breaking news
Congress Party
-
ఆయన ఆదేశిస్తే రాజీనామాకు రెడీ: దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు దానం తెలిపారు. తనకు ఎన్నికల్లో పోటీ చేయడం కొత్తేమీ కాదంటూ వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు, అనర్హతల విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందిస్తూ.. రాజీనామా ప్రస్తావన ఇంకా రాలేదు. ముఖ్యమంత్రి ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఎన్నికలు కొత్త కాదు. ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం నా రక్తంలోనే ఉంది. 11 సార్లు ఎన్నికల్లో కొట్లాడిన చరిత్ర నాకు ఉంది. అనర్హత కేసు విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి మరో పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై పెద్ద చర్చే నడుస్తోంది. బీఆర్ఎస్లో గెలిచి అధికార పార్టీలోకి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా?.. లేదా ఎమ్మెల్యే సభ్యత్వానికి వారే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తారా?.. రాజీనామా చేస్తే ఉప ఎన్నికలో వీరే అభ్యర్థులుగా ఉంటారు. మరి అనర్హత వేటు పడితే కూడా వీరికి పోటీ చేసే అవకాశం ఉంటుందా అనే చర్చ మొదలైంది.ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి సుప్రీం కోర్టు సీరియస్గా రియాక్ట్ అయింది. సుప్రీం గడువు అక్టోబర్ 30 తేదీకే ముగియడంతో స్పీకర్ కార్యాలయం మరింత సమయం కావాలని కోర్టును ఆశ్రయించింది. దీంతో, సుప్రీంకోర్టు మరో 4 వారాల సమయం ఇస్తూనే స్పీకర్ కార్యాలయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం హెచ్చరించింది. అయితే, పార్టీ ఫిరాయించిన అంశంపై అనర్హత వేటు పడితే.. వచ్చే ఉపఎన్నికలో పోటీ చేయడానికి అవకాశం ఉండదు .. అదే అనర్హత వేటు పడకముందే రాజీనామా చేస్తే.. దాన్ని స్పీకర్ ఆమోదిస్తే వచ్చే ఉప ఎన్నికలో పోటీ చేయడానికి అర్హులు అవుతారు. -
పరిశ్రమల భూముల్లో కమర్షియల్ కాంప్లెక్స్లు, విల్లాలా?
కుత్బుల్లాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీ పేరుతో రూ.5 లక్షల కోట్ల భారీ భూ కుంభకోణానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ పారిశ్రామికవాడల్లోని రూ. 5 లక్షల కోట్ల విలువైన భూములను దోచుకునేందుకు ‘హిల్ట్ పి’ తెచ్చిందంటూ బీఆర్ఎస్ పోరుబాట చేపట్టింది. ఇందులోభాగంగా కేటీఆర్ గురువారం మేడ్చల్ జిల్లా జీడిమెట్ల, షాపూర్నగర్లో పర్యటించారు. పారిశ్రామికవాడలోని హమాలీల అడ్డా వద్ద కార్మికులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, సత్యవతి రాథోడ్తో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఒకప్పుడు ప్రభుత్వాలు పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. ‘పరిశ్రమలు వద్దంటూ అపార్ట్మెంట్లు, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకోవాలని పారిశ్రామిక భూములను ఇస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లు అవి ప్రైవేట్ వ్యక్తుల భూములు కావు. ప్రైవేట్ వ్యక్తులకు ప్రజల కోసం ప్రభుత్వం ఇచ్చిన భూములు. పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించాలన్న నిబంధనలతోనే ఆ భూములను ఇచ్చారు. మార్కెట్లో గజం ధర రూ.లక్షన్నర పలుకుతుంటే, ప్రభుత్వం కేవలం రూ.4 వేలకే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తోంది. హైదరాబాద్లో పేదల ఇళ్లకు, పాఠశాలలకు, ఆసుపత్రులకు, చివరికి శ్మశానవాటికలకు కూడా స్థలం లేదు.. కానీ, ప్రైవేట్ వ్యక్తులకు 9,300 ఎకరాల భూమిని ప్రభుత్వం అప్పనంగా ఇస్తామంటోంది’ అని చెప్పారు. ఈ 9,300 ఎకరాలను వెనక్కి తీసుకొని, అక్కడ కాంగ్రెస్ చెబుతున్న ఇందిరమ్మ ఇళ్లు, యంగ్ ఇండియా స్కూల్స్, ఆసుపత్రులు కట్టాలని హితవు పలికారు.కాంగ్రెస్ కుంభకోణాన్ని వివరించేందుకే...కాంగ్రెస్ కుంభకోణం వెనుక ఉన్న అసలు నిజాలు నిగ్గుతేల్చాలన్న ఉద్దేశంతోనే పారిశ్రామిక వాడల్లో పర్యటిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. హిల్ట్ పాలసీ స్కాంపై త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని, ఈ పాలసీని వెనక్కి తీసుకొనేదాకా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. తమ ప్రభుత్వం రాగానే ఈ పాలసీని రద్దు చేస్తామని, అవసరమైతే ఇందుకోసం ఒక చట్టాన్ని తెస్తామన్నారు. ఇంతటి భారీ దోపిడీని చూసి తట్టుకోలేక ఓ తెలంగాణ బిడ్డ తమకు సమాచారం ఇచ్చారని, దీనిపై తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, సమాచారం లీకైంది అంటూ ప్రభుత్వం బాధపడుతోందని పేర్కొన్నారు. ఒకవైపు రూ.170 కోట్లకు ఎకరం చొప్పున భూములు విక్రయించామంటూ రోజు వార్తలు రాయించుకుంటున్న సర్కార్, మరోవైపు కేవలం రూ.కోటికి ఎకరం చొప్పున జీడిమెట్లలో భూమిని ఎలా అమ్ముతుందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని దుయ్యబట్టారు. అనంతరం జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని పలు పరిశ్రమలను సందర్శించి కార్మిక సమస్యలపై కార్మికులతో, పారిశ్రామిక వేత్తలతో చర్చించారు. -
7న కాంగ్రెస్ రెండేళ్ల వైఫల్యాలపై మహాధర్నా
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 7న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇందిరాపార్కు వద్ద.. కాంగ్రెస్ రెండేళ్ల పాల నా వైఫల్యాలపై ‘గల్లంతైన గ్యారంటీలు – నెరవేరని వాగ్దానాలు, ప్రజా వంచనకు రెండేళ్లు’ నినాదంతో మహాధర్నా నిర్వహిస్తున్నట్టు బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు వెల్ల డించారు. హిల్ట్ పాలసీ, జీహెచ్ఎంసీలో పురపాలికల విలీనం, మొత్తంగా పాలనా వైఫ ల్యాలను ఎండగట్టేలా దీనిని చేపడుతున్నా మన్నారు.ఈ ధర్నాలో భాగంగా.. ప్రభు త్వానికి వ్యతిరేకంగా చార్జిషీట్ విడుదల చేస్తా మని తెలిపారు. ఆయన గురువారం బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నెరవేర్చని హామీల చిట్టాను ప్రజల ముందు పెడతామన్నారు. పంచాయతీ ఎన్నికల కార ణంగా... ఈ ధర్నా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం లేదని, గ్రేటర్ పరిధిలోని 8 జిల్లాల్లోనే దీనిని నిర్వహిస్తున్నామన్నారు. కాగా, రాంచందర్రావును సినీనటుడు శుభలేఖ సుధాకర్ కలిసి ఎస్పీ బాలసుబ్ర హ్మణ్యం విగ్రహావి ష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించారు. -
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు
సాక్షి, ఆదిలాబాద్: సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా భావించి నాలుగు కోట్ల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. వీటిని ముందుకు తీసుకెళ్లాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడవాలని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. ముగిశాక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పేదలకు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఆదిలాబాద్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేశ్ బీజేపీ అయినప్పటికీ వారిని కలుపుకొని అభివృద్ధి పథం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పు డు ప్రతిపక్ష నాయకులకు సీఎం సభలో పాల్గొనే, మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, సెక్రటేరియెట్లో వందలాది మంది పోలీసులను పెట్టి నన్ను, సీతక్కను నిర్బంధించారని గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు.. రానివ్వబోమని సీఎం అన్నారు. ప్రజాపాలన– ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలి ‘ఈ రెండేళ్లలో నేను ఏ ఒక్కరోజు సెలవు తీసుకోలేదు. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రిగా చిన్న వయస్సులోనే నాకు అవకాశం వచ్చింది. దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చాడు. ప్రస్తుతం ప్రజల కోసం, గౌరవం పొందడం కోసం నిరంతరం పనిచేస్తున్నా. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండేళ్ల పాలన సాగించా. తెలంగాణ ఆడబిడ్డలను గత ముఖ్యమంత్రి దివాలా తీయించాడు. మేము ఉచిత ప్రయాణం కల్పించాం. వెయ్యి బస్సులకు యజమానులను చేశాం. స్వయం సహాయక బృందాల (ఎస్హెచ్జీ) మహిళలు పెట్రోల్ బంక్లు నడుపుతున్నారు. మొత్తం కోటి మంది ఎస్హెచ్జీ మహిళలకు ఇందిరమ్మ చీరలు పంచుతాం. ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే పాడిపంటలు సమృద్ధిగా పండుతాయి..అందుకే రాష్ట్రంలో వర్షాలు కూడా సమృద్ధిగా పడ్డాయి..’అని ముఖ్యమంత్రి అన్నారు. రూ.లక్ష కోట్లు గోదావరిలో కొట్టుకుపోయాయి.. ‘ప్రాణహిత–చేవెళ్లతో 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడం కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో రూ.38 వేల కోట్లతో శంకుస్థాపన చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక పెద్దాయన దయ్యంలా మారి ప్రాజెక్టును కాలగర్భంలో కలిపాడు. పేరు, ఊరు, అంచనాలు మార్చాడు. కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయ్యింది. ఆయన ఇంట్లో కనక వర్షం కురిసిందే తప్ప ఆదిలాబాద్కు నీళ్లు రాలేదు. తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్లకు అనుమతి ఇవ్వడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నా.. గత ప్రభుత్వం తీరుతో ప్రాజెక్టు కిందికి తరలిపోయింది. రూ.లక్ష కోట్లు గోదావరిలో కొట్టుకుపోయాయి. సొమ్ము రావడంతో సొంత కుటుంబసభ్యులు కత్తులతో పొడుచుకుంటున్నారు. బిడ్డ, కొడుకు, అల్లుడు తలో దిక్కు. అసలు ఆయన ఎక్కడ పడుకుంటున్నాడో అందరికీ తెలుసు..’అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు శంకుస్థాపనకు నేనే వస్తా.. ‘మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులు తమ పరపతితో ఆ ప్రభుత్వాన్ని ఒప్పించాలి. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు కట్టడానికి టెండర్లు పిలిచాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పొలాలకు నీళ్లు ఇస్తాం. ప్రాజెక్టు శంకుస్థాపనకు నేనే వస్తా. ఆదిలాబాద్లో మూతపడిన సీసీఐ ఫ్యాక్టరీని ప్రైవేట్ పెట్టుబడిదారులను తీసుకొచ్చి తెరిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదే. ఇక్కడ ఎయిర్పోర్టు కట్టాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. ఏడాదిలో ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు తీసుకొస్తా. ఎయిర్ బస్సును కూడా తీసుకొస్తా. కొరటా–చనాఖా ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకోవాలని గతంలో కోరారు. ఇక్కడ నూటికి నూరు శాతం అభివృద్ధి పనులు చేపడతాం..’అని సీఎం చెప్పారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి.. ‘తెలంగాణ యువకులు ఐఏఎస్, ఐపీఎస్లు కావాలన్నదే నా కోరిక. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 61 వేల ఉద్యోగాలు ఇచ్చాం. త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. గత ప్రభుత్వ హయాంలో నియామకాలు లేవు. కానీ వాళ్ల ఇంట్లో మాత్రం పదవులు వచ్చాయి. పంచాయతీ ఎన్నికల్లో అడ్డగోలుగా ఖర్చు పెట్టొద్దు.. వీలైతే ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకోవాలి. గ్లోబల్ సమ్మిట్కు కన్నతల్లి లాంటి సోనియమ్మ ఆశీర్వాదం తీసుకున్నాం. ఖర్గే, రాహుల్, ప్రియాంకలను ఆహా్వనించాం. ప్రధాని, కేంద్ర మంత్రులను కూడా రమ్మని కోరాం..’రేవంత్ తెలిపారు. రూ.260 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలోనే రూ.260 కోట్లతో తలపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సీఎం లాంఛనంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యేలు వినోద్, వెడ్మ బొజ్జు, పాయల్ శంకర్, మాజీ మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. ‘సాక్షి’చొరవకు అభినందనలు ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు, యూనివర్సిటీ ఏర్పాటు డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. వీటిపై ఇటీవల ఆదిలాబాద్లో ‘సాక్షి’ఆధ్వర్యంలో చర్చా వేదికలు నిర్వహించడం జరిగింది. వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘సాక్షి’చొరవను పలువురు అభినందిస్తున్నారు. సీఎంతో పాయల్ ముచ్చట కైలాస్నగర్: ఆదిలాబాద్ సభలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీఎంతో సుదీర్ఘంగా చర్చించడం సభకు హాజరైన ప్రజలందరి దృష్టినీ ఆకర్షించింది. సీఎం ప్రసంగించేంత వరకు వారిరువురు మాట్లాడుకుంటూ కన్పించడం చర్చనీయాంశమయ్యింది. మంత్రులు, అధికార పార్టీ నేతలు ఆసీనులైన వేదికపై సీఎం పాయల్ శంకర్తోనే ఎక్కువసేపు మాట్లాడడంతో అంతగా ఏమి మాట్లాడి ఉంటారనే ఆసక్తి నెలకొంది. -
బీజేపీకి.. ‘ఈశాన్యం’ పోటు..!
2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచి రాష్ట్రాలపై బీజేపీ జైత్రయాత్ర అప్రతిహతంగా సాగుతూ వస్తోంది. ఒడిశా లాంటి రాష్ట్రాలను సైతం కైవసం చేసుకున్న కాషాయదళం.. పశ్చిమ బెంగాల్ మాదే అంటోంది..! అయితే.. ఈశాన్యంలో వాస్తు దోషమో.. వ్యూహాత్మక తప్పిదాలో తెలియదు కానీ, నార్త్-ఈస్ట్ రాష్ట్రాల్లో విపక్షాలు బలం పుంజుకుంటున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అసలు కాంగ్రెస్ ఉనికి అనేది లేకుండా బీజేపీ చేసింది. కానీ, ఇప్పుడు పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అసలు.. ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది? రాబోయే ఎన్నికల కోసం ఇప్పుడే రాజకీయ వేడి రాజుకుందా? ఎవరిది పైచేయిగా ఉంది? ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది? ఈ వివరాలు తెలియాలంటే.. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి.ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం అత్యంత కీలకమైన రాష్ట్రం. 2016లో అనూహ్యంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీని.. రెండో సారి కూడా విజయలక్ష్మి వరించింది. నిజానికి బీజేపీ ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేయడం 2016లోనే మొదటిసారి. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తనదైన శైలిలో పాలనను కొనసాగిస్తూనే.. బహుభార్యత్వ నిరోధక చట్టం.. అక్రమ చొరబాటు దారుల నిరోధం వంటి అంశాలతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం అమలు సమయంలో విద్యార్థి సంఘాల నిరసనను సమర్థంగా ఎదుర్కొన్నారు. అయితే.. ఇప్పుడు మాత్రం జెన్-జీ ఉద్యమాలు బీజేపీని గద్దెదింపే స్థాయిలో ఉధృతంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రముఖ గాయకుడు జుబిన్ గర్గ్ మరణంతో అభిమానుల ప్రవాహం ఉప్పొంగి కనిపించగా.. షెడ్యూల్డ్ తెగల జాబితాలో ఆరు ఓబీసీ వర్గాలను చేర్చాలంటూ హిమంత సర్కారు చేసిన సిఫార్సు ఇప్పుడు ఎస్టీల్లో తీవ్ర అసంతృప్తి జ్వాలలకు కారణమవుతోంది. ఇప్పటికే శక్తిమంతమైన బోడో తెగలోని విద్యార్థి నాయకులు ఈ నిర్ణయాన్ని బహిరంగంగా ఖండించారు. అదే సమయంలో.. గౌరవ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్.. ఈ అంశాలను ఎజెండాగా మలచుకుని, ప్రజావ్యతిరేక ఉద్యమాలకు సిద్ధమవుతోంది. హిమంత సర్కారు ఎస్టీ జాబితా అనే తేనెతుట్టెను కదలించిందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటి వరకు ఓబీసీలుగా ఉన్న థాయ్ అహోమ్, టీ తెగలు, కుచ్ రాజ్ బంశీ వంటి వర్గాలను ఎస్టీల్లో చేర్చాలని అస్సాం సర్కారు నిర్ణయించింది. రాష్ట్ర జనాభాలో వీరి వాటా 27శాతం. ఈ నిర్ణయంపై అస్సాంలో రెండు నెలలుగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ వర్గాలను ఎస్టీల్లో చేర్చడంతో తనకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఈ వర్గాలు గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నాయి. అదేసమయంలో ఈ జాబితాపై ఎస్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అస్సాంలో ఎస్టీల జనాభా 13శాతం. వీరిలో బోడోలాండ్, కర్బీ అంగ్లాంగ్, దిమహాసావోలోని స్వయంప్రతిపత్తి ప్రాంతాల్లో ఉంటున్నారు. నిజానికి బీజేపీ అస్సాంలో పాగా వేయడానికి దోహదపడ్డ ప్రాంతాలు ఇవే. ఇప్పుడు ఈ తెగల వారు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో.. ప్రముఖ గాయకుడు జుబిన్ గర్గ్ మరణం కూడా హిమంత సర్కారును చిక్కుల్లో పడేసింది. ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు జుబిన్ది హత్యేనని ముఖ్యమంత్రి ప్రకటించాల్సి వచ్చింది. ఈ పరిణామాలను కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలచుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే 8 పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడడానికి కాంగ్రెస్ సిద్ధమైంది. అయితే.. బెంగాలీ మాట్లాడే ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏఐయూడీఎఫ్ ఈ కూటమికి దూరంగా ఉండాలని నిర్ణయించింది. అదే జరిగితే.. ఇండియా కూటమికి ఓట్ల చీలిక పోటు తప్పదని విశ్లేషకులు అంటున్నారు.