గుర్తుచేసుకున్నారు. "నేను ఆమెను ఒక ప్రశ్న అడిగాను. 'మీ గుండెపై చేయి పెట్టుకుని చెప్పండి, మహిళలకు ఎప్పుడైనా ఈ ప్రత్యేక హక్కు లభించిందా? మహిళలకు ఇంతటి స్వర్ణయుగం ఎప్పుడైనా ఉందా?' అని అడిగాను," అని ఆమె లోక్సభలో అన్నారు.బిల్లును తీసుకురావడానికి బీజేపీ వాళ్లు ఎందుకంత తొందరపడుతున్నారు అని సోనియా గాంధీ మాటలకు.. మేము కూడా మీలాగే దాన్ని 30 ఏళ్ళ పాటు అలా వదిలేయాలా?" అని రనౌత్ ప్రశ్నించారు.మహిళలకు న్యాయం అందించడానికి ప్రధాని మోదీ వేగంగా చర్యలు తీసుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. 60 ఏళ్లలో జరగనిది ఆయన 10 ఏళ్లలో సాధించారు. అది పక్కా ఇళ్లైనా, గ్యాస్ సిలిండర్ల పంపిణీ అయినా, లేదా రక్షణ దళాల్లోకి మహిళలను చేర్చుకోవడమైనా. మహిళలకు న్యాయం చేయడానికి ఆయన తొందరపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. -
డీలిమిటేషన్ బిల్లుపై విపక్షాల ఆరోపణలకు అమిత్షా కౌంటర్
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, డీ లిమిటేషన్ బిల్లు, పునర్విభజన కమిషన్ బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. -
‘పునర్వీభజన’కు వ్యతిరేకంగా ఓటేస్తాం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లులోని నియోజకవర్గాల పునర్వీభజన నిబంధనలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని వెల్లడించాయి. సంబంధిత బిల్లును తీసుకొస్తున్న విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఇది రాజకీయ ప్రేరేపిత బిల్లు అని ఆరోపించారు. విపక్ష ‘ఇండియా’కూటమి పార్టీల నేతలు బుధవారం ఢిల్లీలో ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. గురువారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించారు. భేటీ అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. మహిళ రిజర్వేషన్ల బిల్లును తీసుకొస్తున్న విధానం పట్ల తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. ప్రతిపక్షాలను అణచివేసి బిల్లును నెగ్గించుకోవాలన్నదే ప్రభుత్వ ప్రయత్నంగా కనిపిస్తోందన్నారు. మహిళా రిజర్వేషన్లకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. గతంలో ఆమోదించిన సవరణ బిల్లును అమలు చేయాలని కోరుతున్నామని, ప్రభుత్వం మాత్రం డీలిమిటేషన్ పేరిట డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో డీలిమిటేషన్ వ్యవహారాన్ని వ్యతిరేకించాలని ఉమ్మడిగా నిర్ణయించినట్లు స్పష్టంచేశారు. మహిళా రిజర్వేషన్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. స్పష్టత లేని జనగణన, భవిష్యత్తు డీలిమిటేషన్తో మహిళా రిజర్వేషన్లను ముడిపెట్టొద్దని కోరారు. పార్లమెంట్ వద్ద ఉండాల్సిన అధికారాలను కార్యనిర్వాహక వర్గానికి కల్పిస్తూ, రాజకీయంగా అనుకూలమైనప్పుడల్లా నియోజకవర్గాలను మార్చేస్తే ఎలా అని ప్రశ్నించారు. అస్సాం, జమ్మూకశ్మీర్లో ఇలాంటి మోసం చూశామని ఖర్గే తెలిపారు. అందుకే నియోజకవర్గాల పునర్వీభజనను కచ్చితంగా వ్యతిరేకిస్తామని స్పష్టంచేశారు. అధికారం కోసమే ఈ కుతంత్రం: రాహుల్ మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతు ఇస్తోందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ఈ బిల్లును 2023లో పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చెప్పారు. మహిళా రిజర్వేషన్లు ఇప్పటికే రాజ్యాంగంలో భాగమేనని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపాదిస్తున్న దానికి మహిళా రిజర్వేషన్లతో ఎలాంటి సంబంధం లేదన్నారు. డీలిమిటేషన్తో అధికారం దక్కించుకోవాలన్న కుతంత్రం తప్ప ఇందులో ఇంకేముందని ప్రశ్నించారు. విపక్షాల భేటీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అనంతరం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కుల గణన డేటాను విస్మరించి ఓబీసీ, దళిత, ఆదివాసీల హక్కులను చోరీ చేస్తే సహించబోమని హెచ్చరించారు. అలాగే దక్షిణ, ఈశాన్య, వాయువ్య, చిన్న రాష్ట్రాల పట్ల అన్యాయంగా వ్యవహరించడాన్ని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ప్రమాదకరం: కె.సి.వేణుగోపాల్మోదీ ప్రభుత్వం చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన చర్య ప్రమాదకరమైనదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై, ముఖ్యంగా రాష్ట్రాలకు సమాన అధికారాన్ని కల్పించే సమాఖ్య వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. విపక్ష నేతల సమావేశంలో డీఎంకే నాయకుడు టి.ఆర్.బాలు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు సాగరికా ఘోష్, శివసేన(ఉద్ధవ్) నాయకులు సంజయ్ రౌత్, అరవింద్ సావంత్, ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సూలే, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ తదితరులు పాల్గొన్నారు. -
నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు, కేడర్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీపై ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. సీఎం రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్గౌడ్లు బుధవారం సమావేశమయ్యారు. ఉదయం 11 గంటల నుంచి నాలుగున్నర గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాల వారీగా నేతల పేర్లను వడబోసిన ముగ్గురు నేతలు.. పలు కీలక పదవుల విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ముఖ్యంగా కుల సమాఖ్యలకు చైర్మన్లు, పాలకవర్గం నియామకాల విషయంలో ఏకాభిప్రాయానికి రావడంతో రజక, నాయీ బ్రాహ్మణ, వడ్డెర, సగర, వాల్మీకిబోయ, కృష్ణ బలిజ (పూసల), భట్రాజ, కుమ్మరి శాలివాహన, విశ్వబ్రాహ్మణ, మేదరి, గీత, గొర్రెలు, మేకల తదితర పారిశ్రామిక ఫెడరేషన్లకు చైర్మన్లు, పాలకవర్గాలను నియమిస్తూ రెండు, మూడురోజుల్లో ఉత్తర్వులు విడుదల కానున్నాయి. మరోవైపు ఖాళీగా ఉన్న పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం, జిల్లా స్థాయి నేతలకు కార్పొరేషన్ డైరెక్టర్ పదవుల గురించి కూడా చర్చించిన నేతలు ఆయా పోస్టులను ఎవరికి కేటాయించాలి? ఏయే సామాజిక వర్గాలకు ఎలా ప్రాతినిధ్యం ఇవ్వాలి? ఏ జిల్లాకు ఎన్ని పదవులు ఇవ్వాలనే దానిపై కూడా ఓ అంగీకారానికి వచ్చారని, అయితే ఆ పోస్టులను జూన్ నెలలో ప్రకటించాలని నిర్ణయించినట్టు సమాచారం. కార్పొరేషన్లను ఎమ్మెల్యేలకు కేటాయించే విషయంలో కూడా ఏకాభిప్రాయం కుదిరిందని తెలిసింది. నాలుగు వర్కింగ్, ప్రచార కమిటీపై కూడా పార్టీ పదవులపై కూడా రేవంత్, మీనాక్షి, మహేశ్గౌడ్లు చర్చించారు. ముఖ్యంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎవరన్న దానిపై చర్చ ఓ కొలిక్కి వచ్చిందని, ఈసారి పీసీసీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తారని, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, అదే ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ ఎంపీ, ఓ ఏఐసీసీ కార్యదర్శి, అదే జిల్లాకు చెందిన మహిళా నేత ఉన్నట్టు తెలుస్తోంది. ప్రచార కమిటీ చైర్మన్ పేరుపై కూడా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. పార్టీ కోశాధికారిగా ఉమ్మడి హైదరాబాద్ పరిధిలోని సీఎం సన్నిహితుడిని నియమించే అంశంపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. అలాగే పెండింగ్లో ఉన్న ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కొత్త అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, పెండింగ్లో ఉన్న సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా«ల అధ్యక్షులు, పలు జిల్లా కమిటీలపై కూడా చర్చ జరిగిందని, అన్ని పదవుల విషయంలో ముగ్గురు నేతలూ ఒక అభిప్రాయానికి వచ్చారని గాం«దీభవన్ వర్గాల ద్వారా తెలిసింది. పదవుల జాబితాకు అధిష్టానం ఆమోదం పొందిన తర్వాత అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించారు. మంత్రులపై ఆరోపణల గురించి చర్చ? రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై కూడా నేతలు చర్చించారని తెలుస్తోంది. ముఖ్యంగా జీవన్రెడ్డి ఎపిసోడ్తో పాటు ఇటీవలి కాలంలో రాష్ట్ర మంత్రివర్గ సభ్యులపై వస్తున్న ఆవినీతి ఆరోపణల గురించి చర్చించినట్టు సమాచారం. మరోవైపు డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ పక్షాన ప్రత్యేక వాదన తెరపైకి తెచ్చిన నేపథ్యంలో ఈ బిల్లు గురించి అవసరమైతే క్షేత్రస్థాయి ఆందోళనకు పార్టీ కేడర్ను సిద్ధం చేయాలని కూడా నిర్ణయించారు. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం వీలైనంత త్వరగా నిర్వహించాలని నిర్ణయించారు. డీసీసీ అధ్యక్షుల నేతృత్వంలో పీఏసీలు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో మరో కొత్త కమిటీ చేరనుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్న రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) తరహాలోనే జిల్లా స్థాయిలోనూ ఏర్పాటు చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షుల నేతృత్వంలో ఏర్పాటు కానున్న ఈ పీఏసీల్లో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులను సభ్యులుగా నియమించనున్నారు. ఆయా జిల్లాల్లో జరిగే ముఖ్య రాజకీయ పరిణామాలు, ఎన్నికల సందర్భంగా తీసుకునే నిర్ణయాల్లో పీఏసీలు కీలకంగా వ్యవహరించనున్నాయి. అయితే,ఆయా జిల్లాల పీఏసీల్లో తమకు స్థానం కల్పించకపోవడంపై పలువురు రాష్ట్ర కమిటీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. -
డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం : ఖర్గే
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని, కానీ కేంద్రం తీసుకొస్తున్న విధానం సరైనది కాదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ ‘రాజకీయ స్వార్థంతో డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చారు. డీలిమిటేషన్ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మాత్రం మద్దతు ఇస్తాం. ప్రభుత్వం విపక్షాలను అణగదొక్కాలని చూస్తోంది’ అని అన్నారు.రేపటి నుంచి పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపు, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు వంటి కీలక బిల్లులపై చర్చ జరగనుంది. లోక్సభలో ఏప్రిల్ 16, 17 తేదీల్లో ఈ బిల్లులపై చర్చ, ఓటింగ్ జరగనుంది. మూడు బిల్లులపై చర్చకు మొత్తం 18 గంటల సమయం కేటాయించారు.రాజ్యసభలో ఏప్రిల్ 18న చర్చ, ఓటింగ్ జరగనుంది. అక్కడ చర్చకు 10 గంటల సమయం కేటాయించారు. అదనంగా, ఏప్రిల్ 16, 17 తేదీల్లో రాజ్యసభ డిప్యూటీ ఛైర్పర్సన్ ఎన్నికపై కూడా చర్చ జరగనుందని సమాచారం. -
రోడ్డు ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ నేత మృతి
సాక్షి, ఖమ్మం జిల్లా: రోడ్డు ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ సీనియర్ నేత జావిద్ మృతి చెందారు. ఖమ్మం- హైదరాబాద్ జాతీయ రహదారిపై పిల్లలమర్రి శివారులో ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జావీద్ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న రూరల్ పోలీసులు.. రూరల్ మృతదేహాన్ని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు.భట్టి విక్రమార్క దిగ్బ్రాంతిజావిద్ మృతి పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి జావిద్ అందించిన సేవలు మరువలేవన్నారు. జావిద్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. గత పది సంవత్సరాల పాటు పార్టీ కష్టకాలంలో ముందుండి జావిద్ సేవలు అందించారని గుర్తు చేశారు. ఖమ్మం నగర కార్పొరేషన్ మాజీ అధ్యక్షునిగా, ప్రస్తుతం పిసిసి కార్యవర్గ సభ్యునిగా, రాజీవ్ గాంధీ పంచాయతీ అభియాన్ కమిటీలో కీలక నేతగా, సేవాదళ్ రాష్ట్ర నాయకునిగా సుదీర్ఘకాలం పార్టీకి ఆయన అందించిన సేవలు మరువలేనివి అన్నారు. మహమ్మద్ జావిద్ కుటుంబానికి యావత్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. జావిద్ కుటుంబానికి ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం తన సానుభూతి తెలిపారు. -
కేసీఆర్కు సమకాలికుడినే.. చేతులు కట్టుకోను
సాక్షి, జగిత్యాల: తనపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి సీనియర్ నేత జీవన్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ముందు చేతులు కట్టుకుని నిలబడతానన్న వ్యాఖ్యలను బుధవారం ఆయన ఖండించారు. ‘‘కేసీఆర్ ముందు నేను చేతులు కట్టుకుని నిలబడతానంటూ సీఎం రేవంత్ మాట్లాడడం సరికాదు. విభేదాల పేరుతో వ్యక్తిగతంగా కించపరచడం సరికాదు. నేను ఎవరి ముందు చేతుల కట్టుకుని నిలబడను. కేసీఆర్కు నేను సమకాలికుడినే. ఇద్దరం కలిసే రాజకీయ ప్రయాణం చేశాం. ..తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర గొప్పది. ఆయన సమాజాన్ని గౌరవించే నాయకుడు. వ్యక్తిని గౌరవించే సంస్కారం నాది. నేను ఎవరి ముందు చేతులు కట్టుకోను. రాజకీయాల్లో నాకు ఆత్మగౌరవం ముఖ్యం. కాంగ్రెస్ పార్టీలో అది దెబ్బతింది కాబట్టే బయటకు వచ్చా అని జీవన్రెడ్డి చెప్పారు. -
ప్రొరాటా వద్దు.. హైబ్రిడే కావాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘ప్రొరాటా (దామాషా) పద్ధతిలో లోక్సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి 850కి పెంచితే జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా తీవ్ర అన్యాయం జరుగుతుంది. కేంద్ర నిధుల కేటాయింపుల్లో ఇప్పటికే వివక్షకు గురవుతున్న దక్షిణాది రాష్ట్రాలకు ఇది మరో ఎదురుదెబ్బ అవుతుంది. దేశ ఆర్థిక వికాసానికి గణనీయంగా సహకారం అందించే దక్షిణాదికి ప్రాధాన్యం, ప్రాతినిధ్యం పార్లమెంటులో తగ్గిపోతుంది. జనాభా విస్ఫోటనం ఉన్న ఉత్తరాది–మధ్యభారత రాష్ట్రాలు లాభపడతాయి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ప్రొరాటాకు బదులు హైబ్రిడ్ మోడల్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ విషయంలో దక్షిణాదికి అన్యాయం జరగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చల కోసం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు, ఏకాభిప్రాయ సాధనతోనే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతోపాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు–2026ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి మంగళవారం ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుపై ప్రభావం కలిగించే అంశమైనందున బాధ్యతతో అత్యవసరంగా ఈ లేఖ రాసినట్లు పేర్కొన్నారు.దక్షిణాది రాష్ట్రాలు బలహీనపడతాయి..‘లోక్సభ స్థానాల పెంపుతో దక్షిణ రాష్ట్రాలపై పడే ప్రభావాన్ని కేంద్రం పూర్తిగా విశ్లేషించలేదు. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, కేరళ దశాబ్దాలుగా జనాభా నియంత్రణ, ఆరోగ్యం, మానవ అభివృద్ధి రంగాల్లో కృషి చేశాయి. జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాయి. ప్రొరాటా పద్ధతిలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలనే ప్రతిపాదనతో ఈ రాష్ట్రాలన్నీ నిర్మాణాత్మకంగా నష్టపోయి రాజకీయంగా బలహీనపడతాయి. ప్రొరాటా మోడల్ కేవలం గణాంకాల మార్పుగా కాకుండా రాజకీయ అసమతుల్యతకు దారితీస్తుంది. ప్రొరాటా మోడల్ను దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించవు. ఈ అంశంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉత్పన్నమవుతుంది. అందుకే అందరికీ న్యాయం జరిగేలా ఒక స్థిరమైన పరిష్కారం అవసరం. ఈ విషయంలో హైబ్రిడ్ మోడల్ ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుంది. అందరి ప్రాతినిధ్యంతోపాటు అన్ని రాష్ట్రాల సహకారాన్ని ఈ మోడల్ సమతౌల్యం చేస్తుంది’ అని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సూచించిన 50 శాతం– 50 శాతం విధానాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. హైబ్రిడ్ మోడల్ ప్రకారం కొత్తగా పెంచే సీట్లలో సగాన్ని ప్రొరాటా పద్ధతిలో... మిగతా సగం సీట్లను రాష్ట్రాల ఆర్థిక భాగస్వామ్యం (జీఎస్డీపీ), అభివృద్ధి ప్రమాణాల ఆధారంగా కేటాయించాలని సూచించారు.ప్రస్తుత సీట్లలోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలిమహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏఐసీసీ సంపూర్ణ మద్దతిస్తోందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ సీట్లతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను యథాతథంగా వెంటనే అమలు చేయాలని ప్రధాని మోదీని సీఎం కోరారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి గతంలో సీట్ల సంఖ్య పెంచకుండా కేవలం నియోజకవర్గాల సరిహద్దులను మారుస్తూ డీలిమిటేషన్ నిర్వహించినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అలాంటి ప్రక్రియను చేపట్టవచ్చని.. అందుకు పూర్తి మద్దతు ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. హైబ్రిడ్ మోడల్పై ద్వారా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు నష్టపోకుండా ఉండటంతోపాటు ప్రజాస్వామ్య ప్రాతినిధ్య సూత్రం అమలవుతుందన్నారు. ఈ అంశంపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపి అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలతో కలిసి ఏకాభిప్రాయానికి రావాలని కోరారు. దేశ బలం భిన్నత్వంలో ఏకత్వమని.. ఇలాంటి కీలక నిర్ణయాలు ఆ ఐక్యతను చాటేలా ఉండాలని సూచించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అందరికీ న్యాయం చేసే పరిష్కారాన్ని కనుగొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు రేవంత్ లేఖలోక్సభ సీట్లను ప్రొరాటా పద్ధతిలో పెంచే ప్రతిపాదనను దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామిలకు వేర్వేరుగా బహిరంగ లేఖలు రాశారు. లోక్సభ సీట్లను 850కి ప్రొరాటా పద్ధతిలో పెంచితే దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోతుందని.. దేశాభివృద్ధిలో భాగం పంచుకుంటున్న రాష్ట్రాలు నష్టపోతూ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు లాభపడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగేలా హైబ్రిడ్ మోడల్ను పరిశీలించాలని.. ఈ అంశంపై రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు రావాలని రేవంత్ కోరారు. -
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: డీలిమిటేషన్పై ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. లోక్సభ సీట్ల పెంపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లేఖలో మూడు అంశాలను రేవంత్రెడ్డి ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ను సీట్ల పెంపుతో కలపడం సరికాదన్న రేవంత్.. జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణాదికి నష్టం అన్నారు.ఆర్థిక, అభివృద్ధి ప్రమాణాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్ సూచించారు. హైబ్రిడ్ మోడల్ను అనుసరించాలన్నారు. అన్ని పార్టీలతో చర్చలు జరపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దేశ ఐక్యతకు న్యాయమైన ప్రతినిధిత్వం కీలకమన్న రేవంత్.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. ప్రస్తుత 543 సీట్లతోనే మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, సీట్ల పెంపు మూడు వేర్వేరు అంశాలు. డిలిమిటేషన్ను సీట్ల పెంపుతో కలపడం సరైంది కాదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని.. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు నష్టపోతాయని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర రాష్ట్రాలకు అధిక రాజకీయ శక్తి వెళ్తుంది. దక్షిణ రాష్ట్రాల వాణి పార్లమెంట్లో తగ్గే ప్రమాదం ఉంది. ఆర్థికంగా ఎక్కువగా దేశానికి తోడ్పడుతున్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. హైబ్రిడ్ మోడల్ ద్వారా సమతౌల్యం సాధించవచ్చు. సీట్లలో సగం జనాభా ఆధారంగా, మిగతా సగం ఆర్థిక ప్రమాణాల ఆధారంగా ఇవ్వాలి. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో చర్చలు జరపాలి. న్యాయం, సమాన ప్రతినిధిత్వం లేకపోతే దేశ ఐక్యత దెబ్బతింటుంది’’ అని సీఎం రేవంత్ లేఖలో పేర్కొన్నారు.తమిళనాడు సీఎంకు లేఖ: తమిళనాడు సీఎంకు కూడా రేవంత్రెడ్డి లేఖ రాశారు. లోక్సభ సీట్లను ప్రోరాటా పద్ధతిలో పెంచే ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు దీనికి వ్యతిరేకంగా నిలబడాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్కు లేఖ రాశారు సీఎం. మహిళల రిజర్వేషన్, డిలిమిటేషన్, లోక్సభ సీట్ల పెంపు అనే మూడు వేర్వేరు అంశాలను కలిపి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.లోక్సభ సీట్లను 543 నుంచి 850కు పెంచి ప్రోరాటా పద్ధతిలో పంచితే దక్షిణ రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోతుందని అప్రమత్తం చేశారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకునే రాష్ట్రాలు నష్టపోతూ, జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు లాభపడే పరిస్థితి వస్తుందని అన్నారు. అందుకే అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగేలా హైబ్రిడ్ మోడల్ను పరిశీలించాలని, ఈ అంశంపై రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన కోరారు. -
శిఖరాగ్రం నుంచి శిథిలావస్థకు
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు ప్రధానంగా అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్యే కేంద్రీకృతమైంది. రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు అప్రతిహతంగా పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సిన దురవస్థకు చేరింది. 50 ఏళ్లుగా అధికారానికి దూరమైన కుర వృద్ద పార్టీ ఈసారి ఖాతా తెరిచేందుకే కిందా మీదా పడే పరిస్థితికి చేరుకుంది...! 1977 నుంచి మొదలైన పతనం స్వాతంత్య్రానంతరం నుంచి బెంగాల్ను కాంగ్రెస్ 1977 దాకా పాలించింది. బిదాన్ చంద్రరాయ్, ప్రఫుల్ల చంద్రసేన్, అజయ్ ముఖర్జీ, సిద్ధార్థ శంకర్ రే వంటి దిగ్గజ నేతలు ముఖ్యమంత్రులుగా చేశారు. 1977లో రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం మొదలైంది. ఆ ఏడాది జ్యోతిబసు నాయకత్వంలోని కమ్యూనిస్టులు రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. కాంగ్రెస్తో విభేదించి 1998లో మమతా బెనర్జీ సొంత కుంపటి పెట్టుకోవడంతో బెంగాల్లో పార్టీ పరిస్థితి మరింత కునారిల్లుతూ వచ్చింది. అప్పటినుంచీ క్రమంగా ప్రాధాన్యతను కోల్పోయింది. 2011లో బెంగాల్లో తృణమూల్ తొలిసారిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కాంగ్రెస్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లు సాధించిన కాంగ్రెస్ 2011లో 42, 2016లో 44 సీట్లు నెగ్గింది. కానీ గత ఐదేళ్లలో బెంగాల్లో బీజేపీ పుంజుకోవడంతో కాంగ్రెస్ భారీగా నష్టపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా నెగ్గలేకపోయింది! ఓట్ల శాతంలోనూ సింగిల్ డిజిట్కు పరిమితమైంది. 2016లో కేవలం 3 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ 2021లో ఏకంగా 77 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదా చేజిక్కించుకుంది. కార్యాలయాల్లోనూ కన్పించని సందడి ప్రస్తుతం బెంగాల్వ్యాప్తంగా ప్రతి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో తృణమూల్, బీజేపీ జెండాలతో ఎన్నికల కోలాహలం కనబడుతుంటే కాంగ్రెస్లో మాత్రం చడీచప్పుడే లేదు. చాలా జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను సైతం తెరిచే పరిస్థితి లేదు! పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హస్తంజెండా పట్టుకునే కార్యకర్తే కరువైన పరిస్థితి! 2021 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకొంటే అన్ని పార్టీలూ ‘సున్నా’చుట్టాయి. దాంతో కాంగ్రెస్ ఈసారి మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తోంది. బెహ్రాంపూర్ నుండి అధిర్ రంజన్ చౌదరి, మాలతీపూర్ నుంచి మౌసమ్ నూర్, సుజాపూర్ నుంచి అబ్దుల్ హన్నన్ తదితరులు బరిలో ఉన్నారు.పతనానికి కారణాలెన్నో బెంగాల్లో కాంగ్రెస్ పతనానికి అనేక కారణాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికార పార్టీలకు వ్యతిరేకంగా భారీ ఉద్యమాలు నడపడంలో మూడు దశాబ్దాలుగా పార్టీ విఫలమైంది. తొలుత లెఫ్ట్ ఫ్రంట్కు దన్నుగా ఉన్న మధ్య, ఉన్నత తరగతి ఓటర్లు ఆ తర్వాత టీఎంసీ వైపు మళ్లారు. బీజేపీ ఎదుగుదలతో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు దాదాపుగా గండి పడింది. రాష్ట్రంలో 30 శాతమున్న ముస్లింలు పూర్తిగా తృణమూల్ వైపు వెళ్లారు. -
హైబ్రిడ్గా సీట్లు పెంచాలి
