breaking news
Congress Party
-
ఒకే ఫ్రేమ్లో మోదీ–పవార్–షా..
ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఒకే ఫ్రేమ్లో కనిపించిన ఫొటో ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సుప్రియా సూలే కుమార్తె రేవతి సూలే వివాహ రిసెప్షన్ సందర్భంగా చోటుచేసుకున్న ఈ పరిణామం.. సాధారణ కుటుంబ వేడుకే అయినప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.सुप्रिया सुळे यांची मुलगी रेवती सुळे आणि सारंग लखानी यांचा दिल्लीत रिसेप्शन सोहळा. यावेळी अमित शाह यांनी उपस्थित राहीले. रेवती आणि सारंग यांना आशिर्वाद दिले. #sharadpawar #amitshah pic.twitter.com/pSE3rg9UQL— Ramraje Shinde (@ramraje_shinde) August 10, 2026Prime Minister Modi ji attended the wedding reception of Sharad Pawar's granddaughter today. He blessed the newlyweds during the event. pic.twitter.com/0BVKo5YXZT— Avinash K S🇮🇳 (@AvinashKS14) August 10, 2026ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో కొనసాగుతున్న శరద్ పవార్ పార్టీ.. ఇటీవల కేంద్ర ప్రభుత్వంతో పలు అంశాలపై చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో మోదీ, పవార్, షా కలిసి కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. ఈ వివాహ వేడుకకు కొందరు కాంగ్రెస్ పెద్దలు, ఎన్సీపీ-ఎస్పీ మిత్రపక్షాల నేతలు కొందరు దూరంగా ఉండడమూ ఇందుకు మరో ప్రధాన కారణమైంది. అయితే ఇది కేవలం కుటుంబ కార్యక్రమంలో భాగమైన మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని ఎన్సీపీ (ఎస్పీ) వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మహారాష్ట్ర రాజకీయాల్లో మాత్రం.. ఈ కలయికపై ఊహాగానాలు మొదలయ్యాయి.కొసమెరుపు: మోదీ విధానాలపై తరచూ విమర్శలు చేసే రోహిత్ పవార్.. అదే వేదికపై ప్రధాని మోదీతో కలిసి ఫొటోకు పోజివ్వడం కూడా చర్చకు దారితీసింది.If Sharad Pawar’s faction ever boards the NDA ship, Rohit Pawar will probably be the first passenger with his bags packed. 😂On social media, Rohit Pawar keeps claiming that he will never bow before the BJP. When it came to Delhi, he was among the first to meet PM Modi along…— Saffron Monk (@mangeshspa) August 11, 2026ఇక ఈ వివాహ వేడుకకు బీజేపీ అగ్రనేతలు హాజరు కావడం కంటే కొన్ని గంటల ముందే.. ఎన్సీపీ (ఎస్పీ)కి చెందిన లోక్సభ ఎంపీల బృందం ప్రధాని మోదీని కలిసింది. సుప్రియా సూలే నేతృత్వంలోని ఎనిమిది మంది ఎంపీలు మహారాష్ట్రకు సంబంధించిన పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కరువు పరిస్థితులు, సాగునీరు, నదుల అనుసంధానం, రైల్వే ప్రాజెక్టులు, రైతు రుణమాఫీ వంటి అంశాలపై వినతిపత్రం అందించారు. పుణె–నాశిక్ సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు, ఉల్లి ధరలు, చంద్రభాగా నది కాలుష్యం వంటి సమస్యలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం.రాజకీయ మార్పులపై ఊహాగానాలుమోదీతో పవార్ వర్గం వరుస భేటీలు, కేంద్రం ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై పార్టీ వైఖరి వంటి పరిణామాలు కొత్త చర్చలకు కారణమయ్యాయి. డీలిమిటేషన్ విషయంలో తమ నిర్ణయం తుది బిల్లు వచ్చిన తర్వాతే తీసుకుంటామని సుప్రియా సూలే ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే కొన్ని షరతులతో ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది.ఇండియా కూటమిలో ఉంటూనే.. ఎన్సీపీ (ఎస్పీ) మాత్రం తమ రాజకీయ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెబుతోంది. మహారాష్ట్ర సమస్యలు, ప్రజా ప్రయోజన అంశాలపైనే కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని స్పష్టం చేస్తోంది. గతంలోనూ శరద్ పవార్, సుప్రియా సూలేలు ప్రధాని మోదీని కలిసి విద్యార్థుల సమస్యలు, నీటి నిర్వహణ, రైతుల అంశాలపై చర్చించారు.ఒక ఫొటో.. ఎన్నో ప్రశ్నలు!ప్రస్తుతం రేవతి సూలే వివాహ రిసెప్షన్లో తీసిన ఈ చిత్రం కేవలం ఓ కుటుంబ వేడుక జ్ఞాపకమే అయినప్పటికీ.. దాని వెనుక ఉన్న రాజకీయ నేపథ్యం కారణంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీతో పవార్ సాన్నిహిత్యం పెరుగుతోందా? లేదంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాత్రమే ఈ భేటీలా? మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ ఫొటో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. -
యూపీలో రాజకీయ భూకంపం రానుందా? 403 సీట్లు మరీ..
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్వాదీ పార్టీతో సీట్ల సర్దుబాటు చర్చలు ముందుగానే ప్రారంభం కావాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. అయితే, రాష్ట్రంలోని 403 నియోజకవర్గాల్లో ఎక్కువ వాటా పొందడమే పార్టీ లక్ష్యం కాదు. దానికి బదులుగా, సంస్థాగత బలం, అభ్యర్థి సామర్థ్యం, కుల సమీకరణాలు, సమాజ్వాదీ పార్టీ మద్దతు కలిసొచ్చే గెలుపు అవకాశాలు ఉన్న స్థానాలపై చర్చలు జరగాలని పార్టీ కోరుతోంది. అలాంటి నియోజకవర్గాల్లో కూటమికి విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందని భావిస్తోంది.ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో పరిమిత ఉనికి మాత్రమే ఉన్న కాంగ్రెస్కు ఈ విధానం ప్రాధాన్యం సంతరించుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీతో కలిసి పోటీ చేసిన తర్వాత పార్టీ పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. ఇరు పార్టీలు కూడా 403 అసెంబ్లీ స్థానాలన్నింటిపైనా సర్వేలు నిర్వహిస్తున్న వేళ భవిష్యత్తులో ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలన్న చర్చలకు ఇది పునాది వేయొచ్చు.సీట్ల సర్దుబాటు పరిమితం కాలేదుసీట్ల సర్దుబాటు ప్రధానంగా ఎన్ని స్థానాలు దక్కాయన్న లెక్కల ఆధారంగా నిర్ణయం తీసుకోవడాన్ని కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. తమకు వాస్తవికంగా గెలిచే అవకాశం ఉన్న కొద్దిపాటి స్థానాలపై దృష్టి పెట్టినా, గెలుపు అవకాశాలే ప్రమాణంగా ఉండాలని పార్టీ కోరుతోంది.“ఒక విషయం అంశంలో మేము స్పష్టంగా ఉన్నాం. మా ముఖ్యమంత్రి అభ్యర్థి సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం. అయితే అది సమాజ్వాదీ పార్టీ నిర్ణయం. రాష్ట్రంలో మా ఉనికిని పెంచుకోవాలని కోరుతున్నాం. అందుకోసం మంచి స్థానాల్లో పోటీ చేయడం ముఖ్యం” అని ఓ కాంగ్రెస్ నాయకుడు తెలిపారు.“ఒక పార్టీ వరుసగా మూడు సార్లు ఓడిపోయిన స్థానాన్ని మళ్లీ అదే పార్టీకి ఇవ్వడం వల్ల కూటమికి ఉపయోగం ఉండదు. మరో పార్టీ అభ్యర్థి తన ఓట్లతో పాటు భాగస్వామ్య పార్టీ ఓట్లను కూడా కలిపి తెచ్చుకోగలిగితే అది మరింత బలమైన అవకాశం అవుతుంది” అని ఓ కాంగ్రెస్ ఎంపీ తెలిపారు.కాంగ్రెస్ లక్ష్యం రెండు విధాలుగా ఉంది. అసెంబ్లీలో ప్రాతినిధ్యాన్ని పెంచుకోవడం, ఉత్తరప్రదేశ్లో బలహీనమైన సంస్థాగత వ్యవస్థను తిరిగి నిర్మించుకోవడం. 403 స్థానాల్లో చేస్తున్న సర్వేలు కాంగ్రెస్-సమాజ్వాదీ పార్టీ ఒప్పందాన్ని ప్రభావితం చేయొచ్చు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు విడివిడిగా 403 నియోజకవర్గాలన్నింటినీ అంచనా వేస్తున్నాయి.గత ఎన్నికల ఫలితాలు, కుల సమీకరణాలు, సంస్థాగత బలం, అభ్యర్థుల సామర్థ్యం, రెండు పార్టీల మద్దతు వర్గాలు పరస్పరం బదిలీ అయ్యే అవకాశం వంటి అంశాలను ఈ సర్వేలు పరిశీలించే అవకాశం ఉంది.“ముందుగా జరిగిన సమావేశంలో 403 స్థానాలన్నింటిపైనా సిద్ధం కావాలని, సంస్థను బలోపేతం చేయాలని నిర్ణయించాం. అయితే ఎన్నికలు దగ్గరపడే వేళ కుల సమీకరణాలు, సమాజ్వాదీ పార్టీ మద్దతు వల్ల కాంగ్రెస్కు గెలుపు అవకాశాలు ఉన్న స్థానాలను గుర్తించాలి” అని ఓ కాంగ్రెస్ ఎంపీ తెలిపారు. “సాధారణ అంగీకారానికి రావడానికి సమాజ్వాదీ పార్టీ తన సర్వే చేస్తోంది. కాంగ్రెస్ కూడా తన సర్వే చేస్తోంది. తుది నిర్ణయం పార్టీ నాయకత్వం తీసుకుంటుంది” అని మరో కాంగ్రెస్ ఎంపీ తెలిపారు.మా వాటా ఎక్కువ: సమాజ్వాదీ పార్టీభవిష్యత్తులో ఏ ఒప్పందం జరిగినా రాష్ట్రంలో రెండు పార్టీల బలాబలాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ అసెంబ్లీలో తన ఉనికిని పెంచుకోవాలని చూస్తుండగా, సమాజ్వాదీ పార్టీ రాష్ట్రంలో పెద్ద భాగస్వామ్య పార్టీగా ఉంది. కూటమి నిర్ణయాలు అగ్ర నాయకత్వమే తీసుకుంటుందని ఓ సీనియర్ సమాజ్వాదీ పార్టీ నాయకుడు తెలిపారు. కాంగ్రెస్ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించలేమని చెప్పారు. “2027 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే మా వాటా ఎక్కువ. అభ్యర్థుల గెలుపు అవకాశాల ఆధారంగానే సీట్ల పంపకం ఉంటుంది” అని ఆయన తెలిపారు.ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఈ సంబంధాన్ని ఎలా చూడాలనుకుంటుందో సంకేతాలు ఇచ్చింది. ఇటీవల ఉత్తరప్రదేశ్కు ఏఐసీసీ ఇన్ఛార్జ్గా నియమితులైన రాజేంద్ర పాల్ గౌతమ్, పార్టీ “సమానత్వం, గౌరవం”తో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు.2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే ఆశించిన ఫలితం రాలేదు. సమాజ్వాదీ పార్టీ 47 స్థానాలు, కాంగ్రెస్ 7 స్థానాలు గెలుచుకోగా, 403 సభ్యుల అసెంబ్లీలో బీజేపీ 312 స్థానాలతో ఘన విజయం సాధించింది.చర్చలు ఆలస్యం కావడం, నియోజకవర్గ స్థాయిలో తగిన సమన్వయం లేకపోవడం కూటమికి నష్టం చేశాయని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. రెండు పార్టీల మధ్య 20కి పైగా స్థానాల్లో “స్నేహపూర్వక పోటీలు” కూడా జరిగాయి.“చర్చలు ఆలస్యం కావడం, నియోజకవర్గ స్థాయిలో తగిన సమన్వయం లేకపోవడం వల్ల గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభావం భూమి స్థాయిలో కనిపించలేదు” అని రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాతో జరిగిన ఉత్తరప్రదేశ్ ఎంపీల సమావేశానికి హాజరైన ఓ కాంగ్రెస్ నాయకుడు తెలిపారు.ఈ సమావేశం పార్లమెంట్ సమావేశాల సమయంలో జరిగింది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీని కలిసిన తర్వాత ఇది జరిగింది.“కూటమి చివరి క్షణంలో నిర్ణయమయ్యేది కాదు. కలిసి వెళ్లాలా వద్దా అన్నది ముందుగానే నిర్ణయించాలి. గత అనుభవాల దృష్ట్యా ఇది కీలకం” అని ఓ సీనియర్ కాంగ్రెస్ ఎంపీ తెలిపారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు విడిగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.2024 ఎన్నికలు కాంగ్రెస్కు కొత్త మోడల్ యూపీ 2017 ఎన్నికలు హెచ్చరికగా నిలిస్తే, 2024 లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ అనుసరించాలనుకుంటున్న మోడల్గా నిలిచాయి. లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ మళ్లీ కూటమిగా పోటీ చేశాయి. ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ 62 స్థానాలు, కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేసింది. సమాజ్వాదీ పార్టీ 37 స్థానాలు, కాంగ్రెస్ 6 స్థానాలు గెలిచాయి. మొత్తం గెలిచిన స్థానాల సంఖ్య 43కి చేరింది. 2019 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 62 స్థానాలు గెలిచిన బీజేపీ 33 స్థానాలకు పరిమితమైంది.తాము ఎన్ని స్థానాల్లో పోటీ చేశామన్న దానికంటే, కూటమి బలాన్ని విజయాలుగా మార్చగలిగే నియోజకవర్గాలు దక్కాయా అన్నదే ముఖ్యం అని కాంగ్రెస్ భావిస్తోంది. అదే సూత్రాన్ని ఇప్పుడు 403 స్థానాల అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయాలని కోరుతోంది. -
బీజేపీకి సంతోషం కలిగించే మాటలొద్దు!
కాంగ్రెస్లో జెన్జీ రాజకీయాలపై కొత్త చర్చ మొదలైంది. పార్టీ లైన్ను దాటి కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై హైకమాండ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆయన పేరును ప్రస్తావించకుండా వార్నింగ్ ఇచ్చింది. బీజేపీని సంతోష పెట్టేలా మాట్లాడడం మానుకుంటే మంచిదంటూ సూచనలు చేసింది. రాహుల్ గాంధీ చేపట్టిన ‘యువత కార్యక్రమం’ కంటే.. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు జెన్జీ యువతను ఎక్కువగా ఆకర్షించాయని థరూర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించింది. కేరళ కాంగ్రెస్ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. పార్టీ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పార్టీ నేతల వ్యాఖ్యలు బీజేపీకి రాజకీయంగా ఉపయోగపడేలా ఉండకూడదని పరోక్షంగా హెచ్చరించారు.థరూర్ వ్యాఖ్యలపై స్పందించిన వేణుగోపాల్.. ఆ వ్యాఖ్యలను తాను పూర్తిగా వినలేదని, మీడియా కథనాల ద్వారానే తెలుసుకున్నానని చెప్పారు. “కాంగ్రెస్ నేతలు పార్టీ విధానాలకు ఎప్పుడూ కట్టుబడి ఉండకపోయినా.. బీజేపీని సంతోషపరిచేలా వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి” అని అన్నారు. రాహుల్ గాంధీపై విమర్శలు వస్తే బీజేపీకి అది రాజకీయంగా లాభిస్తుందని వ్యాఖ్యానించారు. అయితే థరూర్ ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడారని తాను భావించడం లేదని స్పష్టం చేశారు.జెన్జీపై రాహుల్ ప్రచారాన్ని సమర్థించిన కాంగ్రెస్ఇదే సమయంలో రాహుల్ గాంధీ చేపట్టిన యువత కార్యక్రమాలను వేణుగోపాల్ గట్టిగా సమర్థించారు. ప్రయాగ్రాజ్లో జరిగిన ఛాత్రోంకీ గూంజ్ కార్యక్రమానికి వచ్చిన వారు సాధారణ కాంగ్రెస్ కార్యకర్తలు కాదని.. నిజమైన జెన్జీ యువతేనని పేర్కొన్నారు. కోటా, డెహ్రాడూన్లలోనూ ఇదే తరహా స్పందన వచ్చిందని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై రాహుల్ నిరంతరం పోరాడుతున్నారని అన్నారు.అసలు థరూర్ ఏమన్నారు?మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో శశిథరూర్.. రాహుల్ గాంధీ “ఛాత్రోంకీ గూంజ్” కార్యక్రమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ కార్యక్రమం లేవనెత్తిన అంశాలే CJP నిరసనల్లోనూ ఉన్నాయని.. అయితే జంతర్ మంతర్ వద్ద జరిగిన CJP ఆందోళన స్థాయిలో కాంగ్రెస్ కార్యక్రమం ఎందుకు ప్రభావం చూపలేకపోయిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. “మనం యువత గొంతు విన్నామా? జెన్జీ నాడిని పట్టుకోగలిగామా?” అంటూ థరూర్ ప్రశ్నించారు.అయితే తన వ్యాఖ్యలు పార్టీపైనో, లేదంటే రాహుల్ గాంధీపై దాడి కాదని తర్వాత ఆయన వివరణ ఇచ్చారు. యువతకు రాజకీయాల్లో మరింత భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరాన్ని మాత్రమే చెప్పానని తెలిపారు.సీజేపీ ప్రభావంపై రాజకీయ చర్చనీట్ పరీక్ష అంశాలు, విద్యార్థుల సమస్యలపై కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. అదే సమయంలో యువత సమస్యలను రాజకీయ పార్టీలు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాయన్న ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి. థరూర్ వ్యాఖ్యలు కాంగ్రెస్లో అంతర్గత చర్చకు దారితీయగా.. వేణుగోపాల్ స్పందనతో పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ యువత కార్యక్రమాలకు పూర్తి మద్దతుగా నిలిచినట్లు స్పష్టమైంది. -
రేవంత్ మాటలే బీఆర్ఎస్కు ఆయుధాలు!
తెలంగాణలో కాంగ్రెస్,బీఆర్ఎస్ల మధ్య రాజకీయ పెనుగులాట ఆసక్తికరంగా ఉంది. మూడో పక్షం బీజేపీ అధికార సాధన లక్ష్యంగా పనిచేస్తున్నప్పటికీ, ఇప్పటివరకైతే ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో పట్టు నిలబెట్టుకోవడంతో పాటు,ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెరగకుండా ఉండడానికి అన్ని రకాల యత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో హైడ్రా ద్వారా ప్రభుత్వానికి స్వాధీనం అయిన భూముల అమ్మకం ద్వారా వచ్చే వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్రం కోసం వినియోగించాలని ఆలోచిస్తున్నారు. హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ ను బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించినా అందుకు ప్రభుత్వం సుముఖంగా లేనట్లుగా కనిపిస్తుంది. ఈ పరిణామం ఎటువైపు దారి తీస్తుందన్నది చర్చగా ఉంది. ప్రభుత్వంపై కాని, కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కాని ఆరోపణలు వస్తున్న తీరు రేవంత్ కు చికాకు కలుగుతుండవచ్చు. ఇక బీఆర్ఎస్ నాయకత్వం ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైన ఆధారపడి రాజకీయాలను నడుపుతోంది. మాజీ ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం జనంలో తిరగకుండా, వెనుక ఉండి పార్టీని నడుపుతున్నారు. ఫేసెస్ ఆఫ్ ద పార్టీగా కేటీఆర్, హరీష్ రావులు కనిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ అవకాశం వచ్చినా వదలిపెట్టకుండా ఆందోళనలకు సన్నద్దమవుతున్నారు. రేవంత్ ప్రసంగాలలో ఏ మాత్రం తప్పులు దొర్లినా వెంటనే అందుకుని ప్రజలలోకి తీసుకువెళ్లడానికి కేటీఆర్, హరీష్ రావు శాయశక్తుల కృషి చేస్తున్నారు. ప్రభుత్వపై వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా వారు పని చేస్తున్నారు.ఈ క్రమంలో కొన్నిసార్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల దుమారం హద్దులు మీరుతున్నట్లు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఒక సభలో ఇంజనీరింగ్ విద్యను క్రిమినల్ వేస్ట్ అని వ్యాఖ్యానించారు. కనీసం ఉద్యోగాలకు దరఖాస్తు కూడా రాయలేకపోతున్నారని ఆయన అన్నారు. ఆయన ఉద్దేశం ఇంజనీర్లందరిని కించపరచడం కాకపోవచ్చు. ఇంజనీరింగ్ విద్య ప్రమాణాలు కోల్పోతోందని చెప్పాలన్నది ఆయన భావన. అందులో కొంత నిజం ఉంది. కొంతమంది ఇంజనీరింగ్ పూర్తి చేసినా మంచి ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ఇటీవలి కాలంలో వివిధ కారణాల వల్ల సుమారు 60 కాలేజీలు మూతపడ్డాయట. లెక్చరర్లు మంచి విద్య అందించాలని చెప్పడం తప్పు కాదు. కాని అసలు ఆ ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ అని అనడం విమర్శలకు దారి తీసింది. రేవంత్ రెడ్డి ఒక్కోసారి కొన్ని వ్యాఖ్యలు చేసి ఇబ్బందులలో పడుతున్నారు. హైడ్రాను సమర్ధించడానికి హిట్లర్తో పోల్చుకోవడం, ఇరాన్ యుద్ద విధ్వంసాన్ని ప్రస్తావించడం వంటివి చేశారు. ఇప్పుడేమో ఇంజనీరింగ్ విద్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏ రంగంలో అయినా కొన్ని ప్రమాణ లోపాలు ఉండవచ్చు. కాని అంతమాత్రాన దానిని క్రిమినల్ వేస్ట్ అని అంటామా అన్నది ఆలోచించుకోవాలి. అలాగైతే మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలను ఏమి చేయాలన్న ప్రశ్న వస్తుంది కదా! ఇంజనీరింగ్ విద్యను లక్షలాది మంది చదువుకున్నారు కాబట్టే దేశంలోకాని, ఇతర దేశాలలో కాని మనవాళ్లు మంచి ఉద్యోగాలలో ఉన్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో రాణిస్తున్నారన్న సంగతిని గ్రహించాలి. రేవంత్ వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకోవడానికిబీఆర్ఎస్ నేతలు అన్ని వ్యూహాలు అమలు చేశారు. తెలంగాణలోని యువతను అవమానించే రీతిలో రేవంత్ మాట్లాడారంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అప్లికేషన్ రాయలేని స్థితిలో ఇంజనీర్లు ఉన్నారంటున్న రేవంత్ తన ఎన్నికల అఫిడవిట్ ను పూర్తి చయగలరా అని సవాల్ చేశారు.కాంగ్రెస్ పార్టీనే క్రిమినల్ వేస్ట్ అని కేటీఆర్ మండిపడ్డారు . ఆ తర్వాత రేవంత్ పై కూడా ఆ తరహా వ్యాఖ్యలే చేశారు.రేవంత్ ఇంజీనిరింగ్ విద్యను వేస్ట్ అనడాన్ని ఎవరూ సమర్దించరు. అలాగే కేటీఆర్ కూడా రేవంత్ ను అదే మాట అనడం కరెక్టు కాదని చెప్పాలి. తమను వ్యక్తిగతంగా అటాక్ చేస్తే తామూ అదే చేస్తామని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. కొంత హద్దులు మీరి ఇరువైపులా విమర్శలు చేసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఇక ఇంజీనర్లకు మద్దతు ఇస్తూ రాకెట్ పంపుతున్నవారిని అవమానిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ వ్యాఖ్యలపై లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేస్తూ ఒక లేఖ కూడా రాశారు. ఉద్యోగాల పేరుతో యువతను కాంగ్రెస్ దగా చేసిందని కేటీఆర్ ఆరోపించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేకపోయిందని ఆయన మండిపడ్డారు. జెన్ జి, కాక్రోచ్ ఉద్యమాలకు మద్దతు ఇచ్చే విషయంలో ఈ రెండు పార్టీలు పోటీ పడ్డాయి. ఢిల్లీలో కాంగ్రెస్ కు కొంత అడ్వాంటేజ్ ఉన్నా, తెలంగాణకు వచ్చేసరికి అదికారంలో అదే పార్టీ ఉండడంతోబీఆర్ఎస్ ఆ అవకాశాన్ని వాడుకుంది. కొద్ది రోజుల క్రితం నిరుద్యోగులతో సంగ్రామ్ పేరుతో ఒక భారీ సభను నిర్వహించారు. ఖమ్మంలో ఒక నిరుద్యోగి ఆత్మహత్యయత్నం చేస్తూ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడాన్ని తన నోట్ లో తప్పుపట్టారు. ఇది కాంగ్రెస్ పై నిరుద్యోగి ఛార్జీషీట్ అని కేటీఆర్ పేర్కొన్నారు. మొత్తం యువతను ఆకర్షిస్తే తమకు అధికారం రావడం ఖాయమనిబీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్న తరుణంలో రేవంత్ వ్యాఖ్య వారికి అందివచ్చినట్లయిందనిపిస్తుంది. ఇక హైడ్రా కమిషనర్ రంగనాధ్ విషయంలో రేవంత్ కోర్టు ఆదేశాలను పాటించడానికి ఇష్టపడడం లేదని అర్దం అవుతుంది. రంగనాధ్ ను బదిలీ చేయాలని హైకోర్టు సూచించినా ,అది ప్రభుత్వ విచక్షణాధికారమన్న భావనలో రేవంత్ ఉన్నారనుకోవాలి. అదే టైమ్ లో హైడ్రా స్వాధీనం చేసుకున్న భూముల అమ్మకం ద్వారా అరవైవేల కోట్ల నుంచి తొంభై వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు దీనిని వాడవచ్చన్నది ప్రభుత్వ వర్గాల భావన. అయితే ఈ భూములను అమ్మడానికి అవకాశం లేదన్నది విపక్షం వాదనగా ఉంది. గత రెండేళ్లుగా ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయి ఉండడం, ఫీజ్ రీయింబర్స్ మెంట్ చెల్లింపులు, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వలేకపోవడం, మెట్రో రైలు రుణం వ్యవహారం మొదటికి రావడం ఇలా అనేక సమస్యలు ఉన్న తరుణంలో నిజంగానే ఈ భూములను అమ్మే అవకాశం వస్తే అది ప్రభుత్వానికి జాక్ పాట్ అవుతుంది.కాని మరో వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వస్తున్న అవినీతి ఆరోపణలు ప్రభుత్వానికి చికాకుగా మారుతున్నాయి.ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తాను చెల్లించవలసిన సుమారు 400 కోట్లకు పైగా రుణాన్ని తీర్చివేశారట.ఇది ఎలా సాధ్యమైందని,దానిపై విచారణ చేయించగలరా అని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేష్ రెడ్డి సవాల్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లూటింగ్ ఏజెంట్లుగా మారారని ఆయన ధ్వజమెత్తారు. ఆయా శాఖలలో అవినీతి జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారంలో ఉన్నవారికి ఇవన్ని ఒక చక్రబంధం వంటివి. వీటిని జాగ్రత్తగా తప్పించుకుంటూ ముందుకు పోవాలని అదికార కాంగ్రెస్ యత్నిస్తుంది. కాని ఆ చక్రబంధంతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికిబీఆర్ఎస్ అన్ని వ్యూహాలు అమలు చేస్తోంది. ఎవరిది పై చేయి అవుతుందో కాలమే తేల్చుతుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బీజేపీలో ఆయనే నా ఫేవరేట్.. ‘హలో అంకుల్’ అంటూ రాహుల్..
న్యూఢిల్లీ: రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సహజం. కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. బీజేపీలో తనకు ఇష్టమైన నాయకుడు ఎవరో చెబుతూ.. మాజీ పంజాబ్ ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ పేరును రాహుల్గాంధీ ప్రస్తావించారు.ఇన్స్టాగ్రామ్లో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ కార్యక్రమంలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ రాహుల్గాంధీ.. అమరీందర్ సింగ్తో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. ‘‘ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన చాలా కూల్. సైనిక చరిత్రపై ఆయనకు మంచి పట్టు ఉంది. హలో అంకుల్ అమరీందర్’’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. జెన్ జెడ్, విద్యార్థులతో మరింతగా మమేకమయ్యేందుకు రాహుల్గాంధీ ఈ ఇన్స్టాగ్రామ్ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే అమరీందర్ సింగ్పై చేసిన వ్యాఖ్య వైరల్గా మారింది.రాహుల్ వ్యాఖ్యలపై అమరీందర్ సింగ్ కూడా స్పందించారు. తన గురించి రాహుల్గాంధీ మంచి మాటలు చెప్పడం సంతోషంగా ఉందన్నారు. రాహుల్, ప్రియాంక గాంధీలను చిన్నప్పటి నుంచే తనకు తెలుసని గుర్తుచేశారు. రాహుల్ తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్గాంధీ తనకు క్లాస్మేట్, స్నేహితుడని చెప్పారు. అయితే వ్యక్తిగత సంబంధాలు, రాజకీయ అనుబంధాలు వేర్వేరు అని అమరీందర్ స్పష్టం చేశారు. రాహుల్, సోనియాగాంధీ కుటుంబంతో తన వ్యక్తిగత, కుటుంబ సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయని.. కానీ రాజకీయంగా మాత్రం తాను బీజేపీకి కట్టుబడి ఉన్నానని తెలిపారు.అమరీందర్ వ్యాఖ్యలకు పంజాబ్ బీజేపీ నేతలు కూడా స్పందించారు. పంజాబ్ బీజేపీ అధికార ప్రతినిధి ప్రీత్పాల్ సింగ్ బలియావాల్.. అమరీందర్ సింగ్ను పంజాబ్లో అత్యున్నత స్థాయి నాయకుడిగా అభివర్ణించారు. అయితే కాంగ్రెస్ పంజాబ్ యూనిట్లో అంతర్గత విభేదాలు తీవ్రంగా ఉన్న సమయంలోనే రాహుల్ ఆయనను గుర్తు చేసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేత రాణా గుర్జీత్ సింగ్ మాత్రం రాహుల్, అమరీందర్కు కుటుంబ సంబంధాలు ఉన్నాయని, అమరీందర్ గౌరవనీయమైన నాయకుడని అన్నారు. ఆయన కాంగ్రెస్ను వీడకుండా ఉంటే పార్టీలో అందరికీ మార్గదర్శకుడిగా ఉండేవారని అభిప్రాయపడ్డారు.అమరీందర్ సింగ్ ఒకప్పుడు కాంగ్రెస్లో కీలక ప్రాంతీయ నాయకుడిగా ఉన్నారు. 2017లో పంజాబ్లో కాంగ్రెస్కు ఘన విజయం అందించి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్లో అంతర్గత విభేదాల నేపథ్యంలో 2021లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఆ తర్వాత కాంగ్రెస్ను వీడారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసి, 2022 ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో అనంతరం బీజేపీలో విలీనం చేశారు. ప్రస్తుతం అమరీందర్ కుటుంబ సభ్యులు కూడా బీజేపీలోనే ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్తో రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ.. సోనియాగాంధీ కుటుంబంతో తన వ్యక్తిగత అనుబంధం కొనసాగుతుందని అమరీందర్ పలుమార్లు స్పష్టం చేశారు. దీంతో రాహుల్గాంధీ చేసిన ‘హలో అంకుల్ అమరీందర్’ వ్యాఖ్య మరోసారి ఆ పాత రాజకీయ, కుటుంబ అనుబంధాలను తెరపైకి తెచ్చింది."Hello, Uncle Amarinder!"LoP Shri @RahulGandhi gives a warm shoutout to his favourite politician from the BJP. pic.twitter.com/kwgQPDZ5SV— Congress (@INCIndia) August 6, 2026 -
కాంగ్రెస్ కంటే సీజేపీనే బెటర్: శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చేపట్టిన విద్యార్థి నిరసనల ప్రచార కార్యక్రమం ఆశించిన స్థాయిలో ప్రజాదరణ పొందలేదని ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ అంగీకరించారు. ముంబైలో జరిగిన ‘ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైట్ నేషన్స్’ (ఐఐఎంయూఎన్) 15వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేపర్ లీకేజీ అంశాలపై తాము ముందుగానే గళం విప్పినప్పటికీ, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసనలకు వచ్చిన జనసందోహం తమ ప్రచారానికి రాలేదన్నారు.తాము లేవనెత్తిన అంశాలనే సీజేపీ కూడా జంతర్ మంతర్ వద్ద ప్రస్తావించిందని, రాహుల్ గాంధీ నేతృత్వంలో ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమం ద్వారా విద్యార్థులతో మమేకమయ్యామని శశిథరూర్ గుర్తుచేశారు. అయితే, తమ వ్యూహంలో ఎక్కడ లోపం జరిగిందో, యువత (జెన్ జీ) నాడిని పట్టుకోవడంలో ఎందుకు విఫలమలమయ్యామో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై జూన్ 20 నుంచి సీజేపీ చేపట్టిన ఆందోళనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.ఇది కూడా చదవండి: ‘వర్షం కురిసిన ఉదయం’.. వందకి రూ. 400 ఇస్తామన్నా.. -
కర్ణాటకలో పట్టపగలే దారుణం.. కాంగ్రెస్ నేత హత్య
బెంగళూరు: కర్ణాటకలోనియ దారుణ ఘటన వెలుగు చూసింది. ఉడుపి జిల్లాలో కాంగ్రెస్ నేత, కాంట్రాక్టర్, మాజీ పంచాయతీ అధ్యక్షుడు డేవిడ్ డిసౌజా దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం గుర్తు తెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు. దీంతో డేవిడ్ మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు ఓ వాహనంలో వచ్చి డిసౌజాపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు. కాగా, డిసౌజా కాంగ్రెస్ రాజకీయాల్లో చురుకుగా ఉండటంతో పాటు కాంట్రాక్టు పనులు చేసేవారు. గతంలో పంచాయతీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. దీంతో ఆయన హత్య స్థానిక రాజకీయ, వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది.అయితే, డేవిడ్ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. -
10, 11, 12వ తేదీల్లో తప్పనిసరిగా హాజరుకండి
న్యూఢిల్లీ: పార్లమెంట్లో చాలా కీలకమైన అంశాలు చర్చకు రానున్నందున ఈ నెల 10, 11, 12వ తేదీల్లో తప్పనిసరిగా హాజరు కావాలంటూ శుక్రవారం కాంగ్రెస్ తన పార్టీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఈ మూడు రోజుల్లో తమ ఎంపీలు కూడా తప్పనిసరిగా సభల్లో ఉండేలా చూడాలని ప్రతిపక్ష ఇండియా కూటమి పక్షాలను కూడా కాంగ్రెస్ కోరింది. వచ్చే వారంలో వివాదాస్పద విదేశీ విరాళాల నియంత్రణ సవరణ(ఎఫ్సీఆర్ఏ) బిల్లు–2026, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టే చాన్సుందన్న వార్తల నేపథ్యంలో లోక్సభలో కాంగ్రెస్ చీఫ్ విప్ కె.సురేశ్, రాజ్యసభలో ఆ పార్టీ చీఫ్ విప్ జైరాం రమేశ్ ఈ మేరకు వేర్వేరుగా క్షుప్తంగా విప్లను జారీ చేశారు. అయితే, ఎఫ్సీఆర్ఏ, నియోజకవర్గాల బిల్లును ప్రవేశపెట్టే యోచన లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. ఎఫ్సీఆర్ఏ బిల్లు నెగ్గాలంటే సాధారణ మెజారిటీ ఉంటే సరిపోతుంది. రాజ్యాంగ సవరణ బిల్లుకు మాత్రం మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమవుతుంది. -
డీసీసీ అధ్యక్షుల మార్పు?
సాక్షి, హైదరాబాద్: నియామకాలు జరిగి నిండా సంవత్సరం కాకముందే జిల్లా కాంగ్రెస్ (డీసీసీ) అధ్యక్షులను మార్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఉత్తర తెలంగాణకు చెందిన నలుగురు డీసీసీ అధ్యక్షుల పనితీరు బాగాలేదని ఏఐసీసీకి నివేదికలు వెళ్లిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇటీవల ఢిల్లీలో జరిగిన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో డీసీసీ అధ్యక్షుల పనితీరుపై చర్చ జరిగిందని, ఈ చర్చలో ఏఐసీసీ అభిప్రాయాన్ని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారని, ఇందుకు సమన్వయ కమిటీ కూడా అంగీకారం తెలిపిందని సమాచారం. దీంతో త్వరలోనే డీసీసీ అ«ధ్యక్షుల మార్పులుంటాయనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సమన్వయం ఏదీ? సమన్వయ కమిటీ సమావేశంలో రాష్ట్రంలోని అందరు డీసీసీ అధ్యక్షుల పనితీరు మదింపు నివేదికలను మీనాక్షి ప్రవేశపెట్టారు. జిల్లాల వారీగా పలు సూచికల ఆధారంగా ర్యాంకింగులిచ్చిన ఆమె.. కొందరి పనితీరు బాగాలేదని సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ సమక్షంలోని కమిటీ దృష్టికి తెచ్చారు. ఈ జాబితాలో మహిళలతోపాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు తెలిసింది. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు నిర్వహించడంలో, జిల్లాలోని పార్టీ నాయకత్వాన్ని సమన్వయం చేసుకోవడంలో వీరు విఫలమవుతున్నారని, ఏఐసీసీకి తగిన సమాచారం ఇవ్వడం లేదని ఆమె సమన్వయ కమిటీ దృష్టికి తీసుకొచ్చారని, ఈ నేపథ్యంలోనే సమన్వయకమిటీ అంగీకారం మేరకు త్వరలోనే ఆ ముగ్గురు లేదా నలుగురు డీసీసీ అధ్యక్షుల మార్పు ఉంటుందని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి.తమ విషయంలో సామాజిక అన్యాయం జరుగుతోందని కొందరు డీసీసీ అధ్యక్షులు ఆరోపిస్తున్నారు. అగ్రవర్ణాలకు చెందిన డీసీసీ అధ్యక్షుల పనితీరుపై ఎలాంటి సమీక్ష ఎందుకు జరపడం లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన తమ పనితీరును మాత్రమే ఎందుకు లెక్కగడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని నేతలందరినీ కలుపుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని, కొందరు రావడం లేదని, వారితో సఖ్యత కుదరడం లేదని, ఈ విషయంలో టీపీసీసీ, ఏఐసీసీలు ఎలాంటి చొరవ తీసుకోకుండా తాము కలుపుకొని పోవడం లేదని అనడంలో అర్థం లేదని వారంటున్నారు. -
‘బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది’
సాక్షి,హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, అయినప్పటికీ ఆల్మట్టి, జూరాల నుంచి నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులకు ప్రణాళిక ప్రకారం నీటి పంపిణీ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. సాగునీటి అధికారుల సూచనల మేరకు వచ్చిన ఇన్ఫ్లోకు అనుగుణంగా నీటి నిర్వహణ జరుగుతోందని చెప్పారు.సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు నీళ్లు ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని జూపల్లి స్పష్టం చేశారు. పాలమూరు బిడ్డ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా అల్లుడు అయిన సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిని నిలిపివేశారన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయ పబ్బం గడుపుకోవడానికే బీఆర్ఎస్ హంగామా చేస్తోందని ఆరోపించారు. జూరాలకు నీళ్లు వదలాలంటూ ప్రాజెక్టుల వద్ద ముందుగానే డ్రామాలు చేస్తూ, అధికారులు నీటిని విడుదల చేసిన తర్వాత దానిని తమ క్రెడిట్గా ప్రచారం చేసుకోవడమే వారి లక్ష్యమని విమర్శించారు.ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సాగర్, భీమా ప్రాజెక్టులకు కాంగ్రెస్ హయాంలోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి ఎత్తిపోతల పనులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.చెడిపోయిన పంపులు, మోటార్లు, కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలను కూడా మరమ్మతు చేయకుండా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. భీమా ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందించే అవకాశాన్ని బీఆర్ఎస్ కోల్పోయిందని, జూరాలకు 50 టీఎంసీల నీటి వినియోగానికి అవసరమైన రిజర్వాయర్లు కూడా నిర్మించలేదని అన్నారు. గట్టు, తుమ్మిళ్ల వంటి ప్రాజెక్టులను సైతం విస్మరించిందని ఆరోపించారు.ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వంద శాతం పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కృష్ణా జలాల్లో ఉన్న హక్కులను సాధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడుతుందని జూపల్లి పేర్కొన్నారు. రాష్ట్ర నీటి హక్కులను కాపాడుతూ తెలంగాణ ప్రయోజనాలను సాధిస్తామని స్పష్టం చేశారు.ఎల్నినో ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు అధికారులు సూచించిన ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. పంట కొనుగోలు, బోనస్ అంశాలపై బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం అసత్యమని, పాలమూరు జిల్లా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. సాగు, తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తున్నామని మంత్రి జూపల్లి వెల్లడించారు. -
కాంగ్రెస్ మీటింగ్లో ట్విస్ట్.. మాజీ సీఎం ‘గో బ్యాక్’ అంటూ నినాదాలు..
పంజాబ్ కాంగ్రెస్లో పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తున్న ‘హర్ బూత్, కాంగ్రెస్ మజ్బూత్’ సంస్థాగత కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ భూపేష్ బఘేల్కు వ్యతిరేకంగా కార్యకర్తలు నిరసన చేపట్టారు. ‘భూపేష్ బఘేల్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేయడంతో సమావేశం ఉద్రిక్తంగా మారింది.కాగా, పార్టీ ఇన్చార్జ్ భూపేశ్ బఘేల్, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ వేదికపై ఉన్న సమయంలోనే కొందరు కార్యకర్తలు ‘బఘేల్ గో బ్యాక్’ అని ముద్రించిన టీ షర్టులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ, మాజీ మంత్రి భారత్ భూషణ్ అషుకు అనుకూలంగా కూడా నినాదాలు చేశారు. అనంతరం, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నిరసనకారులను బయటకు వెళ్లాలని రాజా వారింగ్ కోరారు. దీంతో వారింగ్, అషు అనుచరుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.అనంతరం స్పందించిన రాజా వారింగ్.. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వచ్చిన వారు ఆర్ఎస్ఎస్ అనుకూల వర్గం అంటూ ఆరోపించారు. తమ కార్యక్రమాలను భంగం కలిగించే ప్రయత్నం జరుగుతుందనే ముందస్తు సమాచారం తమకు ఉందని చెప్పుకొచ్చారు. కొద్దిమంది మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యక్రమాలకు మంచి స్పందన వస్తోందని పేర్కొన్నారు. అయితే, రాజా వారింగ్ వ్యాఖ్యలను భారత్ భూషణ్ అషు అనుచరులు తీవ్రంగా ఖండించారు.‘మేము కాంగ్రెస్ కార్యకర్తలమే. మాకు కాంగ్రెస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం రాజా వారింగ్కు లేదు’ అంటూ వారు స్పందించారు.After posters controversy, T-shirts in Ludhiana। Picture Punjab Congress program. pic.twitter.com/fpCn0fUI7I— Parmeet Bidowali (@ParmeetBidowali) August 6, 2026మరోవైపు.. రాజా వారింగ్ మాట్లాడుతూ, గతంలో విజిలెన్స్ బ్యూరో కేసులో అషు అరెస్టు అయినప్పుడు ఎనిమిది రోజుల పాటు విజిలెన్స్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి ఆయనకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క నాయకుడి వ్యక్తిగత ఆస్తి కాదని, అందరి పార్టీ అని స్పష్టం చేశారు. మరోవైపు భూపేష్ బఘేల్ స్పందిస్తూ.. పార్టీ కార్యక్రమాలను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రమశిక్షణా ఉల్లంఘనలను ఏమాత్రం సహించబోమని, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్కు బయట ప్రత్యర్థులతో పాటు పార్టీలోనే ఉన్న ‘స్లీపర్ సెల్స్, ‘అంతర్గత విధ్వంసక శక్తులను’ కూడా గుర్తించి బయటకు పంపాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. -
‘పట్టభద్రుల ఓటర్ల నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోండి’
సాక్షి, రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)ను బూత్ స్థాయిలో పార్టీ పట్టును బలోపేతం చేసే కార్యక్రమంగా భావించి క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.గురువారం రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలోని దుర్గా కన్వెన్షన్ హాల్లో ఆయన అధ్యక్షతన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల కీలక సమావేశం జరిగింది. రాబోయే "హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్" పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలు, సర్ ప్రక్రియ పురోగతిని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షించి క్యాడర్కు మంత్రి శ్రీధర్ బాబు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు.పాత, కొత్త నాయకులు సమన్వయంతో వ్యవహరించి ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఎలాంటి భేదాభిప్రాయాలకు తావులేకుండా అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు అయ్యేలా పార్టీ శ్రేణులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. పట్టభద్రుల్లో ఓటరు నమోదు ప్రాముఖ్యతపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఓటరు నమోదును చేపట్టాలని, బూత్ స్థాయిలోని ప్రతి గ్రాడ్యుయేట్ను పార్టీ శ్రేణులు కలిసేలా కార్పొరేషన్ల చైర్మన్లు, అసెంబ్లీ, పార్లమెంట్ బాధ్యులు, జిల్లా అధ్యక్షులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.ఆ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న ఎన్నికల హామీల అమలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. అలాగే బీఆర్ఎస్, బీజేపీల వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులతో పాటు సంబంధిత పార్టీ బాధ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక ఉంటుందని, ఈ విషయంలో తుది నిర్ణయం హై కమాండ్దేనని తేల్చి చెప్పారు.ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుంచి సమన్వయంతో పనిచేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో చేరేలా మరియు తప్పులను సరిదిద్దేలా సర్ ప్రక్రియపై పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రకాష్ గౌడ్, కసిరెడ్డి నారాయణ రెడ్డి, అరికెపూడి గాంధీ, కార్పొరేషన్ ఛైర్మన్లు మల్ రెడ్డి రాంరెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, బండి రమేష్, డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్, నర్సింహా రెడ్డి, ధారా సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ రెడ్డిని ఓడిస్తా.. కాంగ్రెస్ ను భయపెడుతున్న PK కామెంట్స్
-
30 మంది రెబల్స్ భేటీ.. డీకేకు చెక్ పెట్టే వ్యూహం?
-
పంజాబ్ ఎన్నికల్లో ఆ పార్టీకే ఆధిక్యం.. బీజేపీకి భారీ ఎదురుదెబ్బ!
పంజాబ్లో 2027లో రాబోయే శాసనసభ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా జరగనున్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ చేపట్టిన తాజా మూడ్ సర్వేలో వెల్లడయింది. పంజాబ్ రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన విస్తృత క్షేత్రస్థాయి అధ్యయనం ప్రకారం... ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రధాన ప్రత్యర్థులపై స్వల్ప ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ విజయావకాశాల్లో ముందంజలో ఉంది. అయినప్పటికీ 2022 ఎన్నికల తరహాలో ఏకపక్ష తీర్పు కాకుండా ఈసారి ఎన్నికల సమరం పోటీగా ఉండబోతోందని స్పష్టమవుతోంది.మొత్తం 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 58 నుండి 63 సీట్లు గెలుచుకుని సాధారణ మెజారిటీ మార్కుకు అతి చేరువగా లేదా స్వల్పంగా దాటే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ మూడ్ సర్వే అంచనా వేసింది. ప్రతిపక్షంలో ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 36 నుండి 43 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచే అవకాశం ఉన్నది. కొత్తగా రాజకీయ అరంగేట్రం చేస్తున్న ‘వారిస్ పంజాబ్ దే’ (డబ్ల్యూడీ) పార్టీ 4 నుండి 7 సీట్లు గెలుచుకుని గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2 నుండి 6 సీట్లు, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడీ) 2 నుండి 4 సీట్లు గెలుపొందే అవకాశాలుండగా, ఇండిపెండెంట్లు, ఇతరులు మిగిలిన స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది.పార్టీల వారీగా ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ 37 శాతం, కాంగ్రెస్ 31 శాతం, వారిస్ పంజాబ్ దే 14 శాతం, బీజేపీ 8 శాతం, శిరోమణి అకాలీదళ్ 6 శాతం, ఇతరులు 4 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ మూడ్ సర్వే పేర్కొంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎలాంటి ముందస్తు పొత్తులు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతాయనే ప్రాతిపదికన ఈ అంచనాలు రూపొందించడం జరిగింది. 2022 నాటి ఏకపక్ష అనుకూల వేవ్ నుంచి పంజాబ్ రాజకీయాలు ఇప్పుడు ప్రభుత్వ పాలనా పనితీరు ప్రాతిపదికగా జరిగే పోరు వైపు మళ్లాయని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. గత ఎన్నికల్లో సాంప్రదాయ పార్టీలపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఆప్కు అనుకూల ప్రభంజనాన్ని సృష్టించగా, ఈసారి మాత్రం ఓటర్లు ప్రభుత్వం అందించిన సుపరిపాలన, సంక్షేమ పథకాల అమలు, నిరుద్యోగ నిర్మూలన-ఉపాధి కల్పన, వ్యవసాయ విధానాలు, ఆర్థిక నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణ, రాజకీయ నాయకుల విశ్వసనీయత ఆధారంగానే ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు.రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. 40 శాతం మంది ఓటర్లు ఆయనకే మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంటూ మద్దతు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీకి 33 శాతం మంది మద్దతు లభించగా, అమృత్పాల్ సింగ్కు 13 శాతం మంది మద్దతు తెలిపారు. ఇతర నాయకులకు అత్యల్ప ప్రజాదరణ లభించింది. ఈ సర్వేలోని అత్యంత కీలకమైన అంశం ఏంటంటే... ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పట్ల ఉన్న ప్రజాదరణకు, క్షేత్రస్థాయిలోని ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల ఉన్న అసంతృప్తికి మధ్య స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తున్నది. ముఖ్యమంత్రిపై వ్యక్తిగతంగా వ్యతిరేకత తక్కువగా ఉన్నప్పటికీ, అనేక నియోజకవర్గాలలో ఆప్ ఎమ్మెల్యేలపై స్థానికంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందే ఎక్కువమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి కొత్తవారికి అవకాశమిస్తే ఆప్ విజయావకాశాలు గణనీయంగా మెరుగుపడతాయని ఈ మూడ్ సర్వేలో వెల్లడయింది. ప్రభుత్వంపై కాకుండా స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతే ఓటర్ల ప్రవర్తనను శాసించనున్నట్లు సర్వే అంచనా వేసింది.రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలమైన గ్రామస్థాయి సంస్థాగత నిర్మాణాత్మక బలాన్ని కలిగి ఉండి, ఆప్కు ప్రధాన సవాలుగా నిలుస్తోంది. కాంగ్రెస్ నాయకుల్లో మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీకే అత్యధిక ప్రజాదరణ ఉన్నట్లు ఈ సర్వే వెల్లడయింది. కాంగ్రెస్ పార్టీ చన్నీని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి, పార్టీలోని అంతర్గత విబేధాలను నియంత్రిస్తూ సరైన అభ్యర్థులను పోటీలో నిలబెడితే అనేక నియోజకవర్గాల్లో ఆప్కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) రాజకీయ ప్రభావం రోజురోజుకీ క్షీణిస్తున్నట్లు సర్వే స్పష్టం చేసింది. అకాలీదళ్కు సాంప్రదాయ ఓటు బ్యాంక్గా ఉన్న సిక్కు 'పంథిక్' ఓటర్లు, ముఖ్యంగా అమృత్సర్, గుర్దాస్పూర్, తరణ్ తారన్ వంటి సరిహద్దు జిల్లాల్లోని యువ సిక్కు ఓటర్లు వేగంగా 'వారిస్ పంజాబ్ దే' వైపు మొగ్గు చూపుతున్నారు. మత్తు పదార్థ రహిత పంజాబ్, సిక్కు అస్తిత్వ అంశాలపై స్పష్టమైన ప్రచారం చేయడంతో 'వారిస్ పంజాబ్ దే' కొన్ని ప్రాంతాల్లో కీలక శక్తిగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా దీని ప్రభావం పరిమితంగా ఉన్నప్పటికీ, కొన్ని కీలక నియోజకవర్గాల్లో సాంప్రదాయ ఓట్ల విధానాన్ని మార్చడం ద్వారా ఫలితాలను తలకిందులు చేసే సామర్థ్యం ఈ ఈ పార్టీకి ఉన్నది.పంజాబ్లో బీజేపీ తన దీర్ఘకాలిక విస్తరణ వ్యూహాన్ని కొనసాగిస్తున్నది. లూథియానా, జలంధర్, అమృతసర్, హోషియార్పూర్, పటియాలా, ఎస్.ఎ.ఎస్ నగర్ (మొహాలి) వంటి ప్రధాన పట్టణ నియోజకవర్గాల్లో పార్టీ ఓటు బ్యాంకు విస్తరించేందుకు కృషి చేస్తున్నది. పట్టణ ప్రాంత హిందూ ఓటర్లు, వ్యాపారులు, చదువుకున్న యువతలో ఆదరణ పెరిగినప్పటికీ, సిక్కు రైతాంగంలో తిరిగి నమ్మకాన్ని పునరుద్ధరించుకోవడం బీజేపీకి అతిపెద్ద సవాలుగా మిగిలిపోయింది. దీంతో కొన్ని పట్టణ స్థానాల్లో సీట్లు సాధించే అవకాశం ఉన్నా, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద మార్పును సృష్టించే పరిస్థితి బీజేపీకి ఇంకా రాలేదు.రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాతో పాటు కొంతమంది ఎంపీలు, ముఖ్య నేతలు ఆప్ని వీడటం పట్టణ ప్రాంతాల్లో రాజకీయంగా చర్చనీయాంశమైనప్పటికీ, ఎన్నికల ఫలితాలపై దీని తక్షణ ప్రభావం చాలా తక్కువగానే ఉంటుందని సర్వే నిర్ధారించింది. ఈ చేరికలు పట్టణ ప్రాంతాల్లో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచినప్పటికీ, సాధారణ ఓటర్ల ప్రాధాన్యతల్లో పెద్దగా మార్పు తేలేదు. ముఖ్యంగా గ్రామీణ పంజాబ్లో వ్యవసాయం, ఉపాధి, పాలన, స్థానిక అభ్యర్థుల బలం మాత్రమే ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. డేరా సచ్చా సౌదా, రాధా స్వామి సత్సంగ్ బియాస్, డేరా సచ్ ఖండ్ బల్లాన్, నామ్ధారి , నిరంకారి వంటి డేరాలు పంజాబ్లోని మాల్వా, దోఆబా ప్రాంతాల్లో దాదాపు సగం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సామాజికంగా గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. డేరాలు నేరుగా ఏ పార్టీకీ ఓటు వేయాలని ఆదేశాలు ఇవ్వకపోయినా, వారి సామాజిక ప్రభావం దగ్గరగా జరిగే పోటీల్లో ఫలితాలను ప్రభావితం చేస్తుంది. డేరాలతో మెరుగైన సంబంధాల వల్ల బీజేపీకి కొంత ప్రయోజనం కలిగే అవకాశం ఉన్నప్పటికీ, అది మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద విజయాన్ని కట్టబెట్టలేదని సర్వే విశ్లేషించింది.మొత్తంగా చూస్తే, 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సిద్ధాంతాల కంటే ఎక్కువగా ప్రజాపాలన, నాయకత్వ విశ్వసనీయత, అభ్యర్థుల ఎంపిక మరియు స్థానిక సమస్యల ఆధారంగానే జరగనున్నాయి. ఏకపక్ష ప్రభంజనాలు లేకుండా వందలాది నియోజకవర్గాల్లో హోరాహోరీ స్థానిక పోటీలు జరగనున్నాయి. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ స్వల్ప ఆధిక్యంలో ఉన్నప్పటికీ, అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు, సంస్థాగత బలం, ప్రజల అంచనాలకు తగినట్లుగా స్పందించే తీరుపైనే అంతిమ విజయం ఆధారపడి ఉంటుంది.పీపుల్స్ పల్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ డాక్టర్ రాజన్ పాండే పర్యవేక్షణలో, సీనియర్ పరిశోధకుడు అమిత్ ఓహ్లాన్ సమన్వయంలో 24 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లతో కూడిన 6 బృందాలు జూన్ 20 నుండి జూలై 31, 2026 వరకు (45 రోజుల పాటు) పంజాబ్లోని మాల్వా, మాఝా, దోఆబా ప్రాంతాలలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వేను నిర్వహించాయి. ‘సిస్టమాటిక్ స్ట్రాటిఫైడ్ రాండమ్ శాంప్లింగ్’ పద్ధతిలో వివిధ సామాజిక వర్గాలు, వృత్తులు, వయస్సు, ఆర్థిక నేపథ్యాలు కలిగిన ఓటర్లతో ముఖాముఖి సంభాషించి మొత్తం 8,000 మంది ప్రతినిధుల నుండి శాంపిల్స్ సేకరించి ఈ నివేదికను తయారు చేశారు.-'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే. -
30 ఫ్లస్.. డీకేకు చెక్ పెట్టే వ్యూహమా?