అసోంతో పాటు.. ఈశాన్యంలో మరో కీలక రాష్ట్రం మణిపూర్. కుకీలు-మైటీలకు మధ్య వివాదాలతో జరిగిన అల్లర్లు మణిపూర్ను అట్టుడికించాయి. ఫలితంగా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని తప్పించాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్తో బీజేపీ అధిష్ఠానం రాజీనామా చేయించింది. ఫలితంగా రాష్ట్రపతి పాలన మొదలైంది. ఇప్పుడు మణిపూర్లో రాష్ట్రపతి పాలనను స్వయానా బీజేపీ నాయకులే వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. మరో ఆర్నెల్లపాటు రాష్ట్రపతి పాలనను పొడిగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించాలంటూ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. 2027లో మణిపూర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. తాజా పరిణామాలు బీజేపీని చిక్కులోకి నెట్టేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇక మేఘాలయ, త్రిపురలో కూడా రాజకీయ వేడి రాజుకుంటోంది. కాంగ్రెస్కు చెందిన రోనీలింగ్డో నేషన్ పీపుల్స్ పార్టీలో చేరడంతో.. కాంగ్రెస్ పార్టీ మేఘాలయ అసెంబ్లీలో తన ప్రాతినిధ్యాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే..! అయితే.. మాజీమంత్రి ముకుల్ సంగ్మా కాంగ్రెస్లో చేరారు. అయితే.. ఎన్పీపీ నేతృత్వంలో ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగుతోంది. 17 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాయిస్ ఆఫ్ ద పీపుల్స్ పార్టీ(వీపీపీ)తో పొత్తుతో అధికారపీఠాన్ని చేజిక్కించుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. అదే జరిగితే.. ఎన్డీయే నేతృత్వంలోని ప్రభుత్వానికి చిక్కులు తప్పవు. అటు త్రిపురలో రాజకుటుంబానికి చెందిన ప్రద్యోత్ మాణిక్య నేతృత్వంలోని టీఎంపీ బలాన్ని పుంజుకుంటోంది. అస్సాం, త్రిపురలో నిరసనలు.. మణిపూర్ అల్లర్లు, మేఘాలయలో పరిణామాలు మారుతున్న నేపథ్యంలో.. ఈశాన్యంలో బీజేపీకి చిక్కులు తప్పవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
ఎన్నికలప్పుడే రాజకీయాలు: సీఎం రేవంత్
సాక్షి, ఆదిలాబాద్: ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలని.. తర్వాత అభివృద్ధే లక్ష్యం అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు రావాలని కేంద్రంలోని నేతలను కూడా ఆహ్వానించానన్నారు. గురువారం.. ఆదిలాబాద్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లలో ఒక్కరోజైనా సెలవు తీసుకోలేదని.. విపక్ష నేతలను కలుపుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో సీఎం సభల్లో విపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇచ్చారా? అంటూ రేవంత్ ప్రశ్నించారు.‘‘ఎన్నికలయ్యాక ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందించడమే లక్ష్యం. ఏడాదిలో ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు పనులు ప్రారంభిస్తాం. ఎర్రబస్సు రావడం కష్టమనుకున్న ఆదిలాబాద్కు ఎయిర్బస్ తీసుకొస్తున్నాం. అత్యంత వెనకబడిన ఆదిలాబాద్ను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా. ఆదిలాబాద్కు నీళ్ల కోసం ప్రాణిహిత- చేవెళ్ల ప్రాజెక్టు పనులను వైఎస్ ప్రారంభించారు. అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా’’ అని రేవంత్ పేర్కొన్నారు.‘‘జిల్లా అభివృద్ధికి రెండు నెలల్లో ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాం. మళ్లీ తొందరలోనే ఆదిలాబాద్ వచ్చి సమీక్ష చేస్తాను. ఇంద్రవెల్లిలో యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నా. ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని కొనసాగిస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇచ్చారా?. మేం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు 61 వేల ఉద్యోగాలు ఇచ్చాం. కాళేశ్వరం.. కూలేశ్వరం అయింది. ప్రజల సొమ్ము తిన్నవారు బాగుపడరు’’ అంటూ రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. -
గ్యాస్ మాస్క్లతో ఎంపీలు.. కాలుష్యంపై గగ్గోలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నాలుగవ రోజు (గురువారం) సభ సమావేశమైన వెంటనే, ప్రతిపక్షాలు ప్రధానంగా రెండు కీలక సమస్యలను లేవనెత్తాయి. అవి ఢిల్లీ-ఎన్సిఆర్, ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్య సంక్షోభం, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఆల్-టైమ్ కనిష్ట స్థాయికి పడిపోవడం. ప్రతిపక్షాల ఎజెండాలో వాయు కాలుష్యంపై చర్చ ప్రధానాంశంగా నిలవగా, పలువురు ప్రతిపక్ష ఎంపీలు గ్యాస్ మాస్క్లు ధరించి నిరసన తెలిపారు. ఈ సమస్యను జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలని వారు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.ఉత్తర భారతదేశంలోని నెల రోజుల నుంచి తీవ్రమవుతున్న వాయు కాలుష్య సంక్షోభంపై చర్చ నిర్వహించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీలు లోక్సభలో వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చారు. మాణికం ఠాగూర్, మనీష్ తివారీ, విజయకుమార్ అలియాస్ విజయ్ వసంత్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులలో శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్న ఈ సంక్షోభాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ తీర్మానం నోటీసులో ప్రభుత్వం సమన్వయంతో కూడిన జాతీయ వ్యూహాన్ని రూపొందించడంలో విఫలమైందని, పక్షవాతానికి గురై, చర్యలకు బదులుగా సలహాలు మాత్రమే ఇస్తోందని" తీవ్రంగా విమర్శించారు.వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ ప్రతిపక్ష ఎంపీలు బుధవారం, గురువారం పార్లమెంట్కు గ్యాస్ మాస్క్లు ధరించి వచ్చారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కూడా వాయు కాలుష్యం వంటి ముఖ్యమైన ప్రజా సమస్యలపై పార్లమెంటులో చర్చ జరగాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ అజయ్ మాకెన్ కాలుష్య సంక్షోభంపై స్పందిస్తూ, ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడంలో కేంద్రంలోని బీజేపీ విఫలమయ్యిందని ఆరోపించారు. ఇదే సమయంలో దేశ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అధికార పార్టీపై పదునైన విమర్శలు చేశారు. గురువారం ప్రారంభ వాణిజ్యంలో యూఎస్ డాలర్తో రూపాయి విలువ 28 పైసలు క్షీణించి, చరిత్రలో ఎన్నడూ లేనంతగా ₹90.43 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు."కొన్ని సంవత్సరాల క్రితం మన్మోహన్ సింగ్ హయాంలో రూపాయితో పోలిస్తే డాలర్ విలువ ఎక్కువగా ఉన్నప్పుడు, వీరంతా ఏమన్నారు? ఇప్పుటి పరిస్థితికి వీరు చెప్పే సమాధానం ఏమిటి? వారినే అడగండి, మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు," అని ప్రియాంక గాంధీ వాద్రా పార్లమెంట్ వెలుపల విలేకరులను ప్రశ్నించారు. రూపాయి విలువ పతనంపై అధికార పక్షం గతంలో చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తు చేస్తూ, ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ పతనం గురించి ప్రశ్నించడానికి ప్రయత్నించారు.పార్లమెంట్ శీతాకాల సమావేశాల నాలుగవ రోజు (గురువారం) కేవలం చట్టసభ చర్చలకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తున్న ఆరోగ్య , ఆర్థిక సంక్షోభాలకు వేదికగా నిలిచింది. ప్రతిపక్షాల గ్యాస్ మాస్క్ నిరసన ఢిల్లీలోని కాలుష్య సంక్షోభ తీవ్రతను జాతీయ వేదికపైకి తీసుకువచ్చింది. రూపాయి పతనంపై ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తాయి. కాలుష్యాన్ని జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలనే డిమాండ్పై కేంద్రం స్పందన కోసం పలువురు ఎదురుచూస్తున్నారు. #WATCH | Delhi: Opposition MPs protest in front of Makar Dwar on Parliament premises over air pollution issue. pic.twitter.com/BoEeQQPdkH— ANI (@ANI) December 4, 2025 -
భౌ భౌ...!