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు బిల్లులపై కేంద్ర ప్రభుత్వం హడావుడి చేస్తోందని.. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన రెండు వేర్వేరనే విషయాన్ని మరుగున పెట్టి, రెండింటినీ జనాభా లెక్కల తర్వాత ఆమోదింప చేసుకోవాలని ప్రధాని మోదీ యోచిస్తున్నారని విమర్శించారు. మహిళా రిజర్వేషన్, పునర్విభజన బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని.. ప్రపంచంలోనే భారత్లో మహిళలకు ఓటు హక్కు కల్పించిన పార్టీ కాంగ్రెస్ అని రేవంత్ గుర్తుచేశారు. నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు కేవలం జనాభా ప్రాతిపదికన చేయడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక నిర్మాణం, రాష్ట్రాల భాగస్వామ్యాన్ని పరిగణనలోకి తీసుకొని సీట్ల పెంపు జరగాలని డిమాండ్ చేశారు. అందుకోసం ‘హైబ్రిడ్ మోడల్’ అవసరమని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. పెంచబోయే 272 లోక్సభ స్థానాల్లో 136 సీట్లను జనాభా ప్రాతిపదికన మరో 136 సీట్లను జీఎస్డీపీ ఆధారంగా ఆయా రాష్ట్రాలకు కేటాయించాలని సీఎం ప్రతిపాదించారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్పై ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన మంత్రివర్గ సహచరులు, ఎంపీలతో కలిసి సచివాలయంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...హైబ్రిడ్ విధానంతో సమన్యాయానికి అవకాశం‘దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆదాయం, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. జాతీయ స్థూల ఉత్పత్తి జీఎస్డీపీలో దక్షిణాది రాష్ట్రాలే ముందున్నాయి. అలాంటి రాష్ట్రాలను శిక్షించడం తగదు. పన్నులు కట్టడం, సలాం కొట్టడం అనే దానికి మేం వ్యతిరేకం. అందుకే హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదిస్తున్నాం. లోక్సభలో ప్రస్తుతమున్న 543 సీట్లను 50 శాతం మేర పెంచితే సీట్లు 816కు చేరుతాయి. పెరిగే 272 సీట్లలో 136 దామాషా (ప్రొరాటా) ప్రకారం పెంచుకొని మరో 136 సీట్లను ఆర్థికంగా దేశానికి అందిస్తున్న సేవల ఆధారంగా పెంచాలి. ఈ సీట్ల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో చర్చించాలి. పార్లమెంటులో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. 2028 మార్చి వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. 2027 మార్చి 31లోగా జనగణన, 2028 మార్చిలోగా పునర్విభజన పూర్తి చేసి 2029లో పెరిగిన సీట్లతో ఎన్నికలకు వెళ్లవచ్చు’అని రేవంత్ సూచించారు.మహిళా బిల్లు, పునర్విభజన బిల్లును కలపడం రాజకీయ కుట్ర‘నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లును ఒకటిగా చూపిస్తూ కేంద్రం హడావుడి చేస్తోంది. ఈ రెండింటికీ ఎలాంటి సంబంధం లేదు. వేర్వేరుగా చర్చించి అమలు చేయాలి. మహిళల రిజర్వేషన్ బిల్లు విషయంలో ఆలస్యం చేయడానికి ఈ పద్ధతి ఉపయోగిస్తున్నారు. దేశంలో ప్రధానిగా, రాష్ట్రపతిగా, స్పీకర్గా, ముఖ్యమంత్రులుగా మహిళలకు అవకాశాలు కల్పించింది కాంగ్రెస్. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చారు. సోనియా గాంధీ నాయకత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లు–2013లో రాజ్యసభలో ఆమోదం పొందింది. కానీ బీజేపీ సహకరించకపోవడంతో లోక్సభలో నిలిచిపోయింది. 2023లో మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. 2024 ఎన్నికల్లోనే 33% రిజర్వేషన్లు అమలు చేసి ఉంటే 181 మహిళలు లోక్సభలో ఉండేవారు. 2026 జనాభా లెక్కల తర్వాత అంటే మహిళల హక్కులను వాయిదా వేయడమే. నియోజకవర్గాల పునర్విభజనతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో పెట్టి ఆమోదించాలి’అని సీఎం సూచించారు.జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపుతో దక్షిణానికి అన్యాయం‘దేశంలో 1970 ప్రాంతంలో కుటుంబ నియంత్రణ అమలు చేయాలని కేంద్రం నిర్ణయించినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను కట్టుదిట్టంగా అమలు చేశాయి. అందుకే జనాభా తగ్గింది. ఉత్తరాదిలో నియంత్రణ లేకపోవడంతో జనాభా పెరిగింది. ఇప్పుడు జనాభా ఆధారంగా సీట్లు పెంచితేం మంచి పనిచేసిన రాష్ట్రాలను శిక్షించినట్లే అవుతుంది. ఇందిరాగాంధీ ఈ విషయాన్ని గమనించి లోక్సభ సీట్ల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 25 ఏళ్ల వరకు సీట్ల పెంపును ఇందిరాగాంధీ నిషేధించారు. 2001లో వాజ్పేయి పునర్విభజన బిల్లుపై చట్ట సవరణ చేశారు. చట్టపరంగా సీట్ల పెంపుపై నిషేధం విధించారు. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన సీట్ల పునర్విభజనకు ఒప్పుకోబోమని దక్షణాది రాష్ట్రాలు నిరసన తెలపడంతోపాటు ప్రధానికి లేఖ రాశాయి. దాంతో దామాషా ప్రకారం 50 శాతం సీట్లు పెంచుతామంటున్నారు. 20 సీట్లు ఉన్న కేరళకు, 80 సీట్లు ఉన్న యూపీకి ఉన్న అంతరం ప్రస్తుతం 60 సీట్లు మాత్రమే. కానీ 50 శాతం పెంచితే 90 సీట్లకు అంతరం పెరుగుతుంది. తెలంగాణకు, యూపీకి 94 సీట్ల అంతరం పెరుగుతుంది. దక్షణాదిలో 130 సీట్లు ఉన్నాయి. 50 శాతం పెరిగితే 195 అవుతాయి. 413 సీట్లున్న ఉత్తరాదిలో 621 సీట్లు అవుతాయి. దక్షణాది, ఉత్తరాద మధ్య అంతరం 412 సీట్ల నుంచి 620 సీట్లకు పెరుగుతుంది. దీనివల్ల ఒక్క తెలంగాణకే కాదు... దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలతోపాటు గోవా, పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు కూడా అన్యాయమే జరుగుతుంది. తద్వారా దక్షిణాది, ఉత్తరాది మధ్య వ్యత్యాసం మరింత పెరుగుతుంది. ఇది దేశ సమతౌల్యానికి ప్రమాదకరం’అని సీఎం రేవంత్ హెచ్చరించారు.బండి సంజయ్, కిషన్రెడ్డి మోదీ ఇంటి ముందు బంట్రోత్తులుగానే..‘50 శాతంతో సీట్ల పునర్విభజన జరిగితే కిషన్రెడ్డి, బండి సంజయ్ ప్రధాని మోదీ ఇంటి ముందు బంట్రోతులుగా నిలబడాల్సి వస్తుంది. వాళ్ల అవసరం ఇకపై ఉండదు. ఉత్తరాది రాష్ట్రాల్లో గెలిచే ఎంపీలతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. మోదీ గుజరాత్ వదిలి యూపీ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారంటే అక్కడ 80 సీట్లు ఉన్నాయి కాబట్టి. అందుకే హైబ్రిడ్ విధానంలో దేశానికి ఆర్థిక పరిపుష్టిని అందిస్తున్న రాష్ట్రాలకు 50 శాతం కేటాయించాలి. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. 50 శాతం మెరిట్, 50 శాతం రిజర్వేషన్ అని. దానినే కేంద్రం ఉపయోగించాలి’అని సీఎం సూచించారు.మహిళలకు బీజేపీ అన్యాయం చేసింది‘బీజేపీ 1980 ఏప్రిల్ 6న ఏర్పాటైంది. ఇప్పటివరకు 15 మంది బీజేపీ అధ్యక్షుల నియామకం జరిగితే ఆ పార్టీ అధ్యక్షురాలిగా ఒక్క మహిళను కూడా నియమించలేదు. జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ పదవి కూడా ఇవ్వలేదు. దీన్నిబట్టే బీజేపీకి మహిళలపై గౌరవం, చిత్తశుద్ది ఎంత ఉందో అర్థమవుతుంది. బీజేపీకి మహిళను అధ్యక్షురాలిగా నియమించుకున్న తర్వాత బండి సంజయ్ మాట్లాడాలి. బండి సంజయ్ వ్యాఖ్యలు దక్షణాది రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మహిళలకు వ్యతిరేకం. మా ఎంపీలు తెలంగాణను సాధించారు. ఇప్పుడు పునర్విభజనపైనా పోరాడుతారు. దక్షణాది రాష్ట్రాలతోపాటు చిన్న రాష్ట్రాలను కూడా ఐక్యం చేస్తాం. పార్లమెంటులో బిల్లును ఎలా ఆమోదిస్తారో చూస్తాం. అన్ని దక్షణాది రాష్ట్రాలతోపాటు ఢిల్లీ, పంజాబ్ లాంటి చిన్న రాష్ట్రాలకు దీనిపై లేఖ రాస్తా’అని సీఎం రేవంత్ చెప్పారు. -
మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిందే కాంగ్రెస్.. ఫిట్టింగ్ పెట్టింది ఎన్డీయే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పురుషులతో పాటు మహిళలకు సమాన ఓటు హక్కు కల్పించిందే కాంగ్రెస్ పార్టీ అని.. అలాంటి పార్టీ మహిళా రిజర్వేషన్ల బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలకు రిజర్వేషన్లు ఇంతకాలం అడ్డుకుంది ఎన్డీయేనేనని ఆరోపించారాయన. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో బీజేపీ చేస్తున్న ప్రచారంపై సోమవారం సెక్రటేరియట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్పై చర్చ కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. అయితే.. ఈ రెండింటినీ ఒకేలా చూపించే ప్రయత్నం చేస్తోంది. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమనట్లు బీజేపీ ప్రచారం చేస్తోంది. బిల్లుకు విపక్షాలు సహకరించడం లేదని అపవాదు వేస్తోంది. మహిళలకు అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది. రాజ్యాంగబద్ద పదవుల్లోనూ మహిళకు అవకాశం ఇచ్చింది. మహిళలకు రిజర్వేషన్ల బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని సోనియా భావించారు. గతంలో కాంగ్రెస్ బిల్లు పెడితే బీజేపీ పార్లమెంట్ను స్తంభింపజేసింది. 2013లో బిల్లు తీసుకొస్తే బీజేపీ సహకరించలేదు. అందుకే మహిళా బిల్లు ఆగింది. గత పదేళ్లుగా బీజేపీ ఈ బిల్లు ఊసే ఎత్తలేదు. చట్టంలో ఫిట్టింగ్ పెట్టి మహిళలకు రిజర్వేషన్లను దూరం చేసిందే ఎన్డీయే అని సీఎం రేవంత్ ఆరోపించారు.2024లోనే రిజర్వేషన్లు వర్తింపజేసి ఉంటే మహిళలకు లాభం జరిగేదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు చర్చే అవసరమే లేదన్న ఆయన.. అయినా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు.శిక్షించే హక్కు ఎవరిచ్చారు?మహిళా బిల్లు, డీలిమిటేషన్కు లింకు పెడుతున్నారు. ఇక్కడే అసలు కుట్ర ఉంది. డీలిమిటేషన్పై కేంద్రం హడావిడి చేస్తోంది. 50 శాతం సీట్లు పెంచాలని మోదీకి ఏ దేవుడు చెప్పారు. జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్ను గతంలో ఇందిరా గాంధీ నియంత్రించారు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పాటించాయి. అందుకే ఇక్కడ జనాభా తగ్గింది. మోదీ చర్యలతో ఉత్తరాదిలో సీట్లు పెరుగుతాయి.. దక్షిణాదిలో తగ్గుతాయి. ఇది ఉత్తరాది, దక్షిణాది మధ్య తీవ్ర అంతరాన్ని పెంచుతుంది.జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమే జరుగుతుంది. చిన్న రాష్ట్రాలు మనుగడ కోల్పోతాయి. రాజకీయంగా దక్షిణాది వాళ్లను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే ప్రయత్నం జరుగుతోంది. సీట్లు పెంచాలనుకుంటే ముందు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి. ఎక్స్పర్ట్ కమిటీ వేయండి.. అసెంబ్లీల అభిప్రాయం తెలుసుకోండి. జనగణన పూర్తయ్యే లోపు పూర్తి చేయండి. మేం హైబ్రిడ్ మోడల్ను ప్రతిపాదిస్తున్నాం. పెంచాలనుకున్న 272 సీట్లలో 136 ప్రొరేటా ప్రకారం చేయండి. మిగిలిన 136 సీట్లను జీఎస్డీపీ ప్రకారం చేయండి. స్థూల ఉత్పత్తిలో అత్యధిక భాగస్వామ్యం చేస్తున్న రాష్ట్రాలకు సీట్లు పెంచండి. దేశానికి మేం అత్యధిక ఆదాయం అందిస్తున్నాం. అత్యధిక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాం. అలాంటి రాష్ట్రాలను శిక్షించే హక్కు మీకెవరు ఇచ్చారు?’’ అని కేంద్రాన్ని సీఎం రేవంత్ నిలదీశారు. -
జగిత్యాల కాంగ్రెస్లో ట్విస్ట్.. మంత్రి అడ్లూరికి కొత్త టెన్షన్!
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో జగిత్యాల జిల్లా రాజకీయం మరోసారి హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డి వెళ్లిపోయినప్పటికీ హస్తం పార్టీలో వర్గ విభేదాలు ఆగలేదు. మంత్రి అడ్లూరి వర్గం వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ వర్గం అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చక్రం తిప్పుతున్నట్టు మంత్రి అనుచరులు బహిరంగంగానే కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.వివరాల మేరకు జగిత్యాలలో జీవన్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్స్ ఎంపిక వ్యవహారం తెరపైకి వచ్చింది. మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్స్ మూడు పదవులనూ ఎమ్మెల్యే వర్గీయులకే అప్పగించడంతో మంత్రి అడ్లూరి వర్గం ఖంగుతిన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్లో చక్రం తిప్పుతున్నారని ఆరోపిస్తూ అడ్లూరి వర్గం మంత్రిని నిలదీశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తే మీరేం చేస్తున్నారంటూ మంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. తమ పదవుల మాటేంటని ప్రశ్నించినట్టు తెలిసింది.జీవన్ రెడ్డిని కాదని మంత్రితో ఉంటే ఎమ్మెల్యే అనుచరులు, మాజీ బీఆర్ఎస్ నేతలకే ప్రాధాన్యం ఇవ్వడంతో వారంతా మండిపడుతున్నారు. దీంతో, దిద్దుబాటు చర్యలకు దిగిన మంత్రి అడ్లూరి.. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకుని సీనియర్లతో చర్చించడానికి సిద్దమైనట్టు తెలిసింది. అయితే, పార్టీ అంతర్గత విభేదాలు బట్టబయలు కావడంతో మంత్రి అడ్లూరికి కొత్త తిప్పలు మొదలైనట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పైచేయి సాధించినట్టు పలువురు చర్చించుకుంటున్నారు. మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులుగా సంజయ్ వర్గీయులు బీఆర్ఎస్ నుంచి వచ్చిన జగిత్యాల బీఆర్ఎస్ మాజీ పట్టణాధ్యక్షుడు గట్టు సతీష్, మైనార్టీశాఖ అధ్యక్షుడిగా పనిచేసిన అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, మాజీ కౌన్సిలర్ జంబర్తి లక్ష్మికి అవకాశం కల్పించడంతో విభేదాలు బయటకు వచ్చాయి. -
కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ గూటికి ఆ ఎమ్మెల్యే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జీవన్రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్తో బంధం తెంచుకుని బీఆర్ఎస్లో చేరబోతుండడంతో ఆ పార్టీలో జోష్ నెలకొంది. అయితే మరో నేత కూడా ఇదే బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా.. ఆయన బహిరంగంగా చేసిన కామెంట్లే ఇందుకు నిదర్శనం. సీనియర్ నేత, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై గరం గరంగా ఉన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల ఆధారంగా ఆయన తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరతారా? అనే చర్చ జోరందుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. నిజామాబాద్ జిల్లా సిద్ధాపూర్ రిజర్వాయర్ నిధుల విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. ఈ పరిణామంపై పోచారం రిజర్వాయర్ వద్ద బైఠాయించి మరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘బిల్లులు రాకపోతే ఎలా పని చేయాలని కాంట్రాక్టర్లు అంటున్నారు. అయినా వాళ్లను బతిమాలి పనులు చేయిస్తున్నాం. నా రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఏనాడూ చూడలేదు. నిధులు విడుదల చేయాలని సంబంధిత మంత్రిని 20 సార్లు అడిగా. ఇప్పుడు మంత్రులు కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు. వాళ్ల కాళ్లు మొక్కలా ఏంది?. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?’’ అని ప్రశ్నించారాయన. ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన పోచారం.. టీడీపీ, ఆ తర్వాత టీఆర్ఎస్(ప్రస్తుత బీఆర్ఎస్)లో చేరారు. అటుపై మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్గానూ ఆయన పని చేశారు. అయితే.. 2024లో కాంగ్రెస్లో చేరి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమితులయ్యారు. అయితే.. ఆయన పార్టీ ఫిరాయించినట్లు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసినప్పటికీ స్పీకర్ మాత్రం ఆ పిటిషన్ కొట్టేశారు. గత కొంత కాలంగా కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరతారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. -
తమిళనాడు ఎన్నికల వేళ ట్విస్ట్.. కాంగ్రెస్కు బిగ్ షాక్!
సాక్షి, చైన్నె: తమిళనాడులో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో మహిళలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, పార్టీ సీనియర్ నాయకురాలు హసీనా సయ్యద్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ అధిష్టానంపై, ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర అధ్యక్షుడు సెల్వపెరుంతొగైపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయమై హసీనా సయ్యద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వేదికలపై మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గొప్పగా చెబుతుందని, కానీ ఆచరణలో తమిళనాడులో పోటీ చేస్తున్న 28 స్థానాల్లో కేవలం ఇద్దరు మహిళలకు (సుమారు 7%) మాత్రమే అవకాశం ఇచ్చిందని హసీనా మండిపడ్డారు. తనకు పట్టున్న కృష్ణగిరి నియోజకవర్గాన్ని కేటాయించాలని కోరగా, స్క్రీనింగ్ కమిటీలో తన పేరు మొదటి స్థానంలో ఉందని ఆమె తెలిపారు. అయితే, ఎంపీ చెల్లకుమార్ తన పలుకుబడిని ఉపయోగించి ఆ సీటును దక్కించుకున్నారని, దీని వెనుక నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహాలే కారణమని ఆరోపించారు.నాయకత్వంపై ధ్వజం..ఢిల్లీలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తనకు మైలాడుతురై సీటు ఇస్తామని హామీ ఇచ్చి, చివరి నిమిషంలో పార్టీతో సంబంధం లేని వ్యక్తికి కేటాయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్గే, సెల్వపెరుంతొగై కుమ్మక్కై అభ్యర్థుల ఎంపికలో ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. 27 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ ఐదుగురు మహిళలకు అవకాశం ఇచ్చిందని, అయితే, మహిళా సాధికారత గురించి మాట్లాడే కాంగ్రెస్ మాత్రం అర్హత ఉన్న మహిళలను విస్మరించిందని విమర్శించారు. రాజకీయంగా అణచివేతకు గురవుతున్న మహిళల గొంతుకను వినిపించేందుకు తాను ’రివల్యూషనరీ పిజియన్స్’ అనే సంస్థను ప్రారంభిస్తున్నట్లు హసీనా ప్రకటించారు. కాగా, ఎన్నికల సమయంలో కీలక మహిళా నేత ఇలా ఆరోపణలు చేస్తూ పార్టీని వీడటం తమిళనాడు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. -
తెలంగాణ హైకోర్టులో పవన్ ఖేరాకు ఊరట
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు ఊరట లభించింది. అస్సాం సీఎం సతీమణిపై చేసిన వ్యాఖ్యల కేసులో.. తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వారం రోజుల పాటు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు, అలాగే విచారణకు సహకరించాలని పవన్ ఖేరాను ఆదేశించింది.అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణి రిణికి భూయాన్శర్మపై పవన్ ఖేరా(Pawan Khera) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు అయిన సంగతి తెలిసే ఉంటుంది. రిణికి భూయాన్శర్మ వద్ద పలు దేశాలకు చెందిన పాస్పోర్టులు, పౌరసత్వాలు ఉన్నాయని పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు అయ్యింది.పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, సీనియర్ న్యాయవాది రవీందర్రెడ్డిలు వాదనలు వినిపిస్తూ.. రాజకీయంగా ఎదుర్కోలేక, ఊహాజనిత కేసులు పెట్టి వేధించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. పిటిషనర్ గురించి అస్సాం సీఎం అనుచితంగా మాట్లాడంతోపాటు 100 మందికిపైగా పోలీసులను ఢిల్లీలోని ఆయన నివాసానికి పంపడంలో దురుద్దేశం ఉందన్నారు. అయితే పిటిషనర్ భార్య ఇక్కడ నగరంలోని సనత్నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని, అందువల్ల స్థానికంగా ఇక్కడే ఉంటున్నారని.. ఈ పిటిషన్పై విచారించే పరిధి ఈ కోర్టుకు ఉందని తెలిపారు. అస్సాం ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దేవజిల్ షైకీ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్పై నమోదైన కేసు సాధారణమైన పరువు నష్టం కేసు కాదన్నారు. సీఎం భార్య వద్ద పలు దేశాలకు చెందిన పాస్పోర్టులు, పౌరసత్వాలు ఉన్నాయన్న ఆరోపణలు చేయడానికి నకిలీపత్రాలను వినియోగించారని తెలిపారు. నిందితుడు ఢిల్లీలో శాశ్వత నివాసి అనడానికి సంబంధించిన ఆధార్కార్డు ఉందన్నారు. హైదరాబాద్ నివాసినంటూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కె.సుజన.. పిటిషనర్ పవన్ ఖేరాకు మధ్యంతర ఊరట ఇస్తూ ఈలోపు సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు. -
కాంగ్రెస్ పార్టీ జీవన్రెడ్డికి ఎన్నో అవకాశాలు ఇచ్చింది: మహేశ్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి జీవన్రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఆయన చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. గాంధీభవన్లో గురువారం ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. జీవన్రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బీ–ఫామ్ ఇచ్చిందని గుర్తు చేశారు. రాజకీయంగా మారుతున్న పరిస్థితులను బట్టి నాయకులు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని చెప్పడం సరికాదని, ఆయన్ను సీఎంగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారని చెప్పారు.కాంగ్రెస్పై విమర్శలు చేసే ముందు గతంలో బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని జీవన్రెడ్డిని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీలు వేర్వేరు కాదని, భవిష్యత్లో ఆ రెండు పార్టీలు కలిసే అవకాశముందని అభిప్రాయపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, ఆధారాలు ఉంటే గాంధీభవన్కు తీసుకురావాలని సవాల్ విసిరారు. ఆధారాలతో వస్తే చర్చకు సిద్ధమని, నిరాధార ఆరోపణలు చేయొద్దని హెచ్చరించారు. నాదర్గుల్ భూముల వ్యవహారం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని పేర్కొన్నారు.బీఆర్ఎస్ చేసిన దోపిడీపై ప్రజలకు ఇప్పటికే అవగాహన వచ్చిందన్నారు. మంత్రి వర్గ విస్తరణ ముఖ్యమంత్రి పరిధిలోని అంశమని, సమీప కాలంలో విస్తరణ ఉండదనే అనుకుంటున్నట్టు తెలిపారు. తనతోపాటు పలువురు నాయకులు ఎన్ఎస్యూఐ నుంచే ఎదిగినవారేనని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, వంశీచంద్రెడ్డి, ఎంపీ అనిల్కుమార్యాదవ్, శంకర్నాయక్ తదితరులు కూడా ఎన్ఎస్యూఐ నుంచి వచ్చినవారేనని చెప్పారు. -
కేసీఆర్ పాలనే బెస్ట్...సీఎం రేవంత్ పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
కాంగ్రెస్ విత్ డ్రా : ఆమె ఎన్నిక ఇక లాంఛనమే!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని బారామతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మాజీ ఎన్పీసీనేత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దివంగత అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ ఏకగ్రీవంగా గెలుపొందనున్నారు. కాంగ్రెస్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడంతో, ఏప్రిల్ 23న జరగాల్సిన బారామతి ఉప ఎన్నికలో సునేత్ర ఎంపిక ఏకగ్రీవం కానుంది. గురువారం ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ చీఫ్ హర్షవర్ధన్ సప్కల్కు ఫోన్ చేసి, తమ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. దీంతో అజిత్ పవార్కు గౌరవ సూచకంగా కాంగ్రెస్ గురువారం మధ్యాహ్నం పోటీ నుంచి వైదొలగడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ ఉప ఎన్నికకు కాంగ్రెస్ ఆకాష్ మోర్ను పోటీలో నిలిపింది.ఇదీ చదవండి: వ్యాపారవేత్త హత్య: దుబాయ్లో భారతీయ గ్యాంగ్స్టర్ అరెస్ట్కాగా జనవరి 28న బారామతి ఎయిర్ఫీల్డ్లో అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం కూలిపోవడంతో మరణించిరు. 1991 ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచినప్పటి నుండి ఈ ఏడాది ఆయన మరణించే వరకు ఈ స్థానాన్ని అజిత్ పవార్ దక్కించుకున్నారు. అంతకుముందు, 1967 నుండి ఆయన మామ శరద్ పవార్ ఈ నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహించేవారు. పవార్ కుటుంబానికి కంచుకోటగా భావిస్తారు. అజిత్ మరణం తరువాత తన దివంగత భర్త స్థానంలో ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయం: జీవన్రెడ్డి
సాక్షి, జగిత్యాల జిల్లా: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే పార్టీతోనే జత కట్టాలని భావించానని.. అందుకే, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ కేటీఆర్ రాబోతున్నారు. ఆయన వచ్చాక ఎప్పుడు జాయిన్ కావడమనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు.కేసీఆర్ పాలన కంటే కాంగ్రెస్ బెటర్ అని భావించి అధికారం ఇచ్చారు. కానీ, కాంగ్రెస్ కంటే కేసీఆర్ పాలన వందరెట్లు బెటర్ అనిపిస్తోంది. మొక్కజొన్న కొనుగోళ్లు లేవు, రైతుబంధు సమయానికి పడదు, ఆరు గ్యారంటీల అమలూ సరిగా లేదు. కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. నేను తుమ్మిడిహట్టి దగ్గర కట్టాలని కోరానేగానీ.. కాళేశ్వరంపై విమర్శలు చేయలేదు. ప్రజాభిప్రాయం మేరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై నా ఫైట్ కొనసాగుతుంది’’ అంటూ జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. -