కేబినెట్ విస్తరణ తర్వాత కర్ణాటక కాంగ్రెస్లో మొదలైన అసంతృప్తి మరింత తీవ్రరూపం దాలుస్తోంది. మంత్రి పదవులు దక్కని సీనియర్ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు నిరసనలు కొనసాగిస్తుండగా.. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రం కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెబల్ నేతలు నేడు కీలక సమావేశం నిర్వహిస్తుండడం.. ఉత్కంఠను రేకెత్తిస్తోంది.ఇటీవల కర్ణాటక కేబినెట్ విస్తరణలో 19 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. అయితే పలువురు సీనియర్ నేతలు తమకు అవకాశం రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు నేతల అనుచరులు బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయం ఎదుట నిరసనలు కూడా చేపట్టారు. ముఖ్యంగా తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న నేతలు.. ప్రాంతీయ సమతుల్యత, సీనియారిటీ, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం వంటి అంశాలను తెరపైకి తెస్తున్నారు. కొన్ని జిల్లాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కలేదని, మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని కూడా అసంతృప్త నేతలు చెబుతున్నారు.ఇప్పటికే రాజీనామా చేసిన ఎమ్మెల్యే..మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తి చెందిన ఇండీ ఎమ్మెల్యే యశ్వంతరాయగౌడ పాటిల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ విషయంలో ఆయన వెనక్కి తగ్గాలని అనుకోవడం లేదని అనుచరులు చెబుతున్నారు. మరో నేత బేలూరు గోపాలకృష్ణ కూడా రాజీనామా ఆలోచనలో ఉన్నారు. వీరితో పాటు దినేశ్ గుండు రావు, ఎం. కృష్ణప్ప, ఆయన కుమారుడు ప్రియకృష్ణ, ఎం.సీ. సుధాకర్, ఆర్బీ తిమ్మాపూర్, రహీం ఖాన్ వంటి పలువురు నేతలు కేబినెట్ కూర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.మంత్రి పదవుల ఎంపికలో ప్రాంతీయ సమతుల్యత పాటించలేదని, సీనియర్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నేతలు తమ అనుచరులతో కలిసి నిరసనలు చేపట్టగా.. మరికొందరు పార్టీ నాయకత్వంపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.రాజీనామా చేస్తే నిమిషాల్లో ఆమోదిస్తా: డీకేఅసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామా హెచ్చరికలపై ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కఠినంగా స్పందించారు. రాజీనామా చేయాలనుకునేవారిని ఎవరూ ఆపలేరని, రాజీనామా లేఖలు వస్తే నిమిషాల్లో ఆమోదిస్తామని హెచ్చరించారు. “రాజకీయాల్లో రాజీనామాలు సాధారణం. పార్టీ అన్నింటికంటే ముఖ్యం. ఓపికగా ఉండాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని, సహనం పాటించడం వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని అసంతృప్త నేతలకు సూచించారు. ఈ తరుణంలో.. డీకే శివకుమార్తో చర్చల అనంతరం కొందరు నేతలు మెత్తబడినట్లు సమాచారం.నేడు ఏం తేలనుంది?మంత్రి పదవులు దక్కని నేతలు నేడు రహస్యంగా భేటీ అవుతున్నట్లు సమాచారం. ఆ సమావేశంలో.. తమ డిమాండ్లు, పార్టీ నాయకత్వంపై ఒత్తిడి పెంచే మార్గాలు, భవిష్యత్ రాజకీయ వ్యూహంపై చర్చించనున్నట్లు సమాచారం. దాదాపు 30 మందికిపైగా ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ పెంచుతోంది. సీఎం డీకే వైఖరి కారణం.. అవసరమైతే రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించాలని కూడా వాళ్లు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రెబల్ ఎమ్మెల్యేల సమావేశం నేపథ్యంలో ఈ అసంతృప్తి ఏ స్థాయికి వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.అధిష్టానం రంగంలోకి..కర్ణాటక కాంగ్రెస్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ అధిష్టానం కూడా రంగంలోకి దిగింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలాను బెంగళూరుకు పంపింది. ఇప్పటికే ఆయన సీఎం డీకే శివకుమార్తో భేటీ అయ్యి ఈ అంశంపై చర్చించారు. ఇవాళో, రేపో అసంతృప్త నేతలతో చర్చలు జరిపి వివాదాన్ని సద్దుమణిగేలా చేయడమే లక్ష్యంగా హైకమాండ్ ప్రయత్నిస్తోంది.ప్రభుత్వానికి ముప్పు ఉందా?కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 113. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి 135 స్థానాలు గెలుచుకుంది. అంటే మెజారిటీ మార్క్ కంటే 22 స్థానాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ 66, జేడీఎస్ 19 స్థానాలు గెలుచుకున్నాయి.అందుకే ప్రస్తుతం కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసినా.. ప్రభుత్వం పడిపోయేంత సంఖ్యాబలం సంక్షోభం లేదని పార్టీ ధీమాగా ఉంది. కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు బయటకు వెళితే తప్ప ప్రభుత్వానికి తక్షణ ముప్పు ఉండదన్న అంచనా ఉంది. అయితే సంఖ్యాబలం ఉన్నప్పటికీ.. సీనియర్ నేతల అసంతృప్తి కొనసాగితే అది డీకే శివకుమార్ నాయకత్వానికి, పార్టీ అంతర్గత ఐక్యతకు రాజకీయ సవాల్గా మారే అవకాశం ఉంది.ఇప్పటి వరకు మంత్రి పదవుల కోసం జరిగిన అసంతృప్తి.. నేడు జరిగే ఎమ్మెల్యేల సమావేశంతో ఏ మలుపు తిరుగుతుందన్నదే కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. రెబల్ ఎమ్మెల్యేలు ఏ నిర్ణయం తీసుకుంటారు? అధిష్టానం వారిని బుజ్జగిస్తుందా? లేదంటే డీకే శివకుమార్ కఠిన వైఖరినే కొనసాగిస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది. -
హాలోగ్రామ్.. సోలో పెత్తనం
సాక్షి, హైదరాబాద్: నామినేషన్..ఒకటీ రెండుసార్లు కాదు..ఏకంగా 8 సార్లు. ఇదే పద్ధతిలో ఒకే సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టారు. ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన టెండర్ ఒప్పందమే ఇప్పటికీ కొనసాగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా, ప్రభుత్వాలు మారినా సంస్థ (కన్సార్షియం) మాత్రం మారలేదు. రాష్ట్రంలో మద్యం బాటిళ్లపై అతికించే లేబుళ్ల సరఫరా కాంట్రాక్టును అప్పటి నుంచి ఇప్పటివరకు ఒకే సంస్థకు నామినేషన్ పద్ధతిపై కట్టబెడుతున్నారు. హాలోగ్రామ్లుగా పిలిచే ఈ లేబుళ్ల సరఫరా బాధ్యతను కొత్త సంస్థకు కట్టబెట్టేందుకు గతంలో ప్రయత్నాలు జరిగినా, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రయత్నాలు జరుగుతున్నా..అవి పేరుకు మాత్రమేనని, లోలోపల ఎప్పటికప్పుడు ‘సర్దుబాట్లు’ కొనసాగుతున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నిసార్లు సంబంధిత ఫైలు కదిలినా అది కార్యరూపం దాల్చక పోవడం, తాజాగా ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ జారీ చేసి రెండేళ్లవుతున్నా పాత సంస్థకే టెండర్ కొనసాగుతుండటం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. కాగా ఇదే సంస్థ కొత్తగా మరో ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడానికి కూడా ఈ ‘సర్దుబాటే’ కారణమని, పాత సంస్థను మార్చే హడావుడి కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమవుతోందని, ఈ లేబుళ్లకు సంబంధించిన ఏ ఫైలూ ముందుకు కదలడం లేదని ఎక్సైజ్ వర్గాలే అంటుండటం గమనార్హం. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు, సదరు సంస్థ ఇచ్చే ఆమ్యామ్యాలు..వెరసి ఈ నామినేషన్ తంతు ఏళ్ల తరబడి కొనసాగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సదరు సంస్థకు ప్రతి నెలా 15 కోట్ల లేబుళ్లకు గాను రూ.5 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లిస్తుండటం గమనార్హం. టెండర్ గడువు ఎప్పుడో ముగిసినా.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2013లో యూఫ్లెక్స్, శ్రీటెక్, సీ–టెల్ అనే మూడు సంస్థల కన్సార్షియంకు హాలోగ్రామ్ల టెండర్ ఖరారయ్యింది. 2018లోనే ఈ టెండర్ గడువు ముగిసింది. 2013 నుంచి 2018 వరకు ఐదేళ్ల పాటు టెండర్ ప్రకారం లేబుళ్ల సరఫరా జరగ్గా, ఆ తర్వాత నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టు గడువును పొడిగిస్తూ వస్తున్నారు. 2018 నుంచి గడువు ముగిసినప్పుడల్లా కొత్త టెండర్ నోటిఫికేషన్ కోసం ఫైలు కదలడం, ప్రభుత్వ పెద్దలతో సదరు కన్సార్షియం ‘అవగాహన’కు రావడం, ఫైలు వెనక్కి తిరిగి రావడం, మళ్లీ అదే సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టడం పరిపాటిగా మారిపోయింది. అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న ఓ వ్యక్తి మధ్యవర్తిత్వం వహించగా, మాజీ ఎంపీ వ్యవహారం నడిపారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడూ అదే తీరు.. ‘సర్దుబాటు’ తంతు కొనసాగిందనే విషయం తెలుసుకున్న ప్రస్తుత కీలక మంత్రి అగ్గిమీద గుగ్గిలం అయి వెంటనే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే అది తాజా ‘సర్దుబాటు’ జరిగే వరకు మాత్రమేనని, ఆ తర్వాత మళ్లీ పరిస్థితి యధాతథమేనని ఎక్సైజ్ వర్గాల సమాచారం. అయితే హాలోగ్రామ్ల సరఫరా కోసం తూతూ మంత్రంగా 2024లో ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్కు హాలోగ్రామ్లు సరఫరా చేసే ఆసక్తి ఉన్న సంస్థలు తమను సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ మేరకు 23 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఈ బిడ్లు దాఖలై దాదాపు రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు అది ఫైనల్ కాలేదు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటన్నది బహిరంగ రహస్యమేనని అంటున్నారు. ఇదే సమయంలో ఈ మద్యం లేబుళ్ల సరఫరా టెండర్ దక్కించుకునేందుకు తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న ఓ మీడియా అధిపతి ప్రయత్నం చేశాడని సమాచారం. కాగా ప్రస్తుత ప్రభుత్వంలో ఓ కీలక నేత సహకారంతో హాలోగ్రామ్ల సరఫరా టెండర్ కోసం ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న సంస్థతోనే ‘సర్దుబాటు’ జరగడంతో ఆ మీడియా అధిపతి తన ప్రయత్నాల నుంచి తప్పుకున్నారనే చర్చ ఎక్సైజ్ వర్గాల్లో జరుగుతోంది. రిజ్వీ విఫల యత్నాలు ఇదంతా జరుగుతుండగానే అప్పట్లో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన రిజ్వీ..ఈ లేబుళ్ల కాంట్రాక్టు ప్రభుత్వ రంగ సంస్థకు కట్టబెట్టాలని యోచించారు. ఈ మేరకు సెక్యూరిటీ సర్టిఫికెట్లు ముద్రించే నాసిక్లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్ను సంప్రదించారు. ఆ సంస్థకు ఉన్న సాంకేతిక నైపుణ్యం, ఎంత ధరకు హాలోగ్రామ్లు సరఫరా చేయగలరనే వివరాలను సేకరించారు. ఈ మేరకు నాసిక్ ముద్రణాలయానికి టెండర్ను ఇచ్చే ఫైలును కదిలించారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఆ ఫైలుకు మోక్షం కలగలేదు. పాత సంస్థ ఆధ్వర్యంలోనే ఇప్పటికీ హాలోగ్రామ్లు సరఫరా అవుతున్నాయి. కొసమెరుపు ఏమిటంటే.. ప్రస్తుతం లిక్కర్ (ఐఎంఎల్) బాటిళ్లకు మాత్రమే హాలోగ్రామ్లు సరఫరా చేస్తున్న సదరు పాత సంస్థ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది. మద్యం సీసాలతో పాటు బీర్ బాటిళ్లకు కూడా తామే హాలోగ్రామ్లు ఇస్తామని, అది కూడా నామినేషన్ పద్ధతిలోనే ఇవ్వాలని ప్రభుత్వంపై ‘అన్ని రకాలుగా’ ఒత్తిడి పెంచుతున్నట్టు సమాచారం. కాగా ఇందుకు సంబంధించి రేపోమాపో ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తొలినాళ్లలోనే అవినీతి మరకలు! మద్యం సీసా మూతపై అడ్డంగా అతికించి ఉండే లేబుల్నే హాలోగ్రామ్ అంటారు. దీన్ని హాలోగ్రాఫిక్ ఎక్సైజ్ అధెసివ్ లేబుల్ (హెచ్ఈఏల్ లేబుల్) అని కూడా పిలుస్తారు. తెలంగాణలో ఈ హాలోగ్రామ్లను హెడోనిక్ పాత్ ఫైండర్ సిస్టమ్ (హెచ్పీఎఫ్ఎస్) విధానంలో తయారు చేస్తున్నారు. అంటే ఒక మద్యం బాటిల్ను ఏ కంపెనీ తయారు చేసింది? తయారైన బాటిల్ ఏ డిపోకు వచ్చింది? అక్కడి నుంచి ఏ షాప్కు వెళ్లింది? ఏ సైజ్లో ఉందనే వివరాలు ఈ లేబుల్పై ఉంటాయి. ఈ విధానం ద్వారా ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయంలో కూర్చుని రాష్ట్రంలో సరఫరా అయ్యే ప్రతి మద్యం బాటిల్ పంపిణీ వ్యవస్థను ట్రాక్ చేయవచ్చు. ఈ లేబుల్స్ను సరఫరా చేసేందుకు 2013లో (ఉమ్మడి రాష్ట్రంలో) టెండర్ ఖరారు చేశారు. మూడు సంస్థల కన్సార్షియం ఈ టెండర్ను దక్కించుకుంది. వాస్తవానికి అప్పట్లోనే ఈ టెండర్ ఖరారు ప్రక్రియకు అవినీతి మరకలు అంటాయి. ఆ అవినీతి మరకలు తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా కొనసాగుతూనే ఉన్నాయని, పాత సంస్థకే గత ఎనిమిదేళ్లుగా నామినేషన్ పద్ధతిలో టెండర్ కొనసాగిస్తున్నారంటే ఆమ్యామ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఉమ్మడి రాష్ట్రంలో కుదుర్చుకున్న టెండర్ అగ్రిమెంట్ ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ టెండర్ దక్కించుకున్న కన్సార్షియంలోని మూడు సంస్థలు రెండు రాష్ట్రాల బాధ్యతలను అనధికారికంగా పంచుకున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో లేబుళ్ల సరఫరా బాధ్యతలు యూఫ్లెక్స్ చూస్తుండగా, ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారం, సాఫ్ట్వేర్ నిర్వహణను సీ–టెల్ అనే సంస్థ చూస్తున్నట్టు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 33 పైసలకు పెరిగిన ఒక లేబుల్ రేటు ప్రస్తుతం ప్రతి నెలా 15 కోట్ల లేబుళ్లను సదరు సంస్థ బేవరేజెస్ కార్పొరేషన్కు అందిస్తోంది. టెండర్ దక్కించుకున్న సమయంలో ఒక లేబుల్ను 22 పైసలకు సరఫరా చేస్తామని ఒప్పందం కుదరగా, అది క్రమంగా పెరుగుతూ ఇప్పుడు ప్రతి లేబుల్ సరఫరా రేటు 33 పైసలకు చేరింది. అంటే ప్రతినెలా రూ.5 కోట్లు, సంవత్సరానికి సుమారు రూ.60 కోట్ల విలువైన లేబుళ్లను ఈ సంస్థ సరఫరా చేస్తోందన్నమాట. మరి ఇందులో అసలు ఖర్చయ్యేది ఎంతో.. ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు, అధికారులకు సమర్పించే ఆమ్యామ్యాలు ఎన్నో అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అసలీ కాంట్రాక్టును ఇలా నామినేషన్ పద్ధతిన ఇంకెన్ని సంవత్సరాలు పొడిగిస్తారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. -
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను భవిష్యత్తు తరాలు క్షమించవు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని సమర్థించడం దురదృష్టకరమని, బాధ్యత గల నాయకులు యువతకు ఆదర్శంగా నిలవాలని, కానీ రాహుల్ గాంధీ ఆ దిశగా వ్యవహరించడం లేదని అన్నారు.పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని సరైన మార్గంలో నడిపించడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం బాధ్యత అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అలాంటి సందర్భాల్లో అసభ్యకరంగా మాట్లాడిన వారిని వెనుకేసుకురావడం సరికాదని, రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులను ఎవరైనా ఇదే విధంగా దూషిస్తే ఆయన అదే విధంగా స్పందిస్తారా అని ప్రశ్నించారు.అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనపై, తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు వచ్చినప్పటికీ ఆయన హుందాగా స్పందించారని, చిన్నారులు తప్పులు చేయడం సహజమని, వారిని సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత పెద్దలదేనని మోదీ సూచించారు. ఆయన స్పందనలో క్షమాగుణం, బాధ్యత మాత్రమే కనిపించగా, విద్యార్థిని స్వచ్ఛందంగా క్షమాపణ చెప్పడం భారతీయ సంస్కృతి, విలువలకు నిదర్శనమని మంత్రి అన్నారు.అలాగే, భారతీయ సంప్రదాయాలు పెద్దలను గౌరవించడం, తప్పు చేసిన వారిని క్షమించి సరైన మార్గంలో నడిపించడం వంటి విలువలను బోధిస్తాయని వారు గుర్తుచేశారు. ప్రతిపక్ష నాయకుడిగా యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా వ్యవహరించాల్సిన సమయంలో రాహుల్ గాంధీ బాధ్యతాయుత రాజకీయాలను విస్మరించారు. అయితే, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం అవమానకరమైన భాషను ప్రోత్సహించే నాయకులను భవిష్యత్తు తరాలు తిరస్కరిస్తాయని, దేశ ప్రజల ఆకాంక్షలకు గౌరవం ఇచ్చే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి యువత మద్దతు ఎప్పటికీ ఉంటుందని మంత్రి కిషన్రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి దక్కలేదు
కర్ణాటక: కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది, మా కష్టాల గురించి అడిగేవారే లేరని, అమ్మా నాన్న లేని అనాథలుగా అనిపిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంవై గోపాలకృష్ణ అన్నారు. మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్లో ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు మంత్రి పదవి దక్కకపోవడం ఆశ్చర్యంగా, అవమానంగా ఉందన్నారు. మంత్రివర్గ విస్తరణ లో అనేక లోపాలున్నాయన్నారు. నియోజకవర్గ ప్రజలు ఎక్కువగా బాధపడుతున్నారన్నారు. సిద్దుకు ఆప్తుడనని ఇవ్వలేదు: సుధాకర్ యశవంతపుర: తాజా మాజీ మంత్రి, చింతామణి ఎమ్మెల్యే డాక్టర్ ఎంసీ సుధాకర్ సీఎం శివకుమార్ను ప్రస్తావించకుండా ప్రభుత్వ ముఖ్యులు కారణమని ఎదురుదాడి చేశారు. వచ్చే రోజుల్లో గట్టి నిర్ణయం తీసుకోక తప్పదన్నారు. మంత్రి స్థానం తప్పడంపై స్పందిస్తూ, సిద్ధరామయ్య పనితీరును చూసి దగ్గరయ్యా, ఆ ద్వేషంతో నాకు మంత్రి పోస్టు ఇవ్వలేదని పరోక్షంగా సీఎంపై విమర్శలు చేశారు. గతంలో మంత్రులుగా ఉన్నవారికి మళ్లీ ఇచ్చారు, వారిలో ఏం చూసి ఇచ్చారో తనకు తెలియదన్నారు. -
కర్ణాటక కాంగ్రెస్లో బిగ్ ట్విస్ట్.. సీఎంకు షాకిచ్చిన మండలి చైర్మన్
కర్ణాటక రాజకీయాల్లో ‘రాజీనామా’ అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. కర్ణాటక శాసన మండలి చైర్మన్ బసవరాజ్ హొరట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తనకు ఫోన్ చేసి చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని కోరినట్లు వెల్లడించారు. అయితే ఈ విషయంలో బీజేపీ, జేడీఎస్ నాయకులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. ఈ క్రమంలో సీఎం డీకేకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు.ఇటీవల కాంగ్రెస్ అధిష్ఠానం కొంతమంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి మంత్రివర్గ విస్తరణకు మార్గం సుగమం చేయాలన్న చర్చలు రాజకీయ దుమారం రేపగా, ఇప్పుడు అదే చర్చ శాసన మండలికి చేరింది. మండలి ఛైర్మన్ బసవరాజ్ హొరట్టికి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఫోన్ చేసి రాజీనామా చేయాలని కోరినట్లు హొరట్టి స్వయంగా వెల్లడించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో హొరట్టి వెంటనే స్పందిస్తూ..‘ఛైర్మన్ను పార్టీ అధిష్ఠానం నిర్ణయించదు.. సభే ఎన్నుకుంటుంది. తొలగించాలంటే సభా నిబంధనల ప్రకారమే జరగాలి’ అని కౌంటర్ ఇచ్చారు. తన పదవీకాలం 2028 వరకు ఉందని, తనను తొలగించాలంటే సభలో అవిశ్వాస తీర్మానం తీసుకురావాల్సిందేనని హొరట్టి స్పష్టం చేశారు. ఈ అంశంపై బీజేపీ, జేడీఎస్ నేతలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.తనను తొలగించాలంటే కనీసం 10 మంది సభ్యులు 14 రోజుల ముందుగా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని, ఆ తర్వాత సభలో జరిగే ఓటింగ్ ఆధారంగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. 1956 నుంచి ఏ చైర్మన్ కూడా ప్రభుత్వం మధ్యలో రాజీనామా చేయించలేదని, తనను తొలగించడానికి ఎలాంటి కారణం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం 75 సభ్యుల కర్ణాటక శాసన మండలిలో కాంగ్రెస్కు 38 మంది సభ్యులతో మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలో హొరట్టి కొనసాగింపుపై రాజకీయ చర్చ మరింత వేడెక్కింది. దీంతో, ముఖ్యమంత్రి, మండలి చైర్మన్ మధ్య పొలిటికల్ ట్విస్ట్ చోటుచేసుకుంది.#WATCH | Bengaluru, Karnataka: On the removal and changes of names from the Karnataka Legislative Council Chairman's list, BJP leader Basavaraj Horatti says, “...Whatever decision is taken by the House, the House is supreme. I will go to the House. Whatever the House decides, I… pic.twitter.com/q9fnQJC0Ir— ANI (@ANI) August 3, 2026అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం శాసన మండలి చైర్మన్ పదవికి సలీం అహ్మద్ పేరును ఖరారు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇదే సమయంలో అసెంబ్లీ స్పీకర్గా జీఎస్ పాటిల్, డిప్యూటీ స్పీకర్గా ఏఎస్ పొన్నన్న, డిప్యూటీ చైర్పర్సన్గా ఉమాశ్రీ పేర్లను కూడా కాంగ్రెస్ ఆమోదించింది. కాగా, పార్టీ ముందుగానే చైర్మన్ పేరును ప్రకటించడంపై హొరట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధమని ఘాటుగా వ్యాఖ్యానించారు. -
ఎవరికి ఏ శాఖ ఇవ్వాలి?
కర్ణాటక: కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు గురించి సీఎం డీకే శివకుమార్ హైకమాండ్తో చర్చలు జరిపారు. కొందరు మంత్రులతో వ్యక్తిగతంగా మాట్లాడారు. గతంలో సిద్దరామయ్య సర్కారులో పనిచేసిన మంత్రులకు ఇప్పుడు అవే శాఖలను కేటాయించే అవకాశముంది. పాత మంత్రులు శాఖల మార్పును వాంఛిస్తున్నారు. మంత్రి కే.హెచ్.మునియప్ప ఆహారపౌరసరఫరాల శాఖకు బదులుగా సాంఘిక సంక్షేమ శాఖ ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో వ్యవసాయ శాఖను చూసిన ఎన్.చెలువరాయస్వామికి అదే శాఖను ఇస్తారని తెలుస్తోంది. సిద్దు హయాంలో మంత్రులుగా ఉండి, మళ్లీ ఇప్పుడు పదవులు చేపట్టిన శివరాజ్ తంగడగి, బీ.జేడ్ జమీర్ అహ్మద్ ఖాన్, సంతోష్ లాడ్, మధుబంగారప్ప, నాగేంద్ర, ఎస్.ఎస్.మల్లికార్జున్లకు పాత శాఖలే ఇచ్చినా ఆశ్చర్యం లేదు. కొత్త మంత్రులకు ఈ శాఖలు? కొత్తగా చేరిన రుద్రప్ప లమాణికి–ఎక్సైజ్, కే.ఎస్.బసవంతప్ప–పురపాలక, టీ.రఘుమూర్తి–ఎస్టీల సంక్షేమం, రిజ్వాన్ హర్షద్–ఉన్నత విద్య, పుట్టరంగశెట్టి–పశు సంవర్ధక, పట్టు, అజయ్సింగ్–చిన్న పరిశ్రమల–కే.ఎం.శివలింగేగౌడ, హెచ్.సీ.బాలకృష్ణ–అటవీ, పర్యావరణ, బసవరాజరాయరెడ్డి–న్యాయ, అసెంబ్లీ వ్యవహారాలు, విజయానంద కాశప్పనవర్–జౌళి, లక్ష్మణ్ సవది–సహకార, చక్కెర శాఖలు లభించే అవకాశముంది. -
నెక్ట్స్ ఇక తెలంగాణే
సాక్షి, హైదరాబాద్: పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ పూర్తయిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఇక తెలంగాణపై దృష్టి పెట్టనుందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితులను చక్కదిద్దడంలో భాగంగా అధికార మార్పిడి, మంత్రివర్గ విస్తరణ ప్రక్రియలు హైకమాండ్ చేపట్టింది. కర్ణాటకలో దశల వారీగా ఈ కార్యక్రమం పూర్తి చేసింది. ఇక రాష్ట్రం వంతే అనే అభిప్రాయం పార్టీవర్గాలు, ఆశావహుల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ రాజకీయ వ్యవహారాలపై కాంగ్రెస్ పెద్దలు దృష్టి పెడతారని, అందులో భాగంగా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణ ఫైలుకు ఈ నెలలో కదలిక వస్తుందని అంటున్నారు. అధిష్టానం నుంచి ఏ క్షణమైనా కబురు రావచ్చని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ బెర్తుపై ఎమ్మెల్యేల ఆశలుఈ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. విస్తరణకు అధిష్టానం గ్రీన్సిగ్నల్ ఇస్తే ఈ దఫాలో ఖాళీగా ఉన్న రెండు బెర్తులను భర్తీ చేయడంతో పాటు ప్రస్తుత మంత్రుల శాఖల మార్పునకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి కావడం, పలువురు ఎమ్మెల్యేలు కేబినెట్ బెర్తుపై ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ఎన్నికల మంత్రివర్గం కూర్పుపై అధిష్టానం పూర్తి స్థాయిలో కసరత్తు చేయనుంది. అయితే ఇటీవలæ పార్టీ ముఖ్య నేతలు, టీపీసీసీ సమన్వయ కమిటీతో అధిష్టానం భేటీ అయినప్పటికీ మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకు రాలేదు. కానీ కర్ణాటక ఎపిసోడ్ పూర్తయిన నేపథ్యంలో అక్కడి పరిస్థితులు సద్దుమణిగిన వెంటనే తెలంగాణపై హైకమాండ్ దృష్టి పెడుతుందని అంటున్నారు. -
అసంతృప్తి నేతలకు డీకే శివకుమార్ షాక్!
కర్ణాటక కాంగ్రెస్లో మంత్రి పదవుల కేటాయింపు తర్వాత మొదలైన అసంతృప్తి చర్చలకు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెక్ పెట్టారు. మంత్రి పదవులు దక్కకపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని ప్రకటించడంపై ఆయన నేరుగా స్పందించారు. ఈ క్రమంలో రాజకీయాల్లో రాజీనామాలు సర్వసాధారణమని.. దాన్నొక టీ కప్పులో తుపానుగా చూపించే ప్రయత్నం చేశారు.మంగళవారం ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ.. “రాజీనామా చేయాలనుకునేవారిని ఎవరూ ఆపలేరు” అంటూ వ్యాఖ్యానించారు. అయితే పార్టీతోనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని, పదవులు రాకపోయినా నేతలు ఓపికగా ఉండాలని సూచించారు.ఇటీవల కర్ణాటక కేబినెట్ విస్తరణలో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మంత్రి పదవి దక్కని సీనియర్ నేత యశ్వంతరాయగౌడ వి. పాటిల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. బేలూరు గోపాలకృష్ణ కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది.ఈ పరిణామాలపై స్పందించిన డీకే శివకుమార్.. గతంలో తాను కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నానని గుర్తుచేశారు. ధర్మ్సింగ్, సిద్ధరామయ్య ప్రభుత్వాల సమయంలో తనకు మంత్రి పదవి దక్కని సందర్భాలు ఉన్నాయని.. అయినా పార్టీ కోసం ఓపికగా ఉన్నానని చెప్పారు. “నాకు కూడా అప్పట్లో అవకాశాలు రాలేదు. నేను రాజీనామా చేయలేదు. జీ. పరమేశ్వర కూడా ఓపికగా ఎదురుచూశారు. పార్టీలో ఉంటేనే భవిష్యత్ ఉంటుంది” అని డీకే వ్యాఖ్యానించారు.మరోవైపు మంత్రి పదవి దక్కని నేతలకు తగిన బాధ్యతలు అప్పగిస్తామని డీకే శివకుమార్ ఇప్పటికే హామీ ఇచ్చారు. ప్రతి నాయకుడికి పదవి ఆశించడం సహజమేనని, అసంతృప్తిగా ఉన్న వారితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.కేబినెట్ విస్తరణ తర్వాత కాంగ్రెస్లో అసంతృప్తి బయటపడటం అధిష్ఠానానికి కొత్త తలనొప్పిగా మారింది. అయితే నేతల మధ్య సమన్వయం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇదే సమయంలో డీకే శివకుమార్ వ్యాఖ్యలు.. పదవుల కోసం ఒత్తిడి తెస్తున్న నేతలకు స్పష్టమైన సంకేతంగా మారాయి. పార్టీని వీడే నిర్ణయం వ్యక్తిగతమైనదే అయినప్పటికీ.. రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్లోనే కొనసాగాలని ఆయన సూచించినట్లు కనిపిస్తోంది. -
డీకే శివకుమార్కు బిగ్ షాక్ 12 మంది కాంగ్రెస్ MLAల రాజీనామా?
-
రేవంత్రెడ్డే క్రిమినల్ వేస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులను, చదువుకున్న యువతను ‘క్రిమినల్ వేస్ట్’గా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొనడం అత్యంత అవమానకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. పోటీ పరీక్షల కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న లక్షలాది మంది యువతను అవమానించే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు. నిజంగా క్రిమినల్ వేస్ట్ ఎవరైనా ఉంటే 89 కేసులు ఎదుర్కొంటున్న రేవంత్రెడ్డేనని, అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడమే కాంగ్రెస్ పార్టీ చేసిన అసలైన క్రిమినల్ వేస్ట్ అని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో రాహుల్గాందీ, రేవంత్రెడ్డి కలిసి ఇచ్చిన గ్యారంటీలు, యూత్ డిక్లరేషన్, రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ వంటి హామీలను అమలు చేయకుండా యువతను మోసం చేశారని విమర్శించారు. కనీసం తన ఎన్నికల అఫిడవిట్ను అయినా స్వయంగా నింపే సామర్థ్యం రేవంత్కు ఉందా? అని ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే విద్యాశాఖ మంత్రి బాధ్యత నుంచి వెంటనే తప్పుకోవాలని, రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ యువతకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ భవ¯న్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వేణు సూసైడ్ లేఖ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ ఖమ్మం జిల్లాకు చెందిన నిరుద్యోగి గడ్డం వేణు రాసిన సూసైడ్ లేఖ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పట్టే చార్జిషీట్ లాంటిదని కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్యోగాల హామీ అమలు కాకపోవడం వల్లే తాను తీవ్ర నిరాశకు గురయ్యానని వేణు తన లేఖలో పేర్కొన్న విషయాన్ని ప్రభుత్వం గమనించాలని అన్నారు. అయితే యువత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు, ఆత్మహత్యాయత్నాలకు పాల్పడొద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులపాటు నిర్వహించి యువతకు ఇచ్చిన హామీలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలని డిమాండ్ చేశారు. లేకుంటే యువతకు జరిగిన ద్రోహంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ తరఫున గట్టిగా ప్రశ్నిస్తామని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. కాళేశ్వరంపై అసత్య ప్రచారం కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు నీరు ఎలా వస్తోందో ప్రజలకు చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. గాయత్రి, మేడారం పంపింగ్ వ్యవస్థలు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమేనని గుర్తుచేశారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణను రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ముందుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం సిద్ధం చేసిన రాయదుర్గం–ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టును రద్దు చేసింది రేవంత్ ప్రభుత్వమేనన్నారు. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇటీవల దివంగతుడైన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిపైనా కేసులు పెట్టారని మండిపడ్డారు. పౌర సరఫరాలు, విద్యాశాఖ అవినీతి అంశాలను బయటపెట్టి ఈడీ, సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడినందుకే ఆయనను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. -
కర్ణాటక కాంగ్రెస్లో అసమ్మతి.. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేల రాజీనామా?
సాక్షి,బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర అసంతృప్తి బయటపడింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైన వేళ పార్టీలో తిరుగుబాటు వ్యక్తమైంది. కేబినెట్లో చోటు దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఇండి నియోజకవర్గ ఎమ్మెల్యే యశవంతరాయగౌడ వి. పాటిల్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమాణికి అందజేశారు.మరోవైపు సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ సైతం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి కాంగ్రెస్ అధిష్ఠానానికి షాక్ ఇచ్చారు. తమతో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు.ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కేబినెట్లోకి కొత్తగా 20 మంది మంత్రులను చేర్చుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే, వరుస రాజీనామాలు, ఎమ్మెల్యేల అసంతృప్తితో రాజధాని బెంగళూరులో తీవ్ర కలకలం రేగింది. ఈ పరిణామాల నేపథ్యంలో, కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. -
రాహుల్ గాంధీ మాట తప్పారు జాబ్ రాక విద్యార్థి సూసైడ్ నోట్
-
ఎమ్మెల్సీ.. ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి సభ్యుల (ఎమ్మెల్సీ) ఎంపికపై అధికార కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. నవంబర్లో ఖాళీ కానున్న మూడు గవర్నర్ కోటా స్థానాలు, వచ్చే ఏడాది మార్చిలో జరిగే రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయా స్థానాల్లో అభ్యర్థిత్వాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రాథమికంగా చర్చించారు. అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల కంటే తక్కువ సమయం ఉండగా వచ్చే మార్చిలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఆయా స్థానాల అభ్యర్థిత్వాలపై వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండింటికి పది మందికి పైగా.. నల్లగొండ–ఖమ్మం–వరంగల్, హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు వచ్చే మార్చిలోపు ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పట్టభద్రుల స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాణీదేవీ, తీన్మార్ మల్లన్న పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్లోనే ఓటరు నమోదు నోటిఫికేషన్ వస్తుందని రాజకీయ వర్గాల అంచనా. అప్పటి నుంచే ఓటర్ల నమోదు హడావుడి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాలకు పదిమందికిపైగా ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ స్థానానికి టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్స్ కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.ఆయనతోపాటు ఉపాధ్యాయ సంఘాల నేత, టీపీసీసీ అధికార ప్రతినిధి జి. హర్షవర్దన్రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరి సతీశ్ యాదవ్తోపాటు పలు విద్యాసంస్థల అధినేతలు కూడా పోటీ పడుతున్నారు. ఇక నల్లగొండ–ఖమ్మం–వరంగల్ స్థానం నుంచి తెలంగాణా డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతోపాటు ఖమ్మం జిల్లా యువనేత డాక్టర్ జి.లోకేశ్ యాదవ్, వరంగల్ జిల్లాకు చెందిన దొమ్మాటి సాంబయ్య, నమిండ్ల శ్రీనివాస్, కాశీరాం నాయక్, నల్లగొండ నుంచి చనగాని దయాకర్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై త్వరలోనే పూర్తిస్థాయి కసరత్తు ప్రారంభమవుతుందని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి.మిగిలిన సామాజిక వర్గాలకు.. గవర్నర్ కోటా కింద ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్, బస్వరాజు సారయ్యల పదవీకాలం నవంబర్లో ముగియనుంది. ఎస్సీ, ఓసీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురి పదవీ విరమణతో ఖాళీ కానున్న స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయాన్ని పాటించాలని అధిష్టానం భావిస్తోంది. ఇందులో రెండు స్థానాలు బీసీలకు, ఒకటి ఎస్సీలకు ఇవ్వాలనేది ఆ పార్టీ నేతల ఆలోచనగా కనిపిస్తోంది. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన తర్వాత గౌడ, ముస్లిం, మాల, వెలమ, లంబాడీ, ఎంబీసీ సామాజిక వర్గాలకు ఎమ్మెల్సీలుగా అవకాశమిచ్చింది. అందువల్ల నేపథ్యంలో ఈసారి మున్నూరుకాపు, యాదవ, పద్మశాలి, ముదిరాజ్, మాదిగ సామాజిక వర్గాలకు చెందిన నేతల పేర్లను పరిశీలించే అవకాశాలున్నాయి. ఒకవేళ ఓసీలకు ఇవ్వాల్సి వస్తే వైశ్య, బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గాలకు అవకాశం లభించనుంది. ఇదిలాఉండగా, దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి యువతకు అవకాశాలు కలి్పస్తారని, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఓసీలకు కేటాయిస్తారని, గవర్నర్ కోటాలో బీసీ, ఎస్సీలకు అవకాశమిస్తారనే మరో చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతుండటం గమనార్హం. -
కాంగ్రెస్తో పొత్తుకు ఆప్ రెడీ.. నెక్ట్స్ జరిగేదేంటి?
గోవాలో 2027 అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రతిపక్ష పార్టీలు కూటమి ఏర్పాటుపై ప్రాథమిక చర్చలు ప్రారంభించాయి. కాంగ్రెస్, గోవా ఫార్వర్డ్ పార్టీ చర్చలు ప్రారంభించగా, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.గోవా అసెంబ్లీలో 40 మంది సభ్యులు ఉంటారు. అసెంబ్లీ ఎన్నికలు 2027 ఫిబ్రవరి-మార్చిలో జరిగే అవకాశం ఉండటంతో పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో బీజేపీ ఇప్పటికే కనీసం 30 స్థానాలు గెలిచి రాష్ట్రంలో వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిరీశ్ చోడంకర్ మాట్లాడుతూ.. కూటమి ఏర్పాటుపై గోవా ఫార్వర్డ్ పార్టీ అధినేత విజయ్ సర్దేశాయితో చర్చలు జరిపినట్లు తెలిపారు. శనివారం దక్షిణ గోవాలోని ఫటోర్డాలో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్, జీఎఫ్పీ 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి.శనివారం జరిగిన చర్చలు ప్రాథమిక స్థాయిలో మాత్రమే జరిగాయని, కూటమిని కొనసాగించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చోడంకర్ తెలిపారు. "మళ్లీ సమావేశమై సీట్ల సర్దుబాటు సహా ఇతర విషయాలను ఖరారు చేస్తాం" అని ఆయన చెప్పారు.ఇదిలా ఉండగా, ఆప్ గోవా అధ్యక్షుడు వాల్మీకి నాయక్ పొత్తుపై నిర్ణయం తీసుకునేందుకు ఏర్పాటు చేసిన పార్టీ కమిటీని కలిశారు. ఆప్ సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్న పార్టీలతో పొత్తుకు సిద్ధంగా ఉందని, రాష్ట్రంలో అవినీతి బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడమే ప్రధాన లక్ష్యమని నాయక్ మీడియాతో చెప్పారు.ప్రస్తుతం గోవాలో 33 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది. ఇందులో 28 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఇద్దరు మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 40 స్థానాల్లో 20 స్థానాలు గెలిచింది. ఆ తర్వాత ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది.ప్రస్తుతం కాంగ్రెస్కు ముగ్గురు ఎమ్మెల్యేలు, ఆప్కు ఇద్దరు ఎమ్మెల్యేలు, గోవా ఫార్వర్డ్ పార్టీ, రివల్యూషనరీ గోవన్స్ పార్టీకి ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నారు. చర్చలు ప్రారంభం కావడంతో 2027 గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి వ్యూహాన్ని పరిశీలించడం ప్రారంభించాయి. -
‘నాకు సొంత ఇల్లే లేదు’.. భారీ మెజార్టీ ఇస్తేనే పోటీ చేస్తా : మంత్రి కోమటిరెడ్డి
సాక్షి,నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గ ప్రజలు తనకు భారీ మెజార్టీతో గెలిపిస్తామని ముందస్తుగా హామీ ఇస్తేనే తాను పోటీకి దిగుతానని ఆయన స్పష్టం చేశారు.ప్రజల పూర్తి మద్దతు, నమ్మకం ఉంటేనే రాజకీయాల్లో కొనసాగుతానని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తన రాజకీయ నిబద్ధతను,ఆస్తుల వివరాలను ప్రస్తావిస్తూ.. తనకు నల్లగొండలో సొంత ఇల్లు గానీ, తన సొంత గ్రామంలో ఎలాంటి భూములు గానీ లేవని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. తాను స్వార్థం కోసం కాకుండా, కేవలం ప్రజల సేవ కోసమే రాజకీయాలు చేస్తున్నానని అన్నారు.నల్లగొండ పట్టణాభివృద్ధిపై తనకున్న లక్ష్యాన్ని చాటిచెప్పిన ఆయన, నల్లగొండను సాధారణ పట్టణంలా కాకుండా ఒక అత్యాధునిక నగరంగా, రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ఇప్పటికే నల్లగొండను కార్పొరేషన్గా మార్చామని, రహదారులు, మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని మంత్రి వివరించారు. -
‘నామినేటెడ్’పై కాంగ్రెస్ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ వేగవంతం చేసింది. వ్యవసాయ పరపతి సహకార సంఘాల (పీఏసీఎస్) చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ కార్పొరేషన్లు, జిల్లా, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీకి అనుసరించాల్సిన విధివిధానాలను ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్లోని గాం«దీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్తో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వేం నరేందర్రెడ్డి సమావేశమై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిగా పార్టీ నాయకత్వం నిర్దేశించిన విధానాల ప్రకారమే చేపట్టాలని నిర్ణయించారు. సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ సూచనలకు అనుగుణంగా నియామకాలు చేపట్టాలని స్పష్టం చేశారు. నియామకాల విషయంలో స్థానిక నాయకత్వం అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు సముచిత గుర్తింపు కలి్పంచాలని సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలిసింది. ఆశావహుల పేర్లపై చర్చ ఉమ్మడి జిల్లాలకు నియమించిన ఇన్చార్జి మంత్రులు ఆయా జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాలకు సంబంధిత జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ఆయా నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులు, సీనియర్ నాయకులు హాజరై ఆశావహుల పేర్లపై చర్చించనున్నారు. స్థానిక పరిస్థితులు, పార్టీ బలోపేతానికి చేసిన కృషి, నాయకుల సేవలను పరిగణనలోకి తీసుకుని సమన్వయంతో నివేదిక సిద్ధం చేసి పీసీసీకి పంపాలని నిర్ణయించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో పార్టీ సంస్థాగత నాయకత్వానికి అధిక ప్రాధా న్యం ఇవ్వాలని గాం«దీభవన్లో జరిగిన సమావేశం నిర్ణయించింది.మొత్తం పోస్టుల్లో సుమారు 60 శాతం పదవులను గతంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసిన నాయకు లు, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, నియోజకవర్గ స్థాయి సీనియర్ నాయకులకు కేటాయించాలని నిర్ణయించారు. పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన వారికి గుర్తింపు కలి్పంచడమే ఈ నిర్ణయం ఉద్దేశమని పార్టీ వర్గాలు తెలిపాయి.నియామకాలలో సామాజిక న్యాయం పాటించాలని కూడా సమావేశం నిర్ణయించింది.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు తగిన ప్రాధాన్యం కలి్పస్తూ అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం ఉండేలా జాబితాలు రూపొందించాలని సూచించారు. సామాజిక సమతుల్యతతో పాటు ప్రాంతీయ సమతుల్యతను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నాయకత్వం నిర్ణయించింది.సీఎం, పీసీసీ చీఫ్ తుది నిర్ణయం జిల్లాల నుంచి వచ్చే నివేదికలను పరిశీలించిన అనంతరం అన్ని సంప్రదింపులు పూర్తి చేసి తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో చాలాకాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ త్వరలోనే పూర్తి కానుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పదవుల నియామకాల కోసం ఎదురుచూస్తున్న పార్టీ నాయకుల్లో ఈ పరిణామం ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
‘ప్రభుత్వానికి-గాంధీ భవన్కు ఎలాంటి విభేదాలు లేవు’
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి- గాంధీ భవన్కు ఎలాంటి విభేదాలు లేవన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ పార్టీ మహా సముద్రమని, అందులో చిన్న చిన్న సమస్యలు సహజమన్నారు. పార్టీకి-ప్రభుత్వానికి మధ్య అన్నదమ్ముల పంచాయతీ మాత్రమే ఉందన్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుందని, దాన్ని గ్యాప్ అనడం కరెక్ట్ కాదన్నారు. కోఆర్డినేషన్ ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఢిల్లీలో జరిగిందన్నారు. తమ అంతర్గత పంచాయతీలలో ఇతరులు దూరితే వాళ్లకే నష్టమన్నారు పొంగులేటి. ధరణి టెండర్ నుంచి భూ భారతి వరకూ SET(ప్రత్యేక విచారణ బృందం) విచారణ చేస్తుందన్నారు. ప్రోహిబిటెడ్ లిస్ట్లో బీఆర్ఎస్ ఎంత పెట్టింది - కాంగ్రెస్ ఎలా చేసింది లెక్కలు SET తీస్తుందన్నారు. రీ -సర్వే వల్ల 90శాతానికి పైగా భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. -
విద్యార్థులకు కావాల్సింది క్షమాభిక్ష కాదు మోదీజీ: రాహుల్
చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విద్యార్థుల ఆందోళనలను పట్టించుకోవడంలో విఫలమయ్యారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం ఆరోపించారు. విద్యార్థులకు ఆయన క్షమాభిక్ష కాదు, క్షమాపణ చెప్పాలని అన్నారు."భారత్ విద్యార్థులకు ఆయన క్షమాభిక్ష అవసరం లేదు. వారికి ఆయన క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉంది" అని రాహుల్ చెప్పారు. విద్యార్థులు తనపై చేసిన వ్యాఖ్యలను "క్షమిస్తున్నాను" అన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ రాహుల్ ఇలా అన్నారు.నీట్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను రాహుల్ కలుసుకుని ఓదార్చారు. ఈ భేటీ చెన్నై సమీపంలోని మహాబలిపురంలో జరిగింది. తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు దుఃఖంలో ఉండటాన్ని చూడటం కంటే బాధాకరమైనది మరొకటి లేదని రాహుల్ అన్నారు. ప్రాణాలు కోల్పోయిన ప్రతి యువకుడు, యువతి వెనుక జీవితాంతం బాధ మోసే కుటుంబం ఉంటుందని చెప్పారు.పలుసార్లు ప్రశ్నపత్రాల లీకులు జరగడం, పరీక్షలు రద్దు కావడం, ఎన్నో సంవత్సరాల సన్నాహాలు ఒక్క రాత్రిలో వృథా కావడం విద్యా వ్యవస్థలోని వైఫల్యాన్ని బయటపెట్టాయని అన్నారు. నిజాయితీగా లేని వ్యవస్థలో విద్యార్థులు నిజాయితీగా శ్రమించాలని అడుగుతున్నారని చెప్పారు.ప్రశ్నపత్రం లీక్ కారణంగా భవిష్యత్తు కోల్పోయిన ఒక్క విద్యార్థినైనా, దుఃఖంలో ఉన్న ఒక్క తల్లిదండ్రినైనా ప్రధాన మంత్రి కలవలేదని ఆయన విమర్శించారు. విద్యార్థులు, వారి కుటుంబాలు అనుభవిస్తున్న వేదనను కేంద్ర ప్రభుత్వం గుర్తించడంలో విఫలమైందని అన్నారు. -
కాంగ్రెస్ ‘గో’ రాజకీయం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ గోవుల చుట్టూ రాజకీయం దిశగా పావులు కదుపుతోంది. హిందుత్వ ఓట్లు గంపగుత్తగా బీజేపీ ఖాతాలో పడకుండా సంఘ్తో సంబంధం లేని ఓటు బ్యాంకును తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలను అసెంబ్లీ ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందు నుంచే మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్రెడ్డి త్వరలోనే గోవులను కేంద్రంగా చేసుకొని కీలక నిర్ణయం ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో గోరక్షణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం.. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారని.. త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది.కమిషన్ ఏర్పాటుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో గోమాత పూజ చేయాలని, ఈ కార్యక్రమానికి బతుకమ్మ తరహా ప్రాచుర్యం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే గోమాత దినోత్సవం నిర్వహించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలియవచి్చంది. తద్వారా గోజాతి సంరక్షణతోపాటు హిందుత్వ ప్రభావం ఉన్న ఓటర్లను ఆకర్షించే వ్యూహాన్ని అమలు చేయాలనేది సీఎం రేవంత్రెడ్డి ఆలోచనగా కనిపిస్తోంది. బోర్డు కావాలని అడిగితే.. వాస్తవానికి గత నెలలో రాష్ట్రంలోని గోశాలల నిర్వాహకులతో పశుసంవర్థక శాఖ సమావేశమైంది. ఈ సమావేశంలో భాగంగా రాష్ట్రంలోని 200కుపైగా గోశాలల నిర్వాహకులు తమ సాదకబాధలను ప్రభుత్వం ముందు పెట్టారు. గోసరంక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని పశుసంవర్థక శాఖ అధికారులు సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఏకంగా కమిషన్ ఏర్పాటు చేద్దామని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం గమనార్హం.ఈ నేపథ్యంలోనే బాలల సంక్షేమ కమిషన్ తరహాలోనే గోరక్షణ కమిషన్కు అధికారాలు కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. గోవుల సంరక్షణతోపాటు అన్ని గోశాలలపై పర్యవేక్షణ, గోశాలలకు విరాళాల విషయంలో పారదర్శకత, గోవధ, ఇతర అంశాల్లో ఫిర్యాదులపై కమిషన్ తుది నిర్ణయం తీసుకొనేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఏర్పాటు కానున్న ఈ కమిషన్లో పశుగణాభివృద్ధి, విజయా డెయిరీ, వెటర్నరీ యూనివర్సిటీ, గోశాలల నిర్వాహకులు, పశుసంవర్ధక శాఖ అధికారులను సభ్యులుగా నియమించనున్నట్లు సమాచారం. గోశాలలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. ఇప్పటికే రాష్ట్రంలోని మొయినాబాద్, యాదాద్రి, వేములవాడల్లో భారీ గోశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వంద ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న మొయినాబాద్ గోశాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇక రాష్ట్రంలోని 258 గోశాలలకు రిజి్రస్టేషన్ తప్పనిసరి చేయడమే కాకుండా ఆయా గోశాలలు సొంతంగా మనుగడ సాగించేలా ఆర్థిక పరపతి కల్పించే దిశలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. ఇక బతుకమ్మ పూజ తరహాలోనే గోమాత పూజను కూడా ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం తరఫున గిన్నిస్ రికార్డు సాధించేందుకు పశుగణాభివృద్ధి సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.ఈ సంస్థ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 1,500 మంది గోపాలమిత్రలు పనిచేస్తున్నారు. వారు ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల్లో ఏకకాలంలో గోవులను సమీకరించి వాటికి పూజ చేయబోతున్నామని తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ సింగం చరణ్ కౌశిక్ యాదవ్ ‘సాక్షి’కి తెలిపారు. అలాగే ఏటా సెపె్టంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట బీజేపీ చేసే హడావుడికి కూడా గోవుతోనే చెక్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రోజును గోమాత దినోత్సవంగా ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఫలితమిస్తున్న విరుగుడు బీజేపీని కౌంటర్ చేసేందుకు కొన్ని రాజకీయ వ్యూహాలు ఫలితాన్ని ఇస్తున్నాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ముఖ్యంగా 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీని ఎదుర్కొనేందుకు ఆ పార్టీ నేత కేజ్రీవాల్ ఓ టీవీ ఇంటర్వ్యూలో హనుమాన్ చాలీసా పఠించారు. ఆ తర్వాత కన్నాట్ప్లేస్లోని ఓ హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకున్నారు. బీజేపీకి పడాల్సిన హిందుత్వ ఓట్లకు గండి కొట్టేందుకు ఈ పరిణామం ఓ కారణమనే విశ్లేషణలు అప్పట్లో వచ్చాయి.అలాగే 2016లో జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే కొన్ని వారాల ముందు తన ఫాంహౌస్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయుత చండీ మహాయాగం నిర్వహించారు. అంగరంగ వైభవంగా ఈ యాగాన్ని నిర్వహించడం ద్వారా ఆయన తనలోని హిందుత్వవాదాన్ని బహిరంగంగా తెలియజేశారు. ఈ నేపథ్యంలో తాము హిందూ వ్యతిరేకులం కాదని బహిరంగ పర్చడం ద్వారా బీజేపీకి అనుబంధంగా లేని హిందుత్వ ఓట్లను ఆకర్షించవచ్చని కాంగ్రెస్ కూడా అంచనా వేస్తోంది. -
రెండు ఎమ్మెల్సీలనూ కొట్టాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో పట్టభధ్రులకు మరింత దగ్గరయ్యేలా, వచ్చే ఫిబ్రవరిలో జరిగే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలనూ గెలుచుకునేలా ఇప్పటినుంచే నేతలంతా పనిచేయాలని పీసీసీ సమన్వయ కమిటీలో నిర్ణయించారు. గ్రాడ్యుయేట్ స్థానాలకు ఆగస్టులోగా అభ్యర్థుల ఎంపికపై నిర్ణయానికి రావాలని నిశ్చయించారు. ఇందుకోసం మహబూబ్నగర్–హైదరాబాద్–రంగారెడ్డి జిల్లాలకు ఎన్నికల ఇన్చార్జిగా మంత్రి దామోదర రాజనర్సింహకు బాధ్యతలు కట్టబెట్టారు. ఆయన ఇతర మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్తో కలిసి అభ్యర్థిపై నిర్ణయానికి రావాలని నిర్ణయించారు. నల్లగొండ–ఖమ్మం–వరంగల్ స్థానానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డిలను ఇన్చార్జీలుగా నియమించారు.మంత్రులు తమ జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు (డీసీసీ), ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతో విస్తృతంగా చర్చించి.. ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ ద్వారా పార్టీ అధిష్టానానికి నివేదిక సమరి్పంచాలని నిర్ణయించారు. సెప్టెంబర్ నుంచి ఓటరు ఎన్రోల్మెంట్ ప్రక్రియను విస్తృతంగా జరపాలనే నిశ్చయానికి వచ్చారు. రెండు స్థానాలను గెలిపించుకునేలా ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా నేతలు కృషి చేయాలని అధిష్టానం సూచించింది. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ జాతీయ కార్యాలయం ’ఇందిరా భవన్’లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సర్’ప్రక్రియపైనా చర్చించారు. పార్టీ, ప్రభుత్వ మధ్య మరింత సమన్వయం, ప్రభుత్వ పథకాల ప్రచారంపై ఓ యాక్షన్ప్లాన్ను తయారు చేసే అంశంపై విస్తృత చర్చ జరిగింది. సెప్టెంబర్ 15 తర్వాతే కొత్త కార్పొరేషన్లు ఇక రాష్ట్రంలో ఇటీవల గడువు ముగిసిన కార్పొరేషన్లతోపాటు, కొత్త కార్పొరేషన్లకు చైర్మన్లు, ఇతర సభ్యుల నియామకాలను సెప్టెంబర్ 15 తర్వాత నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. రెండేళ్లపాటు పనిచేసిన కార్పొరేషన్ చైర్మన్లను కొనసాగించాలని కొందరు, వారిని పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని మరికొందరు వాదిస్తున్న నేపథ్యంలో దీనిపై తుది నిర్ణయానికి వచ్చేందుకు కొంత గడువు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అలాగే, రాష్ట్రంలో మిగిలిపోయిన సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల డీసీసీ అధ్యక్షుల ఎంపికకు మరోమారు ఏఐసీసీ పరిశీలకులను హైదరాబాద్ పంపాలని నిర్ణయించారు.సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు ప్రధాన పోటీదారుల్లో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై సందిగ్ధత నెలకొనగా, రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు నేతల పేర్లపై పీఠముడి నెలకొంది. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎంపికను ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని అధిష్టానం చెప్పినట్లు సమాచారం. ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్)పై ఇప్పటికే బీఎల్ఏల పనితీరుపై కమిటీ భేటీలో సంతృప్తి వ్యక్తంకాగా, వెనకబడిన నియోజకవర్గాల్లో మరింత దూకుడుగా ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. పథకాలకు ఇంటింటికీ చేర్చడానికి యాక్షన్ ప్లాన్: భట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ కేడర్, సంస్థాగత వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికీ చేర్చేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి సమన్వయ కమిటీలో సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ మాట్లాడుతూ, పారీ్ట–ప్రభుత్వ సమన్వయం, సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై చర్చించినట్లు తెలిపారు. -
ఓ పొలిటికల్ డిజైన్ ఉంది.. ఆ నెలలో చెబుతా: జగ్గారెడ్డి
సాక్షి, సంగారెడ్డి: ఆనాడు రాహుల్ గాంధీకి మాట ఇచ్చాను కాబట్టే.. ఈ ముడున్నరేళ్ల మా పార్టీ ప్రభుత్వ, రాజకీయ వ్యవహారాల గురించి మాట్లాడలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ‘‘నేనేదైనా మాట్లాడాలనుకుంటే ఢిల్లీ ట్రైన్ ఎక్కి రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాతే బయటికి వచ్చి మాట్లాడుతా. మనసులో ఒకటి పెట్టుకుని బయట మరొకటి మాట్లాడే వ్యక్తిని కాదు’’ అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.‘‘మూడున్నరేళ్ల క్రితం మా పార్టీలో లోపాలు ఉంటే బయట మాట్లాడాను. కార్యకర్తల వ్యవహారం, పార్టీ అంశాలపై అంతర్గతంగా, బహిరంగంగాను చర్చించాను. ఈ మధ్య పీఏసీ మీటింగ్లో అంతర్గతంగా మాట్లాడే విషయాలు కూడా బయటికి వస్తున్నాయని సమావేశానికి పోవడమే మానేశాను. పీఏసీ మీటింగ్కి వెళ్లి ఉంటే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను ఏఐసీసీ ఇంచార్జ్, సీఎం దృష్టికి తీసుకెళ్లేవాణ్ని. మళ్ళీ నేను మాట్లాడిన అంశాలు బయటకి వచ్చేవి.. అందుకే పోలేదు. ఈ మూడున్నర ఏళ్లుగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ, ప్రభుత్వ వ్యవహారాలను ఎక్కడ బహిరంగంగా, అంతర్గతంగా చర్చించలేదు’’ అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.‘‘ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ 40 మంది కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి పిలిచారు. అందులో నాకు ఆహ్వానం అందింది. ఆ సమావేశంలో రాహుల్ గాంధీతో 15 నిమిషాలు మాట్లాడాను. నేను సంగారెడ్డి రాంనగర్లోని రాంమందిర్ నుంచి విద్యార్థి నేతగా నా రాజకీయ ప్రయాణం మొదలై.. నేడు ఢిల్లీలో మీ నివాసానికి వచ్చి మీ ముందు కూర్చునే వరకు సాగిందని చెప్పాను. మీ ముందు ఒక రోజు ఇలా కూర్చొని మాట్లాడాలని అనుకున్నా.. ఇప్పుడు మాట్లాడుతున్నా నేను అనుకున్నది సాధించాను అని చెప్పాను..ఏ పార్టీ నుంచి ప్రధాన మంత్రి ఉన్నా అధికారంలో ఉన్నన్ని రోజులే గుర్తుపెట్టుకుంటారని చెప్పా. పదవులతో పని లేకుండా గుర్తు పెట్టుకునే వారిలో మీ కుటుంబమే ఉంటుందని చెప్పా. కానీ రాహుల్ గాంధీ కుటుంబాన్ని దేశ ప్రజలు చిరకాలం గుర్తి పెట్టుకుంటారని కూడా చెప్పాను. రాహుల్ గాంధీ నన్ను పక్కకి పిలిచి ఓ మాట చెబుతాను వింటావా అని అడిగారు. మీకు ఎవరిపై అయిన కోపం ఉంటే మీడియా ముందు మాట్లాడకండి. ఢిల్లీకి వచ్చి నాతో మాట్లాడండి అన్నారు. ఆనాడు రాహుల్ గాంధీకి మాట ఇచ్చాను కాబట్టే.. ఈ ముడున్నరేళ్ళ మా పార్టీ ప్రభుత్వ, రాజకీయ వ్యవహారాల గురించి మాట్లాడలేదు..రాజకీయంగా నాకు మనసులో ఓ కోరిక ఉంది. నాకు ఓ పొలిటికల్ డిజైన్ ఉంది. అది నవంబర్లో చెబుతా. ఈ మూడు నెలల కాలంలో రాజకీయంగా నాకు ఓ క్లారిటీ వస్తుంది. నాకు ఫ్యామిలీ కంటే పబ్లిక్, పాలిటిక్సే ముఖ్యం. నేను 24 గంటల పాటు పబ్లిక్, పాలిటిక్స్ గురించే ఆలోచిస్తా’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
‘నా వ్యాఖ్యల్లో తప్పులేదు.. క్షమాపణ చెప్పను’
సాక్షి,ఢిల్లీ: లోక్సభలో తనకు మాట్లాడే అవకాశం లేదని తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని, క్షమాపణలు చెప్పబోమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యనించారు. బుధవారం రాహుల్గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘విద్యార్థులపై పోలీసుల దుశ్చర్యకు కేంద్రహోంమంత్రి అమిత్ షానే బాధ్యత వహించాలి. పోలీసులు మేకులున్న లాఠీలతో విద్యార్థులను చావబాదారు. పెల్లెట్ గన్ తగిలి ఓ యువకుడు కన్ను పోవాల్సిన పరిస్థితి వచ్చింది.మహిళలు, మైనర్లపై కూడా దాడులు చేశారు. పోలీసులకు అమిత్షా ఆదేశాలైనా ఇచ్చి ఉండాలి.. ఆయనకు తెలియకుండా జరిగుండాలి’అని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా జరిగిన పేపర్ లీకేజీల నిరసనల సందర్భంలో, విద్యార్థి నిరసనకారులపై పోలీసుల కాల్పులు, లాఠీఛార్జీలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఆదేశాలు ఇచ్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అమిత్ షా ఆదేశాలు ఇచ్చారనడానికి రాహుల్ గాంధీ దగ్గర ఏవైనా రాతపూర్వక ఆధారాలు ఉంటే సభ ముందు ఉంచాలని, లేదంటే నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు సభకు క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని, అలాంటప్పుడు ఎందుకు క్షమాపణలు చెప్పాలని ప్రశ్నించారు. -
మల్లిఖార్జున ఖర్గే Vs జేపీ నడ్డా..దద్దరిల్లిన పార్లమెంట్..