న్యూఢిల్లీ: పార్లమెంటు ఆవరణలోకి కారులో కుక్కను తీసుకొచ్చి కలకలం రేపిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి బుధవారం మీడియాకు మరింత పని పెట్టారు. తనపై సభలో హక్కుల తీర్మానం పెట్టాలని పాలక బీజేపీ ఎంపీలు యోచిస్తున్నారన్న వార్తలపై మీడియా ఆమెను ప్రశ్నించగా ‘భౌ భౌ...!’అంటూ విచిత్రంగా స్పందించారు. ‘‘ఇంతకంటే ఇంకేం చెప్పమంటారు నన్ను?’’ అంటూ మీడియాకే ఎదురు ప్రశ్న కూడా వేశారు. ‘‘తీర్మానం పెట్టినప్పుడు చూసుకుందాం. అదేమన్నా పెద్ద సమస్యా? అదే జరిగితే సరైన సమాధానం సభలోనే ఇస్తా’’ అని చెప్పుకొచ్చారు. అనంతరం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో కూడా ఈ ఉదంతంపై మారి్మక వ్యాఖ్యలు చేశారు. రేణుక ‘భౌ భౌ’ ఉదంతంపై సోషల్ మీడియాలో మీమ్స్, జోకులు పేలుతున్నాయి. ఒకరు పాపులర్ సాంగ్ ‘హూ లెట్ ద డాగ్స్ ఔట్’ ను ఎంపీ కామెంట్స్ తో రీమిక్స్ చేసి అలరించగా మరొకరు ‘ప్రాణికోటికి మన ఎంపీలు భలే సేవ చేస్తున్నారు’ అని రాసుకొచ్చారు. రాజకీయ రచ్చ సోమవారం పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి రోజు సందర్భంగా రేణుక ఒక కుక్కను భవన ప్రాంగణంలోకి తేవడం కలకలం రేపింది. అయితే, ‘దారిలో తారసపడ్డ ఒక వీధి కుక్కను తాను కాపాడి కార్లో తీసుకొచ్చా. దాన్ని వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లానని అనంతరం ఆమె చెప్పారు. పైగా, ‘కరిచేది (సభ) లోపల కూచున్నవాళ్లే. బయటుండే ఇలాంటి శునకాలు కాదు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేగాక ఈ శునకోదంతం రాజకీయ రచ్చకు కూడా దారి తీసింది. కుక్కలను పార్లమెంటు ఆవరణలోకి అనుమతించడం లేదు గానీ లోనికి (సభ వైపు చూపుతూ) మాత్రం రానిస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ ఉదంతంపై పలువులు బీజేపీ ఎంపీలు తీవ్రంగా మండిపడ్డారు. -
కుప్పకూలిన వ్యవస్థకు గట్టి పునాది వేస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో కి వచ్చే నాటికి రెవెన్యూ వ్యవస్థ కుప్ప కూలి పోయి ఉందని, దాన్ని పునాదుల నుంచి మళ్లీ నిర్మించుకుంటూ వస్తున్నామని రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. కొంచెం ఆలస్యమైనా రెవెన్యూ వ్యవస్థకు గట్టి పునాదులు వేస్తామన్నారు. రైతులు తమ భూమి గురించి భయపడే దశ నుంచి పూర్తి భద్రత కల్పిస్తూ వారిలో ధైర్యం నింపగలిగామని వెల్లడించారు. బుధవారం ఆయన సచివాలయంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్కుమార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక కమిషనర్ రాజీవ్గాంధీ హన్మంతులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా భయంకరమైన ధరణిని బంగాళాఖాతంలో వేసి ప్రజలు మెచ్చిన భూభారతి చట్టాన్ని తెచ్చామన్నారు. భూదార్ కార్డులిస్తాం: రెండో దశలో భాగంగా నక్షాలు లేని 373 గ్రామాల్లో సర్వే చేసి భూముల హద్దులు నిర్ధారించి భూదార్ కార్డులిస్తామని పొంగులేటి చెప్పారు. మూడో దశలో ప్రతి జిల్లాలోని 70 గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. మొత్తం 3,490 మంది లైసెన్సుడు సర్వేయర్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామని, మరో 2,500 మందిని డిసెంబర్ చివరి కల్లా అందుబాటులోకి తెస్తామన్నారు. అతుకుల బొంత ధరణి వెబ్సైట్ను రూపుమాపి, భూముల వివరాలు, సర్వే సమాచారం, రిజిస్ట్రేషన్ గణాంకాలు ఒకే వేదికపై ఉండేలా ఏకీకృత వెబ్సైట్ను వచ్చే జనవరిలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అన్ని భద్రతా ప్రమాణాలుండే భూదార్కార్డులను రైతులకు ఇస్తామని, భవిష్యత్తులో ఏ రిజిస్ట్రేషన్ లావాదేవీ అయినా సర్వే మ్యాప్ ఉంటేనే జరిగేలా పారదర్శక వ్యవస్థను రూపొందిస్తామని చెప్పారు. అయితే కంగారు పడి ప్రజలను మభ్యపెట్టాలని తమకు లేదని, కొంత ఆలస్యమైనా చెప్పిన దాని కంటే ఒకటి ఎక్కువే చేస్తామని పొంగులేటి వెల్లడించారు. తన కుమారుడిపై వస్తున్న ఆరోపణల విషయంలో స్పందిస్తూ.. ‘నిజం నిలకడ మీద తెలుస్తుంది. నిజం మారదు. మార్చబడదు’ అని చెప్పారు.పొంగులేటి ఇంకా ఏం చెప్పారంటే...!⇒ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా నోటీసుల జారీ అయిపోయింది. త్వరలోనే పరిష్కార ప్రక్రి య ప్రారంభమవుతుంది. ఇందులో అఫిడవిట్ ఇవ్వాలన్న నిబంధనపై కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అవసరమైతే జీవోను మార్చేందుకూ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ⇒ గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల అవకతవకలపై తాము చేసిన ఫోరెన్సిక్ ఆడిటింగ్ ప్రక్రియ పైలట్ జిల్లాలైన సిద్ధిపేట, సిరిసిల్లలో ముగిసింది. ఈ నివేదికను త్వరలోనే వెల్లడిస్తాం. ⇒ నిషేధిత భూముల జాబితాను వెబ్సైట్లో పెట్టాం. ఎవరికైనా అభ్యంతరాలుంటే దరఖాస్తు చేసుకోవాలి. పరిశీలించి అవసరమైతే ఆయా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తాం. ⇒ ఒకసారి ఒక భూమిని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ను రద్దు చేసే అధికారం రాష్ట్రానికి లేదు. కేంద్ర చట్టాన్ని మార్చి ఆ అధికారాన్ని ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని అడిగాం. కేంద్రం కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ⇒ హిల్ట్పిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదు. బీఆర్ఎస్ హయాంలో ఏ పరిశ్రమలకు ఎలా భూములను ధారాదత్తం చేశారనే విషయాలను త్వరలోనే తెలియజేస్తాం. ⇒ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 45–46 వేల మందికి అక్రిడిటేషన్లు జారీ చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. ⇒ తెలంగాణ పేరుతో రెండుసార్లు బీఆర్ఎస్ మసిపూసి మారేడు కాయ చేసింది. పడికట్టు పదాలతో ప్రజలను మోసం చేసింది. ఇకముందు కూడా అలాంటిది నడుస్తుందనుకోవడం వారి పొరపాటు. -
త్వరలో 40 వేల ఉద్యోగాలు.. సీఎం రేవంత్ ప్రకటన
సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే శ్రీకాంతాచారి స్ఫూర్తితో 60వేల ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి చెప్పారు. మరో ఆరు నెలల్లో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టంచేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రజా పాలన–ప్రజా విజయోత్సవాల కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ హుస్నాబాద్ నుంచే బహుజన దండు కట్టారు. తెలంగాణ ఉద్యమం ఈ ప్రాంతం నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడింది. 2004లో కరీంనగర్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని 2014లో ఇచ్చారు’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రూ.262 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. కిరికిరి సర్పంచ్లు వస్తే ఐదేళ్లు వృథా ‘యువత పదేళ్లు రాజకీయాలు పక్కన పెట్టి అందరూ ఏకమై, వీలైనంత వరకు ప్రజలను ఒప్పించి ఏకగ్రీవమైనా చేసుకోండి.. లేదా మంత్రులు, ప్రభుత్వం, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసే వాడిని, మంచోడిని గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవాలి’ అని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. మద్యానికి ఆశపడో.. కాళ్లలో కట్టెలు పెట్టే వారిని ఎన్నుకుంటే మీ గ్రామ అభివృద్ధికి నిధులు రావన్నారు. కిరికిరి సర్పంచ్లు వస్తే ఐదేళ్ల కాలం వృథా అవుతుందని చెప్పారు. ‘పొంకనాలు కొట్టే వాడిని సర్పంచ్గా ఎన్నుకోవద్దు. చిన్న తప్పులు చేస్తే అభివృద్ధి దెబ్బతింటుంది. కేంద్రంతో ఎన్ని వైరుధ్యాలున్నా కొట్లాడి నిధులు తెస్తాం. గ్రామాల అభివృద్ధికి ని«ధులు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా’ అని చెప్పారు. మంచి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో అలాగే ఓ మంచి వ్యక్తి గ్రామ సర్పంచ్గా ఉంటే ఆ గ్రామం అలా అభివృద్ధి చెందుతున్నారు. కాళేశ్వరం...కూలేశ్వరమైంది కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎస్సారెస్పీ ఎలా ఉందో?.. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ‘రూ.లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కూలేశ్వరమైంది.. ఆనాడు ఎస్సారెస్పీని నెహ్రూ కడితే ఇప్పటికీ చెక్కు చెదరలేదదు. ఆనాడు కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులే దేశానికి సేవలు అందిస్తున్నాయి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్, నెట్టెంపాడు, జూరాల ప్రాజెక్టులు నిర్మించింది కాబట్టే దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ వృద్ధి చెందింది. వ్యవసాయం అంటే దండగ కాదు.. పండగ అని చేసి చూపించింది ప్రజా ప్రభుత్వమే’ అని అన్నారు. మహిళలను ఓనర్లను చేశాం విద్య, నీటిపారుదలపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. వ్యవసాయం కోసం రూ1.04 లక్షల కోట్ల నిధులు ఖర్చు పెట్టామని, 25 లక్షల మంది రైతులకు రూ. 21,654 కోట్లను రుణ మాఫీ చేశామన్నారు. రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ‘మహిళలకు ఫ్రీ బస్సేకాదు... మహిళా సంఘాలకు వెయ్యి బస్సులను ఇచ్చి ఓనర్లను చేశాం. బీఆర్ఎస్ పదేళ్లలో డబుల్ బెడ్ రూంలు ఇవ్వలేదు. పదేళ్లలో కాంగ్రెస్ 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కట్టించే దిశగా అడుగులు వేస్తున్నాం’ అని రేవంత్ పేర్కొన్నారు. ఆ మూడు నియోజకవర్గాల్లో దేవుళ్లు పాలించారా? గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో దేవుళ్లు ఏమైనా పాలించారా?... హుస్నాబాద్ను ఎందుకు పట్టించుకోలేదు. గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లో రంగనాయకసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లు పూర్తవుతాయి. అదే హుస్నాబాద్లోని గండిపెల్లి, గౌరవెల్లి ప్రాజెక్ట్లు పూర్తికావు. కేసీఆర్కు ప్రచారం మొదలు పెట్టేందుకు సెంటిమెంట్గా హుస్నాబాద్ కావాలి.. ని«ధులు మాత్రం సున్నా’ అని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. గత పాలకుల మాదిరిగా హుస్నాబాద్ను నిర్లక్ష్యం చేయం... త్వరలో గౌరవెల్లిని పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటానని ప్రకటించారు. ఐటీఐలను ఏటీసీలుగా.. ‘ఐటీఐలు కాలం చెల్లిపోయిన శిక్షణలు ఇచ్చేవి. డీజిల్ మెకానిక్ రిపేర్ చేసే అంబాసిడర్ కార్లు షెడ్డుకు పోయాయి. నేర్చుకున్న విద్యార్థులు ఫాం హౌజ్లో ఉన్న కారు రిపేర్ చేయాలి. ఇప్పుడు ఆడీ, బెంజ్ కార్లు వచ్చాయి. అందుకే ఐటీఐ కాలేజీలన్నింటినీ ఏటీసీలుగా మార్చాం. ఏటీసీలో చేరే ప్రతీ విద్యార్థికి నెలనెలా రూ.2 వేలు ఇస్తున్నాం. నిరుద్యోగులను సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దుతాం’ అని రేవంత్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, తుమ్మల నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. కాగా, ఢిల్లీ పర్యటన నేపథ్యంలో సీఎం మధ్యాహ్నం ఒంటి గంటకు హాజరుకావాల్సి ఉండగా సాయంత్రం 5.30 గంటలకు సభావేదిక పైకి వచ్చారు. సీఎం ఆలస్యంగా రావడంతో కొంతమంది వెళ్లిపోయారు. -
మమ్మల్ని రాక్షసులు అంటావా.. నీ సినిమా ఎలా ఆడుతుందో చూస్తా
-
పార్లమెంట్ సమావేశాలు డే-3: రేణుకా చౌదరిపై ఫిర్యాదు
Parliament winter session 2025 Updates..రేణుకా చౌదరిపై చర్యలు తీసుకోవాల్సిందే!రాజ్యసభలో ఎంపీ రేణుకా చౌదరిపై ఫిర్యాదుఓ కుక్కను రక్షించి తన కారులో పార్లమెంట్లో తీసుకొచ్చిన కాంగ్రెస్ ఎంపీదీనిపై అధికార పార్టీ నుంచి అభ్యంతరాలు అరిచేవారు.. కరిచేవారు పార్లమెంట్ లోపేల ఉన్నారంటూ వ్యాఖ్య‘మొరుగుడు’ వ్యాఖ్యలపై చైర్మన్కు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీలుఆమె వ్యాఖ్యలు పెద్దల సభ గౌరవానికి విరుద్ధంగా ఉన్నాయంటూ ఫిర్యాదు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలుమూడోరోజు ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలుసెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లుఢిల్లీ కాలుష్యంపై కాంగ్రెస్ ఎంపీల నిరసన..ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీల నిరసనఆక్సిజన్ మాస్కులు ధరించి నిరసన వ్యక్తం చేసిన ఎంపీలు దీపేందర్ సింగ్ హుడా సహా పలువురు విపక్ష ఎంపీలువాయు కాలుష్యం పైన చర్చించాలని వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిన ఎంపీ దీపేందర్ హుడావిపక్షాల ధర్నా..పార్లమెంట్లో లేబర్ కోడ్కు వ్యతిరేకంగా విపక్షాల ధర్నాధర్నాలో పాల్గొన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కనిమోలి సహా విపక్ష పార్టీ ఎంపీలు కార్పొరేట్లకు అనుకూలంగా లేబర్ కోడ్ చట్టాలను తీసుకొచ్చారని విపక్షాల ఆరోపణలేబర్ కోడ్ను ఉపసంహరించుకోవాలని నినాదాలు#WATCH | Delhi | Opposition leaders protest against Labour laws in Parliament premises pic.twitter.com/K8wtZdJtAH— ANI (@ANI) December 3, 2025కాసేపట్లో సమావేశాలు ప్రారంభం..నేడు మూడో రోజు పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. లోక్సభలో ది సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఎస్ఐఆర్పై చర్చకు కేంద్రం అంగీకరించడంతో సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరిస్తామన్న విపక్షాలు .అఖిలపక్ష సమావేశంలో ఎస్ఐఆర్పై చర్చకు అంగీకరించిన ప్రభుత్వండిసెంబర్ 9న ఎన్నికల సంస్కరణలపై చర్చచర్చకు సమాధానం ఇవ్వనున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ఎన్నికల సంస్కరణల చర్చలో భాగంగా ఎస్ఐఆర్పై కొనసాగనున్న చర్చచర్చకు 10 గంటల సమయం కేటాయింపుడిసెంబర్ 8వ తేదీన వందేమాతరంపై చర్చవందేమాతరంపై చర్చను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ#WATCH | Delhi | Congress MPs Sonia Gandhi and Priyanka Gandhi Vadra arrive at the Parliament for the third day of the #WinterSession2025 Congress MP Priyanka Gandhi Vadra says, "We should also discuss other things like pollution. We should discuss many other issues which are… pic.twitter.com/idFERZh21O— ANI (@ANI) December 3, 2025 -
బరిలో ‘సోనియాగాంధీ’ అయోమయంలో కాంగ్రెస్
కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్ 9 - 11 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో మున్నార్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిగా సోనియా గాంధీ (అవును మీరు చదవింది నిజమే) కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది.ఎవరీ సోనియా గాంధీకేరళలోని నల్లతన్ని కల్లార్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ విధేయుడు, సీనియర్ నాయకుడు దివంగత దురే రాజ్ కుమార్తె సోనియా గాంధీ. సోనియా గాంధీ పట్ల అభిమానంతో, ఆమెకు ఆ పేరు పెట్టుకున్నారట.అయితే బీజేపీలో చురుకైన కార్యకర్తగా ఉన్న సుభాష్ను సోనియా వివాహం చేసుకున్నారు . ప్రస్తుతం పంచాయతీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అంతేకాదు పాత మున్నార్ మూలక్కడ వార్డులో జరిగిన ఉప ఎన్నికలో ఆమె బీజేపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. తన భర్త రాజకీయ మార్గాన్ని అనుసరిస్తూ ఇప్పుడు మళ్లీ బీజేపీ తరపున బరిలోకి దిగారు. చదవండి: జస్ట్ రూ. 200తో మొదలై రూ. 10 కోట్లదాకా ఇంట్రస్టింగ్ సక్సెస్ స్టోరీమరోవైపు మున్నార్లో సోనియా గాంధీ పోటీ కాంగ్రెస్కు ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి మంజుల రమేష్కు ఇక్కడ సంకట పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే కాంగ్రెస్ అధినేతగా సోనియా గాంధీ పేరు అందరికీ సుపరిచితమే. ఆ పేరున్న వ్యక్తం పోటీ చేయడంతో సోనియా పేరు తక్షణమే ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో రమేష్ ఆందోళన పడుతున్నారు. డిసెంబర్ 13న లెక్కింపు జరుగుతుంది.ఇదీ చదవండి: అపూర్వ ఘట్టం, అరుదైన ఘనత : ప్రధాని మోదీ ప్రశంసలు -
పవన్ వ్యాఖ్యలు బాధాకరం: MLC బల్మూరి వెంకట్
-
పవన్ వ్యాఖ్యలు.. చంద్రబాబు స్పందించాలి: పొన్నం