గులాబీ ఫ్లెక్సీల్లో జీవన్రెడ్డి ఫొటో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జగిత్యాల వెళ్లి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించనున్నారు. గురువారం ఉదయం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కలిసిన కేటీఆర్, వినోద్ కుమార్, రమణ.. ఇతర కీలక నేతలు సుమారు అరగంట పాటు జీవన్రెడ్డి చేరిక అంశంపై చర్చించారు. అనంతరం జగిత్యాలకు బయల్దేరారు. కేటీఆర్ రాకతో జగిత్యాల అంతటా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే కేటీఆర్తో పాటు జీవన్రెడ్డి ఫొటో కూడా ఫ్లెక్సీలో ప్రముఖంగా కనిపిస్తోంది. దీంతో.. ఆయన గులాబీ కండువా కప్పుకోవడం దాదాపు ఖరారైందనే సంకేతాలు అందుతున్నాయి. అన్నీ కుదిరితే పార్టీ ప్లీనరీ కంటే ముందే ఆయన బీఆర్ఎస్లో చేరవచ్చని తెలుస్తోంది.జీవన్రెడ్డి తెలంగాణలో సీనియర్ రాజకీయ నేత. 1983లో కాంగ్రెస్ చేరి.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయన.. గతంలో రెండుసార్లు మంత్రి పని చేశారు. ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్కు వీరవిధేయుడిగా ఉన్న ఆయన.. గత కొంతకాలంగా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో హర్టయ్యారు. ఈ క్రమంలోనే 43 ఏళ్ల కాంగ్రెస్ బంధాన్ని తెంచుకున్నారు. బీఆర్ఎస్దే విజయంబీఆర్ఎస్లో చేరిక వేళ.. జీవన్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్దేనని అన్నారు. కాంగ్రెస్ పాలనతో పోలిస్తే బీఆర్ఎస్ పాలన భేష్ అని.. వచ్చే ఎన్నికల్లో రేవంత్రెడ్డికి ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. అది చెప్పడానికి జీవన్రెడ్డి ఎవరు?జీవన్రెడ్డి ఎపిసోడ్పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. జీవన్రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14సార్లు బీఫామ్ ఇచ్చింది. రేవంత్ పోవాలి.. మార్పు రావాలి అనడానికి జీవన్రెడ్డి ఎవరు?. కేసీఆర్ అవినీతిని జీవన్రెడ్డి చాలాసార్లు బహిరంగంగానే విమర్శించారు. పొంగులేటి అవినీతిపై ఆధారాలు ఉంటే చర్చకు రండి. ఆధారాలు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం అని మహేష్గౌడ్ అన్నారు. -
పరారీలో ఖేడా : హైదరాబాద్లో పవన్ ఇంటి వద్ద బారికేడ్లతో భద్రత
సాక్షి, హైదరాబాద్ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికీ భూయాన్ శర్మపై ఆరోపణల కేసులో అస్సాం పోలీసులు ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా నివాసంలో సోదాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఉన్న పవన్ ఖేరా, ఆయన భార్య నీలిమ ఇంటి బయట పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తమను అస్సాం పోలీసులు ఇంకా సంప్రదించలేదని నగర పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అస్సాం పోలీసులు వచ్చి నోటీసు ఇస్తే తాము సహకరిస్తామని వారు తెలిపారు.మరోవైపు పవన్ ఖేడా ఆచూకీ కోసం తాము ఇంకా ప్రయత్నిస్తున్నామని అస్సాం పోలీసులు బుధవారం తెలిపారు. ఢిల్లీలోని ఖేడా నివాసంలో నిజాముద్దీన్ ఈస్ట్లో ఉన్న కాంగ్రెస్ నాయకుడి ఇంటికి అస్సాం పోలీసుల బృందం దాదాపు రెండు గంటల పాటు సోదాలు జరిపిన అనంతరం, పోలీసులు "కొన్ని నేరారోపణ సాక్ష్యాలు" ఎలక్ట్రానిక్ పరికరాలతో వెనుదిరిగారు. హిమంత భార్యకు మూడు పాస్పోర్టులు ఉన్నాయని, విదేశాల్లో అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని, ఆ సమాచారాన్ని ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించలేదని ఖేడా తీవ్ర ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఖేడాపై గువాహటిలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా అస్సాం పోలీసులు మంగళవారం ఢిల్లీలో పవన్ ఖేడా నివాసానికి చేరుకొని సోదాలు చేశారు.అయితే, ఆ సమయంలో ఇంట్లో పవన్ ఖేడా లేరని, ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియదని అస్సాం డీజీపీ దేబజిత్ నాథ్ చెప్పారు. ఎక్కడున్నా అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. సోదాల్లో కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, ఖేడాపై నేరారోపణలకు దారితీసే కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ వివరాలు ఇప్పుడే వెల్లడించలేమని పేర్కొన్నారు. అస్సాం పోలీసులు ఉదయం 11 గంటలకు పవన్ ఖేడా నివాసానికి చేరుకున్నారు. రెండు గంటల తర్వాత వెళ్లిపోయారు. ఈ సోదాల పట్ల కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ నెల 9న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని తేలిపోవడంతో హిమంత ఉక్కిరిబిక్కిరవుతున్నారని, అందుకే ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడింది. హిమంత భార్యపై ఖేడా చేసిన ఆరోపణలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమర్థించారు. సీఎం భార్యపై ఈడీ లేదా సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖేడాపై కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. హిమంత, ఆయన కుటుంబ తప్పిదాలను బయటపెడతామన్నారు.ఇదీ చదవండి: BMWలో అమ్మడికి జాక్పాట్... ఎలాగో తెలిస్తే షాకవుతారు!పరారైన ఖేడా: హిమంత తనపై, తన కుటుంబంపై ఆరోపణలకు ఆధారమైన పత్రాలను కాంగ్రెస్ సరిచూసుకోలేదని హిమంత ఎద్దేవా చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలన్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలను ఖండించారు. వృద్ధాప్యంతో ఆయన పిచి్చగా మాట్లాడుతున్నారన్నారు. ‘‘మాపై ఆరోపణలు చేసిన పవన్ ఖేడా హైదరాబాద్ పారిపోయారు. ఆయన పాతాళంలో దాక్కున్నా పట్టుకోవడం తథ్యం’’ అని అన్నారు. నిజాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం, వాటిని కాంగ్రెస్ నాయకత్వం సమర్థించడం ఏమిటని సీఎం నిలదీశారు. ‘‘ఆరోపణల డాక్యుమెంట్లను ఖేడాకు రాహుల్ గాంధీ ఇచ్చి ఉంటారు. కనుక ఈ కేసులో రాహుల్ గాందీని చేర్చాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు.ఇదీ సంగతి : సీజ్ఫైర్ : పాక్ మార్కెట్లు ఫైర్, ట్రేడింగ్ నిలిపివేత! -
కేంద్ర మాజీ మంత్రి మోహ్సినా కిద్వాయ్ కన్నుమూత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో తీరని విషాదం నెలకొంది. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తదితర ఉద్దండులతో కలిపి పనిచేసిన కాంగ్రెస్ కురువృద్ధురాలు, కేంద్ర మాజీ మంత్రి మోహ్సినా కిద్వాయ్ (94) బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వయోభారంతో తలెత్తిన అనారోగ్య సమస్యలతో నోయిడాలోని మెట్రో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.మోహ్సినా కిద్వాయ్ మరణవార్తను ఆమె బంధువు రజి ఉర్ రెహ్మాన్ కిద్వాయ్ మీడియాకు వెల్లడించారు. ఆమె భౌతికకాయాన్ని మధ్యాహ్నం 3 గంటలకు నోయిడా సెక్టార్-40లోని స్వగృహం నుంచి అంతిమ యాత్రగా తీసుకెళ్లి, సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. భర్త ఖలీల్ ఆర్ కిద్వాయ్ గతంలో మృతి చెందారు.సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో 1930, జనవరి 1న జన్మించిన మోహ్సినా.. దశాబ్దాల పాటు భారతీయ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. 1977లో మీరట్ నుంచి లోక్సభకు ఎన్నికై పార్లమెంటరీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఏడు, ఎనిమిదో లోక్సభలకు ఎన్నికైన ఆమె, 2004 నుంచి 2016 వరకు ఛత్తీస్గఢ్ నుంచి రాజ్యసభ ఎంపీగా కూడా సేవలందించారు. అంతకుముందు యూపీ రాష్ట్ర ప్రభుత్వంలోనూ పౌరసరఫరాలు, సాంఘిక సంక్షేమం, చిన్న తరహా పరిశ్రమల శాఖల మంత్రిగా పనిచేశారు.పార్టీకి పెద్ద దిక్కుగా..1982లో తొలిసారిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోహ్సినా.. ఆ తర్వాత వైద్య ఆరోగ్య (1983–84), గ్రామీణాభివృద్ధి (1984), రవాణా (1986), పట్టణాభివృద్ధి (1986–89) తదితర కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. పలు పార్లమెంటరీ కమిటీల్లో చురుకైన సభ్యురాలిగా వ్యవహరించారు. సోనియా గాంధీకి సైతం అత్యంత సన్నిహితురాలిగా మెలిగిన ఆమె.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా, కేరళ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. -
దేశంలో మరో కొత్త పార్టీ.. నవజ్యోత్ కౌర్ సిద్ధూ ప్రకటన
చండీగఢ్: కాంగ్రెస్ బహిష్కృత నాయకురాలు నవజ్యోత్ కౌర్ సిద్ధూ సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు ఎక్స్లో తెలిపారు. పంజాబ్ మాజీ మంత్రి, క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్యనే నవజ్యోత్ కౌర్ సిద్ధూ. ఆమె బీజేపీలో చేరవచ్చని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, భారతీయ రాష్ట్రవాది పార్టీ (బీఆర్పీ)ని స్థాపిస్తున్నట్లు ఓ ఫొటో ద్వారా వెల్లడించారు. పార్టీ పేరుతో ఉన్న ఫొటోతో పాటు ఆమె ఓ సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్ చేశారు.ఎంతోకాలంగా ఈ ప్రకటన చేయాలని ఎదురుచూస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ ఆలోచన కొంతకాలంగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ప్రస్తుత రాజకీయ నాయకుల పనితీరును సమీక్షించిన తర్వాత కొత్త ప్రత్యామ్నాయ పార్టీ అవసరమనిపించిందని తెలిపారు.తన కొత్త పార్టీ ప్రజాసేవ, న్యాయం, బాధ్యతల నిర్వహణపై దృష్టి సారిస్తుందని చెప్పారు. ప్రజలకు నిజంగా ఏం కావాలో దాన్ని తిరిగి అందించడం లక్ష్యమని, దేశంపై బాధ్యతా భావంతో ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తున్నానని పేర్కొన్నారు. ఒకే లక్ష్యంతో శాంతి, న్యాయం కోసం అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా కలిసి పనిచేయడానికి నమ్మకంతో చేరారని తెలిపారు.పంజాబ్ కోల్పోయిన కీర్తిపై దృష్టి పెడతా..పంజాబ్ కోల్పోయిన గౌరవాన్ని తిరిగి తీసుకురావడం, ప్రేమ, స్వేచ్ఛ, నిస్వార్థ సేవ వంటి విలువలపై ఆధారపడి రాష్ట్రాన్ని “సువర్ణ రాష్ట్రం”గా మార్చడమే లక్ష్యమని నవజ్యోత్ కౌర్ సిద్ధూ చెప్పారు. ప్రజలతో, ప్రజల కోసం అనే విధంగా ప్రభుత్వాన్ని నిర్మించాలనే లక్ష్యంతో పాటు పౌరుల్లో ఆధ్యాత్మిక వికాసం వంటివి పెంపొందించేందుకు ప్రోత్సహిస్తామని తెలిపారు. ఉన్నత చైతన్యంతో పని చేయడం, సత్యం, ప్రేమ మార్గంలో నడవడం గురించి ఆమె చెప్పారు. గాయపడిన ప్రజల మనసులను నయం చేయడంపై ఈ ఉద్యమం దృష్టి సారిస్తుందని తెలిపారు. ఆమె చేసిన ఈ ప్రకటనలో స్పష్టత అంతగా లేదు. పార్టీ నిర్మాణం, నాయకత్వం, అధికారికంగా పార్టీని ప్రారంభించేది ఎప్పుడు? వంటి కీలక వివరాలు ఇంకా వెల్లడించలేదు. -
కాంగ్రెస్ నోట పాక్ పాట
బార్పేట/హోజాయ్/దిబ్రూగఢ్: ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్పై ప్రధాని మోదీ విమర్శల జడి కురిపించారు. ‘‘పాకిస్తాన్కు అనుగుణంగా కాంగ్రెస్ నడుచుకుంటోంది. తాజా ఘటనలే ఇందుకు సాక్ష్యం’’ అన్నారు. సోమవారం అస్సాంలోని బార్పేట, హోజాయ్, దిబ్రూగఢ్లలో మోదీ ఎన్నికల సభల్లో ప్రసంగించారు. ‘‘2016 సర్జికల్ దాడులు మొదలు సిందూర్ దాకా మనం చేపట్టిన ప్రతి ఆపరేషన్లోనూ కాంగ్రెస్ పాక్కే వంతపాడుతోంది. పాక్ ఎజెండాకే విలువిస్తోంది. దశాబ్దాల తరబడి మాజీ సైనికులకు వన్ర్యాంక్–వన్ పెన్షన్ విధానం అమలు చేయకుండా కాంగ్రెస్ మాజీ సైనికులకు ద్రోహంచేసింది. మేం వచ్చాక రూ.1.24 లక్షల కోట్లను నేరుగా వాళ్ల బ్యాంక్ ఖాతాలో జమచేశాం. రాహుల్గాంధీ ప్రేమ దుకాణాలు తెరిచానని గొప్పగా చెప్పుకుంటారుకానీ వాస్తవానికి ఆయన అబద్ధాల దుకాణాలు, అవమానకర షాప్లు తెరిచారు. ప్రజల నుంచి బీజేపీ భూములు లాక్కుందని ఆరోపిస్తారుగానీ నేషనల్ హెరాల్డ్, రాజీవ్గాంధీ చారిటబుల్ ట్రస్ట్ తదితరాల గుప్పిట్లో ఎంత భూమి ఉందో చెప్పరు. కాంగ్రెస్ హయాంలో అస్సాంలో గుంతలు పడ్డ రోడ్లపై వాహనాలు కూడా సరిగా నడపలేని దుస్థితి. మేం ఏకంగా యుద్ధ విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అయ్యేంత పటిష్టంగా రోడ్లు నిర్మించాం’’అంటూ మొరాన్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ రహదారిని ఉద్దేశించి మోదీ చెప్పారు.మోదీ మెచ్చిన స్ఫటిక కమలం ఇటీవల కేరళలోని తిరువళ్లలో ప్రచార సభలో మోదీ ప్రసంగం మధ్యలో ఉన్నట్టుండి ఎస్పీజీ కమెండోలను పిలిచారు. ‘‘స్ఫటిక కమలం ఆకృతిలోని పేపర్వెయిట్ను ఈ సభలో చూశా. అలాంటిది ఒకటి కావాలి. కుదిరితే తెప్పించండి’’ అని సూచించారు. వెంటనే రంగంలోకి దిగిన నిర్వాహకులు సభలో క్రిస్టిల్ కమలం ఎవరి వద్ద ఉందా అని ఆరా తీశారు. దాన్ని ఎక్కడ కొన్నారో కనుక్కున్నారు. తిరువళ్ల ప్రైవేట్ బస్టాండ్ సమీపంలోని ఆ దుకాణానికి వెళ్లి రెండింటిని కొని ప్రజాపనుల శాఖ గెస్ట్హౌస్ వద్ద ఎస్పీజీ అధికారులకు అందజేశారు. అదే రాత్రి వాటిని ఢిల్లీకి పంపించారు. మోదీ మెచ్చిన ఆ పేపర్ వెయిట్ను ప్రాచీన ఫెంగ్ షుయీ విధానంలో తయారు చేశారు. దాంట్లో 16 పూల రేకులు ఒక ఆధారానికి అతికించి ఉన్నాయి. దాన్ని తిప్పితే అందమైన పూల రేకులన్నీ తిరుగుతాయి. -
‘ప్రాంతీయ’ వ్యూహం!
సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య ప్రవేశద్వారం అస్సాంలో ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరింది. హోరాహోరీగా సాగిన ప్రచార పర్వానికి మంగళవారం సాయంత్రంతో తెరపడనుంది. పదేళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్న బీజేపీని ఎలాగైనా గద్దె దించాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని ప్రాంతీయ పార్టీలను కలుపుకుని బరిలో దిగింది. కంచుకోటను కాపాడుకుని హ్యాట్రిక్ కొట్టాలని కాషాయ దళం సర్వశక్తులూ ఒడ్డుతోంది. సంక్షేమం, జాతీయవాద అ్రస్తాలతో ఓటర్ల ముందుకు వెళ్తోంది. కాంగ్రెస్ ‘ఐక్య’మంత్రం 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 40 నుంచి 45 శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్ నిలకడగా 25 నుంచి 30 శాతం ఓట్లు సాధించినా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ప్రాంతీయ పార్టీల మధ్య చీలడంతో బీజేపీ గెలుపు సునాయాసం అవుతూ వచ్చింది. దాంతో ఈసారి కాంగ్రెస్ జాగ్రత్త పడుతోంది. ఓట్ల విభజనకు అడ్డుకట్ట వేసే వ్యూహంతో ముందుకెళ్తోంది. రైతుల్లో, గ్రామీణ వర్గాల్లో పట్టున్న అఖిల్ గొగోయ్ సారథ్యంలోని రైజోర్ దళ్, యువతను ప్రభావితం చేయగల లురిన్జ్యోతి గొగోయ్ నేతృత్వంలోని అస్సాం జాతీయ పరిషత్ను తనవైపు తిప్పుకుంది. దీనికి తోడు సంప్రదాయ, మైనారిటీ ఓటర్లను సంఘటితం చేయడంపై పీసీసీ చీఫ్ నేత గౌరవ్ గొగోయ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఓట్ల బదిలీపైనే ఆశలు ప్రాంతీయ పార్టీలు గత ఎన్నికల్లో 8 నుంచి 15 శాతం ఓట్లు సాధించాయి. ఆ ఓటు బ్యాంకును ఈసారి కాంగ్రెస్ కూటమికి పక్కాగా బదిలీ చేసుకోగలిగితే 40 శాతానికి పైగా ఓట్లు రావడం ఖాయమని కాంగ్రెస్ భావిస్తోంది. 60 నుంచి 70 స్థానాలతో విజయం సాధిస్తామని గంపెడాశలు పెట్టుకుంది. కాకపోతే భిన్న సిద్ధాంతాలున్న ప్రాంతీయ పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీ ఏ మేరకు సాధ్యమన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే విభేదాలను పక్కనపెట్టి పార్టీల నేతలంతా ఉమ్మడిగా పని చేసేలా ప్రత్యేక సమన్వయ కమిటీలను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ‘హిమంత’కోట పదిలమేనా? గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అస్సాం ప్రజలు కమలనాథులకే పట్టం కట్టారు. 2016 ఎన్నికల్లో సొంతంగా 60 స్థానాలు నెగ్గిన బీజేపీ మిత్రపక్షాలతో కలిపి 86 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2021లోనూ సొంతంగా 60, మిత్రపక్షాలతో కలిసి 75 సీట్లు నెగ్గి అధికారాన్ని నిలబెట్టుకుంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సారథ్యంలో సంస్థాగతంగా, క్షేత్రస్థాయిలో బీజేపీ మరింత బలంగా కనిపిస్తోంది. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని భావిస్తోంది. మైక్రో మేనేజ్మెంట్, క్షేత్రస్థాయిలో శ్రేణుల మధ్య సమన్వయంతో దూసుకెళ్తోంది. భారీ మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్మాణం, సంక్షేమ పథకాలు అధికార పార్టీకి శ్రీరామరక్షగా మారాయి. శాంతిభద్రతల పరిరక్షణ కూడా సానుకూలాంశమే. పదునైన హిందూత్వ ఎజెండా, బంగ్లాదేశ్ చొరబాట్ల నివారణ వంటి సున్నితమైన అంశాలను ముమ్మరంగా ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ను హిమంత ఆత్మరక్షణలో పడేశారు. -
రూ.3 వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టే కుట్ర
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ తర్వాత కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి.. సెటిల్మెంట్లకు దిగుతోంది. ఇప్పటికే నాదర్గుల్లోని రూ.7 వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టేందుకు యత్నించిన ప్రభుత్వ పెద్దలు.. తాజాగా కోహెడలోని మరో రూ.3 వేల కోట్ల విలువ చేసే 200 ఎకరాల పండ్ల మార్కెట్ భూములను కూడా తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు’అని మాజీమంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఎమ్మెల్యేలు పి.సబితారెడ్డి, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, కాలేరు వెంకటేశ్, బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేత క్యామ మల్లేశ్తో కలిసి సోమవారం ఆయన కోహెడలో పర్యటించారు. అనంతరం హరీశ్రావు మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. భూములను కొల్లగొట్టేందుకే‘కొత్తపేటలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో పండ్ల మార్కెట్ను కట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆ మేరకు 2020లో జీఓ నంబర్ 11 తీసుకొచ్చి మార్కెట్ను నోటిఫై చేశాం. భూములు కోల్పోయిన రైతులకు రూ.10 కోట్ల నష్టపరిహారం కూడా చెల్లించాం. జీఓ నంబర్ 216 ద్వారా మార్కెట్ ఖాతాలో రూ.350 కోట్లు జమ చేశాం.రూ.1,000 కోట్ల అంచనాలతో అత్యాధునిక మార్కెట్ యార్డ్కు డీపీఆర్ కూడా సిద్ధం చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటింది. ఇప్పటి వరకు తట్టెడు మట్టి తీయలేదు. టీజీఐఐసీ పేరుతో విలువైన ఈ భూములను తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది పూర్తిగా రైతుల సమస్య. ఏ ప్రభుత్వమైనా రైతుల కోసం పని చేయాలి. కానీ సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కమీషన్ల కోసం పనిచేస్తోంది. ‘దిల్’భూములను మార్కెట్కెలా కేటాయిస్తారు?ఇక్కడ భూములకు ప్రత్యామ్నాయంగా దిల్ భూముల్లో మార్కెట్ కట్టిస్తాం అంటున్నారు. ఏపీ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలోని డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(దిల్) భూములపై అనేక వివాదాలు ఉన్నాయి. వీటిలో ఏపీ వాటా అడుగుతోంది. ఈ భూములపై కోర్టు కేసులు కూడా ఉన్నాయి. పలువురు పేద రైతులు ఈ భూములపై ఆధారపడి ఉన్నారు. ఎలాంటి వివాదాలు లేని భూములను అనుయా యులకు అప్పగించి.. వివాదాస్పద దిల్ భూములను మార్కెట్కు ఎలా కేటాయిస్తారు? రేవంత్రెడ్డి ప్రభుత్వం కన్ను కోహెడ భూములపై పడింది. ఇప్పటికే లీలా హోటల్ కేంద్రంగా కేరళకు చెందిన నలుగురు దళారులు వీటిని కొల్లగొట్టే ప్రయత్నం మొదలు పెట్టారు. 30 వేల మంది రైతులు కావాలో? లేక ముగ్గురు దళారులు కావాలో? ప్రభుత్వమే తేల్చుకో వాల్సి ఉంది. ఇక్కడ మార్కెట్ నిర్మించకపోతే ఎంత దూరమైనా పోరాడుతాం. రైతుల పక్షాన కొట్లాడుతాం’అని హరీశ్రావు స్పష్టం చేశారు. -
2034 వరకు మా సర్కారే: సీఎం రేవంత్
సాక్షి, ఆదిలాబాద్: ‘మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే.. 2034 వరకు ప్రజా ప్రభుత్వమే కొనసాగుతుంది.. మీ బాగోతం ప్రజలు చూశారు.. మళ్లీ గడీల పాలన కావాలని ఎవరూ కోరుకోరు. పదేళ్లలో మీరు చేయ లేని ఎన్నో గొప్ప పనులు మా ప్రభుత్వం చేసింది.. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి..’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘అడ్డు పడడానికి ఊరూరా తిరగడం కాదు.. ఎంతసేపూ లొల్లి పెట్టాలి.. యాగీ చేయాలనే దృక్పథంతోనే వెళ్తున్నారు..’ అంటూ విపక్ష బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పదేళ్లలో ఇలాంటి సంప్రదాయం చూశారా? ‘పీసీసీ అధ్యక్షుడిగా అప్పట్లో నిర్మల్లో నిరసన తెలిపినా, ఇంద్రవెల్లిలో దండోరా పెట్టినా.. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహించినా.. ప్రజా సమస్యలను పరిష్కరించాలనే ఉక్కు సంకల్పంతోనే పోరాటం కొనసాగించాం. ఎన్ని కేసులు పెట్టినా కొట్లాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం. అందుకే పార్టీలకు అతీతంగా ఈ సభలకు ఆహ్వానించాం. గత పదేళ్లలో తెలంగాణలో ఇలాంటి సాంప్రదాయం ఎప్పుడైనా చూశారా?. ఇక్కడ కాంగ్రెస్ శాసనసభ్యులు లేకపోయినా బోథ్లో, నిర్మల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మంజూరు చేశాం. మా ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రజలు నష్టపోకూడదని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం. పార్టీలు చూడకుండా, ప్రజల కష్టాలు చూసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. జూన్ 2 నాటికి ఎయిర్పోర్టుకు శంకుస్థాపన బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు మంజూరు చేశాం. అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేస్తాం. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. త్వరలోనే వీలైతే జూన్ 2 నాటికి ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణానికి శిలాఫలకం వేసేలా చూస్తాం. ఆదిలాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఆదిలాబాద్లో యూనివర్సిటీకి సంబంధించి భూసేకరణ చేపట్టాం. త్వరలోనే శంకుస్థాపన చేస్తాం. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు అభ్యర్థన మేరకు గూడెం సత్యనారాయణస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. డిసెంబర్లో ఇందిరమ్మ చీరలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఏమేం కావాలో అంచనాలు సిద్ధం చేస్తున్నాం. తెలంగాణ ఆడపడుచులకు వచ్చే డిసెంబర్లో ఇందిరమ్మ చీరలు అందజేస్తాం.. చిలుకపచ్చ రంగు చీరలు అందిస్తాం. పేదల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే మా ప్రయత్నం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్న బియ్యం పంపిణీ ‘రాష్ట్రంలో రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. ఇప్పటివరకు దాదాపు రూ.5,400 కోట్లు ఆ ఇళ్లు కట్టుకునే పేదల ఖాతాల్లో వేశాం. ఎన్నడైనా గత ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేసిందా?. సన్న బియ్యంతో పేదల కడుపు నింపాలనే ఆలోచన ఎప్పుడైనా చేసిందా?. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మా ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తోంది. మా ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణానికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాం. మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీలు) తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్కు హైటెక్ సిటీలో షాపులు కేటాయించాం..’ అని సీఎం తెలిపారు. పిప్రిలో సభ సీఎం ఆలోచనే: డిప్యూటీ సీఎం ‘పిప్రిలో బహిరంగ సభ నిర్వహించాలన్నది సీఎం రేవంత్రెడ్డి ఆలోచనే.. నా ఆలోచన కాదు..’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలకు సంబంధించి చర్చిస్తున్న క్రమంలో.. ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహిద్దామని సీఎం అన్నారని చెప్పారు. పిప్రి నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేపట్టి ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు వాటిని మంజూరు చేసి అమలు చేయాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారని వెల్లడించారు. ఆనాడు మండుటెండలో తనతో నడిచి పాదయాత్రను విజయవంతం చేశారని, ఈరోజు కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారని అన్నారు. ఇది రాజకీయ సభ కాదని ఆనాడు ప్రజలతో ఏర్పర్చుకున్న అనుబంధానికి నిదర్శనం ఈ సభ అని భట్టి చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో మంత్రులందరం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని, అంతరాలు లేని సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని చెప్పారు. ఆనాడు టీపీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్రెడ్డి, సీఎల్పీ నేతగా మల్లుభట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలు, బహిరంగ సభలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి దోహద పడ్డాయని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. అప్పట్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ తెలంగాణను మేటి రాష్ట్రంగా నిలుపుతున్నారని అభినందించారు. వచ్చే ఎన్నికల్లో వందకు పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. భట్టి పాదయాత్రకు మూడేళ్లు పూర్తి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క, సీఎల్పీ నేతగా రాష్ట్రంలో చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. ఆనాడు భట్టి పాదయాత్ర ప్రారంభించిన పిప్రిలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక బహిరంగ సభను ప్రభుత్వం నిర్వహించింది. కాగా అప్పట్లో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి రూ.614 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఎస్హెచ్జీల మహిళలకు వడ్డీలేని రుణాలు పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ ఎంపీ వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్రావు, వెడ్మ బొజ్జు, మాలోత్ రాందాస్, ఎమ్మెల్సీ దండే విఠల్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, విజయరమణారావు, బీజేపీ ఎంపీ గొడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, కేంద్ర మాజీమంత్రి వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ బంద్.. గజ్వేల్లో ఉద్రిక్తత..