-
సర్కార్ కీలక నిర్ణయం.. పథకాలకు ఈ కొత్త సర్టిఫికెట్ తప్పనిసరి
-
హైడ్రా రంగనాథ్ దూకుడుకు బ్రేక్.. రేవంత్ సర్కార్కు ఎదురుదెబ్బ?
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి పరిధి వారికి ఉంటుంది. సర్వాధికారాలు ఒకే వ్యవస్థకు ఉండవు. చెక్స్ అండ్ బేలెన్సెస్తో నడిచేదే ప్రజాస్వామ్యం. కాని దురదృష్టవశాత్తు కొన్నిసార్లు అధికారంలో ఉన్నవారు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుంటారు. కార్యనిర్వహణాధికారిగా ఉండవలసిన అధికారిక వ్యవస్థ కూడా ఇష్టారాజ్యంగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో చెప్పడానికి, హైదరాబాద్ లోని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా కనిపిస్తాయి. రంగనాథ్కు సమర్దుడైన అధికారిగా పేరు ఉండవచ్చు. కాని తనకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయన్న విషయాన్ని ఆయన విస్మరిస్తున్నారన్న విమర్శ కొంతకాలంగా వినిపిస్తున్నదే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేరుగా సంబంధ, బాంధవ్యం ఉండడం కావచ్చు.. లేదా తన సహజ ప్రవృత్తి కావచ్చు.. ఏదైనా కానీ.. న్యాయ వ్యవస్థను సైతం పదే,పదే దిక్కరిస్తున్నారన్న అభిప్రాయం వల్ల ఆయనకు చిక్కులు వచ్చిపడ్డాయి. ఏకంగా ఆయనను హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించడం తీవ్ర సంచలనం అయింది. రేవంత్ సర్కార్ కు పెద్ద ఎదురు దెబ్బే అన్నది అందరి అభిప్రాయం. రంగనాథ్ను ఈ సమస్య నుంచి గట్టెక్కించి,తన పరువు కాపాడుకోవడానికి రేవంత్ ప్రభుత్వం ఏ మార్గం అనుసరిస్తుందన్నది ఆసక్తికర అంశంగా ఉంది. రంగనాథ్ను బదిలీ చేయాలన్న కోర్టు ఆదేశం, కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకోవడమేనని ప్రభుత్వానికి చెందిన న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పదే,పదే కోర్టుధిక్కరణ కు పాల్పడుతున్నందున, ఇలాంటి అరుదైన ఆదేశం ఇవ్వవలసి వచ్చిందని కోర్టు తీర్పును సమర్ధించేవారు వ్యాఖ్యానిస్తున్నారు. న్యాయ వ్యవస్థకు, ప్రభుత్వ వ్యవస్థకు మధ్య ఇది ఘర్షణకు దారి తీస్తుందా?లేక మద్యే మార్గంగా రాజీ కుదురుతుందా అన్న తర్జనభర్జనలు సాగుతున్నాయి. ప్రభుత్వం ఈ తీర్పుపై అప్పీల్ కు వెళ్లినప్పుడు ఎలాంటి వాదన చేస్తుందన్నదానిపై ఈ వ్యవహారం ఆధారపడి ఉండవచ్చు. హైదరాబాద్ లో ప్రభుత్వ భూమిని ,ఆక్రమణలకు గురైన చెరువులను పునరుద్దరించడానికి ఈ హైడ్రా ను రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసింది.ఈ క్రమంలో కమిషనర్ గా నియమితులైన రంగనాథ్ కొన్ని చెరువులను పరిరక్షించారన్న పేరు తెచ్చుకున్నారు. అంతవరకు మంచిదే. కాని ఆయా చోట్ల ప్రైవేటు వ్యక్తుల, నిరుపేదల ఇళ్లను కూల్చివేసిన తీరు వివాదాస్పదం అయింది. హైడ్రా ఏర్పడిన తొలినాళ్లలో ఒక ఇంటిని కూల్చిన సన్నివేశంలో ఒక చిన్నారి తన పుస్తకాలను కూడా అధికారులు తీసుకోనివ్వలేదని మీడియా ముందు చెప్పిన వీడియో వైరల్ అయింది. అది రేవంత్ సర్కార్ కు తీరని చేటు చేసింది. అలాగే కొన్నిచోట్ల అపార్టుమెంట్లు, విల్లాలను తొలగించిన వైనం మధ్య తరగతి వారిలో తీరని ఆక్రోశం మిగిల్చింది.రూపాయి,రూపాయి కూడగట్టుకుని, బ్యాంకు లోన్లు తీసుకుని తాము ఇంటిని కొనుగోలు చేస్తే, సడన్ గా హైడ్రా వచ్చి వాటిని కూల్చితే తమ పరిస్థితి ఏమిటని అనేక మంది వాపోయారు.లే అవుట్ లకు అనుమతి ఇచ్చినప్పుడు, ఇళ్ల నిర్మాణం జరుగుతున్నప్పుడు ,విద్యుత్ తదితర సదుపాయాలు కల్పిస్తున్నప్పుడు అధికారులు ఎందుకు నివారించలేదన్న ప్రశ్న వస్తుంది. విచిత్రం ఏమిటంటే ప్రభుత్వమే ఒకవైపు అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేస్తుంటుంది.మరో వైపు అక్రమ నిర్మాణాలు అంటూ అదే ప్రభుత్వం కూల్చివేతలకు దిగుతుంది. చెరువుల గర్భంలో ఆక్రమణలకు పాల్పడి ,అనధికారికంగా నిర్మాణాలు చేస్తే చర్య తీసుకోవడం తప్పుకాదు.కొన్ని చోట్ల ఆయా కాలనీలవారు స్వయంగా హైడ్రాకు ఫిర్యాదు చేసిన నేపధ్యంలో కూడా చర్యలు చేపట్టారు. పార్కులను పరిరక్షించారు. మొత్తం మీద లక్షన్నర కోట్ల విలువైన భూములను ప్రభుత్వానికి అప్పగించామని హైడ్రా కమిషనర్ చెబుతున్నారు. అది నిజమే కావచ్చు. అయినా ఎందుకు ఇప్పుడు ఇలాంటి క్రైసిస్ లో పడ్డారు?కొన్ని ప్రైవేటు స్థలాలను కూడా ప్రభుత్వ భూములుగా పరిగణించి చర్య తీసుకున్నారన్నది ఆరోపణ. ఆ సంస్థలు ,వ్యక్తులు కోర్టును ఆశ్రయించి రక్షణ పొందినా,వాటిని పట్టించుకోకుండా రంగనాథ్ వ్యవహరించారన్నది విమర్శ. లోతుకుంట భూ వివాదం కూడా అలాంటిదే. 65 కోర్టు ధిక్కరణ పిటిషన్ లు ఆయనపై పడ్డాయంటే, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి పిటిషన్ లపై కోర్టు తీవ్రంగా స్పందించింది. కోర్టు ఆదేశాలను లెక్క చేయకపోవడంపై ఆగ్రహించింది. ఏకంగా హైడ్రాను గ్రీకు పురాణాలలోని పలు తలల రాక్షసుడిగా అభివర్ణించింది.కొద్ది రోజుల క్రితం కూడా హైకోర్టు ఒక వ్యాఖ్య చేస్తూ తాము సంయమనం పాటిస్తున్నామని, రంగనాధ్ కస్టడీకి ఆదేశించేవాళ్లమే అని హెచ్చరించింది.ఈ నేపధ్యంలో రంగనాధ్ క్షమాపణ కోరిన తీరును హైకోర్టు ఆక్షేపించింది. తాను పిటిషనర్ స్థలంలో జోక్యం చేసుకోలేదని,పిటిషనర్ ఆరోపణలన్నీ అవాస్తవమని, కోర్టు మరోలా అనుకుంటే క్షమించాలని అఫిడవిట్ లో పేర్కొన్నారు.ఇందులో నిజాయితీ లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. తీర్పు తర్వాత రంగనాద్ చేసిన వ్యాఖ్యలు కూడా గమనించదగినవే. నిజానికి ఒక అదికారిగా అంత సీరియస్ గా మాట్లాడి ఉండాల్సింది కాదేమో!భూకబ్జాదారులు ,లాండ్ మాఫియా వ్యక్తులు కోర్టులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఇది ఒకరకంగా కోర్టులతో మళ్లీ తగాదా పడినట్లే అవుతుందేమో తెలియదు. రాజకీయ వ్యవస్థలోని వారు ,రేవంత్ ప్రభుత్వంలోని బాధ్యులు ఆయన తరపున మాట్లాడి ఉంటే సమంజసంగా ఉండేదేమో!ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు పెద్దగా ముందుకు వచ్చినట్లు కనిపించదు. అదేదో రేవంత్ చూసుకుంటారులే అన్నట్లుగా ఉన్నారేమో అనిపిస్తుంది.ఊహించినట్లే రేవంత్ సమర్ధించుకోవల్సి వచ్చింది. భూకబ్జాదారులే కోర్టులలో కేసులు వేస్తున్నారని ఆయన అన్నారు.అంతేకాక గతంలో బిఆర్ఎస్ హయాంలో సి.ఎస్.గా పనిచేసిన సోమేష్ కుమార్ పై400 కోర్టు ధిక్కరణ కేసులు పడ్డాయని ఆయన గుర్తు చేశారు. హైడ్రా ను కొనసాగించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. రంగనాద్ బదిలీపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.కోర్టు తీర్పు ప్రతి చూశాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అంటే అప్పీల్ కు వెళ్లడానికే రంగం సిద్దం అవుతున్నదని అనుకోవచ్చు.న్యాయ వ్యవస్థ తన పరిధి దాటి ఆదేశాలు ఇచ్చిందన్నది ముఖ్యమంత్రి భావనగా కనిపిస్తుంది. అధికారి బదిలీ అన్నది ప్రభుత్వ అభీష్టం మేరకు జరుగుతుందన్నది ఆయన చెప్పకనే చెప్పారు.ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో అప్పుడే చెప్పలేం. లోతుకుంటలోని 10వేల కోట్ల రూపాయల విలువైన భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసిందని రంగనాద్ అంటున్నారు. ఇందులో నిజానిజాలను న్యాయవ్యవస్థకు మరింత గట్టిగా వివరించే ప్రయత్నం జరిగి ఉండాల్సింది. ఆక్రమణలలో ఉన్నవాటిని కూల్చడంలో హైడ్రా వివక్ష చూపుతోందన్న విమర్శ కూడా వచ్చింది. ఉదాహరణకు దుర్గం చెరువు ఎఫ్ టి ఎల్ లో ఉన్న ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చి,వారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేవరకు ఎందుకు ఆగారని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సమీప బంధువుల ఇళ్లు ఇందులో ఉండడమే కారణమని వారు ఆరోపిస్తుంటారు. దీనిపై హైడ్రా లేదా ప్రభుత్వం వివరణ ఇచ్చినట్లు కనిపించదు.రంగనాధ్ వ్యవహార శైలి చూస్తే తానేదో సర్వస్వతంత్రుడన్నట్లుగా అనిపిస్తుంటుందన్నది ఒక ఆరోపణ.ఆయన చిత్తశుద్దిని ఆక్షేపించడం లేదు కానీ.. దూకుడుగా ప్రవర్తించడాన్ని తప్పుపడుతున్నారు. కాగా రేవంత్ ఒక సందర్భంలో తాను హిట్లర్ మాదిరి ప్రవర్తిస్తానని, ఇరాన్ యుద్దంతో హైడ్రా కూల్చివేతలను పోల్చడం వివాదాస్పదం అయింది. హైదరాబాద్ లో వేల కోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయన్నది నిజం. కాని ఆ నెపంతో పేద,మధ్య తరగతివారి ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చడం ఎంతవరకు సమర్ధనీయం అన్నది ఆలోచించుకోవాలి. ఇందులో హ్యూమన్ ఫేస్ ను కూడా జోడించి చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదేమో. యుపిలో బుల్ డోజర్ రాజ్ నడుస్తోందని కాంగ్రెస్ పదే,పదే ఆరోపిస్తుంటుంది. అదే బుల్ డోజర్ రాజ్ ను తెలంగాణకు తెచ్చారని బిఆర్ఎస్ ఆరోపిస్తోంది.ఈ అంశాలన్నిటిని పరిగణనలోకి తీసుకుని రేవంత్ సర్కార్ జాగ్రత్తగా అడుగులు వేయకపోతే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం కూడా ఉండవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సమన్వయం లేదు.. కలహాలు పెరిగాయి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి జ్వాలలు, అంతర్గత పోరుపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం కొరవడటం.. జిల్లాల్లో మంత్రుల ఏకఛత్రాధిపత్యం.. ఎమ్మెల్యేల నియోజకవర్గాల స్థాయి అభివృధ్ధి పనుల్లో జాప్యంపై వరుసగా వస్తున్న ఫిర్యాదులపై రాష్ట్ర నాయకత్వాన్ని గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. కొన్ని నెలలుగా జిల్లాల స్థాయి నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు చోటుచేసుకుంటున్న పరిణామాలను పరిశీలించిన కాంగ్రెస్ హైకమాండ్, ప్రభుత్వం–పార్టీ మధ్య సమన్వయం గాడి తప్పుతోందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జితో జరిగిన సమావేశంలో పార్టీ వ్యవహారాలపై స్పష్టమైన హెచ్చరికలు చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అందరిదీ సొంత అజెండానే.. రాష్ట్ర పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు సహా భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ సోమవారం పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పరిస్థితి, సంస్థాగత వ్యవహారాల, ఎస్ఐఆర్ కొనసాగుతున్న తీరుపై రెండు గంటలపాటు చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి తెప్పించుకున్న నివేదికలు, ఇంచార్జీలు ఇచ్చిన నివేదికలపై అధిష్టాన పెద్దలు సమీక్షించారు. ప్రభుత్వ నిర్ణయాలు పార్టీ శ్రేణులకు చేరడం లేదని, పార్టీ నుంచి వచ్చే అభిప్రాయాలు ప్రభుత్వానికి వెళ్లడం లేదని, మంత్రులు–ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కొరవడిందని వచ్చిన నివేదికలపై గట్టిగానే చర్చ జరిగినట్లు సమాచారం. చాలామంది మంత్రులు తమ తమ శాఖలు, నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారని, జిల్లాల వారీగా పార్టీని సమన్వయం చేసే బాధ్యత కనిపించడం లేదన్న అభిప్రాయాన్ని పార్టీ పెద్దలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా మంత్రులు సొంత నియోజకవర్గాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, నిధుల కేటాయింపుల్లోనూ వారికి ప్రాధాన్యమిచ్చుకుంటూ జిల్లా ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు అందాయని రాష్ట్ర నేతల దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. మంత్రుల స్థాయిలోనూ, కార్పొరేషన్ పదవుల్లో ఉన్న నేతలు తమ సొంత అజెండా, సొంత ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నాలు తప్ప, పార్టీ ఇమేజ్కు పెద్దగా దోహదం చేయడం లేదన్న అంశంపై ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సందర్భంగానే ఎస్ఐఆర్ ప్రక్రియలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల భాగస్వామ్యం కొరవడిందన్న అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. షబ్బీర్..సామేల్..డీసీసీల వ్యవహారాలపై ప్రశ్నలు తమకు అందించిన నివేదికల్లోని అంశాలను ప్రస్తావిస్తూ కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నేతల నుంచి వివరణ కోరినట్లు తెలిసింది. ముఖ్యంగా యాదాద్రి దేవస్థాన పాలకమండలి ఎంపికలో జిల్లా నేతల అభిప్రాయాలను కోరకపోవడం, జిల్లా నేతలను విస్మరించారని ఫిర్యాదులు రావడం, పీసీసీని లక్ష్యంగా చేసుకుంటూ సీనియర్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యలు చేయడం, యూత్ కాంగ్రెస్ నేత వ్యవహారంలో జరిగిన వివాదం, ఇటీవల తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చుట్టూ జరిగిన పరిణామాలు, ఆయన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తీవ్రంగా స్పందించడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. మండల కమిటీల ఏర్పాటు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ప్రాధాన్యం కల్పిస్తున్నారన్న ఆరోపణలతో అనేక జిల్లాల నుంచి వచ్చిన ఫిర్యాదులపైనా మాట్లాడినట్లు తెలిసింది. అభివృద్ధి నిధుల కేటాయింపు, అధికార యంత్రాంగం స్పందన, స్థానిక సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యేల సూచనలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసిన అంశాలపైనా అధిష్టానం దృష్టి సారించినట్లు సమాచారం. రంగంలోకి హైకమాండ్ రాష్ట్ర పరిస్థితిని గాడిన పెట్టేందుకు హైకమాండ్ రంగంలోకి దింగింది. పార్టీ సమన్వయాన్ని కాపాడే క్రమంలో మొదటి అడుగుగా బుధవారం ఢిల్లీలో పార్టీ పీసీసీ సమన్వయ కమిటీ భేటీని నిర్వహించాలని నిర్ణయించింది. దీంతోపాటే.. మీనాక్షికి పార్టీ–ప్రభుత్వ సమన్వయాన్ని బలోపేతం చేసే బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. జిల్లాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహించడం, విభేదాలను అంతర్గతంగానే పరిష్కరించడం, బహిరంగ విమర్శలకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించే నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికీ వెనుకాడబోమని స్పష్టమైన కేతాలు ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. సీనియర్ నేతల విషయంలో అవసరమైతే హైకమాండ్ నేరుగా జోక్యం చేసుకుంటుందని, ఏఐసీసీ పరిశీలకులను పంపి అవసరమైన చర్యలకు దిగుతామనే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. -
కాళేశ్వరంపై ఉద్దేశపూర్వక రాజకీయాలు
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రస్తుతం కన్నెపల్లి వద్ద తగిన నీటి మట్టం ఉన్నందున పంప్హౌస్ల ద్వారా నీటిని ఎత్తిపోయే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం రైతులకు నీరు అందించడం లేదన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో గ్రౌటింగ్ పూర్తయిన తర్వాత పరిమిత స్థాయిలో నీటిని నిల్వ ఉంచి మూడు పంప్హౌస్ల ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని రిటైర్డ్ ఇంజినీర్లు సూచించారని తెలిపారు.సోమవారం కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక రాజకీయ ప్రేరేపితమైందని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే 48 గంటల్లో నివేదిక ఇచ్చారని, అందుకే దానిని బీఆర్ఎస్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదుం ఎన్డీఏ రిపోర్ట్ అని ఎద్దేవా చేశారు. రూ.8.5 కోట్లతో కాఫర్ డ్యామ్ నిర్మిస్తే నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని ప్రభుత్వ ఇంజినీర్లు నివేదిక ఇచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. తుమ్మిడిహెట్టి సాధ్యం కాకపోవడంతోనే నిపుణుల సూచనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేశామని చెప్పారు. ఐటీ ఉద్యోగాలు తగ్గాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ ఉద్యోగాల సంఖ్య తగ్గిపోయిందని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం ఐటీ టవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగించుకోవడంలో విఫలమైందన్నారు. ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీల్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వకపోవడంతో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని విమర్శించారు. టీ–ఫైబర్ ప్రాజెక్టును పూర్తి చేస్తే ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ ఉద్యోగాలు పెరుగుతాయని తెలిపారు. కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ పనులు రెండున్నరేళ్లుగా నిలిచిపోయాయని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్–కరీంనగర్ రైల్వే మార్గం విద్యుద్దీకరణతోపాటు మిడ్ మానేరు వద్ద రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మాణాన్ని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ సాధించిన విజయం తెలంగాణ యువత ప్రతిభను ప్రపంచానికి చాటిందని కేటీఆర్ అన్నారు. అర్ధరాత్రి బీజేపీతో కాంగ్రెస్ దోస్తీ: ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ మధ్య అంతర్గత అవగాహన ఉందని, అర్ధరాత్రి వేళల్లో కాంగ్రెస్ నేతలు బీజేపీ నాయకులతో రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదా లు జరిగినా వివరాలు బయటకు రాకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. అక్కడ దొరికిన నగదును లెక్కించడానికి మిషన్లు కూడా సరిపోవట్లేదంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. -
జై జవాన్.. జై కిసాన్.. జై 'యువ'
సాక్షి, హైదరాబాద్: వికసిత్ భారత్ 2047, సబ్కా సాథ్ సబ్కా వికాస్ వంటి నినాదాలతో మాత్రమే మార్పు రాదని, యువశక్తిని సరైన దిశలో నడిపించి దేశ భవిష్యత్తుతో వారిని అనుసంధానం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. అందులో భాగంగానే ఒకప్పుడు ‘జై జవాన్, జై కిసాన్‘ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ‘జై జవాన్, జై కిసాన్, జై యువ‘ అనే నినాదంతో ముందుకెళుతుందని చెప్పారు. యువశక్తి ఇక రోడ్లపై పోరాడటమే కాదు, పార్లమెంట్లోకి రావడానికీ సిద్ధంగా ఉందని, చట్టాలను కేవలం పాటించడానికే కాదు, రూపొందించడానికీ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. వర్షాకాల సమావేశాల్లో లోక్సభ స్థానాల పెంపు, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లతో పాటు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే వయసును తగ్గించే అంశంపై కూడా చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నాలుగు అంశాలపై ఒకేసారి చర్చ జరగాలని, ప్రజాస్వామ్యంపై కేంద్ర ప్రభుత్వానికి నమ్మకం ఉంటే ఈ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేసి ప్రతిపక్ష పార్టీలు, భాగస్వామ్య వర్గాల అభిప్రాయాలు తీసుకుని దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే మంచి చట్టాన్ని రూపొందించాలని కోరారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం జాతీయ మీడియాతో మాట్లాడారు. విని, ఆలోచించి, చట్టం చేయాలి ‘ప్రదానమంత్రికి తెలంగాణ ప్రభుత్వం తరఫున నా డిమాండ్ ఒక్కటే. సీట్ల పెంపు, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్తో పాటు ఎన్నికల వయసు తగ్గింపు అంశాన్ని కూడా చర్చించండి. దేశంలో లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీ.. ఇలా ఎక్కడ ఎన్నికల వ్యవస్థ ఉన్నా అక్కడ చర్చ జరగాలి. ప్రజల స్వరమే దీనిపై తుది నిర్ణయానికి ఆధారం కావాలి. ప్రధాని మోదీ ఎప్పుడూ మాట్లాడడమే కాదు వినడమూ అలవర్చుకోవాలి. మీ పార్టీ, మీ వ్యవస్థలో మీరు చెప్పేది అందరూ వింటారు. ఎందుకంటే మీరు ఎప్పుడూ ‘మన్ కీ బాత్‘ పేరుతో ఆకాశవాణిలో మాట్లాడుతూనే ఉంటారు. మీకు మాట్లాడడం మాత్రమే అలవాటు. వినే అలవాటు లేదు. కానీ ఇప్పుడు వినడం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే దేశం మారుతోంది. దేశ ప్రజలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడడం ప్రారంభించారు. మీరు కొత్తగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. విని, ఆలోచించి, చట్టం చేయాలి. యువశక్తిని రాజకీయ వ్యవస్థలోకి తీసుకొస్తే దేశ భవిష్యత్తు మారిపోతుంది. 21, 25 సంవత్సరాలకు తగ్గించాలి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ ఎదుగుతుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయస్సు ఇంకా 25 సంవత్సరాలుగానే ఎందుకు ఉండాలి? అందుకే ఆగస్టు నెలను చరిత్రాత్మక నెలగా మార్చాలని నిర్ణయించాం. తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి సంయుక్త సమావేశాన్ని నిర్వహించి, ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకుని, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 21 సంవత్సరాలకు, రాజ్యసభ, శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసే వయస్సును 25 సంవత్సరాలకు తగ్గించాలని తీర్మానం చేసి ఆమోదించాలని నిర్ణయించాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. మోదీకి ఇది రెండో పరాజయం ‘దేశంలోనే అత్యంత శక్తివంతుడు తానేనని భావించే మోదీకి ఇది రెండో పరాజయం. రైతులకు వ్యతిరేకంగా నల్లచట్టాలు తెచ్చినప్పుడే రాహుల్గాంధీ హెచ్చరించారు. ఈ చట్టాలను దేశ ప్రజలు అంగీకరించరని, విరమించుకోవాలని సూచించారు. కానీ మోదీ తనను ఏమీ చేయలేరని భావించారు. రైతులకు క్షమాపణలు చెప్పాల్సి వస్తుందని నాడు రాహుల్గాంధీ చెప్పినా వినలేదు. చివరకు దేశ వ్యాప్తంగా రైతులు ఉద్యమబాట పట్టారు. ప్రాణాలు పోయినా వెనక్కు తగ్గకుండా ఉద్యమించి మోదీని వెనక్కు తగ్గించారు. ఆ మూడు నల్లచట్టాలను విరమించుకునేలా చేసి రైతులకు క్షమాపణలు చెప్పించారు. దాన్ని ఒక పాఠంగా తీసుకుని మోదీ మారతారని, ప్రతిపక్షానికి గౌరవం ఇస్తారని భావించాం. కానీ మారలేదు. పాత ధోరణినే కొనసాగించారు. ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి విద్యా రంగంలోనూ అదే పరిస్థితి కనిపించింది. యూజీసీ–నెట్ సహా అనేక పోటీ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. పరీక్షలు రాసిన విద్యార్థులు విఫలం కాలేదు.. పరీక్షలను సక్రమంగా నిర్వహించాల్సిన కేంద్ర ప్రభుత్వమే విఫలమైంది. ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ, నార్కోటిక్స్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి బెదిరించి విద్యార్థులను, వారి పక్షాన మాట్లాడిన వారిని నియంత్రించాలని ప్రయత్నించారు. దేశమంతా వీధుల నుంచి పార్లమెంట్ వరకు తమ శక్తిని యువత చాటింది. 56 అంగుళాల ఛాతీ అంటూ గొప్పలు చెప్పుకున్న అహంకారాన్ని ఓడించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే కాదు.. నీట్ ఘటనల్లో తమ పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు కేంద్రం ఆర్థికసాయం అందించాలి. విద్యార్థులపై పెట్టిన అన్ని క్రిమినల్ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి. రాహుల్గాంధీ కోరినట్టు అది జరగకపోతే యువశక్తి మరో ఉద్యమం చేపడుతుంది..’ అని రేవంత్రెడ్డి హెచ్చరించారు. ఈ విజయం ముమ్మాటికీ విద్యార్థులదే.. ‘మొదట దేశం, తర్వాత ప్రజలు, చివరగా పార్టీ. దేశ ప్రజల ప్రయోజనాల కోసం అవసరమైనప్పుడు కాంగ్రెస్ ముందు నిలబడుతుంది. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది, నిజాం పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసింది, స్వతంత్ర తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీనే. ఇప్పుడు యువత చేసిన ఉద్యమాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావించడం లేదు. ఈ విజయం ముమ్మాటికీ విద్యార్థులు, యువతదే. వారికి అండగా నిలబడడం కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా తీసుకుంది. పేదలను మరింత పేదలుగా మార్చడం బీజేపీకి ఎప్పుడూ అలవాటు. అందుకే చిన్న రాష్ట్రాలన్నింటికీ నష్టం జరిగేలా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడుతోంది. దీనికి శాస్త్రీయ పరిష్కారాన్ని కనుగొనాలి..’ అని సీఎం అన్నారు. -
ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.2,278.14 కోట్లకు పరిపాలనా అనుమతి, 2,009.23 ఎకరాల భూసేకరణకు ఆదేశాలు జారీ చేసింది. IAF కోసం 1,609.23 ఎకరాలు, సివిల్ ఏవియేషన్కు 400 ఎకరాలు వాడనుంది. జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్గా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేస్తారు. MRO, కార్గో, ప్యాసింజర్ సేవలకు ఎయిర్పోర్ట్ రూపకల్పన ఉండనుంది. భూసేకరణ, రోడ్ల మళ్లింపు, విద్యుత్ టవర్ల తొలగింపునకు నిధులు వాడతారు. హైటెన్షన్ లైన్లు, నీటి వనరుల మార్పునకు ప్రత్యేక ప్రణాళిక వేస్తున్నారు. 2026 డిసెంబర్ 31లోగా భూసేకరణ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన నిర్ణయం
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య (79) సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఆదివారం ప్రకటించారు. వయసు పెరగడం, ఆరోగ్యం బలహీనపడటం, రాజకీయాల్లో అవినీతి పెరగడమే ఇందుకు కారణమని చెప్పారు.ఎక్స్లో చేసిన పోస్టులో సిద్ధరామయ్య, ప్రజా జీవితంలో చురుగ్గా కొనసాగుతానని, కానీ ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. "రాజకీయ రంగం అవినీతిమయంగా మారిపోయింది. అందుకే నేను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను. అయితే రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ప్రజల కష్టసుఖాలకు గొంతుకగా నిలుస్తాను" అని పేర్కొన్నారు.తన వరుణ నియోజకవర్గ ప్రజలు మరోసారి పోటీ చేయాలని కోరుతున్నారని, కానీ ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. తన నిర్ణయానికి కారణం వివరిస్తూ.. ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం ముగిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయానికి తన వయసు 81 లేదా 82 ఏళ్లు ఉంటుందని సిద్ధరామయ్య తెలిపారు."ఇప్పుడు నా వయసు 79 ఏళ్లు. మా ప్రభుత్వ పదవీకాలం ముగియడానికి ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అప్పటికి నాకు 81-82 ఏళ్లు వస్తాయి. నా ఆరోగ్యం గతంలో ఉన్నంత బలంగా లేదు. ఇంతకుముందులా అదే ఉత్సాహంతో పని చేయడం ఇక సాధ్యం కాదు" అని అన్నారు.సిద్ధరామయ్య తన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానం గురించి కూడా ప్రస్తావించారు. 1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా ప్రజా జీవితంలో అడుగుపెట్టానని, 2028తో ఆ ప్రయాణానికి 50 ఏళ్లు పూర్తవుతాయని చెప్పారు."ఓటములు, విజయాలు రెండూ చూశాను. కానీ నేను నమ్మిన సిద్ధాంతాలకు విరుద్ధంగా ఎప్పుడూ వ్యవహరించలేదు. నా మనస్సాక్షిని ఎప్పుడూ మోసం చేయలేదు అన్న సంతృప్తి నాకు ఉంది" అని చెప్పారు. ఎన్నికల రాజకీయాల తీరు మారిపోయిందని సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు."ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రజలకు డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు రాజకీయాలు పూర్తిగా అవినీతిమయంగా మారిపోయాయి. నిజాయితీ రాజకీయాలకు నిలదొక్కుకునే అవకాశం కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇకపై ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను" అని పేర్కొన్నారు. ఎన్నికల రాజకీయాలకు వీడ్కోలు ప్రకటించినా, ప్రజల కోసమే పని చేస్తానని సిద్ధరామయ్య చెప్పారు. "50 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు నన్ను తమలో ఒకడిగా భావించి ప్రేమతో నడిపించారు. ఆ రుణం నా మీద ఉంది. అందుకే నా మిగిలిన జీవితం కూడా ప్రజాసేవకే అంకితం" అని పోస్టులో పేర్కొన్నారు. -
మాకు ఆత్మగౌరవం కావాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దళిత ప్రజా ప్రతినిధులు ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధపడ్డారు. పార్లమెంటు సభ్యులుగా, శాసనమండలి, శాసన సభ్యులుగా ప్రజాక్షేత్రంలో గెలిచినప్పటికీ... ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల వద్ద కనీస మర్యాద లేకపోవడం పరాజయం కంటే ఘోర అవమానంగా భావిస్తున్నట్లు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధిగా గెలిచినందుకే ఈ అవమానాలు పడాల్సి వస్తుందా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రజాప్రతినిధుల మాదిరిగా తమకు కూడా గౌరవ మర్యాదలు దక్కాలని, అందరితో సమానంగా ప్రభుత్వంలో సముచిత ప్రాధాన్యం పొందాలని వారు కోరుతున్నారు. ఇందులో భాగంగా ఎస్సీ ప్రజాప్రతినిధుల కమిటీ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ, కన్వీనర్ మల్లు రవి నేతృత్వంలో ఎస్సీ ఎంపీలు కడియం కావ్య, గడ్డం వంశీ, ప్రభుత్వ విప్లు అద్దంకి దయాకర్, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, ఏఆర్ నాగరాజు, మట్టా రాగమయి, మందుల సామేల్, కడియం శ్రీహరి తదితరులు శనివారం ప్రజాభవన్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి గోడును వెళ్లబోసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో విసిగిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో గెలిపిస్తే... ఆయా ఎస్సీ ప్రజాప్రతినిధులకు ఏమాత్రం గౌరవం దక్కడం లేదంటూ ఉపముఖ్యమంత్రి ఎదుట వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ నియోజకవర్గాల్లో డివిజన్ స్థాయి అధికారి నుంచి మండల స్థాయి అధికారి వరకు ఎవరికి బదిలీ అయినా తమ దృష్టికి రావడం లేదని, కనీసం కొత్త అధికారులకు పోస్టింగ్ ఇస్తున్న విషయం కూడా కనీస సమాచారం ఉండడం లేదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమంత్రితో సహా ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల పర్యటన వివరాలు కూడా తమకు తెలిడయం లేదని వివరించారు. ఈ అంశంపై జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులు, చివరకు కలెక్టర్ను అడిగినా స్పందన రావడం లేదని, సచివాలయంలోని సంబంధిత శాఖ కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే వారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఎస్సీ ప్రజాప్రతినిధులంతా మూకుమ్మడిగా భట్టి ముందు విన్నవించారు. ప్రాధాన్యత ఇస్తేనే నియోజకవర్గంలో పార్టీకి మరింత మంచిపేరు వస్తుందని, తదుపరి ఎన్నికల్లో మరింత మెజార్టీ వస్తుందన్నారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి భారీగా పెరుగుతోందని, కొందరు అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, వారితో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని వివరించారు. ఈ అవినీతిని అరికట్టకుంటే, అవినీతి అధికారులపై చర్యలు తీసుకుని వ్యవహారాన్ని కట్టడి చేయకుంటే భవిష్యత్లో పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందనే అంశాన్ని కూడా వివరించినట్లు తెలిసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల్లో సానుకూల వాతావరణం ఉందని, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతం అయ్యాయని, ఎస్సీ నియోజకవర్గాల్లో అదనంగా మరో వెయ్యి ఇళ్లు చొప్పున యూనిట్లు పెంచాలని ఎస్సీ ప్రజాప్రతినిధులు కోరారు. అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10 కోట్లు చొప్పున నియోజకవర్గ అభివృద్ధి నిధి ఇవ్వాలని కూడా వివరించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ తీసుకుని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పర్యటించాలని కోరినట్లు తెలిసింది. ఈ సమావేశంలో తుంగతుర్తి నియోజకవర్గ పంచాయతీ కూడా చర్చకు వచి్చనట్లు సమాచారం. ఎస్సీ ప్రజాప్రతినిధుల సమస్యలను సావధానంగా విన్న భట్టి వారికి నచ్చజెప్పినట్లు తెలిసింది. ఎస్సీ ప్రజాప్రతినిధుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఇకపై ఎలాంటి ఇబ్బందులున్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని భట్టి వారికి సూచించారు. అందరి ఐక్యతే పార్టీకి బలం అని, పార్టీకి నష్టం కలిగించే ఏ పనీ చేయవద్దన్నారు. తన పూర్తి సహకారం ఉంటుందని వారికి స్పష్టం చేశారు. అదేవిధంగా పార్టీనేతల మధ్య సమస్యలు వస్తే అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలని, లేకుంటే పార్టీ అధ్యక్షుడు, లేదా తన దృష్టికి తీసుకురావాలని, అలా కాకుండా రచ్చకెక్కితే మంచిది కాదంటే తుంగతుర్తి వ్యవహారంపై స్పందించినట్లు తెలిసింది. -
హైదరాబాద్: నెక్లెస్ రోడ్డులో కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: నెక్లెస్ రోడ్డులో కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. యువత సాధించిన విజయాన్ని మా ఖాతాలో వేసుకోవడం లేదని.. ఇది యువత సాధించిన విజయంగా పేర్కొన్నారు.’’రాజకీయ పార్టీలు కేవలం మద్దతు మాత్రమే ఇచ్చాయి. ఓటు హక్కు ను 18 ఏళ్లకే కల్పించి యువతను రాజకీయాల్లో రాజీవ్ గాంధీ ప్రోత్సహించారు. ప్రపంచంలో చాలా దేశాల్లో 18 ఏళ్ల యువతకు చట్టసభల్లో అవకాశం ఇచ్చారు. ఆగస్టు మొదటి వారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. 21 ఏళ్లకే చట్టసభల్లోకి వచ్చేలా యువతకు అవకాశం ఇవ్వాలని సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం’’ అని రేవంత్ చెప్పారు.మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ర్యాలీ నిర్వహించామని.. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు వేలాది మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారన్నారు. ఏకచ్ఛత్రాధిపత్యానికి వ్యతిరేకంగా యావత్ విద్యార్థి లోకం ఏకమైంది. నీట్ పరీక్ష సక్రమంగా నిర్వహించలేని దుస్థితి. చైనా చొచ్చుకొస్తుంటే అడ్డుకోలేని దుస్థితి. విద్యార్థి లోకానికి తలొగ్గి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు’’ అని ఆయన పేర్కొన్నారు. -
ఈ ప్రభుత్వాన్ని దించే సమయం వచ్చింది: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం మన విద్యా వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టే దిశగా చాలా పెద్ద అడుగని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. శనివారం ఆయన ఎక్స్లో వీడియో రూపంలో మాట్లాడారు.‘‘దేశవ్యాప్తంగా పోరాడిన విద్యార్థులందరికీ అభినందనలు. మీ అందరిని చూస్తుంటే గర్వంగా ఉంది. వీధుల్లోకి వచ్చి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, తమ భవిష్యత్తును కాపాడేందుకు ధైర్యంగా నిలిచిన ప్రతి యువకుడికి, ప్రతి విద్యార్థికి హృదయపూర్వక శుభాకాంక్షలు.ఇంకా 2 డిమాండ్లు మిగిలే ఉన్నాయి. విద్యార్థులను, భారత భవిష్యత్తును గౌరవిస్తూ ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలి. విద్యార్థులపై హింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. రైతులు, కార్మికులు, పేదలు, ఈ ప్రభుత్వం అణచివేసిన ప్రతి ఒక్కరూ తమ గౌరవం కోసం రాజ్యాంగబద్ధంగా పోరాడటమే నిజమైన ధైర్యం. ఈ ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి దించే సమయం వచ్చింది. భయపడొద్దు’’ అని పేర్కొన్నారు. धर्मेंद्र प्रधान का इस्तीफा हमारे education system को फिर से संवारने की दिशा में बहुत बड़ा कदम है। शाबाश देश भर के छात्रों, आप सभी पर गर्व है।सड़कों पर आ कर लोकतंत्र, संविधान और अपने भविष्य की रक्षा में डट कर खड़े होने वाले हर एक युवा, हर छात्र को बहुत-बहुत बधाई।2 मांगें… pic.twitter.com/Uc2cEOCVKA— Rahul Gandhi (@RahulGandhi) July 25, 2026 -
కోమటిరెడ్డి బ్రదర్స్తో అదే చెప్పా: ఎమ్మెల్యే సామెల్
సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్లో తుంగతుర్తి పంచాయితీ మరోసారి తీవ్ర విభేదాలను బయటపెట్టింది. కోమటిరెడ్డి బ్రదర్స్ తీరుపై తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా పర్యటనలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. తనకు టికెట్ ఇచ్చింది రాజగోపాల్రెడ్డి కాదని, ఏఐసీసీ అని స్పష్టం చేశారు.తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంలో రాజగోపాల్రెడ్డి పాత్ర లేదని ఎమ్మెల్యే సామెల్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టికెట్ నా చేతిలో లేదు.. రాజగోపాల్రెడ్డి చేతిలో అంతకన్నా లేదు. ఏఐసీసీ నాకు టికెట్ ఇచ్చింది. నన్ను గెలిపించింది రాజగోపాల్రెడ్డి కాదు.. పార్టీ’’ అని పేర్కొన్నారు.‘నాకు తెలియకుండా ఎలా?’తన నియోజకవర్గంలోకి రావాలంటే కనీస సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని సామెల్ అన్నారు. ‘‘నాకు తెలియకుండా నా నియోజకవర్గానికి ఎలా వస్తారు?’’ అంటూ ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు గౌరవం ఉండాలని పేర్కొన్నారు. ‘పార్టీలో నేనే ముందున్నా’కాంగ్రెస్లో తానే ముందునుంచి ఉన్నానని ఎమ్మెల్యే సామెల్ తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలో రాజగోపాల్రెడ్డిని గెలిపించేందుకు తన కేడర్ ఎంతో కష్టపడిందని, అయితే ఇప్పుడు అదే కేడర్ బాధపడుతోందని అన్నారు. ‘‘మునుగోడులో ఆయన్ను గెలిపించినందుకు నా కార్యకర్తలు బాధపడుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. రాజగోపాల్రెడ్డి గతంలో తన గెలుపుపై వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ‘‘నేను గెలుస్తా అని గతంలో రాజగోపాల్రెడ్డి చెప్పారు. అప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు. ఆ తర్వాత పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చారు’’ అని విమర్శించారు.కులాల ఓట్లపై ఆసక్తికర వ్యాఖ్యలుఎన్నికల సమయంలో సామాజిక వర్గాల ఓట్లపై కూడా సామెల్ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజగోపాల్రెడ్డికి మాదిగలు ఓటు వేశారు.. నాకు రెడ్లు ఓటేశారు’’ అని అన్నారు.‘ఎన్నిసార్లు కలిసినా రోడ్లు ఇవ్వలేదు’గతంలో తన నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదని ఎమ్మెల్యే ఆరోపించారు. ‘‘నేను ఎన్నోసార్లు కలిశాను. రోడ్లు కావాలని అడిగాను. చివరకు అటెండర్తో ఫోన్ చేయించినా వెళ్లి కలిసేవాడిని’’ అని పేర్కొన్నారు.కోమటిరెడ్డి బ్రదర్స్పై వ్యాఖ్యలుకోమటిరెడ్డి సోదరులు నియోజకవర్గ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని తాను చెప్పినట్లు సామెల్ వెల్లడించారు. ‘‘కోమటిరెడ్డి బ్రదర్స్ను ఇన్వాల్వ్ కానివ్వొద్దని చెప్పా. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు ఇకనైనా అధిష్టానం ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని అన్నారు. మొత్తంగా మునుగోడు కాంగ్రెస్లో ఎమ్మెల్యే సామెల్, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి తెరపైకి రావడంతో రాజకీయాలను మరింత వేడెక్కించాయి. -
విద్యార్థులను శత్రువులుగా చూస్తున్న మోదీ ప్రభుత్వం: సోనియా
న్యూఢిల్లీ: విద్యా వ్యవస్థలో సంస్కరణలు, అకౌంటబిలిటీ కోరిన పాపానికి మోదీ ప్రభుత్వం విద్యార్థులపట్ల క్రూరంగా ప్రవర్తిస్తోందని, ఈ దేశ భవిష్యత్తుగా కాకుండా శత్రువులా చూస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీప ఆర్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించార.ఉ. దేశ విద్యా వ్యవస్థను దిగజారుస్తున్న మోడీ ప్రభుత్వ డొల్లతనాన్ని ఈ దేశ విద్యార్థులు బట్టబయలు చేశారని వ్యాఖ్యానించారు. విద్యార్థుల పక్షాన నిలవడం నైతికంగానే కాకుండా రాజకీయ, రాజ్యాంగబద్ధ ధర్మం కూడా అని స్పష్టం చేశారు. నిరాశ నిస్పృహలను కలిగించే విద్యావ్యవస్థ, మోడీ ప్రభుత్వపు అహంకార ధోరణి, బాధ్యతారాహిత్యం వంటి అంశాలన్నీ నిరసనలకు దారితీయడం సహజ పరిణామమేనని సోనియాగాంధీ ‘ద హిందూ’పత్రికలో ‘ఆన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్, యంగ్ ఇండియాస్ ట్రామా’శీర్షికతో రాసిన కథనంలో పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి ఆధ్వర్యంలో పనిచేసే ఢిల్లీ పోలీసులు ‘ఛలో సంసద్’సందర్భంగా విద్యార్థులపై చూపిన క్రూరత్వం ఈ ప్రభుత్వ హయాంలో కొత్తేమీ కాదని, 2020లో సీఏఏ నిరసన ప్రదర్శనల సందర్బంగానూ పోలీసులు, పారా మిలటరీ బలగాలు దారుణంగా వ్యవహరించాయని, మహిళ రెజ్లర్లపై జరిగిన దమనకాండను కూడా ఈ దేశం మరచిపోలేదని అన్నారు. విద్యార్థులు ధైర్యంగా వేస్తున్న ప్రశ్నలకు ఈ ప్రభుత్వం పిరికితనంతో జవాబు చెబుతోందని, క్రూరంగా అణచివేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రశ్న పత్రాల లీకేజీని అరికట్టడంలో దారుణంగా విఫలమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేందుకు నిరాకరించడం ప్రజల మనసుల్లో గూడుకట్టుకుపోయిన ఆగ్రహానికి ఆజ్యం పోసిందని అన్నారు. ఎనీ్టయేను శక్తిమంతం చేసేందుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచి్చన సలహాలను బహిరంగంగానే తిరస్కరించడం ద్వారా ప్రధాన్ ధిక్కారాన్ని ప్రదర్శించడమే కాకుండా బాధ్యతారహితంగా వ్యవహరించారని ఆ కథనంలో ఆరోపించారు. -
నిధులు గప్పిన నిప్పు!
సాక్షి, హైదరాబాద్: నియోజకవర్గాల అభివృద్ధి నిధుల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో అంతర్గతంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ అధికారంలో ఉన్నందున తమ నియోజకవర్గాలకు ఎడాపెడా నిధులు తెచ్చుకుని అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల మనసులు గెలుచుకోవాలకున్న తమ ఆశలు అడియాసలుగానే మిగిలిపోతున్నాయంటూ పలువురు మథన పడుతున్నారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు పదుల కోట్లలో గత రెండున్నరేళ్లుగా పెండింగ్లోనే ఉండిపోవడం వారిలో అసంతృప్తిని రాజేస్తోంది.ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు, స్కూల్, అంగన్వాడీ బిల్డింగులు, నీటి సరఫరా పనులు, పైప్లైన్లు, మోటార్లు, బోర్ల ఏర్పాటు తదితర మౌలిక సదుపాయాల కోసం డబ్బులు సకాలంలో రాకపోవడంతో పనులు ఆగిపోతున్నాయని, సగం పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు రాకపోవడంతో చేతులెత్తేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.10 కోట్లు ఇచ్చారని, ఆ తర్వాత 9 నెలల కిందట నియోజకవర్గానికి రూ.5 కోట్లు అంటూ ఉత్తర్వులు జారీ చేసినా ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదని చెబుతున్నారు.గతంలో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లు తమ చుట్టూ తిరుగుతున్నారని, నిధుల కోసం ప్రభుత్వం వద్దకు వెళితే డబ్బుల్లేవనే సమాధానం వస్తోందని, ప్రభుత్వ పెద్దలను ఈ విషయమై పలుమార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోతోందని వివరిస్తున్నారు. ఇదిలావుండగా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా ప్రజాభవన్లో సమావేశాలు నిర్వహించినప్పుడు, పాత హామీలకు నిధుల కోసమే ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని, ఇలాంటి సమయంలో నియోజకవర్గాల్లో ఎలాంటి కొత్త హామీలు ఇవ్వొద్దంటూ డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేసినట్టు ఈ సమావేశాలకు హాజరైన పలువురు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఏం చేయాలో పాలుపోవడం లేదని అంటున్నారు. సన్నిహితుల వద్ద ఏకరువు.. నియోజకవర్గ అభివృద్ధి నిధుల విషయంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎక్కడా బాహాటంగా మాట్లాడలేకపోయినా తమ సన్నిహితుల వద్ద మాత్రం తమ అంతరంగాన్ని పంచుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఎడాపెడా హామీలిచ్చామని, ప్రజలు కూడా తమ హామీలు నమ్మి ఓట్లేస్తే..ఇప్పుడు ఆ పనులు పూర్తి చేసే పరిస్థితి లేదని అంటున్నారు. పరిస్థితి ఇలా ఉంటే మళ్లీ ఎన్నికలకు ఏం చెప్పి వెళతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల వద్దకు వెళితే అప్పుల లెక్కలు చెబుతున్నారని, కొత్తగా హామీలు ఇవ్వొద్దని ఆదేశిస్తున్నారని, దీంతో ప్రజలకు సంబంధించిన పనులేమీ చేయలేక పోతున్నామంటూ తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల నియోజకవర్గాలకు వందల కోట్లు ఎక్కడివి? తమ నియోజకవర్గాలకు నిధులు అడిగితే ఆర్థిక పరిస్థితి, అప్పుల గురించి చెబుతున్నారని, అలాంటప్పుడు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల నియెజకవర్గాలకు ఏకకాలంలో వందల కోట్ల నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటూ సన్నిహితుల వద్ద ఎమ్మెల్యేలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల నియోజకవర్గాలకు అడిగిందే తడవుగా నిధులు ఎలా మంజూరు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. నిజానికి కూడా ఈ తరహా అసంతృప్తి నేపథ్యంలోనే గతంలో పాలమూరు జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పలు సందర్భాల్లో ఎమ్మెల్యేలు కలిసినప్పుడు, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా నిధుల అంశమే హాట్ టాపిక్గా మారుతోంది. ముఖ్యంగా గత మూడు, నాలుగు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ విషయం చర్చనీయాంశమవుతోంది. అనిరుద్రెడ్డి దూకుడు! నియోజకవర్గ అభివృద్ధి నిధుల విషయంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరు««ద్రెడ్డి కొంత దూకుడుగానే వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడో తాను గెలిచిన కొత్తలో రూ.150 కోట్లకు రోడ్లు మంజూరయ్యాయని, తన గురువు, ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి ఈ రోడ్లు మంజూరు చేసినా.. ఇంకా రూ.50 కోట్ల మేరకు నిధులు రావాల్సి ఉందని ఆయన చెబుతున్నారు. ఈ విషయంలో తాను నేరుగా ఆర్థిక మంత్రిని కలుస్తానని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటానని అంటున్నారు. అవసరమైతే 10 వేల మందితో దీక్ష కూడా చేపడతానని ఆయన తన సన్నిహితులతో చెబుతున్నట్టు సమాచారం. కాగా ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హ్యామ్ రోడ్ల శంకుస్థాపనల కోసం పాలమూరు జిల్లాకు వెళ్లినప్పుడు కూడా అనిరు«ధ్ అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించారు. ఎప్పుడూ కోమటిరెడ్డి వెన్నంటి ఉండే ఆయన మహబూబ్నగర్కు వెళ్లి మంత్రిని పలకరించి వెళ్లిపోవడం పాలమూరు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. పలువురు ఇతర ఎమ్మెల్యేలదీ ఇదే అభిప్రాయం! అనిరు«ధ్తో పాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అంతర్గత సమావేశాల్లో ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. ఇటీవల దిల్కుషా గెస్ట్హాస్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ ఎమ్మెల్యేల సమావేశం జరిగినప్పుడు కూడా నియోజకవర్గంలో అభివృద్ధి పనుల గురించిన చర్చ వచ్చింది. తమకు కూడా నిధులు సరిగా ఇవ్వడం లేదని, సబ్ప్లాన్ నిధులను కూడా మంజూరు చేయడం లేదని పలువురు వాపోయినట్టు సమాచారం.మరోవైపు తమ నియోజకవర్గాల అభివృద్ధికి అదనంగా రూ.10 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సమావేశంలో తీర్మానం చేయడం గమనార్హం. కాగా ఈ అభివృద్ధి నిధుల విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 10–15 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడూ ఒకరితో మరొకరు టచ్లో ఉంటున్నారని, ఏం చేయాలనే దానిపై గుట్టుగా మంతనాలు జరుపుతున్నారని, ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయాలనే చర్చ కూడా వారి మధ్య జరుగుతున్నట్టు గాం«దీభవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రతిపక్షాలకు గుండు సున్నా.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (ఏసీడీపీ) కింద ఏడాదికి కొన్ని నిధులను ఎమ్మెల్యేలకు ఇచ్చే సంప్రదాయం కొనసాగుతోంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. అయితే ఈ పేరుతో ఇవ్వాలంటే అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సి వస్తుందనే ఆలోచనతోనే ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) పేరుతో ముఖ్యమంత్రి విచక్షణ మేరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులు కేటాయించాలని నిర్ణయించారు.ఆ మేరకు తొలినాళ్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలకు కూడా ఎస్డీఎఫ్ నిధుల కింద రూ.10 కోట్ల చొప్పున ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్లకు చెందిన ఎమ్మెల్యేలకు మాత్రం ఇంతవరకు నియోజకవర్గ అభివృద్ధి కోసం రూపాయి ఇవ్వకపోవడం గమనార్హం. అభివృద్ధి నిధులే కాకుండా ఇతర సంక్షేమ పథకాల అమల్లోనూ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, నియోజకవర్గాల్లో నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ తమకు అవకాశం ఇవ్వడం లేదని బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. రూపాయి కూడా ఇవ్వలేదు.. ‘గతంలో అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఏసీడీపీ కింద రూ.5 కోట్లు ఇచ్చే వారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన రెండున్నరేళ్లుగా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ఏసీడీపీ కింద ప్రభుత్వానికి అనేకమార్లు ప్రతిపాదనలు పంపినా ఆమోదించడం లేదు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు ఆర్దిక మంత్రి భట్టి విక్రమార్క దృష్టికి కూడా తీసుకెళ్లాం. విడుదల చేస్తామనే హమీ తప్ప ప్రయోజనం లేదు. గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన రూ.10 కోట్లలో పెండింగ్ ఉన్న వాటిని కూడా ఇవ్వడం లేదు. – కొత్త ప్రభాకర్రెడ్డి, కేపీ వివేకానంద (బీఆర్ఎస్) అసెంబ్లీలో ప్రస్తావించినా ఫలితం లేదు.. మా నియోజకవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావడం లేదు. ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యేలకు రూ.5 కోట్లు ఇస్తున్నా మాకు రూపాయి విదల్చడం లేదు. ఏఎస్డీపీ కింద ఇవ్వాల్సిన నిధుల కోసం అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించాం. సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రాలిచ్చాం. ఆర్థిక మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశాం. అయినా ఎలాంటి ప్రయోజనం లేదు. – బీజేపీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, పాయల్శంకర్ సరైన సమయంలో సరైన నిర్ణయం.. నాకు అన్నింటికంటే నియోజకవర్గ ప్రయోజనాలే ముఖ్యం. ఈ ప్రాంత ప్రజల గురించే నా ధ్యాసంతా. జడ్చర్ల ప్రజల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నా. మంజూరై రెండేళ్లయినా నిధులు రాక సగం పూర్తయిన ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు ఆగిపోయాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా. – జనంపల్లి అనిరుధ్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే (కాంగ్రెస్) -
అస్సలు సోనమ్ వాంగ్ చుక్ ఎవరు? : అభిజిత్ దీప్కే
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అంశంపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమం ఇప్పుడు కొత్త రాజకీయ మలుపు తిరిగింది. ఈ పోరాటానికి అసలు నాయకత్వం ఎవరిది? ఉద్యమ క్రెడిట్ ఎవరికి దక్కాలి? అనే అంశాలపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమించడంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.అస్సలు సోనమ్ వాంగ్చుక్ ఎవరు? ఆయన దీక్ష విరమిస్తే ఉద్యమం ఎందుకు ఆగాలి? అంటూ అభిజిత్ దీప్కే ప్రశ్నించారు. ఈ ఉద్యమం ఏ ఒక్క వ్యక్తికి సంబంధించినది కాదని, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రజా ఉద్యమమని స్పష్టం చేశారు.వాంగ్చుక్ దీక్ష విరమించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే తమ పోరాటం మాత్రం ఆగదని అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. ఈ ఉద్యమం కేవలం సోనమ్ వాంగ్చుక్ది కాదు. నాది కాదు. అలాగే ఏ రాజకీయ పార్టీది కూడా కాదు. ఇది విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కొనసాగే ప్రజా ఉద్యమం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్మంతర్లో మా ఆందోళన కొనసాగుతుంది’ అని ఆయన వెల్లడించారు.వాంగ్చుక్ నిర్ణయం సరైంది కాదుఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సోనమ్ వాంగ్చుక్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ మాట్లాడుతూ.. వాంగ్చుక్ను సామాజిక కార్యకర్త అన్నా హజారేతో పోల్చారు. అన్నా హజారే ఓ దశలో ఉద్యమం తర్వాత మౌనంగా వహించినట్లే ఇప్పుడు వాంగ్చుక్ కూడా అదే దారిలో నడుస్తున్నారు’అని వ్యాఖ్యానించారు.విద్యార్థుల ప్రతినిధులు లేకుండానే ప్రభుత్వ ప్రతినిధులతో మూసి తలుపుల వెనుక సమావేశమై వ్యక్తిగత ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతే వాంగ్చుక్ దీక్షను విరమించారని మసూద్ ఆరోపించారు. ఏ హామీల ఆధారంగా, ఏ పరిస్థితుల్లో దీక్ష విరమించారో దేశ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాజకీయ ప్రయోజనాల కోసం సోనమ్ వాంగ్చుక్ వంటి నిష్కళంక పర్యావరణవేత్తపై కాంగ్రెస్ అనవసర ఆరోపణలు చేస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ స్వయంగా వాంగ్చుక్ను కలిసి ప్రభుత్వ చర్యలను వివరించారని, పేపర్ లీకేజీలపై కఠిన చట్టాలు, ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటు వంటి అంశాలపై స్పష్టమైన హామీలు ఇచ్చిన తర్వాతే ఆయన గౌరవప్రదంగా దీక్షను విరమించారని బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ తెలిపారు.అయితే ఈ వివాదాల మధ్య అభిజిత్ దీప్కే చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ప్రధాన చర్చగా మారాయి. ఒక వ్యక్తి నిర్ణయంతో ఉద్యమాలు ముగిసిపోవని, ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం కేవలం పరీక్షల అవకతవకల అంశంగానే కాకుండా రాజకీయ పరంగా కూడా మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
రూ.6 లక్షలకే రూ.60 లక్షల ఫ్లాట్
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున పేదలకు గౌరవప్రదమైన సొంతింటిని అందించాలని ప్రజా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. నిరుపేదలు నివసిస్తున్న ప్రాంతంలోనే సొంతింటి కలను నెరవేర్చేందుకు నియోజకవర్గాన్ని యూనిట్గా ఎంపిక చేశామన్నారు. అక్కడే ఇందిరమ్మ టవర్స్ నిర్మించి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ఈ ఇళ్ల కోసం స్థానికంగా అందుబాటులో ఉన్న మీ సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మీసేవ వాట్సాప్ నంబర్(8096958096), మీ సేవ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూ.60 లక్షల విలువ ఉండే ఒక ఫ్లాట్ను కేవలం రూ.6లక్షలకు మాత్రమే ఇస్తున్నామన్నారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లు, దరఖాస్తులు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఆ తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియలో రిజర్వేషన్లు పాటిస్తామని, అన్ని వర్గాలకు ఇళ్లు ఇచ్చే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మొత్తం ఇళ్లలో 50శాతం ఇళ్లు రిజర్వేషన్ల పద్దతిలోనే కేటాయిస్తామని స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేయలేని పనిని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందన్నారు. లబ్ధిదారుల మీద ఆర్థిక భారం తగ్గించడానికి ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ ఇస్తోందని, ఇది విక్రయ ప్రక్రియ కాదని, ప్రభుత్వ ఆర్థిక సహకారం అని స్పష్టం చేశారు. లబ్ధిదారుడి వాటా అన్ని ప్రాంతాల్లో రూ.6 లక్షలు మాత్రమే అని అన్నారు. క్యూర్ పరిధిలో తొలి విడతగా ప్రయోగాత్మకంగా నిర్మించే ఇందిరమ్మ ఇళ్లలో యాజమాన్య హక్కుల రిజర్వేషన్కు సంబంధించి ఎస్సీలకు 14 శాతం, ఎస్టీలకు 5శాతం, బీసీలకు 16 శాతం, దివ్యాంగులకు 5 శాతం, ప్రభుత్వ అవుట్ సోర్సింగ్, 4వ తరగతి ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులకు 10 శాతం చొప్పున మొత్తం 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామన్నారు. ఈ 50 శాతం రిజర్వేషన్లలో 30 శాతం మహిళలకే కేటాయిస్తున్నామని, మిగిలిన 50 శాతం వాటా జనరల్ కేటగిరీకి మంజూరు చేస్తామన్నారు. -
సీఎం రేవంత్కు కేటీఆర్ లీగల్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు. గ్లోబేరినా టెక్నాలజీస్ అంశంలో చేసిన అసత్య ఆరోపణలపై 48 గంటల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్.. గ్లోబేరినా సంస్థతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు, యాజమాన్య హక్కులు లేవని స్పష్టం చేశారు.‘‘గ్లోబేరినా బినామీ కంపెనీ అనడం, సీబీఎస్ఈ కాంట్రాక్టులు ఇప్పించాననడం పూర్తిగా అవాస్తవం. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉండి బాధ్యతారహితంగా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని కేటీఆర్ హితవు పలికారు. రాజకీయ లబ్ధి కోసమే తన ప్రతిష్టను దెబ్బతీసేలా దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారని విమర్శలు గుప్పించారు. గడువులోగా క్షమాపణ చెప్పకుంటే సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తాం’’ అని కేటీఆర్ హెచ్చరించారు. -
షర్మిలకు షాక్.. YSRCPలో చేరిన కాంగ్రెస్ నేతలు
-
2027లో ఉత్తరప్రదేశ్ను ఏలేది ఎవరు?