సాక్షి, సిద్ధిపేట: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. గోదావరి జిల్లాలో కనిపించే పచ్చదనంపై తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారని.. నరుడి దిష్టికి రాయి కూడా పగిలిపోతుందని అంటారు అని పవన్ చేసిన కామెంట్లపై తెలంగాణ నాయకులు భగ్గుమంటున్నారు. పవన్ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేటలోని హుస్నాబాద్లో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల భావంతో ఉండే రాష్ట్రాలు. తెలంగాణ తుపానులో మునుగుతుంటే మేము ప్రకృతి అనుకున్నాం తప్ప ఏపీని తప్పుపట్టడం లేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే ఏపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్.. తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అంటే ఆయన వివేకవంతుడా? లేక అవివేకా? అని ప్రశ్నించారు. ..మిత్రపక్షానికి బాధ్యత వహిస్తున్న తెలంగాణ బీజేపీ నాయకత్వం ఆయన వ్యాఖ్యలపై స్పందించాలని కోరుతున్నాను. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలి. స్వయంగా బీజేపీ పొత్తు ఉంది కాబట్టి రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు కలిగేలా మాటలు మాట్లాడటం దురదృష్టకరం. ఏపీలో తుఫాను వస్తే మా హుస్నాబాద్ మునిగింది.. మేము ఏపీ ప్రజలను తప్పు పట్టడం లేదు. అది ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తున్నాం. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మా దిష్టి తగిలిందని నిందిస్తే ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరం. వెంటనే పవన్ తన మాటలు ఉప సంహరించుకోవాలి.. క్షమాపణలు కోరాలి. భవిష్యత్తులో ఇలాంటి వివక్ష పూరిత మాటలు మాట్లాడవద్దు.. విజ్ఞతగా వ్యవహరించాలి. ఉప ముఖ్యమంత్రి బాధ్యతగా మాట్లాడాలి. ఏపీ, తెలంగాణ కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగాలి.. ఇలాంటి వ్యాఖ్యలు మాకు రావు.. మీరు మాట్లాడకూడదు అని హితవు పలికారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలితెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల భావంతో ఉండే రాష్ట్రాలు..తెలంగాణ తుఫాన్ లో మునుగుతుంటే మేము ప్రకృతి అనుకున్నాం తప్ప ఆంధ్రప్రదేశ్ ను తప్పుపట్టడం లేదు..ఎక్కడో కోనసీమ లో కొబ్బరి… pic.twitter.com/CEI7fldwq6— Ponnam Prabhakar (@Ponnam_INC) December 2, 2025 -
ఎస్ఐఆర్పై ఆగని రగడ.. లోక్సభ వాయిదా
Parliament Winter Session Updates..లోక్సభ వాయిదా.. లోక్సభలో ఎస్ఐఆర్పై రగడలోక్సభ మధ్యాహ్నాం 12 గంటలకు వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా.. Lok Sabha adjourned to meet again at 12:00 Noon, after Opposition MPs entered the well of the House demanding a discussion on SIR pic.twitter.com/K2S4Pcu8FX— ANI (@ANI) December 2, 2025పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.రెండో రోజు సందర్భంగా ఎస్ఐఆర్ ప్రతిపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. #WATCH | Delhi | Opposition leaders, including Congress MP Sonia Gandhi, LoP Lok Sabha Rahul Gandhi and LoP Rajya Sabha, Mallikarjun Kharge, hold a protest against SIR in Parliament premises, on the second day of the winter session pic.twitter.com/wJDWl8tk5t— ANI (@ANI) December 2, 2025ఉభయ సభల్లో నిరసనలు.. ఎస్ఐఆర్పై చర్చించాలని రాజ్యసభలో విపక్షాల పట్టు.సభలో విపక్ష నేతల నినాదాలు.ఓట్ చోరీ ప్రభుత్వం అంటూ లోక్సభలో విమర్శలు. పార్లమెంట్ లోపల, వెలుపల సభ్యుల నినాదాలు.నిరసనల్లో పాల్గొన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, ప్రతిపక్ష నేతలు. అయితే, ఎన్నికల సంస్కరణలపై సిద్ధమన్న కేంద్రం. #WATCH | Opposition MPs raise slogans of "Vote chor, gaddi chhor", raising the issue of SIR and demanding a discussion on it in Lok Sabha, as the House proceedings begin on the second day of the winter session of the Parliament(Video source: Sansad TV/ YouTube) pic.twitter.com/SCr37YmlXh— ANI (@ANI) December 2, 2025 -
డీకే విందులో సిద్దరామయ్యకు ఇష్టమైన నాన్ వెజ్ వంటకాలు
ముఖ్యమంత్రి పదవి మార్పిడి రగడను అల్పాహార విందుల ద్వారా పరిష్కరించుకునేలా కాంగ్రెస్ నాయకత్వం.. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను ఆదేశించింది. ఫలితమే వరుసగా జరుగుతున్న బ్రేక్ఫాస్ట్ భేటీలు. అందరికీ నోరూరేలా పలు రకాల వంటకాలతో వారి సమావేశాలు జరుగుతూ రచ్చను చల్లార్చే ప్రక్రియలుగా రూపాంతరం చెందాయి.బెంగుళూరు: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు మూడురోజుల కిందట అల్పాహార విందును ఆతిథ్యమిచ్చిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. ఇప్పుడు తానే అతిథిగా మారారు. ఈదఫా డీకే విందు ఇవ్వబోతున్నారు. ఇందులో సిద్దుకు ఇష్టమైన నాన్ వెజ్ ఉండే వీలుంది. మంగళవారం ఉదయం సదాశివనగరలోని డీసీఎం నివాసంలో జరగబోయే ఈ విందు సమావేశం ఉత్కంఠ పుట్టిస్తోంది. సిద్దరామయ్య ఇంట విందులో ఇద్దరూ ఐక్యతను ప్రదర్శించి, కుర్చీ రగడకు విరామం ఇచ్చినట్లు చాటుకున్నారు. ఇది ఫలించినట్లుగా ఉందనుకున్న హైకమాండ్ తిరుగు విందు ఇవ్వాలని డీకేశిని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నెల 8 నుంచి బెళగావిలోని సువర్ణసౌధ భవనంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆరంభం కాబోతున్నాయి. ప్రతిపక్షాలకు కుర్చీ మారి్పడి గందరగోళం ఆయుధం కాకూడదని సీఎం, డీసీఎం తీర్మానించారు. హైకమాండ్ ఆవరణలో బంతి.. గత 15 రోజుల నుంచి రాష్ట్ర కాంగ్రెస్లో సీఎం సీటు తగాదా తారాస్థాయికి చేరింది. హైకమాండ్ మనసులో ఏముందో బయట పెట్టకుండా సామరస్య పరిష్కారానికి సూచనలు చేస్తోంది. మీరిద్దరే కూర్చొని చర్చించుకొని ఓ తీర్మానానికి వచ్చి ఆ తరువాత ఢిల్లీకి రండని సూచించినట్లు తెలుస్తోంది. బెంగళూరులో సీఎం, డిప్యూటీ సీఎం విందు భేటీల ద్వారా తమ టాసు్కలను పూర్తి చేస్తుండగా, ఢిల్లీలో హైకమాండ్ తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. సోనియాగాం«దీ, రాహుల్గాందీకి పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇక్కడి పరిణామాలను వివరించి, త్వరగా పరిష్కారం కనుగొనాలని కోరారు. సోనియా, రాహుల్ త్వరలోనే ఇద్దరినీ పిలిపించుకొని కార్యాచరణను తెలియజేస్తారని కాంగ్రెస్ ఉన్నత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు వారంలో మొదలవుతాయి, ఆ తరువాత హైకమాండ్ నిర్ణయం వెలువరిస్తుందని సమాచారం. -
డీకే సీఎం అయ్యేది అప్పుడే: సిద్దరామయ్య
బెంగళూరు: కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. కర్ణాటక కాంగ్రెస్లో అధికార పంపిణీపై ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ ఇంటికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బ్రేక్ ఫాస్ట్ మీటింగ్కు వెళ్లారు. ఈ సందర్బంగా సీఎంకు డీకే, ఆయన సోదరుడు డీకే సురేష్ స్వాగతం పలికారు. అనంతరం, ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. అల్పాహారంలో నాటుకోడి చికెన్, ఇడ్లీ, ఉప్మా, దోశ, కాఫీ ఆస్వాదిస్తూ ప్రస్తుత పరిణామాలపై చర్చించుకున్నారు.బ్రేక్ ఫాస్ట్ అనంతరం సీఎం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం మార్పుపై అధిష్టానానిదే తుది నిర్ణయం. హైకమాండ్ ఎప్పుడు ఆదేశిస్తే శివకుమార్ అప్పుడు ముఖ్యమంత్రి అవుతారు. హైకమాండ్, రాహుల్ గాంధీ ఆదేశాలను మేము పాటిస్తాం. రేపు డీకే, నేను కేసీ వేణుగోపాల్ను కలుస్తాం. మేము కలిసే ఉన్నాం. మా మధ్య విభేదాలేమీ లేవు. మేమంతా కలిసే ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. భవిష్యత్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. #WATCH | Bengaluru | Karnataka CM Siddaramaiah says, "There are no differences. DK Shivakumar and I are united. We are running the government. In the future also, we will run the government unitedly..." pic.twitter.com/uM4cjTNDL7— ANI (@ANI) December 2, 2025ఇక, అంతకుముందు.. సీఎం సిద్దరామయ్యను మంగళవారం బ్రేక్ ఫాస్టుకు ఆహ్వానించినట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) ట్విట్టర్లో వెల్లడించారు. ఈ సందర్బంగా డీకే శివకుమార్..‘కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం, మరింత సమన్వయంతో కలిసి పనిచేయడం గురించి మాట్లాడటానికి, ముఖ్యమంత్రిని రేపు బ్రేక్ఫాస్ట్కి ఆహ్వానించాను’ అని రాసుకొచ్చారు. డిప్యూటీ సీఎం ఆహ్వానం మేరకు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి సిద్దరామయ్య సదాశివనగర్లోని నివాసానికి రాగా.. బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేశ్ ఆయన్ను సాదరంగా స్వాగతించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి మార్పు గురించి ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. రెండున్నరేళ్ల తర్వాత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సీఎం బాధ్యతలు అప్పగించేలా అప్పట్లో ఓ ఒప్పందం కుదిరిందని ప్రచారం జరుగుతోంది. పార్టీ దీనిని పదేపదే ఖండిస్తున్నా.. ఈ అంశం రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది.అయితే, గత శనివారమే వీరిద్దరూ సిద్ధరామయ్య ఇంట్లో సమావేశం అయిన విషయం తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని ప్రకటించారు. అధిష్ఠానం ఏం చెబితే తామిద్దరం అదే పాటిస్తామని తెలిపారు. #WATCH | Bengaluru, Karnataka | Dy CM DK Shivakumar and his brother DK Suresh welcome CM Siddaramaiah at their residence. pic.twitter.com/g5f1dWMzvo— ANI (@ANI) December 2, 2025 #WATCH | Bengaluru | Karnataka CM Siddaramaiah reaches Dy CM DK Shivakumar's residence, at his invitation for a breakfast meeting (Visuals from outside Dy CM DK Shivakumar's residence) pic.twitter.com/OmWK5dpwmT— ANI (@ANI) December 2, 2025 -