గజ్వేల్ బంద్ అప్డేట్స్..గజ్వేల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డీసీసీ అధ్యక్షులు ఆంక్షా రెడ్డి ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. దీంతో, పోలీసులు.. వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ స్వల్ప వాగ్వాదం, తోపులాట జరిగింది. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ నేతలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.కాగా, గజ్వేల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ నేడు బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో దుకాణాలు మూతపడ్డాయి. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు బైఠాయించి ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. గజ్వేల్లోని కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.ఇక, రెండ్రోజుల క్రితం మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. అదే సమయంలో క్యాంప్ ఆఫీస్ కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. కాంగ్రెస్ నేతలే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తాము సీఎం ఫోటో పెట్టడానికే వెళ్ళాం.. దాడి చేయలేదని కాంగ్రెస్ నాయకుల వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్షా రెడ్డి సహా 42 మందిపై గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
సునేత్ర పవార్కు కాంగ్రెస్ ఝలక్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నేపథ్యంలో అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సునేత్ర పవార్ విజ్ఞప్తిని కాంగ్రెస్ హైకమాండ్ తిరస్కరించింది. దీంతో, ఉన ఎన్నికను ఏకగ్రీవం చేయాలనుకున్న ఆమె ప్రయత్నం విఫలమైంది.కాగా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ ఇటీవలే విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణం కారణంగా బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. కాగా, ఈ స్థానం నుంచి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీలో నిలబడ్డారు. అనంతరం, బారామతి నుంచి సునేత్ర.. ఏకగ్రీవంగా ఎన్నిక కావాలని ఆకాంక్షించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీతో ఆమె చర్చలు జరిపారు. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సప్కల్ను కలిశారు. పోటీలో కాంగ్రెస్ అభ్యర్థి లేకుండా ఉండాలనే ప్రయత్నాలు చేశారు. కానీ, కాంగ్రెస్ అభ్యర్థిని పోటీలో దింపాలని నిర్ణయం తీసుకుంది.ఇక, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సునేత్ర పవార్పై కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని బరిలోకి దింపింది. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యాయవాది ఆకాష్ విశ్వనాథ్ మోర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మరోవైపు, ఆమె ఉద్ధవ్ థాక్రేను కూడా సంప్రదించారు. అయితే, ఇప్పటికీ శివసేన యూబీటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ అన్నారు. ఆమె బీజేపీతో పొత్తులో ఉన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు.ఇదిలా ఉండగా.. నేడు సునేత్ర పవార్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. బారామతి పవార్ కుటుంబానికి కంచుకోట. అజిత్ పవార్ మరణంతో సునేత్ర పవార్కు సింపతీ వర్క్ అవుట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఉద్ధవ్ వర్గం అభ్యర్థిని పోటీలో నిలుపుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
వివాదరహితుడు
వి.వైతిలింగం... పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో వివాద రహితుడు. నిష్కళంక నాయకుడు. పార్టీ అంతర్గత సవాళ్లను ఎదుర్కోవడంలో సమర్థుడు. ఎంతటి రాజకీయ గందరగోళంలో అయినా.. నిబ్బరంగా, సౌమ్యంగా ఉండటం ఆయన విలక్షణ శైలి. సరళంగా, సూటిగా మాట్లాడటంలో ఆయనకు ఆయనేసాటి. ఒకప్పుడు సహచరుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామితో తట్టంచవాడి నియోజకవర్గంలో పోటీ పడుతున్నారు. సుస్థిర పాలన... వైతిలింగం తండ్రి వి.వెంకటసుభ రెడ్డియార్ పాండిచ్చేరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన స్ఫూర్తితో 1971లో యూత్ కాంగ్రెస్ సభ్యునిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 30 ఏళ్ల వయసులో నెట్టపాక్కం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, కేవలం 90 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1985లో రెండోసారి పోటీ చేసి గెలుపొందారు. 1996 నుంచి 2001 వరకు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ పదవిని చేపట్టిన అతి పిన్న వయసు్కలలో ఒకరు. తాను ముఖ్యమంత్రికాగానే బడ్జెట్ లోటుపై దృష్టి సారించారు. ఆర్థిక వృద్ధి తోడ్పాటుకోసం ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరిచారు. పొత్తుల విషయంలో పార్టీ హైకమాండ్తో విభేదాల కారణంగా కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్.రంగస్వామి రాజీనామా చేయడంతో, 2008లో ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. పుదుచ్చేరి శాసనసభకు ఎనిమిది సార్లు ఎన్నికైన సీనియర్ నేత. తాను అధికారంలో ఉన్న రెండు పర్యాయాలు స్థిరమైన పాలనను అందించిన నాయకుడు. అసెంబ్లీ నుంచి లోక్సభకు... 2011 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళమెత్తారు. 2016 జూన్లో అసెంబ్లీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పుదుచ్చేరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2024లో మరోసారి పోటీ చేసి ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అధికార కూటమిపై ప్రతిపక్షం విజయం సాధించడం పుదుచ్చేరి లోక్సభ చరిత్రలో అదే మొదటిసారి. 2021 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు సీట్లను మాత్రమే గెలుచుకుని, పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఓటమిని చవిచూసింది. ఆ ఓటమితో కేడర్లో నైతిక స్థైర్యం తగ్గడం, వర్గపోరాటాల నేపథ్యంలో, 75 ఏళ్ల వైతిలింగం జూన్ 2023లో పుదుచ్చేరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి... పార్టీని చక్కబెట్టే పనిలో పడ్డారు. పుదుచ్చేరి ఏకైక లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనను ఈసారి అనూహ్యంగా బరిలోకి దిగారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామిపై తట్టంచవాడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వ్యవసాయం చేస్తూ... 1950లో అక్టోబర్ 5న తమిళనాడులోని కడలూరులో జన్మించారు. పుదుచ్చేరిలోని మదుక్కరైలో పెరిగారు. అక్కడ పాఠశాల విద్య పూర్తి చేశాక, చెన్నైలోని లయోలా కళాశాలలో చేరారు. మదుక్కరైలో కుటుంబ వ్యవసాయం మధ్య పెరిగిన ఆయనకు చిన్న వయస్సు నుండే వ్యవసాయ పనులంటే ఆసక్తి. తన మాధ్యమిక విద్యను పూర్తిచేసి వ్యవసాయంపై దృష్టి సారించారు. ఆ తరువాత డిస్టెన్స్లో డిగ్రీ పూర్తి చేశారు. పుదుచ్చేరికి వైద్య సేవల సంచాలకుడిగా విశేష సేవలు అందించిన డాక్టర్ సాంబశివం కుమార్తె అయిన శశికళను 1969లో వివాహం చేసుకున్నారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి కుట్ర పన్నారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. తగినంత సాక్ష్యాధారాలు లేకపోవడంతో వైతిలింగంతోపాటు సహ నిందితులందరినీ నిర్దోషులుగా విడుదలయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాంగ్రెస్ పెద్దల చెరలో 373 ఎకరాలు: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లో రూ.7 వేల కోట్ల విలువైన భారీ భూ కుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆరోపించారు. ప్రభుత్వ భూమిపై కన్నేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుటుంబం 373 ఎకరాల భూమిని ఆక్రమించిందన్నారు. తెలంగాణభవన్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్రావు మాట్లాడారు. నాదర్గుల్లోని సర్వే నంబర్ 613 (కొత్త సర్వే నంబర్ 119)లో ఉన్న 373 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదేనని గతంలోనే స్పష్టమైందన్నారు. ఈ భూములను ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు లేఖ రాయగా, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో వీటిని ప్రభుత్వ భూములుగా అసెంబ్లీలో ప్రకటించి ఏపీఐఐసీకి అప్పగించారని తెలిపారు.2022 అక్టోబర్ 13న హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ కూడా ఈ భూముల క్రయవిక్రయాలు చెల్లవని స్పష్టం చేశాయని వివరించారు. విక్రయాల్లో పాల్గొన్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించిందన్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో జస్టిస్ పంకజ్మిట్టల్, జస్టిస్ ప్రసన్న ధర్మాసనం ముందు ఈనెల 7న విచారణకు ఉందని తెలిపారు. సుప్రీంకోర్టులో ఎలాంటి స్టే లేదని, కాబట్టి హైకోర్టు తీర్పే అమల్లో ఉందని చెప్పారు. ల్యాండ్ సీలింగ్ చట్టానికి విరుద్ధంగా విక్రయాలు ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి 373 ఎకరాలు ఉండే అవకాశం లేదని, అయినా శివరాజ్ బహదూర్ 2016లో ఈ భూములను ఆల్ఫా, ఒమేగా, యునిటెక్ కంపెనీలకు విక్రయించాడని ఆరోపించారు. సెక్షన్ 8, 17 ప్రకారం డిక్లరేషన్ లేకుండా విక్రయం చెల్లదని, సెక్షన్ 22ఏ కింద ఈ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని కందుకూరు ఆర్డీఓ స్పష్టం చేశారని చెప్పారు. ఈ భూముల్లో సుమారు 600 మంది పేద రైతులు తాతముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్నారని వివరించారు. ప్రస్తుతం వారిని భూముల్లోకి రానివ్వకుండా బౌన్సర్లు, రౌడీలను పెట్టి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. మహిళా రైతులు కౌసల్య, మమతలను బెదిరిస్తూ, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఆఫర్ చేసి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, బోర్లు, కంచెలను ధ్వంసం చేశారని చెప్పారు. మంత్రి పొంగులేటి కుటుంబ హస్తం ఈ కబ్జాల వెనుక సాక్షాత్తూ మంత్రి పొంగులేటి కుటుంబం ఉందని హరీశ్రావు ఆరోపించారు. శిల్పా ఇన్ఫ్రా, శిల్పా రాఘవ ఎల్ఎల్పీ, ఎక్యూ స్కై్వర్ రియల్టర్స్ వంటి సంస్థల్లో మంత్రి కుమారుడు హర్షారెడ్డి తదితరులు డైరెక్టర్లుగా ఉన్నారన్నారు. కోహినూర్ గ్రూప్, శిల్పా ఇన్ఫ్రా, మెగా కంపెనీ పేర్లతో బోర్డులు మారుస్తూ భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. ‘చెరువులను కాపాడుతున్నానని చెప్పే సీఎం రేవంత్రెడ్డికి ఈ ఆక్రమణలు కనిపించవా? ప్రతిపక్షాలపై సిట్లు వేస్తారు కానీ ఇక్కడ ఎందుకు స్పందించరు’అని ప్రశ్నించారు. తక్షణమే హైడ్రా ద్వారా అక్రమ కాంపౌండ్ వాల్ను కూల్చాలని, ఆక్రమణదారులను అరెస్ట్ చేయాలని, రైతులను తిరిగి భూముల్లోకి అనుమతించాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. రేపు ఉదయం వరకు హైడ్రా కమిషనర్ చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి నాదర్గుల్కు వెళ్లి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
అస్సాం సీఎం హిమంత భార్యకు మూడు పాస్పోర్టులు
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భూయాన్ శర్మ మూడు దేశాల పాస్పోర్టులు కలిగి ఉన్నారని, దుబాయ్లో ఆమె పేరిట ఆస్తులు, అమెరికాలో కంపెనీ ఉన్నాయని పేర్కొంది. కాంగ్రెస్ మీడియా ఇన్చార్జి పవన్ ఖేరా ఆదివారం మీడియా సమావేశంలో ఈ ఆరోపణలు చేశారు. ఆమెకు దుబాయ్, అంటిగ్వా బార్బుడా, ఈజిప్టు పాస్పోర్టులున్నాయన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన పక్షంలో విదేశాలకు పారిపోవాలని ప్లాన్ వేసుకున్నారా? అంటూ ఖేరా ఎద్దేవా చేశారు. ఇందుకు సంబంధించిన పలు పత్రాలను ఆయన మీడియాకు చూపారు. సీఎం శర్మ భార్య పేరుతో అమెరికాలో ఓ కంపెనీ ఉందని చెప్పారు. ఈ వివరాలను దాచినందుకు గాను ఎన్నికల కమిషన్ సీఎం శర్మ నామినేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా స్పందించారు. వచ్చే 48 గంటల్లోగా ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఖేరా చూపుతున్న పత్రాల్లోని వివరాలకు ఎటువంటి పొంతన లేదన్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి నిస్పృహతో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ సీఎం శర్మ ఆరోపించారు. -
గుజరాతీలు నిరక్షరాస్యులు!
ఇడుక్కి/న్యూఢిల్లీ: గుజరాతీలు నిరక్షరాస్యులంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. ఆదివారం ఆయన కేరళలోని ఇడుక్కిలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ‘‘గుజరాత్ ప్రజలు నిరక్షరాస్యులైనందున ప్రధాని మోదీ వారిని నమ్మించి మోసగించారు. కానీ కేరళ ప్రజలు ఎంతో తెలివైనవారు. అక్షరాస్యులు. వారిని మోదీ, కేరళ సీఎం విజయన్ ఏమాత్రం మోసం చేయలేరు’’ అని పేర్కొన్నారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. గుజరాతీలు, ఉత్తర భారతీయులను ఆయన అవమానిస్తున్నారని ధ్వజమెత్తింది. కాంగ్రెస్కు ఓట్లేయడం లేదనే అక్కసుతోనే గుజరాత్, యూపీవాసులను ఖర్గే అవమానిస్తున్నారని ఆరోపించింది. ఆయన వ్యాఖ్యలను గుజరాత్ కాంగ్రెస్ నేతలు, ఎస్పీ చీఫ్ అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సమర్థిస్తారా అని ప్రశ్నించింది. విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్) నిబంధనలు మార్చాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. దీన్ని క్రైస్తవ సంస్థలు, ఎన్జీవోలు, పౌర సంఘాలపై దాడిగా అభివర్ణించారు. ఎఫ్సీఆర్ఏ సవరణలతో బీజేపీ, మోదీ నిజంస్వరూపం బట్టబయలైందన్నారు. ‘‘సీఎం విజయన్ స్వతంత్రుడు కారు. మోదీ చెప్పినట్లే నడుచుకుంటున్నారు’’ అని ఆరోపించారు. -
లచ్చమ్మ కుంట చెరువు.. హైడ్రాకు హరీష్ సవాల్
సాక్షి, హైదరాబాద్: భూముల విషయంలో పెద్దలే గద్దలుగా మారితే ఎలా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. నాదర్గూల్ భూముల ఆక్రమణ వెనుక మంత్రి పొంగులేటి సభ్యులే ఉన్నారని ఆరోపించారు. హైదరాబాద్ నడిబొడ్డున 7000 కోట్ల భూ కుంభకోణం జరుగుతోందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘దళితుల భూములను కాంగ్రెస్ భక్షించే ప్రయత్నం జరుగుతోంది. నాదర్గూల్ భూముల కుంభకోణం జరిగింది. పేదల భూముల్లోకి వారిని పోకుండా అడ్డుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నాదర్గూల్ భూముల కోసం చాలా ఏళ్లుగా పోరాటం జరుగుతుంది. ఈ భూమి తనదేనని రాజ్ బహుదూర్ కోర్టులో పోరాటం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఈ భూముల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది.రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూ భారతి పోర్టల్లో ఈ ల్యాండ్ ప్రభుత్వ భూమిగా పేర్కొంది. ఈ భూములను కాపాడాల్సిన బాధ్యత ఆర్డీవోది. దీనిపై అక్కడి రైతులు రెవెన్యూ అధికారులకి, హైడ్రా కమిషనర్కి ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించడం లేదు. నాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన భూమిని రేవంత్ రెడ్డి లాకుంటున్నారు. స్వయంగా రెవెన్యూ మంత్రే ఈ భూముల ఆక్రమణ వెనుక ఉంటే అధికారులు ఎలా చర్యలు తీసుకుంటారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో భూములను ఆక్రమిస్తే ఎవర్ని వదలను అన్న సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఈ భూములపై హైడ్రా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు.లచ్చమ్మ కుంట చెరువును అక్కడ పెద్దలు ఆక్రమిస్తుంటే హైడ్రా కమిషనర్ ఏం చేస్తున్నారు?. చెరువులను కాపాడుతా అనే హైడ్రాకు కళ్లు కనబడటం లేదా?. హైడ్రా కమిషనర్కి సవాల్ చేస్తున్నా. రేపు హైడ్రా కమిషనర్ రావాలి లేదా మా ఎమ్మెల్యేలతో నేనే వెళ్తాను. మరోవైపు 80 ఎకరాల గుట్టలు మాయం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ నెల 7న ఈ భూములపై సుప్రీంకోర్టులో విచారణ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వారంలోనే ఈ భూమి కోహినూర్కి చెందింది అని బోర్డు పెట్టారు. శిల్పా ఇన్ఫ్రా పొంగులేటి కుమారుడిది. ఈ భూముల వెనుక పొంగులేటి కుటుంబ సభ్యులే ఉన్నారు అంటూ’ వ్యాఖ్యలు చేశారు. -
వాళ్లు పెట్టారు.. వీళ్లు తీశారు
గజ్వేల్/సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మాజీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు ముట్టడించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటో పెట్టడంపై వివా దం రేగింది. ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. దీంతో శనివారం పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రధాన రహదారి గుండా కేసీఆర్ క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి లోపలికి ప్రవేశించారు. ఈ సందర్భంగా కార్యాలయం ప్రధాన ద్వారం అద్దాలు పగిలిపోయాయి. కాంగ్రెస్ శ్రేణులు వారి వెంట తెచ్చుకున్న రేవంత్రెడ్డి చిత్రపటాన్ని అక్కడ పెట్టి కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గజ్వేల్ సమస్యలను పట్టించుకోని కేసీఆర్కు ఒక్క నిమిషం కూడా పదవిలో కొనసాగే అర్హత లేదంటూ ఆంక్షారెడ్డి ధ్వజమెత్తారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని కాంగ్రెస్ శ్రేణులను అక్కడి నుంచి పంపించారు. సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అక్కడికి చేరుకొని కాంగ్రెస్ వైఖరిపై విరుచుకుపడ్డారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులతో ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీస్స్టేషన్లో కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు క్యాంపు కార్యాలయంలో రేవంత్రెడ్డి ఫొటోను తొలగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కార్యాలయం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అధికార మదంతోనే దాడి: హరీశ్రావు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే గజ్వేల్లోని కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో విర్రవీగుతూ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తూ కాంగ్రెస్ నాయకులు బిహార్ గ్యాంగ్ను తలపిస్తున్నారన్నారు. ఓ వైపు విద్వేష ప్రసంగాల బిల్లు పేరిట ప్రజలు, ప్రతిపక్షాల నోర్లు మూయిస్తూ మరోవైపు గూండా రాజ్యం నడుపుతున్నారని మండిపడ్డారు. ‘సీఎం, మంత్రులు పొలిటికల్ టూర్లు చేస్తూ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేస్తూ ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నారు. దాడులు ఆపకపోతే ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుంది’అని హరీశ్రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ దాడిని బీఆర్ఎస్ మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఖండించారు. -
గజ్వేల్లో టెన్షన్ టెన్షన్ KCR క్యాంప్ కార్యాలయంపై దాడి
-
కాంగ్రెస్ కు బిగ్ షాక్ క్యాతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం
-
బీఆర్ఎస్దే విజయం.. క్యాతనపల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా
సాక్షి, మంచిర్యాల: తెలంగాణలో బీఆర్ఎస్కు ఘన విజయం దక్కింది. మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎరిగింది. క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిశెల సంధ్యారాణి ఎన్నికయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్, సీపీఐ మైత్రితో అధికార కాంగ్రెస్ పార్టీకి చెక్ పడింది.రాష్ట్రంలో వాయిదా పడుతూ వస్తున్న ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల ప్రక్రియ నేడు జరిగింది. ఈ సందర్భంగా ఈ మూడు మున్సిపాలిటీల్లో శనివారం ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో క్యాతనపల్లి మున్సిపాలిటిలో మున్సిపల్ చైర్ పర్సన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిశెల సంధ్యారాణి ఎన్నిక కాగా.. వైస్ చైర్ పర్సన్గా సీపీఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరితను ఎన్నుకున్నారు.ఇక, క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు కాంగ్రెస్ దూరంగా ఉంది. ఎట్టకేలకు క్యాతనపల్లి మున్సిపాలిటీపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పంతం నెగ్గించుకున్నారు. కాగా, క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఐ పొత్తు పెట్టుకోగా 22 వార్డులకుగాను 10 వార్డుల్లో బీఆర్ఎస్, 4 వార్డుల్లో సీపీఐ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్-సీపీఐ కూటమికి స్పష్టమైన బలం ఉన్నది. కాంగ్రెస్ అభ్యర్థులు ఏడు స్థానాల్లోనే గెలిచారు. కానీ, మంత్రి వివేక్, కాంగ్రెస్ నేతల అరాచకాల వల్ల గతంలో చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్లుగా పొత్తు ధర్మంలో ఇద్దరు మహిళలు ఎన్నికయ్యారు. -
20 గుంటల భూమిలో 8 స్తంభాలు.. నాగలి ఎలా తిరుగుతుంది?
జగిత్యాల జిల్లా: మల్లాపూర్కు చెందిన వృద్ధురాలు ముష్కరి గంగామణి గ్రామసభలో నా 20 గుంటల వ్యవసాయ భూమిలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 8 విద్యుత్ స్తంభాలు వేసిండ్రు అంటూ తన ఆవేదనను వెల్లడిస్తూ ట్రాన్స్కో ఏఈ వినీత్రెడ్డిని వేడుకుంటున్న కథనం శుక్రవారం ‘సాక్షి’లో ‘‘కాల్మొక్త సారూ.. కనికరించండి’ శీర్షికన ప్రచురితమైంది. ఈ కథనాన్ని టీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు ట్విట్ చేశారు. విద్యుత్శాఖ మంత్రి భట్టి గారూ.. ఈ సమస్యకు పరిష్కారం చూపండి అంటూ 20 గుంటల భూమిలో ఇష్టరీతిన స్తంభాలు వేస్తే సాగుకి నాగలి ఎట్టా తిరుగుతది? పంట ఎట్ల పండుతది? అంటూ డిప్యూటీ సీఎం బట్టితో పాటు మాజీ మంత్రి కేటీఆర్కు, సీఎంవో కార్యలయానికి పోస్టు చేశారు. https://t.co/DVI3Vih9iy pic.twitter.com/RxNNnb7QLj— Kalvakuntla Vidyasagar Rao (@Vidyasagarrao_K) April 4, 2026 -
ఇరాన్ ఎఫెక్ట్.. కాంగ్రెస్లో కొత్త ట్విస్ట్?