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 2027 అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పటికే తారాస్థాయికి చేరింది. అధికార బీజేపీతో పాటు విపక్షాలైన సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి నుంచే తమ పావులు కదుపుతున్నాయి. రాష్ట్రంలో 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సామాజిక సమీకరణాలు, కులగణనలే అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీలు సరికొత్త వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి.బీజేపీ సరికొత్త వ్యూహం - సంస్థాగత బలోపేతంగత లోక్సభ ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని బేరీజు వేసుకున్న భారతీయ జనతా పార్టీ, ఓడిపోయిన స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించింది. వెనుకబడిన వర్గాల ఓట్లు పార్టీకి దూరమవ్వకుండా ఉండేందుకు క్షేత్రస్థాయిలో సంస్థాగత ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడంతో పాటు, హిందుత్వ, అభివృద్ధి అజెండాతో ముందుకు వెళ్తూ ప్రజల్లో మతపరమైన, సామాజిక ఐక్యతను చాటేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.ఎస్పీ ‘పీడీఏ’ ఫార్ములా - మారుతున్న సమీకరణలుసమాజ్వాదీ పార్టీ ఈసారి టికెట్ల కేటాయింపులో వినూత్న పద్ధతిని అనుసరిస్తోంది. కేవలం నాయకుల వ్యక్తిగత ప్రభావంపై ఆధారపడకుండా, ప్రతి నియోజకవర్గంలోని సామాజిక పరిస్థితులను క్షుణ్ణంగా అంచనా వేస్తోంది. కేవలం యాదవ, ముస్లిం ఓట్లకే పరిమితం కాకుండా, ఇతర వెనుకబడిన కులాలను కూడా తమ వైపునకు తిప్పుకోవడానికి ‘పీడీఏ’ (వెనుకబడిన, దళిత, అల్పసంఖ్యాక) నినాదంతో ముందుకు సాగుతోంది.మాయావతి ఒంటరి పోరుయూపీలో మళ్లీ అధికారం చేజిక్కించుకునేందుకు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఏ పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. పార్టీకి బలమైన పునాదిగా ఉన్న దళిత ఓటు బ్యాంకును తిరిగి నిలబెట్టుకోవడంతో పాటు, ఇతర వెనుకబడిన వర్గాలు, సవర్ణుల్లో కొంత భాగాన్ని ఆకట్టుకునేలా పాత సామాజిక ఇంజినీరింగ్ సూత్రాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ దూకుడు - కులగణన అస్త్రంరాష్ట్రంలో కోల్పోయిన పాత ప్రాభవాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా కులగణన అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, జనాభా ప్రాతిపదికన ప్రతి వర్గానికి సరైన ప్రాతినిధ్యం దక్కాలనే డిమాండ్ను బలంగా వినిపిస్తోంది. అంతేకాకుండా రైతులు, యువకులు, వివిధ సామాజిక వర్గాల నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసే పనిలో పడింది.ఓవైసీ ఎంట్రీతో మారుతున్న సమీకరణలుఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ రాక యూపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముస్లిం ఓట్లతో పాటు దళిత, వంచిత వర్గాలను కూడగట్టి సరికొత్త సామాజిక సమీకరణాన్ని తెరపైకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామం నేరుగా విపక్షాలైన ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల ఓటు బ్యాంకుపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.సామాజిక సమీకరణల ప్రాధాన్యత ఉత్తరప్రదేశ్ జనాభాలో వెనుకబడిన తరగతులు, దళిత, ముస్లిం కమ్యూనిటీలదే సింహభాగం ఉంది. దశాబ్దాలుగా ఇక్కడ ఏ కులం ఎంత బలంగా ఉందనే లెక్కలే ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తూ వస్తున్నాయి. యాదవ, కుర్మి, లోద్, నిషాద్ వంటి వెనుకబడిన కులాలు, ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల్లో పట్టు సాధించేందుకే అన్ని ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.ఇది కూడా చదవండి: గాంధీ నుంచి సోనమ్ వాంగ్చుక్ వరకు.. -
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
గన్ ఫౌండ్రి: దేశ రాజధానిలో రాహుల్ గాందీ, ప్రియాంకా గాంధీ తదితర నేతలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వగా, దేశ ప్రధాని నివాసం ఎదుట కాంగ్రెస్ వ్యవహరించన తీరును నిరసిస్తూ బీజేపీ గాం«దీభవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో బుధవారం గాంధీభవన్, బీజేపీ రాష్ట్ర కార్యాలయ పరిసర ప్రాంతాలు రణరంగంగా మారాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించాయి. ఈ క్రమంలో అక్కడే ఉన్న బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో పరిస్థితి విషమించింది. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకోవడంతోపాటు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక టీవీ జర్నలిస్టు, మహిళా కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. బీజేపీ ఆధ్వర్యంలో... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు గాం«దీభవన్ ముట్టడికి ప్రయత్నించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ విచి్ఛన్నకర రాజకీయాలు, రాహుల్గాంధీ దేశ వ్యతిరేక వైఖరిపై బీజేపీ పోరుబాట చేస్తుందని చెప్పారు. నీట్ పరీక్ష పత్రం లీకేజిపై పార్లమెంటులో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, రాహుల్ ప్రధాని నివాసం ముట్టడికి దిగడం ఆయన అపరిపక్వతకు నిదర్శనమని మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఆందోళనలో అసలు విద్యార్థులే లేరని, కేవలం సామాజిక విద్రోహ, ఆ్రల్టాలెఫ్ట్ మూకలను జమచేసి ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. అనంతరం గాం«దీభవన్ ముట్టడికి వెళ్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుని గోషామహాల్, అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఎన్.రామచందర్రావు, ఇతర బీజేపీ నేతల అరెస్ట్పై కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, ఎం.రఘునందన్రావు, బీజేఎల్పినేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, ఖండించారు. నీట్ ప్రశ్నపత్రం అంశంపై లోక్ సభలో చర్చకు సిద్ధమని కేంద్ర్రం ముందుకు వచ్చినా కూడా చర్చకు రాకుండా కాంగ్రెస్ రాజకీయం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని కిషన్రెడ్డి అన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజిపై విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్ బల్మూరు వెంకట్ డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు. కరీంనగర్లో ఉద్రిక్తత కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ నిరసన కరీంనగర్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నగరంలోని కార్ఖానగడ్డ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టి, కోర్టుసర్కిల్లోని అంబేడ్కర్ విగ్రహం వరకు డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి ఊహించని విధంగా సమీపంలో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం వైపు ర్యాలీ మళ్లింది. అప్రమత్తమైన పోలీసులు మేడిపల్లి సత్యంను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్ తదితరులు కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. కార్యాలయంలో ఉన్న బీజేపీ కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్రావు తదితరులు కర్రలతో కాంగ్రెస్ నాయకులపై దాడి చేశారు. కార్యాలయం గేట్ వేసి పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ, ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. చెప్పులు, కుర్చీలు విసురుకున్నాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసి కాంగ్రెస్ శ్రేణులను చెదరగొట్టారు. ప్రతిగా కాంగ్రెస్ కార్యాలయంపై దాడికి బీజేపీ నేతలు సిద్ధమవగా డీసీసీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ముక్కులో నుంచి రక్తం రావడంపై స్పందించిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నివాసం దగ్గర జులై 21న సాయంత్రం ధర్నాకు దిగిన కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా పలువురు ఎంపీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీని తరలించే సమయంలో ఆయన ముక్కులో నుంచి రక్తం వచ్చింది.దీనిపై ఇవాళ రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘పర్వాలేదు. అలాంటి దెబ్బలు తినడం నాకు కొత్త కాదు. ఎలాంటి ఇబ్బంది లేదు. అంతా బాగానే ఉంది. నా బాధ్యత భారత ప్రజల సంకల్పాన్ని వ్యక్తం చేయడం. విద్యార్థుల సంకల్పమైనా, యువత ఆకాంక్షలైనా, రైతుల గళమైనా వాటిని వినిపించడమే ప్రతిపక్ష నాయకుడిగా నా బాధ్యత. భారత ప్రజల గొంతుకగా నిలవాలి. ప్రజలు ఎందుకు బాధపడుతున్నారో దేశం దృష్టికి తీసుకురావాలి. ఇవి చాలా చిన్న మూల్యాలు. పెద్ద త్యాగాలు కావు. ప్రజల ఆకాంక్షల కోసం వారి వెంటే నిలబడే అవకాశం రావడం నాకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. అందుకే రెండు మూడు దెబ్బలు తగిలినా నాకు ఎలాంటి సమస్య లేదు. అవసరమైతే ఇంకా ఎన్నో దెబ్బలు తినడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను’’ అని రాహుల్ చెప్పారు. -
నీట్ ఆందోళనలపై కేంద్రం కీలక ప్రకటన
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశాన్ని రాజకీయ మైలేజ్ కోసం ఉపయోగించొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ప్రతిపక్షాలకు సూచించారు. పేపర్ లీకేజీ ఘటనలను రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా పలు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకైన ఘటనలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో ఇంటర్, పదో తరగతి పరీక్షలతో పాటు పంజాబ్లో గ్రూప్-డీ పరీక్ష, అలాగే కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా పేపర్ లీకేజీ ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.అలాంటి సందర్భాల్లో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని ప్రతిపక్షాలు, ఇప్పుడు నీట్ లీక్ అంశాన్ని మాత్రమే ఎందుకు హైలైట్ చేస్తున్నాయని జేపీ నడ్డా ప్రశ్నించారు. ఈ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని విమర్శించారు.నీట్ అంశంపై పార్లమెంట్లో సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎంతసేపైనా చర్చించేందుకు మేము సిద్ధం. సమస్యలకు పరిష్కారం పార్లమెంట్లో చర్చ ద్వారానే లభిస్తుంది. చర్చలకు పార్లమెంట్కు మించిన వేదిక మరొకటి లేదు’ అని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. -
అమ్మాయిల దుస్తులు చించేస్తారా..? బీజేపీ, కాంగ్రెస్ మధ్య డీల్ కుదిరిందా..?
-
వైఎస్సార్సీపీలో చేరిన ఒంగోలు కాంగ్రెస్ నేతలు
సాక్షి, తాడేపల్లి: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇవాళ (బుధవారం) వైఎస్సార్సీపీలో చేరారు. ఒంగోలు నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.నాగలక్ష్మి, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ సీనియర్ నాయకుడు డి.సతీష్బాబు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు.ఈ సందర్భంగా వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన వైఎస్ జగన్ భవిష్యత్తులో సమర్థంగా పనిచేయాలని ఆకాంక్షించారు. వైఎస్ జగన్ నాయకత్వం, ఆయన సిద్ధాంతాలు, లక్ష్యాలు, ప్రజల పట్ల నిబద్ధతతో కూడిన రాజకీయ జీవితం తమను ఎంతగానో ఆకర్షించాయని నాగలక్ష్మి, సతీష్బాబు వెల్లడించారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న వైఎస్సార్సీపీలో చేరడం సంతోషంగా ఉందని.. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. -
కేంద్ర సర్కారు ముందు రాహుల్ గాంధీ 3 డిమాండ్లు
న్యూఢిల్లీ: విద్యార్థులపై అమానుషంగా లాఠీఛార్జ్ చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో 152 సార్లు పేపర్లు లీకేజ్లు జరిగాయని తెలిపారు. అన్ని సార్లు పేపర్ లీకేజీలు జరిగితే ఒక్కరికి కూడా శిక్ష పడలేదని చెప్పారు. నిరసనలు తప్ప విద్యార్థులు చేసిన నేరం ఏంటని నిలదీశారు. దేశంలో విద్యా వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఎన్డీఏ సర్కారు పబ్లిక్ సెక్టార్లను ప్రైవేటీకరిస్తోందని చెప్పారు.3 డిమాండ్లు కేంద్ర సర్కారు ముందు రాహుల్ గాంధీ మూడు డిమాండ్లు పెట్టారు. ‘‘కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యార్థులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి, విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి’’ అని అన్నారు. "అందరికీ స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఏంటంటే, ఒకప్పుడు ప్రపంచంలో అత్యుత్తమ విద్యా వ్యవస్థల్లో ఒకటిగా పేరొందిన మన విద్యా వ్యవస్థ ఇప్పుడు అక్రమాలతో నిండిన వ్యవస్థగా మారింది. గత 10 ఏళ్లలో 152 ప్రశ్నాపత్రాల లీక్లు జరిగాయని మనకు తెలుసు. లెక్క వేస్తే నెలకు దాదాపు ఒకటి చొప్పున జరుగుతున్నట్టే. దీని ప్రభావం 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలపై పడింది. వీరంతా మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందినవారు. కష్టపడి సంపాదించిన డబ్బును పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తున్నారు. చివరికి వారి ఆశలను పూర్తిగా అవమానిస్తున్నారు.ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక్కరికీ శిక్ష పడలేదు. అంటే కొందరు వ్యక్తులు లేదా ఒక వర్గం మన విద్యా వ్యవస్థను, దేశంలో అత్యంత విలువైన సంపదైన విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం చేసింది? ఒక్క శిక్ష కూడా పడలేదు. వ్యవస్థ అక్రమాలతో నిండిపోయిందన్న విషయం ఒక్కటే కాదు, అది సామాన్య ప్రజలకు అందని స్థాయిలో ఖరీదుగా కూడా మారింది.ఈ గణాంకం ప్రతి యువకుడికి తెలుసు. కానీ భారత ప్రభుత్వం మాత్రం తెలుసుకోలేకపోతోంది. ఒక పరీక్ష రాసే కుటుంబాలు ఖర్చు చేస్తున్న మొత్తం, కేంద్ర ప్రభుత్వం విద్య కోసం కేటాయిస్తున్న మొత్తం బడ్జెట్కు దాదాపు సమానం.ప్రజల నుంచి పన్నులు వసూలు చేసిన తర్వాత, పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఖర్చు చేసే నిధినే విద్యా బడ్జెట్ అంటారు. అది రూ. 1.4 లక్షల కోట్లు. అదే సమయంలో, ప్రతి ఏడాది నీట్ పరీక్ష రాసే కుటుంబాలు కలిపి రూ.1.32 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి.ఇది ఆ కుటుంబాల నుంచి జరుగుతున్న బహిరంగ దోపిడీ తప్ప మరొకటి కాదు. అంత డబ్బు ఖర్చు చేయించిన తర్వాత ప్రశ్నపత్రం లీక్ అయిందని చెబుతున్నారు. అంటే మొత్తం వ్యవస్థ అక్రమాలతో నిండిపోయింది. యువత వీధుల్లోకి రావడానికి ఇదే రెండో కారణం. అది పూర్తిగా సరైన కారణం" అని అన్నారు. -
కర్రలతో కొట్టుకున్న కాంగ్రెస్ Vs బీజేపీ
-
కాక్రోచ్ జనతా పార్టీపై సీఎం రేవంత్ ఫస్ట్ రియాక్షన్
-
కాంగ్రెస్ VS బీజేపీ..హైదరాబాద్ లో హై టెన్షన్
-
విజయవాడలో ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల కొట్లాట
సాక్షి, విజయవాడ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అరెస్టు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలకు వ్యతిరేకంగా విజయవాడలో బీజేపీ కౌంటర్ ఆందోళన చేపట్టింది. ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ చేపట్టిన నిరసన ప్రజాస్వామ్య విరుద్ధమని బీజేపీ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పార్టీ జెండాల కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్టు సమాచారం.వివరాల ప్రకారం.. విజయవాడలో మ్యూజియం రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలు "డౌన్ డౌన్ రాహుల్ గాంధీ", "డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ" అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు చేస్తోందని వారు ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఒకేచోట చేరడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాంగ్రెస్ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ, కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది.అనంతరం, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ..‘మోదీ ఇంటి ముట్టడి వెనుక అసలు శక్తులు బయటపడ్డాయి. దాడి వెనుక కాంగ్రెస్ అగ్రనేతల హస్తం ఉంది. జంతర్ మంతర్ నిరసనలకు కాంగ్రెసే సూత్రధారి. సోనమ్ వాంగ్చుక్ను వెనుక ఉండి నడిపిస్తోంది కాంగ్రెస్ పార్టీనే. నిరసనల్లో ఒక్క నీట్ విద్యార్థి కూడా లేరు, కేవలం లెఫ్ట్ యూనియన్ నాయకులే ఉన్నారు. నిరసనల్లో అర్బన్ నక్సల్స్, 370 రద్దును వ్యతిరేకించే శక్తులు ఉన్నాయి. నీట్ లీకేజీకి సంబంధించి 15 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంట్లో మాట్లాడే ధైర్యం ప్రతిపక్షాలకు లేదు. నేపాల్, బంగ్లాదేశ్ తరహా అలజడులు సృష్టిస్తే ఉపేక్షించం. విద్యార్థులకు భరోసా, నిజమైన నీట్ బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. -
నల్ల దుస్తుల్లో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
-
రాహుల్ గాంధీ అరెస్ట్కు నిరసనగా కాంగ్రెస్ ర్యాలీ
వికారాబాద్: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్ట్కు నిరసనగా కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా కొడంగల్లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొడంగల్లోని తన నివాసం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు సీఎం రేవంత్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నినాళులు అర్పించారు.కరీంనగర్ జిల్లాలో..జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. డిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరుద్యోగుల నిరసన కార్యక్రమంలో పోలీసుల లాఠీఛార్జ్ పై నిరసన ప్రకటించారు. ప్రధాన మంత్రీ నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫ్లెక్సీ లు దగ్ధం చేశారు.నల్లగొండలో..నల్లగొండలో గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు.సిద్దిపేట జిల్లాలో.. హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అరెస్టులను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన జరిగింది. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో, ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అరెస్టులను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్న జరిగిన విద్యార్థుల నిరసన ప్రజాస్వామ్యంలో స్వతంత్ర ఉద్యమాన్ని , సత్యాగ్రహాన్ని తలపించింది. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులు తిరగబడకుండా పోలీసులు కొడుతుంటే ఇంకా కొట్టండి అని గాంధేయ మార్గంలో నిరసన తెలిపారు. అనేక మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థుల లాఠీచార్జ్ పై కనీసం హోంమంత్రి సంఘీభావం తెలపలేదు. ఇప్పటికే ఛాత్రోంకి గుంజ్ పేరుతో దేశ వ్యాప్తంగా విద్యార్థులతో రాహుల్ గాంధీ గారు విద్యా వ్యవస్థ పై మాట్లాడుతు విద్యార్థుల గొంతు వినిపిస్తున్నారని పొంగులేటి అన్నారు. కామారెడ్డి జిల్లాలో..రాహుల్ గాంధీ అరెస్ట్ ను నిరసిస్తూ నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావుపల్లి చౌరస్తాలో 161వహై వే పై జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతా రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆలే మల్లికార్జున్, జుక్కల్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా..రాహుల్ గాంధీ తో పాటు ప్రతిపక్షాల నేతల అక్రమ అరెస్టు నిరసిస్తూ, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లోని గాంధీ చౌక్ వద్ద కళ్లకు గంతలు కట్టుకొని కాంగ్రెస్ శ్రేణుల నిరసన తెలిపారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.నిర్మల్ జిల్లా బైంసా.. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అరెస్టులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ముధోల్ నియోజకవర్గం ఇంచార్జ్ నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో ఆందోళన బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా
పార్లమెంట్ వర్షకాల సమావేశాలకు సంబంధించి అప్డేట్స్.. -
ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారు: శశి థరూర్
న్యూఢిల్లీ: నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ వివాదంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రధాని నరేంద్ర మోదీ నివాస ముట్టడికి యత్నించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు సీనియర్ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాజకీయ దుమారం రేపింది. ఈ పోలీసు చర్యను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్రంగా ఖండించారు.ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత దురదృష్టకరమని, ఇది సరైన పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలను, వారి డిమాండ్లను లేవనెత్తే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు లోక కల్యాణ్ మార్గ్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకుని ఛత్రసాల్ స్టేడియం, మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లకు తరలించి, ఆ తర్వాత విడుదల చేశారు. మరోవైపు 2014 నుంచి దేశవ్యాప్తంగా పరీక్షా పత్రాలు లీకవుతున్నాయని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న విద్యాశాఖ మంత్రి తన బాధ్యత విస్మరించారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.ఇది కూడా చదవండి: భీమ్ ఆర్మీ టికెట్పై అభిజీత్ దిప్కే పోటీ? -
నేడు కాంగ్రెస్ చలో లోక్భవన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేడు చలో లోక్భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసనలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ నేతలు లోక్భవన్ వెళ్లనున్నారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుండి లోక్భవన్ వెళ్లనున్న కాంగ్రెస్ నేతలు.ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనున్నారు. రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ నిరసనలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. అలాగే, నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. -
రేవంత్కు తెలిసింది ఒట్లు.. తిట్లే!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘ఢిల్లీలో పార్లమెంట్ వద్ద వేలాది యువత నిరసనతో కేంద్రాన్ని ఎలా గడగడలాడించిన్రో చూస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే పరిస్థితి ఎదురవుతుంది. యువత, రైతన్నలు తిరగబడితే కాంగ్రెస్ నాయకుడు బయట తిరగలేరు.’అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో మాజీ ఎమ్మెల్యే ఎన్.దివాకర్రావు అధ్యక్షతన జరిగిజన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రైతులు అల్లాడుతున్నారు. అన్ని గండాలను దాటిన రేవంత్రెడ్డి గండం రైతులు దాటలేకపోతున్నారు. రైతులకే కాక అన్ని వర్గాలకు ఈ ప్రభుత్వం మోసం చేసింది. 31నెలలు అయిపోయింది. ఇంకా 29నెలలే ఉంది. యువ సంగ్రామ సదస్సుతో ప్రభుత్వాన్ని ఎండగట్టాం. యువత చేతికి రేవంత్రెడ్డి దొరికితే పొట్టు పొట్టు కొట్టేటట్టు ఉన్నారు. పాము సొంత పిల్లల్ని తిన్నట్లు రేవంత్రెడ్డి రైతులను చెప్పలేని కష్టాలు పెడుతున్నారు. నాలుగు సార్లు రైతుబంధు ఎగ్గొట్టారు. కన్నెపల్లి వద్ద 94మీ.ఎత్తులో నీరు పారుతున్నా అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలు నడిపిస్తే, రోజుకు 3టీఎంసీల ఎత్తిపోయవచ్చు. ఎన్డీఎస్ఏ కన్నెపల్లి నీళ్లు ఎత్తిపోయొద్దని చెప్పిందా? అని ప్రశ్నించారు. గోదావరి, ప్రాణహిత నదులు పారుతున్నా పరిపాలించే వారికి సోయి లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే రూ.400కోట్లతో ఎల్అండ్టీ సంస్థ రిపేరు చేస్తామని చెప్పినా ప్ర భుత్వం పట్టించుకోలేదు. ఆయన గురువు చంద్రబాబు పట్టిసీమ లిఫ్టు నడిపిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్లది రక్తం చల్లండి అంటే ప్రశాంత్రెడ్డి, సూర్యాపేట జిల్లాలో రైతులు రక్తం చల్లారు. సీఎం రేవంత్రెడ్డికి తెలిసింది ఒట్లు, తిట్లు మాత్రమే.’అని విమర్శించారు. ఈ సందర్భంగా వరంగల్లో రైతు డిక్లరేషన్పై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్గాందీ, సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు ఇచ్చిన హామీలపై వీడియోను ప్రదర్శించారు. ఏ జాతి నీది అంటున్నారని, తెలంగాణలో ఓ ఎమ్మెల్యేను రూ.50లక్షలతో కొనుగో లు చేసేందుకు వెళ్లిన జాతి తమదికాదని ధ్వజమెత్తారు. తెలంగాణలో రెండే జాతులున్నాయని, ఒకటి ప్రేమించేది, మరోటి రాష్ట్రానికి ద్రోహం చేసే జాతి అన్నారు. కాగా, వరిధాన్యం కాపాడుకునేందుకు వెళ్లి గాలివానకు గోడ కూలి చనిపోయిన నలుగురు రైతులు తనుగుల నాగరాజు, తనుగుల అభిరాం, నెల్కి లచ్చన్న, గుండారపు వెంకటేశ్ కుటుంబాలకు కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ తరఫున ఒక్కొక్కరికి రూ.5లక్షలు అందజేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ సదస్సు లో ఆసిఫాబాద్, బాల్కొండ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, ప్రశాంత్రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్సీలు జీవన్రెడ్డి, నారదా సు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, కోరుకంటి చందర్, కోనేరు కోనప్ప, దాసరి మనోహర్, నాయకులు రామ్మోహన్రావు, జాన్సన్నాయక్, విజిత్రావు పాల్గొన్నారు. -
ప్రధాని నివాసం 'యుద్ధరంగం'
న్యూఢిల్లీ: నీట్–యూజీ పేపర్ లీక్ అంశంపై ప్రతిపక్షాల ధర్నాతో ఢిల్లీ లోక్కల్యాణ్ మార్గ్లోని ప్రధానమంత్రి నివాస ప్రాంతం అట్టుడికింది. న్యాయం చేయాలని కోరిన విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని విపక్షాలు మంగళవారం గొంతెత్తాయి. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం వీడీ సతీశన్ సహా పలు పార్టీల ఎంపీలు, నేతలు హైసెక్యూరిటీ జోన్ అయిన ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించారు. అక్కడే బైఠాయించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నినాదాల హోరుతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అరుపులు, తోపులాటలతో యుద్ధ రంగాన్ని తలపించింది. దాదాపు 20 నిమిషాల తర్వాత కేంద్ర ప్రభుత్వ దూతగా కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్తో కలిసి ధర్నా స్థలికి చేరుకున్నారు. నిరసన విరమించాలని రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఫోన్లో మాట్లాడారు. నీట్–యూజీపై పార్లమెంట్లో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అందుకు కాంగ్రెస్ నేతలు అంగీకరించలేదు. మోదీ రాజీనామా చేయాల్సిందేనని, లేకపోతే రాత్రంతా ఇక్కడే ఉంటామని తేల్చి చెప్పారు. చేసేది లేక జితేంద్ర సింగ్ వెనుదిరిగారు. ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛపై ఆంక్షలు విధించిందని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేతలు తమ చేతులను తాళ్లతో కట్టేసుకున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు ధర్నా కొనసాగింది. చివరకు పోలీసులు ప్రతిపక్ష నాయకులను బలవంతంగా అదుపులోకి తీసుకొని వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు..విద్యార్థులపై దాడి అంటే ప్రతి భారతీయ కుటుంబంపై దాడి జరిగినట్లేనని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఎలాంటి సమాధానాలు చెప్పకుండా, ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోకుండా తప్పించుకోగలనని ప్రధాని మోదీ భావిస్తున్నారని.. కానీ, ఈసారి అలా చేయడం కుదరదని తేల్చిచెప్పారు. ధర్నా సందర్భంగా ఆయన మాట్లాడారు. మన విద్యార్థులకు న్యాయం జరగాలని విశ్వసించే దేశభక్తి గల ప్రతి భారతీయుడు ఈ ధర్నాలో తమతో చేరాలని రాహుల్ కోరారు. విద్యార్థుల గళాన్ని ఎవరూ విస్మరించలేరని చెప్పారు. ‘‘సోమవారం విద్యార్థులపై జరిగిన అరాచకాలకు సంబంధించి ప్రధాని మోదీ నుంచి సమాధానం కోరేందుకు ఆయన నివాసానికి ర్యాలీగా వెళ్లాం. జరిగిన దానికి బాధ్యత వహించడానికి గానీ, దీనిపై పార్లమెంట్లో చర్చ జరపడానికి గానీ ప్రభుత్వం ఇష్టపడటం లేదు. యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు ప్రధానమంత్రి, హోం మంత్రి రాజీనామా చేయాలి. విద్యార్థుల హక్కులు, వారి న్యాయమైన డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది’’ అని రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘విద్యార్థులపై లాఠీచార్జి, బలప్రయోగం చేసినందుకు ఈ పిరికిపంద, నియంతృత్వ ప్రభుత్వం సమాధానం చెప్పక తప్పదు. మోదీ, అమిత్ షా మన యువత పట్ల తప్పు చేశారు. వారు పదవుల నుంచి తప్పుకోవాల్సిందే’’ అని మల్లికార్జున ఖర్గే తేల్చిచెప్పారు. విద్యార్థులకు న్యాయం చేసి, వారి డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించే దాకా తమ పోరాటం ఆపబోమని కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా పేర్కొన్నారు. న్యాయం జరిగే వరకూ వెనక్కి తగ్గబోమన్నారు. పోలీసులు తమపై బలప్రయోగం చేశారని కొందరు ఎంపీలు ఆరోపించారు. సోమవారం జరిగిన లాఠీచార్జిలో గాయపడి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు మంగళవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.అరెస్టు.. విడుదల ప్రధానమంత్రి నివాసం ఎదుట బైఠాయించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ను పోలీసులు బలవంతంగా అరెస్టుచేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసులను కాంగ్రెస్ శ్రేణులు ప్రతిఘటించేందుకు ప్రయత్నించాయి. పోలీసులను తనను అరెస్టు చేసే సమయంలో రాహుల్ గాంధీ నేలపై పడుకొని కనిపించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో ఆయనకు స్వల్ప గాయమైంది. రాహుల్కు, అఖిలేష్ యాదవ్ను పోలీసులు నిర్బంధించి, ఛత్రసాల్ స్టేడియంకు తరలించారు. ‘‘భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రస్తుతం అమలవుతోంది’’ అని రాహుల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతలు. చిత్రంలో రాహుల్, ప్రియాంక, ఖర్గే, డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్, అనిల్కుమార్ యాదవ్ తదితరులు రాహుల్ గాంధీ కంటి కింద గాయం కావడంతోపాటు చేతులు, కాళ్లపై కూడా స్వల్ప గాయాలయ్యాయని కాంగ్రెస్ నేతలు చెప్పారు. రాహుల్ ముక్కు నుంచి రక్తం కారినట్లు తెలుస్తోంది. తనను అరెస్టు చేస్తున్న ఫొటోలను ఆయన ‘ఎక్స్’లో షేర్చేశారు. ‘‘మోదీజీ, మీరు ఎంత ఒత్తిడి తెచ్చినా, మీ సర్వశక్తులు ఒడ్డినా సరే విద్యార్థుల న్యాయం జరగడం కోసం సాగుతున్న ఈ పోరాటం మాత్రం ఇప్పుడు ఆగదు’’ అని ఉద్ఘాటించారు. మంగళవారం రాత్రి రాహుల్, అఖిలేష్ను ఛత్రసాల్ స్టేడియం నుంచి పోలీసులు విడుదల చేశారు. ప్రియాంక గాంధీని మందిర్మార్గ్ స్టేషన్కు తరలించారు. ఆమె తల్లి సోనియా గాంధీ స్టేషన్కు చేరుకొని ప్రియాంకను పరామర్శించారు. తర్వాత ప్రియాంకను పోలీసులు విడుదల చేశారు.పార్టీ నేతలను అరెస్టు చేసి తరలించిన మందిర్మార్గ్ పోలీస్స్టేషన్కు వచ్చిన సోనియాగాంధీ రాహుల్ గాంధీ మాట మార్చారు నీట్–యూజీకి సంబంధించిన అన్ని అంశాలపై, దానిపై జరుగుతున్న ఉద్యమంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. దీనిపై చర్చకు అంగీకరించిన రాహుల్ గాంధీ కొద్ది నిమిషాల్లోనే వెనక్కి తగ్గారని, ఆ స్థాయి నాయకుడికి ఇది తగదని పేర్కొన్నారు. పార్లమెంట్లో చర్చించడంతోపాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని పట్టబట్టారని చెప్పారు. నీట్–యూజీపై పార్లమెంట్లో నిబంధనల ప్రకారం అధికారిక చర్చ కోసం కాంగ్రెస్ ఇప్పటివరకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదని తెలిపారు. రాహుల్ గాంధీ వంటి సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష నేత మాట తప్పడం దురదృష్టకరం, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అని జితేంద్ర సింగ్ ఆక్షేపించారు. పార్లమెంట్లో చర్చకు ఇకనైనా ముందుకు రావాలని ప్రతిపక్షాలకు సూచించారు. -
రాహుల్ గాంధీ, ప్రియాంక సహా కీలక నేతలు అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నివాసం దగ్గర మంగళవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ధర్నాకు దిగిన కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సహా పలువురు ఎంపీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించారు. భారీగా మోహరించిన పోలీసులు వారిని చుట్టుముట్టి బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.కేంద్రం ముందుకు కాంగ్రెస్ ఐదు డిమాండ్లు ఉంచింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలి, నీట్ పేపర్ లీక్ పై హోంమంత్రి సమాధానం చెప్పాలి, నీట్ పేపర్ లీక్ తో ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఢిల్లీలో హింసపై విచారణ జరిపించాలి. ఈ ఐదు డిమాండ్లపై హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని చెప్పడంతో ఆయా నేతలందరినీ అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. రాహుల్ ముక్కులో నుంచి రక్తం?రాహుల్ గాంధీని బలవంతంగా తరలించే సమయంలో ముక్కులో నుంచి రక్తం వచ్చిందని ఎన్డీటీవీ పేర్కొంది. పోలీసులు వచ్చిన సమయంలో రాహుల్ గాంధీ రోడ్డుపై కూర్చుని.. అక్కడి నుంచి వెళ్లేందుకు నిరాకరించగా, దాదాపు 10 మంది పోలీసు సిబ్బంది ఆయనను చుట్టుముట్టారు. చివరకు ఆయనను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆయన ముక్కు నుంచి రక్తం కారుతున్నట్టు కనిపించింది.కాగా, కేంద్రంపై ఒత్తిడి మరింత పెంచే ప్రయత్నంలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ముట్టడి జరిగిన తదుపరిరోజే కాంగ్రెస్ నేతలు న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వైపు నిరసన చేపట్టడం గమనార్హం. రాహుల్ గాంధీ రాత్రంతా ప్రధాని నివాసం బయటే నిరసన కొనసాగిస్తారని సమాచారం వచ్చినా.. సాయంత్రం 6.40 గంటలకు పోలీసులు ప్రవేశించి ధర్నాను భగ్నం చేశారు. राहुल गांधी के साथ नरेंद्र मोदी का यह बर्ताव ठीक नहीं है।Rahul gandhi Prime Minister Narendra Modi #RahulGandhi pic.twitter.com/Yq4dWSBNOR— Neeraj Bhawani (@Neeraj_Bhawanii) July 21, 2026 Delhi: Pictures of Lok Sabha LoP Rahul Gandhi, protesting with Opposition leaders and workers at Lok Kalyan Marg being detained by Delhi Police.(ANI photos by Naveen Sharma) pic.twitter.com/Y9mSANwbdt— ANI (@ANI) July 21, 2026 -
కేంద్ర మంత్రి వచ్చి మాట్లాడినా వెనక్కి తగ్గని రాహుల్ గాంధీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నిరసనకు దిగిన నేపథ్యంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్ కల్యాణ్ మార్గ్కు చేరుకుని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో మాట్లాడారు. కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ కూడా అక్కడ ఉన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు రాహుల్ గాంధీ పట్టుబడ్డారు.నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలని రాహుల్ గాంధీ చెప్పారు. విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్పై విచారణ జరిపించాలని రాహుల్ అన్నారు. ప్రధాని మోదీ మౌనం వీడాలని చెప్పారు. సమాధానం దాటవేసే ధోరణిలో మోదీ ఉన్నారు. విద్యార్థులపై దాడి.. దేశంపై దాడేనని చెప్పారు.స్పష్టమైన హామీ ఇచ్చేవరకు కదిలేది లేదని కాంగ్రెస్ చెప్పింది. రాహుల్ గాంధీ డిమాండ్లపై కేంద్ర మంత్రి అమిత్ షాతో జితేంద్ర సింగ్ చర్చించారు. ఆందోళనలో పాల్గొనాలని ప్రజలకు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.కేంద్ర ప్రభుత్వం ముందు కాంగ్రెస్ పార్టీ 5 డిమాండ్లు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనీట్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలినీట్ పేపర్పై హోంమంత్రి సమాధానం చెప్పాలినీట్ పేపర్ లీక్తో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలిఆదివారం (జులై 20) జరిగిన లాఠీఛార్జ్పై విచారణ జరిపించాలి छात्रों पर हमला हर भारतीय परिवार पर हमला है।प्रधानमंत्री मोदी को लगता है कि वो बिना जवाब दिए, बिना किसी नतीजे का सामना किए बच निकलेंगे - नहीं कर पाएंगे, इस बार तो बिल्कुल नहीं। मैं हर उस देशभक्त भारतीय से अपील करता हूं जो मानता है कि हमारे छात्रों को न्याय मिलना चाहिए -…— Rahul Gandhi (@RahulGandhi) July 21, 2026 -
‘వాంగ్చుక్కు ఏమైనా జరిగితే..’.. కాంగ్రెస్ ఎంపీ హెచ్చరిక
న్యూఢిల్లీ: ఆస్పత్రిలో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పర్యావరణ కార్యకర్త సొనమ్ వాంగ్చుక్ విషయంలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వివేక్ తన్ఖా సంచలన ప్రకటన చేశారు. వాంగ్చుక్కు ఎలాంటి హాని జరిగినా తాను ఎంపీ పదవిలో కొనసాగేందుకు ఇష్టపడనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. వాంగ్చుక్ నిరసన దీక్షను ముగిసేలా చూడాల్సిన బాధ్యత పార్లమెంటు, ప్రభుత్వం, న్యాయవ్యవస్థలపై ఉందని పేర్కొన్నారు. ఆయనకు ఏ చిన్న నష్టం జరిగినా అది మన అందరి వైఫల్యమే అవుతుందని, ఒకవేళ అదే జరిగితే తాను ఎంపీగా ఉండలేనని తేల్చిచెప్పారు. वांगचुक जी का अनिश्चितकालीन उपवास खत्म हो, यह सुनिश्चित करना संसद, सरकार और न्यायपालिका—सभी की सामूहिक ज़िम्मेदारी है। अगर उन्हें कोई नुकसान पहुँचता है, तो यह हम सबकी सामूहिक विफलता होगी। अगर ऐसा होता है, तो कम से कम मैं तो सांसद बने रहना बिल्कुल पसंद नहीं करूँगा।#SonamWangchuk— Vivek Tankha (@VTankha) July 21, 2026గత 23 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సొనమ్ వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా ఆయన తన దీక్షను కొనసాగిస్తున్నారు. మరోవైపు నీట్ పేపర్ లీక్ అంశంపై ఢిల్లీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ న్యాయవాది అయిన వివేక్ తన్ఖా చేసిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
‘ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం సాగుతోంది’
నల్లగొండ: తమ కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం సాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశానికి సంబంధించి పదే పదే తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసింది ఎవరి హయాంలో.. కూలింది ఎవరి హయాంలో అంటూ నిలదీశారు. నల్లగొండ రివ్యూ మీటింగ్లో ఉత్తమ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్ హయాంలో ప్రాణహిత- చేవెళ్ళ ప్రాజెక్టును ప్రారంభించారు. తుమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకు బీఅర్ఎస్ కక్కుర్తి కారణంగా మార్చారు. కమీషన్ల కోసమే మేడగడ్డకు మార్చారు. తుమ్మడిహెట్టి వద్ద నీళ్లు లేవనేది అబద్ధం. 30 శాతం ఖర్చు చేశాక మార్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణంలో లోపం కారణంగానే కూలిపోయిందని జాతీయ స్థాయి నిపుణులే రిపోర్ట్ ఇచ్చారు’ అని స్పష్టం చేశారు. -
ఎవరూ గాంధీభవన్కు రావొద్దు
సాక్షి, హైదరాబాద్: ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని ఎన్నికల ప్రచారం తరహాలోనే సీరియస్గా తీసుకోవాలని, రానున్న పది రోజుల పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదేశించారు. ఎస్ఐఆర్ గడువును ఆగస్టు మూడో తేదీ వరకు పొడిగిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలని, అప్పటివరకు నియోజకవర్గాల్లోనే ఉండి ఓటర్ల జాబితా సవరణపై దృష్టి పెట్టాలని సూచించారు. చైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని ఆగస్టు 3వ తేదీ వరకు నాయకులు గాంధీభవన్కు రావొద్దు.అలాంటి వారికి అసలు అపాయింట్మెంట్లు ఇవ్వొద్దు. కొందరు నాయకులు హైదరాబాద్లో కూర్చుని పనిచేయడం లేదు. హైదరాబాద్ చుట్టూ తిరుగుతామంటే కుదరదు..’ అని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్పై కాంగ్రెస్ పార్టీ పనితీరు గురించి ఆదివారం ఆయన జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్లతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇన్చార్జిలు, ఎస్ఐఆర్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.30న మళ్లీ సమీక్ష‘ఎస్ఐఆర్పై పార్టీ పక్షాన ఇప్పటివరకు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 489 సమావేశాలు జరిగాయి. కొన్ని చోట్ల బాగానే జరుగుతున్నా మరికొన్ని చోట్ల వెనుకబడ్డాం. ఇప్పటికైనా ఆయా నియోజకవర్గాల్లోని నేతలు ఎస్ఐఆర్పై దృష్టి పెట్టాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎస్ఐఆర్ కోసం నియమించిన పార్టీ ఇన్చార్జిలు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే. బీఎల్ఏ, బీఎల్వోల రిపోర్టులను గాంధీభవన్ టీం ఎప్పటికప్పుడు పరిశీలించి సూచనలివ్వాలి. ఇన్చార్జి మంత్రులు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయాలి. ఏది జరిగినా వారిదే బాధ్యత. ఈ నెల 30వ తేదీన మళ్లీ పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి మరోమారు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదికలు తీసుకుంటాం..’ అని రేవంత్ స్పష్టం చేశారు. 100 మందికి రాహుల్తో ఫొటోకు చాన్స్‘జిల్లాల వారీగా ఎస్ఐఆర్ కార్యక్రమాలపై అన్ని జిల్లాల ఇన్చార్జి మంత్రులు సోమవారం సమీక్షలు జరుపుతారు. ఎంపీలు పార్లమెంటు సమావేశాల్లో ఉన్నా ఎస్ఐఆర్పై దృష్టి సారించాల్సిందే. పార్టీ పరంగా ఎస్ఐఆర్ ఇన్చార్జిలుగా ఉన్నవారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. ఇన్చార్జిలుగా ఎంపీలున్నా క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయాల్సిందే. లేదంటే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. పూర్తిగా బీఎల్వోల రిపోర్టులపై ఆధారపడొద్దు. బీఎల్ఏల రిపోర్టులను పరిశీలించాలి. పార్టీ పరంగా పనిచేస్తున్న నేతలు ఈ బీఎల్ఏలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి.అలా ఉపయోగించుకోవాలంటే పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండి పనిచేయాలి. ప్రతి ఒక్కరూ సీరియస్గా ఉండాలి. బాగా పనిచేసే 100 మందికి రాహుల్గాంధీతో ఫొటో దిగే అవకాశం కల్పిస్తాం. ఎస్ఐఆర్ విషయంలో పార్టీ కార్యక్రమాలన్నింటికీ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, డిప్యూటీ సీఎం ¿భట్టి విక్రమార్క బాధ్యత తీసుకోవాలి. అందరినీ సమన్వయం చేయాలి..’ అని ముఖ్యమంత్రి సూచించారు. జాగ్రత్తగా వ్యవహరించాలి: మహేశ్గౌడ్టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా కీలకమైందని, ఈ విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, చిన్న నిర్లక్ష్యాన్ని కూడా సహించేది లేదని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం ద్వారా పార్టీకి జరిగిన నష్టాన్ని గుర్తించైనా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు పోకుండా జాగ్రత్త తీసుకోవాలని మహేశ్గౌడ్ కోరారు. -
సర్.. బేఖాతర్!