లోపల ఉన్న వాళ్లే కరుస్తారు
న్యూఢిల్లీ: శీతాకాల సమా వేశాలకు హాజరయ్యేందుకు పార్లమెంట్కు వచ్చిన కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి వెంట కారులో ఒక వీధిశునకాన్ని తీసుకురావడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా రేణుకా దీటుగా బదులిచ్చారు. సోమవారం ఉదయం ఒక వీధిశునకాన్ని ఆమె కాపాడి ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత వెటర్నరీ వైద్యునికి చూపించేందుకు బయల్దేరారు. డ్రైవర్ ఈమెను మార్గమధ్యంలో పార్లమెంట్ వద్ద దింపేసి వెటర్నరీ ఆస్పత్రికి వెళ్తామనుకున్నాడు. ఈలోపే పార్లమెంట్ వద్ద రేణుక కారులో కుక్క ఉండటం చూసి బీజేపీ నేతలు విమర్శలు మొదలెట్టారు. పార్లమెంట్లో చర్చించాల్సిన అంశాలు ఎంత ముఖ్యమైనవో కాంగ్రెస్ నేతలకు బోధపడటం లేదు. ఇలా కుక్కలను తీసుకొచ్చి తమాషా చేస్తున్నారు. ఈ అంశాన్ని రాజ్యసభ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లాలి ’’ అని బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ అన్నారు. దీంతో రేణుకాచౌదరి తీవ్రంగా స్పందించారు. ‘‘ ప్రభుత్వానికి అసలు కుక్కలంటే గిట్టదనుకుంటా. జంతువులు సమస్యలు చెప్పుకోలేవు. అయినా ఈ శునకం నా కారులో ఉందికదా. బయటకు రాలేదు. అయినా ఇది చాలా చిన్న కుక్క. ఇవేమీ కరవవు. కరిచే వాళ్లు వేరే ఉన్నారు. వాళ్లు పార్లమెంట్ లోపల ఉన్నారు. వీధిశునకాలను కాపాడకూడదని ఏ చట్టంలో రాసి ఉంది? ’’అని రేణుక వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే వెటకారంగా స్పందించారు. ‘‘ ఆమె చెప్పింది నిజమే. కుక్కలు అస్సలు కరవవు. విపక్ష సభ్యులు ముఖ్యంగా ఆమె సొంత పార్టీ నేతలే ఇరుసభల్లో హంగామా సృష్టించి కరిచినంత పనిచేస్తారు. పార్లమెంట్కు మీరు కుక్కలను వెంట తీసుకొస్తే మేం అధికారాన్ని వెంట తీసుకొస్తాం’’ అని అన్నారు. -
ఐక్యతారాగంలో మరో విందు
సాక్షి, బెంగళూరు: అధికార మార్పిడి వివాదానికి అల్పాహార భేటీ ద్వారా విరామం ప్రకటించి ఐక్యతారాగం పాడిన సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మరోసారి తమ ఐక్యతను చాటిచెప్పేందుకు సిద్ధమయ్యారు. మూడు రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సీఎం సిద్ధరామయ్య తన నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు. ఇప్పుడు డీకే వంతు వచ్చింది. సోమవారం విధానసౌధలో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ‘తన నివాసంలో భోజన విందుకు’ రావాల్సిందిగా సీఎంను డీకే ఆహ్వానించారు.అయితే బ్రేక్ఫాస్ట్కు వస్తానని సీఎం తెలిపారు. దీంతో సీఎం సిద్ధరామయ్యకు ఇష్టమైన నాటుకోడి పులుసుతో పాటు ఇతరత్రా వంటకాలను ప్రత్యేకంగా డీకే సిద్ధం చేయిస్తున్నారు. కలిసి కూర్చుని మాట్లాడుకోవాలంటూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచనల మేరకు ఈ నెల 29న ముఖ్యమంత్రి నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు తామిద్దరం కలసికట్టుగా సాగుతున్నట్లు మీడియాకు వివరించారు. తద్వారా సీఎం మార్పిడి వివాదానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు. జనవరి మొదటి వారానికి వాయిదా! కాగా, సీఎం మార్పుపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎటూ తేల్చకుండా నాన్చుతోంది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ నాయకులు బిజీగా ఉండడంతో కర్ణాటక అధికార మార్పిడిపై చర్చించేందుకు అధిష్టానం నాయకులు అందుబాటులో లేరని తెలుస్తోంది. ఢిల్లీలో ఆదివారం సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో కర్ణాటక రాజకీయ పరిస్థితి చర్చకువచ్చింది. సిద్ధరామయ్య, డీకేల కార్యాచరణపై వివరాలను అడిగి తెలుసుకున్న సోనియా జనవరి మొదటి వారంలో పరిశీలిస్తామని ఖర్గేకు తెలిపినట్లు సమాచారం. మేం సోదర సమానులం: డీకే ముఖ్యమంత్రి, తాను సోదర సమానులమని, కలసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకు సాగుతామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మాజీ సీఎం దివంగత కెంగల్ హనుమంతయ్య వర్ధంతి సందర్భంగా విధానసౌధలోని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన శివకుమార్ అనంతరం మీడియాతో మాట్లాడారు. తమలో గ్రూపులు మీడియా సృష్టి అన్నారు. రాజకీయ ద్వేషంతోనే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని నేషనల్ హెరాల్డ్ కేసును ఉదహరిస్తూ ఆయన పేర్కొన్నారు. డీకే ఇస్తున్న విందుకు వెళుతున్నట్లు ఇదే కార్యక్రమం సందర్భంగా సీఎం తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు ప్రస్తావిస్తూ సోనియా, రాహుల్ గాందీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సరికాదన్నారు. -
వీరన్న కుటుంబాన్ని ఆదుకునేదెవరు?: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: కౌలు రైతులకు భరోసా ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఖమ్మం రైతు బానోతు వీరన్న ఉదంతంపై తాజాగా ఆయన ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న బలవన్మరణం చెందడం అత్యంత బాధాకరం. పండించిన పంటకు ధర రాక.. అప్పులు తీర్చే దారిలేక చనిపోతున్నా అంటూ పురుగుల మందు తాగుతూ వీరన్న సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాలకు ఓ నిదర్శనం.వీరన్నది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం చేసిన హత్యనే. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయని ఫలితంగా బతుకులు భారమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు కౌలు రైతులకు ఏడాదికి రూ. 15,000 రైతుభరోసా ఇస్తామని బాండ్లు రాసిచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేయడం దుర్మార్గం. పండించిన పంటను కొనే దిక్కులేక, మద్దతు ధర రాక, దళారుల దోపిడీకి రైతులు బలవుతున్నారు. సెల్ఫీ వీడియోలో వీరన్న చెప్పిన మాటలకైనా ఈ ప్రభుత్వానికి చలనం వస్తుందా? ఇచ్చిన హామీ ప్రకారం కౌలు రైతులకు ఎప్పుడు రైతు భరోసా ఇస్తారు? మీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంత మంది రైతులను బలి తీసుకుంటారు?. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో కౌలు రైతు బానోతు వీరన్న కుటుంబాన్ని పరామర్శించాలని, ఆ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.రైతులెవరూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని చేతులు జోడించి విన్నవిస్తున్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాటం చేద్దాం.. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే.. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయి... ఎవరూ అధైర్యపడకండి అంటూ హరీష్రావు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
‘సర్’పై పట్టు.. రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్
పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడీవేడిగా.. -