ఇరాన్ యుద్ధం కాస్తా కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసింది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సరఫరా, పెట్రోల్ అంశాల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయాలతో సీనియర్ లీడర్లు విభేదించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ సీనియర్లు రాహుల్ గాంధీని విభేదిస్తూ మోదీ ప్రభుత్వ విధానాన్ని పదేపదే ప్రశంసించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం అనంతర పరిస్థితులపై మోదీ ప్రభుత్వ దౌత్య వైఖరిని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు మరియు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పదేపదే విమర్శించారు. మోదీ పాలనలో భారత విదేశాంగ విధానం రాజీ పడుతోందని ఆరోపించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమనీ మృతి విషయంలో కూడా భారత వైఖరిని రాహుల్ తప్పు పట్టారు. ఖమేనీ హత్యను ఖండించాలని రాహుల్ గాంధీ కేంద్రాన్ని కోరారు. అలాగే, గ్యాస్, పెట్రోల్ కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీటిని సరఫరా చేయడంలో కేంద్రం విఫలమైందని బహిరంగంగానే రాహుల్ మాట్లాడారు.అయితే, రాహుల్ వ్యాఖ్యలను మాత్రం కాంగ్రెస్ సీనియర్ నేతలు పరోక్షంగా తప్పు పడుతున్నారు. రాహుల్కు మద్దతు ఇవ్వకుండా కేంద్రానికి మద్దతు తెలుపుతున్నారు. ఇరాన్ విషయంలో భారత విదేశాంగ శాఖ నిర్ణయాలను మెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితి పట్ల ప్రభుత్వ విధానాన్ని పదేపదే ప్రశంసిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కమల్నాథ్, ఆనంద్ శర్మ, శశిథరూర్, మనీష్ తివారీ వంటి నేతులు బీజేపీ సర్కార్కు మద్దతుగా మాట్లాడారు.కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రభుత్వ విధానాన్ని బాధ్యతాయుతమైన రాజనీతి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ.. ప్రభుత్వం సరైన పనే చేస్తున్నట్లుందని అని అన్నారు. మరోనేత ఆనంద్ శర్మ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఐక్యతకు పిలుపునిచ్చారు. పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని భారతదేశం దౌత్యపరంగా నిర్వహించిన తీరును ఆయన... పరిణతి చెందినది మరియు నైపుణ్యంతో కూడినది అని ప్రశంసించారు. కమల్నాథ్ స్పందిస్తూ.. దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత ఏమీ లేదన్నారు. కొరత ఉందన్న వాతావరణాన్ని మాత్రమే సృష్టిస్తున్నారు అంటూ కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో కొనసాగుతున్న ఈ అంతర్గత కలహాలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి స్పందించారు. ఈ సందర్బంగా.. "రాహుల్ గాంధీ ఒక అవకాశవాది.. దేశద్రోహి అని కాంగ్రెస్ నాయకులకు తెలుసు!" అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.అయితే, పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ విషయంలోనూ కాంగ్రెస్లో ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. కేంద్రం చర్యలను రాహుల్ గాంధీ తప్పుపడితే కొందరు కాంగ్రెస్ సీనియర్లు మాత్రం కేంద్రాన్ని ప్రశంసించారు. నాడు శశిథరూర్ పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. -
అస్సాంలో మూడు ముక్కలాట!
సాక్షి, న్యూఢిల్లీ: అస్సాం ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ‘ప్రాంతీయ’పోరుగా మారాయి! ఎగువ, మధ్య, దిగువ అస్సాం ప్రాంతాల మధ్య సంక్లిష్టమైన రాజకీయ యుద్ధంగా రూపుదాల్చాయి. ప్రతి ప్రాంతానికీ భిన్నమైన సామాజిక నేపథ్యం, స్థానిక సమస్యలు, ఓటింగ్ సరళి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాల్లో ఎగువ అస్సాంలో 35, బోడోలాండ్తో కలిపి మధ్య అస్సాంలో 41, దిగువ అస్సాంలో 50 సీట్లు ఉన్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎగువ అస్సాం బీజేపీ వశం కాగా దిగువ అస్సాంలో ఆ పార్టీకి, కాంగ్రెస్కు హోరాహోరీ పోరు సాగింది. మధ్య అస్సాం రెండింటినీ ఆదరించింది. 2023లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ, సరిహద్దు జిల్లాల్లో ఊపందుకున్న అస్తిత్వ రాజకీయాలు, భారీగా కొత్త ఓటర్ల చేరికతో ఈసారి రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. దిగువ అస్సాం: సరిహద్దులో నువ్వా నేనా! బంగ్లాదేశ్ సరిహద్దును ఆనుకుని ఉండే దిగువ అస్సాం ప్రాంతంలో గుర్తింపు, అస్తిత్వ రాజకీయాలదే ప్రధాన పాత్ర. 50 అసెంబ్లీ స్థానాలున్న ఈ ప్రాంతంలో దుబ్రీ, బార్పేట, గోల్పారా వంటి ముస్లిం ప్రాబల్య జిల్లాలున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఇరు కూటములు హోరాహోరీగా తలపడ్డాయి. ఎన్డీఏకు 23 సీట్లు రాగా కాంగ్రెస్ కూటమి 27 స్థానాలతో పైచేయి సాధించింది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్, దాని భాగస్వామి ఏఐయూడీఎఫ్కు బలమైన పట్టుంది. అస్సాంలో ఏఐయూడీఎఫ్ గెలిచిన 16 సీట్లలో అత్యధికం ఇక్కడే కావడం విశేషం! ఈసారి మాత్రం దిగువ అస్సాంలో కాంగ్రెస్ కూటమికి బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. ఎగువ అస్సాం: బీజేపీ కంచుకోట అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ ఆశలకు ఎగువ ప్రాంతమే అత్యంత కీలకం! తిన్సుకియా, శివసాగర్, డిబ్రూగఢ్, జోర్హాట్ వంటి కీలక జిల్లాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇక్కడి 35 అసెంబ్లీ స్థానాల్లో 2021 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏకంగా 30 సీట్లు కైవసం చేసుకుని సత్తా చాటింది. కాంగ్రెస్ కూటమి 5 స్థానాలకు పరిమితమైంది. డీలిమిటేషన్ తర్వాత ఈ ప్రాంతంలో గిరిజన జనాభా శాతం పెరగడం బీజేపీకి మరింత కలిసొచ్చే అంశం. మధ్య అస్సాం: అధికారానికి వారధి! నగావ్, మోరిగావ్తో పాటు బోడోలాండ్ ప్రాంతంతో కూడిన మధ్య అస్సాం ఈసారి ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారింది. ఇక్కడ 41 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ప్రాంతంలో కుల, ప్రాంతీయ రాజకీయాల ప్రభావం మరీ ఎక్కువ. పలు స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు కింగ్మేకర్లు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి 22, కాంగ్రెస్ కూటమి 16, యూపీపీఎల్, బీపీఎఫ్ వంటి ప్రాంతీయ పార్టీలు 3 స్థానాలు నెగ్గాయి. డీలిమిటేషన్ ప్రక్రియతో ఈ ప్రాంతం రాజకీయంగా సరికొత్త రూపు సంతరించుకుంది. చాలా అసెంబ్లీ స్థానాల సరిహద్దులు మారిపోయాయి. ఎస్టీ రిజర్వుడ్ స్థానాల సంఖ్య పెరిగింది. ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు ముక్కలయ్యాయి.ఈసారి కీలకాంశాలివే...→ అస్సాంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బాగా ప్రభావం చూపనుంది. → కొత్త ఓటర్లతో పాటు భారీగా ఓట్ల గల్లంతు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. → బోడోలాండ్లో ప్రాంతీయ పార్టీల వైఖరి, ఎగువ అస్సాంలో బీజేపీ ఎదుర్కొంటున్న అగ్నిపరీక్ష, దిగువ అస్సాంలో అస్తిత్వ పోరాటం ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. స్వల్ప ఓట్లతోనే భారీ తేడా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 75 స్థానాలు గెలిస్తే విపక్ష కాంగ్రెస్ కూటమి 50కి పరిమితమైంది. స్థానాలపరంగా ఇంత తేడా ఉన్నా ఓటుబ్యాంకు విషయంలో మాత్రం పెద్దగా అంతరం లేకపోవడం విశేషం! బీజేపీకి 33 శాతం, కాంగ్రెస్కు 30 శాతం ఓట్లు పడ్డాయి. ఇతరులు ఒక స్థానానికి (0.8 శాతం) పరిమితం కాగా, ఏఐయూడీఎఫ్ పార్టీ 9 శాతం ఓటు బ్యాంకును సాధించింది. అంటే.. గెలిచిన సీట్లలో ఎన్డీయే స్పష్టమైన మెజారిటీ చూపించినా, ఓట్ల శాతంలో మాత్రం కాంగ్రెస్ కూటమి గట్టి పోటీనే ఇచ్చింది. -
మూడేళ్ల జైలు శిక్ష పడినందుకు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు
భోపాల్: చీటింగ్ కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి అనర్హతకు గురయ్యారు. 1998–2011 సంవత్సరాల మధ్య కాలంలో గ్రామీణ బ్యాంక్ చైర్మన్గా వ్యవహరించిన రాజేంద్ర భారతి ఫిక్స్డ్ డిపాజిట్ల పేరిట బ్యాంక్ రికార్డులను ఫోర్జరీ చేసి వడ్డీ రూపంలో రూ.18.5 లక్షలు కాజేశారన్న ఆరోపణలు రుజువు కావడంతో గురువారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించడం తెల్సిందే. ఈ నేరంలో పాలుపంచుకున్న బ్యాంకు క్యాషియర్ రఘువీర్కు కూడా రూ.లక్ష జరిమానా విధించింది. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి రాష్ట్ర విధాన సభ ప్రిన్సిపాల్ సెక్రటరీ అరవింద్ కుమార్, దాటియా ఎమ్మెల్యే భారతిని అనర్హుడిగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా, సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో గతేడాది అక్టోబర్లో ఈ కేసును మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీకి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. తమ ఎమ్మెల్యే రాజేంద్ర భారతిని అనర్హుడిగా ప్రకటిస్తూ గురువారం అర్ధరాత్రి హడావుడిగా అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేయడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత, మాజీ మంత్రి నరోత్తమ్ మిశ్రాపై రాజేంద్ర భారతి విజయం సాధించడం గమనార్హం. -
ఆరు గ్యారంటీలేవీ?
నారాయణపేట: ‘ఆరు గ్యారంటీల అమలు ఎక్కడ జరుగుతున్నాయి. పిల్లలు పుడితే గానీ కల్యాణలక్ష్మి రావడం లేదు. ‘పాలమూరు బిడ్డలను మోసం చేసి గద్దెనెక్కావు. నీ సొంత నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా వందశాతం రుణమాఫీ చేపట్టావా.. కొడంగల్కు రా చర్చించుకుందాం’అంటూ సీఎం రేవంత్రెడ్డికి మాజీ మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లిలో గురులోకా మసంద్ బావాజీని శుక్రవారం ఆయన దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండలంలోని ఎక్కామెడ్ శివారులో మీడియాతో మాట్లాడారు.రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అసెంబ్లీలో నిలదీస్తే ఇచ్చింది 16 వేల ఉద్యోగాలేనని చెప్పారన్నారు. ఇప్పటికే రైతుబంధు మూడుసార్లు ఎగ్గొట్టావని, వడ్లకు బోనస్ రెండుసార్లు ఇవ్వలేదని.. కూట్లో రాయి తీయనోడు.. ఏట్లే రాళ్లు తీశాడంటా అన్నట్టుంది నీ పరిస్థితి అంటూ రేవంత్రెడ్డిపై సెటైర్లు వేశారు. ‘మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్రెడ్డి వెళ్లారు.. అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది. మళ్లీ కేరళలో జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి వెళుతున్నారు. రేవంత్.. నీది ఐరన్ లెగ్ అక్కడ సైతం కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయం’అంటూ హరీశ్రావు ఎద్దేవా చేశారు.పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 1.83 కోట్ల క్యూబిక్ మీటర్ల పనులు చేపడితే, మిగిలిన 30 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడేళ్లు కావొస్తున్నా పూర్తి చేయడం లేదన్నారు. మూడవ ఫేజ్లో ఉన్న పాలమూరు ఎత్తిపోతల పథకంలోని కాల్వలను తవి్వతే కొడంగల్కు 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.90 శాతం పనులు పూర్తి చేసిన పాలమూరును పక్కనపెట్టి కమీషన్ల కోసం రూ.4,500 కోట్లతో నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నారని విమర్శించారు. ఫ్యూచర్ సిటీ అందాల పోటీలు, ఫుట్బాల్ షో అంటూ వేల కోట్లు ఖర్చు చేశావు గానీ.. లంబాడ సోదరులకు చేసింది ఏమీ లేదన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, పాల్గొన్నారు. -
దేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి కాంగ్రెస్, వామపక్షాల కుట్రలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్, వామపక్షాలు మత ఛాందసవాద శక్తులతో చేతులు కలుపుతున్నాయని, సమాజాన్ని విభజించి, ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్రలు సాగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. గురువారం కేరళలో జరిగిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మోదీ వర్చువల్గా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గాంధేయ సిద్ధాంతాన్ని వదిలేసిందని, మావోయిస్టు ముస్లిం లీగ్ కాంగ్రెస్గా మారిపోయిందని ధ్వజమెత్తారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్లు సొంత ఎజెండా కోసం సమాజంలో మనుషుల మధ్య చిచ్చుపెడుతున్నాయని ఆరోపించారు. అదే సమయంలో మన విశ్వాసాలను దెబ్బతీస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయ్యప్ప భక్తుల మనోభావాలను కించపర్చాయని విమర్శించారు. అయ్యప్ప ఆలయ బంగారం విషయంలో ఆ రెండు కూటములు నిజాయితీ లేకుండా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. సహకార బ్యాంకుల్లో ఉన్న ప్రజల కష్టార్జితాన్ని దురి్వనియోగం చేస్తున్నాయని ఆక్షేపించారు. దేశాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కాంగ్రెస్ మాత్రం దేశ ప్రతిష్టను దిగజార్చడమే పనిగా పెట్టుకుందన్నారు. విదేశాల్లోని పరిస్థితుల గురించి కాంగ్రెస్ నాయకులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని, దానివల్ల అక్కడ నివసిస్తున్న భారతీయులు ఇబ్బంది పడాల్సి వస్తోందని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. కేరళలో ఇప్పటిదాకా ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే, యువత బతుకులు బాగుపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని తేల్చిచెప్పారు. పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లాలని, బీజేపీకి ఓటు వేసేలా ప్రజలను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి సూచించారు. -
తండ్రి బాటలో తనదైన ముద్రతో..
గౌరవ్ గొగోయ్.. దేశంలో గుర్తింపు పొందిన యువ నాయకుల్లో ఒకరు. వారసత్వంగానే రాజకీయాల్లోకి వచ్చినా సమస్యలపై గొంతెత్తడంలో తనదైన ముద్ర వేసిన వ్యక్తి. పార్లమెంటు ప్రసంగాల్లో తన వాగ్ధాటితో ఆకట్టుకున్న నేత. ఇప్పుడు అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ పునరుజ్జీవానికి కృషి చేస్తున్నారు. మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన గౌరవ్, తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సీనియర్ బీజేపీ నాయకుడు హితేంద్రనాథ్ గోస్వామితో తలపడుతున్నారు. అస్సాం గణ పరిషత్ను ఓడించి అధికారాన్ని కాంగ్రెస్ చేతికిచ్చిన తన తండ్రి తరుణ్ గొగోయ్ తరహాలోనే.. బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే తపనతో ముందుకు సాగుతున్నారు. మోదీ ప్రభంజనాన్ని పక్కకు నెట్టి.. గౌరవ్ గొగోయ్ తండ్రి దివంగత తరుణ్ గొగోయ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. దీంతో డైనింగ్ టేబుల్ ముచ్చట్లలోనే కాదు.. ఇంట్లో పూర్తి రాజకీయ వాతావరణం ఉండేది. ఆ రాజకీయాల మధ్యే గౌరవ్ పెరిగారు. బాల్యం నుంచే ప్రభావం ఉన్నా.. ఆయన అధికారికంగా రాజకీయాల్లోకి వచ్చింది మాత్రం 2014లో. కలియాబోర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం కొనసాగినా.. కలియాబోర్లో మాత్రం బీజేపీ అభ్యర్థి మృణాల్ కుమార్ సైకియాపై గెలిచి గౌరవ్ పార్లమెంటులో అడుగుపెట్టారు. 2019లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పార్లమెంటులోని అత్యంత యువ గొంతుకల్లో ఒకరిగా నిలిచారు. స్థానిక సమస్యలపై గళమెత్తారు. ఆర్థిక విధానాలు, పర్యావరణ పరిరక్షణ, జాతీయ భద్రత, సమాఖ్య సంబంధాల వంటి అంశాలపై సూటి ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్నారు. 2020లో కాంగ్రెస్ ఆయనను లోక్సభలో ప్రతిపక్ష ఉప నాయకుడిగా నియమించడంతో ప్రభుత్వంపై దాడిలో దూకుడు పెంచారు. 2023లో ప్రధాని మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. నియోజకవర్గ మార్పులతో 2024 ఎన్నికల్లో జోర్హాట్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ‘చక్రవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడిలాంటివాడిని, కానీ నేనే చక్రవ్యూహాన్ని ఛేదించి బయటకు వస్తాను’అని చెప్పిన ఆయన.. చెప్పినట్లుగానే ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. 2025 మేలో అస్సాం కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన గౌరవ్.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కీలక ముఖంగా మారారు. కాంగ్రెస్ గెలుపు బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. కొత్త కాంగ్రెస్ వర్సెస్ పాత కాంగ్రెస్... 2024లో జోర్హాట్లో గౌరవ్ గొగోయ్ గెలుపు ఆయన విశ్వసనీయతను మరింత పెంచింది. అయితే బలమైన బీజేపీ ఎన్నికల యంత్రాంగం, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ ఆధిపత్యం, కాంగ్రెస్లోని అంతర్గత వర్గపోరాటాలు, విచ్చిన్నమైన ప్రతిపక్షం ఇప్పుడు గౌరవ్ ముందున్న సవాళ్లు. కాంగ్రెస్లోని అన్ని వర్గాలను ఏకం చేయగలిగితే, ఇటీవలి ఓటములతో నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపగలిగితే కొంతమేరకు విజయం సాధిస్తారు. అయితే, యువ ఓటర్లను ఇట్టే ఆకట్టుకునే శక్తి, ఎలాంటి అవినీతి కళంకం లేకపోవడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. నిరుద్యోగాన్ని రూపుమాపి, ద్రవ్యోల్బణాన్ని తగ్గించి, రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతిని అరికట్టడం, ప్రజల జీవితాలను మెరుగుపరచడమే లక్ష్యాలుగా ఆయన ఎన్నికల్లోకి వెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్య కాదు... కొత్త కాంగ్రెస్కు, పార్టీ మారి బీజేపీలో చేరిన పాత కాంగ్రెస్కు మధ్యే అంటున్నారు. కళలంటే ఆసక్తి.. గౌరవ్ గొగోయ్ 1982 సెపె్టంబర్ 4న ఢిల్లీలో జన్మించారు. ప్రాథమిక విద్యను ఢిల్లీలోని సెయింట్ కొలంబస్ పాఠశాలలో అభ్యసించారు. ఢిల్లీలోని గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఆ తరువాత కొంతకాలంపాటు ఎయిర్టెల్ మార్కెటింగ్లో పనిచేసిన ఆయన.. ఉద్యోగాన్ని వదిలి.. ఉన్నత విద్య కోసం యూకేకి వెళ్లారు. లండన్లోని న్యూయార్క్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివారు. గౌరవ్కు డ్యాన్స్, కొరియోగ్రఫీ, సంగీతం అంటే చాలా ఇష్టం. గౌరవ్ తల్లి.. డాలీ గొగోయ్. యూకేకు చెందిన ఎలిజబెత్ క్లేర్ను వివాహం చేసుకున్నారు. బ్రిటిష్ పౌరురాలైన ఎలిజబెత్ ప్రస్తుతం వాతావరణ మార్పులపై పరిశోధనలు చేసే ఆక్స్ఫర్డ్ పాలసీ మేనేజ్మెంట్లో పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
తెలంగాణే 'గ్యారంటీ'!
సాక్షి హైదరాబాద్: కేరళలో యూడీఎఫ్ గ్యారంటీల అమలు సాధ్యమా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని.. దానికి సమాధానం తెలంగాణ రాష్ట్రమే అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. యూడీఎఫ్ మేనిఫెస్టోపై విమర్శలు చేసేవారు.. ఆ హామీలు తెలంగాణలో ఎలా అమలు అవుతున్నాయో వచ్చి చూడాలని, వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. విజయన్, ఆయన మంత్రులు కూడా ప్రత్యక్షంగా వచ్చి పరిశీలించుకోవచ్చని సవాల్ విసిరారు. గురువారం కొచ్చిలో ఐదు ఇందిరమ్మ గ్యారంటీలతో కూడిన యూడీఎఫ్ మేనిఫెస్టోను ఆవిష్కరించిన అనంతరం రేవంత్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, మొదటి కేబినెట్ సమావేశం నుంచే గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నా మని ముఖ్యమంత్రి చెప్పారు. రుణమాఫీ, రైతు భరోసా, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గురించి వివరించారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ –2047 మేరకు తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపనున్నామని చెప్పారు. తమ రాష్ట్రం వృద్ధిరేటు 10.8%గా ఉందని, పన్నులు పెంచకుండానే అభివృద్ధి సాధ్య మని తాము నిరూపించామని రేవంత్ పేర్కొన్నారు. యూడీఎఫ్ స్వర్ణయుగ పాలన ఖాయం అవినీతి, కుటుంబ పాలన అంశంలో కేరళ సీఎం పినరయి విజయన్, మాజీ సీఎం కేసీఆర్ల మధ్య అనేక పోలికలు ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కేరళలో పదేళ్లుగా విజయన్ ప్రభుత్వం కొనసాగుతుంటే 2014 నుంచి సుమారు పదేళ్లపాటు కేసీఆర్ తెలంగాణను పాలించారని చెప్పారు. కుటుంబ పాలన, అవినీతి, అసమర్థ పాలన విషయంలోనూ ఇద్దరి మధ్య పోలికలు ఉన్నా యన్నారు. దేశాన్ని, కేరళనూ మోదీ బ్రదర్స్ పాలిస్తున్నారని మోదీ.. విజయన్ను ఉద్దేశించి విమర్శించారు. దేవుడి సొంత రాష్ట్రంలో ఆయన ఆస్తికే రక్షణ లేకుండా పోయిందంటూ పరోక్షంగా శబరిమల బంగారం ఉదంతాన్ని ప్రస్తావించారు. వచ్చే ఎన్నికలతో కేరళలో విజయన్ పాలన ముగిసి యూడీఎఫ్ స్వర్ణ యుగ పాలన మొదలవుతుందని చెప్పారు. కార్యక్రమంలో కేరళ కాంగ్రెస్ నేతలతోపాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు. -
అమరావతి కాదు.. కమ్మరావతి ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు
-
‘కమ్మరావతి’.. రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని కమ్మరావతి అని పిలవాలని అన్నారు. ఏపీ పునర్విభజన చట్టసవరణ బిల్లుపై రేణుకా చౌదరి మాట్లాడారు. ‘నేను ఇప్పటికే ముఖ్యమంత్రికి చెప్పాను పెట్టరా పేరు అమరావతి.. లేదంటే పిలవరా పేరు కమ్మరావతి. పెట్టు పేరు’అంటూ వ్యాఖ్యానించగా.. సభలో ఇతర ఎంపీలు.. రాజధాని పేరు కమ్మరావతి పెట్టమని చెప్పడమేంటని నవ్వుకున్నారు. -
కేరళ ఎన్నికలు.. UDF మేనిఫెస్టో విడుదల చేసిన రేవంత్
కొచ్చి: కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం యూడీఎఫ్ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేనిఫెస్టోను ప్రతిపక్ష నాయకుడు వి.డి. సతీశన్కు అందజేశారు. రాహుల్ గాంధీ గతంలో ప్రకటించిన ఐదు హామీలతో పాటు, అనేక ఇతర వాగ్దానాలతో కూడిన ఈ మేనిఫెస్టోను యూడీఎఫ్ తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ అందిస్తున్న పథకాలు, నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మేనిఫెస్టో ప్రకారం.. మహిళలకు KSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం, కళాశాల విద్యార్థులకు నెలకు రూ. 1,000 ఆర్థిక సహాయం అందజేత. అలాగే, యువత వ్యాపారాలు ప్రారంభించడానికి రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. రూ. 3,000 సంక్షేమ పింఛను, ఊమెన్ చాందీ పేరుతో అన్ని కుటుంబాలకు రూ. 25 లక్షల వరకు ఉచిత బీమా పథకం. వృద్ధుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటు వంటి ఆరు 'ఇందిరా హామీలు' మేనిఫెస్టోలో పొందుపరిచారు. వీటితో పాటు, 'జాబ్ వాచ్ టవర్ల' ఏర్పాటు, వయనాడ్లో ఒక గిరిజన విశ్వవిద్యాలయం, అలాగే కోజికోడ్ మరియు తిరువనంతపురం నగరాల్లో మెట్రో/లైట్ మెట్రో ప్రాజెక్టులను అమలు చేస్తామని కూడా యూడీఎఫ్ హామీ ఇచ్చింది.మేనిఫెస్టోలోని వాగ్దానాలు-ఇందిరా హామీలు:మహిళలకు KSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణంకళాశాల విద్యార్థులకు నెలకు రూ. 1,000 ఆర్థిక సహాయంసంక్షేమ పింఛన్లు రూ. 3,000కు పెంచబడతాయిఅన్ని కుటుంబాలకు రూ. 25 లక్షల వరకు ఉచిత 'ఊమెన్ చాందీ ఆరోగ్య బీమా'యువత వ్యాపారాలు ప్రారంభించడానికి రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణంవృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు ఆరోగ్య రంగం:'కారుణ్య బెనివలెంట్ ఫండ్' మరియు 'శృతి రంగం' వంటి పథకాలు తిరిగి ప్రారంభించబడతాయిBPL కుటుంబాలకు చెందిన రోగులకు డయాలసిస్ ఉచితం చేయబడుతుందిమహిళలు మరియు పిల్లల కోసం 'She Hospitals' (షీ హాస్పిటల్స్) ప్రారంభించబడతాయిJIPMER నమూనాలో 'బిల్లు లేని ఆసుపత్రులు' (No-bill hospitals) స్థాపించబడతాయిఆసుపత్రులకు వచ్చే రోగులకు పడక (బెడ్) పొందడం వారి హక్కుగా పరిగణించబడుతుందివ్యవసాయం మరియు మత్స్య రంగం:వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టబడుతుందిరబ్బరుకు రూ. 300 కనీస మద్దతు ధర (Floor Price) కల్పించబడుతుంది.అలాగే CIAL నమూనాలో ఒక రబ్బరు కంపెనీ ప్రారంభించబడుతుందివరి ధాన్యానికి రూ. 35, కొబ్బరికి అధిక కనీస ధర ఇవ్వబడుతుందిమత్స్యకారులకు మరియు కేఎస్ఆర్టీసీ, ఆటో, టాక్సీ యజమానులకు ఇంధన రాయితీ ఇవ్వబడుతుంది విద్య మరియు ఉపాధి:వయనాడ్లో ఆధునిక సౌకర్యాలతో 'గిరిజన విశ్వవిద్యాలయం' స్థాపించబడుతుందిక్యాంపస్లలో ర్యాగింగ్ను నివారించడానికి 'సిద్ధార్థన్ స్టూడెంట్ డిస్ట్రెస్ యాప్' ప్రవేశపెట్టబడుతుంది'సిద్ధార్థన్ యాంటీ-ర్యాగింగ్ చట్టం' అమలు చేయబడుతుందివిద్యా సంస్థలలో వివక్షను అంతం చేయడానికి 'రోహిత్ వేముల చట్టం' అమలు చేయబడుతుందిఅంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్లోని మార్పులను అధ్యయనం చేయడానికి 'జాబ్ వాచ్ టవర్' ఏర్పాటు చేయబడుతుంది10,000 కొత్త ఎంఎస్ఎంఈ సంస్థలను ప్రారంభించడానికి సహాయం అందించబడుతుంది సంక్షేమ ప్రాజెక్టులు:ఆకలి రహిత కేరళ కోసం ఇందిరా క్యాంటీన్లు ప్రారంభించబడతాయిఐదేళ్లలో 5 లక్షల మందికి ఇళ్లు అందించబడతాయిసామాజిక భద్రతా పింఛనులో దివ్యాంగులకు 25% అదనంగా ఇవ్వబడుతుందిఆశా కార్యకర్తల కనీస వేతనాన్ని రూ.700కి పెంచనున్నారుపేదల వివాహాలను తక్కువ ఖర్చుతో జరిపించడానికి 'స్నేహ సుమంగళి' వివాహ మందిరాలను నిర్మించనున్నారుపరిపాలన మరియు అభివృద్ధి:అవినీతిని అరికట్టడానికి రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ను ఏర్పాటు చేయనున్నారుమత సామరస్యాన్ని నిర్ధారించడానికి 'సహన మంత్రిత్వ శాఖ'శాంతి కోసం 'శాంతి మరియు సామరస్య' శాఖను ఏర్పాటు చేయనున్నారునదులను అనుసంధానించడం ద్వారా కేరళ తీరప్రాంతంలో 'మిషన్ సముద్ర' ప్రాజెక్టును అమలు చేయనున్నారుతిరువనంతపురం మరియు కోజికోడ్ నగరాల్లో మెట్రో/లైట్ మెట్రో ప్రాజెక్టులను అమలు చేయనున్నారుమాదకద్రవ్య రహిత కేరళ కోసం 'బ్రేక్ ది డ్రగ్ చైన్' ప్రాజెక్టును ప్రారంభించనున్నారు -
అస్సాంలో మూడోసారి.. మేమే!