సాక్షి, హైదరాబాద్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలు, సమన్వయకర్తల నియామకం. గాంధీభవన్లో ప్రత్యేక వ్యవస్థ. ‘ఎస్ఐఆర్ను సీరియస్గా తీసుకోండి.. లేదంటే మీ స్థానంలో కొత్తవారు వస్తారు.. అవసరమైతే మీ జిల్లాలు మార్చేందుకు కూడా వెనుకాడను..’ అంటూ ఎమ్మెల్యేలకు, ఇన్చార్జి మంత్రులకు సీఎం రేవంత్రెడ్డి హెచ్చరికలు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు డీసీసీ అధ్యక్షుల నుంచి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి సమాచార సేకరణ. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఎప్పటికప్పుడు తీసుకుంటున్న చర్యలు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ నిర్వహించిన తర్వాత వచ్చిన ఫలితాలు.. ‘ఇవేవీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పట్టడం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ‘సర్’పై ప్రత్యేక దృష్టి సారించాలని పార్టీ పక్షాన పదేపదే చెబుతున్నా మంత్రులతో సహా ఎమ్మెల్యేలు కూడా ఖాతరు చేయడం లేదు..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వద్ద ఉన్న నివేదికలు స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మొత్తం 66 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలుండగా, అధికారం ఉండి కూడా వారి వారి నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేయలేకపోతున్నారని అవి పేర్కొంటున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆదివారం పార్టీ నేతలతో జరిగిన జూమ్ సమావేశంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ కేడర్ పనితీరును గురించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తన వద్ద ఉన్న నివేదికను నాలుగు కేటగిరీల్లో సీఎం రేవంత్ చదివి వినిపించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలున్న 11 చోట్ల ముందంజ ఈ నివేదిక ప్రకారం 41 మంది పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే ఎస్ఐఆర్పై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్నారు. 11 చోట్ల పర్వాలేదనే స్థాయిలో పనిచేస్తుండగా, 14 స్థానాల్లో మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదని, మరో 4 స్థానాల్లో అసలు కాంగ్రెస్ పార్టీ కేడర్ జాడ కూడా లేదని వెల్లడయింది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలున్న మరో 11 చోట్ల పార్టీ ఇన్చార్జిల ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తేలింది. మొత్తం మీద పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న మొత్తం నియోజకవర్గాల్లో 60 శాతం స్థానాల్లో మాత్రమే ఎస్ఐఆర్ కార్యక్రమం చురుగ్గా సాగుతోందని వెల్లడైంది. ఎస్ఐఆర్ విషయంలో బాగా పనిచేస్తున్న నియోజకవర్గాల జాబితాలో కొడంగల్, మధిర, ఆంధోల్, కొల్లాపూర్ తదితర నియోజకవర్గాలుండగా, పెద్దగా పనిచేయని నియోజకవర్గాల జాబితాలో హుజూర్నగర్, పర్వాలేదనే స్థాయిలో పనిచేస్తున్న స్థానాల్లో ధర్మపురి ఉండటం గమనార్హం. రాష్ట్రంలోని 89 నియోజకవర్గాలపై కాంగ్రెస్ పార్టీ అంచనా ఇది: బాగా పనిచేస్తున్న నియోజకవర్గాలు: అచ్చంపేట, ఆదిలాబాద్, ఆలేరు, అంబర్పేట, ఆంధోల్, అశ్వారావుపేట, బెల్లంపల్లి, భువనగిరి, భూపాలపల్లి, బోధ్, చెన్నూరు, దేవరకొండ, డోర్నకల్, స్టేషన్ ఘన్పూర్, గోషామహల్, హుస్నాబాద్, హుజూరాబాద్, జడ్చర్ల, జగిత్యాల, కల్వకుర్తి, కామారెడ్డి, కరీంనగర్, ఖైరతాబాద్, కొడంగల్, ఖమ్మం, కొల్లాపూర్, కొత్తగూడెం, మధిర, మహబూబాబాద్, మహబూబ్నగర్, మానకొండూరు, మంచిర్యాల, మంథని, మిర్యాలగూడ, ములుగు, నాగార్జున సాగర్, నకిరేకల్, నల్లగొండ, నారాయణ్ ఖేడ్, నిజామాబాద్ రూరల్, అర్బన్, పాలకుర్తి, పరకాల, రామగుండం, సంగారెడ్డి, సిర్పూర్, తాండూరు, వేములవాడ, వనపర్తి, వరంగల్ వెస్ట్, వర్థన్నపేట, ఇల్లెందు. పర్వాలేదనే స్థాయిలో పనిచేస్తున్న స్థానాలు: బాన్సువాడ, చొప్పదండి, ధర్మపురి, కోదాడ, మల్కాజిగిరి, మునుగోడు, ముషీరాబాద్, నారాయణపేట, నర్సంపేట, పరిగి, కుత్బుల్లాపూర్, సత్తుపల్లి, శేరిలింగంపల్లి, తుంగతుర్తి, సూర్యాపేట, జహీరాబాద్. సరిగా పనిచేయని నియోజకవర్గాలు: బాల్కొండ, బోధన్ , చేవెళ్ల, గజ్వేల్, హుజూర్నగర్, చార్మినార్, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి, ముథోల్, నిర్మల్, పినపాక, రాజేంద్రనగర్, ఉప్పల్, ఎల్లారెడ్డి, గజ్వేల్, నర్సంపేట, యాకుత్పుర. అసలు దృష్టి పెట్టని స్థానాలు: ఆలంపూర్, ఆర్మూర్, ఆసిఫాబాద్, బహుదూర్పుర. -
TG: రౌడీషీటర్ దాడిలో గాయపడ్డ కాంగ్రెస్ నేత మృతి
వరంగల్: రౌడీషీటర్ దాడిలో గాయపడ్డా వరంగల్ కాంగ్రెస్ నాయకుడు ఆడుప మహేష్ మృతిచెందారు. నిన్న(శనివారం, జూలై 18వ తేదీ) మహేష్పై రౌడీషీటర్ కుమార్తో పాటు పలువురు దాడికి పాల్పడ్డారు. మహేష్పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే తీవ్రంగా గాయపడ్డ మహేష్ను స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో అతన్ని హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ నేత మహేష్తో రౌడీషీటర్ కుమార్ వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం పలువురు వ్యక్తులతో కలిసి వచ్చిన రౌడీషీటర్ కుమార్.. మహేష్పై దాడికి పాల్పడ్డాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను మహేష్పై పోసి నిప్పంటించాడు. దాంతో తీవ్ర గాయాలు పాలైన మహేష్ను ఆపై ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే యత్నం చేశారు. అయితే ఈరోజు పరిస్థితి మరింత విషమంగా మారడంతో హైదరాబాద్కు తరలించే యత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే మహేష్ మృతిచెందాడు. -
కాంగ్రెస్ లో కొత్త వివాదం బాంబ్ పేల్చిన రాజగోపాల్ రెడ్డి
-
పార్లమెంట్ సమావేశాలు.. అఖిలపక్ష భేటీలో హైడ్రామా
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు అఖిలపక్ష భేటీ జరిగింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ చెందిన రెబల్ ఎంపీల విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా సమావేశం నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ఇక, ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ తరఫున ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి హాజరయ్యారు.పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తిరుగుబాటు ఎంపీలతో ఏర్పడిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI)కి సమావేశానికి ఆహ్వానం ఇవ్వడాన్ని నిరసిస్తూ విపక్ష పార్టీలు సమావేశం నుంచి ప్రతీకాత్మకంగా వాక్ అవుట్ చేశాయి. కొద్దిసేపటి తర్వాత మళ్లీ సమావేశానికి హాజరయ్యాయి.#WATCH | Delhi: On rebel TMC MPs, TMC MP Mahua Moitra says, "On what grounds they were invited by the Parliamentary Affairs Minister to attend the all-party meeting. The strength of Trinamool Congress is still showing us 28." pic.twitter.com/pWQxrTv8Q8— ANI (@ANI) July 19, 2026విపక్షాల అభ్యంతరం ఇదే..టీఎంసీకి చెందిన సుమారు 20 మంది తిరుగుబాటు ఎంపీలు జూన్లో ఎన్సీపీఐలో విలీనం అయినట్లు ప్రకటించారు. అయితే ఆ విలీనాన్ని లోక్సభ స్పీకర్ ఇంకా అధికారికంగా ఆమోదించలేదు. అయినప్పటికీ ఎన్సీపీఐని అఖిలపక్ష సమావేశానికి పిలవడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ మాట్లాడుతూ.. పార్లమెంట్ వెబ్సైట్లో కూడా పేరు లేని, అధికారిక గుర్తింపు లేని పార్టీని ఎలా సమావేశానికి పిలుస్తారు? అని ప్రశ్నించారు.మరోవైపు.. ఎన్సీపీఐ పార్లమెంటరీ పక్ష నాయకురాలు కాకోలి ఘోష్ దస్తిదార్ మాత్రం తమకు సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. స్పీకర్కు అవసరమైన పత్రాలన్నీ సమర్పిస్తామని, విలీనానికి సంబంధించిన నిర్ణయం రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు.ఇదిలా ఉండగా.. అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు పలు కీలక అంశాలను ప్రస్తావించాయి. అయోధ్య రామాలయ విరాళాల వ్యవహారం, నీట్ పేపర్ లీక్, వ్యవసాయ సమస్యలు, పెట్రోల్లో ఈ20 ఇంధన మిశ్రమం, అలాగే నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) వంటి అంశాలపై పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశాయి. దీంతో, వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాకముందే అఖిలపక్ష సమావేశంలో రాజకీయ వేడి రాజుకుంది. ఎన్సీపీఐకి ఇచ్చిన గుర్తింపుపై మొదలైన వివాదం.. పార్లమెంట్ సమావేశాల్లోనూ అధికార–విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. -
పదవులు అడుక్కోను.. రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ‘నేను, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఒకే కుటుంబం కాదు. మేమిద్దరం అన్నదమ్ములమైనా మా కుటుంబాలు వేరు. నాకు పదవులు అడుక్కోవడం తెలియదు. కొట్లాడటమే నా తత్వం’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం గాంధీభవన్కు వచ్చిన ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఇలా వ్యాఖ్యలు చేశారు. హుజూర్నగర్ ఎమ్మెల్యే, కోదాడ ఎమ్మెల్యే (ఉత్తమ్, పద్మారెడ్డి) ఒక కుటుంబం అవుతారని, కానీ నా ఫ్యామిలీ నాది, వెంకట్రెడ్డి ఫ్యామిలీ ఆయనదని పేర్కొన్నారు. తాను రాజీనామా చేసి ఉపఎన్నికకు పోతే తన నియోజకవర్గానికి 100 మంది ఎమ్మెల్యేలు వచ్చారని రాజగోపాల్రెడ్డి గుర్తుచేశారు.‘ఎన్నికల ముందు మంత్రి పదవులిస్తామని హామీ పొందిన వారిలో జూపల్లి, పొంగులేటి, కొండా సురేఖ, వివేక్ వెంకట్ స్వామి, తుమ్మలకు న్యాయం చేశారు. నా విషయంలోనే ఏఐసీసీ హామీ నెరవేర్చలేదు’అని మరోసారి వివరించారు. ఏఐసీసీ ఇచ్చిన మాట ప్రకారం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ గాం«దీని ప్రధాని చేయడమే రాజగోపాల్రెడ్డి లైన్ అని స్పష్టంచేశారు. రాజగోపాల్రెడ్డి, జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు పారీ్టలో మరోసారి చర్చకు దారితీశాయి. -
మీ కుటుంబంలోని నలుగురు తెలంగాణకు ఏం ఇచ్చారు?: రేవంత్
ఘట్కేసర్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణకు రూ.8 లక్షల 11 వేల కోట్ల అప్పులు ఎలా అయ్యాయి? అని అన్నారు. 16 ఏళ్ల పాటు గ్రూప్-1 ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు.ఘట్కేసర్లో అందెశ్రీ స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మీ కుటుంబంలోని నలుగురు తెలంగాణకు ఏం ఇచ్చారు? నిజాంల కంటే ఆస్తిపరులు ఎలా అయ్యారు? తెలంగాణలో గత పాలకుల అహంకార వైఖరిపై అందెశ్రీ గళమెత్తారు. నిరాశ, నిస్పృహలకు లోనైనప్పుడు అందెశ్రీ నాకు స్ఫూర్తిగా నిలబడేవారు. అందెశ్రీ పాటలు తూటాలై, మరఫిరంగులై గడీలను బద్దలు కొట్టాయి.ఆయన రాసిన జయ జయహే తెలంగాణ గీతం రాష్ట్ర గీతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలుస్తుందని ఆనాడు భావించాం. కానీ, గత పదేళ్లలో కుట్రలతో ఆయన పాటను వినిపించకుండా చేశారు. ఇప్పుడు తెలంగాణలోని ప్రతి బడిలో, ప్రతి గడపలో ఆయన పాట వినిపిస్తోంది.ఏ రోజైతే అందెశ్రీ గళాన్ని బంధించాలనుకున్నారో.. గద్దరన్నను అవమానించారో ఆనాడే గడీల పాలనను శాశ్వతంగా పాతరేయాలని నిర్ణయించుకున్నారు. మేక తోలు కప్పుకున్న తోడేలు ఇవాళ మాట్లాడుతోంది. ఈ తోడేళ్ల గుంపును నేను ప్రశ్నిస్తున్నా.. ఆనాడు కవితను, వినోద్ రావును ప్రజలు తిరస్కరిస్తే ఉద్యోగాలు ఇచ్చినవ్ కదా? తెలంగాణ బిడ్డల ఉద్యోగాల కోసం ఒక్కనాడైనా ఆలోచించారా? మేం నోటిఫికేషన్లు ఇచ్చినం రేవంత్ రెడ్డి భర్తీ చేశారని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావ్. పేపర్ లీకేజీలతో వందల కోట్లు సంపాదించుకున్నారు తప్ప.. పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేయాలని మీ కుటుంబం ఏనాడైనా ఆలోచించిందా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రభుత్వంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: యాదాద్రి ఆలయ కమిటీ బోర్డు సభ్యురాలు, మాజీ కార్పొరేటర్ ఈశ్వరమ్మ యాదవ్పై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. చింతకుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బాధితురాలైన ఈశ్వరమ్మ యాదవ్కు వెంటనే గన్మెన్ భద్రత కల్పించాలని, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈశ్వరమ్మ యాదవ్ ఎల్బీ నగర్లో అత్యధిక మెజార్టీతో కార్పొరేటర్గా గెలుపొందారని, గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుకుగా సేవలందిస్తున్న నాయకురాలని ఆయన తెలిపారు. అలాంటి మహిళా నాయకురాలిని అవమానిస్తూ మాట్లాడటమే కాకుండా, దాడికి పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని విమర్శించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే భాషనే శివచరణ్ రెడ్డి కూడా అనుసరిస్తున్నారని ఆరోపించిన ఆయన, ఈశ్వరమ్మ యాదవ్ను అవమానించిన అనంతరం శివచరణ్ రెడ్డికి 1+1 గన్మెన్ భద్రత కల్పించారని, కానీ దాడికి గురైన 80 ఏళ్ల ఈశ్వరమ్మ యాదవ్ మాత్రం భయాందోళనల మధ్య ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు.బాధితురాలికి భద్రత కల్పించకుండా, నిందితులకు గన్మెన్ సెక్యూరిటీ ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబిస్తోందని ఆయన విమర్శించారు. బీసీలు, పేద వర్గాలపై కాంగ్రెస్ నాయకులు చులకన భావంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఘటనపై విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలో బీసీ నాయకులకు చోటు కల్పించలేదని, జగ్గా రెడ్డి, నరసింహా రెడ్డితో కమిటీ వేసినప్పటికీ బాధితులను కలిసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదని అన్నారు. అలాగే, శివచరణ్ రెడ్డికి ఇప్పటివరకు కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని విమర్శించారు.షబ్బీర్ అలీకి వెంటనే షోకాజ్ నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వం,ఈ ఘటనలో మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించిన ఆయన, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా స్పందించలేదని అన్నారు.రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని షాబాద్లో ఆరుగురు మహిళల హత్యలు పోక్సో కేసుల్లో నిందితులకు బెయిల్ లభిస్తున్న ఘటనలు మహిళల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా వ్యతిరేక, బహుజన వ్యతిరేక విధానాలతో వ్యవహరిస్తోందని ఆరోపించారు.బీసీలకు పదవులు ఇచ్చినట్లు చూపిస్తూ.. వెనుక నుంచి వారిని అణచివేస్తున్నారని విమర్శించిన ప్రవీణ్ కుమార్,యాదాద్రి ఆలయ కమిటీ బోర్డు సభ్యురాలైన ఈశ్వరమ్మ యాదవ్కు వెంటనే గన్మెన్ సెక్యూరిటీ కల్పించాలని, ఎలాంటి అధికారిక హోదా లేని శివచరణ్ రెడ్డికి భద్రత ఎలా కల్పించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫామ్స్ నింపే నిబంధనలు ప్రతీ ఒక్కరూ పాటించాల్సిందేనన్నారు. నామినేషన్ పత్రంలో ప్రతీ కాలమ్ భర్తీ చేయాలని ఎన్నికల నిబంధన ఉందన్నారు. కొన్నిసార్లు ఎన్నికల అధికారులు చూసి చూడనట్లు ఉన్నా.. రాజకీయ ప్రత్యర్థులు దాన్నే ఎత్తిచూపుతారు. ప్రత్యర్థులు ఫిర్యాదు చేయకపోతే పరిస్థితి మరోలా ఉండేదేమోనంటూ ఆయన వ్యాఖ్యానించారు.‘‘కోర్టు కేసు వివరాలు ఇవ్వాలని నటరాజన్కు సమయం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. ఒకసారి రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకున్న తర్వాత నా పరిధిలో ఉండదు. మీనాక్షి నటరాజన్ సుప్రీం కోర్టును వెళ్లినా.. కోర్టు సైతం ఆర్వో నిర్ణయాన్నే సమర్థించింది. సీఎం రేవంత్రెడ్డి రెండు ఓట్లు సర్ ప్రక్రియతో ఇక ఉండవు’’ అని సీఈసీ పేర్కొన్నారు.‘సర్’పై విమర్శల నేపథ్యంలో జ్ఞానేష్కుమార్ స్పందిస్తూ.. ‘‘ప్రపంచంలోనే ఫెడరల్ ఎలక్షన్ జరిగే దేశం ఇండియా. ప్రపంచంలోనే అత్యంత ఆర్గనైజేషన్ కలిగిన బాడీ ఎలక్షన్ కమిషన్. దేశంలో ఓటర్ల సంఖ్య ప్రతీ ఏడాది 8 కోట్ల వరకు మారుతుంది. 95 కోట్ల భారతీయ ఓటర్లకు నేను లీడర్ కావడం నాకు గర్వంగా ఉంది. దేశ వ్యాప్తంగా 12 లక్షల మంది బీఎల్వోలు పనిచేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగడానికి ప్రక్రియలో అందరూ ముఖ్యమే...ఎలక్షన్ కమిషన్ అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. మొన్న జరిగిన వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో 93.7 ఓటింగ్ శాతం ప్రపంచ రికార్డు సాధించాం. ఏఎస్ఎస్డీఎఫ్ ఓట్లను మాత్రమే ఎలక్షన్ కమిషన్ తొలగిస్తుంది. ‘సర్’ను ఇతర దేశాలను ఆదర్శనంగా తీసుకోబోయే రోజులు వస్తాయి. ప్రభుత్వ పథకాలకు ఓటర్ ఐడి కార్డు తప్పనిసరి అనే వార్తల్లో నిజం లేదు’’ అని సీఈసీ జ్ఞానేష్కుమార్ తెలిపారు. -
విమర్శనాస్త్రాలను సిద్ధంచేస్తున్న కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ: కొన్ని వారాల క్రితం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లును ఐక్యమత్యంతో వీగిపోయేలా చేసిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మోదీ సర్కార్ను పలు సమస్యలపై ఇరుకున పెట్టేందుకు సంసిద్ధమవుతోంది. అయోధ్యలో రామమందిరం హుండీకి వచ్చిన కోట్లాది విరాళాళాలను కాజేసిన ఉదంతం మొదలు ప్రతిష్టాత్మక నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీలతో విద్యావ్యవస్థ భ్రషు్టపట్టడందాకా పలు కీలక అంశాలపై ఎన్డీఏ సర్కార్ను నిలదీయనుంది. తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ(ఎస్పీ), శివసేన(యూబీటీ) తదితర విపక్ష పార్టీలను చీల్చే సంస్కృతిపై కేంద్రం తీరును ఎండగట్టాలనే కాంగ్రెస్ నిశ్చయినికి వచ్చింది. ఈ మేరకు గురువారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ (సీపీపీ) భేటీలో పార్టీ అగ్రనేతలు నిర్ణయం చేశారు. ఈ నెల 20 ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్టీ వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ అగ్ర నాయకులు గురువారం ఢిల్లీలో పార్టీ అగ్రనేత, సీపీపీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసం 10, జన్పథ్లో జరిగింది. పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీతో పాటు సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, చిదంబరం, కె.సురేష్, నసీర్ హుస్సేన్, మాణిక్యం ఠాగూర్, కుమారి సెల్జా, తారిఖ్ అన్వర్, శశి థరూర్, మనీష్ తివారీ హాజరయ్యారు. ప్రస్తుత సమావేశాల్లో ప్రస్తావనకు తేవాల్సిన అంశాలు, లేవనెత్తాల్సిన సమస్యలపై చర్చించారు. నియోజకవర్గాల పునర్విభజన, లోక్సభ సీట్ల పెంపునకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు, 30 రోజులపాట జైలు పాలైన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను పదవుల నుంచి తొలగించేందుకు సంబంధించిన బిల్లుతో సహా పలు కీలకమైన చట్టాలను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందని భేటీలో నేతలు నిర్ణయించారు. సీపీపీ భేటీ అనంతరం సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఖర్గే.. దేశ ప్రజల జీవితాలు, భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్న అనేక అంశాలపై ప్రభుత్వాన్ని జవాబుదారిగా నిలబెడతామని తెలిపారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక విశ్వాసాలకు ద్రోహం జరిగిందన్న ఆరోపణలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలో పెరుగుతున్న అవినీతి, రాజ్యాంగబద్ధ సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారన్న విమర్శలు, రాజకీయ పార్టీలను బలహీనపరిచే చర్యలు, అవినీతి ఆరోపణలు, వివిధ కుంభకోణాలపై పార్లమెంట్ ఉభయసభల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సామాన్యులను ఇబ్బంది పెడుతున్న ధరల పెరుగుదల, విదేశాంగ విధానంలో వైఫల్యాలు, వ్యూహాత్మక తప్పిదాలు, 3.5 కోట్ల వాహన యజమానులపై 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రో ఉత్పత్తులను బలవంతంగా అంటగట్టడం, విచక్షణారహిత అడవుల నరికివేత, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల హక్కులపై జరుగుతున్న దాడులు వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు ఖర్గే తెలిపారు. అఖిలపక్ష సమావేశం జరపాల్సిందే.. డీలిమిటేషన్ అంశంపై కేంద్ర ప్రభుత్వం సవరించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మళ్లీ ప్రవేశపెట్టనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ బిల్లుపై ముందుగా అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లోనే డీలిమిటేషన్ ప్రతిపాదనలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి పలుమార్లు లేఖలు రాసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ఖర్గే పేర్కొన్నారు. అనంతరం లోక్సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని సాధించలేక ఏప్రిల్ 17న తిరస్కరణకు గురైందని గుర్తుచేశారు. ప్రస్తుతం అదే బిల్లును సవరించి మళ్లీ ప్రవేశపెట్టనున్నట్లు మీడియా కథనాలు వస్తున్నాయని ఖర్గే తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రూపొందించిన సవరించిన ప్రతిపాదనలపై అన్ని రాజకీయ పార్టీలతో ముందుగా సమగ్రంగా చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు దాని వివరాలను అధ్యయనం చేసి అభిప్రాయాలు తెలియజేసేందుకు ప్రతిపక్ష పార్టీలకు తగిన సమయం కల్పించాలని ప్రధాని మోదీకి ఖర్గే తన లేఖలో విజ్ఞప్తి చేశారు. -
మమతకు కాంగ్రెస్ బిగ్ షాక్.. ఇదేం ఫిట్టింగ్?
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కాంగ్రెస్ పార్టీ నుంచి అనూహ్య ఆహ్వానం వచ్చింది. అయితే ఈ ఆహ్వానంతో పాటు కాంగ్రెస్ ఓ కీలక షరతును కూడా విధించింది. కాంగ్రెస్ను వీడి కొత్త పార్టీ ఏర్పాటు చేయడం తన రాజకీయ జీవితంలో చేసిన తప్పేనని మమతా బెనర్జీ అంగీకరిస్తేనే జూలై 21న జరిగే కార్యక్రమానికి రావాలని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నేతలు సూచించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.కోల్కతాలోని షహీద్ మినార్ వద్ద జూలై 21న కాంగ్రెస్ నిర్వహించే కార్యక్రమానికి మమతా బెనర్జీని ఆహ్వానిస్తున్నామని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ తెలిపారు. అయితే 1998లో కాంగ్రెస్ను వీడి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ను స్థాపించడం మమత తీసుకున్న రాజకీయంగా తప్పు నిర్ణయమని ఆమె అంగీకరించాలని ఆయన పేర్కొన్నారు.‘షహీద్ దివస్’..జూలై 21 రోజు మమతా బెనర్జీ రాజకీయ జీవితంలో కూడా ప్రత్యేక ప్రాధాన్యత కలిగినది. 1993 జూలై 21న ఓటరు గుర్తింపు కార్డులను తప్పనిసరి చేయాలనే డిమాండ్తో అప్పటి యువ కాంగ్రెస్ నాయకురాలిగా ఉన్న మమతా బెనర్జీ ఆధ్వర్యంలో కోల్కతాలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ ఆందోళన సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది కార్యకర్తలు మరణించారు. ఆ ఘటనకు గుర్తుగా మమతా బెనర్జీ ప్రతి ఏడాది జూలై 21ను ‘షహీద్ దివస్’గా నిర్వహిస్తూ వస్తున్నారు.అయితే ఈ ఘటన జరిగిన సమయంలో మమతా బెనర్జీ కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకత్వంతో విభేదాలు రావడంతో 1998లో పార్టీ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ను స్థాపించారు. అనంతరం బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ క్రమంగా బలమైన శక్తిగా ఎదిగింది. మరోవైపు కాంగ్రెస్ ప్రభావం రాష్ట్రంలో తగ్గుతూ వచ్చింది. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేతలు, మమతా బెనర్జీ కాంగ్రెస్ను వీడటం వల్ల రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారిపోయాయని అంటున్నారు. కాంగ్రెస్ బలహీనపడటం వల్లే బెంగాల్లో బీజేపీకి ఎదగడానికి అవకాశం లభించిందని వారు వాదిస్తున్నారు.కూటమి బీటలు.. శుభంకర్ సర్కార్ మాట్లాడుతూ, మమతా బెనర్జీ కాంగ్రెస్ను వీడకపోయి ఉంటే పశ్చిమ బెంగాల్ రాజకీయ పరిస్థితులు మరోలా ఉండేవని వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి విడిపోవడం చారిత్రక తప్పిదమని ఆమె అంగీకరించాలని కోరారు. మరోవైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ రెండూ ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లో భాగస్వాములుగా ఉన్నప్పటికీ, పశ్చిమ బెంగాల్లో మాత్రం ఈ రెండు పార్టీలు ప్రత్యర్థులుగానే కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో పరస్పర విమర్శలు, ఆరోపణలు తరచుగా వినిపిస్తుంటాయి. కాంగ్రెస్ ఆహ్వానం, విధించిన షరతుపై ఇప్పటివరకు మమతా బెనర్జీ లేదా తృణమూల్ కాంగ్రెస్ అధికారికంగా స్పందించలేదు. అయితే జూలై 21 కార్యక్రమానికి ముందు మమత స్పందన ఎలా ఉంటుందన్నది బెంగాల్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
రాహుల్, ఖర్గేకు ఓపెన్ లెటర్.. క్షమాపణ చెప్పాల్సిందే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఆస్ట్రేలియాలో నిర్వహించిన 'మెల్బోర్న్ మీట్స్ మోదీ' కార్యక్రమం రాజకీయ దుమారం రేపుతోంది. ఆ సభకు వచ్చినవారిని 'పెయిడ్ క్రౌడ్'(డబ్బులిస్తే వచ్చారు) అంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ కార్యక్రమం నిర్వాహకులు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బహిరంగ లేఖ ద్వారా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జూలై 9న మెల్బోర్న్లోని మార్వెల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 30 వేల మంది హాజరయ్యారు. సభకు హాజరైన వారిని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. విదేశీ మీడియా కథనాలను ప్రస్తావిస్తూ చార్టర్డ్ విమానాల ద్వారా ప్రజలను తరలించారని, ఇందుకోసం నిధులు వినియోగించారని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను నిర్వాహకులు పూర్తిగా ఖండించారు. 'మోదీ ఎయిర్వేస్' పేరుతో సిడ్నీ నుంచి మెల్బోర్న్కు ప్రత్యేక చార్టర్ విమానాన్ని సమన్వయం చేసిన కమ్యూనిటీ ప్రతినిధులు.. సభకు వచ్చిన వారంతా స్వచ్ఛందంగానే వచ్చారని స్పష్టం చేశారు. ప్రయాణం, వసతి, ఇతర ఖర్చులను ఎక్కువ మంది స్వయంగా భరించారని, మరికొందరికి స్థానిక భారతీయ సంఘాలు మాత్రమే సహకరించాయని పేర్కొన్నారు.నిర్వాహకుల్లో ఒకరైన అమిత్ కరంత్ మాట్లాడుతూ.. "ఆస్ట్రేలియాలోని సిడ్నీ, అడిలైడ్, బ్రిస్బేన్, పెర్త్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఒక్కరికీ కూడా బీజేపీ, భారత ప్రభుత్వం, ఆస్ట్రేలియా ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. వారంతా స్వచ్ఛందంగా వచ్చారు. 'పెయిడ్ క్రౌడ్' అనడం వేలాది మంది భారతీయ-ఆస్ట్రేలియన్లను అవమానించడమే అని అన్నారు.బహిరంగ లేఖలో నిర్వాహకులు మూడు ప్రధాన డిమాండ్లు చేశారు. చార్టర్ విమానానికి బీజేపీ, భారత ప్రభుత్వం నిధులు సమకూర్చిందనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని కాంగ్రెస్ అంగీకరించాలి. సభకు వచ్చినవారిని 'పెయిడ్ క్రౌడ్'గా అభివర్ణించిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. నిర్వాహకులు, వాలంటీర్లు, ప్రయాణికులు, భారతీయ-ఆస్ట్రేలియన్ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని కోరారు.అలాగే భారతీయ-ఆస్ట్రేలియన్ సమాజం ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదని కూడా వారు స్పష్టం చేశారు. కొందరు కాంగ్రెస్కు, మరికొందరు బీజేపీకి, ఇంకొందరు ఇతర పార్టీలకు మద్దతు ఇస్తారని, చాలా మందికి ఎలాంటి రాజకీయ అనుబంధం కూడా ఉండదని పేర్కొన్నారు. అందువల్ల దేశీయ రాజకీయాల కోసం ప్రవాస భారతీయులను లక్ష్యంగా చేసుకుని విమర్శించడం తగదని సూచించారు.కాగా, మెల్బోర్న్లో జరిగిన 'మెల్బోర్న్ మీట్స్ మోదీ' కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్ జసింటా అలన్ కూడా పాల్గొన్నారు. భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు, ప్రవాస భారతీయుల సేవలను ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు. -
హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉద్రిక్తత
సాక్షి,హైదరాబాద్: నగరంలోని ఎల్బీ నగర్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి ఇంటి వద్ద యాదవ సంఘాల నేతలు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.శివచరణ్ రెడ్డి ఇంటిపై యాదవ సంఘాలకు చెందిన కొందరు దాడికి ప్రయత్నించినట్లు సమాచారం. అప్రమత్తమైన ఆయన అనుచరులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.ఈ క్రమంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు.ప్రస్తుతం ఎల్బీ నగర్ ప్రాంతంలో పరిస్థితిని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఘర్షణకు గల పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. -
ఫ్లడ్.. బ్లడ్.. పీక్స్కు చేరిన కాళేశ్వరం వార్!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ రక్తదాన శిబిరం నిర్వహించగా.. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ ‘అవినీతి కాళేశ్వరం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఇటు తెలంగాణ భవన్, అటు గాంధీభవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించాల్సి వచ్చింది.సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పీవీ నరసింహారావు మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో బీఆర్ఎస్వీ.. ‘రేవంత్ రక్తదాహానికి రక్తదానం’ అనే నినాదంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు నేతలు.. ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కాళేశ్వరం అంశాన్ని వాడుకుంటోందని మండిపడ్డారు. ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. సేకరించిన రక్తపు ప్యాకెట్లతో.. సీఎం రేవంత్ నివాసానికి వెళ్లి నిరసన తెలుపుతామని బీఆర్ఎస్వీ నేతలు అంటున్నారు. దీంతో తెలంగాణ భవన్ బయట భారీగా పోలీసులు మోహరించారు. ఇక..మరోవైపు అధికార కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో ఎదురుదాడికి దిగింది. గాంధీభవన్లో ‘అవినీతి కాళేశ్వరం’ పేరుతో కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని ప్రదర్శించింది. ప్రాజెక్టు లోపాలు అంటూ పలు చిత్రాలను ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.కాళేశ్వరం అంశాన్ని ఇరు పార్టీలు రాజకీయ ఆయుధంగా మార్చుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. మరోవైపు రాజకీయ కక్షతోనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. దీంతో కాళేశ్వరం వ్యవహారం చుట్టూ అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు మరింత ఉధృతమవుతోంది. -
విరాళాల చోరీపై మోదీ మౌనమెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర విరాళాల చోరీ వ్యవహారంలో ప్రధాని మోదీ తీరును కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన కుంభకోణంపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రణాళికాబద్ధంగానే భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసేలా ఈ వ్యవహారాన్ని నడిపించాయన్నారు. ప్రతి చిన్న అంశానికీ అది తమ గొప్పతనమేనంటూ చెప్పుకునే ప్రధాని మోదీ, నిధుల గోల్మాల్పై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. రోజుకు లక్షలాది రూపాయల విరాళాలు మాయమైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలోనే స్పష్టమైందని జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఈ కేసును నీరుగార్చేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తున్నప్పటికీ, భారీ మొత్తంలో నిధులు పక్కదారి పట్టాయనే వాస్తవాన్ని సిట్ అంగీకరించాల్సి వచ్చిందని తెలిపారు. దేవుడి సొమ్ము లూటీ వ్యవహారం కేవలం కొద్దిమంది కిందిస్థాయి ఉద్యోగులకే పరిమితం కాలేదని, దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉందని ఆరోపించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్తో పాటు ఇతర కీలక ట్రస్టీలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక లోతైన రహస్యాలు దాగి ఉన్నాయని ఆరోపించారు. కేసు తీవ్రతను తగ్గించేందుకు అధికారికంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు, సిట్ విచారణలు, కొందరి రాజీనామాలు కేవలం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలేనని స్పష్టం చేశారు. చోరీపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరపాలని, పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్చేశారు.ఆప్ సంతకాల ఉద్యమం న్యూఢిల్లీ: అయోధ్యలోని రామాలయంలో విరాళాల చోరీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం దేశవ్యాప్త సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న జపనీస్ పార్క్లో సుందరకాండ పారాయణ కార్యక్రమం చేపట్టారు. హనుమాన్ ఆశీస్సులతో ప్రారంభించిన ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని, చందాల చోరీకి బాధ్యులైన వారిని శిక్షించాలంటూ ప్రధాని మోదీకి రాసిన లేఖలపై సంతకాలు చేయాలని ప్రజలను కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఇతరులు సైతం ఇలాంటి లేఖలనే ప్రధాని మోదీకి రాసేలా ప్రోత్సహించాలన్నారు. రామాలయంలో చోరీకి బాధ్యులపై చర్యలను కోరుతూ తమ నివాసాలతోపాటు తమ ప్రాంతంలోని ఆలయాల్లో హనుమాన్ చాలీసా పఠించాలని, హనుమాన్ హారతి నిర్వహించాలని సూచించారు. కేవలం ఆప్ కార్యకర్తలకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం జరగాలన్నారు. -
టార్గెట్ హరీశ్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోయాలన్న డిమాండ్తో నాలుగైదు రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య సాగుతున్న మాటల యుద్ధంలో భాగంగా మాజీమంత్రి హరీశ్రావు టార్గెట్గా కాంగ్రెస్ నేతలు ఆదివారం విరుచుకుపడ్డారు. కల్వకుంట్ల కుటుంబాన్ని మొత్తం లోపలేపిస్తా: విప్ అద్దంకి ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ బరాజ్లు నేలమట్టమవుతాయని చెబుతుంటే హౌలేగాడిలా నీళ్లు ఎత్తిపోయాలని హరీశ్ మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్రెడ్డి మ్యాప్ వేసి చూయించినా మ్యాడ్ ఫెలోకి అర్థం కావడం లేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆనవాళ్లు కేసీఆర్ చెడగొట్టాడని, ప్రాణహిత చేవెళ్లకు కాళేశ్వరం పేరు పెట్టి కమీషన్లు దండుకున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చుకుతిన్న కల్వకుంట్ల కుటుంబానికి సిగ్గు, లజ్జ ఉంటే సప్త సముద్రాలు దాటిపోవాలని, లేదంటే తనకు ఒక గంట అధికారమిస్తే ఆ కుటుంబం మొత్తాన్ని లోపలేస్తానని అద్దంకి వ్యాఖ్యానించారు. సైకోలా మారి రైతులను తప్పదోవ పట్టించే ప్రయత్నం: విప్ ఆది శ్రీనివాస్ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హరీశ్రావు అబద్ధాల వరద పారిస్తున్నాడని, ఆయన చదివింది పాలిటెక్నిక్ అయినా పెద్ద ఇంజనీర్లా పోజులు కొడుతున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మేడిగడ్డ తెలంగాణకు గుండెకాయ అన్నారని, అది జారిపోయిందని, అసలు ఈ ప్రాజెక్టులో నీరు నిల్వ చేస్తే ప్రమాదమని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఎస్ఏ సూచించిందని చెప్పారు. ఊర్లు కొట్టుకుపోయినా సరే రాజకీయాలే ముఖ్యమన్నట్టు బీఆర్ఎస్ నేతల తీరు ఉందని, హరీశ్రావు సైకోలా మారిపోయి రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రక్తం చిందించే ధైర్యం హరీశ్రావుకు లేదు: జగ్గారెడ్డి ‘తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు పెట్రోల్ తెచ్చుకొని అగ్గిపెట్టె మర్చిపోయిన హరీశ్రావు ఎంతో మంది యువకుల బలిదానాలకు కారణమయ్యాడు. హరీశ్రావుకు అంత ధైర్యం లేదు. ఆయన రక్తం చిందించమని అడిగినా చిందించడు. అసలు రక్తం చిందించే ధైర్యం హరీశ్రావుకు లేదు.’అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలను రెచ్చగొట్టే మనస్తత్వం కేసీఆర్ కుటుంబానికి ఉందని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డిని ఏదో ఒకటి అనాలి అనే లైన్లోనే హరీశ్రావు వెళుతున్నారు తప్ప ఆయనకు ప్రజలు, రైతులు అవసరం లేదని, కేవలం రాజకీయమే ముఖ్యమని చెప్పారు. ఆయనది కసబ్ క్యారెక్టర్ : మెట్టు సాయికుమార్ హరీశ్రావుది కసబ్ లాంటి మనస్తత్వమని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని దివాళా తీయించడంలో కేసీఆర్ పాత్ర ఎంత ఉందో హరీశ్రావు పాత్ర కూడా అంతే ఉందన్నారు. రేవంత్రెడ్డి గురించి మాట్లాడే అర్హత చిల్లర మాటలు మాట్లాడే హరీశ్రావుకు లేదని చెప్పారు. -
దేశంలో ఏదైనా కీలక పరిణామం చోటుచేసుకోనుందా?
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో పలు అంశాలపై రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చడంతో దీని ప్రభావం ఇంధన రవాణాపై మరోసారి పడే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జూలై 19న ఈ సమావేశం జరగనుంది. ఇందులో ఏ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందన్న ఉత్కంఠ నెలకొంది. దేశంలో ఏదైనా కీలక పరిణామం చోటుచేసుకోనుందా? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. వాటికి ఒక రోజు ముందు (జులై 19న) ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. వర్షాకాల సమావేశాల్లో ప్రాధాన్యం ఉన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లుల గురించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలకు వివరాలు తెలియజేయనుందని చెబుతున్నారు.జులై 19 ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది. వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందువల్ల వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఎజెండాపై చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు, వారి ప్రతినిధులకు ఆహ్వానం పంపుతోంది. ఈ సమావేశంలో ప్రతిపక్షాలు తమ ప్రశ్నలను కూడా ప్రభుత్వం ముందుంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ఇదిలా ఉంటే, ఈ వర్షాకాల సమావేశాల్లో దేశీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. చట్టం-శాంతిభద్రతల నుంచి సరిహద్దు భద్రత వరకు పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం అంశంతో పాటు రామ మందిరంలో విరాళాల చోరీ అంశాన్ని కూడా ప్రతిపక్షాలు ప్రస్తావించే అవకాశం ఉంది. -
రేవంత్.. ఏది మాట్లాడితే అది చెల్లుతుందా?: హరీష్ ఫైర్
సాక్షి, తెలంగాణభవన్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట బూతులు, అబద్ధాల ప్రవాహం పారుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటలు సైకోలా ఉన్నాయి ముఖ్యమంత్రి లా లేవు అంటూ ఘాటు విమర్శలు చేశారు. పంట పొలాల్లో మా రక్తం పారిస్తా అని రేవంత్ మాట్లాడుతున్నాడు. హిట్లర్కు పట్టిన గతే రేవంత్కు పడుతుందని మండిపడ్డారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శాపనార్థాలు రైతులకు అవసరం లేదు. ముఖ్యమంత్రి భాష చూస్తే అబద్ధాలు, శాడిజం, బూతులు కనిపిస్తున్నాయి. కన్నెపల్లి పంపులను ఆన్ చేయమంటే మా రక్తం కావాలనుంటున్నాడు. మా గొంతు నొక్కుతున్నాడు. రైతులకు నీళ్లు ఇవ్వడానికి రక్తం కావాలంటే ఇస్తాం. మీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు. జైలు పంపుతామంటే ఏ ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త భయపడడు. మాకు కేసులు, అరెస్ట్లు కొత్త కాదు. రైతుల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం. ప్రతి పక్షాలపై ఉన్న దృష్టి పంట పొలాలకి నీళ్లు ఇవ్వడంపై లేదు.కన్నెపల్లిపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రిని చూస్తే జాలేస్తుంది. విషయం లేకపోవడం వల్లే ఇలా బూతులు మాట్లాడుతున్నారు. అబద్దాలు, బూతుల విషయంలో మేము రేవంత్లో పోటీ పడలేం. ముఖ్యమంత్రికి ప్రాజెక్ట్లపై కనీస విషయ పరిజ్ఞానం లేదు. సీఎం రేవంత్ మాటలు చూస్తే ఓ శాడిస్ట్ మాట్లాడుతున్నాడా? అనిపిస్తోంది. మాట్లాడితే రిటైర్డ్ ఇంజనీర్లను జైలులో పెడతా అని బెదిరిస్తావ్. రిటైర్లు ఇంజనీర్లు కూడా నీళ్లు ఎత్తిపోయవచ్చనే చెబుతున్నారు. రైతులను, ప్రజలను కాపాడాలన్న తపన ముఖ్యమంత్రికి ఉండాలి. సీఎం రేవంత్ ఒక్కటైనా నిజం మాట్లాడుతున్నాడా?.రేవంత్ రెడ్డిలో సైకో కనిపిస్తున్నాడు. నిన్న ముఖ్యమంత్రిలా ఆయన మాట్లాడలేదు. రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడతున్నారు. ఆయనలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా ఏది మాట్లాడితే అది చెల్లుతుందా?. ఓటమి తప్పదు అనే భయంతో ఇలా బూతు భాష మాట్లాడుతున్నావ్. షాబాద్ ఘటనపై ముఖ్యమంత్రి ఇప్పటి వరకు స్పందించలేదు. షాబాద్లో ఘటన జరిగితే రాష్ట్ర పోలీస్ బాస్ గోల్ఫ్ ఆడుతున్నాడు. ముఖ్యమంత్రి అలానే ఉన్నాడు.. ఆయన నియమించుకున్న పోలీస్ అధికారులు అలానే ఉన్నారు. షాబాద్ ఘటన నిందితులకు, సీఎం రేవంత్కు మధ్య తేడాఈ లేదు. హిట్లర్కు పట్టిన గతే రేవంత్కు పడుతుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
మధ్యప్రదేశ్లో మరో భారీ స్కాం!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ అవినీతి, దోపిడీకి కేంద్రంగా మారిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక కుంభకోణం మరువకముందే మరో కుంభకోణం వెలుగుచూస్తోందని విమర్శించారు. తాజాగా రాష్ట్రంలో ఇథనాల్ తయారీ పేరిట రూ.1,200 కోట్ల భారీ బియ్యం కుంభకోణం జరిగిందని ఆరో పించారు. ఈ మేరకు తన సామాఇజక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, కిశోర బాలికల కోసం వినియోగించాల్సిన బియ్యాన్ని లాభాల కోసం పక్కదారి పట్టించారని ఖర్గే మండిపడ్డారు. సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రైస్ మిల్లర్లు, ఇథనాల్ మాఫియాకు అప్పగించారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఈ అవినీతి దందా సాగుతోందని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగం, అధికార పార్టీ నేతల కుమ్మక్కుతో ప్రజల హక్కుగా దక్కాల్సిన పౌష్టికాహారాన్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.ముఖ్యమంత్రి చుట్టూ ఉజ్జయిని భూస్కామ్తాజా బియ్యం కుంభకోణం కంటే ముందు ఉజ్జయినిలో భారీ భూ కుంభకోణం వెలుగుచూసిందని ఖర్గే గుర్తుచేశారు. ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, హైవే కారిడార్ రానున్నాయని ప్రతిపాదించిన ప్రాంతాల్లోనే ముందస్తు సమాచారంతో అక్రమంగా భూముల కొనుగోళ్లు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్రపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రతి శాఖలోనూ దోపిడీ సాగుతోందని, బీజేపీ నేతలు తమ జేబులు నింపుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శించారు.అవినీతికి మోడల్గా మధ్యప్రదేశ్గతంలో సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణం నుంచి మొదలుకొని, లెక్కలేనన్ని పేపర్ లీకేజీలు, అవినీతి వ్యవహారాలు వెలుగుచూస్తున్నా రాష్ట్రంలో దోపిడీ ఆగలేదని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు మధ్యప్రదేశ్ను పూర్తిగా ‘అవినీతి మోడల్’గా మార్చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలాగే మౌనం వహిస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోదీ, అమిత్ షాలు తమ అధికార అహంకారంతో ప్రజా జీవితంలో ఉండాల్సిన జవాబుదారీతనం అనే భావనను కాలరాశారని ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
పార్టీ నేతలపై జగ్గారెడ్డి ఆగ్రహం
-
ఉండేనా.. ఊడేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు చైర్మన్లుగా పనిచేస్తున్న కాంగ్రెస్ నేతల భవితవ్యం డోలాయమానంలో పడింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన వీరి రెండేళ్ల పదవీకాలం ఈ నెలలో ముగుస్తోంది. ఈ నెల 7వ తేదీ నుంచి మొదలై 20వ తేదీ వరకు 33 మంది కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం ముగుస్తోంది. కానీ, ఇప్పటివరకు ఆయా కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లను నియమిస్తారా? వీరినే కొనసాగిస్తారా అన్నది తేలలేదు. పదవుల కోసం పడరాని పాట్లుఓవైపు పదవీకాలం అయిపోతుండడంతో తమ పదవులు నిలబెట్టుకునేందుకు ప్రస్తుత కార్పొరేషన్ చైర్మన్లు పడరాని పాట్లు పడుతున్నారు. తమ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు మొదలు, మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్తో సహా సీఎం రేవంత్రెడ్డిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. కానీ రాష్ట్ర పార్టీ పెద్దలు ఇంకా ఓ నిర్ణయానికి రాకపోవడంతో తమ పదవులు ఉంటాయో ఊడతాయోననే సందిగ్ధంలో ప్రభుత్వ అధికారిక ప్రకటన కోసం కళ్లలో వత్తులు వేసుకొని వారంతా ఎదురుచూస్తున్నారు. రెన్యువల్ ఉంటుందా..? పార్టీ అధికారంలోకి వచ్చేందుకు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేసిన నాయకులు, అనివార్య కారణాల వల్ల అసెంబ్లీ టికెట్లు పొందలేని వారు, పార్టీ అనుబంధ సంఘాలకు చైర్మన్లుగా పనిచేసిన వారికి తొలి దఫాలో చైర్మన్లుగా అవకాశమిచ్చారు. 2024, జూలైలో వీరి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో 2026 జూలైలో రెండేళ్ల పదవీ కాలం ముగియనుంది. అయితే, ఈ కార్పొరేషన్ చైర్మన్ల నియామకం వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. వీరి పదవీకాలం మరో ఆరునెలలు ఉందన్నప్పటి నుంచే ఈ పదవుల నియామకంపై ఊహాగానాలు, చర్చోపచర్చలు జరిగాయి. తొలుత అవకాశమిచ్చిన వారెవరికీ మరోమారు రెన్యూవల్ ఉండదని, ఎవరినీ మళ్లీ కొనసాగించేది లేదని సీఎం రేవంత్ తన సన్నిహితులతో చెప్పినట్టు తొలుత వార్తలు వచ్చాయి.మరోవైపు చైర్మన్ల విషయంలో గ్రేడింగ్ జరిగిందని, మెరుగైన పనితీరు కనబర్చిన వారు, పార్టీకి అవసరమైన వారు కలిపి ఓ 10–11 మంది రెన్యూవల్ అవుతారనే చర్చ ఆ తర్వాత జరిగింది. వీరి పదవీకాలం ముగిసేలోపే ఉత్తర్వులు వస్తాయని పార్టీ నేతలంతా భావించారు. కానీ, అలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో ప్రస్తుత కార్పొరేషన్ చైర్మన్లు మరో ప్రయత్నం చేశారు. ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్లుగా పనిచేస్తున్న ముగ్గురికి వారి వారి నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ సమస్య ఏర్పడనుంది.నిర్మలా జగ్గారెడ్డి, చల్లా నర్సింహారెడ్డి, ఈరవత్రి అనిల్ల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నందున వారికి అధికారిక ప్రొటోకాల్ ఉండాలంటే అధికార పదవి తప్పకుండా ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వీరి పదవీకాలం ముగిసేలోపే ఉత్తర్వులు వస్తాయనే చర్చ కూడా జరిగింది. కానీ, అలాంటిదేమీ జరగకపోవడంతో కార్పొరేషన్ చైర్మన్లు నైరాశ్యంలో మునిగిపోయారు. ఈ పరిస్థితుల్లో శనివారమే కార్పొరేషన్లకు చైర్మన్ల ఉత్తర్వులు వెలువడతాయనే వార్తలు వస్తున్నాయి.కానీ, అలాంటి అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన కసరత్తుకు ముగింపుగా ఈనెల 15వ తేదీన సీఎం రేవంత్, ఇన్చార్జ్ మీనాక్షి, టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్లు భేటీ అవుతారని, ఈ సమావేశంలో ఎన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించాలి? ఎంతమందికి రెన్యూవల్ చేయాలి? ఎంతమందిని తప్పించాలి? కొత్తగా ఎవరికి చైర్మన్లుగా అవకాశం కల్పించాలి? చైర్మన్లతోపాటు డైరెక్టర్ పోస్టుల నియామకంలో ఏం నిర్ణయం తీసుకోవాలనే దానిపై స్పష్టత రానున్నట్టు తెలుస్తోంది. మిగిలినవీ ముగిస్తారా? వివిధ కార్పొరేషన్లు, కమిషన్లు, కుల ఫెడరేషన్లు, నగరాభివృద్ధి అథారిటీలు కలిపి దాదాపు 130 సంస్థలకు చైర్మన్లను నియమించే అవకాశముంది. ఇందులో 37 కార్పొరేషన్లు, 17 కుల ఫెడరేషన్లకు కాంగ్రెస్ పార్టీ నేతలను చైర్మన్లుగా నియమించారు. విద్యుత్ సంస్థలు, ఇరిగేషన్, ఆరోగ్య శాఖకు సంబంధించిన 12 కార్పొరేషన్లకు ఐఏఎస్ అధికారులను నియమించారు. టీజీపీఎస్సీ, బీసీ, ఎస్టీ, ఎస్టీ కమిషన్లు, లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఫుడ్ కమిషన్, ఉమెన్, ఫైనాన్స్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, లోకాయుక్త, మీడియా అకాడమీ లాంటి 13 సంస్థలకు కూడా మండళ్లు ఏర్పాటయ్యాయి.ఇవి పోను మరో నాలుగైదు కార్పొరేషన్లకు ఇంకా పదవీ కాలం ముగిసేందుకు సమయముంది. ఇవన్నీ మినహాయించగా, ప్రస్తుతం మరో 45 వరకు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించే అవకాశముంది. ఇప్పుడు పదవీకాలం ముగిసే 33 కార్పొరేషన్లకు కూడా చైర్మన్లు, పాలకమండళ్లను నియమించొచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఖాళీ అయ్యే వాటితో పాటు మరో 30 వరకు కార్పొరేషన్లకు చైర్మన్లను ఈ దఫా ప్రకటించవచ్చనే చర్చ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఈ మేరకు దాదాపు 60కిపైగా కార్పొరేషన్లను పరిగణనలోకి తీసుకొని సామాజిక సమీకరణల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. -
117 సీట్లు మావే!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘గత ఎన్నికలకు ఆరు నెలల ముందే జోస్యం చెప్పా. ఇప్పుడు 2029 ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి చెబుతున్నా. అసెంబ్లీ ఎన్నికలు 2029 మే – జూన్ మధ్య జరుగుతాయి. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ సీట్లు 26కి, 119 అసెంబ్లీ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. 182 శాసనసభ స్థానాల్లో 117 సీట్లకు పైగా గెలిచి రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.అలాగే 20 ఎంపీ స్థానాలు కూడా కాంగ్రెస్ గెలుచుకుని రాహుల్గాందీని ప్రధానమంత్రి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కౌరవ వంశంగా ఉన్న కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ గడ్డ మీది నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరు. ఇది భద్రాచలం రాముడి మీద ఆన. కాస్కో చంద్రశేఖర్రావు...’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ వద్ద జరిగిన రైతు ఆశీర్వాద సభలో చివరి విడత రైతుభరోసా కింద రూ.1,009 కోట్ల నిధులను సీఎం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. అప్పుడు 65 సీట్లు గెలుస్తామని చెప్పా.. ‘2023 జూలైలో భట్టి పాదయాత్ర ముగింపు, పొంగులేటి కాంగ్రెస్లో చేరిక సందర్భంగా ఖమ్మంలో రాహుల్గాంధీ బహిరంగ సభ నిర్వహించారు. సభకు ఖమ్మం జిల్లా ప్రజలు లక్షలాదిగా ఉప్పెనై వచ్చారు. ఈ సభ తర్వాత గాం«దీభవన్లో పాత్రికేయ మిత్రులు కలిసి బీజేపీ వేగంగా వస్తోంది, బీఆర్ఎస్, కేసీఆర్ మాయమాటలు, మూటలను తట్టుకుని ఎన్నికల్లో ఎలా గెలుస్తారు? అని అడిగారు.కానీ ఖమ్మం సభ చూశాక కాంగ్రెస్ పార్టీ నుంచి 65 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు, సీపీఐ ఒక్క సీటు గెలుస్తుంది, బీజేపీ 8 –9 సీట్లు, ఎంఐఎం 6–7 సీట్లు పోగా మిగిలిన చోట్ల మాత్రమే కేసీఆర్, కేసీఆర్ భజనపరులు గెలుస్తారని చెప్పా. అదే తరహాలో కాంగ్రెస్ 64 సీట్లు గెలవగా.. ఉప ఎన్నికల్లో ప్రజలు మరో రెండు సీట్లు ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ అలాగే జరిగింది. ప్రజాతీర్పు ద్వారా పాపాల భైరవుడిని ఫార్మ్ హౌస్లో బంధించినం..’ అని రేవంత్ అన్నారు. అన్నం తినేటోడు ఇప్పుడు సర్వేలు చేయిస్తడా.. ‘రేవంత్రెడ్డి సర్వే చేసుకుంటే మేము గెలుస్తున్నామని వచ్చిందని మాట్లాడుతున్నారు.. అన్నం తినేటోడు ఎవడన్నా ఎన్నికలు ఎన్నడు ఉంటాయో తెలవకుండా సర్వేలు చేయిస్తడా?..’ అని మాజీ మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి సీఎం విమర్శలు చేశారు. ‘మొన్న కన్నెపల్లి పోయిండు. మేడిగడ్డలో నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండన్నడు. మేడిగడ్డ గేట్లు దించి నీళ్లు నిలబెడితే.. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండడు. ఖమ్మం జిల్లాలో 44 ఊర్లు కొట్టుకుపోతాయి. నీ లుచ్చా రాజకీయాల కోసం మేడిగడ్డ నింపి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చేయాల్నా?..’ అని మాజీమంత్రి హరీశ్రావును ఉద్దేశించి రేవంత్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఉచిత కరెంట్పై సంతకం చేసింది వైఎస్సార్ ‘రైతుల కోసం 30 నెలల కాలంలో రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం. సన్న బియ్యంతో కోట్లాది మంది ప్రజలకు బుక్కెడు బువ్వ పెట్టే కార్యక్రమం జరుగుతోంది. రైతును రాజును చేయాలన్న ఆలోచనతో తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కాంగ్రెస్ది. ఉచిత కరెంటు మా పేటెంట్. 2004లో ఎల్బీ స్టేడియంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి మొట్టమొదటి సంతకం పెట్టి, రైతాంగానికి ఉచిత కరెంట్ అందించడంతో పాటు రైతుల మీద ఉన్న వేల కేసులను తొలగించారు..’ అని సీఎం తెలిపారు. రాహుల్గాంధీని ప్రధానిని చేద్దాం.. ‘మోదీ, అమిత్ షా.. మమతా బెనర్జీ పార్టీ, ఆప్ను చీల్చి, ఇతర పార్టీలను లొంగతీసుకుని సీట్లు పెంచాలన్న బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ పాపంలో వాళ్లు విజయం సాధించడానికి అవకాశం ఉంది. అందుకే రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి. ఈనెల 20న ఢిల్లీకి వెళ్తున్నా, మల్లికార్జున ఖర్గే, రాహుల్గాం«దీని కలుస్తున్నా. 26 పార్లమెంట్ సీట్లలో 20 సీట్లు తెలంగాణ నుంచి మేము అందిస్తామని చెప్పదలుచుకున్నా. ఖమ్మంలో, ఇదే ప్రాంతంలో 5 లక్షల మందిని ఆహ్వానించి రాహుల్గాంధీతో సభ ఏర్పాటు చేస్తాం. భద్రాద్రి రాములోరి ఆశీర్వాదంతో రాహుల్గాం«దీని దేశానికి ప్రధానమంత్రిని చేసేవరకు మనం విశ్రమించొద్దు..’ అని రేవంత్ పిలుపునిచ్చారు. మొక్కజొన్న రైతులకు రూ.3,504 కోట్లు సభావేదిక పైనుంచి రైతు భరోసా నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో పాటు, యాసంగి సీజన్లో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్నకు గాను రైతులకు రూ.3,504 కోట్లు సీఎం విడుదల చేశారు. భూధార్కు సంబంధించి పైలట్ గ్రామంగా సర్వే పూర్తి చేసిన ఖమ్మం జిల్లా ములుగుమాడులోని రైతులు ముగ్గురికి లాంఛనంగా ఈ–పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేశారు. అవన్నీ చెక్కు చెదరలేదు.. కాళేశ్వరం కూలిపోయింది: భట్టి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నిర్మించిన నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు దశాబ్దాలైనా చెక్కు చెదరలేదని, కొన్ని వందల టీఎంసీల సామర్ధ్యంతో ప్రాజెక్టులు ఇప్పటికీ నీళ్లు అందిస్తుంటే.. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచి్చన బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయిందని ఎద్దేవా చేశారు. ‘గోదావరిపై ప్రాజెక్టులతో రూ.లక్షల కోట్లు దోపిడీ చేశారు. దోపిడీలకు పాల్పడే ఇలాంటి గుంటనక్కలు, తోడేళ్లను రాష్ట్రంపై మరోసారి పడనివ్వబోం..’ అని భట్టి అన్నారు. ప్రతీ గజాన్ని సర్వే చేస్తాం: పొంగులేటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..‘భూభారతి ద్వారా ప్రస్తుతం 70 గ్రామాల్లో సర్వే చేస్తున్నాం. రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలోని ప్రతి గజాన్ని సర్వే చేసి సాగులో ఉన్న వారికి మ్యాప్తో భూధార్ కార్డు ఇస్తాం..’ అని తెలిపారు. ఇప్పటికే రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు బుద్ధి చెప్పారని, మళ్లీ ఎన్నికలు వచ్చినా బుద్ధి చెబుతారని అన్నారు. 30 మాసాల్లో రూ.36 వేల కోట్ల రైతుభరోసా: తుమ్మల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..రైతుభరోసా కింద 30 మాసాల కాలంలో రూ.36 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో రూ.72 వేల కోట్లు మాత్రమే జమ చేసిందని విమర్శించారు. ఈ సభలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మంత్రులు వాకిటి శ్రీహరి, ఉత్తమ్కుమార్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు వేం నరేందర్రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, బలరాంనాయక్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, డాక్టర్ రాంచందర్ నాయక్, ఎమ్మెల్యేలు మాలోతు రాందాస్నాయక్, మట్టా రాగమయి, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, నవీన్యాదవ్, నాగరాజు, మనోహర్రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్నాయక్, ఈర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
తలుపులు తెరవండి.. వేరే పార్టీల వారిని చేర్చుకోండి
సాక్షి, హైదరాబాద్: బీజేపీలోకి ఇతర పార్టీల వారిని చేర్చుకునేందుకు తలుపులు తెరవాలని రాష్ట్ర పార్టీ నేతలకు కేంద్ర ఆరోగ్య, రసాయనాలు–ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా సూచించారు. వేరే పార్టీలకు చెందిన వారిని కలుపుకుంటేనే బీజేపీ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. రాష్ట్ర పార్టీ నేతలంతా విభేదాలను పక్కన పెట్టి పరస్పర సహకారం, సమన్వయంతో పనిచేసి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేలా చూడాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కచ్చితంగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ‘మీరు కష్టపడి పనిచేయండి మీతోపాటు మేము ఉంటాం. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలను ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. మీ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని అభిమానించేంతలా చూసుకోవాలి. కార్యకర్తలతో మంచిగా ఉండండి. వారితో మంచిగా లేకుంటే మీరు డిస్కనెక్ట్ అవుతారు’అని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో రాష్ట్ర ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తమకు సమాచా రం ఉందన్నారు. గురువారం రాష్ట్రానికి వచ్చిన నడ్డా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశమైనప్పుడు ఈ కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ‘ఇప్పటికే ఒకసారి మన బస్సు (అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి) మిస్సయింది. ఇంకోసారి బస్సు మిస్ కానివ్వకండి. వేర్లు లేని చెట్ల లాగా మారకండి. కాంగ్రెస్, బీఆర్ఎస్ల వ్యతిరేకతే మనల్ని గెలిపిస్తుందనే భావనతో ఉండకండి. సొంతంగా పార్టీ గెలిచేందుకు మనం ఏం చేస్తున్నాము అనేది కూడా చాలా ముఖ్యం. నేను అవినీతికి పాల్పడను. ఇంకొకరిని అవినీతి చేయనివ్వను అన్న ప్రాథమిక సూత్రంతోనే మోదీ విజయం సాధించారు. మనమంతా కూడా మోదీ పేరు చెప్పుకొని గెలుస్తున్నా...సొంతంగా గెలుపు కోసం అనుసరించబోయే కార్యాచరణ ఉందా ? మీ అంత మీరు గెలిచేందుకు ఏం చేస్తున్నారు? ఆత్మవిమర్శ చేసుకోండి. అవినీతితో పోరాడడంతోపాటు ఎల్లప్పుడూ ప్రజల పక్కనే చేదోడువాదోడుగా నిలిస్తే తప్పకుండా వారు ఆదరిస్తారు. మీ మీ కార్యక్షేత్రాలను వదలకుండా కష్టపడి పనిచేయాలి. లీడర్ల వెంట తిరిగినంత మాత్రాన లీడర్లు కాలేరు. రేపు కాంగ్రెస్ నేతలను (హిమాచల్లో) కలవడానికి వెళుతున్నాను. ఎందుకంటే వారిని కలిస్తే వారు మనవారు అవుతారు’అని నడ్డా దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, ఎంపీ డా.కె.లక్ష్మణ్, బీజేఎలీ్పనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, పార్టీనేతలు పొంగులేటి సుధాకరరెడ్డి, గరికపాటిమోహన్రావు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, శాంతికుమార్, చింతల రామచంద్రారెడ్డి బండారు విజయలక్ష్మి, లంకెల దీపక్రెడ్డి, కప్పర ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్కు ఏటీఎంగా మార్చిన సర్కార్ ఉండాలా ? ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రభుత్వం ఏటీఎంగా మారిందని, అదే ప్రభుత్వం కొనసాగాలా? మారాలా? అన్నది రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకోవాలని జేపీ నడ్డా పిలుపునిచ్చారు. గురువారం ఓ హోటల్లో ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్యం–దౌత్యం–అభివృద్ధి’అంశంపై నిర్వహించిన మేధావుల గోష్టిలో నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ను అంతర్గతంగా బలోపేతం చేస్తూనే, ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవాన్ని శిఖరాగ్రానికి చేర్చిన ఘనత ప్రధాని మోదీదని కొనియాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హెచ్సీయూ వీసీ జె.అనురాధ, ఐఫ్లూ వీసీ ప్రొ.నాగళ్లపల్లి నాగరాజ్ ప్రసంగించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, వివిధరంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు పాల్గొన్నారు. -
తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ సొంత సర్వేలో తేలిందన్న కేటీఆర్.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు.78 సీట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కాంగ్రెస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. సర్వేల భయంతోనే సీఎం రేవంత్ వ్యాఖ్యలు. రెండు మీడియా సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగాలు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఇదే అంశం వ్యక్తమైంది. మరోసారి ప్రజలు కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నామని స్పష్టంగా తమ అభిప్రాయం చెప్పిన విషయాన్ని తెల్చిచెప్పారు...సొంత సర్వేతో పాటు పలు సర్వేల్లో వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతను చూసి తట్టుకోలేకనే మరోసారి ముఖ్యమంత్రి గత వారం రోజులుగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పతనం దాదాపు ఖాయమైపోయిందని.. సగం పరిపాలనా కాలం ముగిసిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
నీ క్యారెక్టర్ ఏంటో చెప్పమంటారా..? కడియంకు కొండా వార్నింగ్..
-
రేవంత్ 20 ఏళ్ల రాజకీయం.. సీఎం కుర్చీపై కొత్త సమరం!
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో ఇరవై ఏళ్లు పూర్తి కావడం ఒక మైలురాయే. ఇందుకు ఆయనను అభినందించాలి. రాజకీయంగా జడ్పీటీసీ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అంత తేలిక కాదు. దానికి ఎంతో కష్టపడాలి. వ్యూహాత్మకంగా సాగాలి. ఆ విషయంలో రేవంత్ను మెచ్చుకోవచ్చు. అంతవరకు అభినందనలు.ఈ సందర్భంగా మిడ్జిల్ వద్ద జరిగిన సభలో రేవంత్ చేసిన ప్రసంగం గమనిస్తే ఏదో భయం ఆయనను వెన్నాడుతున్నట్లు అనిపిస్తుంది. ఎంత పదవి వచ్చినా, దానిని నిలబెట్టుకోవడానికి ఏమి చేయాలా అన్నదానిపై కాస్త గందరగోళంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాముడి వంటిదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రావణుడి వంటిదని ఆయన అనడంలోనే ఆ డౌటు వస్తుంది. ఆయన ఉద్దేశం తాను రాముడినని, విపక్ష నేత, మాజీ సీఎం చంద్రశేఖరరావును రావణుడని చెప్పడమే కదా!తాను ప్రభుత్వపరంగా ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ఘనంగా చెప్పుకోవచ్చు. ఇచ్చిన హామీలు ఏమిటో, వాటిని ఏ విధంగా నెరవేర్చుతున్నట్లో వివరించగలిగితే ఎక్కువ ప్రయోజనం ఉండేది. రాష్ట్ర అప్పుల గురించి రెండున్నర ఏళ్ల తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎంతవరకు ప్రయోజనం? ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో సహా కొందరు మంత్రులు అప్పులపై బీఆర్ఎస్ నేతలకు సవాళ్లు విసరడం, చర్చలంటూ హడావుడి చేయడం, దానికి ప్రతిగా బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కే.తారక రామారావు, మాజీ మంత్రి హరీష్లు చర్చకు సిద్దం అంటూ ప్రతి సవాల్ చేయడం తదితర ఘట్టాలు చూస్తే ప్రభుత్వం ఏదో రకంగా అప్పుల పేరుతో ఇతర అంశాలను డైవర్ట్ చేయడానికి యత్నిస్తున్నట్లు అనిపిస్తుంది.మిడ్జిల్లో రేవంత్ కూడా అప్పుల ప్రస్తావన తెచ్చి కేటీఆర్, హరీష్రావులను పిల్ల రాక్షసులుగా అభివర్ణించారు. వారిని మీరు అన్నా, వారు మిమ్మల్ని అన్నా ఇదేదో మీ రెండు పార్టీలకే సంబందించిన అంశం కాదు. ఎన్నికలకు ముందు కూడా ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులపై తీవ్ర విమర్శలు చేశారు కదా! అయినా ఆచరణ సాధ్యం కాని అనేక వాగ్దానాలను పీసీపీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ ప్రచారం చేశారు కదా! కాంగ్రెస్ ఎన్నికల మానిఫెస్టోలో పలు హామీలు ఇచ్చారు కదా! పోలింగ్కు కొద్ది రోజుల ముందు రేవంత్ రెడ్డి రైతులకు ఎలాంటి భరోసా ఇచ్చారో గుర్తు చేసుకోండి.కేసీఆర్ గెలిస్తే పదివేలే రైతుకు వస్తుందని, అదే కాంగ్రెస్ గెలిస్తే 15వేలు రూపాయలు వస్తాయని అన్నారా? లేదా? అప్పుడు అది సాధ్యమా? కాదా? అన్నది ఆలోచించలేదా? గతంలో అమెరికా టూర్లో రేవంత్ ఒక మాట అన్నారు. మోసపోయే ప్రజలు ఉన్నంతకాలం రాజకీయ నేతలుగా మోసం చేస్తూనే ఉంటామని వ్యాఖ్యానించారు. ఆ మానిఫెస్టో చూసిన తర్వాత అది నిజమే అనిపిస్తుంది కదా! ఉదాహరణకు మహిళలకు ఒక్కొక్కరికి 2500రూపాయలు చొప్పున ఇస్తామని చేసిన వాగ్దానం గురించి ఇంతవరకు వివరణ ఇచ్చారా? లేదే! అలా అని అసలు ఏ హామీ అమలు కాలేదని చెప్పజాలం. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తున్నారు. పబ్లిక్ స్కూళ్లను కొన్నిచోట్ల ఏర్పాటు చేయడం వరకు బాగుంది. దానిని మెచ్చుకోవచ్చు. రైతులకు రుణమాఫీని కొంతమేర అమలుచేశారు. ఇటీవలి కాలంలో హామీల గురించి మాట్లాడడం కన్నా, బీఆర్ఎస్ను, కేసీఆర్ను తీవ్రంగా విమర్శించడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు అనిపిస్తుంది. తద్వారా ప్రభుత్వ వైఫల్యాలను అటువైపు మళ్లించాలన్న ఉద్దేశం కావచ్చు. కేటీఆర్, హరీష్రావులకు, అదే టైమ్లో బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు సమాధానంగా కూడా కావచ్చు. అయితే విపక్షాలకన్నా ప్రభుత్వంలో ఉన్నవారికి అధిక బాధ్యత ఉంటుంది. వాగ్దానాల సంగతి ఎలా ఉన్నా, కొత్తగా మూసి పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీపై ఎక్కువ దృష్టి పెట్టడం ద్వారా ప్రజల మద్దతు పొందాలని చూస్తున్నట్లు అనిపిస్తుంది. అది కూడా తప్పు కాదు. కాకపోతే మూసికి సంబంధించి రెండున్నర టీఎంసీల మంచినీరు ఎక్కడి నుంచి వస్తుందని మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంటుంది. అలాగని కాలుష్య కాసారంగా ఉన్న మూసిని బాగు చేయవద్దని ఎవరూ చెప్పరు.అలాగే ఫ్యూచర్ సిటీ పేరుతో వేల కోట్లు వ్యయం చేయాలన్న ఆలోచనను కూడా ఒకటికి రెండుసార్లు సమీక్షించుకుని ముందుకు వెళ్లవలసి ఉంటుంది. మెట్రో రైలుకు సంబంధించిన రుణ భారాన్ని నెత్తిన వేసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుందా? లేదా? అన్నదానిపై చర్చ జరగాలి. రైతు భరోసా కింద రైతులకు డబ్బు వేసిన మాట నిజమే. కాని మానిఫెస్టోలో చెప్పినట్లు చేస్తున్నారా? లేదా? అన్నది చర్చనీయాంశం అవుతుంది. విపక్షంగా బీఆర్ఎస్ ఆ ప్రశ్నను లేవనెత్తి రైతులకు రేవంత్ 28720 కోట్ల బకాయిపడ్డారని విమర్శిస్తున్నారు. వీటిపై తగురీతిలో జవాబు ఇస్తున్నట్లు అనిపించదు. అయితే ఇలా ఇవ్వకపోవడానికి గత కేసీఆర్ ప్రభుత్వ పాలనవల్ల కలిగిన నష్టం, అప్పటి అప్పులే కారణమని చెప్పి తప్పించుకోవాలన్నది కాంగ్రెస్ లక్ష్యం కావచ్చు.కేసీఆర్ పాలన, తన పాలనపై చర్చకు సిద్దమని రేవంత్ అంటున్నారు. అదేదో అసెంబ్లీ సమావేశాలలో పెట్టుకోగలిగితే సరిపోతుంది. ఇక ఆయా సభలలో రేవంత్ చేస్తున్న ప్రకటనలు కొన్ని ఆశ్చర్యకరంగాను, ఆసక్తికరంగాను ఉంటున్నాయి. తాను గుంపుమేస్త్రీనని ఆయన ప్రకటించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా తన గుంపేనని, ఈ గుంపే తన బలమని, ధైర్యమని, ప్రజలకు ప్రభుత్వానికి వారధి అని రేవంత్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వారధి అన్నంతవరకు బాగానే ఉంటుంది కాని, గుంపు అనడమే అంత బాగున్నట్లు లేదు. గుంపు అంటే ఏదో మేకలు, గొర్రెల గుంపేమో అన్న భావన కలిగే అవకాశం ఉంది. దీనికి హరీష్ రావు జవాబిస్తూ ముంపు మేస్ల్రీ అని ఎద్దేవ చేశారు. రేవంత్ మంచి ఉద్దేశంతోనే గుంపు మేస్త్రీ అని చెప్పుకున్నా, ఆ పదం అంత బాగున్నట్లు అనిపించదు.మరో సభలో రేవంత్ మాట్లాడుతూ అధికారం కోసం అబద్దాలు చెప్పనని, ఏమి ఉంటే అదే చెబుతానని, చెప్పిందే చేస్తానని, ఇచ్చిన మాట నిలబట్టుకోవడమే తన రాజకీయ జీవితం అని రేవంత్ ప్రకటించారు. నిజంగా అలా చేయగలిగితే ఆయనను అభినందించవచ్చు. రేవంత్తో సహ రాజకీయ నేతలు అబద్దాలు ఆడుతున్నారా? లేదా? అన్నది ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఎన్నికల ముందు ఏమేమి చెప్పింది. వాటిని ఎలా ఆచరించి చూపింది, తద్వారా తాను సత్య సంధుడనని రుజువు చేసుకోగలిగితే ఆయనకు గొప్ప పేరు వస్తుంది. కాని తన రాజకీయ గురువు, ఏపీ ముఖ్యమంత్రి తరహాలోనే రాజకీయ ప్రసంగాలు చేస్తే తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారా? అన్నది చర్చనీయాంశం.ఏపీలో ఉన్న రాజకీయ, సామాజిక పరిస్థితులు వేరు. తెలంగాణలో పరిస్థితులు వేరు. తెలంగాణలో దైర్యంగా ప్రశ్నించగలిగ ప్రజలు ఎక్కువ. ఏపీలో ప్రజలు ఇటీవలి కాలంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి భయపడేలా రెడ్ బుక్ పాలన సాగుతోంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఏపీతో పోల్చితే రేవంత్ సర్కార్ మరీ ఘోరంగా పోలీసులను ప్రజలపై, ప్రశ్నంచేవారిపై ప్రయోగించడం లేదు. అంతవరకు ఓకే. కాని అబద్దాలు చెప్పను అన్న స్టేట్ మెంట్ మాత్రం కాస్త అతిగానే ఉందనిపిస్తుంది. ఇటువంటి ప్రకటనల వల్ల ఆయనకు రాజకీయంగా నష్టం జరగవచ్చు. సాద్యమైనంతవరకు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే ప్రభుత్వాన్ని నడుపతూ ప్రజలకు నిజాలు చెప్పడం వల్లే ఆయనకు మంచి పేరు వస్తుందని అనాల్సి ఉంటుంది. 20 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్నందుకు రేవంత్కు మరోసారి అభినందనలు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సూర్యాపేట లో హైటెన్షన్.. సామెల్-ఛామల కిరణ్ వర్గాల మధ్య దాడి!
-
అమృతం కురిసిన రోజు
‘కోటికి ఒకరే పుడతారు పుణ్య మూర్తులు’ అన్నారు. అలా జనించిన వారు సమాజానికి వెలుగిస్తారు. అందరి జీవితాలలో సంతోషాన్ని వెలిగిస్తారు. జనం గుండెల్లో సజీవులై ఉంటారు. అలాంటి మహామనుషులలో అతి ముఖ్యుడు డా‘‘ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన 1949 జూలై 8న ఈ లోకంలో అడుగుపెట్టాడు. ఆయన మన మధ్య లేక పోయినా ఆయన జన్మదినాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలవారూ ఓ పండుగలా జరుపుకొంటున్నారు. ఆయన చిత్రపటానికి పాలాభిషే కాలు, పూలాభిషేకాలు ఇంకా చేస్తున్నారు అంటే ఆయన ఎంత మేలు చేశారో, ఎన్ని ప్రాణాలు నిలిపారో లెక్కేయడం కష్టం. ఈ మధ్య చంద్రబాబు సమక్షంలో ‘నేను ఇంకా జీవించి ఉండటానికి కారణం రాజశేఖరరెడ్డిగారు, ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ’ అని ఓ మహిళ ధైర్యంగా ప్రకటించింది. అందుకే ఆయన దేవుడయ్యాడు. వైద్య విద్య పూర్తయిన తరువాత ఆస్పత్రి పెట్టి ఒక రూపాయికే వైద్యం చేశాడు. అందుకే ఆయన్ని జనం ‘రూపాయి డాక్టరు’గా పిలుచుకున్నారు. ప్రజలకు కేవలం వైద్యం అందిస్తే చాలదు, ఇంకా అనేక విషయాలలో వారికి సేవలు అందాలంటే శాసనం చేసే అధికారం ఉండాలని భావించాడు. అందుకే రాజకీయ రంగప్రవేశం చేశాడు. తన వ్యక్తిత్వం, నిజాయితీ నిలుపుకొంటూనే ముందుకు సాగాడు. ఆరుసార్లు శాసనసభ్యుడిగా, నాలుగుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక అయిన తిరుగులేని నాయకుడాయన.పాదయాత్రలతో చరిత్ర33 సంవత్సరాల అతి చిన్న వయసులోనే ఆయన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. 1985 నుంచి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఉపనాయకుడుగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ప్రజల కోసం చేసిన పోరాటాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఓ సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావును సెక్రటేరియట్ ముందు నడిరోడ్డులో నిలువరించాడు. ఆ తెగువ చూసి రాష్ట్రం ముక్కున వేలేసుకుంది. ఇతను కదా నాయకుడు అనుకుంది. రామారావు సైతం ఆంతరంగికుల ముందు రాజశేఖరరెడ్డిని మెచ్చుకున్నారట. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్ర బాబు ఆనాడు విద్యుత్ చార్జీలు పెంచితే దాన్ని వ్యతిరేకిస్తూ 90 మంది శాసనసభ్యులతో కలిసి ఆ రోజుల్లో నిరాహార దీక్షచేశాడు. రైతులను రక్షించడానికి వారికి ఉచిత విద్యుత్తు అందించాలన్న ఆలోచన ఆయనకు ఆనాడే వచ్చిందేమో!రాయలసీమ ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే పోతి రెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కెనాల్ సామర్థ్యం పెంచాలని 1986లో 22 రోజులు పాదయాత్ర చేశాడు వైఎస్. ఆ తరువాత ముఖ్యమంత్రిగా ఆ కెనాల్ సామర్థ్యం పెంచాడు. పాదయాత్రలో సెక్యూరిటీ, సౌకర్యాలు, భోజనం – ఏవీ పట్టించుకునేవాడు కాదు. కొన్నిసార్లు నేరుగా పొలాల్లోకో, ఎదురుగా ఉన్న గుడిసెలోకో హఠాత్తుగా వెళ్ళి పోయేవాడు. వారి మాటలు వినేవాడు. కష్టం తెలుసుకునేవాడు. 2003లో వైఎస్సార్ చేసిన సుదీర్ఘ పాదయాత్ర ఓ సువర్ణా ధ్యాయానికి ఆరంభం. చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు 1,673 కిలోమీటర్లు 67 రోజుల పాటు నడిచి, ప్రజల మధ్య నిలిచాడు. ఆయన వెంట ఉన్న మాకు అనుక్షణం ఓ కొత్త అనుభవం. నడి ఎండలో నడుస్తూ కూడా ఆయన ఆలోచించింది తనవారి కోసం, తన ప్రజల కోసం. తాను తినడానికి ముందు భోజనం అందరికీ అందిందా అని చూసేవాడు. అందరి మధ్యలోనే పడుకునేవారు. ఏసీ గదులు ఉన్నాయని చెప్పినా వారించేవాడు. పాదయాత్రలో ఆయన పరిష్కరించిన సమస్యలపై ఓ పెద్ద పుస్తకం రాయచ్చు. పాదయాత్ర మధ్య దశలో ఆయన ఆరోగ్యం క్షీణించింది. అయినా లెక్క చేయలేదు. నాలుగు రోజుల విశ్రాంతి తర్వాత తిరిగి కదిలాడు. వైద్యులు వారించారు. నేనూ వైద్యుడినే అన్న విషయం మరచి పోతున్నారు అన్నాడు చిరునవ్వుతో! పథకాలే పతకాలుగా...2004 ఎన్నికలలో ప్రజలు ఆయనకు అఖండ మెజారిటీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన ఒక స్వర్ణయుగం. ఒక విప్లవం. ఒక మార్పు, ఒక భరోసా, ఒక కదలిక. అన్ని రాష్ట్రాలు ఆరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూశాయి. ఒక మంచి మనిషి అధికారంలోకి వస్తే ఇన్ని మంచి పనులు చేయవచ్చా అని ఆశ్చర్యపోయాయి. ఉచిత కరెంటు అందింది. పేదల ఇంటి ముందుకు ఆరోగ్యశ్రీ వచ్చి కొన్ని లక్షల ప్రాణాలు నిలిచాయి. ఆయన చిత్రపటాన్ని ఇంటిలో పెట్టుకున్నారు. పేద విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్య అందింది. లక్షలాది మంది పేద విద్యార్థులు విద్యావంతులై లక్షలు సంపాదిస్తున్నారు. ‘జలయజ్ఞం’తో రైతుల ముఖం నిండా ఆనందం. హింసావాదాన్ని వీడి ప్రజలలో కలవండి అని అభ్యర్థిస్తూ నక్సలైట్లతో చర్చలు కూడా జరిపారు. శాంతిమయ రాష్ట్రాన్ని స్వప్నించిన మహాస్వాప్నికుడు ఆయన. తిరుమల శ్రీవేంక టేశ్వర స్వామి వారి అఖండ వైభవ ప్రచారానికి అంతులేని కృషి, కార్యక్రమాలు చేసి శ్రీనివాస ప్రభువు పల్లకీ మోసి, పల్లె పల్లెకు తీసుకువెళ్ళిన హైందవ ధర్మ సేవకుడాయన. శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ స్థాపకుడు. ‘కల్యాణమస్తు’ అన్న కరుణామూర్తి. మహా విషాదం2009 ఎన్నికలలో తిరిగి అధికారంలోకి వచ్చారు. కానీ అను కోని పరిణామం ఆయనను మనకు దూరం చేసింది. ఓ నాయకుని కోసం కొన్ని వందల మంది ఆత్మార్పణ చేసుకోవడం కనీ వినీ ఎరు గని మహావిషాదం. ఇలాంటి అద్భుత వ్యక్తి హితుడు, స్నేహితుడు, గురువు అయినందుకు నాకు ఆనందం, గర్వం. ఆయనతో గడిపిన ప్రతిక్షణమూ నాకు కొత్త పాఠం. నా తప్పులు దిద్దాడు. నా చేయి పట్టి నడిపాడు. ‘కరుణా’ అంటూ ప్రేమగా పిలిచాడు. నిత్యం పచ్చ గానూ, పచ్చిగానూ ఉంది ఆ జ్ఞాపకం. నాలాంటి కొన్ని లక్షల మందికి జీవన సౌభాగ్యం కల్పించిన ఆ మహానాయకుడు మళ్ళీ జన్మించి మన మధ్యకు రావాలని ప్రార్థిద్దాం. మదిలోని ఆయన జ్ఞాపక సజీవ చిత్ర పటానికి ఈ విధంగా అక్షర సుమాలు అర్పించు కోవడం, నా తీరని తీయని ఋణం, బంధం, బాంధవ్యం!భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త తిరుపతి మాజీ శాసనసభ్యులు -
తెలంగాణపై బీజేపీ ఆపరేషన్ 2028.. అసలు గేమ్ మొదలైందా?
తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ఆరంభించింది. ప్రధాని మోదీనే ఇందుకు శ్రీకారం చుట్టారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొద్ది రోజుల క్రితం తెలంగాణలో పర్యటించి వివిధ సభలలో పాల్గొన్నారు. ఆయన చేసిన ప్రసంగాలు గమనిస్తే.. 2028 శాసనసభ ఎన్నికలలో ఎలాగైనా తెలంగాణపై కాషాయ జెండా ఎగురవేయాలన్న సంకల్పం కనిపిస్తుంది. ఆయన కొత్తగా అధ్యక్షుడు అయినందున భవిష్యత్తులో వచ్చే ఎన్నికలన్నీ ఆయన సామర్థ్యానికి పరీక్షలు అవుతాయి. జయాపజయాలపై పూర్తిగా ఆయనదే బాధ్యత కాకపోవచ్చు. కాని సహజంగానే ఆయనపై అందరి దృష్టి ఉంటుంది.నితిన్ చేసిన ప్రసంగాలలో కొన్ని కీలక అంశాలు కనిపిస్తాయి. పశ్చిమబెంగాల్లో మాదిరే విజయం సాధించాలని, అందుకోసం ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. తెలంగాణలో గెలుపుపై ధీమాను కూడా ఆయన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తే తప్పుకాదు. కాని మతపరమైన అంశాలతో ప్రజలను రెచ్చగొట్టడం, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో లక్షల ఓట్ల తొలగింపు వంటివి జరుగుతాయా అన్న సందేహం వస్తుంది.బెంగాల్లో టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఆధ్వర్యంలోని ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండవచ్చు. కాని దానికి మించి బీజేపీ కేంద్రంలో తనకు ఉన్న అధికారాన్ని ఉపయోగించి మమతను ఉక్కిరిబిక్కిరి చేయడానికి యత్నించింది. తన చేతిలో ఉండే సీబీఐ, ఈడి వంటి సంస్థలను విచ్చలవిడిగా టీఎంసీనేతలపై ప్రయోగించిందన్న విమర్శలు వచ్చాయి. తెలంగాణలో కూడా ఇలాంటి వ్యూహాలను అమలు చేసే అవకాశం ఉందా? అంటే లేదని చెప్పడం కష్టమే.గత పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో ఎనిమిది సీట్లను సాధించి బీజేపీ సంచలనం సృష్టించింది. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ బాగా బలహీనపడినట్లు కనిపించినా, తర్వాత యధా ప్రకారం ఆ పార్టీ అగ్రనేతలు బాగా యాక్టివ్ అయి టూర్లు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు సాగిస్తున్నారు. అందువల్లే కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. మాచ్ పిక్సింగ్ చేసుకుంటే తప్ప బీజేపీ అధికారంలోకి రాలేదని వ్యాఖ్యానించారు. ఆ సంగతి ఎలా ఉన్నా, తెలంగాణలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉందని చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నా అది బీజేపీకి ప్లస్ అవుతుందన్న నమ్మకం ఇంకా రా లేదు.జనంలో ఉన్న ఒక అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యే ప్రధాన పోటీ ఉండవచ్చనిపిస్తుంది. అందుకే ఒక నెల రోజులలో తెలంగాణలో బీజేపీకి అనుకూల పరిస్థితులు తయారు కావాలని నితిన్ నబీన్ పార్టీ నేతలను ఆదేశించారు. హైదరాబాద్లోని కార్పొరేషన్లకు జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయాలు సాధించాలని ఆయన నిర్దేశించారు. ఇందుకోసం రాష్ట్ర బీజేపీ నేతలు కలిసికట్టుగా ఎంత దూకుడుగా వెళతారు? కేంద్రంలో తమకు ఉన్న అధికారాన్ని ఇక్కడ కూడా ఏ మేరకు ప్రయోగిస్తారు? రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ను ఎదగనీయకుండా చేయడానికి ప్రత్యేక ప్రణాళికను ఏమైనా అమలు చేస్తారా? అన్నది చర్చనీయాంశం అవుతుంది.ఈ క్రమంలో బీజేపీ ఒంటరి పోరుకే సిద్ధపడవచ్చని ఆ పార్టీ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొద్దికాలం క్రితం ఇదే మాట ఓపెన్గా చెప్పారు. ఇతర రాష్ట్రాలలో ఇప్పటికే ఉన్న పొత్తులు కొనసాగిస్తారా? లేక అక్కడ కూడా ఒంటరిగా ఎదగడానికి యత్నిస్తారా? అన్నదానిపై క్లారిటీ లేదు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా బీజేపీ ఇక్కడ ఒంటరిగా పోటీచేస్తే ఏపీలో దాని మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తాయి అన్న చర్చ వస్తుంది. పెద్దగా బలం లేకపోయినా, ఆ పార్టీలకు ఎంతో కొంతమంది అభిమానులు ఉంటారు. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటారు. ఇద్దరు గురుశిష్యులుగా పేరొందారు.కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక సభలో కర్నాటక ముఖ్యమంత్రి డీ.కే శివకుమార్తో కలిసి చంద్రబాబు, రేవంత్లు పాల్గొన్నారు. డీ.కే మాట్లాడుతూ తాము ముగ్గురం కలిసి చరిత్ర సృష్టించబోతున్నామని వ్యాఖ్యానించారు. రేవంత్ను చంద్రబాబు పొగిడారు. తెలంగాణ అభివృద్ది కోసం రేవంత్ బాగా కష్టపడుతున్నారని, తెలంగాణ ప్రాజెక్టుల కోసం రేవంత్ రాజీ పడరని ప్రశంసించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని అనుకుంటున్న సమయంలో బీజేపీ మిత్రుడైన చంద్రబాబు ఇలా కాంగ్రెస్ నేతను మెచ్చుకోవడం ఆసక్తికరమైన అంశమే. దీనిపై ఏమి మాట్లాడాలో బీజేపీ తెలంగాణ నేతలకు అర్థం కావడం లేదు. అందుకే ఏపీకే తమ మితృత్వం పరిమితమని, ఇక్కడ టీడీపీ తన సొంత వ్యూహం అమలు చేయవచ్చని వారు చెబుతున్నారు.మరో వైపు రేవంత్ రెడ్డి తనకు టీడీపీతో ఉన్న సంబంధాలను వాడుకుంటూ ఆ పార్టీకి కాస్తో, కూస్తో ఉన్న క్యాడర్ను, అభిమానులను కాంగ్రెస్ వైపు ఆకర్షించడానికి యత్నిస్తున్నారు. టీడీపీతో పాటు ఒక సామాజికవర్గం ఓట్లను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేశారు. టీడీపీ వారు కూడా కాంగ్రెస్కే మద్దతు ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు. దీనిని కాంగ్రెస్ అధికార ప్రతినిదులు బహిరంగంగానే అకనాలెడ్జ్ చేస్తూ, టీడీపీ తమకే మద్దతు ఇస్తుందని టీవీ చర్చలలో చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నగరపాలక సంస్థల ఎన్నికలు పలు రాజకీయ పరిణామాలకు కీలకంగా ఉండవచ్చు. ఈ ఫలితాల ప్రభావం భవిష్యత్తులో తెలంగాణ శాసనసభ ఎన్నికలపై పడే అవకాశం ఉంది.చంద్రబాబు వ్యూహాత్మకంగా రేవంత్ ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో పరోక్ష స్నేహం కొనసాగిస్తున్నారని, అలాగే చంద్రబాబు ద్వారా రేవంత్ బీజేపీ అగ్ర నాయకత్వంతో సంబంధాలు పెట్టుకోగలిగారన్న ప్రచారం రాజకీయ వర్గాలలో ఉంది. అయితే దీనికి ఇప్పటికిప్పుడు ఆధారాలు కనిపించకపోవచ్చు. కాకపోతే ప్రధాని మోదీ తన సభలో రేవంత్ను ఉద్దేశించి తమతో కలిసి పనిచేయాలని అంటూ చేసిన వ్యాఖ్యలను కొందరు ఉదహరిస్తుంటారు. అంతేకాక రేవంత్కు మోదీ అప్పాయింట్మెంట్ ఇచ్చే విధానాన్ని కూడా కొందరు ప్రస్తావిస్తుంటారు.కాగా ఇటీవల మెట్రో రైల్ వివాదంలో రేవంత్ కోరిక మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చలు జరిగేలా చూశారు. అయినా మెట్రో రుణం విషయం కాని, రెండో దశ గురించి కాని స్పష్టత రాలేదు. రేవంత్కు సహకరిస్తున్నట్లు కనిపిస్తూనే బహుశా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి బీజేపీ ఈ వ్యూహం అమలు చేస్తోందా అన్న అభిప్రాయం కలుగుతుంది. కాంగ్రెస్తో పాటు ప్రాంతీయ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని నితిన్ మండిపడ్డారట. ఒకవైపు అలాంటి ప్రాంతీయ పార్టీలతో జతకడుతూ, మరోవైపు ఇలా ఉపన్యాసాలు ఇస్తే వినే జనం ఆశ్చర్యపోవల్సిందే.వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని వీరు చెబుతారు. కాని అదే వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలతో మితృత్వం చేస్తుంటారు. అవకాశవాద రాజకీయాలకు బీజేపీ అతీతం కాదని చెప్పడానికి ఇవన్ని ఉదాహరణలే అవుతాయి. ఏది ఏమైనా తన అధికారాన్ని అడ్డు పెట్టి ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై వేదింపులు, అక్రమ కేసులు, సీబీఐ, ఈడి సంస్థల దాడులు వంటివి చేయకుండా ఫెయిర్ రాజకీయం చేసి తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. కాని ప్రస్తుత బీజేపీ నాయకత్వం అలాంటి నిబద్దత కలిగిన రాజకీయం చేస్తోందా అన్నదే ప్రశ్న.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బీజేపీకి బిగ్ సవాల్
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో బీజేపీకి మరో శత్రువు లేడు. పార్టీలోనే ఒకరికి ఒకరు శత్రువులు ఉన్నారు. ఇదే పెద్ద సమస్య. ప్రధానమైన ఈ సమస్యను అధిగమిస్తే అన్నీ అవే సర్దుకుంటాయి. పార్టీ అధికారంలోకి రావడం ఖాయం’అని రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ అభయ్ పాటిల్ ఇటీవలి సమావేశంలో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అధినాయకత్వం చేసిన సీరియస్ హెచ్చరికలను రాష్ట్ర నేతలు సీరియస్గా తీసుకుంటారా లేదా అన్నది ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో హాట్టాపిక్గా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర బీజేపీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో వెనుకడుగుపై నిర్దిష్ట కార్యాచరణ రూపకల్పనలో రాష్ట్ర బీజేపీ విఫలమవుతున్నట్టుగా విమర్శలు వినిపిస్తున్నా యి. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను ఎండగట్టే విషయంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపైనా స్పష్టత కొరవడిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ముగ్గురు ముఖ్య నేతలు పర్యటించినా.... దాదాపు 40 రోజుల వ్యవధిలోనే బీజేపీకి చెందిన అగ్ర నాయకత్వ త్రయం తెలంగాణలో పర్యటించింది. మే 10న సికింద్రాబద్ పరేడ్గ్రౌండ్స్లో ప్రధాని మోదీ, జూన్ 12న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, జూన్ 28–30 తేదీల మధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్నబిన్ పర్యటించారు. రాష్ట్ర పర్యటనల విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నా.. రాష్ట్ర బీజేపీ మొక్కుబడిగా అప్పుడప్పుడు క్షేత్రస్థాయి పోరాటాలు తప్ప ఓ స్పష్టమైన దీర్ఘకాలిక కార్యాచరణతో ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయడంలో వెనుకడుగు తప్పడం లేదంటున్నారు. తెలంగాణలో పార్టీ పూర్తిస్థాయిలో పుంజుకొని, ప్రజల ఆదరణతో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదిగే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూడు దశాబ్దాలుగా పార్టీ పుంజుకోవడం మళ్లీ ఎన్నికల ముందు చతికిలబడడం ఓ ప్రహసనంగా మారడంతో అధినాయకత్వం తలపట్టుకుంటోంది. అధిష్టానం ‘మందు బిళ్ల’పనిచేస్తుందా ? బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్నబిన్ మూడురోజుల పర్యటన సందర్భంగా రాష్ట్ర పార్టీలో నేతలు గ్రూపులుగా విడిపోవడం, సమన్వయ లేమి సమస్యలుండడాన్ని సహించబోమని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యనేతలు మొదలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు గ్రూపులుగా విడిపోవడం, పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించడంపై పద్ధతి మార్చుకోవాలని మందలించినట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రూపులను టాలరేట్ చేసే పరిస్థితి లేదని నితిన్నబిన్ స్పష్టం చేశారు. పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తే ఎంత పెద్ద నేతనైనా ఉపక్షించే పరిస్థితి లేదని గట్టి వార్నింగే ఇచ్చారు. బెంగాల్ కేడర్ కసి ఇక్కడెందుకు లేదు ? తాజాగా జరిగిన రాష్ట్ర కార్యవర్గభేటీలో పదేళ్లలో తృణముల్ కాంగ్రెస్ పాలనలో పశ్చిమబెంగాల్లో బీజేపీ కార్యకర్తలు ఎంతటి పీడన, అణచివేత, హత్యలు, అత్యాచారాలకు గురయ్యారో ఆ రాష్ట్ర ఇన్చార్జ్గా పనిచేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్ బన్సల్ వివరించారు. అక్కడ తృణమూల్ అరాచకాలను ఎదుర్కోవడంతోపాటు, 15 వేల మంది కార్యకర్తలు తప్పుడు కేసులతో జైళ్లకు వెళ్లినా వెనుకడుగు వేయకుండా పోరాడారని, అలాంటి నిబద్ధత, కచ్చితంగా ఫలితాలు సాధించాలనే కసి రాష్ట్ర పార్టీలో ఎందుకు కరువైందని ప్రశ్నించారు. రాష్ట్ర పదాధికారులు, కార్యవర్గసభ్యుల్లో ఎవరు పని చేస్తున్నారు? ఎవరు టైంపాస్ చేస్తున్నారో అధిష్టానం దగ్గర పూర్తి సమాచారం ఉందని బన్సల్ హెచ్చరిచ్చినట్టు తెలిసింది. బెంగాల్లో కార్యకర్తల మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలీసు కేసులకు సైతం వెరవకుండా రాజీలేని పోరాటానికి సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. -
ఏం చేద్దాం.. ఎలా చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 25 లక్షల ఎకరాలు. రాష్ట్రంలోని పేదలకు దశాబ్దాలుగా ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూమి ఇది. ఈ భూములపై అసైనీలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అసైన్డ్ భూములకే కాదు దాదాపు 7 లక్షల ఎకరాల పోడు భూములపై కూడా హక్కులిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. కానీ అధి కారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతుండగా..అప్పటినుంచి ఇప్పటివరకు అసైన్డ్ భూముల విషయంలో ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్న దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతూనే ఉంది. అయితే తాజాగా.. మంత్రివర్గ భేటీలో దీనిపై చర్చ జరిగిన నేపథ్యంలో.. దీనికి సంబంధించి పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. హక్కుల కల్పనతో పాటు ల్యాండ్ పూలింగ్, రెగ్యులరైజేషన్, పరిమిత అధికారాల కల్పన లాంటి ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నప్పటికీ అసైన్డ్ భూములు కలిగిన పేదలకు ఉచితంగా హక్కులు కల్పించాలనే నిర్ణయానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అన్నివిధాలా అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు ఈ భూముల విషయంలో ఏం చేయాలన్నా తెలంగాణ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టానికి (1977) సవరణలు చేయాల్సి ఉన్నందున చట్ట సవరణ ముసాయిదాను తయారు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. కేబినెట్లో ఏం జరిగింది? విశ్వసనీయ సమాచారం ప్రకారం..పేదలకు హక్కులు కల్పించడం, తదుపరి పరిణామాలు, ప్రత్యామ్నాయాలపై మంత్రివర్గ భేటీలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తేనే బాగుంటుందని కొందరు అభిప్రాయపడగా, అలా చేస్తే పేదల చేతుల్లో ఉండే కొద్దిపాటి భూములు అన్యాక్రాంతమవుతాయని, కాబట్టి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని కొందరు చెప్పారు. మరికొందరు.. పూర్తి హక్కుల కల్పన కాకుండా నాలా తరహాలో భూమి వినియోగ మార్పిడి అధికారాలు కల్పిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ద్వారా అన్ని లక్షల ఎకరాల భూమి ఒకేదఫాలో మార్కెట్లోకి వస్తే రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం పడే అవకాశముందని, అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఇంకొందరు చెప్పారు. ఈ నేపథ్యంలో దీనిపై మంత్రివర్గం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. దీనిపై పూర్తిస్థాయి అధ్యయనానికి మంత్రుల కమిటీ లేదా భూచట్టాల నిపుణులు, అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. హక్కుల కల్పనకు సిఫారసులు అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పించాలని ప్రభుత్వానికి పలు సిఫారసులు వచ్చాయి. ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీతో పాటు వ్యవసాయ కమిషన్ తమ సిఫారసులు పంపాయి. ప్రపంచ బ్యాంకు, ఇతర అరి్థక సంస్థలు, భూ విధానాలపై పనిచేసే అంతర్జాతీయ సంస్థలు కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని తమ నివేదికల్లో పేర్కొన్నాయి. భూమి అమ్మకాలు, కొనుగోళ్లపై ఆంక్షలు ఉండకూడదని, అలా ఉండడం పేదల ఆర్థికాభివృద్ధికి అడ్డంకిగా మారుతుందని, దేశ ఆర్థిక వృద్ధి కూడా నెమ్మదిస్తుందని వెల్లడించాయి. మార్కెట్లోని ఇతర వస్తువులు మాదిరిగా ల్యాండ్ మార్కెట్ కూడా సరళంగా ఉండాలని, అలా ఉన్నప్పుడే పేదలకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయం కూడా ఈ నివేదికల్లో వ్యక్తమైంది. తర్వాతి పరిణామాలపై మల్లగుల్లాలు ఇంతవరకు బాగానే ఉన్నా.. హక్కుల కల్పన తర్వాత ఏం జరుగుతుందన్న దానిపైనే ప్రభుత్వ పెద్దలు ప్రధానంగా మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా గత 20 ఏళ్ల కాలంలో దేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీల చేతుల్లో ఉన్న భూకమతాల సంఖ్య తగ్గిపోతోందని పలు నివేదికలు చెపుతున్నాయని, తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని, పేదలకు భూములు లేకుండా పోతాయనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే కొందరు మంత్రులు అభిప్రాయపడినట్టుగా.. ఇంత పెద్ద మొత్తంలో భూములు ఒకేసారి మార్కెట్లోకి వస్తే రియల్ ఎస్టేట్ రంగం ఒడిదుడుకులకు లోనవుతుందనే మీమాంస కూడా ప్రభుత్వ పెద్దలను అయోమయంలో పడేస్తోందనే చర్చ జరుగుతోంది. రెండు ప్రధాన ప్రత్యామ్నాయాలు..! ఒకవేళ పేదలకు అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించని పక్షంలో ప్రభుత్వం ముందు రెండు ప్రధాన ప్రత్యామ్నాయాలు ఉన్నట్టు సమాచారం. కాగా ఇవి రెండూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరిశీలించినవే కావడం గమనార్హం. అందులో ల్యాండ్ పూలింగ్ (పేదల వద్ద ఉన్న అసైన్డ్ భూములను ప్రభుత్వమే సమీకరించి వారికి ఆ భూమిలో సంపూర్ణ హక్కులు కల్పిస్తూ కొంత భాగం ఇవ్వడం) ఒకటి కాగా ఈ విషయంలో సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీంతో ల్యాండ్ పూలింగ్ అంశాన్ని అధ్యయనం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలావుండగా అసైనీల చేతుల నుంచి దాదాపు 10 లక్షల ఎకరాల వరకు అన్యాక్రాంతమైనట్టుగా గణాంకాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేదల వద్ద ఉన్న అసైన్డ్ భూములను వారికి ఉచితంగానే ఇచ్చేసి, ఇతరుల చేతుల్లో ఉన్న భూములను ప్రభుత్వ విలువకు క్రమబద్ధీకరించే వీలుంది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.30 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అసైన్డ్ భూముల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. చిక్కులున్నా హక్కులు కల్పిస్తే మేలు అసైన్డ్ భూముల విషయంలో చాలా చిక్కులున్నాయి. భూరికార్డులు సరిగా లేవు. పట్టా మార్పిడి జరగడం లేదు. కొత్త పుస్తకాలు రావడం లేదు. విస్తీర్ణంలో వ్యత్యాసాలున్నాయి. ఈ రికార్డులను సరిచేసి పేదలకు భద్రమైన భూమి హక్కులు కల్పించగలగాలి. భూముల జియో ట్యాగింగ్ చేయాలి. తాత్కాలిక భూదార్ ఇవ్వాలి. ఆ తర్వాత అన్నీ సరి చేసి శాశ్వత భూదార్ ఇవ్వాలి. ఏది ఏమైనా పేదలకు అసైన్ చేసిన భూమిపై వారికి పూర్తి హక్కులు ఇస్తే మేలు జరుగుతుంది. 25 లక్షల ఎకరాల భూమిలో అందరూ అమ్ముకోవాలనుకునే వారుండరు. – ఎం.సునీల్కుమార్, భూచట్టాల నిపుణుడు -
రంకెలు వేస్తే అంకెలు మారవు
సాక్షి, హైదరాబాద్: అప్పుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో రూ.8.21 లక్షల కోట్ల అప్పు అంటూ గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయలేక, రోజూ బయటపడుతున్న అవినీతి ఆరోపణలు, స్కామ్ల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రోజుకో కొత్త అప్పుల లెక్క చెబుతున్నారని ధ్వజమెత్తారు. ‘రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవు. మా మాట అసెంబ్లీలో ఒకటే.. బయట ఒకటే. మీరు మాత్రం శ్వేతపత్రంలో ఒకలా, అసెంబ్లీలో మరోలా, ప్రెస్మీట్లలో ఇంకోలా చెబుతున్నారు. బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా, ఎమ్మెల్యేగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, కేసీఆర్ శిష్యుడిగా చెప్తున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లే. దీనిపై అసెంబ్లీలోనైనా, బహిరంగ వేదికపైనైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధం..’అని మరోసారి సవాల్ విసిరారు. రాష్ట్రానికి అప్పులు ఇప్పించేందుకు సచివాలయం చుట్టూ బాంబే, గుజరాత్ బ్రోకర్లు తిరుగుతున్నారని లంచాలు ఇచ్చి అప్పులు తెచ్చే దుస్థితి దేశంలో ఎక్కడా లేదని ధ్వజమెత్తారు. శనివారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కేపీ వివేక్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి చెప్పిన అప్పుల లెక్కలకు కౌంటర్ ఇచ్చారు. రేవంత్, భట్టి..ఎవరు చెప్పింది నిజం? ‘భట్టి విక్రమార్క వెల్లడించిన పత్రాల్లో.. తెలంగాణ ఏర్పాటుకు ముందున్న రూ.84,268 కోట్ల రుణాలను, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 7 నుంచి 2024 మార్చి 31 వరకు తీసుకున్న రూ.15,118 కోట్ల అప్పును కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ ఖాతాలో కలిపేశారు. ఈ రెండూ కలిపి రూ.99,386 కోట్లను 2023 డిసెంబర్ నాటికి ఉన్న మొత్తం బకాయి రూ.5,16,881 కోట్ల నుంచి తీసేస్తే అసలు అప్పు రూ.4,17,495 కోట్లు మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రం, కాగ్ నివేదిక, ఆర్బీఐ గణాంకాలు, ఎకనామిక్ సర్వే అన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లేనని చెబుతున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3.47 లక్షల కోట్లు అప్పు చేసినట్లు మార్చి 18న అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. కానీ ఇప్పుడు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మాత్రం రూ.1.77 లక్షల కోట్లే అని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చెప్పింది నిజమా? లేక ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చెప్పింది నిజమా? నాలుగు నెలల్లో అప్పు ఎలా తగ్గింది?..’అని హరీశ్రావు నిలదీశారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4.50 లక్షల కోట్ల అప్పు చేసిందని చెప్పారు. అప్పుల కోసం రూ.వందల కోట్ల కమీషన్లు ‘ప్రస్తుత ప్రభుత్వం అప్పులు కూడా పారదర్శకంగా తీసుకురాలేక బ్రోకర్లకు వందల కోట్ల రూపాయల కమీషన్లు చెల్లిస్తోంది. టీజీఐఐసీ భూముల తాకట్టు ద్వారా రూ.10 వేల కోట్ల అప్పు కోసం రూ.170 కోట్ల బ్రోకరేజ్ చెల్లించారు. హెచ్ఎండీఏ భూములపై మరో రూ.20 వేల కోట్ల అప్పు తెస్తే మొత్తం రూ.510 కోట్ల వరకు బ్రోకర్లకు చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. డిస్కంలు, హైదరాబాద్ కార్పొరేషన్లు, వాటర్ బోర్డు ద్వారా మరో రూ.70 వేల కోట్ల అప్పు సమీకరించే లక్ష్యంతో మొత్తం లక్ష కోట్ల అప్పులకు రూ.1,710 కోట్ల వరకు కమీషన్లు వెళ్తున్నాయి..’అని హరీశ్రావు ఆరోపించారు. -
రాముడా.. రావణుడా? ఎవరి పాలన కావాలి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలి. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. రాహుల్ను ప్రధానిని చేయాల్సిన చారిత్రక అవసరం దేశంలో ఉంది. ఇందుకు తెలంగాణ ప్రజలు అండగా ఉండి.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాందీకి కృతజ్ఞత తెలపాలి. నాతో కలిసి నడవండి.. రాహుల్ను ప్రధానిని చేద్దాం. అందుకు మొదటి అడుగు మిడ్జిల్ మండలం నుంచే పడాలి. – సీఎం రేవంత్రెడ్డిసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పాపాల భైరవుడు రావాలి.. రావాలి అని కొడుకు, అల్లుడు తిరుగుతున్నారని, పదేళ్లలో రూ.8.21 లక్షల కోట్లు అప్పులు చేసిన కేసీఆర్ ప్రజలకు ఏం చేశారని సీఎం రేవంత్రెడ్డి నిలదీశారు. ‘మీ ఊళ్లలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్లు, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాలు ఇచ్చారా? కోటి ఎకరాలకు నీళ్లు అందించారా? ఎందుకు వీళ్లు మళ్లీ రావాలి?..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనను రావణుడితో, కాంగ్రెస్ పాలనను రాముడి పాలనతో పోలుస్తూ.. రాముడి పాలన కావాలా.. రావణుడి పాలన కావాలా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధిగా 20 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా రేవంత్రెడ్డి శనివారం మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో పర్యటించారు. ముందుగా నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే ఆత్మీయులతో ముచ్చటించారు. ఆ తర్వాత డీసీసీబీ మాజీ చైర్మన్ ధ్యాప గోపాల్రెడ్డి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మిడ్జిల్ మండలంలోని 40 గ్రామ పంచాయతీలకు రూ.50 లక్షల చొప్పున మొత్తం రూ.20 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ఊర్కొండ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లతో శిలాఫలకం ఆవిష్కరించారు. సుమారు రూ.17 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన ఆత్మీయ కృతజ్ఞత వందన సభలో మాట్లాడారు. ఏం చేశారని మీకు లక్షల కోట్లు వచ్చాయి? ‘పదేళ్లలో ఏం వ్యాపారం చేశారని మీకు, మీ కుటుంబాలకు లక్ష కోట్లు వచ్చాయి. తెలంగాణకు రూ.8.21 లక్షల కోట్ల అప్పులు ఎలా మిగిలాయి? బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఫామ్హౌస్లో పండించిన గంజాయి, డ్రగ్స్ను రైతు బజార్లలో పెట్టి అమ్ముతారు. మీతో పాటు పాటు దోపిడీ చేసిన ఆఫీసర్లను నిన్న మొన్న ఏసీబీ ఆఫీసర్లు పట్టుకుంటున్నారు. ఒక్కొక్కరి వద్ద రూ.100 కోట్లు, రూ.200 కోట్లు, రూ.300 కోట్ల అక్రమ సంపాదన బయట పడుతోంది. వీళ్లకు ఈ సొమ్ము ఎక్కడిది? ప్రజల నుంచి దోచుకున్నదే కదా. కేసీఆర్కు గజ్వేల్, ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల ఫాంహౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? కేటీఆర్కు జన్వాడలో వంద ఎకరాలు, హరీశ్రావుకు మొయినాబాద్లో 50 ఎకరాలు, కల్వకుంట్ల కవితకు శంకర్పల్లిలో 25 ఎకరాల ఫామ్హౌస్లు ఎక్కడి నుంచి వచ్చాయి? నీ షడ్డకుడి కొడుకు సంతోష్రావుదైతే లెక్కలు చెప్పనికే లేదు. ఇంత సంపాదన ఈ పదేళ్లలో ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడివి ఈ ఆస్తులు? ఎక్కడ సంపాదించారు. ఎందుకు తెలంగాణ అప్పుల పాలైంది? మీకు ఉరి శిక్ష వేసినా తక్కువే.. బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లు దండుకున్న దుర్మార్గులు, నీచులు. వాళ్ల సంపాదన, దోపిడీ, దొంగతనాలు ఆగిపోయాయనే మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అప్పులు, తప్పులు చేసినవాళ్లు మళ్లీ వస్తే రాష్ట్రంలో ఫోన్ కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోలేరు. ఆడబిడ్డల మాటలు దొంగతనంగా వినేవాడు అసలు మనిõÙనా? అసెంబ్లీకి రాడు.. ప్రజాసమస్యలు ప్రస్తావించడుం. అధికారం ఇస్తే దోచుకోవడానికి మాత్రం వస్తాడట. పదేళ్లలో రాష్ర్టంలో ఆయన చేసింది ఏమంటే ఇసుక దోపిడీకి అడ్డుపడిన నేరెళ్ల దళితులపైకి లారీలు ఎక్కించుడు. పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగినందుకు ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసి జైళ్లలో పెట్టించుడు. ప్రశ్నలు, ప్రశ్నపత్రాలను పల్లీ, బఠానీల మాదిరి అమ్ముకున్నారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాలు ఇవ్వలేదు. పరిపాలనకు పాలమూరు బిడ్డ పనికిరాడా? ఆ పశుపతి ఫామ్హౌస్లోనే కుంగికృశించి పోవాల్సిందే. అధికారం అనేది ఇక వాళ్లు మరిచిపోవాల్సిందే. నల్లమల నుంచి వచ్చిన నాకు ఏమీ తెలియదని కొందరు అవహేళన చేశారు. పరిపాలనకు పాలమూరు బిడ్డ పనికిరాడా? అహంకారానికి, అహంభావానికి ఒక హద్దు ఉంటుంది. ప్రజాయుద్ధ నౌక, పేదల గళం గద్దర్ను గడీల ముందు నిలబెట్టిన మీకు ఉరి శిక్ష వేసినా తక్కువే..’ అంటూ సీఎం మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఖర్చేందో తేల్చండి ‘ఏం అన్యాయం చేశామని ప్రజా ప్రభుత్వం పోవాలి. గంజాయి, డ్రగ్స్ అమ్మే వాళ్లను జైల్లో పెట్టినందుకా? ధాన్యం చివరి గింజ వరకు కొని రైతుల ఖాతాల్లో రూ.80 వేల కోట్లు వేసినందుకా? 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్కార్డులు, సన్న బియ్యం ఇచ్చినందుకా? రైతు రుణమాఫీ చేసినందుకా? సన్న వడ్లకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చింది వాస్తవం కాదా? జనగణనలో కులగణన చేసి వందేళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదా?కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 30 నెలల్లో రైతు భరోసా కోసం రూ.1.76 లక్షల కోట్లు ఖర్చు చేసింది. సరాసరి ప్రతి నెలా రూ.5,600 కోట్లు మేం ఖర్చు చేస్తున్నాం. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసిందేందో లెక్కలు తేల్చండి. నా ఆత్మ బంధువులు మిడ్జిల్ ప్రజల మధ్య నుంచి చెబుతున్నా. 2034 వరకు కాంగ్రెస్దే అధికారం..’ అని రేవంత్ అన్నారు. రబ్బానీకి పదవి ఇవ్వాలి.. మిడ్జిల్ను దత్తత తీసుకోవాలి ‘2006 జూలై 2 నాడు మిడ్జిల్ మండల ప్రజలు సువర్ణాక్షరాలతో ఒక చరిత్రను లిఖించిన రోజు. ఆనాడు మీరు నాటిన మొక్క ఈనాడు మహావృక్షమై ముఖ్యమంత్రిగా మీ ముందు నిలిచింది. ఆనాడు జెడ్పీటీసీగా నా గెలుపు నాది కాదు.. ఈ మిడ్జిల్ మండల ప్రజలది. స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన ఈ బిడ్డను ఆశీర్వదించిన మీ నిర్ణయం గొప్పది. అయితే నా వల్ల ఎవరికీ కష్టం, నష్టం రాకూడదన్నదే నా ఆలోచన. అందుకే ఆనాడు జెడ్పీ చైర్మన్ రేసులో నిలిచి జెడ్పీటీసీ అభ్యరి్థగా నాపై ఓడిన రబ్బానీకి ఈ రోజు ఒక మంచి పదవి ఇవ్వాలని డిప్యూటీ సీఎంకు సూచిస్తున్నా. నా బాధ్యతను నెరవేర్చేందుకు మిడ్జిల్ను దత్తత తీసుకోవాలని భట్టిని కోరుతున్నా. మిడ్జిల్ మండలానికి ఏమిచ్చినా, చివరికు నా ప్రాణమిచ్చినా తక్కువే..’ అని ముఖ్యమంత్రి అన్నారు. సీఎం కాన్వాయ్కు ట్రాఫిక్ చిక్కులు శంషాబాద్ రూరల్: మిడ్జిల్ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్కు శనివారం ట్రాఫిక్ చిక్కులు ఎదురయ్యాయి. దీంతో బెంగళూరు జాతీయ రహదారిపై ఆయన వాహన శ్రేణి నెమ్మదిగా వెళ్లాల్సి వచ్చింది. రాత్రి 7.35 గంటల సమయంలో శంషాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో కాన్వాయ్ వెళ్తుండగా.. హైవేపై ట్రాఫిక్ జాంను క్లియర్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు విన్పించాయి. ప్రజలకు మంచి చేయడమే లక్ష్యం: భట్టి ప్రజలకు మంచి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజా సమస్యలను దగ్గరగా చూసిన సీఎం రేవంత్రెడ్డి అధికారులపైనే ఆధారపడి పాలన సాగించడం లేదని, ప్రజలకు దగ్గరగా సంక్షేమాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితం ఓట్లు వేసి జెడ్పీటీసీగా గెలిపించిన ప్రజలను మర్చిపోకుండా వారందరికీ కృతజ్ఞతలు తెలపడం మంచి సాంప్రదాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు అనిరు«ద్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, మధుసూదన్రెడ్డి, మేఘారెడ్డి, రాజేష్రెడ్డి, వీర్లపల్లి శంకర్, కార్పొరేషన్ చైర్మన్లు శివసేనారెడ్డి, కొత్వాల్, తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్లో యువజన కాంగ్రెస్ జాతీయ లీగల్ సెల్ కాన్క్లేవ్
హైదరాబాద్: యువజన కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జాతీయ లీగల్ సెల్ కాన్క్లేవ్ విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా హాజరైన న్యాయవాదులు, న్యాయ నిపుణులను ఉద్దేశించి ముఖ్య అతిథులు రాజ్యాంగ పరిరక్షణ, న్యాయవ్యవస్థ, న్యాయవ్యవస్థ దుర్వినియోగం, సామాజిక న్యాయం, యువ న్యాయవాదుల పాత్ర తదితర కీలక అంశాలపై ప్రసంగించారు.దేశంలోనే తొలిసారిగా యువజన కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఇలాంటి జాతీయ స్థాయి కాన్క్లేవ్ నిర్వహించడం అభినందనీయమని ముఖ్య అతిథులు కొనియాడారు. నేషనల్ లీగల్ కాంక్లేవ్ లో న్యాయవాదులకు పరస్పర అనుభవాల మార్పిడి, సమకాలీన న్యాయ అంశాలపై అవగాహన పెంపొందించుకునేందుకు ఇటువంటి కాన్క్లేవ్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిభ్, జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కలంబ, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, బిహర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కృష్ణ అల్లవేరు, రాజ్యసభ సభ్యులు, సీనియర్ న్యాయవాది వివేక్ టoకీయా, ఏఐసీసీ సెక్రెటరీ సచిన్ సావంత్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జాతీయ లీగల్ సెల్ కన్వీనర్ రూపేష్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ గూడూరు నిఖిల్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు నందితా రావు, సంజయ్ ఘోష్, తదితరులు పాల్గొన్నారు. -
పంజాబ్ కాంగ్రెస్లో భగ్గుమన్న అసంతృప్తి!
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్లో అంతర్గత సంక్షోభం ముదిరిపాకానపడింది. 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు గాను పార్టీ అధిష్టానం బుధవారం ప్రకటించిన ఎన్నికల కమిటీయే ఈ లుకలుకలకు ఆజ్యం పోయడం గమనార్హం. పీసీసీ అధ్యక్షుడిగా లూథియానా ఎంపీ అమరీందర్ సింగ్ రాజా వడింగ్ను కొనసాగించాలంటూ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డ మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ ఏర్పాటు చేసిన సమావేశానికి పెద్ద సంఖ్యలో కీలక నేతలు హాజరయ్యారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయం పంజాబ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా, కాంగ్రెస్ ఎంపీ సుఖ్జిందర్ సింగ్ రంధావా నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఢిల్లీలో భేటీ అయ్యారు. మరికొద్ది నెలల్లోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలపై అధిష్టానం ఆందోళన చెందుతోంది. పశ్చిమబెంగాల్లో టీఎంసీలో మాదిరిగానే ఇక్కడ కూడా పార్టీ ముక్కలవుతుందా అని బెంబేలెత్తుతోంది.కాషాయం వైపు రంధావా చూపుగురుదాస్పూర్ కాంగ్రెస్ ఎంపీ సుఖ్జిందర్ సింగ్ రంధావా శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ భేటీలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు తరుణ్ చుగ్ కూడా పాల్గొన్నారు. అనంతరం రంధావా మాట్లాడుతూ.. పంజాబ్ కాంగ్రెస్ పరిస్థితుల గురించి మాజీ సీఎం చన్నీ, పీసీసీ చీఫ్ రాజా వడింగ్లనే అడగాలంటూ వ్యాఖ్యానించారు. పార్టీ నేతలతో ఇన్ని సమావేశాలు నిర్వహించిన తర్వాత కూడా ఇలాంటి దురదృష్టకర పరిస్థితులు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.ఎంపీ మనీశ్ తివారీ అసంతృప్తి..రాజకీయ పరిణామాల మధ్య చండీగఢ్ ఎంపీ మనీశ్ తివారీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ బుధవారం ప్రకటించిన ఎన్నికల కమిటీల్లో తనకు చోటు దక్కకపోవడంపై సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘వ్యక్తులు, సంస్థల అభద్రతాభావానికి ఏదైనా చికిత్స ఉంటే బాగుండు’అని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. 45 ఏళ్లుగా తాను పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేశానని, కాంగ్రెస్ పార్టీ కూడా తనకు చాలా ఇచి్చందని అందులో పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలపై పరోక్ష దాడిగానే విశ్లేషకులు భావిస్తున్నారు.మొరిండాలో చన్నీ బలప్రదర్శన..పీసీసీ చీఫ్ పదవి దక్కకపోవడంతో జలంధర్ ఎంపీ, మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ అధిష్టానంపై పోరుబాట పట్టారు. స్వగ్రామం మొరిండాలోని నివాసంలో ఆయన ఏర్పాటు చేసిన భేటీకి ఆరుగురు ఎమ్మెల్యేలు సహా 30 మంది దాకా కీలక నేతలు హాజరయ్యరు. పంజాబ్ కాంగ్రెస్లో బలమైన నేతలుగా గుర్తింపు ఉన్న రాణా గుర్జీత్ (కపుర్తలా ఎమ్మెల్యే), పర్గత్ సింగ్ (జలంధర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే), ఓపీ సోనీ (మాజీ డిప్యూటీ సీఎం), భరత్ భూషణ్ ఆశు (మాజీ మంత్రి) తదితరులున్నారు.సమావేశానికి ఎమ్మెల్యేలు తృప్త రాజిందర్ బాజ్వా, కాలా థిల్లాన్ సహా పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యరు. తదుపరి కార్యాచరణలపై వారంతా దాదాపు మూడుగంటలపాటు చర్చించారు. చన్నీని రాష్ట్ర అధ్యక్షుడిగా చేయకుండా పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాదని సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్యే దర్శన్ బ్రార్ కుండబద్దలు కొట్టారు. ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్గా చన్నీ పేరు ఖరారైనప్పటికీ, అనూహ్యంగా రాజా వడింగ్నే కొనసాగించారని ఆయన ఆరోపించారు.చన్నీ వ్యూహాలు.. ప్రధాన డిమాండ్లు..రాజా వడింగ్ను పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించాలని చన్నీ వర్గం బహిరంగంగానే వకాల్తా పుచ్చుకుంటోంది. చన్నీ రెండు ప్రధాన డిమాండ్లతో అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పంజాబ్ కాంగ్రెస్లో పార్టీ అధ్యక్షుడిగా ఉన్నవారే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కావడం ఆనవాయితీ. 2017లో కెపె్టన్ అమరీందర్ సింగ్ సైతం అప్పటి పీసీసీ చీఫ్ ప్రతాప్ బాజ్వాను తప్పించి ఆ పదవిని దక్కించుకున్నారు. తద్వారా తన మద్దతుదారులకు టికెట్లు ఇప్పించుకుని సీఎం అయ్యారు. ఇప్పుడు చన్నీ కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తున్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజా వడింగ్ క్రెడిట్ తీసుకోకూడదని ఆయన భావిస్తున్నారు. ఒకవేళ పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకపోతే, 2022 ఎన్నికల తరహాలోనే తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని చన్నీ పట్టుబడుతున్నారు. పంజాబ్లో జాట్ సిక్కుల సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవడం ఇష్టం లేకనే కాంగ్రెస్ అధిష్టానం రాజా వడింగ్ను పీసీసీ చీఫ్గా కొనసాగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీన్ని కౌంటర్ చేసేందుకు చన్నీ పంజాబ్లోని 31 శాతం దళిత ఓటుబ్యాంకును అస్త్రంగా వాడుకుంటున్నారు. -
ఆగని అప్పుల రగడ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధికారంలో ఉండగా చేసిన అప్పులపై చెలరేగిన వివాదం మూడో రోజు కూడా కొనసాగింది. తొలిరోజు.. కేటీఆర్ చేసిన బహిరంగ చర్చ సవాల్తో రభస ప్రారంభం కాగా, రెండో రోజు గురువారం గన్పార్క్, తెలంగాణ భవన్ వేదిక గా రచ్చరచ్చ అయ్యింది. మంత్రివర్గ భేటీలోనూ చర్చనీయాంశమైంది. ఇక శుక్రవారం అప్పులపై అధికార పక్షం, విపక్షం లేఖాస్ర్తాలు సంధించుకున్నాయి. తాను చెప్పిన అప్పు లెక్కలకు కట్టుబడి ఉన్నానంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి బీఆర్ఎస్ నేతలకు లేఖలు రాశారు. కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీశ్రావుకు లేఖలు రాసిన ఆయన.. తాను చెప్పిన అప్పు లెక్కలు తప్పని కేసీఆర్తో చెప్పించినా, నిరూ పించినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు.దీనిపై చర్చించేందుకు సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్క్లబ్కు వస్తున్నానని, బీఆర్ఎస్ నేతలు కూడా రావాలని సవాల్ చేశారు. చెప్పినట్లే సాయంత్రం ప్రెస్క్లబ్కు వెళ్లారు. బీఆర్ఎస్ నేతలు రాకపోవడంతో వారిపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాగా మంత్రి జూపల్లి లేఖలపై స్పందించిన మాజీ మంత్రి హరీశ్రావు.. తాను కూడా ఆయనకు ఒక లేఖ రాశారు.కాంగ్రెస్ హయాంలో చేసిన అప్పుల గణాంకాలతో పాటు, బీఆర్ఎస్ చేసిన అప్పుల లెక్కలను అందులో వివరించారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి, తాను అప్పుల గురించి మాట్లాడిన వీడియోలను వాట్సాప్ ద్వారా మంత్రి జూపల్లికి పంపారు. ఇవి చూసిన తర్వాతైనా రాజీనామా చేయాలన్నారు. మరోవైపు సంగారెడ్డిలోనూ మాట్లాడుతూ..జూపల్లిపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇంకోవైపు డిప్యూటీ సీఎం భట్టి కూడా శుక్రవారం.. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు, కాంగ్రెస్ హ యాంలో చేసిన అప్పులు, చెల్లింపులపై గణాంకాలు వెల్లడించారు. -
‘నా మాటకు నేను కట్టుబడి ఉన్నా..నిరూపిస్తా’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ల మధ్య సవాళ్లు-ప్రతి సవాళ్లు రచ్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. తాను అన్న మాటకు కట్టుబడి ఉన్నానని, అది నిరూపిస్తానన్నారు. ఈరోజు(శుక్రవారం, జూలై 3వ తేదీ) సోమాజిగూడ ప్రెస్క్లబ్లో కేసీఆర్, హరీష్రావు, కేటీఆర్ల కోసం మూడు కుర్చీలు వేశామని, కానీ వారు రాలేదన్నారు. దీనిలో భాగంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ‘ పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో రూ. 8 లక్షల కోట్ల అప్పు చేశారు. ఈ మాటకు నేను కట్టుబడి ఉన్నా.. నిరూపిస్తా. దమ్ముంటే కాదని నిరూపించండి. కాళేశ్వరం కార్పొరేషన్ అప్పు మీరు చేసిందా కాదా?, మిషన్ భగీరథ కార్పొరేషన్ అప్పు మీరు చేసింది కాదా?, మా ప్రభుత్వం చేసిన అప్పు గురించి నేను చాలెంజ్ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గత అప్పులకు వడ్డీ కింది రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా కట్టాం’ అని పేర్కొన్నారు.ఇక హరీష్ రావు రాసిన లేఖ గురించి ప్రస్తావిస్తూ.. అందులో ఏమీ లేదని విమర్శించారు. ‘ నేను లేఖలో ప్రస్తావించిన వాటికి హరీష్ నుంచి సమాధానం రాలేదు. అసలు మీరు ఎందుకు ప్రెస్క్లబ్కు రాలేదో సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
చర్చ.. రచ్చ!