గువాహటి: అస్సాంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చొరబాటుదార్ల రక్షణ కోసం చట్టం తీసుకొస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ కుట్రలను సాగనిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఆయన బుధవారం అస్సాంలో పర్యటించారు. ధెమా జీ జిల్లాలోని గోగాముఖ్, బిశ్వనాథ్ జిల్లాలోని బెహాలీలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. మెజార్టీ ప్రజల ను మైనార్టిలుగా మార్చేసి, చొరబాటుదార్లను శాశ్వతంగా ఓటుబ్యాంకుగా మార్చుకోవడమే కాంగ్రెస్ అసలు లక్ష్యమని ధ్వజమెత్తారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాకముందు చొరబాటుదార్ల కోసం కేంద్రంలో చట్టం తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రయతి్నంచిందని గుర్తుచేశారు. ఆ పార్టీ కుతంత్రాలను ఎన్డీయే అడ్డుకుందని వెల్లడించారు. ఇప్పుడు కూడా చొరబాటుదార్లను కాపాడుతామంటూ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారని విమర్శించారు. దేశ విభజన సమయంలో ముస్లిం లీగ్ చేసినట్టుగానే నేడు కాంగ్రెస్ సైతం సమాజాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని ఆరోపించారు.భ్రష్టాచార్ కీ జనని కాంగ్రెస్ ‘‘ఓట్ల ఏకీకరణపై బీజేపీకి విశ్వాసం లేదు. మేము నమ్మే సూత్రం సబ్కా సాత్, సబ్కా వికాస్ మాత్రమే. అభివృద్ధికి, సాంస్కృతిక వారసత్వానికి ఓటు వేయాలి. అస్సాంను మరింత అభివృద్ధి చేసే బాధ్యత మాదే. రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించబోతున్నాం. ప్రజల ఆశీస్సులతో ఈ ఎన్నికల్లో నెగ్గి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ యువరాజు(రాహుల్ గాం«దీ)కి వందోసారి కూడా ఓటమి తప్పదు. యువతకు మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేలా బీజేపీ మేనిఫెస్టో రూపొందించాం. అస్సాంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వాటిని ఉపయోగించుకోలేదు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిపెట్టలేదు. బీజేపీ అధికారంలోకి వచి్చన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇక్కడి వనరుతోనే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం. అది అవినీతికి తల్లిలాంటిది(భ్రష్టాచార్ కీ జనని). అస్సాం ఆత్మగౌరవాన్ని, భద్రతను కాపాడే విషయంలో రాజీపడింది’’ అని మోదీ ధ్వజమెత్తారు.ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం ‘‘మేము మళ్లీ అధికారంలోకి వస్తే అస్సాంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు చేస్తాం. ఆరో షెడ్యూల్ కింద గిరిజనులకు రక్షణలు కల్పిస్తాం. అస్సాం గుర్తింపు, గౌరవాన్ని కాపాడుతాం. రాష్ట్రంలో పదేళ్ల బీజేపీ పాలన సేవ, సుశాసన్కు బాటలు వేసింది. తేయాకు సాగుకు ప్రసిద్ధి పొందిన అస్సాం నేడు సెమీకండక్టర్ల తయారీ హబ్గా మారడం సంతోషంగా ఉంది’’అని మోదీ ఉద్ఘాటించారు. తేయాకు తోటలో కార్మికుడిగా మోదీ అస్సాం రాష్ట్రం దిబ్రూగఢ్ జిల్లాలో మనోహరి టీ ఎస్టేట్ను ప్రధాని మోదీ సందర్శించారు. 19 మంది మహిళా కూలీలతో కలిసి కొద్దిసేపు పనిచేశారు. స్వయంగా తోటలోకి దిగి తేయాకు తెంపి, సంప్రదాయ బుట్టలోకి సేకరించారు. తేయాకు తోటలో పనిచేయడం మర్చిపోలేని అనుభవమని మోదీ పేర్కొన్నారు. తన జీవితం ఛాయ్తో ముడిపడి ఉందన్నారు. టీ చెట్ల నుంచి తేయాకు ఎలా తెంచాలన్నది మహిళలను చూసి నేర్చుకున్నానని తెలిపారు. మహిళలతో మాట్లాడారు. వారి పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. అలాగే వంటల గురించి అడిగి తెలుసుకున్నారు. వారిలో ఒక మహిళను తన గురువుగా మోదీ అభివరి్ణంచారు. మరో మహిళ పాట పాడి వినిపించారు. తేయాకు అస్సాం అత్మ అంటూ మోదీ ఎక్స్లో పోస్టుచేశారు. ఇక్కడ సాగవుతున్న టీ ప్రపంచమంతటా సరఫరా అవుతోందని వివరించారు. టీ కార్మికుల శ్రమ, పట్టుదల అస్సాంకు గర్వకారణమని స్పష్టంచేశారు. -
‘యువరాజు’ సెంచరీ: ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
గోగాముఖ్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల సమరంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార పర్వాన్ని హోరెత్తించారు. ‘ఈ ఎన్నికలు కేవలం విజయం కోసం కాదు వికసిత భారత్ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రజా తీర్పు’ అంటూ గోగాముఖ్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పేర్కొన్నారు. అస్సాంలో ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి జయకేతనం ఎగురవేసి, ఘనమైన ‘హ్యాట్రిక్’ నమోదు చేయడం ఖాయమని మోదీ ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలుప్రసంగంలో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని ఘాటు విమర్శలు చేశారు. అస్సాం ప్రజలు ఆ పార్టీని మరోసారి తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికలతో ఎన్డీఏ హ్యాట్రిక్ విజయం సాధిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓటములలో హ్యాట్రిక్ కొట్టడమే కాకుండా, వారి ‘యువరాజు’ ఓటముల్లో సెంచరీని పూర్తి చేసుకోబోతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రకటన తర్వాత జరిగిన తన మొదటి సభకు భారీగా తరలివచ్చిన జనసందోహమే ఎన్డీఏ విజయానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. Assam has seen rapid development over the past decade. The people are ready to reaffirm their faith in the BJP-NDA. Watch from Gogamukh.https://t.co/UN20VAYJoS— Narendra Modi (@narendramodi) April 1, 2026మేనిఫెస్టోలో వరాల జల్లుఅస్సాం అభివృద్ధి కోసం బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన కీలక హామీలను మోదీ ఈ సందర్భంగా వివరించారు. 15 లక్షల కుటుంబాలకు ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ కింద పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. పేద విద్యార్థుల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించారు. లఖ్పతి దీదీ పథకం ద్వారా ఇప్పటికే మూడు లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందారని, రానున్న కాలంలో ఈ సంఖ్యను 40 లక్షలకు విస్తరిస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. ‘అరుణోదయ’ పథకాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు.ఏప్రిల్ 9న పోలింగ్అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు విడుదల కానున్నాయి. అస్సాం గణ పరిషత్ (ఏజీపీ), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్)లతో కలిసి బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. గత పదేళ్ల అభివృద్ధి మళ్లీ తమను అధికారంలోకి కూర్చోబెడుతుందని బీజేపీ భావిస్తుండగా, అధికారపక్షాన్ని గద్దె దించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. మోదీ పర్యటనతో అస్సాం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.ఇది కూడా చదవండి: Iran war : మృత్యు నీడలో భారత మత్స్యకారులు -
బీజేపీ మేనిఫెస్టో.. 3,000 పెన్షన్, ఉచిత సిలిండర్!
తిరువనంతపురం: కేరళలో అధికారమే లక్ష్యంగా యూడీఎఫ్, ఎల్డీఎఫ్లతో పాటు బీజేపీ కూడా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఓటర్లను ఆకర్షించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో తన ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించింది.కేరళలో అధికారంలోకి వస్తే నిరుపేద మహిళలు, వితంతువులు, 70 ఏళ్ల పైబడ్డ వృద్ధులకు నెలకు రూ.3,000 పెన్షన్ ఇస్తామని బీజేపీ ప్రకటించింది. పేద కుటుంబాలకు ఏటా రెండు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు అందజేస్తామని పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ మేరకు పలు వరాలు గుప్పించింది. రాష్ట్రానికి ఎయిమ్స్, ప్రార్థనా స్థలాల పరిరక్షణకు చట్టం తదితర హామీలు ఇచ్చింది. మంగళవారం తిరువనంతపురంలో జరిగిన ఎన్డీఏ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. హామీలు ఇవే..నిరుపేద కుటుంబాల్లో ఇంటి పెద్దగా ఉన్న మహిళలకు నెలకు రూ.3,000 పెన్షన్వితంతువులకు, 70 ఏళ్లు పైబడ్డ వృద్ధులకు కూడా నెలకు రూ.3,000 పెన్షన్ఓనం, క్రిస్మస్ పండుగలకు ఒక్కోటి చొప్పున నిరుపేద కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ సిలిండర్మెడికల్, కిరాణా దుకాణాల్లో నెలకు రూ.2,500 మేరకు కొనుగోళ్లకు వీలుగా ప్రతి పేద మహిళకూ భక్ష్య, ఆరోగ్య సురక్ష కార్డు. -
‘జుబీన్’ చుట్టూ ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ మృతి ప్రధానాంశంగా మారుతోంది. దీనిపై పారీ్టల పరస్పర ఆరోపణలు, దూషణలతో వాతావరణం వేడెక్కింది. ఈ అంశానికి కాంగ్రెస్ ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలోనే చోటిచి్చంది! తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోగా గార్గ్ మృతిపై నిజాలు వెలికితీసి న్యాయం చేస్తామని హామీ ఇచి్చంది. అస్సాంలో గార్గ్కు లక్షల్లో అభిమానులున్నారు. దాంతో వారి ఓట్ల కోసం పార్టీలన్నీ యథాశక్తి ప్రయత్నిస్తున్నాయి. రాజకీయ దుమారం 52 ఏళ్ల జుబీన్ గార్గ్ 2025 సెపె్టంబర్ 19న సింగపూర్లో ఒక ద్వీపం వద్ద ఈత కొడుతూ మరణించారు. అది కాస్తా రాజకీయంగా వివాదాంశంగా మారింది. గార్గ్ను కుట్రలో భాగంగా హత్య చేశారని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. అది ప్రమాద మరణమేనని సింగపూర్ కోర్టు నిర్ధారించినా, ఆయనకు బలవంతంగా మద్యం తాగించారని హిమంత వాదించారు. దీనిపై విచారణకు సిట్ కూడా ఏర్పాటు చేశారు. గార్గ్ మేనేజర్, ఈవెంట్ నిర్వాహకుడు, ఇద్దరు బ్యాండ్ సభ్యులు సహా ఏడుగురు ఇప్పటికే అరెస్టయ్యారు. ఈ ఉదంతాన్ని ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలచుకునేందుకు పారీ్టలన్నీ ప్రయత్నిస్తుండటం విశేషం. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఐదు ప్రధాన హామీలలో గార్గ్ కేసుకూ స్థానం కలి్పంచింది! గార్గ్ హత్య ఎలా జరిగింది, బాధ్యులెవరన్నది తాము అధికారంలోకి వచి్చన 100 రోజుల్లో వెలికి తీసి నిజానిజాలను ప్రజల ముందుంచుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. గార్గ్ కుటుంబానికి న్యాయం చేయలేకపోతే బీజేపీకి ఓటేయొద్దని హిమంత పలుమార్లు ప్రకటించడాన్ని పీసీసీ చీఫ్ గౌరవ్ గొగొయ్ ఎన్నికల ర్యాలీల్లో పదేపదే గుర్తు చేస్తున్నారు. విచారణలో విపరీత జాప్యం జరుగుతోందంటూ గార్గ్ భార్య గరిమ ప్రధానికి లేఖ రాయడాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. గార్గ్ మృతిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ మొదలవనుంది. స్మారకం చుట్టూ నేతల చక్కర్లు గువాహటి సమీపంలో నిర్మిస్తున్న గార్గ్ స్మారక కేంద్రం వద్ద నేతలు బారులు తీరుతున్నారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు రాష్ట్ర, జాతీయ నాయకులు నిత్యం పోటెత్తుతున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకా గాంధీ వాద్రా మొదలుకుని ఆ పారీ్టకి చెందిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దాకా ఈ జాబితాలో ఉండటం విశేషం! ఎన్నికలు సమీపిస్తుండటంతో నేతల రాక మరింత పెరిగింది. రాజకీయాలను ఆజన్మాంతం ద్వేషించిన జుబీన్ పేరు ఇప్పుడు రాజకీయంగా మారుమోగుతుండటం విచిత్రంగా ఉందంటూ ప్రజలు విస్తుపోతున్నారు! -
చర్చించకుండా పారిపోయారు: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కిందని శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ టి.హరీశ్రావు ఆగ్ర హం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా సీఎం రేవంత్రెడ్డి తొండలు, కండల భాష వాడారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిన ప్రతీసారి ప్రతిపక్షంపై ఎదురుదాడి చేస్తూ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందన్నారు. ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ సమర్థవంతంగా నిర్వహిస్తుంటే కాంగ్రెస్ తట్టుకోలేకపోతున్నదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, డాక్టర్ సంజయ్, బండారి లక్ష్మారెడ్డి, విజయుడు, పాడి కౌశిక్రెడ్డితో కలిసి అసెంబ్లీ మీడియా హాల్లో మంగళవారం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత సహాఅనేక అంశాలపై ఎలాంటి దిశా నిర్దేశం లేకుండానే ముగిశాయన్నారు. బడ్జెట్, బిల్లులను ఆమోదించుకోవాలనే రాజ్యాంగ అనివార్యత వల్లే సభను తూతూ మంత్రంగా నడిపారన్నారు. 19 అంశాలపై బీఆర్ఎస్ స్వల్పకాలిక చర్చల కోసం నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం ముందుకు రాలేదని, ప్రశ్నోత్తరాల్లో బీఆర్ఎస్ లేవనెత్తిన ప్రశ్నలు చర్చకు రాకుండా సాగదీత ధోరణిలో సభ జరిగిందన్నారు. సీఎం ఢిల్లీ పర్యటనలు, డిప్యూటీ సీఎం సన్నద్ధత పేరిట, విరామం పేరిట గంటల కొద్దీ సభ వాయిదా వేశారని, కేరళ ఎన్నికల కోసం అసెంబ్లీ సమావేశాలను 30వ తేదీన హడావుడిగా ముగించారని హరీశ్రావు మండిపడ్డారు. అవినీతి మంత్రిని కాపాడేందుకు డైవర్షన్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అవినీతిని సాక్ష్యాధారాలతో సహా సభలో బయటపెడితే డైవర్షన్ రాజకీయాలు చేశారని హరీశ్రావు మండిపడ్డారు. అవినీతి మంత్రిని కాపాడేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సస్పెండ్ చేసి బిల్లులు, పద్దులు ఆమోదించుకున్నారన్నారు. కత్తుల కోలాటం ఆడుతాం.. తలలు తీస్తాం.. సామాజిక బహిష్కరణ చేస్తాం.. అంటూ కాంగ్రెస్ సభ్యుల మాటలను సీఎం పక్కన కూర్చుని ప్రోత్సహించారన్నారు. ఎమ్మెల్యేల వ్యాఖ్యలతో పాటు రేవంత్ రెండేండ్లుగా సభలో వాడుతున్న భాషను కూడా ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చినా రూ.లక్ష కోట్లు కొట్టుకు పోయాయని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ పార్లమెంటులో కామెంట్లు చేస్తున్నారని, కేంద్ర మంత్రి వ్యాఖ్యలు అచ్చం రేవంత్ మాటల తరహాలోనే ఉండడం కాంగ్రెస్, బీజేపీ నడుమ ఉన్న ఫెవికాల్ బంధానికి నిదర్శనమన్నారు. -
కాంగ్రెస్.. రాజకీయ రాబందు
థరాడ్/గాందీనగర్: కాంగ్రెస్ పార్టీ రాజకీయ రాబందులా వ్యవహరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికి పశ్చిమాసియా పరిణామాలను వాడుకుంటోందని మండిపడ్డారు. ఆ ఉద్రిక్తతలు మనపై ప్రభావం చూపకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. మంగళవారం గుజరాత్లోని వావ్ థరాడ్ జిల్లా నానీ గ్రామంలో మోదీ పర్యటించారు.రూ.19,806 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. ఖేడ్బ్రహ్మ–హిమ్మత్నగర్–అసర్వా రైలుకు పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మోదీ ప్రసంగించారు. ‘‘కాంగ్రెస్ పుకార్లు వ్యాప్తి చేస్తోంది. ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద, గ్యాస్ ఏజెన్సీ ముందు క్యూ కట్టేలా చేస్తోంది. కాంగ్రెస్ నేతలు విచ్చింన్న రాజకీయాల్లో నిమగ్నమయ్యారు. పరిస్థితులు అదుపు తప్పితే దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి కాంగ్రెస్ కాచుకొని ఉంది’’ అని దుయ్యబట్టారు. ఇంధన భారం పడకుండా చర్యలుపలు దేశాలు యుద్ధం, అశాంతి, అస్థిరతలో కూరుకుని ఉంటే భారత్ మాత్రం సుస్థిరత, ఐక్యతను ప్రదర్శిస్తోందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. పశి్చమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధనం కొరత పెరిగిందని గుర్తుచేశారు. ఇంతటి సంక్షోభంలోనూ మన బలమైన విదేశాంగ విధానం, పౌరుల సమష్టి కృషితో ప్రతికూల పరిస్థితిని విజయవంతంగా నియంత్రిస్తున్నామని తెలిపారు. యుద్ధం వల్ల ప్రపంచమంతటా ఇంధనం ధరలు 10 నుంచి 15 శాతం పెరిగాయన్నారు. ఈ భారం మన ప్రజలపై పడకుండా చర్యల చేపటినట్లు వెల్లడించారు. శాంతి, అహింస సందేశం ప్రపంచ అస్థిరత, అశాంతి మంటల్లో చిక్కుకున్న నేటి తరుణంలో సామ్రాట్ సంప్రాతి మ్యూజియం శాంతి, అహింస సందేశాన్ని ఇస్తోందని ప్రధాని మోదీ అన్నారు. గుజరాత్ రాజధాని గాంధీ నగర్ సమీపంలో శ్రీమహావీర్ జైన్ ఆరాధన కేంద్రం ప్రాంగణంలో నిర్మించిన ఈ మ్యూజియాన్ని ఆయన ప్రారంభించారు. ఈ మ్యూజియం వారసత్వం, సందేశం మన దేశానికే కాకుండా మొత్తం మానవాళికి ఎంతో ఉపయోగకరమని చెప్పారు. విశ్వసనీయ సరఫరాదారు భారత్ గుజరాత్లోని సనంద్లో కేనెస్ సెమీకాన్ కంపెనీ ఆధ్వర్యంలోని సెమీకండక్టర్ ప్లాంట్ను మోదీ ప్రారంభించారు. సెమీకండక్టర్లలో మనదేశం విశ్వసనీయ సరఫరాదారుగా మారిందని చెప్పారు. ‘‘21వ శతాబ్దం పలు సవాళ్లు తెచి్చంది. సంఘర్షణల వల్ల ప్రపంచ సప్లై చైన్లు ప్రభావితమయ్యాయి. రాబోయే దశాబ్దాల్లో సాంకేతికత, ఇంధన భద్రతకు మా ప్రభుత్వం బలమైన పునాది వేస్తోంది’’ అని వివరించారు. -
ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు లేరు..