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల సవాళ్లు, ప్రతిసవాళ్లతో గురువారం రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. గురుకులాల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలు, బీఆర్ఎస్ హయాంలో అప్పుల విమర్శలు ఇందుకు కారణమయ్యాయి. ఆయా అంశాలపై చర్చకు సిద్ధమన్న ఇరుపక్షాలు ఎలాంటి చర్చలూ జరగకుండానే గన్పార్క్, తెలంగాణ భవన్ వేదికగా పరిస్థితిని రచ్చరచ్చగా మార్చాయి. ముగ్గురు మంత్రులు గన్పార్క్ వద్దకు చేరుకుని మరోసారి విపక్షానికి సవాల్ విసరగా, గన్పార్క్ వద్ద చర్చకు సై అన్న విపక్ష నేతలు హరీశ్రావు, కేటీఆర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గన్పార్క్ వద్ద మాట్లాడిన మంత్రులు, తెలంగాణ భవన్లో మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు మరోసారి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. రెండు రోజులుగా మాటల యుద్ధం అవినీతి, అప్పులపై ఉభయ పార్టీల మధ్య గత రెండు రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల జరిగిన బహిరంగ సభల్లో పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని ప్రకటించడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దానికి సై అంటూనే అప్పులకు సంబంధించిన తప్పుడు లెక్కలపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమంటూ స్పందించారు. మరోవైపు గురుకులాల్లో విద్యార్థులకు సరఫరా చేసే యూనిఫాం, విద్యా కిట్లలో రూ.2 వేల కోట్ల భారీ అవినీతి జరిగిందని, దీనిపై బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ఎల్పీ ఉప నాయకుడు హరీశ్రావు, మరో నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సవాల్ చేయగా, తాము సిద్ధమేనంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలోనే గురువారం మంత్రులు అడ్లూరి లక్ష్మణ్కుమార్, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజహరుద్దీన్ గన్పార్కు వద్దకు వచ్చారు. బీఆర్ఎస్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ లేదా హరీశ్రావు తమతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే అసెంబ్లీలో ప్రత్యేకంగా దీనిపై చర్చకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. గన్పార్క్ వద్ద జూపల్లి, అడ్లూరి, అజహర్, పొన్నం కంచన్బాగ్ పోలీస్స్టేషన్కు హరీశ్ తరలింపు మంత్రులతో గన్పార్కు వద్ద చర్చకు తాను సిద్ధమంటూ హరీశ్రావు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరారు. అయితే ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉండడంతో పోలీసులు ఆయన్ను అక్కడే అడ్డుకున్నారు. కానీ తాను వెళ్లి తీరతానంటూ హరీశ్ పట్టుపట్టడంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని కంచన్బాగ్ పోలీస్స్టేషన్కు తరలించారు. తెలంగాణ భవన్లోనే కేటీఆర్ బీఆర్ఎస్ హాయాంలో జరిగిన అప్పులపై తనతో చర్చించేందుకు రావాలని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావును సవాల్ చేసిన కేటీఆర్ కూడా తెలంగాణ భవన్కు వచ్చారు. అయితే తెలంగాణ భవన్కు వస్తానన్న జూపల్లి రాకపోగా.. గన్పార్క్కు రావాలంటూ సవాల్ చేయడంతో.. కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ నుంచి గన్పార్క్ వెళ్లడానికి బయలుదేరారు. కానీ ఆయన్ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో..మీ మంత్రులు పారిపోయామంటూ తమపై ఆరోపణలు చేస్తున్నారని, తాను గన్పార్క్కు వెళ్తానని అన్నా సరే ఆయన తెలంగాణ భవన్ దాటి రాకుండా పోలీసులు నిలువరించారు. అప్పుల గణాంకాలు వెల్లడించిన జూపల్లి గాందీభవన్లో జరిగిన ప్రజలతో ముఖాముఖి అనంతరం నేరుగా గన్పార్క్కు చేరుకున్న మంత్రి జూపల్లి 2014లో రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న అప్పులు, 2023లో బీఆర్ఎస్ దిగిపోయే నాటికి ఉన్న అప్పులను గణాంకాలతో సహా వివరించారు. తాను చెప్పిన గణాంకాలు తప్పని కేసీఆర్తో చెప్పిస్తే తాను చెప్పిన కట్టుబడి రాజీనామా చేస్తానని మరోమారు కేటీఆర్కు సవాల్ విసిరారు. మళ్లీ తెలంగాణ భవన్కు హరీశ్ ఉదయం పోలీసులు అదుపులో తీసుకున్న మాజీ మంత్రి హరీశ్రావు కంచన్బాగ్ పోలీస్స్టేషన్ నుంచి నేరుగా మళ్లీ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అక్కడ విలేకరులతో మాట్లాడారు. అయితే చివరకు రెండు పార్టీల నేతలు అసెంబ్లీ సమావేశాలు పెట్టి అవినీతి, అప్పులపై చర్చించాలని పట్టుపట్టడం గమనార్హం. ఇలావుండగా మరో ప్రధాన పార్టీ బీజేపీ కూడా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించింది. ఆ రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయని, డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజలను మభ్యపెడుతున్నాయని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. -
మీరు ఉండాల్సింది గన్ పార్క్ లో కాదు జూపార్క్ లో
-
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణి ఆకస్మిక బదిలీ!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా విభాగంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ అధికారిణి జి. లక్ష్మీబాయిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను ప్రస్తుత బాధ్యతల నుండి బదిలీ చేస్తూ, హౌసింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న ఐఏఎస్,ఇతర ఉన్నతాధికారుల బదిలీల పరంపరలో భాగంగానే ఈ కీలక స్థానచలనం జరిగినట్లు సచివాలయ అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ బదిలీ వ్యవహారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బదిలీ అయిన అధికారిణి లక్ష్మీబాయి, మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణి కావడం దీనికి ప్రధాన కారణం. -
‘రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా 46 మంది కాంగ్రెస్ నేతలు.. అధిష్టానానికి లేఖలు’
సాక్షి,హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్రెడ్డిని తప్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హైకమాండ్కు లేఖలు రాశారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.మీడియా చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత రాజకీయాలపై స్పందించారు. సీఎం రేవంత్రెడ్డికి, ఆయన మంత్రివర్గంలోని మంత్రులకు మధ్య గ్యాప్ బాగా పెరిగిందని ఆరోపించారు. ఇటీవల రేవంత్రెడ్డి చేసిన ‘హిట్లర్’ వ్యాఖ్యలు పార్టీకి తీవ్రంగా నెగెటివ్ అయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్లోనే 46 మంది నాయకులు సీఎంకు వ్యతిరేకంగా ఉన్నారని, రేవంత్రెడ్డిని మార్చాలంటూ పలువురు మంత్రులు సైతం అధిష్టానాన్ని కోరినట్లు వెల్లడించారు.ప్రస్తుతం రేవంత్రెడ్డిని ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్లు మాత్రమే కాపాడుతున్నారని ఏలేటి వ్యాఖ్యానించారు. రేవంత్రెడ్డి వ్యవహారశైలి కారణంగానే రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల మధ్య కూడా విభేదాలు వచ్చాయని అన్నారు. గతంలో రేవంత్రెడ్డిపై మీనాక్షి నటరాజన్ నివేదిక సమర్పించారని.. ఆ నివేదికను మనసులో పెట్టుకునే ఆమెకు ఎంపీ పదవి రాకుండా రేవంత్రెడ్డి అడ్డుకున్నారని మహేశ్వర్రెడ్డి ఆరోపించారు -
పోలీసులతో వాగ్వాదం KTR అరెస్ట్
-
బీఆర్ఎస్-కాంగ్రెస్ సవాళ్ల నడుమ.. కేసీఆర్కు అద్దంకి ఫోన్
కాంగ్రెస్ , బీఆర్ఎస్ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్ల అప్డేట్స్.. తెలంగాణ భవన్ నుంచి మీడియా సమావేశంలో హరీష్తెలంగాణ భవన్కు వస్తానన్న మంత్రి జూపల్లి ఎందుకు రాలేదు: హరీష్జూపల్లికి చీము, నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చేయాలిమంత్రి జూపల్లికి విషయం లేకనే చర్చకు రాలేదుమంత్రి జూపల్లి తెలంగాణ భవన్కు వస్తానని సెల్ఫ్గోల్ వేసుకున్నారుఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదుకేసీఆర్ బాధ్యతారాహిత్యంగా ఉన్నారు: అద్దంకికేసీఆర్ బయటకు రావడానికి బయపడుతున్నాడు.బీజేపీ పొత్తులొ ఎక్కువ సీట్లు లాగేందుకు బిఆర్ఎస్ బలంగా ఉందని చెప్పేందుకు కేటీఆర్- హరీష్ రావు ప్రయత్నిస్తున్నారు.జీతం తీసుకునేందుకే మాత్రమే కేసీఆర్ అసెంబ్లీ వస్తున్నారు.కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దద్దమ్మలు హరీష్ రావు, కేటీఆర్.కేటీఆర్, హరీష్ ను పంపి తెలంగాణను ఆగం చేస్తున్నారు.కేటీఆర్- హరీష్ రావు సైడ్ యాక్టర్స్.బీజేపీ- బిఆర్ఎస్ మధ్య సీట్ల ఒప్పందం జరుగుతుంది.ప్రతిపక్ష నేత కేసీఆర్కు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఫోన్మీడియా సమావేశం నుంచే కేసీఆర్కు ఫోన్ చేసిన అద్దంకిఫోన్ లిఫ్ట్ చేసే వరకు ఇలాగే చేస్తానంటుంన్న అద్దంకిఅసెంబ్లీకి రావాలని కోరడానికే కేసీఆర్కు ఫోన్ చేస్తున్నా అంటున్న అద్దంకి. తెలంగాణ భవన్కు మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.తెలంగాణ భవన్ వద్ద మరోసారి హైటెన్షన్..గన్పార్క్కు బయలుదేరిన కేటీఆర్.గన్పార్క్కు వెళ్తుండగా కేటీఆర్ను అడ్డుకున్న పోలీసులు.పోలీసులతో కేటీఆర్ వాగ్వాదం.పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం.కేసీఆర్ రావాలంటే రాహుల్ గాంధీ రావాలిరాహుల్ గాంధీని తోలుకొస్తే.... కేసీఆర్ ను తెచ్చే భాద్యత నాదిఅక్కడేమో మంత్రులు తొడలు కొడుతున్నారు.. ఇకడేమో పోలీసులను పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారుముఖ్యమంత్రి సవాల్ విసిరితే సందట్లో సడేమియా అన్నట్టు మద్యలో జూపల్లి దూరిండుఅన్ని లెక్కలు చెప్పడానే సిద్ధంగా ఉన్నాం.సీఎం, జూపల్లికి కేటీఆర్ సవాల్.. అరెస్ట్ ఎందుకు.. చర్చకు దమ్ము లేదా?: కేటీఆర్ సవాల్తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్తో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం.సవాల్ చేసిన సీఎం తోక ముడిచి పారిపోయారు.సవాళ్ల మధ్యలో మంత్రి జూపల్లి దూరారు.చర్చకు సిద్దమైతే మంత్రి జూపల్లి ఎక్కడికి పోయారు.బహిరంగంగా చర్చించే దమ్ము మంత్రులకు లేదు.చేతకాని వాళ్లు సవాళ్లు ఎందుకు చేయాలి?.చర్చించేందుకు కనీసం అసెంబ్లీ అయినా పెట్టండి.సవాళ్లు చేయడం.. పారిపోవడం కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనం.ముఖ్యమంత్రి, మంత్రులు చేతకాని వాళ్లని తేలిపోయింది.విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదు.చర్చకు మంత్రి వస్తారనుకుంటే ముఖం చాటేశారు.ప్రజాక్షేత్రంలో మీ డొల్లతనం బయటపడింది.మా ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు.అప్పులపై చర్చకు రావాలని మొన్న సీఎం సవాల్ విసిరారు.గురుకులాల్లో అవినీతిపై చర్చకు వెళ్తే హరీష్రావును అరెస్ట్ చేశారు.తెలంగాణ భవన్కు వస్తానని జూపల్లి అన్నారు.తెలంగాణ భవన్కు రాకుండా జూపల్లి ఎక్కడో మాట్లాడుతున్నారు.దమ్ముంటే అసెంబ్లీ పెట్టండి, సభలోనే చర్చిద్దాం.గన్పార్క్ దగ్గర జూపల్లి ఉంటే, మేం అక్కడికే చర్చకు వస్తాం.మేం గన్పార్క్ వెళ్తే చార్మినార్ రమ్మంటారు.చార్మినార్ వెళ్తే కొల్లాపూర్ రమ్మంటారు.అసలు తన శాఖలో ఏం జరుగుతుందో జూపల్లికే తెలియదు.లేదంటే మా వాళ్లను కంచన్బాగ్కు పంపించారు కదా..అక్కడికే రండి అక్కడే చర్చిద్దాం.సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి వస్తే.. అక్కడ చర్చకు మేం రెడీ.ముఖ్యమంత్రి రేవంత్.. సెక్యూరిటీ లేకుండా చర్చకు రావాలి.హరీష్రావు చర్చలకు వస్తే అరెస్ట్ చేయిస్తారు. కంచన్బాగ్ పీఎస్కు బీఆర్ఎస్ నేతలుతెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు. హరీష్ సహా గులాబీ పార్టీలను కంచన్బాగ్ పీఎస్కు తరలింపుపోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం.. హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇతర బీఆర్ఎస్ నేతల బృందాన్ని అక్రమ అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో సిటీ చుట్టూ తిప్పుతున్న పోలీసులుపోలీసుల వాహనం వెంబడి వందలాది వాహనాల్లో బయల్దేరిన బీఆర్ఎస్ శ్రేణులుహరీష్ రావును ఎక్కడికి తీసుకెళ్తే అక్కడి వరకు వెంటే వస్తామంటున్న బీఆర్ఎస్ శ్రేణులు https://t.co/BwNMKhesLv pic.twitter.com/Z8VfKmNEG8— Telugu Scribe (@TeluguScribe) July 2, 2026 జూపల్లి కోసం కేటీఆర్ వెయిటింగ్..మంత్రి జూపల్లి కోసం తెలంగాణభవన్లో ఎదురుచూస్తున్న కేటీఆర్తెలంగాణభవన్లో చర్చ కోసం జూపల్లికి కుర్చీ ఏర్పాటు.సవాల్ చేయడం కాదు.. జూపల్లి రావాలంటూ బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కామెంట్స్..హరీష్, కేటీఆర్ కోసం రెండు గంటల పాటు ఎదురుచూశాంముగ్గురం మంత్రులం అమర వీరుల స్తూపం దగ్గరకి వచ్చి వెయిట్ చేశాంహరీష్, కేటీఆర్ చర్చకు రాలేదుబీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధంపోలీసులు అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం? అంటూ ప్రశ్నలు. అసెంబ్లీలో కూడా చర్చకు సిద్దమే..హరీష్ రావు సహా బీఆర్ఎస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.హరీష్ను అరెస్ట్ చేసి వాహనం ఎక్కించిన పోలీసులు. హరీష్ కామెంట్స్..మంత్రి జూపల్లి తెలంగాణ భవన్కు వస్తానన్నారు.. తోక ముడిచారు.గురుకులాలపై చర్చలకు గన్పార్క్కు రమ్మన్నారు.మేము వస్తుంటే పోలీసులతో అడ్డుకుంటున్నారు.చర్చకు రావాలని పిలిచి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు?.అసెంబ్లీలో కూడా చర్చకు సిద్దమే.పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు.ప్రభుత్వ అవినీతిని ప్రజలు, అసెంబ్లీ ముందు పెడతాం. మరోవైపు.. మంత్రి పొంగులేటి సీఎల్పీకి చేరుకున్నారు. దమ్ముంటే మమ్మల్ని అడ్డుకోవద్దు..గన్పార్క్ బయలుదేరిన హరీష్రావును అడ్డుకున్న పోలీసులు.పాదయాత్రగా గన్పార్క్ వెళ్లేందుకు సిద్దమైన హరీష్.హరీష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.పోలీసులను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులు.పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని హరీష్ ఆగ్రహం.ప్రభుత్వానికి దమ్ముంటే తమను అడ్డుకోవద్దని సవాల్మంత్రి జూపల్లి కామెంట్స్గాంధీ భవన్లో మంత్రి జూపల్లిహరీష్ రావు గన్ పార్క్ వస్తున్నానని చెప్పారుబావ బామ్మర్దులు ఇద్దరు రండినేను సైతం గన్ పార్క్ దగ్గరికి వస్తున్నానువారి సవాల్కు సమాధానం అక్కడే ఇస్తానుబావ ఒక దగ్గర బామ్మర్ది ఒక దగ్గర ఎందుకు?.ఇద్దరూ గన్ పార్క్ రండి ఇద్దరికీ అక్కడే సమాధానం ఇస్తాను.హరీష్ రావు, కేటీఆర్ వస్తే చర్చకు సిద్ధం అంటున్న మంత్రులు..ఆరోపణలు కాదు.. ఆధారాలు చూపించండి అంటూ మంత్రుల వ్యాఖ్యలు... తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా..కారులో నుంచే మంత్రి పొన్నంకు హరీష్ ఫోన్ కాల్.మంత్రి పొన్నం తన కాల్ లిఫ్ట్ చేయడం లేదన్న హరీష్.పోలీసుల తీరుపై మాజీ మంత్రి హరీష్ సీరియస్.మంత్రులకు ఫోన్ చేసినా తీయడం లేదని వ్యాఖ్యలు..పోలీసులతో హరీష్ వాగ్వాదం..పోలీసుల అదుపులో హరీష్. పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు. హరీష్రావు అడ్డగింత.. గన్పార్క్కు బయలుదేరిన హరీష్రావును అడ్డుకున్న పోలీసులు.పోలీసులతో బీఆర్ఎస్ శ్రేణుల వాగ్వాదంమంత్రులే గన్పార్క్ వద్దకు తనను రమ్మనారంటూ హరీష్ వాగ్వాదంమా కోసం మంత్రులు ఎదురుచూస్తున్నారు. గన్పార్క్కు బయలుదేరిన హరీష్మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మంత్రులతో చర్చకోసం అమరవీరుల స్థూపం వద్దకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలుమంత్రి జూపల్లితో చర్చ కోసం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎదురుచూస్తున్న మరో బృందంతెలంగాణభవన్లోనే కేటీఆర్ ఉంటారు.ఎక్కడైనా మేం చర్చకు సిద్దం.గురుకులాలపై అన్ని ఆధారాలతో మేము వస్తున్నాం.చర్చకు మేం సిద్ధం.మంత్రులు అక్కడే ఉండాలి.మీ చాలెంజ్లు, బహిరంగ సవాళ్లకు మేం భయపడం: మంత్రి అడ్లూరిఆర్ఎస్ ప్రవీణ్కుమార్ వద్ద ఆధారాలుంటే చూపించాలి: మంత్రి పొన్నంఅవినీతి చేసినట్టు నిరూపిస్తే మేం రాజీనామా చేస్తాం: పొన్నం తెలంగాణలో పొలిటికల్ హీట్.. తెలంగాణ భవన్ చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు..సమావేశమైన కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు.ప్రెస్ క్లబ్ వద్ద పోలీసుల మోహరింపుకాసేపట్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, గెల్లు శ్రీనివాస్గురుకులాల టెండర్లలో అవినీతిపై చర్చించేందుకు సిద్ధమన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్గురుకులాల్లో అవినీతి జరిగిందంటోన్న బీఆర్ఎస్మంత్రులు అడ్లూరి, అజహారుద్దీన్, పొన్నం చర్చకు రావాలంటోన్న బీఆర్ఎస్దీంతో సోమాజీగూడ ప్రెస్ క్లబ్ వద్ద పోలీసుల మోహరింపు గన్పార్క్ చేరుకున్న మంత్రులు..గన్ పార్క్కి చేరుకున్న మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇతర ముఖ్య నేతలుచర్చకు రావాలంటూ బీఆర్ఎస్ నేతలకు సవాల్.. తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్..కాంగ్రెస్ , బీఆర్ఎస్ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్ల నడుమ.. తెలంగాణ భవన్ వద్ద మోహరించిన పోలీసులు లు.తెలంగాణ భవన్కు చేరుకుంటున్న బీఆర్ఎస్ నేతలుమినిస్టర్ క్వార్టర్స్ నుంచి గన్ పార్క్కి బయలుదేరిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్రాష్ట్ర అప్పులపై సవాళ్లు..రాష్ట్ర అప్పులపై చర్చించేందుకు అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు.10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావు.చర్చకు సిద్ధమైతే తెలంగాణ భవన్కు వస్తానన్న జూపల్లి.రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన అప్పులపై చర్చకు సిద్ధమంటున్న బీఆర్ఎస్కాసేపట్లో తెలంగాణ భవన్కు రానున్న కేటీఆర్ , హరీష్ రావు.మంత్రులు వర్సెస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్గురుకుల టెండర్స్ కుంభకోణంపై చర్చించేందుకు సిద్ధమా అంటూ మంత్రులకు సవాల్ విసిరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.గురుకుల టెండర్స్ కుంభకోణంపై చర్చించేందుకు తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు బయలుదేరనున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.అమరవీరుల స్థూపం వద్దకు కేటీఆర్, హరీష్ రావు రావాలంటున్న మంత్రులు.సోమాజిగూడ ప్రెస్ క్లబ్ , అమరవీరుల స్థూపం వద్ద పెద్ద ఎత్తున మోహరించిన పోలీస్ బలగాలు.మంత్రి అడ్లూరి కౌంటర్.. దమ్ముంటే బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై అసెంబ్లీలో చర్చకు రావాలని డిమాండ్.ఆరోపణలు చేసి తొక ముడవడం కాదు.. నిరూపించాలని డిమాండ్.ఆర్ఎస్ ప్రవీణ్ చిట్టా మా దగ్గర ఉందిఅందరి లెక్కలు తేలుస్తాం. -
కాంగ్రెస్ హయాంలో కుంభకోణాల ఖని
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/రామకృష్ణాపూర్: రెండేళ్ల కాంగ్రెస్ హయాంలో సింగరేణిని కుంభకోణాల ఖనిగా మార్చారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు. బుధవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పరిధి ఎంఎన్ఆర్ గార్డెన్లో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన సింగరేణి పరిరక్షణ సదస్సుకు హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరై రెండు గంటలపాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ వచ్చాక ఓబీ టెండర్లలో సైట్ విజిట్ విధానంతో గతంలో మైనస్లో వెళ్లే కాంట్రాక్టులు 13 శాతం అధికంతో సీఎం బామ్మర్ది సృజన్రెడ్డి శోధ కన్సస్ట్రక్షన్కు కాంట్రాక్టు దక్కిందన్నారు. నైనీ బ్లాక్ టెండర్ను రద్దు చేసిన డిప్యూటీ సీఎం, వీటిని ఎందుకు రద్దు చేయరని ప్రశ్నించారు. ‘నిజం కాకపోతే రాజీనామా’ ఆరు నెలలుగా ఇవన్నీ అడుగుతున్నా డిప్యూటీ సీఎం, సీఎం నోరు విప్పడం లేదని హరీశ్రావు దుయ్యబట్టారు. తాను చెప్పేవి నిజం కాకపోతే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. సౌర విద్యుత్కు ఎన్టీపీసీ, హెచ్సీఎల్ ఒక మెగావాట్కు రూ.3 కోట్లు వెచ్చిస్తుంటే, సింగరేణి మాత్రం 67 మెగావాట్లలో ఒక మెగావాట్కు రూ.7 కోట్ల చొప్పున, మరో 107 మెగావాట్లలో రూ.5 కోట్ల చొప్పున అదనంగా రూ.500 కోట్లు కమీషన్ల కోసం చెల్లించారని విమర్శించారు. జైపూర్ పవర్ ప్లాంట్కు కేబినెట్ ఆమోదం, డీపీఆర్ లేకున్నా టెండర్లు పిలిచి అడ్వాన్సులకు కమీషన్ల కోసం పవర్ మేక్ సంస్థకు సుమారు రూ.1500 కోట్లు ఖర్చు చేశారన్నారు. లేని బొగ్గు ఉన్నట్టు చూపిస్తూ.. కంపెనీ 40 లక్షల టన్నుల బొగ్గుపై ఆదాయ పన్ను, డివిడెంట్లు, సీఎస్సార్, డీఎంఎఫ్టీ, కోల్ సెస్సుల కింద రూ.1600 కోట్లు కట్టారని హరీశ్రావు మండిపడ్డారు. అడ్రియాల్ లాంగ్ వాల్ ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తి లేకున్నా, 1.81లక్షల టన్నులు, మందమర్రిలో 5.68లక్షల మెట్రిక్ బొగ్గు ఉన్నట్లు, శ్రీరాంపూర్లో 4.64లక్షల టన్నులు ఉన్నట్లు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని అన్నారు. సదస్సు కంటే ముందు హరీశ్రావు శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి కోల్మైన్ ఆఫీసర్స్ పీఆచ్చి, పీఆర్సీ అమలుపై చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సదస్సుకు టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, కోనేరు కోనప్ప, పుట్ట మధు తదితరులు హాజరయ్యారు. -
కాంగ్రెస్లో ‘గుట్ట’ చిచ్చు
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట దేవస్థాన పాలకమండలి నియామకం కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపుతోంది. కొందరు మంత్రులతో సహా, ఎమ్మెల్యేల్లో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్నట్టు సమాచారం. కనీసం ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కూడా సమాచారం ఇవ్వలేదన్న ప్రచారం జరుగుతోంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటనలో భాగంగా లండన్లో ఉన్నారు. మంత్రికి కూడా తెలియకుండానే యాదగిరిగుట్ట దేవస్థాన పాలక మండలి నియామకం జరిగిందన్న ప్రచారం గాందీభవన్లో జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీతో సంబంధాలున్న కుటుంబంలోని వ్యక్తిని చైర్మన్గా నియమించారని, బీజేపీతో అంటకాగుతున్న చిరంజీవి కుటుంబానికి చెందిన వారిని, మాజీమంత్రి దేవేందర్గౌడ్ తనయుడు విజయేందర్ను సభ్యులుగా నియమించడంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కమిటీని నియమించడానికి రెండు రోజుల ముందు నల్లగొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించినా.. ఆ సమయంలోనూ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కనీసం మాటమాత్రంగా కూడా పాలక మండలి నియామకం గురించి ప్రస్తావించలేదని వారు అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పాలక మండలి నియామకం విషయంపై ఇద్దరు మంత్రులు పార్టీ అధిష్టానానికి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాందీకి లేఖ రాసే యోచనలో ఉన్నట్టు సమాచారం. దేవస్థాన పాలక మండలిలో సభ్యుల నియామకానికి సంబంధించి మంత్రులు చేసిన సిఫారసులను బుట్టదాఖలు చేశారని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. అసలైన కాంగ్రెస్ నాయకులు కనుమరుగు అవుతున్నారని, పార్టీలో నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా, ఓ సీనియర్ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి స్వయంగా లేఖ రాసి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఒరిజినల్ కాంగ్రెస్ వారు కనుమరుగు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ‘ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలలి. షో అప్స్ చేస్తే..ఎక్కువ మాట్లాడితే ప్రజలకు నచ్చదు. ఇప్పుడు కాంగ్రెస్లో అందరూ కొత్తవారు వచ్చారు. ఒరిజినల్ కాంగ్రెస్ వారు, ఒరిజినల్గా తెలంగాణ కోసం కొట్లాడిన వారంతా రోజురోజుకు కనుమరుగై పోతున్నారు. ఎక్కడెక్కడి వాళ్లో కొత్త బ్యాచ్ వచ్చారు. అంతా కొత్త వారే నడిపిస్తున్నారు. నేను మునుగోడు ఎమ్మెల్యేను. యాదాద్రి జిల్లాలో నా మునుగోడు నియోజకవర్గం ఉంది. యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలిపై కనీస సమాచారం లేదు. ఇది ఏకపక్ష నిర్ణయం. అస్సలు కరెక్ట్ కాదు. గత కొన్నాళ్లుగా ప్రభుత్వ పెద్దల వ్యవహారం బాగా లేదు. వీరి వ్యవహారశైలి నచ్చకనే నల్లగొండ మీటింగ్కు వెళ్లలేదు. నన్ను అడిగితే మా నియోజకవర్గం నుంచి ఒక సభ్యుడిని అయినా వేయించుకునే వాణ్ణి. చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వారి ఖర్మ. చైర్మన్ విషయం నేను మాట్లాడ దలుచుకోలేదు. సభ్యుల విషయమైనా చెప్పాలి కదా. వాళ్లకు ఆ మాత్రం ఆలోచన కూడా లేదు. ఇటీవల రాహుల్గాంధీని కలిసినప్పుడు అన్ని విషయాలు ఆయనతో మాట్లాడాను. త్వరలోనే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్లను కలిసి మాట్లాడతా’అని అన్నారు. ‘మా బ్రదర్ వెంకట్రెడ్డి నన్ను ఉద్దేశించి దాన కర్ణుడని పాజిటివ్గానే మాట్లాడారు. మంచి ఉద్దేశంతో’నే అని తెలిపారు. యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు విషయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూపై విధంగా స్పందించారు. మాట్లాడాల్సింది కానీ...! ఈ విషయమై బుధవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ కూడా స్పందించారు. రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని, ఆ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానన్నారు. నల్లగొండ జిల్లా నేతలతో మాట్లాడి యాదగిరిగుట్ట బోర్డును నియమిస్తే బాగుండేదని చెప్పారు. అయినా, అన్ని విషయాల్లో అందరినీ ఇన్వాల్వ్ చేయలేమని, అలా చేస్తే ఏదీ ముందుకు పోదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై తాను సీఎం రేవంత్తో మాట్లాడతానని మహేశ్గౌడ్ వెల్లడించారు. -
నేను రెడీ.. మీరు రెడీనా?
సాక్షి,హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన సవాల్ను స్వీకరిస్తున్నానని, పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి సవాల్ చేశారు. అప్పులు, పాలనా వైఫల్యాలు, రైతుల దుస్థితి, వ్యవసాయ సంక్షోభం, ఆర్థిక పరిస్థితి దేనిపైనైనా సరే చర్చకు వరంగల్ చౌరస్తానా? అశోక్నగర్ చౌరస్తానా? అసెంబ్లీ, ప్రెస్క్లబ్, కొత్తగా రూ.200 కోట్లతో కట్టుకున్న సీఎం ఇంద్రభవనంలో అయినా చర్చకు సిద్ధమని అందుకు తేదీ, సమయం, ప్రాంతం సీఎం చెప్పాలని ఏ టాపిక్ అయినా సరే చర్చకు సిద్ధమని, ప్రభుత్వం వైఫల్యాలను గణాంకాలతో నిరూపించకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించుకుంటానన్నారు. బుధవారం తెలంగాణభవన్లో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్యాదవ్, వివేకానంద తదితరులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రేవంత్రెడ్డి నల్లగొండ సభ, శిల్పకళావేదిక సభలో బీఆర్ఎస్, కేసీఆర్ను విమర్శించడంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అప్పులకు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పే సంఖ్యలో తేడాలున్నాయని, వీరిద్దరూ చెప్పే దానికి పార్లమెంట్లో వీరి చీకటి మిత్రుడు రఘునందన్రావు అడిగిన ప్రశ్నకు కేంద్రం కాగ్, ఆర్బీఐ నుంచి తీసుకొని ఇచ్చిన లెక్కలకు చాలా తేడాలున్నాయన్నారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే నాటికి ఉన్న అప్పులు రూ.72 వేల కోట్లు అయితే.. తాము దిగిపోయేనాటికి ఉన్న అప్పులు మొత్తం రూ.3.5 లక్షల కోట్లు అని, తమ పదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.2.78 లక్షల కోట్లు అని కేటీఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ పదేళ్లలో రైతులకు రూ.1.75 లక్షల కోట్లు వ్యయం చేశారంటే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.1.56 లక్షల కోట్లు వ్యయం చేశారంటున్నారని, ఇద్దరి మధ్య ఐదు నిమిషాల వ్యవధిలోనే రూ.20 వేల కోట్ల తేడా చెబితే ఎవరిని నమ్మాలని ప్రశ్నించారు. నెలకు అప్పులు, అసలు కింద ఈ ప్రభుత్వం చెల్లిస్తున్నది రూ.2,500 కోట్లలోపు ఉంటుందని కాగ్ నివేదిక చెబుతుంటే.. వీరు బయట మాత్రం రూ.6,000 కోట్లు చెల్లిస్తున్నారని అన్ని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. సీఎం కుటుంబం, మంత్రుల దోపిడీతోనే... సీఎం రేవంత్రెడ్డి కుటుంబ సభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ నేతల దోపీడి వల్లనే తెలంగాణ దివాలా తీస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్రెడ్డి భావదారి్రద్యంతో మాట్లాడుతూ రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. దివాలా, ఎయిడ్స్ రోగి, కేన్సర్ పేషెంట్ అంటూ తాను పాలించే రాష్ట్రం గురించి ఏ ముఖ్యమంత్రి ఇంత నీచంగా మాట్లాడరన్నారు. ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు అని చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి, మరి 72 సార్లు ఎందుకు ఢిల్లీకి వెళ్లాడో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి మాటలు చూస్తుంటే ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదని, ఆయనకు మానసిక జబ్బు ఉందేమో అన్న అనుమానం వస్తుందని కేటీఆర్ అన్నారు. రైతాంగం తీవ్ర సంక్షోభంలో.. కాంగ్రెస్ పాలనలో రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని, అట్లాంటి పరిపాలనకు సంబరాల పేరిట బలవంతపు కార్యక్రమాలు చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. మొన్నటికి మొన్ననే సంపూర్ణంగా రైతుబంధు వేస్తాను..అందరికీ ఇస్తాను అని చెప్పి కేవలం ఒక ఎకరానికి ఇచ్చి, ఒక్కొక్క ఎకరానికి డబ్బులు వేసిన ప్రతిసారి సంబరాలు చేసుకుంటూ ఉత్త మాటలు చెబుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులు, విద్యార్థులు, మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ఎవరికీ డబ్బులు లేవు కానీ... రాహుల్గాంధీకి మాత్రం వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తానంటూ రేవంత్ చెబుతున్న తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. రేవంత్రెడ్డి పాలన మాత్రం పాతాళానికి పడిపోతుందని చెప్పారు. అది రాష్ట్ర ఆదాయం అయినా కావొచ్చు...రియల్ ఎస్టేట్ రంగం కావొచ్చు...చివరకు వాహనాల రిజిస్ట్రేషన్లు జీఎస్టీ వసూలు ఇలా ప్రతి ఒక్క రంగంలో మందగమనం ఉందన్నారు. రేవంత్రెడ్డి పాలనలో మిగిలింది మందగమనం, మందు గమనం తప్పించి ఇంకేమీ లేదన్నారు. రేవంత్రెడ్డి ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుతున్నారన్నారు. నిజంగానే రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించాలని, మద్యం అమ్మకాలను నిషేధించాలని కేటీఆర్ సవాలు విసిరారు. నాలుక మడత తిప్పిన రేవంత్రెడ్డి ధాన్యం ప్రతి గింజా కొంటాం..తాము సేకరించిన ధాన్యం కేంద్రం కొనుగోలు చేయకపోతే కేంద్రంపై పోరాడుతాం అన్న సీఎం రేవంత్రెడ్డి..ఇప్పుడు కేంద్రం ఎంత కోటా ఇస్తే అంతే కొంటాం అంటూ నాలుక మడత తిప్పారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ అంగుష్ట మాత్రుడని, ఆయన నోరు మూసీ కంపుకంటే ఘోరం అని వ్యాఖ్యానించారుం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేబినెట్ సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఎత్తు గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రూ. 4 వేల కోట్ల నుంచి రూ. 18,500 కోట్లకు ఆదాయం పెంచాం రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణకు వచ్చే నెలసరి ఆదాయం రూ.4 వేల కోట్లు అయితే, తాము దిగిపోయేనాటికి ఆ ఆదాయాన్ని రూ.18,500 కోట్లకు పెంచామని కేటీఆర్ అన్నారు. జీఎస్డీపీని రూ.4.5 లక్షల కోట్ల నుంచి రూ.15 లక్షల కోట్లకు చేర్చామని చెప్పారు. ఈ ప్రభుత్వం రైతులకు గడిచిన 30 నెలల్లోనే రూ.1.13 లక్షల కోట్ల బకాయి పడిందన్నారు. రైతుబంధు కింద రూ.30 వేల కోట్లు, కౌలు రైతులకు రూ.22వేల కోట్లు, రుణమాఫీ రూ.29 వేల కోట్లు, ధాన్యానికి బోనస్ రూ.16 వేల కోట్లు, కూలీలకు రూ.15 వేల కోట్లు బకాయిపడ్డారని చెప్పారు. -
రూ.2,000 కోట్ల కుంభకోణం.. ఆధారాలతో వస్తాను: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
గురుకులాల టెండర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2000 కోట్ల కుంభకోణానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపణలు గుప్పించారు. గురువారం ఉదయం 11 గంటలకు ఆధారాలతో పాటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రానున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ మంత్రులు కూడా ఆధారాలతో రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ మంత్రులు వస్తారా? పారిపోతారా? తేలేది రేపే అని వ్యాఖ్యానించారు.‘‘జీవో నం 17 చట్ట విరుద్దమంటూ హై కోర్టు మార్పులు చేయాలని సూచించినా, ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తుంది? కాంట్రాక్టుల్లో సెంట్రలైజ్డ్ పద్ధతిని ఎందుకు తెచ్చారు? స్థానికంగా ఉన్న తెలంగాణ ప్రజలకు కాంట్రాక్టులు ఇవ్వకుండా, ఇతర రాష్ట్రాల వారికి తెలంగాణ సంపద దోచి పెడుతున్నారు. మఫత్ లాల్ ఎవరు? ఆయనకు యూనిఫాం, దుప్పట్లు, టవల్స్ కాంట్రాక్ట్ ఏ ప్రాతిపదికన ఇచ్చారు? ఈ రాష్ట్రంలో చేనేత కార్మికులను మోసం చేసింది నిజం కాదా? నిరంజన్ కుమార్ జైన్ ఎవరు? టోనీ అనే డ్రగ్ సప్లయర్, నిరంజన్ కుమార్ జైన్ కు ఏంటి సంబంధం? డ్రగ్స్ సప్లయ్ చేసే కంపెనీకి, ట్రంకు బాక్సుల కాంట్రాక్టు ఎలా ఇచ్చారు? రాజేశ్ అగర్వాల్ ఎవరు? షూ సప్లయ్ టెండర్ కాంట్రాక్ట్ అతనికి ఎలా ఇచ్చారు? తెలంగాణలో తోలు వ్యాపారం చేసే మాదిగ లేదా ఇతర సామాజిక వర్గాలకు ఎందుకు ఇవ్వలేదు? రూ.2,041 కోట్ల టెండర్లు ఖరారైనా ఇప్పటికీ విద్యార్థులకు ఎందుకు వస్తువులు అందడం లేదు? పిల్లలకు సప్లయ్ చేసే నోట్ బుక్ పేపర్ పై వాటర్ మార్క్ నిబంధన ఎలా వచ్చింది? కరెన్సీ పేపర్, రెవెన్యూ స్టాంప్ పేపర్లకు వాడే వాటర్ మార్క్... పిల్లల నోట్ బుక్స్ కి ఎందుకు? ఈ నిబంధన ఎవరి కోసం చేర్చారు? ప్రోగ్రాం మానిటరింగ్ యూనిట్ ఎందుకు? మా ఆరోపణల్లో అవాస్తవాలు ఉంటే గురువారం ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చి,ప్రజలకు సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ అందరూ ఆధారాలతో వచ్చి, వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలి. కాంగ్రెస్ వస్తుందా? అటెన్షన్ డైవర్షన్ లో భాగంగా తప్పిస్తుందా? చూద్దాం’’ అని చెప్పారు. -
టాపిక్.. ప్లేస్.. డేట్.. టైమ్ రేవంత్ చెప్పాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తమ పాలనలో కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి చేశామని.. బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన కట్టడాలను చూసి ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా ప్రశంసిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాలుగేళ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టామన్న కేటీఆర్.. సీఎం రేవంత్రెడ్డి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం తెచ్చారంటూ ప్రశ్నించారు.‘‘రాష్ట్ర అప్పులపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. సీఎం రేవంత్ తీరుతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆదాయం నెలకు రూ.18,500 కోట్లు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి అరాచక పాలన చేస్తున్నారు. రుణమాఫీ పేరుతో రైతులకు సీఎం రేవంత్ రూ.29 వేల కోట్లు ఎగ్గొట్టారు. అబద్దాలు చెప్పడం సీఎం రేవంత్ జన్మహక్కు’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.‘‘సీఎం రేవంత్, ఆయన సోదరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. డబ్బులు లేవంటూనే రూ.200 కోట్లతో అందాల పోటీలు నిర్వహించారు. సీఎం రేవంత్ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. సీఎం రేవంత్తో చర్చకు నేను సిద్ధం. టాపిక్.. ప్లేస్, డేట్.. టైమ్ రేవంత్ చెప్పాలి. సవాల్ విసిరి పారిపోయే అలవాటు సీఎం రేవంత్దే. మీ తప్పులను బయటపెట్టకపోతే రాజకీయాలను నుంచి తప్పుకుంటా. ఉద్యోగాలు, రైతు డిక్లరేషన్.. దేనిపైనైనా చర్చకు రెడీ’’ అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. -
‘సర్’పై సీజేఐకి 23 పార్టీల బహిరంగ లేఖ
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా సవరణ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై దేశంలోని 23 రాజకీయ పార్టీలు, ఒక స్వతంత్ర ఎంపీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు బహిరంగ లేఖ రాశాయి. సర్ ప్రక్రియలో ఎన్నికల కమిషన్ పాత్ర, తదితర అంశాలపై ప్రశ్నలు లేవనెత్తాయి. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో సర్ ప్రక్రియ ప్రభావం ఎలా ఉందో వివరిస్తూనే అందులో ఎన్నికల కమిషన్ పాత్రను కూడా వివరించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇండియా కూటమిలోని పార్టీలతోపాటు ఆప్, డీఎంకే కూడా ఈ లేఖపై సంతకాలు చేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఎక్స్ వేదికగా తెలిపారు. ‘సర్’పై విపక్షాలన్నీ ఒకే మాటపై ఉన్నాయని, ఉమ్మడిగా నిరసన తెలుపుతున్నాయని, కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటిస్తున్నాయని పేర్కొన్నారు. జూన్ 8న ఇండియా కూటమి పార్టీలతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ లేఖ రాసినట్లు తెలిపారు. ఈ లేఖపై కాంగ్రెస్ తరఫున అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, వామపక్ష పార్టీ నేతలు, స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ సంతకాలు చేసినట్లు తెలిపారు. తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ మీడియాతో మాట్లాడుతూ... ‘ఇండియా కూటమి పార్టీల ఉమ్మడి కృషి ఫలితం ఇది’ అని లేఖపై వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలోని అన్ని ఇతర వ్యవస్థలు విఫలమైన నేపథ్యంలో న్యాయ వ్యవస్థే శరణ్యమన్న ఆలోచన నుంచే ఈ లేఖ పుట్టుకొచ్చిందని కీలక ప్రతిపక్ష నేత ఒకరు తెలిపారు. ఇది న్యాయవ్యవస్థ ఆత్మను స్పృశించే అంశమని, దేశంలో ఏం జరుగుతోందో న్యాయవ్యవస్థ కూడా పట్టించుకోవాలని ఆ నేత వ్యాఖ్యానించారు. -
త్రిలింగ భూమిపై కమలం వికసించాలి
సాక్షి, హైదరాబాద్/ఘట్కేసర్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్కు కౌంట్డౌన్ ప్రారంభమైందని.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ కల సాకారం చేయాలని పార్టీ నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. ఇందుకోసం వెంటనే సడక్ సే సన్సద్ తక్ (గల్లీ నుంచి చట్టసభల దాకా) పోరుబాటకు శ్రీకారం చుట్టాలన్నారు. ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణ లక్ష్యాలను వివరించాలని సూచించారు. తెలంగాణలో పరివర్తన, ప్రజల గొంతుకగా వారి సమస్యలపై రోడ్లపైకి వచ్చి పోరాడితేనే అధికారం సాధ్యమని.. ఈ త్రిలింగ భూమిపై కమలం వికసించేలా పోరాడాలని కోరారు. మంగళవారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ అవుషాపూర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన నితిన్ నబీన్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ల పాలనను తూర్పారబట్టడంతోపాటు తెలంగాణలో అధికారం చేపట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల సొమ్ము రాహుల్ యాత్రలకు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఒక్కటీ పూర్తి చేయలేదని నితిన్ నబీన్ విమర్శించారు. మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్టు పేరిట లూటీకి తలుపులు తెరిచిందని దుయ్యబట్టారు. అవినీతి, నేరమయ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పర్యాయపదంగా మారిందని.. దేశంలోని తుక్డే తుక్డే గ్యాంగ్లతో చేతులు కలిపి పనిచేస్తోందన్నారు. తెలంగాణ ప్రజల శ్రమతో సంపాదించిన డబ్బును ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట ఢిల్లీకి తరలిస్తోందని.. ప్రజల డబ్బును, రైతులకు ఇతర వర్గాలకు ఇవ్వాల్సిన సొమ్మును రాహుల్ గాంధీ విదేశీ యాత్రలకు ఖర్చు చేస్తోందని ఆరోపించారు.బీఆర్ఎస్ హయాంలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలాయని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అదే అవినీతి, అక్రమాలను కొనసాగిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ లెక్కలన్నీ తేలుస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనని, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ముస్లింలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచుతామని ప్రకటించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు జి.కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎం.రఘునందన్రావు, గోడెం నగేశ్, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్రెడ్డి, ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమరయ్య, పార్టీ నేతలు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్, రేఖా శర్మ, పొంగులేటి సుధాకర్రెడ్డి, చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు. విభేదాలు వీడండి: సునీల్ బన్సల్ ‘తెలంగాణలో ఫైర్ ఉన్నా దానిని ఎలా ఉపయోగించుకోవడమే సమస్యగా మారుతోంది. మీలో మీరు కొట్టుకుంటున్నారు. దీంతో అంతర్గత విభేదాలు తీవ్రమవుతున్నాయి. ఈ పరిస్థితిని పక్కనపెట్టి అన్ని శక్తులను ఒకే దిశలో పెట్టే ప్రక్రియ అవసరం ’అని రాష్ట్ర కార్యవర్గ భేటీ ముగింపు సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్ పేర్కొన్నట్లు సమాచారం. నేతలంతా టార్గెట్ తెలంగాణ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ‘రాష్ట్రంలో బీజేపీకి మరో శుత్రువు లేదు. పార్టీలోనే ఒకరికొకరు శత్రువులు ఉన్నారు. ఇదే పెద్ద సమస్య. దీన్ని అధిగమిస్తే పార్టీ అధికారంలోకి రావడం ఖాయం’అని పార్టీ రాష్ట్ర ఇన్చార్జి అభయ్ పాటిల్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.తీర్మానాలు ఇవే...» కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ కోసం రాష్ట్ర పార్టీ కృషి చేయాలని, ప్రభుత్వాన్ని గద్దె దించేలా పోరాడాలని రాష్ట్ర కార్యవర్గం రాజకీయ తీర్మానం ఆమోదించింది. » నిరుద్యోగ భృతి చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మరో తీర్మానం. » రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న రైతుల పక్షాన పోరాడాలని వ్యవసాయ రంగ తీర్మానం ఆమోదం. » ప్రధాని మోదీ పన్నెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతి, అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలను ప్రశంసిస్తూ మరో తీర్మానం. » తెలంగాణకు కేంద్రం భారీగా నిధులు కేటాయించి అభివృద్ధికి ఎంతో సహకరిస్తోందని ఇంకో తీర్మానానికి ఆమోదముద్ర. గ్రూపులను సహించం.. కలిసి పనిచేయాల్సిందే పార్టీ ముఖ్య నేతలతో భేటీలో నితిన్ నబీన్ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పార్టీలో నేతలు గ్రూపులుగా విడిపోవడాన్ని, సమన్వయ లేమి వల్ల పార్టీలో సమస్యలు తలెత్తడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తే ఎంత పెద్ద నేతనైనా ఉపక్షించే పరిస్థితి లేదని తేల్చిచెప్పినట్లు సమాచారం. ఇప్పటికైనా కొందరు నేతలు పద్ధతి మార్చుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయాలని ఆయన సూచించారని తెలిసింది. మంగళవారం రాష్ట్ర కార్యవర్గ భేటీ సందర్భంగా విడిగా ముఖ్య నేతలతో నితిన్ నబీన్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ సర్కార్ ప్రజావ్యతిరేక నిర్ణయాలు, వైఫల్యాలు ఎన్నికల్లో బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఉన్నందున పార్టీ నేతలంతా కలిసిమెలిసి పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయని చెప్పినట్లు తెలిసింది.రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకుప్రజలు సిద్ధంగా ఉన్నారు: రాంచందర్రావు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రా పేరిట కూల్చివేతలతో సర్కార్ను ప్రారంభించిన రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అన్నారు. మూసీ ప్రక్షాళనపై బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే గాంధీ సరోవర్ వంటి భారీ ప్రాజెక్టులను ప్రకటించి లక్షల కోట్లు ఖర్చు చేస్తూ ప్రజలను నిర్వాసితులను చేయడం సరైన విధానం కాదని వ్యాఖ్యానించారు. బీజేపీకి అధికారం కట్టబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మంగళవారం ఘట్కేసర్ సమీపంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన అధ్యక్షోపన్యాసం చేస్తూ మనలో మనం పోరాడకుండా, విభేదించుకోకుండా ‘టీమ్ బీజేపీ’గా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తాను బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తిచేసుకుంటున్న సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి, ప్రతి అడుగులోనూ సహకరించిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు రాంచందర్రావు కృతజ్ఞతలు తెలియజేశారు. నితిన్ నబీన్ నాయకత్వంలో తెలంగాణలో కూడా బీజేపీ విజయపతాకాన్ని ఎగురవేస్తుందనే పూర్తి విశ్వాసం ఉందన్నారు. -
కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనానికి పాజిటివ్గా చర్చలు
శరద్ పవార్(85)కు చెందిన ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేందుకు మార్గం సుగమమవుతున్నట్లు తెలుస్తోంది. శరద్ పవార్ పార్టీ, కాంగ్రెస్ విలీన చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని, తుది దశకు చేరినట్లు సమాచారం.ఇందుకు సంబంధించిన వివరాలను కాంగ్రెస్ నాయకుడు విజయ్ వడెట్టివార్ ఓ జాతీయ మీడియాకు తెలిపారు. శరద్ పవార్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అయ్యే అవకాశంపై చర్చలు కొనసాగుతున్నాయని ధ్రువీకరించారు. విలీనంపై అధిష్ఠానంతో చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. "కాంగ్రెస్, శరద్ పవార్ లౌకికవాద సిద్ధాంతాలను విశ్వసించే వారికి మా పార్టీలోకి ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతాం" అని ఆయన చెప్పారు.శరద్ పవార్ 1999లో కాంగ్రెస్ నుంచి విడిపోయి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు. 2023లో శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ కూడా అదే విధంగా ఎన్సీపీని చీల్చారు. అజిత్ పవార్ తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను తీసుకుని మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరారు. దీంతో ఆ ప్రాంతీయ రాజకీయ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది.మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే వంటి ప్రాంతీయ నాయకులకు ఇటీవల రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలిన సమయంలో కాంగ్రెస్తో విలీనం జరిగే అవకాశంపై చర్చలు మొదలయ్యాయి. ఆయా పార్టీల్లో కీలక నేతలు ఇటీవల ప్రత్యేక వర్గాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో సొంత పార్టీల నుంచి దూరమయ్యారు. కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) ఎమ్మెల్యేలు, ఎంపీలకు కాంగ్రెస్ నాయకత్వం ఆమోదం తెలిపిందని కూడా సమాచారం. ఎన్డీఏలో చేరదాం శరద్ పవార్ పార్టీ భవిష్యత్తుపై రెండు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని సమాచారం. ఒక వర్గం ఎన్డీఏలో చేరాలని భావిస్తోంది. పార్టీకి ఉన్న పార్లమెంటు బలం ఆధారంగా ఎన్డీఏలో భాగస్వామ్యం లభిస్తుందని ఆ వర్గం వాదిస్తోంది. ప్రతిపక్షంలో ఉండటం వల్ల రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో అభివృద్ధి పనులు, నియోజకవర్గ సమస్యల పరిష్కారం కష్టంగా మారిందని కూడా ఆ వర్గ నాయకులు భావిస్తున్నారని సమాచారం.పార్టీ రెండు వర్గాలు మళ్లీ కలిస్తే ఎన్డీఏలోనే కొనసాగాలని దివంగత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కోరుకున్నారని కూడా సమాచారం. ఆయన మరణం తర్వాత రెండు ఎన్సీపీ వర్గాలు మళ్లీ ఒక్కటయ్యే అవకాశం తగ్గిపోయిందని సమాచారం. అయినప్పటికీ స్వతంత్రంగా ఎన్డీఏలో చేరేందుకు ఎలాంటి అడ్డంకి ఉండదని ఆ వర్గం భావిస్తోంది. అయితే పార్టీలోని మరో వర్గం కాంగ్రెస్లో విలీనం కావాలని కోరుకుంటోందని సమాచారం. -
నితిన్ నబీన్ పర్యటన పూర్తిగా ఫ్లాప్ షో: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ పర్యటన పూర్తిగా ఫ్లాప్ షోగా ముగిసిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ బీజేపీ నాయకులు చిన్న సమావేశాన్ని కూడా సక్రమంగా నిర్వహించలేకపోతున్నారని, అలాంటి పరిస్థితిలో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ పర్యటనపై తాజాగా మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ..‘అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీ విభజన రాజకీయాలను ఇప్పటికే తిరస్కరించారు. జీహెచ్ఎంసీ గురించి మాట్లాడే ముందు హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం విధించిన అన్ని అడ్డంకులను తొలగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణకు బీజేపీ సిద్ధంగా ఉందా?. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నా సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో నితిన్ నబీన్ సమాధానం చెప్పాలి.తెలంగాణలో బూత్లు గెలుస్తాం, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుస్తాం అని ప్రగల్భాలు పలికే ముందు గ్రౌండ్ రియాలిటీ చూసుకోవాలి. తెలంగాణలో బెంగాల్ తరహా విభజన రాజకీయాలు సాగవని హెచ్చరించిన ఆయన, నగరాల పేర్లు మార్చడంపైనే బీజేపీ దృష్టి ఉందని, ప్రజల జీవితాలను మార్చే అభివృద్ధి ప్రణాళిక మాత్రం కనిపించడం లేదని విమర్శించారు. సుష్మా స్వరాజ్పై తమకు గౌరవం ఉన్నప్పటికీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేయవద్దని అన్నారు. వారసత్వ రాజకీయాలను విమర్శించే బీజేపీ, ఎన్నికల అవసరాల కోసం వారసత్వ నాయకులను పార్టీలో చేర్చుకుంటోందని ఆరోపించారు. దేశంలో పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, తెలంగాణకు రావాల్సిన కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రాజెక్టుల వంటి కీలక అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ జాతీయవాదం పేరును ఉపయోగిస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు. -
రేవంత్ ఫెయిల్యూర్ సీఎం
సాక్షి,సిద్ధిపేట: సీఎం రేవంత్రెడ్డి గుప్పు మేస్త్రీ కాదు.. ముంపు మేస్త్రీ అని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. సిద్ధపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దద్దమ్మ ముఖ్యమంత్రి, ఫెయిల్యూర్ సీఎం రేవంత్.రైతు బంధ మీద శాసన సభలో చర్చకు రేవంత్రెడ్డి సిద్ధమా?. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మా ప్రభుత్వంలో 92 లక్షల మెట్రిక్ టన్నున ధాన్యం కొన్నాం. 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని రేవంత్ చెప్పుకోవడం విచిత్రం.ఈ రోజు ప్రతి రైతు కేసీఆర్ను, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తలచుకుంటున్నారు.బీఆర్ఎస్ ఎస్ఎల్బీసీ టన్నెల్స్ను 12 కిలోమీటర్లు తవ్వింది. ఎస్ల్బీసీలో కార్మికులు చనిపోతే శవాలను కూడా బయటకు తీయలేకపోయారని విమర్శించారు. -
‘తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను ఉప్పు పాతర వేశారు’
సాక్షి,నల్గొండ: మూసీలో ఉండే కాలుష్యం కంటే బీఆర్ఎస్ నేతల కడుపులో ఉండే కంపే ఎక్కువ’ అంటూ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆదివారం నల్గొండలో రూ.13వేల కోట్ల రోడ్ల నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు.అనంతరం సీఎం రేవంత్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో నల్గొండ తలెత్తుకునేలా చేసిన నాయకుడు కోమటిరెడ్డి. త్యాగమంటే ఎలక్షన్లు తేవడం, కలెక్షన్లు చేసుకోవడమేనా?. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంతో త్యాగం చేశారు. తెలంగాణ కోసం ఎంతో మంది బిడ్డలు త్యాగం చేశారు. బీఆర్ఎస్ పదేళ్లలోనే వందేళ్లకు సరిపోయే విధ్వసం చేసింది. తెలంగాణ సమాజం బీఆర్ఎస్ను క్షమించదు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను ఉప్పు పాతర వేశారు. తెలంగాణ అభివృద్ధిపై శాసన సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన దొడ్డు బియ్యం బర్రెలకు పెట్టుకునేవారు.ఏడాదికి రూ.16వేల కోట్ల వ్యయంతో సన్న బియ్యం ఇస్తున్నాం. కేసీఆర్ తింటున్న సన్న బియ్యాన్నే ఈ రోజుల పేదలు కూడా తింటున్నారు. పేదవాడి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు.. నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. పేదోడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మీకు కడుపు మంట ఎందుకు? అని ప్రశ్నించారు. -
చంద్రబాబుకు గురుదక్షిణగా మన నీటి హక్కులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటి హక్కు లను తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడికి గురుదక్షిణగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీ, కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోకుండా తెలంగాణ ప్రయోజనాలను బలి పెడుతూ ‘ముంపు మేస్త్రీ’లా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా మూడు రాష్ట్రాల సీఎంల సమావేశంలో తెలంగాణ ప్రయోజనాలను పూర్తిగా విస్మరించి, రాష్ట్ర భవిష్యత్ను కేంద్రం చేతుల్లో పెట్టే చీకటి ఒప్పందం జరిగిందన్నారు. కర్ణాటక ప్రభుత్వం 35 టీఎంసీల నవేలి రిజర్వాయర్తోపాటు 9.5 టీఎంసీల సామర్థ్యంతో మూడు బరాజ్లు, ఏపీ ప్రభుత్వం 20 టీఎంసీల గుండ్రేవుల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నా వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయకుండా సీఎం రేవంత్ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల మొత్తం 55 టీఎంసీల నీరు నిల్వ అవుతుందని, శ్రీశైలానికి ప్రవాహం తగ్గి పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలతోపాటు ఆర్డీఎస్కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హరీశ్రావు మాట్లాడారు. రహస్య ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి ముఖ్యమంత్రుల సమావేశంలో మంత్రి ఉత్తమ్, రాష్ట్ర ఇంజనీరింగ్ అధికారులను బయటే ఉంచి కేవలం ముగ్గురు సీఎంలు, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి మాత్రమే పాల్గొనడం అనుమానాలకు తావిస్తోందని హరీశ్రావు అన్నారు. ఆ సమావేశంలో జరిగిన చర్చలు, కుదిరిన ఒప్పందాలను వెంటనే ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆర్డీఎస్కు ట్రిబ్యునల్ ప్రకారం రావాల్సిన 15.9 టీఎంసీల వాటా, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి అవసరమైన నీటి భద్రత, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు భవిష్యత్పై సమావేశంలో ఎలాంటి హామీ సాధించారో సీఎం వెల్లడించాలన్నారు. నదీ జలాలపై సరైన అవగాహన లేకపోవడంతోనే ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో విఫలమవుతోందని విమర్శించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న చర్యల వల్ల చివరకు నష్టపోయేది తెలంగాణేనని, అయినా ప్రభుత్వం నిరసన వ్యక్తం చేయకపోవడం విచారకరమని చెప్పారు. సమ్మక్క సాగర్ను బలి చేయొద్దు గోదావరి నదిలో తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల నికర జలహక్కులను పూర్తిగా సాధించకుండా నదుల అనుసంధానం పేరుతో ఏపీకి అనుకూలంగా వ్యవహరించడం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని హరీశ్రావు ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో 830 టీఎంసీలకు అనుమతులు సాధించగా, మిగిలిన 138 టీఎంసీల కోసం సమ్మక్క సాగర్, వాద్ర, ఎల్లంపల్లి ప్రాజెక్టుల డీపీఆర్లు సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యంతో సమ్మక్క సాగర్ ప్రతిపాదనలు వెనక్కి వచ్చాయన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతుల పేరుతో సమ్మక్క సాగర్ను బలిపెడుతున్నారన్న వార్తలపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా ట్రిబ్యునల్ తుది తీర్పు ముందు తెలంగాణ హక్కులను బలంగా వినిపించాల్సిన సమయంలో ప్రభుత్వం మౌనం పాటిస్తోందన్నారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని కేంద్రానికి వెంటనే లేఖ రాయాలని, మూడు రాష్ట్రాల సమావేశంలో చర్చించిన అంశాలను శాసనసభలో పెట్టి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. తెలంగాణకు కృష్ణా, గోదావరి జలాల్లో ఒక్క చుక్కనీరు తగ్గినా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
అందుకే విష ప్రచారం చేస్తున్నారు: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘‘సర్’ ప్రక్రియ ఓటర్ల జాబితాను పారదర్శకంగా మార్చే కీలక కార్యక్రమం అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా చాలాసార్లు జరిగిందని.. ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదన్నారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా నిర్వహించే సాధారణ చట్టబద్ధమైన ప్రక్రియగా కిషన్రెడ్డి పేర్కొన్నారు.‘‘అర్హులైన వారికి ఓటు కల్పించాలి.. కానీ దీనిపై కూడా కొందరు రాజకీయం చేస్తున్నారు. ‘సర్’పై సుప్రీంకోర్టు కూడా దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కానీ కొన్ని రాజకీయ పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయి. భారత పౌరుల విలువ పెంచే ప్రక్రియ ‘సర్’. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును భద్రపరచుకోవాలి.. స్వచ్ఛందంగా పాల్గొనాలి. బోగస్ ఓట్లు ఉండకూడదు. ‘‘సర్’ వచ్చాక ఓటు పర్సంటేజ్ పెరగడం అందరం చూశాం. స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారిగా బీహార్, బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాల్లో ఓటు శాతం పెరగడానికి కారణం ‘సర్’ అని కిషన్రెడ్డి చెప్పారు.‘‘ప్రజాస్వామ్యానికి భారత దేశం తల్లి లాంటిది.. మదర్ ఆఫ్ డెమోక్రసీ అని ప్రధాని మోదీ చెబుతుంటారు. ఎన్నికల కమిషన్ ఎవరి కనుసన్నల్లో పనిచేసే సంస్థ కాదు. కాంగ్రెస్ దీనిపై లేనిపోని అపోహలు సృష్టిస్తోంది. ఎన్నికల కమిషన్పై బురద చల్లాలని చూస్తున్నారు. ఆటం బాంబులు వేస్తా.. ప్రళయం సృష్టిస్తా అని చెప్పి వారి పరువు వారే తీసుకుంటున్నారు. ‘సర్’ వల్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎందుకు గుండెలు బాదుకుంటున్నాయి?. ఓటర్లను అవగాహన, చైతన్యం కల్పించాల్సిన పార్టీలు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నాయి’’ అంటూ కిషన్రెడ్డి ప్రశ్నించారు.‘‘బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారు.. రేషన్ కార్డులు పొందారు. ఆధార్ కార్డులు పొందారు. లోన్లు కూడా తీసుకున్నారు. వీటిపై ఎందుకు ఈ పార్టీలు మాట్లాడటం లేదు. ‘సర్’ను మతంతో ముడిపెట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు సీఎం చేస్తున్నారు. హైదరాబాద్లోని చాలా బస్తీల్లో రోహింగ్యాలు ఉన్నది వాస్తవం కాదా?. ఎవరు గుండెలు బాదుకున్నా? ఈ ప్రక్రియను ఎవరూ అడ్డుకోలేరు. కానీ రేవంత్ మాత్రం లేనిపోని విమర్శలు చేస్తున్నారు. ‘సర్’ చేసేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కదా. కాంగ్రెస్కు ప్రభుత్వ ఉద్యోగులపై విశ్వాసం లేదు. అందుకే అబద్ధపు, విష ప్రచారం చేస్తున్నారు.. రెచ్చగొడుతున్నారు..కాంగ్రెస్ నేతలు బీఎల్ఓలను బెదిరిస్తున్నారు. మజ్లిస్ కూడా ఎవరి ఇళ్లకు వెళ్లొద్దు.. మా వద్దకు వస్తే మేము చెప్పిన డేటా తీసుకోవాలని బెదిరిస్తున్నారు. మజ్లిస్ కనుసైగల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తోంది. ఉద్యోగులు బెదరవద్దు.. మేము అండగా ఉంటాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ దిగజారి వ్యవహరిస్తున్నాయి. పౌరసత్వంతో కూడా ఓటు హక్కుకు ముడిపెట్టారు. ఓటు ఎక్కడున్నా సరే.. దానికి సంక్షేమ పథకాలకు సంబంధం లేదు. అలాగే పౌరసత్వంతో కూడా ‘సర్’కు సంబంధం లేదు. ఇవే మాటలు కేరళలో ఎందుకు మాట్లాడటం లేదు...బెంగాల్లో రాష్ట్ర ప్రభుత్వ కబంధ హస్తాలోనే ఈ ప్రక్రియ జరిగింది. దీనిపై అక్కడ ఎందుకు మాట్లాడలేదు. ఇవన్నీ నిరాధారమైన విమర్శలు మాత్రమే. ప్రజల్లో ఆందోళన రేకెత్తించి ప్రయోజనం పొందాలని కొందరు చూస్తున్నారు. ఓటర్ లిస్టును చెక్ చేసి ఎక్కడ నివాసముంటే అక్కడకు ఓటు హక్కు పొందేలా చూడాలి. అలాగే తప్పుల సవరణ కూడా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కంటోన్మెంట్లో ‘సర్’కు వెళ్ళిన బీఎల్ఓలతో ఇందిరమ్మ చీరలు అందించాలని కాంగ్రెస్ నీచంగా వ్యవహరించింది. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫోటోతో సహా ఫిర్యాదు చేశాం. ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకోవాలి‘సర్’కు వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే ఎవరైనా బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని అడిగారా?. అదే నిజమైతే కేసీఆర్, కేటీఆర్, అసదుద్దీన్ ఇంటికి కూడా సిబ్బంది వెళతారు.. వారు కూడా సభ్యత్వం తీసుకుంటారా మరి?. అసదుద్దీన్ బారిస్టర్లో రాజ్యాంగం గురించి సరిగ్గా చదవలేదు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఎలా అబద్ధాలు మాట్లాడాలో నేర్చుకున్నాడు. పాత బస్తీలో దొంగ ఓట్లు ఉన్నాయి.. నగరంలో కూడా చాలా ఉన్నాయి.. అవి తొలగిస్తే వారి పప్పులు ఉడకవని భయంతో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో ఉండే ఇతర రాష్ట్రాలు, జిల్లాల ప్రజలు.. ఇక్కడే ఓటు హక్కు తీసుకోవాలి’’ అని కిషన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
కాంగ్రెస్ పాలనలో ప్రజలకు నరకం
పరిగి: ‘మోసపోతే గోస పడుతామని పరిగి గడ్డపై నిలబడి కేసీఆర్ ఆనాడే చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలు నరకం చూస్తున్నారు’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం వికారాబాద్ జిల్లా పరిగిలో ‘సర్’పై నిర్వహించిన శిక్షణ, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసైన్డ్ రైతులకు పట్టాలిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేవంత్.. ఇప్పుడు పారిశ్రామిక పార్కుల పేరిట వేలాది ఎకరాలు లాక్కుంటున్నారని ఆరోపించారు. పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి కనీసం ధాన్యం కూడా పూర్తిగా కొనలేకపోతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి ఆరిపోయే దీపం లాంటివారని ఎద్దేవా చేశారు. రైతుల పక్షాన నిలబడి పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. కమీషన్ల కోసమే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పూర్తి చేశామని.. కానీ రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ప్రేమ ఉంటే ఎందుకు పూర్తి చేయలేదని కేటీఆర్ నిలదీశారు. ఉద్దండాపూర్ నుంచి గ్రావిటీ ద్వారా వికారాబాద్ జిల్లాకు కాల్వల ద్వారా నీటిని తీసుకురావచ్చని సిద్ధం చేస్తే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు కమీషన్లు, కుటుంబ సంపాదన కోసం రూ. 440 కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పక్కన పెట్టారని దుయ్యబట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం, కేసీఆర్ సీఎం కావడం ఖాయమని.. రైతులకు పరిగితోపాటు కొడంగల్, జిల్లా మొత్తానికి సాగు నీరు అందించే బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పార్టీ నేతలు అనిల్రెడ్డి, ప్రవీణ్రెడ్డి, శివనోళ్ల భాస్కర్, రాజిరెడ్డి, సురేందర్, అశోక్కుమార్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. -
రాహుల్పై బీజేపీ ‘మీమ్స్’ వార్.. కాంగ్రెస్ కౌంటర్
ఢిల్లీ: రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై సోషల్ మీడియా వేదికగా బీజేపీ మరో డిజిటల్ వార్ మొదలుపెట్టింది. రాహుల్ విదేశీ పర్యటనలపై మీమ్స్తో పోస్టులు పెడుతూ.. విమర్శలు గుప్పిస్తోంది. రాహుల్ గాంధీ ఎక్కడున్నారు? ఆయన తరచూ చేసే విదేశీ పర్యటనలకు అయ్యే ఖర్చు ఎక్కడి నుంచి వస్తోందంటూ నిలదీసింది. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇస్తూ.. రాహుల్ గాంధీ గ్లోబల్ లీడర్ అని.. అనేక దేశాలు, సంస్థలు ఆయనను ఆహ్వానిస్తుంటాయంటూ పేర్కొంది.ప్రముఖ సినిమా టైటిళ్ల ఆధారంగా రూపొందించిన 'ఛడ్ దే ఇండియా' (ఇండియాను వదిలేయ్), 'లాపతా రాహుల్' (కనిపించకుండా పోయిన రాహుల్) పోస్టర్లతో బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. గో రాహుల్ గాన్, టూరిస్ట్ జిందా హై, పరదేశ్ వంటి మరికొన్ని పోస్టర్లు కూడా వైరల్గా మారాయి. రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆయనను కలవాలని అనుకుంటున్నారని స్పష్టం చేసింది. ఆయన చాలా తక్కువ సమయం మాత్రమే కేటాయించగలరు కాబట్టి, ఆయన పర్యటనలు చిన్నవిగా, తరచుగా ఉంటాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ పేర్కొన్నారు."రాహుల్ గాంధీ కేవలం మన దేశానికి మాత్రమే నాయకుడు కాదు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆయనను ఒక గొప్ప నాయకుడిగా భావిస్తారు. చాలా మంది ఆయన కోసం ఎదురుచూస్తున్నారు. ఈ వరుస ఆహ్వానాల కారణంగా ఆయన కేవలం రెండు రోజులు, నాలుగు, ఐదు రోజులు మాత్రమే సమయం కేటాయించి ప్రయాణిస్తున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ బీజేపీతో ఏకీభవించరని గ్రహించాలి. ప్రజలు భారతదేశాన్ని విభిన్న కోణాల్లో చూస్తారు, ఆ కోణంలోనే వారు రాహుల్ గాంధీని కూడా చూస్తారు" అని ఖుర్షీద్ పేర్కొన్నారు.విదేశీ పర్యటనలు చేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చిన వెంటనే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా విదేశాలకు వెళ్లారని కాంగ్రెస్ ఎంపీ మనోజ్ కుమార్ గుర్తు చేశారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్తే తప్పేంటి? విదేశాలకు వెళ్లవద్దన్నా ప్రధాని.. ఆ తర్వాత తనే స్వయంగా విదేశీ పర్యటనకు వెళ్తారు. రాహుల్ గాంధీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడంటూ ఆయన సమర్థించారు. -
మీ తండ్రిని జైలులో పెడితే... పారిపోయింది నువ్వు మిస్టర్ లోకేశ్..!
-
కాంగ్రెస్ తో చంద్రబాబు చీకటి రాజకీయం బట్టబయలు.. ఢిల్లీకి లోకేష్ పరుగు.!
-
కాంగ్రెస్ వస్తే.. బీజేపీ నేతలు సెక్యూరిటీతో తిరగాలి
న్యూఢిల్లీ: సీనియర్ నేత, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పవన్ ఖేరా చేసిన తాజా వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కేంద్రంలో అధికార మార్పు జరిగితే.. రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. గత 12-15 ఏళ్ల పరిణామాలను ప్రజలు మరచిపోలేదని పేర్కొంటూ.. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే బీజేపీ నాయకులు ప్రజల్లోకి భద్రత లేకుండా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతుండగా, ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్గా మారాయి.గురువారం కాంగ్రెస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన పవన్ ఖేరా.. గత దశాబ్ద కాలంగా దేశ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావించారు. అధికార దుర్వినియోగం, దర్యాప్తు సంస్థల వినియోగం, ప్రతిపక్షాలపై రాజకీయ ఒత్తిళ్లు వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే బీజేపీ నేతలు భద్రత లేకుండా రోడ్లపై తిరగలేని పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు.పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీనిపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తూ కాంగ్రెస్ హింసాత్మక రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.A very strong statement by Congress MP @Pawankhera ji to BJP, “Let our government come to power. When we recount these 12–15 years, BJP leaders will not be able to step out on the streets without security. I am telling you this, they will even need protection to come out in… pic.twitter.com/YrpIHF96Ch— Harmeet Kaur K 🇮🇳 (@iamharmeetK) June 25, 2026మరోవైపు కాంగ్రెస్ వర్గాలు మాత్రం పవన్ ఖేరా వ్యాఖ్యలను వేరే కోణంలో చూడాలని అంటున్నాయి. గత కొన్నేళ్లుగా రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థల వినియోగం, రాజకీయ ఉద్రిక్తతలు, ప్రజల్లో పెరిగిన అసంతృప్తి వంటి అంశాల నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని వివరిస్తున్నాయి.అయితే పవన్ ఖేరా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వాటిని రాజకీయ వ్యాఖ్యలుగానే అభివర్ణిస్తుండగా, మరికొందరు ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ అంశం జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. -
మంత్రి ప్రధాన్ రాజీనామా డిమాండ్తో 30 నుంచి కాంగ్రెస్ ఆందోళనలు
అహ్మదాబాద్/భోపాల్/నాగ్పూర్: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో ఈ నెల 30వ తేదీ నుంచి దేశవ్యాప్త ప్రచారోద్యమం చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. విద్యార్థుల గళం పేరుతో 40 రోజులపాటు జరిగే దేశవ్యాప్త నిరసనలు, ఆగస్ట్ 9వ తేదీన ‘ఢిల్లీ ఛలో’తో ముగియనుందని ఆ పార్టీ పేర్కొంది. నిరసనల సమయంలో మొత్తం 28 నగరాల్లోని విద్యార్థులు, ఉద్యోగార్థులు, కోచింగ్ కేంద్రాలు, కాలేజీ క్యాంపస్లు, గ్రంథాలయాల్లో ప్రభుత్వ నిర్వాకాన్ని వివరిస్తామంది. కరపత్రాల పంపిణీ, వీధివీధినా సమావేశాలు, క్యాంపస్లో విద్యార్థులతో ముఖాముఖి వంటివి చేపడతామంది. అహ్మదాబాద్, భోపాల్, నాగ్పూర్ తదితర నగరాల్లో 30వ తేదీ నుంచి సాగే ఆందోళనలకు సంబంధించిన వివరాలను ఆ పార్టీ నేతలు మీడియాకు వివరించారు. పదేపదే జరుగుతున్న పరీక్షల అవకతవకల కారణంగా విద్యార్థులకు వ్యవస్థపై నమ్మకం తగ్గిపోయిందని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని అహ్మదాబాద్లో కాంగ్రెస్ నేత సతేజ్ పాటిల్ ఆరోపించారు. 130 కోట్ల మంది కలిగిన దేశాన్ని నడిపిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం..కేవలం 23 లక్షల మంది కోసం పక్కాగా పరీక్షను సైతం నిర్వహించలేకపోతోందని ఎద్దేవా చేశారు. పరీక్ష పత్రాలు ముందుగానే లీకవడం మామూలు అంశంగా మారిపోయిందని, ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని పాటిల్ విమర్శించారు. గతంలో ఇలాంటి అనేక కేసుల్లో కేవలం మధ్యదళారులను మాత్రమే అరెస్ట్ చేసి, వాటి వెనుక ఉన్న కుంభకోణాల నెట్వర్క్ను మాత్రం వదిలేసిందని దుయ్యబట్టారు. కోచింగ్ కేంద్రాలు, పరీక్ష పత్రాల లీక్ నెట్వర్క్ల మధ్య ఉన్న సంబంధాలను బయటపెట్టాలన్నారు. వార్షిక పరీక్షలు, వాటి ఫలితాలు, నియామకాలకు సంబంధించిన తేదీలను ముందుగానే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పరీక్షా విధానంలో సమూల ప్రక్షాళన చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాన్ క్షమాపణ చెప్పాలి: రాహుల్ పరీక్ష పత్రాల లీకేజీలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులను ఉగ్రవాదులంటూ వ్యాఖ్యానించిన విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ఆయన మంత్రి పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతి ఒక్కరినీ ద్రోహులంటూ బీజేపీ ప్రభుత్వం ముద్రవేస్తోందని రాహుల్ గురువారం ఎక్స్లో ఆ రోపించారు. -
పరువు నష్టం కేసులో రాహుల్ ‘సారీ’
జబల్పూర్: కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికేయ చౌహాన్పై చేసిన అనుచిత వ్యాఖ్యల పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షమాపణ కోరారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టులో రాహుల్ బుధవారం పిటిషన్ వేశారు. గురువారం దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ప్రమోద్కుమార్ అగర్వాల్ కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. 2018లో ఝబువాలో జరిగిన ర్యాలీలో పనామా పత్రాల లీక్ కుంభకోణంతో సంబంధముందంటూ రాహుల్ తన పేరును ప్రస్తావించారంటూ కార్తికేయ ఆరోపిస్తున్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ భోపాల్లోని ఎంపీ/ఎమ్మెల్యేల కేసుల ప్రత్యేక కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ కోర్టు రాహుల్కు సమన్లు పంపింది. దీంతో, రాహుల్ హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని రాహుల్ పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం కుమారుడి పేరుకు బదులుగా పొరపాటున కార్తికేయ పేరును ప్రస్తావించానని పిటిషన్లో తెలిపారు. పరువునష్టం కేసుతోపాటు సమన్లను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై, కార్తికేయ సానుకూలంగా స్పందించారు. రాహుల్ క్షమాపణను స్వీకరిస్తున్నానని, భోపాల్ కోర్టులో వేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంటానని తెలిపారు. దీంతో, హైకోర్టు కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆయనకిలాంటివి అలవాటే: బీజేపీ తప్పుడు ఆరోపణలు పదేపదే చేయడం, న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తే తర్వాత క్షమాపణలు చెప్పడం వంటివి రాహుల్ గాం«దీకి అలవాటై పోయాయని బీజేపీ ఆరోపించింది. ఎలాంటి ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తూ ఆయన అబద్ధాల కోరుగా మారారని వ్యాఖ్యానించింది. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత కాదు..దు్రష్పచార నేత’అంటూ అభివర్ణించింది. -
రిజర్వేషన్ల అంతమే బీజేపీ అసలు లక్ష్యం
న్యూఢిల్లీ: దేశంలో రిజర్వేషన్లను రద్దుకే భారతీయ జనతా పార్టీ లోక్సభలో మూడింట రెండు వంతుల మెజార్టీ లక్ష్యంగా పని చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఆరోపించారు. దేశ యువత నిరాశా నిస్పృహలే కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో వ్యక్తమవుతున్నాయన్న ఆయన వారు లేవనెత్తిన అంశాలను ముందుకు తీసుకెళతామని తెలిపారు. బీజేపీలోకి ఫిరాయించిన పార్టీ యువ నేతలను మళ్లీ కాంగ్రెస్లోకి చేర్చుకోరాదని, మాలాంటి వారికి అది అవమానకరమన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. పీటీఐ వీడియోస్కు బుధవారం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రమేశ్ మాట్లాడుతూ మహిళ రిజర్వేషన్ల బిల్లు నెపంతో పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనకు జరిగిన ప్రయత్నం కూడా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేసేందుకేనని ఆరోపించారు చిత్తశుద్ధి ఉంటే 2029 ఎన్నికల్లో ప్రస్తుతం లోక్సభలో ఉన్న 543 స్థానాల ఆధారంగానే, ’నారీ శక్తి వందన్’ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2024లో ‘‘అబ్ కి బార్... 400 పార్’’అని బీజేపీ నినదించినప్పుడే తాము అది రిజర్వేషన్లను అంతం చేసేందుకు ఉద్దేశించిందని చెప్పామని, అప్పటి నుంచి ఇప్పటివరకూ టీఎంసీ, శివసేన (యూబీటీ)లను చీల్చేందుకు అమిత్ షా చేస్తున్న ప్రయత్నాలు ఆ మాటలను నిజం చేస్తున్నాయని వివరించారు. రిజర్వేషన్లు ఎత్తివేయాలని ఆర్ఎస్ఎస్తోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలు బీజేపీలోకి ఫిరాయిస్తున్న విషయంపై మాట్లాడుతూ ‘దీనికి కారణం ఒక్కటే. ఏప్రిల్ 17న ‘చాణక్యుడు’(అమిత్ షా) ఎదుర్కొన్న అవమానం. నియోజకవర్గ పునరి్వభజన బిల్లులు మూడూ ఆమోదింపజేస్తానని ఆయన మోడీకి మాటిచ్చారు. కానీ 298 కంటే ఎక్కువ ఓట్లు సాధించలేకపోయారు’’అని వ్యాఖ్యానించారు. బెదిరింపులు, ఆయన వ్యూహం ఫలించకపోవడంతో ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకునే లక్ష్యంతో పార్టీలను చీల్చే రాజకీయాల్లో బిజీగా ఉన్నారని ఆరోపించారు. అయితే.. విపక్షాలు పునరి్వభజన యత్నాన్ని మాత్రమే వ్యతిరేకించాయని, మహిళా రిజర్వేషన్లను కాదని స్పష్టం చేశారు. బీజేపీకి ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగంపై నమ్మకం లేదని, 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్ తీవ్రంగా వ్యతిరేకించిందని అన్నారు. మోజార్టీ అసాధ్యం.. టీఎంసీ, శివసేన (యూబీటీ)లను చీల్చడం ద్వారా బీజేపీ బలం 298 నుంచి 324కు చేరుకున్నా ప్రస్తుత లోక్సభలో మూడింట రెండొంతుల మెజార్టీ మార్కు అందుకోవడం ఆ పార్టీకి అసాధ్యమని జైరామ్ రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్ ఎన్నికల్లో కూడా వారికి ఈ మెజార్టీ రాదని, రాజ్యాంగ సవరణే వారి లక్ష్యమన్నది దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలకు బాగా తెలుసునని రమేశ్ వివరించారు. నియోజకవర్గాల పునరి్వభజన ద్వారా ఎంపీల సంఖ్యను 815కు పెంచాలని అనుకుంటున్నారని, ఇది ఎవరి ప్రయోజనాల కోసమని ప్రశ్నించారు. కుల గణన తర్వాతే పునిర్వభజన జరగాలని, వచ్చే లోక్సభ ఎన్నికలను 543 స్థానాలతోనే నిర్వహించి, అందులో మూడింట ఒక వంతు మహిళలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) రాజకీయాలను ప్రస్తావించిన జైరామ్ రమేశ్.. అవన్నీ దేశ యువతలో పేరుకుపోయిన నిరాశ, నిస్పృహల అభివ్యక్తీకరణ మాత్రమేనని అన్నారు. యువత ఈ రకమైన సందేశం ఇవ్వడంలో తప్పులేదు కానీ చివరకు రాజకీయ పార్టీలే ఆయా అంశాలను అజెండాగా మార్చుకోవాలని చెప్పారు. సీజేపీ ఉద్యమాన్ని ఎవరో స్పాన్సర్ చేస్తున్నారనడం సరికాదన్న ఆయన అది రాజకీయ పార్టీ కూడా కాదని స్పష్టం చేశారు. సోషల్మీడియాలో మంచి గుర్తింపు మాత్రం లభించిందని చెప్పారు. ఉద్యమాల ప్రాముఖ్యతను గుర్తిస్తూనే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలతో ముఖ్య భూమికని గుర్తుచేశారు. -
‘సర్’..వెరీ సీరియస్!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గట్టి ఝలక్ ఇచ్చారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం విషయంలో చాలామంది ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ వైఖరిని మార్చుకోకపోతే వారి స్థానంలో కొత్తవారిని పార్టీ ఇన్చార్జులుగా నియమిస్తామని హెచ్చరించారు. ‘మీరు ఈసారి గెలుస్తారో, ఓడతారో మీ ఇష్టం. కానీ ‘సర్’లో పేదల ఓట్లు పోకుండా చూడాల్సిన బాధ్యత మీదే. పార్టీకి నష్టం కలిగితే చూస్తూ ఊరుకోం. మళ్లీ ఎమ్మెల్యే కావాలనుకున్నా, కొత్తగా ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్నా ఎస్ఐఆర్ను సీరియస్గా తీసుకోవాల్సిందే.మీరేం చేస్తున్నారనే దానికి సంబంధించిన అన్ని నివేదికలూ నా దగ్గర ఉన్నాయి. 10 రోజుల సమయమిస్తున్నా. మీ తీరు మార్చుకోండి. లేదంటే మీ స్థానంలో కొత్త వారు వస్తారు..’ అని రేవంత్ స్పష్టం చేశారు. ఎస్ఐఆర్పై పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్చార్జులతో బుధవారం ఉదయం టీపీసీసీ ఆధ్వర్యంలో జూమ్ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్తో పాటు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలనుద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నారు.. ‘ఎస్ఐఆర్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, పోలింగ్ బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ నేతలు, కార్యకర్తలను అప్రమత్తం చేస్తూ, క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాల్సిన ఎమ్మెల్యేలు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు? పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తే సహించేది లేదు. ఓట్లు తీసేసే వాళ్లు విస్తృతంగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లూ మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నారు.ఓట్లను కాపాడాల్సిన పార్టీగా మనం ఎందుకు సమావేశాలు నిర్వహించడం లేదు? అధికారంలో ఉన్న పార్టీగా అన్ని హంగులూ అందుబాటులో ఉన్నా ఎందుకు వినియోగించుకోవడం లేదు? కేడర్ కూడా లేని కొత్తగూడెంలో బీజేపీ సమావేశాలు పెట్టింది. కనీసం కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉండే సూర్యాపేట జిల్లాలో మనం అవగాహన సమావేశాలు పెట్టుకోలేకపోయాం. ప్రజలకు అవగాహన కల్పించండి ఓట్లు పోయిన తర్వాత పేదలు చాలా ఇబ్బంది పడతారు. కేవలం ఓట్లు మాత్రమే పోవు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోతాయి. వెంటనే డీడీలు కట్టండి. 2002 ఓటరు లిస్టు, ఇప్పటి ఓటరు లిస్టు తెప్పించుకుని సరి చూసుకోండి.అర్హులైన వారి ఓట్లు పోవడానికి వీల్లేకుండా ప్రతి 10 పోలింగ్ బూత్లకు ఒక ఇన్చార్జిని నియమించండి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ సమన్వయకర్త ఉండాలి. ఈ నెల రోజులూ ఎస్ఐఆర్ కార్యక్రమం మీదనే పనిచేయాలి. మనకు గ్రామాల్లో సర్పంచ్లున్నారు. వారి సహకారంతో ప్రజలకు అవగాహన కల్పించాలి. ఎస్ఐఆర్ గురించి గ్రామాల్లో డప్పు చాటింపులు వేయించాలి..’ అని రేవంత్ సూచించారు. హైదరాబాద్లో ఓకే ఎస్ఐఆర్ కార్యక్రమంపై 33 జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు ఎన్ని సమావేశాలు నిర్వహించాయో ప్రతి జిల్లా వారీగా సీఎం చదివి విన్పించారు. ‘హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశాలు బాగా జరిగాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో జరగడం లేదు. అన్ని జిల్లాల్లో పార్టీ కేడర్, నేతలతో సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి యంత్రాంగానికి దిశానిర్దేశం చేయాలి.పోలింగ్ బూత్ వారీగా ఓట్లను సరిచూసుకోవాలి..’ అని చెప్పారు. జిల్లాల వారీగా ఎస్ఐఆర్ కార్యక్రమంపై పార్టీ ఆదేశాలు అమలయ్యేలా ఇన్చార్జి మంత్రులు బాధ్యతలు తీసుకోవాలి. చొరవ తీసుకోకపోతే ఇన్చార్జి మంత్రులను కూడా మారుస్తాం..’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అందరూ చురుగ్గా పాల్గొనాలి: మీనాక్షి గురువారం నుంచి జరిగే ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చురుగ్గా పాల్గొనాలని మీనాక్షి నటరాజన్ కోరారు. గ్రామీణ పేదలు, నిరక్షరాస్యులకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని, గ్రామాల్లో టెంట్లు వేసుకుని ఓట్లను మ్యాపింగ్ చేయాలని సూచించారు. అర్హులైన వారు తమ ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని పిలుపునిచ్చారు. అందుకే టీఎంసీ ఓడిపోయింది: మహేశ్గౌడ్ మహేశ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బీజేపీ దేశంలో చేస్తున్న రాజకీయాలను చూసిన తర్వాతైనా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జులు ‘సర్’ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశ్చిమబెంగాల్లో కేవలం ఓట్ల చోరీతోనే బీజేపీ గెలిచిందని చెప్పారు. అక్కడ టీఎంసీ అప్రమత్తంగా లేకపోవడంతోనే అధికారం కోల్పోయిందని అన్నారు. -
‘బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని మరోసారి తేలిపోయింది’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కాములు తప్ప స్కీములు లేవని.. కుసుమ్ పథకంలో వెయ్యి కోట్ల స్కామ్ చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. ఇందులో కొంతమంది పెద్దల పేర్లు వినపడుతున్నాయి.. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.‘‘పీసీసీ చీఫ్కు ఎసరు పెడుతున్నారు. ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. రైతుబంధుకు వీళ్ళు ఇచ్చిన నిధుల కంటే ప్రచారానికి ఎక్కువ ఖర్చు పెట్టారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని మరోసారి తేలిపోయింది. వారం రోజులు తిట్టుకుని ఇప్పుడు డ్యూయెట్లు పాడుతున్నారు. బీఆర్ఎస్ రాదనే కాంగ్రెస్ వాళ్లు.. కేటీఆర్ పర్యటనలకు ఎందుకు భయపడుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం పీఏగా పని చేస్తున్నారా...?. తెలంగాణ హైబ్రిడ్ సీఎం మోదీ జట్టు అని ఖాయమైంది. రైతులకు 30 వేల కోట్లు ప్రభుత్వం బాకీ ఉంది. భట్టి శాఖలో జరుగుతున్న వెయ్యి కోట్ల అవినీతిపై విచారణ జరపాలి..జాతీయ బ్యాంకును బ్లాక్ మెయిల్ చేసి భయపెడుతున్నారు. చంద్రబాబు,మోదీ ఆలోచనలతో పుట్టిన క్రాస్ బ్రీడ్ హైబ్రీడ్ సీఎం రాష్ట్రంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తే కేంద్ర మంత్రి ఇతర కేంద్ర మంత్రులను కలిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో కాదు.. దేశంలో ఎక్కడైనా పార్టీ ఆఫీసు పెట్టుకోవచ్చు. తెలంగాణ వచ్చినందుకు 11 రోజులు అన్నం తినలేదని పవన్ కల్యాణ్ చెప్పారు. వాళ్ళ శరీరం నిర్మాణం అయ్యింది తెలంగాణ తిండితో.. బీజేపీ, రేవంత్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ కలిసి అందుతున్న నాటకాలు. అందరూ కలిసి మ్యాచ్ ఫిక్స్ రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. -
మెట్రో సేవల్లో అంతరాయం.. చుక్కలు చూసిన ప్రయాణికులు!
సిలికాన్ సిటీగా ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచిన బెంగళూరులో మంగళవారం సాయంత్రం ఊహించని దృశ్యాలు కనిపించాయి. కార్యాలయాల నుంచి ఇళ్లకు బయల్దేరిన వేలాది మంది ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. కొందరు గంటల తరబడి స్టేషన్లలో చిక్కుకుపోగా.. మరికొందరు ఇంటికి చేరుకునేందుకు లారీలు, ట్రక్కులెక్కాల్సి వచ్చింది. దీనికి కారణం నగర మెట్రో వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపమే.బెంగళూరు నమ్మ మెట్రోలో అత్యంత రద్దీగా ఉండేది పర్పుల్ లైన్. అయితే మంగళవారం సాయంత్రం ఈ లైన్లోని కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ వద్ద ఓ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ బిజీ లైన్లో రైళ్ల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైట్ఫీల్డ్తో పాటు నగరంలోని కీలక ప్రాంతాలను అనుసంధానించే ఈ మార్గంలో సర్వీసులు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.Bengaluru Metro services disrupted on Purple Line after technical fault at Cubbon Park station @OfficialBMRCLhttps://t.co/Q5X1D3FHNn pic.twitter.com/j6PEjSFAo7— ChristinMathewPhilip (@ChristinMP_) June 23, 2026స్టేషన్లలో భారీ రద్దీమెట్రో అధికారులు కొన్ని రైళ్లలోని ప్రయాణికులను మధ్యలోనే దింపేయడంతో ఒక్కసారిగా స్టేషన్ల వద్ద భారీ రద్దీ నెలకొంది. ఆఫీసుల నుంచి తిరిగి వస్తున్న ఉద్యోగులు ప్రత్యామ్నాయ రవాణా కోసం రోడ్లపైకి రావడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కూడా స్తంభించింది. క్యాబ్లు, ఆటోలకు ఒక్కసారిగా భారీ డిమాండ్ పెరగడంతో ప్రయాణికులు మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో విచిత్రమైన పరిస్థితులు కనిపించాయి.India's Silicon Valley or India's Biggest Infrastructure Failure? IT Employees Forced to Hitch Rides on Trucks After Yet Another Metro BreakdownBengaluru proudly calls itself India's Silicon Valley, a global technology hub that powers innovation, startups, and multinational… pic.twitter.com/qAGDEQfyNj— Karnataka Portfolio (@karnatakaportf) June 24, 2026లారీలు, ట్రక్కులెక్కిన టెక్కీలుఈ గందరగోళంలో ఇంటికి వెళ్లేందుకు కొందరు ఉద్యోగులు లారీలు, ట్రక్కులు ఎక్కి ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సాధారణంగా ఐటీ హబ్గా గుర్తింపు పొందిన నగరంలో ఇలాంటి దృశ్యాలు కనిపించడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.థర్డ్ వరల్డ్ గవర్నెన్స్..ఈ ఘటనపై స్పందించిన బెంగళూరు దక్షిణ లోక్సభ సభ్యుడు తేజస్వి సూర్య Tejasvi Surya.. కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. “ఫస్ట్ వరల్డ్ టెక్ టాలెంట్.. థర్డ్ వరల్డ్ గవర్నెన్స్.. ఇదే బెంగళూరి కథ” అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. మెట్రో సేవల్లో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని, మెట్రో ఆగిపోయిన ప్రతిసారీ నగరం మొత్తం గందరగోళంలో పడిపోతోందని ఆయన విమర్శించారు.First-world tech talent. Third-world governance.That is the story of Bengaluru.Metro disruptions have become alarmingly frequent. And every time the Metro fails, the entire city descends into chaos. Cabs disappear. Autos refuse rides. Citizens are stranded.Yesterday,… pic.twitter.com/0URP0FbtFK— Tejasvi Surya (@Tejasvi_Surya) June 24, 2026రాత్రంతా మరమ్మతులులోపాన్ని గుర్తించిన మెట్రో సిబ్బంది వెంటనే మరమ్మతు పనులు ప్రారంభించారు. కొంతసేపటి తర్వాత ఎంజీ రోడ్ నుంచి వైట్ఫీల్డ్ మధ్య పరిమిత సేవలను పునరుద్ధరించినప్పటికీ.. రద్దీ మాత్రం తగ్గలేదు. రాత్రంతా కొనసాగిన మరమ్మతుల తర్వాత.. బుధవారం ఉదయం 5 గంటల నాటికి సమస్యను పూర్తిగా పరిష్కరించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ప్రస్తుతం పర్పుల్ లైన్లో సాధారణ సేవలు కొనసాగుతున్నాయి. -
ఇంత అలసత్వమా?.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అల్టిమేటం!
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్లో అలసత్వం కనిపిస్తోందా? క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదా? ఈ ప్రశ్నలకు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలే బలం చేకూరుస్తున్నాయి. ఎస్ఐఆర్ అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకోవాలని స్పష్టం చేసిన ఆయన.. పార్టీ ఆదేశాలను పట్టించుకోని నేతలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో బుధవారం నిర్వహించిన టీపీసీసీ జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ సాధారణ అంశం కాదని, పేద ప్రజల హక్కులతో ముడిపడి ఉన్న కీలక ప్రక్రియ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో కొందరి తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఆయన.. పని చేయని వారి పేర్లు చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దని, అవసరమైతే వారి స్థానంలో కొత్త ఇన్ఛార్జ్లను నియమిస్తామని హెచ్చరించే దాకా వెళ్లారు.కొంతమంది నాయకులు ఎస్ఐఆర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పీసీసీ మీటింగ్లో సీఎం రేవంత్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాల వారీగా అవగాహన కార్యక్రమాలపై తన వద్ద పూర్తి నివేదిక ఉందని, ఎవరు పని చేస్తున్నారు.. ఎవరు చేయడం లేదన్న విషయం తనకు తెలుసని చెప్పారు. పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్పై కాంగ్రెస్ తరఫున మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో సర్పంచ్లను కూడా భాగస్వామ్యం చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.ఎస్ఐఆర్ ప్రక్రియలో పొరపాట్లు జరిగితే పేదల ఓటు హక్కు దెబ్బతినే ప్రమాదం ఉందని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఓటు తొలగిపోతే భవిష్యత్తులో ఆధార్, రేషన్ కార్డులు వంటి సంక్షేమ ప్రయోజనాలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి అన్యాయం జరగకుండా పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.పార్టీ ఆదేశాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసిన సీఎం రేవంత్.. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని క్షమించబోమని హెచ్చరించారు. మరో పది రోజుల సమయం ఇస్తున్నామని, ఈ వ్యవధిలో పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలని అన్నారు. లేకపోతే చర్యలు తప్పవని సంకేతాలు ఇచ్చారు. -
ట్రాన్స్ఫర్ నుంచి టెండర్ దాకా స్కామ్లే
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ట్రాన్స్ఫర్లు మొదలు టెండర్ల వరకు అన్నింటా స్కాములే జరుగు తున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం కారణంగా దాదాపు 30 ఏళ్ల తర్వా త సింగరేణి నష్టాలబాటలో నడుస్తోందని చెప్పారు. సింగరేణిలో కాంగ్రెస్ హయాంలో అన్ని విషయాల్లో స్కామ్లు జరుగుతున్నా యని, కమీషన్ల కోసం ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని దుయ్య బట్టారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హరీశ్రావు పలు అంశాలపై మాట్లాడారు.తప్పు చేస్తే చట్టపరమైన చర్యలుసింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల లేని బొగ్గు నిల్వలు ఉన్నట్లు చూపుతూ ఆ మేరకు సెస్, ట్యాక్సులు, సీఎస్సార్, డీఎంఎఫ్టీ తదితర పన్నులు కట్టారని.. కానీ క్షేత్రస్థాయిలో అసలు బొగ్గును తవ్వి తీయలేదన్నారు. బొగ్గు నిల్వలు చూపించాలని తాము గనుల దగ్గరికి వెళ్తే అనుమతి ఇవ్వట్లేదని.. అదే సమయంలో పనికిరాని షెల్ బొగ్గును మట్టికుప్పలపై పోస్తూ అదే అసలైన బొగ్గుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.తాము అధికారంలోకి వచ్చాక ఈ అంశంపై విచారణ చేపట్టి తప్పుడు వివరాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హరీశ్రావు హెచ్చరించారు. రెండేళ్ల క్రితమే ఉత్పత్తి నిలిచిపోయిన అడ్రియాల గనిలో 1.69 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని పేర్కొనడం కాంగ్రెస్ సర్కార్ అవినీతి పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.సీఎం బావమరిదికే లాభంఓపెన్ కాస్ట్ గనుల్లో ఓవర్ బర్డెన్ తొలగింపు పనుల్లో కమీషన్లు దండుకోవడం కోసమే సైట్ విజిట్ విధానం అమల్లోకి తెచ్చారని హరీశ్రావు ఆరోపించారు. సైట్ విజిట్ తెచ్చిన తర్వాత ప్రతిసారీ ఎక్సెస్కే టెండర్లు వెళ్తున్నాయని.. ఇలా ఎక్స్స్ టెండర్ దక్కించుకున్న తొలి కంపెనీ శోధా కన్స్ట్రక్షన్స్ ఓనర్ సీఎం రేవంత్రెడ్డి బావమరిది సృజన్రెడ్డి అని హరీశ్రావు పేర్కొన్నారు. సైట్ విజిట్ నిబంధన అమల్లోకి వచ్చాక ఎక్సెస్ టెండర్ల వల్ల సింగరేణిపై రూ. 1,000 కోట్లకుపైగా అదనపు భారం పడిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి వివిధ బ్యాంకుల్లో సింగరేణికి రూ.3,200 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండేవని.. ప్రస్తుతం రూ. 4,300 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ)కి సింగరేణి వెళ్లిందని వివరించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ, వనమా వెంకటేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు, రవిచంద్ర, ఎమ్మెల్సీలు టి.రవీందర్రావు, తాతా మధు తదితరులు పాల్గొన్నారు. -
NEET ఎగ్జామ్ మిస్.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?
సాక్షి,బెంగళూరు: కర్ణాటకలో నీట్ పరీక్షపై రాజకీయ దుమారం రేగింది. బెంగళూరులో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ కారణంగానే ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మీడియా ఎదుట వాపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఆదివారం జరిగిన ఈ సంఘటన విద్యార్థులు, తల్లిదండ్రులు, రాజకీయ పార్టీల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. నిన్న దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు నీట్ యూజీ రీ-టెస్ట్ రాసినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే బెంగళూరులో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి, పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. విద్యార్థులు 1.30 గంటలకు రిపోర్ట్ చేయాలని విద్యాశాఖ సూచించింది. కానీ ట్రాఫిక్ పెరగడంతో తల్లిదండ్రులు బైక్లను ఫుట్పాత్లపై నడిపే పరిస్థితి వచ్చింది. చివరికి ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా చేరుకోవడంతో పరీక్షకు అనుమతి ఇవ్వలేదు. వారు గేటు ఎక్కి లోపలికి వెళ్లాలని ప్రయత్నించినా, నిర్వాహకులు గేట్లను మూసివేశారు.అయితే తల్లిదండ్రులు కాంగ్రెస్ ర్యాలీని తప్పుబట్టారు. 7 కిలోమీటర్ల దూరం సాధారణంగా 20 నిమిషాల్లో పూర్తవుతుంది. కానీ ర్యాలీ కారణంగా 35 నిమిషాలకుపైగా పట్టింది. పిల్లల భవిష్యత్తు కోసం ర్యాలీలు నగర బయట జరగాలి అని ఓ తండ్రి అసహంన వ్యక్తం చేశారు. మరొకరు రాహుల్ గాంధీ విద్యార్థుల కోసం కోటాకు వెళ్లారు. కానీ ఆయన పార్టీ ర్యాలీ వల్ల నలుగురు విద్యార్థులు పరీక్ష మిస్సయ్యారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించారు.ఈ ఘటనపై బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ‘కాంగ్రెస్ అధికార దాహం కోసం ఎంత వరకు దిగజారుతుంది?’ అంటూ వీడియోను షేర్ చేశారు. దీనికి కాంగ్రెస్ మంత్రి ప్రియాంక్ ఖర్గే ‘కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదు. గత దశాబ్దంలో 89 పేపర్ లీకులు జరిగాయి’ అని ప్రతిస్పందించారు.కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్ ‘కొంతమంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విన్నాను. వారికి కలిగిన అసౌకర్యంపై విచారం వ్యక్తం చేస్తున్నాను. కానీ బీజేపీ పాలనలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికి వారు క్షమాపణ చెప్పారా?’అని ప్రశ్నించారు. జేడీఎస్ అధినేత హెచ్డీ కుమారస్వామి ఈ ఘటనను ప్రభుత్వానికి అవమానకరమైన పరిణామంగా అభివర్ణించారు.Bengaluru, Karnataka: A parent of one of the students says, "Rahul Gandhi, D.K. Shivakumar, and even the Commissioner of Police, Bengaluru, do not seem to be concerned. Rahul Gandhi went to Kota for the cause of students, right? But because of his party's function today, four… https://t.co/1ixZBqPcRc pic.twitter.com/No3W5edKEb— IANS (@ians_india) June 21, 2026 -
కాంగ్రెస్లో మళ్లీ ‘థరూర్’ మంటలు
న్యూఢిల్లీ: ఎంపీ శశి థరూర్ మరోసారి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారానికి కారణమయ్యారు. జమ్ముకశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయంటూ ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్, సొంత పార్టీ నేతల నుంచే గట్టి విమర్శలకు దారితీసింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో జరిగిన భేటీపై థరూర్ సానుకూల వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయంగా వేడి పుట్టిస్తోంది.గవర్నర్తో భేటీ.. థరూర్ సానుకూల వ్యాఖ్యలుశ్రీనగర్ పర్యటనలో ఉన్న తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కలిశారు. ఈ భేటీ అనంతరం ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ‘ఎల్జీతో అద్భుతమైన సమావేశం జరిగింది. కశ్మీర్లో పరిస్థితులు, సాధారణ స్థితి వైపు సాగుతున్న ప్రోత్సాహకరమైన పురోగతిపై చర్చించాం’ అని పేర్కొన్నారు. స్థానిక రచయితల సంఘం, మహిళా సంఘాల ప్రతినిధులతో ఎల్జీ మాట్లాడుతుండటం సానుకూల పరిణామమని, ఇంకా ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ, ఈ భేటీ తనకు ఎంతో ఆశాజనకంగా అనిపించిందని థరూర్ రాసుకొచ్చారు. In Srinagar! Had the honour of an excellent meeting with Lieutenant-Governor Shri @manojsinha_ at Lok Bhavan today. We discussed the situation in the state and the encouraging progress towards normalcy. When I arrived he was chatting to the President of the Kashmiri Writers’… pic.twitter.com/hm1lz3qDGF— Shashi Tharoor (@ShashiTharoor) June 21, 2026సొంత పార్టీ నుంచే ఘాటు కౌంటర్థరూర్ వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రవీందర్ శర్మ తీవ్రంగా స్పందించారు. గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోవడానికి థరూర్ స్థానిక ప్రజలను కలిసి ఉంటే బాగుండేదని ఎక్స్లో కౌంటర్ ఇచ్చారు. ఏడేళ్ల క్రితం తాము కోల్పోయిన రాష్ట్ర హోదా కోసం పోరాడుతున్న సొంత పార్టీ నాయకులను కలవడానికి కనీసం సమయం కేటాయించకపోవడాన్ని శర్మ తప్పుబట్టారు.ప్రధాని మోదీపై వ్యాఖ్యల వివాదంశశి థరూర్ ఇలా సొంత పార్టీలోనే విమర్శలు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. అమెరికా నౌకాదళ దిగ్బంధం మధ్య ముగ్గురు భారతీయ నావికుల మరణంపై, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ జరిపిన చర్చలను థరూర్ సమర్థించడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. అయితే, దీనిపై థరూర్ స్పందిస్తూ.. తానేమీ రాజకీయంగా ప్రశంసించలేదని, భారతీయ పౌరుల భద్రత గురించే మాట్లాడానని, దీన్ని అనవసరంగా వివాదం చేస్తున్నారని అన్నారు. -
‘యూజ్లెస్ ఫెలోస్.. మీ సంగతి తేలుస్తా’
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహనం కోల్పోయారు. కర్ణాటకలో నిర్వహించిన కాంగ్రెస్ ‘సంకల్ప సమావేష’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తుండగా.. కొందరు కార్యకర్తలు అత్యుత్సహం ప్రదర్శించారు. అయితే.. వద్దని వారిస్తున్న వాళ్లు అదే పని చేయడంతో ఖర్గేకు కోపమొచ్చింది. యూజ్లెస్ ఫెలోస్.. అంటూ గట్టిగానే మందలించారాయన. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘సంకల్ప సమావేష’ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తుండగా.. సభలోని కొందరు కార్యకర్తలు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు మద్దతుగా ‘డీకే.. డీకే’ అంటూ నినాదాలు చేశారు.దీంతో అసహనానికి గురైన ఖర్గే.. “ఇక్కడ మీరు నినాదాలు చేస్తే దేశమంతా ప్రభావితమవుతుందా? ఇది ఒక వ్యక్తి కార్యక్రమం కాదు.. పార్టీ కార్యక్రమం. మీరంతా పనికిమాలిన వాళ్లు(యూజ్లెస్ ఫెలోస్). ఇక్కడ వ్యక్తుల ఆరాధనకు స్థానం లేదు. మనందరినీ ఒక్కచోటికి తీసుకొచ్చేది పార్టీ మాత్రమే. అది గుర్తించండి” అంటూ మండిపడ్డారు.తనకు 58 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని పేర్కొన్న ఖర్గే.. “ఎంతో మంది నాయకులు ఇక్కడికి వచ్చారు. వారి కంటే పార్టీ వారికి ఎక్కువ ఇచ్చింది. ఇక్కడ నినాదాలు చేసిన వారందరి వీడియో ఫుటేజ్ను పరిశీలిస్తాను. ఆ తర్వాత క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.కార్యకర్తలు అలా నినాదాలు చేస్తున్న సమయంలో.. వేదికపైనే ఉన్న డీకే శివకుమార్ తన కుర్చీలోంచి లేచి ఆపమంటూ సైగలు చేశారు. అయినా కూడా వాళ్లు ఆగలేదు. ఆ సమయంలో వేదికపై కూర్చున్న మాజీ సీఎం సిద్ధరామయ్య డీకేను చూస్తూ ఉండిపోయారు.#WATCH | Bengaluru, Karnataka: Congress President Mallikarjun Kharge loses his cool at party workers during the Sankalpa Samavesha programme after the workers raised “DK-DK” slogans“Will the entire country be affected if you shout here? This is not an individual’s programme, it… pic.twitter.com/jmO0rLMftK— ANI (@ANI) June 21, 2026ఖర్గే వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్లో వ్యక్తి కంటే పార్టీ ముఖ్యమనే సందేశాన్ని ఇవ్వడానికే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సభలో డీకే శివకుమార్ అనుచరుల నినాదాలపై ఖర్గే బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడం కర్ణాటక కాంగ్రెస్లోని అంతర్గత రాజకీయాలపై మరోసారి చర్చకు దారితీసింది. కేడర్ను ఉద్దేశించి ఖర్గే అంతలా మాట్లాడిన అవసరం లేదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. -
‘రేవంత్ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’
సాక్షి, సూర్యాపేట: దేశాన్ని కుదిపేసిన పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్ కేసులో ఇప్పటివరకు పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయలేదని.. బండి సంజయ్, సంగప్పలను కనీసం విచారించకుండానే.. రాత్రికి రాత్రే నిందితునికి బెయిల్ మంజూరు చేయడంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.పోక్సో చట్టం అత్యంత బలమైన చట్టమని.. చట్టంలో 2020 లో వచ్చిన మార్పుల ప్రకారం సెక్షన్ 4లోని క్లాస్ 2(ఎఫ్) ప్రకారం, బెయిల్ ఇచ్చే ముందు, బాధిత కుటుంబానికి సమాచారం ఇవ్వాలని,బాధితురాలి అభిప్రాయాలను సేకరించాలని కానీ, సైబరాబాద్ పోలీసులు మరియు ప్రభుత్వ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు బాధితురాలికి న్యాయం చేయడంలో విఫలమయ్యారన్నారు.తెలంగాణలో మహిళలకు రక్షణ లేదన్నారు. కేంద్ర మంత్రి కొడుకు ఏడాది పాటు బాలికపై అత్యాచారానికి పాల్పడితే.. కేసు పెట్టిన మొదటి రోజే అరెస్ట్ చేయకుండా.. స్టేషన్ బెయిల్ ఇద్దామని చూశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పోరాటం తర్వాత 9 రోజులు దాచిపెట్టి తర్వాత లొంగుబాటు చూపెట్టారని గుర్తుచేశారు.బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాత్రం బాల్క సుమన్, అశోక్ అనే వ్యక్తిని మాత్రం అన్యాయంగా నెలల తరబడి జైలులోనే ఉంచుతున్నారని మండిపడ్డారు. బాలికకు న్యాయం జరిగేవరకు చివరివరకు అండగా ఉంటామన్నారు. బీఆర్ఎస్ పోరాటం వల్లనే నిందితుడు అరెస్టయ్యాడని గుర్తు చేశారు. తెలంగాణ బడేభాయ్ చోటే భాయ్ల బంధం ప్రజలకు అర్థమైందన్నారు. పోక్సో కేసులో అరెస్టయి జైలులో ఉన్న నిందితుడు బండి భగీరథ్కు రాత్రికి రాత్రే బెయిల్ మంజూరు చేయించి.. ఇంటికి పంపించేందుకు కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.