-
CM Revanth : కేసీఆర్ లేకపోతే నేను లేను
-
కాంగ్రెస్ అక్రమ మైనింగ్ పై హౌస్ కమిటీ వేయాలి
-
సిట్టింగ్ జడ్జితో ఓకే: హరీశ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరులు, బావమరిదితోపాటు తన సోదరుడు, బావమరిది, కుటుంబ సభ్యులపై సీబీసీఐడీ, హౌస్ కమిటీతో కాకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు ప్రకటించారు. సీఎం సోదరుల టీడీఆర్ కుంభకోణం, బావమరిది అమృత్ కుంభకోణంతోపాటు ఇతర అక్రమాలపై రేవంత్రెడ్డి కూడా విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు. తాను చేసిన సవాల్పై తోక ముడిచి పారిపోకుండా, చెంచాలతో తిట్టించకుండా సీఎం రేవంత్రెడ్డి దమ్ముంటే స్పందించాలన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, కొత్త ప్రభాకర్రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్తో కలిసి హరీశ్రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నడుమ రాష్ట్రంలో భూముల సెటిల్మెంట్తోపాటు అనేక కుంభకోణాల్లో వాటాలు ఉన్నాయని ఆరోపించారు. మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ వ్యవహారంపై అసెంబ్లీ సభా సంఘం ఏర్పాటు చేసే దమ్ము సీఎంకు లేదని విమర్శించారు. మంత్రి పొంగులేటి అక్రమాలు బయటపడటంతో అసెంబ్లీ వేదికగా తనపై బురదచల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. ‘కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టి సెటిల్మెంట్కు వచ్చిన వారికి క్లియర్ చేస్తున్నారు. సెటిల్మెంట్లకు ముందుకు రాని వారిని బెదిరిస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి భూ కుంభకోణాలను త్వరలో ఆధారాలతో సహా బయట పెడతాం. సీఎం, మంత్రి కుంభకోణాలపై విచారణ చేసేంత వరకు బీఆర్ఎస్ వదిలిపెట్టదు’అని హరీశ్రావు తేల్చిచెప్పారు. సొంత ప్రయోజనాల కోసం మంత్రి పొంగులేటి తాను ఎన్నడూ ఫోన్ చేయలేదని.. గృహలక్ష్మి పథకం బిల్లుల విడుదల కోసం ఒకట్రెండు సార్లు మంత్రితో ఫోన్లో మాట్లాడినట్లు హరీశ్రావు వెల్లడించారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి.. ‘సీబీసీఐడీ సీఎం రేవంత్రెడ్డి జేబు సంస్థ. మైనింగ్ అక్రమాలపై నిష్పాక్షిక విచారణ కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి లేదా మంత్రివర్గం నుంచి ఆయన్ను బర్తరఫ్ చేయాలి. సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి నడుమ ఫెవికాల్ బంధం ఉండటం వల్లే కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్ అప్పగించడంతోపాటు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి ఇస్తున్నారు. మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ వ్యవహారం బయటపడటంతో ఆత్మరక్షణలో పడిపోయిన రేవంత్రెడ్డి.. దృష్టి మళ్లింపు రాజకీయాలకు పాల్పడుతున్నాడు. అసెంబ్లీలో మాకు మైకు ఇవ్వకుండా హౌస్ కమిటీ వేయాలనే మా డిమాండ్పై దళితులంటూ రాజకీయం చేస్తున్నాడు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపైనా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడిని ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నాం. గతంలో సీఎం రేవంత్ వాడిన భాషను కూడా ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలి. దళితులపై కాంగ్రెస్ మాటలో ప్రేమ చూపిస్తే బడ్జెట్లో కేటాయింపులు, సంక్షేమ పథకాల ఆచరణలో మేము చూపించాం. దళితులపై రేవంత్రెడ్డి కపట ప్రేమ చూపుతూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కంపెనీ అవినీతికి పాల్పడిందని స్వయంగా రేవంత్రెడ్డే చెప్పాడు. మంత్రి తప్పు చేస్తే సీబీసీఐడీ విచారణ నిష్పాక్షికంగా జరుగుతుందా? పొంగులేటిని కాపాడే క్రమంలో ప్రభుత్వం మరో 100 అబద్ధాలు చెప్పింది. అక్రమ మైనింగ్లో రూ. వందల కోట్లు రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగింది’అని హరీశ్రావు పేర్కొన్నారు. తాము సీఎంకు అందజేసిన 20 అంశాలపై సిట్టింగ్ జడ్జిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పొంగులేటి అంశంపై భవిష్యత్తులో ఏం చేయాలో తమకు తెలుసని.. సోమవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ నుంచి తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హరీశ్రావు తెలిపారు. ముఠా నాయకుడిలా రేవంత్: వేముల ప్రశాంత్రెడ్డి మంత్రి పొంగులేటి అక్రమాలను బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావు ఆధారాలతో సహా బయటపెడితే సీఎం రేవంత్రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు తెరలేపాడని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. ‘రేవంత్ ఎదురుదాడికి దిగి మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ మా నేతలను బెదరిస్తున్నాడు. రేవంత్ సభా నాయకుడిలా కాకుండా ముఠా నాయకుడిలా కనిపిస్తున్నాడు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీ అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, అవినీతి ఆరోపణలపై హౌస్ కమిటీ డిమాండ్ నిరాకరించడం సరికాదు. రేవంత్ వ్యాఖ్యలను కూడా ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలి. ‘మిమ్మల్ని తొక్కుతా’అని మాట్లాడినందుకు సీఎంపై చర్యలు తీసుకోవాలి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మేధావి అయితే ఆయన్ను సీఎం చేయాలి. ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా బీఆర్ఎస్ భయపడదు. అవినీతిపై ప్రశి్నస్తూనే ఉంటాం’అని వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. -
సీఐడీ వద్దంటే సీబీఐ
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన మైనింగ్ లావాదేవీలపై సమగ్ర విచారణను సీబీసీఐడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చాం. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీబీసీఐడీ విచారణ సక్రమంగా జరగదనే అనుమానం వారికి (ప్రతిపక్షం) ఉంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీబీఐ విచారణ కావాలా? సీబీఐ విచారణ కావాలని వారిని అడగమనండి. అడిగితే వేస్తాం’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. మైనింగ్ అక్రమాలపై సభాసంఘం వేయాలని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలోని పోడియం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆదివారం సైతం ఆందోళనకు దిగిన నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ తీరును తూర్పారపట్టారు. సభలో బీఆర్ఎస్ పప్పులు ఉడకవని... వారి మంత్రాలకు చింతకాయలు రాలవని ధ్వజమెత్తారు. పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి చెందిన వారు గానీ, తన కుటుంబంగానీ ఏమైనా అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం ఉంటే సీబీసీఐడీకి ఆధారాలు సమర్పించాలని అన్ని పార్టీల సభ్యులకు సీఎం సూచించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన మైనింగ్ లావాదేవీల్లో అక్రమాలు చేసినట్లు ఆధారాలున్నా సీబీసీఐడీకి ఇవ్వాలని.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన మైనింగ్ లావాదేవీలపైనా విచారణ జరుపుతామని అన్నారు. కేటీఆర్, హరీశ్రావు సీబీసీఐడీకి సహకరించాలన్నారు. హరీశ్రావు కారణంగా ఇరుకునపడ్డానని కేటీఆర్ ఆగ్రహంగా ఉన్నారంటూ చురకలంటించారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... రాఘవ కన్స్ట్రక్షన్స్ నుంచి పన్నులు రాబట్టింది మేమే ‘రాఘవ కన్స్ట్రక్షన్స్ విషయంలో 2025లో వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మైనింగ్ శాఖ పన్నులు రాబట్టుకుంది. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకున్నాం. ఇంత పారదర్శకంగా మేం తీసుకున్న చర్యలను అభినందిస్తే మా అధికారులు మరింత ఉత్సాహంగా పనిచేసేవారు. మా ప్రభుత్వం ఇచ్చిన నోటీసు తీసుకొచ్చి వాళ్లేదో కనిపెట్టినట్లు మాట్లాడుతున్నారు. దానిపై సభాసంఘం వేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ల ప్రభుత్వంలో మూడు సభాసంఘాలు వేసి బ్లాక్మెయిల్ చేసి ఆస్తులు గుంజుకున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాజకీయ లబ్ధి పొందారు. వారిలా హౌస్ కమిటీ వేసి రాజకీయ లబ్ధి పొందాలని మేం చూడలేదు. హౌస్ కమిటీ వేసినా నివేదికను మళ్లీ ఏదో ఒక ప్రభుత్వ విచారణ సంస్థకు ఇవ్వాల్సిందే. అందుకే మేం నేరుగా సీబీసీఐడీ విచారణకు ఆదేశించాం’అని సీఎం రేవంత్ చెప్పారు. దళితులను అవమానించేలా బీఆర్ఎస్ తీరు ‘తెలంగాణ సాధిస్తే దళితుడిని సీఎం చేస్తానని నాడు కేసీఆర్ చెబితే ప్రజలు నమ్మి ఓట్లేశారు. కానీ దళితులకు సీఎం పదవి చేతకాదు.. దొర మాత్రమే సీఎం కావాలని దళితులను నట్టేట ముంచాడు. 2018 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక కేవలం కొప్పుల ఈశ్వర్కు మంత్రి పదవి ఇచ్చాడు. విద్యావంతుడైన భట్టి విక్రమార్కను కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నేతను చేస్తే సంవత్సరం తిరగకముందే ఎమ్మెల్యేలను లాక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. అయినా సహనం కోల్పోకుండా ఆయన పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. అలాంటి ఆయన్ను డిప్యూటీ సీఎంగా, ఆర్థిక మంత్రిగా చేస్తే దాన్ని కూడా సహించట్లేదు. దొరలు మాత్రమే పాలించే తెలంగాణలో దళితుడు బడ్జెట్ ప్రవేశపెడతాడా అని ఉప ముఖ్యమంత్రిని అవమానించేలా వ్యవహరిస్తున్నారు. దళితులపై ప్రేమ కాదు.. కనీసం మానవత్వం కూడా చూపట్లేదు’అని సీఎం రేవంత్ మండిపడ్డారు. దళితుడు పైన కూర్చుంటే కింద కూర్చోవాలా అని కేసీఆర్ సభకు రావట్లేదు ‘గతంలో దళితులు, గిరిజనులకు జరిగిన అవమానాలను గుర్తించే మేం అధికారంలోకి రాగానే పాలనలో వారికి పెద్దపీట వేశాం. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, దయాకర్రావు, కవితారావు, సంతోశ్రావు, వినోద్రావులు రాజ్యమేలారు. కానీ మా టీంలో భట్టి, దామోదర రాజనర్సింహ, వివేక్, అడ్లూరి, సీతక్క, రామచంద్ర నాయక్, వేముల వీరేశం, అద్దంకి దయాకర్ మొదలైన వారున్నారు. ఇన్నాళ్లూ చేసిన పాపాలకు అనుభవిస్తారని స్పీకర్గా దళితుడిని కూర్చోబెడితే ఒక దళితుడి ముందు మైక్ అడగడమా? దళితుడు పైన కూర్చొంటే నేను కింద కూర్చోవాలా? అని కేసీఆర్ సభకు రావట్లేదు. కేసీఆర్ అలా వ్యవహరించగా ఆ పారీ్టలోని ఇతర సభ్యులు సభను నడవనివ్వట్లేదు. స్పీకర్ ఎన్నిసార్లు సభను సజావుగా సాగనీయాలని కోరినా వినట్లేదు. సభాపతిని అవమానించారు. దళితులు మంత్రులుగా ఉండకూడదన్నట్లుగా కుట్రలు చేస్తున్నారు. కుల వివక్షను బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. దళితులను అవమానించే రాజకీయ సంస్కృతి ఇక నడవదు. వారికి గౌరవం, అవకాశాలు కలి్పంచడం మా ప్రభుత్వ బాధ్యత’అని రేవంత్రెడ్డి చెప్పారు. కేసీఆర్తో రాజీనామా చేయించండి ‘సభలో ఒకట్రెండు కోతులు సభను అపహాస్యం చేస్తున్నాయి. రెవెన్యూ శాఖలో సంస్కరణలు తెచ్చి లక్షలాది కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్న పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని రాజీనామా చేయాలంటున్నారు. వారికి సిగ్గుంటే సభకు రాని కేసీఆర్తో రాజీనామా చేయించాలి. రూ. కోటీ పది లక్షల జీతం తీసుకొని సభకు రాడట, జీతం వెనక్కు ఇవ్వడట. ఆయన రాజీనామా చేయవద్దట. గురివింద గింజ సామెతలా వ్యవహరిస్తున్నారు. సభ్యులుగా ఏ అంశమైనా వారు లేవెనెత్తొచ్చు. కానీ మేం చెప్పినట్టే ఈ ప్రభుత్వం నడవాలనే విధానం దుర్మార్గం. స్పీకర్ను నిర్దేశించే ఈ విధానం ఎక్కడిది? కడియం శ్రీహరి కేసీఆర్కు సమానంగా ప్రజాజీవితం నుంచి వచ్చిన వ్యక్తి. నిబద్ధత, నిజాయితీతో కూడిన నాయకుడు. అవినీతి మచ్చలేని సీనియర్ నాయకుడిపై కౌశిక్రెడ్డి వ్యవహరించిన తీరు సరైనదేనా అని కేటీఆర్, హరీశ్ చెప్పాలి. అసభ్యకరంగా, అసహ్యకరంగా సభలో వ్యవహరిస్తే మీరు ఒప్పుకుంటారా? మా దగ్గర కూడా కండలు తిరిగిన రాజ్ ఠాకూర్ (రామగుండం ఎమ్మెల్యే) లాంటి వాళ్లు ఉన్నారు. ఇలాగే ఉంటే అసెంబ్లీలో కత్తిపోట్లు, కుస్తీపోట్లకు పోటీలు జరగాల్సి ఉంటుంది. సభ్యులు సభను సజావుగా జరగనివ్వకపోతే సభా వ్యవహారాల మంత్రి సస్పెన్షన్కు సిఫారసు చేస్తారు. పాడి కౌశిక్రెడ్డి వ్యవహారంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి’అని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. -
‘ఎండాకాలం.. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత’
హైదరాబాద్: తెలంగాణ శాసన సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎండాకాలంలో నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. సన్నబియ్యం కార్యక్రమం మొదలుపెట్టి ఏడాది అవుతోందని చెప్పారు. 86 శాతం ప్రజలకు (3 కోట్ల 36 లక్షల మందికి) సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోటి 60 లక్షల జనాభాకు రేషన్ కార్డులు ఇస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో డొమెస్టిక్ సిలిండర్ల కొరత లేదని, కమర్షల్ సిలిండర్ల కొరత ఉందని తెలిపారు. కొన్ని రోజుల్లో కమర్షియల్ సిలిండర్ల కొరత కూడా తగ్గుతుందని చెప్పారు.మరోవైపు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ స్పందించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా బేసిన్ పై ఫోకస్ పెట్టింది. దిండి ప్రాజెక్ట్ వచ్చే రెండేళ్లలో పూర్తి చేయబోతున్నామని హామీ ఇస్తున్నా. గత ప్రభుత్వం చేసిన లోన్స్ వల్ల ఇప్పుడు సమస్య ఏర్పడింది. 97 వేల కోట్ల రూపాయలను గత ప్రభుత్వం ఇరిగేషన్ పై ఖర్చు చేసింది. కాళేశ్వరం - పాలమూరు ప్రాజెక్ట్ పై మాత్రమే ఖర్చు చేశారు. పాలమూరు ప్రాజెక్ట్ పై ఒక్క ఎకరా కొత్త ఆయకట్టు రాలేదు. పెండింగ్ ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలందరికి న్యాయం చేసేలా ముందుకు వెళ్తున్నాం. ఇరిగేషన్ శాఖలో ఎవ్వరికీ అన్యాయం జరగదు. ఎమ్మెల్యేలు ఎవ్వరూ ఆందోళన చెందవద్దు. ప్రాజెక్ట్ ల భూ సేకరణ కోసం 5వేల కోట్ల రూపాయల బడ్జెట్ లో పెట్టాం’ అని అన్నారు. -
‘ కాంగ్రెస్-బీఆర్ఎస్ ఒక్కటే’
హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని పునరుద్ఘాటించారు కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్. ముఖ్యమంత్రి రేవంత్కు కేటీఆర్ అంటే ప్రేమని, అందుకే ఈ కార్ రేస్, విద్యుత్ కొనుగోలు, ఫామ్ హౌస్, ఫోన్ ట్యాపింగ్ కేసులపై విచారణ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాట్లాడిన బండి సంజయ్.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాళేశ్వరంపై విచారణ ఒక్కటే కనబడుతోందని విమర్శించారు. హరీష్ రావు మీద ఉన్న కసి కేటీఆర్ మీద ఎందుకు తగ్గిందన్నారు బండి సంజయ్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసే ప్రయత్నాలు ఇద్దరి మధ్య జరుగుతున్నాయని, కేటీఆర్ను కవితను కలిపే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్కు, రేవంత్కు మధ్య రహస్య ఒప్పందాలు జరిగాయని బండి సంజయ్ ఆరోపించారు. -
అనుమతుల్లేకుండా ‘రాఘవ’ మైనింగ్: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అనుమతుల్లేకుండానే హైదరాబాద్లో మైనింగ్ చేస్తోందని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావు ఆరోపించారు. ఈ అంశంపై ప్రతిపక్ష సభ్యుడి ఆధ్వర్యంలో సభా సంఘం ఏర్పాటు చేయాలని లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పొంగులేటి మంత్రి పదవికి రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలని పట్టుబట్టారు. హరీశ్కు మద్దతుగా బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ వెల్లోకి దూసుకెళ్లి అక్కడే బైఠాయించి నినాదాలతో సభను హోరెత్తించారు. తప్పు చేయ కపోతే పొంగులేటికి భయం ఎందుకన్నారు. దాడుల్లో దొరికినా ప్రభుత్వ చర్యలేవీ? బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా శనివారం శాసనసభలో గనుల శాఖపై చర్చలో సాగర్ ఎమ్మెల్యే జయవీర్రెడ్డి మాట్లాడిన తర్వాత హరీశ్రావు మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఎంతో ఖనిజ సంపద ఉంది, దాన్ని రక్షించే రక్షకులే భక్షకులయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతుల్లేకుండా దర్జాగా దందా చేస్తున్నారు. జీవో 111కు విరుద్ధంగా కొత్వాల్గూడలో రాఘవ కన్స్ట్రక్షన్స్ బరితెగించి మైనింగ్ చేస్తోంది. అక్కడ ఎలాంటి కాలుష్య పరిశ్రమలు పెట్టొద్దు. కానీ రాఘవ కన్స్ట్రక్షన్స్ భారీ స్టోన్ క్రషర్ను డీజిల్ జనరేటర్లపై నడుపుతోంది. జీవో 26 ప్రకారం స్టోన్ క్రషర్ పెట్టాలంటే మినరల్ డీలర్ లైసెన్స్ ఉండాలి. పరిశ్రమల శాఖ అనుమతి తీసుకోవాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి సీఎఫ్ఈ, సీఎఫ్ఓ సరి్టఫికెట్లు తీసుకోవాలి. కానీ ఆ సంస్థ విద్యుత్ కనెక్షన్ తీసుకోకుండా దొంగచాటుగా డీజిల్ జనరేటర్లతో క్రషింగ్ చేస్తోంది. 2025 మే 21న మైనింగ్ డైరెక్టర్ జనరల్ స్వయంగా ఈ క్రషర్ తనిఖీకి ఆదేశించారు. రెవెన్యూ, పీసీబీ, ఎస్పీడీసీఎల్, మైనింగ్ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి 5,130 మెట్రిక్ టన్నుల అక్రమ రఫ్ స్టోన్ నిల్వలను పట్టుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న డిమాండ్ నోటీసు జారీ చేసి రూ. 24 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. మార్చి 4న మళ్లీ తనిఖీ చేస్తే 11,200 మెట్రిక్ టన్నుల ముడి సరుకు దొరికింది. మార్చి 13న మరో షోకాజ్ నోటీసు జారీ చేశారు. డీజిల్ జనరేటర్లతో కాలుష్యంపై స్వయంగా మైనింగ్ అధికారులే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు లేఖ రాశారు. మైనింగ్ చట్టం ప్రకారం ఎండీఎల్, లైసెన్స్ లేకుండా క్వారీ నిర్వహిస్తే మొదటిసారి రూ. 10 వేలు, రెండోసారి పట్టుబడితే రూ. 25 వేల జరిమానా, ఏడాది కఠిన కారాగార శిక్ష విధించాలి. కానీ రాఘవ కన్స్ట్రక్షన్స్ రెండుసార్లు పట్టుబడ్డా ఎందుకు ప్రభుత్వం మౌనంగా ఉంది? ఆ కంపెనీపై ఎందుకింత ప్రేమ?’అని హరీశ్రావు నిలదీశారు. ప్రతిపక్షానికో న్యాయం.. మంత్రులకో న్యాయమా? ‘మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి చెందిన సంస్థ కావడంతోనే ప్రభుత్వం చర్యలకు వెనకడుగు వేసింది. ప్రతిపక్షానికో న్యాయం.. మంత్రులకో న్యాయం చేస్తోంది. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి తమ్ముడి స్టోన్ క్రషర్లో చిన్న తప్పు జరిగిందని రాత్రికి రాత్రి అరెస్టు చేసి నెల రోజులు జైల్లో పెట్టారు. మరి రాఘవ కన్స్ట్రక్షన్స్పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి’అని హరీశ్రావు డిమాండ్ చేశారు. పొంగులేటి పేరు ప్రస్తావనపై మంత్రుల అభ్యంతరం.. హరీశ్రావు చేసిన ఆరోపణలపై సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. సంబంధం లేని విషయంలో మంత్రి పొంగులేటి పేరు ప్రస్తావించారంటూ మంత్రులు శ్రీధర్బాబు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్తోపాటు విప్ ఆది శ్రీనివాస్, ఇతర కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. హరీశ్రావు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని సభలో మాట్లాడటం నిబంధనలకు విరుద్ధమని, హరీశ్రావు అభూత కల్పనలతో సభను తప్పుదోవ పట్టించడం సరికాదని మంత్రి శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు. వెంటనే హరీశ్రావు క్షమాపణ చెప్పి ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచించారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గంలోని నేరెళ్ల గ్రామంలో దళితులపై అరాచకాలు జరిగినప్పుడు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు. లారీలను నిలిపివేయాలని అడిగిన ప్రజలను కొట్టి హింసించిన ఘటనలు మర్చిపోయారా?.. అప్పుడు సభాసంఘం ఎందుకు వేయలేదు? అని ప్రశ్నించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ కోత్వాల్గూడ మైనింగ్కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా ఉంటే తప్పకుండా విచారణ చేపడతామని... తప్పు ఎవరు చేసినా ఉపేక్షించబోమని మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. మంత్రి వాకిటి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో మహబూబ్నగర్లో ఇసుక మాఫియా లారీల కింద పడి పిల్లలు చనిపోతే కనీసం అటువైపు చూడని నేతలు ఇప్పుడు సభాసంఘం ఏర్పాటు చేయాలని మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యుల వాదప్రతివాదనలతో సభ దద్దరిల్లింది. దీంతో స్పీకర్ జోక్యం చేసుకొని హరీశ్రావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం బడ్జెట్ పద్దులపై చర్చను కొనసాగించారు. -
భర్తీ చేస్తున్నా.. ఖాళీలే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెరిగిన వైద్య అవసరాలకు అనుగుణంగా డాక్టర్లు, ప్రొఫెసర్లతో పాటు ఇతర సిబ్బంది లేకపోవడంతో ఆ ప్రభావం ప్రజారోగ్యం, వైద్యవిద్యపై పడుతోంది. రాష్ట్రంలో పెరిగిన ప్రభుత్వ వైద్య కళాశాలలు వాటికి అనుబంధంగా ఏర్పాటైన ఆస్పత్రులకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైద్యులు, ప్రొఫెసర్లు, నర్సులు పారామెడికల్ సిబ్బంది నియామకం జరుపుతూ వస్తోంది. రాష్ట్రంలోని వైద్య అవసరాలకు ప్రభుత్వ పరిధిలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్, ప్రాథమిక ఆరోగ్యం (డీహెచ్), టీవీవీపీ, డీఎంఈల ద్వారా జిల్లా ఆస్పత్రులు, టీచింగ్ ఆస్పత్రులు, మాతా శిశు కేంద్రాలు, పీహెచ్సీలు, సీహెచ్సీ తదితర కేంద్రాల నిర్వహణ ఉంటుంది. ఈ నాలుగు శాఖల పరిధిలోని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలలో 51,455 వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది ఉండాలి. కానీ ఇప్పటికీ 13,929 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం శాసనమండలి వేదికగా వెల్లడించింది. వాటిలో 7,170 పోస్టుల నియామక ప్రక్రియ పురోగతిలో ఉండగా, మరో 6,759 పోస్టులు ఖాళీగా ఉంటాయని తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం ఆమోదిత పోస్టుల్లో దాదాపు మూడో వంతు ఖాళీగా ఉండటం వల్ల ఆస్పత్రుల సేవలు, వైద్యవిద్య రెండూ తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ... రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యులు, నర్సులు, ప్రొఫెసర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే పలుమార్లు నోటిఫికేషన్లు జారీ చేసింది. తద్వారా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నియంత్రణలోని పీహెచ్సీలు, బస్తీ దవాఖానాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, మాతా శిశు కేంద్రాలలోని మొత్తం 2,651 ఖాళీలలో 145 మంది వైద్యులు, 351 మంది నర్సుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల చేసింది. త్వరలోనే ఈ ఖాళీలు నిండుతాయి. అయితే పారా మెడికల్ సిబ్బంది పోస్టుల్లో 2,651 ఖాళీలు ఉంటే వాటిలో 2,016 వరకు మాత్రమే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు ఇచ్చారు. మరో 635 ఖాళీలు ఉండగా, వాటి నియామకాలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కింద 7,769 పోస్టులకు గాను 1,367 ఖాళీలు ఉండగా, వాటిలో 31 మంది నర్సులు, 160 మంది పారా మెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియ సాగుతోంది. ఇంకా 315 మంది వైద్యులు, 304 మంది నర్సులు, 557 మంది పారా మెడికల్ సిబ్బంది భర్తీ కావలసి ఉంది. ఇక తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా ఆస్పత్రులలో 9,554 మంది వైద్య సిబ్బంది ఉండాల్సి ఉంటే... 3,706 ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఇటీవలే 1,658 మంది వైద్యుల భర్తీకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి కావచ్చింది. మరో 721 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 682 నర్సుల నియామక ప్రక్రియ సాగుతుండగా, 347 పోస్టులు భర్తీ కావలసి ఉంది. అలాగే పారామెడికల్ సిబ్బంది 298 ఖాళీలకు గాను 185 పోస్టులను భర్తీ చేస్తున్నారు. డీఎంఈ పరిధిలోని టీచింగ్ హాస్పిటల్స్లో ఏకంగా 20,585 పోస్టులకు గాను 6,205 ఖాళీలు ఉన్నాయి. అంటే సుమారు 40శాతం పోస్టులు ఖాళీగా ఉండడం వైద్య విద్య నాణ్యతపై నేరుగా ప్రభావం చూపుతోంది. అయితే డీఎంఈ పరిధిలో 607 మంది వైద్యులు, 1,545 మంది నర్సులు, 286 మంది పారా మెడికల్ సిబ్బందితో కూడిన 2,438 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్చలు చేపట్టగా, ఇంకా 3,767 పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. అందులో అత్యధికంగా 2,179 వైద్య విద్య బోధించే వివిధ స్థాయిల ప్రొఫెసర్ పోస్టులు ఉండడం గమనార్హం. వైద్యుల పోస్టుల్లోనే భారీగా ఖాళీలు ఈ నాలుగు శాఖల్లో కలిపి 14,633 ఆమోదిత డాక్టర్/ ప్రొఫెసర్ పోస్టుల్లో ప్రస్తుతం 9,008 మాత్రమే భర్తీ కాగా, 5,625 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న నియామకాలు పూర్తైనా ఇంకా 3,200 పైగా పోస్టులు ఖాళీగా మిగిలే అవకాశం ఉంది. ముఖ్యంగా టీచింగ్ హాస్పిటల్స్లో రెండు పోస్టుల్లో ఒకటి ఖాళీగా ఉండడం తృతీయ స్థాయి వైద్యం, వైద్యుల శిక్షణపై ప్రభావం చూపుతోందని హెల్త్కేర్ రిఫారŠమ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. టీవీవీపీ పరిధిలోని జిల్లా ఆస్పత్రుల్లో అనేక చోట్ల సగానికన్నా తక్కువ సిబ్బందితోనే నడుస్తున్నాయి. దీని వల్ల గ్రామీణ, అర్ధపట్టణ ప్రాంతాల్లో రోగులకు సమయానికి చికిత్స అందడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డాక్టర్లు తయారవుతున్నా.... ఇంకో వైపు రాష్ట్రంలో పెరిగిన వైద్య కళాశాలల ద్వారా ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో వైద్యులు వైద్యం కోసం సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కలిపి ఏటా సుమారు 9,000 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఇంటర్న్షిప్ పూర్తి చేస్తున్నారు. 2,500 నుంచి 3,000 మంది పీజీ వైద్యులు సిద్ధమవుతున్నారు. అయితే నియామకాల్లో ఆలస్యం, అసంఘటిత విధానం కారణంగా వీరిలో చాలా మంది నిరుద్యోగులుగానే ఉండిపోతున్నారు లేదా కాంట్రాక్ట్ ఉద్యోగాలకే పరిమితమవుతున్నారు. ఇది ఒక వైపు ఖాళీలు పెరగడం, మరోవైపు యువ వైద్యులకు అవకాశాలు లేకపోవడం అనే విరుద్ధ పరిస్థితిని సృష్టిస్తోంది. -
తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు ఇలా..
చెన్నై: వచ్చే నెలలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అధికార డీఎంకే పార్టీ- కాంగ్రెస్ల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. ఈ మేరకు డీఎంకేతో జట్టు కట్టిన కాంగ్రెస్తో పాటు పలు ప్రాంతీయ పార్టీల సీట్ల సర్దుబాటును ఈరోజు(శనివారం, మార్చి 28వ తేదీ) ప్రకటించారు. తమిళనాడు మొత్తం 234 అసెంబ్లీ సీట్లకు గాను డీఎంకే 164, కాంగ్రెస్ 28, డీఎండీకే 10 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక వీసీకే 8 స్థానాల్లో, సీపీఐ 5, సీపీఎం 5, ఎండీఎంకే 4 స్థానాలను కేటాయించారు. ఇక డీఎంకే పోటీ చేసే పలు స్థానాల అభ్యర్థులను కూడా ప్రకటించింది. కొలతూర్ నుంచి సీఎం స్టాలిన్ బరిలోకి దిగుతుండగా, చెపాక్ నుంచి ఉదయనిధి పోటీ చేయనున్నారు. బోడినాయక్కనూర్ నుంచి పన్నీరు సెల్వం పోటీ దిగుతుండగా, కోయంబత్తూర్ సౌత్ నుంచి బరిలోకి సెంథిల్ బాలాజీ బరిలో ఉండనున్నట్లు డీఎంకే వెల్లడించింది. -
ఇల్లీగల్ దందా.. హైదరాబాద్ నడిబొడ్డున ఉల్లంఘన..
-
కేరళ పోరు: రంగంలోకి మోదీ, సోనియా.. ‘యోగి’ ఎక్కడ?
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం అంతకంతకూ రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమైన ‘స్టార్ క్యాంపెయినర్ల’ జాబితాను ఆయా పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాయి.బీజేపీ వ్యూహం: మోదీ సుడిగాలి పర్యటనలుకేరళపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ.. ప్రధాని నరేంద్ర మోదీని ప్రధాన ప్రచారకర్తగా రంగంలోకి దించుతోంది. ప్రధాని ఇప్పటికే రెండుసార్లు కేరళలో పర్యటించగా, ఈ ఆదివారం మరోసారి ప్రచారానికి రానున్నారు. బీజేపీ విడుదల చేసిన 40 మంది సభ్యుల జాబితాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ తదితర హేమాహేమీలు ఉన్నారు. అయితే, అనూహ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు ఈ జాబితాలో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.కాంగ్రెస్ ఆశలన్నీ గాంధీ కుటుంబంపైనే..కాంగ్రెస్ పార్టీ కూడా భారీ తారాగణంతో ప్రచార బరిలోకి దిగుతోంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కేరళలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఇప్పటికే రాహుల్, ప్రియాంకలు ఎన్నికల తేదీల ప్రకటనకు ముందే అక్కడ ప్రచారాన్ని ప్రారంభించారు. వీరితో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్, సచిన్ పైలట్ తదితర కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్లను స్టార్ క్యాంపెయినర్లుగా కాంగ్రెస్ ఎంపిక చేయడం విశేషం.రేసులో ఇతర పార్టీలుఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించనున్నారు. అలాగే లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ , బహుజన్ సమాజ్ పార్టీలు కూడా తమ అగ్రనేతల పేర్లను ఎన్నికల సంఘానికి అందజేశాయి. మొత్తానికి జాతీయ స్థాయి నేతల రాకతో కేరళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మరి ఈ స్టార్ క్యాంపెయినర్ల హవా ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపనున్నదో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: అభ్యర్థుల లిస్టుతో ‘విజయ్’ పొలిటికల్ సునామీ! -
తెలంగాణకు మాత్రమే రేవంత్ సీఎం.. ఉత్తరాదికి కాదు: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు మాత్రమే రేవంత్ రెడ్డి సీఎం.. ఉత్తరాది రాష్ట్రాలకు కాదు అంటూ చురకలు అంటించారు.కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా కరీంనగర్లో మాట్లాడుతూ..‘ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్ని పార్టీలు అయినా పెట్టుకోవచ్చు. కాళేశ్వరం డిజైన్ చేసింది కేసీఆర్ ప్రభుత్వమే. కాళేశ్వరం కూలిపోవడానికి అప్పుడున్న బీఆర్ఎస్ బాధ్యత వహించాలి. కేసీఆర్తో సీఎం రేవంత్ కుమ్మక్కు అయ్యారు. రేవంత్, కేసీఆర్ కలిసే రాజకీయం చేస్తారు. ముఖ్యమంత్రి తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణకి ముఖ్యమంత్రి.. ఉత్తరాది రాష్ట్రాలకు కాదు.మొదట ఆరు గ్యారంటీలు అమలు చేయాలి. కేంద్రం ఏం ఇస్తున్నాదో.. ఏం చేస్తుందో తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. తెలంగాణ రాష్ట్ర ఖజానా పరిస్థితి బాగాలేదు. రైతులకి ఇబ్బందులు కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. -
YS కుటుంబాన్ని కొట్టేందుకు.. నాపై 5 CBI కేసులు పెట్టిన కాంగ్రెస్
-
వైఎస్ కుటుంబాన్ని కొట్టేందుకు... నాపై ఐదు సీబీఐ కేసులు పెట్టారు..
సాక్షి, హైదరాబాద్: ‘నేను కాంగ్రెస్లో ఉన్నన్ని రోజులు పార్టీకి సేవ చేసిన. పార్టీ నాకు మంత్రి పదవి ఇచ్చింది. సోనియా గాందీకి, ఆ రోజు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్కి .. మొన్న మంత్రిపదవి ఇచ్చిన కేసీఆర్కు థ్యాంక్స్. పార్టీ మంచి చేసిందని చెప్పుకున్నప్పుడు పార్టీ చేసిన నష్టం కూడా చెప్పుకుంటాం. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కొట్టడానికి నాపై ఐదు సీబీఐ కేసులు పెట్టలేదా? అసెంబ్లీలో సీఎం రేవంత్ నాపై మాట్లాడే వరకు నేను కాంగ్రెస్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఆవేదనతోనే మాట్లాడుతున్న. నిజాయితీగా ఉన్నందుకే కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్నం’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సభ్యులు పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ పద్దులపై శాసనసభలో గురువారం రాత్రి జరిగిన చర్చలో మంత్రి సీతక్క చేసిన విమర్శలకు స్పందిస్తూ సబిత పైవిధంగా స్పందించారు. ‘ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు మంత్రి సీతక్క మొన్న నా మీద పడ్డారు. ఇప్పుడు సునీతా రెడ్డిపై పడ్డారు. నేను తనకు పోటీ కాదు. తను కాంగ్రెస్లో.. నేను బీఆర్ఎస్లో ఉన్నాం. మొన్న హరీశ్రావు మాట్లాడుతున్నప్పుడు.. నేను అయ్యో అన్నందుకే నన్ను దొరసాని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని, సబితమ్మను తిడితే సీఎం సంతోషపడతారేమో’అని సబిత ఘాటుగా విమర్శించారు. బీఆర్ఎస్ వారికి ఇష్టం లేదు: సీతక్క అంతకు ముందు మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పల్లెల్లో నీటి సరఫరా జరగడం లేదని అసత్య ఆరోపణలు చేశారంటూ సబితను తప్పుబట్టారు. ‘నాలాంటి వాళ్లు పంచాయతీరాజ్ శాఖను నిర్వహించడం వారికి ఎట్లానూ ఇష్టం లేదు. ఆదివాసీల నుంచి మంత్రి కావడం బీఆర్ఎస్ వారికి ఏమాత్రం ఇష్టం లేదు..’అని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ కేసులు పెట్టిన తర్వాత కూడా సబిత కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అయ్యారని, ఆ తర్వాత ఆమెను ఓడించడానికి ప్రయత్నించిన వారి పార్టీలో చేరారని విమర్శించారు. సబిత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయాలను బీఆర్ఎస్ వారు విమర్శిస్తున్నప్పుడు ఆమె.. అవును.. అవును అని మద్దతు తెలపడంతోనే ఆవేశం వచ్చి ఆ రోజు ..‘అయ్యో దొరసాని’అన్నానని సీతక్క వివరణ ఇచ్చారు. సబితకు తనపై ద్వేషం ఉండొచ్చని, ఆమె బీఆర్ఎస్లోకి పోవడంతో తనకు మంత్రి పదవి వచి్చందని ఆమె భావిస్తుండవచ్చని సీతక్క పేర్కొన్నారు. ‘ఆమె కేటగిరీ వేరు, నా కేటగిరీ వేరు, ఆమె రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. వాళ్లది హైదరాబాద్ సిటీ. వాళ్లు ఉన్నత వర్గాలు. మేము అడవి బిడ్డలం. మాకు ఎక్కడ కూడా వాళ్లతో పోలిక లేదు’అని సబితను ఉద్దేశించి సీతక్క వ్యాఖ్యానించగా, కులం ప్రస్తావన ఎందుకు? అని బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. సబిత స్పందిస్తూ తాము వ్యవస్థలో లోపాలు ఎత్తిచూపుతామని, కులం, మతం చూడమని స్పష్టం చేశారు. -
ఆరోగ్యశ్రీలో కొత్తగా కాంగ్రెస్ చేసిందేమీ లేదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా చేసిందేమీ లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. ఈ పథకంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగం సభను తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు. గురువారం శాసనసభ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 జూన్ 2వ తేదీన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చే నాటికి ఆరోగ్యశ్రీ పథకానికి నెలకు రూ.32 కోట్లు ఖర్చు అవుతుండగా, 2023 నాటికి రూ.68 కోట్లకు చేరిందని చెప్పారు.ప్రస్తుతం నెలకు రూ.89 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్తోందని, దీన్నిబట్టి చూస్తే ఆరోగ్యశ్రీపై చేస్తున్న ఖర్చులో సహజ పెరుగుదల మాత్రమే ఉందని, కొత్తగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆసుపత్రులకు బకాయిలు పెరిగాయన్నారు. ఆస్పత్రుల నిర్మాణం, సీఎంఆర్ఎఫ్ విషయంలో వాస్తవాలు వివరించేందుకు తమకు సభలో అనుమతి ఇవ్వడం లేదని హరీశ్రావు అన్నారు. వాయిదా తీర్మానాలు తిరస్కరణ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన పలు వాయిదా తీర్మానాలను స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తిరస్కరించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రతి వార్షిక బడ్జెట్లోలో రూ.20 వేల కోట్లు ఖర్చు పెడతామంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీపై చర్చించాలని కోరుతూ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్యాదవ్ వాయిదా తీర్మానం ఇచ్చారు. రాష్ట్రంలో యువత డ్రగ్స్ బారిన పడటంపై చర్చించాలంటూ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్రావు వాయిదా తీర్మానం ఇచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ స్కీమ్, జవహర్లాల్ హౌసింగ్ సొసైటీ తదితర అంశాలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వా యిదా తీర్మానం ఇచ్చారు. వీటన్నిటినీ స్పీకర్ తిరస్కరించారు. ఈ మేరకు సభలో ప్రకటన చేశారు. -
జగన్ ను వదులుకోవడం కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు.. జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్
-
విధి లేకే వీడుతున్నా: జీవన్రెడ్డి
జగిత్యాల: కాంగ్రెస్లో నాలుగు దశాబ్దాలపాటు ఉన్న మాజీమంత్రి జీవన్రెడ్డి ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. బుధవారం జగిత్యాల జిల్లాకేంద్రంలోని బండారి గార్డెన్స్లో అభిమానులు, నాయకులు, కార్యకర్తల మధ్య రాజీనామా చేశారు. ఆ లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ తనదనే ధోరణిలో రేవంత్ మాట్లాడుతున్నారని, అడ్డొస్తే తొక్కుతా అంటున్నారని, ఎంతమందిని తొక్కుతారని ప్రశ్నించారు. ఏదో ఒకరోజు అందుకు ముగింపు తప్పదన్నారు. ఆ ముగింపు జగిత్యాల నుంచే ప్రారంభమవుతుందన్నారు. తాను ఎదగకుండా అణగదొక్కాలన్నదే రేవంత్రెడ్డి ఆలోచన అని, అయినప్పటికీ ఎదిరించి పోరాటం చేయడం తనకేం కొత్త కాదని తెలిపారు. కేసీఆర్, చంద్రబాబు వంటి వారితోనే పోరాటం చేశానని, ఇక నుంచి రేవంత్పైనే తన పోరాటమని వ్యాఖ్యానించారు. రేవంత్కు ఎదిరించే వారు వద్దని, రాహుల్గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచే వారిని అణగదొక్కుతున్నారని జీవన్రెడ్డి చెప్పారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... విధిలేకనే వీడుతున్నా... నేను 1984లో కాంగ్రెస్లో చేరిన. పార్టీతో నాకు 40 ఏళ్ల అనుబంధం ఉంది. అలాంటి అనుబంధాన్ని వదులుకోవాలని ఎవరూ కోరుకోరు. జరిగిన అవమానాలతో విధిలేని పరిస్థితుల్లో పార్టీని వీడుతున్నా. స్థానిక సంస్థల్లో ఒక సమయంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోతే ఒంటరిగా గెలిపించా. కాంగ్రెస్ కార్యకర్తలపై దౌర్జన్యం చేసిన వారికే మళ్లీ పార్టీలో స్థానం కల్పించారు. విధిలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని, మీ హక్కులకు భంగం కలగనివ్వబోమని కేసీ వేణుగోపాల్, మంత్రులు శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్ హామీ ఇచ్చారు. అయినప్పటికీ మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంలో జాప్యం చేశారు. దశాబ్దాలుగా అండగా నిలిచిన ఓ నాయకుడిని అతిదారుణంగా చంపితే సీఎం కనీసం మందలించలేదు. బీఆర్ఎస్ పాలనలో అరాచకం చేసిన పోలీసు యంత్రాంగాన్నే మళ్లీ తీసుకొచ్చారు. వేం నరేందర్రెడ్డి ఎవరు? అసలు వేం నరేందర్రెడ్డి ఎవరు..? ఆయన పార్టీకి ఏం చేశారు..? చిన్నారెడ్డి వంటి సీనియర్ నాయకులకు జరిగిన అన్యాయానికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన దిశగా తీసుకొచ్చారు. సీనియర్లను గౌరవించడం లేదు. అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారు. వేం నరేందర్రెడ్డి ప్రభుత్వానికి ఏం సలహాలు ఇచ్చారో చెప్పాలి. ఇంకెంత కాలం అవమానాలు, మానసిక క్షోభ అనే ఉద్దేశంతోనే పార్టీని వీడుతున్నా. విధిలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నా. నేను ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్లో చేరలేదు. పార్టీ కోసం కష్టపడ్డా. అదే రేవంత్ నాయకులను తొక్కుకుంటూ.. పథకం వేసుకుని పార్టీలో చేరి ముఖ్యమంత్రి అయ్యిండు. రేవంత్ నిర్ణయాలతో సొంత జిల్లా అయిన మహబూబ్నగర్ నియోజకవర్గంలో పార్టీ ఓడిపోయింది. ప్రభుత్వాన్ని నడిపేందుకు తగినంత సంఖ్యా బలం ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం మంచిది కాదని మొదటి నుంచి చెబుతున్నా. ఈ విషయమై గతంలోనే పార్టీ అధిష్టానానికీ లేఖ రాశా. రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపుల ప్రభావం జాతీయస్థాయిలో కాంగ్రెస్పై ప్రభావం చూపుతుంది. పార్టీ కార్యకర్తలకు ఇష్టం లేకపోయినా ఎమ్మెల్యే సంజయ్ను కాంగ్రెస్లో చేర్చుకున్నారు. రేవంత్పై పోరాటం రాబోయే రోజుల్లో రేవంత్రెడ్డితో పోరాటం చేయబోతున్నా. ఇది నా ఆఖరి పోరాటం కానుంది. బీఆర్ఎస్ను ఎదిరించి కాంగ్రెస్ను అధికారంలోకి తేవడానికి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి, సీఎల్పీ నాయకుడిగా భట్టి విక్రమార్క ఎంత పోరాటం చేశారో.. మండలి నాయకుడిగా నేనూ అంతే పోరాటం చేశా. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి, భట్టి ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు మంత్రి అయ్యే అర్హత లేదా? సీనియర్లయిన చిన్నారెడ్డి, మధుయాష్కీ, హన్మంతరావును కాదని వేం నరేందర్రెడ్డిని రాజ్యసభకు పంపడమేంటి? బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతూ పార్టీ జెండా మోసినోళ్లకు పదవులు కట్టబెట్టడాన్ని సహించలేక పార్టీని వీడుతున్నా. నాలుగు దశాబ్దాలుగా అండగా నిలిచిన కార్యకర్తలను నాకు తోడుగా నిలవాలని కోరుతున్నా. జగిత్యాలను జాతీయస్థాయిలో అభివృద్ధి చెందేలా కృషి చేస్తా. -
‘అనర్హత’పై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: అనర్హత పిటిషన్లపై శాసనసభ స్పీకర్ ఇచ్చిన తీర్పులను సవాల్ చేస్తూ పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై వివరణ ఇవ్వాల్సిందిగా స్పీకర్ కమ్ ట్రిబ్యునల్ను, పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసింది. సదరు ఎమ్మెల్యేలకు పిటిషనర్లు వ్యక్తిగతంగా స్పీడ్ పోస్టు ద్వారా నోటీసులు అందించేందుకు అనుమతించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. దానం నాగేందర్ విషయంలో స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్కు తాజా పిటిషన్లు జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కాలే యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్రెడ్డి, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, టి.ప్రకాశ్గౌడ్, ఎ.గాంధీ, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్కుమార్లు కాంగ్రెస్లో చేరారని వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్కు బీఆర్ఎస్ పిటిషన్లు సమర్పించిన విషయం తెలిసిందే. కాగా ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో విచారణ చేపట్టిన స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్.. వీరంతా పార్టీ మారలేదంటూ తీర్పునిచ్చారు. దీనిపై రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. ప్రకాశ్గౌడ్, వెంకట్రావు, గాం«దీ, దానం నాగేందర్, కృష్ణమోహన్రెడ్డి, కాలే యాదయ్య, శ్రీనివాస్రెడ్డికి సంబంధించి దాఖలైన ఏడు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. స్పీకర్ ఆధారాలు పరిగణనలోకి తీసుకోలేదు.. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్రావు వాదనలు వినిపించారు. ‘2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై పోటీ చేసి విజయం సాధించిన సదరు ఎమ్మెల్యేలు తర్వాత కాంగ్రెస్లో చేరడం, ఆ పార్టీ కండువాలు కప్పుకోవడం ప్రింట్, ఎల్రక్టానిక్ మీడియాల్లో కూడా ప్రసారమైంది. దానం నాగేందర్ ఏకంగా 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వీటన్నిటిపై బీఆర్ఎస్ అనేక ఆధారాలు చూపినప్పటికీ స్పీకర్ పరిగణనలోకి తీసుకోలేదు. అవేవీ పరిశీలించకుండానే పిటిషన్లను కొట్టివేశారు. స్పీకర్ తీర్పు రాజ్యాంగ వ్యతిరేకం. పిటిషన్లపై సత్వరమే విచారణ చేపట్టాలి..’అని కోరారు. దీంతో సీజే ధర్మాసనం ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. -
ఎవరో ఎందుకు? నువ్వే పోటీ చెయ్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేటలో పోటీ చేసి గెలిచే వారికి మంత్రి పదవి ఇస్తానంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స్పందించారు. ‘ఎవరో ఎందుకు.. నువ్వే పోటీచెయ్.. సిద్దిపేటలో నా మీద పోటీ చేయాల్సిందిగా రేవంత్రెడ్డిని ఆహ్వానిస్తున్నా’అని వ్యాఖ్యానించారు. రేవంత్ తలకిందులుగా తపస్సు చేసినా తిరిగి సీఎం కాలేడన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, కేసీఆర్ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. రేవంత్ పనితనం చూసి ఓటు వేసేందుకు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సిద్ధంగా లేదని దుయ్యబట్టారు. శాసనసభ లాబీలోని ప్రతిపక్ష నేత కార్యాలయంలో హరీశ్రావు బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. జీవన్రెడ్డి చేరికపై వేచిచూడండి మాజీ మంత్రి జీవన్రెడ్డి రాజీనామా, బీఆర్ఎస్లో చేరికకు సంబంధించి స్పందిస్తూ ‘వేచి చూడండి.. కొన్ని చెప్తే బాగుండవు.. చూస్తేనే బాగుంటాయి’అని హరీశ్రావు వ్యాఖ్యానించారు. ‘అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లను స్వాగతిస్తాం. మహిళా రిజర్వేషన్లపై గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాదికి ఎప్పుడూ చిన్నచూపే ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించి, ప్రగతి దిశగా పనిచేస్తూ నష్టపోతున్నాయి’అని హరీశ్రావు చెప్పారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేటు మెంబర్ బిల్లుపై స్పీకర్ను మరోమారు కలుస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేందుకు తాము 15 అంశాలు ప్రతిపాదించినా ఒక్కటీ పరిగణనలోకి తీసుకోలేదని మండిపడ్డారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నోటిఫికేషన్ల ద్వారా 50,785 ఉద్యోగాలు నోటిఫై చేసి 16,978 మాత్రమే భర్తీ చేసినట్లు ఒప్పుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 36 సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి తొమ్మిదింటికి మాత్రమే అధ్యక్షులను నియమించింది. 17 బోర్డులకు కనీసం కార్యాలయాలు కూడా లేవు’అని హరీశ్రావు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు మరో వారం రోజులు పొడిగించాలని డిమాండ్ చేశారు. -
‘జీవన్ రెడ్డి మనసు మార్చుకొని కాంగ్రెస్లో కొనసాగాలి’
హైదరాబాద్: మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీని విడిచి వెళ్లడం చాలా బాధాకరమని కాంగ్రెస్ ఎంపీ, క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు. జీవన్ రెడ్డి క్రమశిక్షణతో పని చేశారని, ఆయన పార్టీలోనే ఉంటే బాగుండేదని చెప్పారు. జీవన్ రెడ్డి మనసు మార్చుకొని పార్టీలో కొనసాగాలని అన్నారు.‘పార్టీలో ఉండి అడగాలి. కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల చాలా మందికి పదవులు రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ గొప్ప సిద్ధాంతాలు ఉన్న పార్టీ. అలాంటి పార్టీ దేశంలో ఇంకొకటి లేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల అవసరాలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి అద్భుతమైన పాలన చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మంచి ప్రజాదరణ ఉన్న నాయకుడు, గొప్ప వ్యూహకర్త. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కాంగ్రెస్ చేసిన కృషిని ఈ దేశం ఎన్నడూ మరిచిపోదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సిద్ధాంతాలను ఆచరిస్తూ హామీలను అమలు చేస్తూ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు. కులగణన, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, సంక్షేమ పథకాలు, ఆరు గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ఆధారంగా రాజకీయాలు చేసిన నాయకుడు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలాంటి అవకాశాలు ఇచ్చినప్పుడు ఆయన బాగా పని చేశారు. జీవన్ రెడ్డిలాంటి క్రమశిక్షణతో ఉన్న నాయకుడు పార్టీని వీడడం బాధాకరం. ప్రభుత్వం పటిష్ఠమైన పాలన చేయాలంటే కొంత సర్దుకుపోవాలి. నాకు కూడా అవకాశాలు చాలా మిస్సయ్యాయి. నేను పార్టీలోనే ఉండి పోరాటం చేశాను. జీవన్ రెడ్డి మనసు మార్చుకొని పార్టీలో కొనసాగాలి. పరిస్థితులను బట్టి నాయకులకు అవకాశాలు వస్తాయి. వేచి చూడాలి.. మంచి నాయకులకు మంచి అవకాశాలు తప్పకుండా వస్తాయి. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రిగా సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలు చేసిన అనుభవం ఉంది. ఆయన లాంటి వారు ఓపికగా రాజకీయాలు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు అండగా ప్రజాపాలనకు సహకారాన్ని అందిస్తే బాగుండేది’ అని చెప్పారు. -
KCR మంచి దోస్త్ నాకు..
-
BJP MLA రాకేష్ రెడ్డి క్షమాపణ చెప్పాలి..
-
కాంగ్రెస్ కోసం కష్టపడ్డా.. కార్యకర్త హత్యపై రేవంత్ మౌనం
-
కాంగ్రెస్కు గుడ్బై.. రేవంత్పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రయాణానికి మాజీమంత్రి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పేశారు. జగిత్యాలలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. మూడు వేల మందితో కలిసి జీవన్ రెడ్డి.. కాంగ్రెస్కు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్పై కూడా సంచలన ఆరోపణలు చేశారు. అనంతరం, జీవన్ రెడ్డి మాట్లాడుతూ..‘శాసనమండలిలో ఏకైక సభ్యుడిగా నేనే నాయకుణ్ణి, నేనే సభ్యుడిగా పోరాడాను. 1995 ఎన్నికల్లో టీడీపీ గాలిలో కూడా జగిత్యాల స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అది నాటి కాంగ్రెస్ ఐక్యతకు నిదర్శనం. చంద్రబాబు స్వయంగా వచ్చినా, ఎంఐఎం మద్దతిచ్చినా 93 ఎన్నికల్లో 75 శాతం ఓట్లతో నన్ను గెలిపించారు. 2006, 2008 రెండు ఉప ఎన్నికల్లో కూడా నాటి తెలంగాణా ఉద్యమంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ఏఐసీసీ ఎంపిక చేస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీదే ఆధిక్యం. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి ఒంటిచేత్తో పోరాటం చేశాను.పది స్థానాల్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం అనైతికం. దశాబ్ద కాలంగా చేసిన పోరాటంపై ఆధిపత్యం చెలాయించడమే అవుతుంది. అంతకుముందు ఆధిపత్యం చేసిన వాళ్లే మళ్లీ ఆధిపత్యం చేయడమేంటి?. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై సమావేశం గాంధీభవన్లో నిర్వహిస్తే అక్కడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలా వస్తారు?. పార్లమెంట్ వంటి అత్యున్నత ఎన్నికల్లో ఒక పార్టీలో గెల్చి దానికి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి పోటీ చేయడం ఏం సంకేతం ఇస్తుంది?. సరే అభివృద్ధిలో కలిసి వస్తే పర్లేదు కానీ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో వారి జోక్యం ఏంటి?.మహేష్ కుమార్ గౌడ్, వంశీచందర్ వస్తే ఏంటి పరిష్కారం?. నా అనుచరుడిని నడిబజారులో దారుణ హత్య చేస్తే ఓపిక పట్టాలా?. మాకు జరుగుతున్న అవమానాలు, అన్యాయాలపై ఓపిక పట్టాలా?. ఎందుకు ఓపిక పట్టాలి?. కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరి నోటితో నవ్వుతూనే నొసటితో వెక్కిరించే విధంగా సాగింది. శాసనసభ్యుడిగా, మండలి సభ్యుడిగా ఒంటరి పోరాటం చేసిన నేను కనీసం మంత్రి పదవికి అర్హుడిని కాదా?. ఒకనాడు పీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్న నేను ఇవాళ నా హక్కుల కోసం నియోజకవర్గంలో పోరాడాల్సి రావడం ఎంత దౌర్భాగ్యం?. జీవన్ రెడ్డిని తొక్కేయాలనేది ఇవాళ కాంగ్రెస్ యోచన.చంద్రబాబు, కేసీఆర్ పై పోరాటం చేసిన నేను ఇక నుంచి రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తా. ఇంకెంత కాలం ఈ అవమానాలు?. కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరూ ఎదుగొద్దని రేవంత్ ఇదంతా చేస్తున్నారా?. రాహూల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచే నాలాంటి వాడిని అణగదొక్కుతారా?. వేం నరేందర్ రెడ్డి ఎవరు? అని ప్రశ్నించారు -
నేడు జీవన్ రెడ్డి రాజీనామా.. చెరిగిపోతున్న ఆనవాళ్లు