మళ్లీ శశిథరూర్ లొల్లి.. ఈసారి అమ్మ కారణం?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, ఎంపీ శశి థరూర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరమవుతున్నారనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఆయన పార్టీ కీలక సమావేశాలకు తరచూ గైర్హాజరు కావడం, ప్రధాని నరేంద్ర మోదీని బహిరంగంగా ప్రశంసించడం పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. థరూర్ వైఖరిని కాంగ్రెస్ నేతలు ‘అవిశ్వాసం’గా పరిగణిస్తున్నారు. మోదీ విజన్, ఆయన అభివృద్ధి విధానాలపై ధరూర్ కురిపిస్తున్నప్రశంసల జల్లు పార్టీలోని సహచరుకు కూడా మింగుడుపడటం లేదు. శశిథరూర్ కాంగ్రెస్ పార్టీపై చూపుతున్న నిరసన మరోమారు బయటపడింది.నేటి (సోమవారం)నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వ్యూహాత్మక బృందం సమావేశానికి ఎంపీ శశి థరూర్ హాజరు కాకపోవడంతో ఆయన కాంగ్రెస్ను వీడుతున్నారనే ఊహాగానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అయితే థారూర్ ప్రస్తుతం కేరళలో ఉన్నారని, అతని 90 ఏళ్ల తల్లి సంరక్షణను పర్యవేక్షిస్తున్నందున, ఈ సమావేశానికి రాలేకపోయారని ఆయన కార్యాలయం వివరణ ఇచ్చింది. కాగా ఈ తరహా గైర్హాజరు ఇది తొలిసారేమీ కాదు. అంతకుముందు కూడా అనారోగ్యం పేరుతో ‘సర్’ అంశంపై ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సమావేశానికి ఆయన దూరంగా ఉన్నారు. థరూర్ గైర్హాజరీపై పార్టీలో ప్రశ్నలు తలెత్తడానికి ప్రధాన కారణం అదే రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అలాగే ప్రధాని మోదీని ప్రశంసిస్తూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు పెట్టారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతపై థరూర్ చేసిన బహిరంగ ప్రశంసలు కాంగ్రెస్లో తీవ్రమైన అంతర్గత విభేదాలకు దారితీశాయి. ప్రపంచ సవాళ్ల మధ్య కూడా భారతదేశాన్ని ఉద్భవిస్తున్న మోడల్గా మార్చాలనే మోదీ ఆలోచనను థరూర్ కొనియాడారు. ముఖ్యంగా, వలసవాద బానిస మనస్తత్వంను రూపుమాపడం, భాష, సంస్కృతి, వారసత్వం ద్వారా జాతీయ గౌరవాన్ని పెంపొందించడంపై మోదీ దృష్టి సారించడాన్ని ఆయన మెచ్చుకున్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్లోని పలువురు నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. ఈ సమయంలో థరూర్ తాను కాంగ్రెస్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు తన సొంత అభిప్రాయం మాత్రమే ఆయన పేర్కొన్నారు.కాంగ్రెస్లోనే ఉంటానని థరూర్ ఎంత గట్టిగా చెబుతున్నా, ఆయన తీరుతెన్నులు, అభిప్రాయాలు పార్టీలో అంతర్గత విభేదాలకు కారణంగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్ కీలక సమావేశాలకు ఆయన హాజరు కాకపోవడం, ప్రధానిని బహిరంగంగా ప్రశంసించడం తదితర చర్యలు ఆయన త్వరలో కాంగ్రెస్ గూటిని వీడతారేమో అనే సందేహాన్ని మరింతగా పెంచుతున్నాయి. ప్రస్తుతానికి థరూర్ కాంగ్రెస్లోనే కొనసాగుతున్నా, భవిష్యత్తులో ఆయన పార్టీని వీడుతారనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇది కూడా చదవండి: ‘మస్క్’ను తలదన్నేలా.. కుర్రాళ్ల సరికొత్త ఏఐ మోడల్ -
సోనియా, రాహుల్పై కేసు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని చిరకాలంగా వెంటాడుతున్న నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియాగాం«దీ, రాహుల్పై ఢిల్లీ పోలీసులు ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈడీ ఫిర్యాదు ఆధారంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. వారితో పాటు ఈ కేసులో సహ నిందితులైన కాంగ్రెస్ నేతలు సుమన్ దుబే, శామ్ పిట్రోడాతో పాటు యంగ్ ఇండియన్, అసోసియేటెడ్ జర్నల్స్, దాని ప్రమోటర్ సునీల్ భండారీ తదితరులపై ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. వారిపై ఐపీసీ 120 బి (నేరపూరిత కుట్ర), 406 (నమ్మకద్రోహం), 403 (ఆస్తులు కాజేయడం), 420 (మోసం) సెక్షన్లు మోపారు. మనీ లాండరింగ్ నిరోధకచట్టంలోని 66(2) సెక్షన్ ప్రకారం దఖలు పడ్డ అధికారాలను ఉపయోగించుకుని ఎఫ్ఐఆర్ దాఖలు దిశగా ఈడీ చర్యలు తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎఫ్ఐఆర్ నమోదుపై కాంగ్రెస్, బీజేపీ పరస్పర దూషణలకు దిగాయి. బోగస్ కేసును అడ్డుపెట్టుకుని సోనియా, రాహుల్ను వేధించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చౌకబారు రాజకీయాలకు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, అభిషేక్ సింఘ్వీ, ప్రమోద్ తివారీ తదితరులు మండిపడ్డారు. వారు ఎంతటి అభద్రతా భావంలో ఉన్నదీ దీన్నిబట్టి మరోసారి రుజువవుతోందన్నారు. వారి ఆరోపణలను బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ తోసిపుచ్చారు. -
ఒక్క నెల.. 16,372 కోట్లు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇదే అత్యధికం
సాక్షి, హైదరాబాద్: పన్ను ఆదాయంలో ఈ ఏడాది అక్టోబర్ నెల రికార్డు సృష్టించింది. ఆ నెలలో ఏకంగా రూ. 16 వేల కోట్లకు పైగా పన్ను ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూరింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2025 అక్టోబర్కు విడుదల చేసిన గణాంకాల్లో ఈ మేరకు పేర్కొంది. ఇంత భారీ స్థాయిలో ఒకే నెలలో పన్ను ఆదాయం పెద్దఎత్తున రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో పన్ను ఆదాయం రాలేదని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు రెండు ప్రధాన కారణాలున్నాయని అంటున్నాయి. ప్రతి నెలా రూ.1,000 కోట్లకు పైగా ఎక్సైజ్ ఆదాయం వస్తుండగా, ఈ అక్టోబర్లో ఏకంగా రూ.3,675 కోట్లు వచ్చింది. రాష్ట్రంలోని వైన్షాపులకు టెండర్లు పిలవడంతో వచి్చన దరఖాస్తుల రూపంలో రూ.2,845 కోట్లు రాగా, మద్యం విక్రయాల ద్వారా రూ.900 కోట్ల వరకు ఆదాయం వచి్చంది. దీనికితోడు ఈ నెలలో కేంద్ర పన్నుల్లో వాటా కూడా భారీ స్థాయిలోనే వచి్చంది. ఈ ఒక్క నెలలోనే రూ.3వేల కోట్లు దాటింది. దీంతో మొత్తం పన్ను ఆదాయం రూ. 16,372.42 కోట్లకు చేరిందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన పన్ను రాబడుల్లో ఎక్కడా తగ్గుదల లేకపోవడంతోనే ఇది సాధ్యమైందని అంటున్నాయి. సగానికి పైగానే... రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ అంచనాల్లో సగానికి పైగా రాబడులు గత ఏడు నెలల కాలంలో వచ్చాయని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. రూ.2.83 లక్షల కోట్ల బడ్జెట్కు గాను అన్ని రాబడులు, అప్పులు కలిపి రూ.1,45 లక్షల కోట్ల మేరకు సమకూరాయని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇది బడ్జెట్ అంచనాల్లో 51 శాతం కావడం గమనార్హం. ఇందులో పన్ను ఆదాయం రూ. 88వేల కోట్లు కాగా, అప్పులు రూ.50వేల కోట్లు దాటాయి. ఒక్క అక్టోబర్ నెలలోనే ప్రభుత్వం రూ.5 వేల కోట్ల వరకు అప్పులు చేసింది. నవంబర్లో రూ.5 వేల కోట్లు తీసుకోగా, మరో రూ.6వేల కోట్లను డిసెంబర్ 2న బాండ్ల వేలం ద్వారా సమకూర్చుకోనుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెల ముగిసే సమయానికి అప్పుల పద్దు రూ. 60 వేల కోట్లు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
70 లక్షల ఎకరాలకు రైతుభరోసా ఎగ్గొట్టే కుట్ర
నారాయణఖేడ్: రాష్ట్రంలో 70 లక్షల ఎకరాలకు రైతుభరోసా డబ్బులు ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. పంటలు సాగుచేసిన భూములకే రైతుభరోసా డబ్బులు వేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం.. ఈ విషయాన్ని బలపరుస్తోందని ఆయన అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కు వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ 11 పర్యాయాలు రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో వేయగా, కరోనా సమయంలో కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆపలేదన్నారు.ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికలప్పుడే రైతుభరోసా నిధులిస్తోందన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్రెడ్డి మూడు పంటలకు రైతుబంధు వేయాలని డిమాండ్ చేశారని హరీశ్రావు గుర్తుచేశారు. గతేడాది కొన్న సన్నవడ్లకు సంబంధించిన బోనస్ రూ.1,150 కోట్లు ఇప్పటికీ చెల్లించలేదన్నారు. మక్కలు, సోయా కొని నెలగడుస్తున్నా చెల్లింపులు చేయలేదన్నారు. రైతులు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను ఓడిస్తేనే రైతుభరోసా, బోనస్, పంటల బీమా వస్తాయన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
ఫిరాయింపులపై వారిది ఒకటే తీరు
సాక్షి ప్రతినిధి, వరంగల్: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రజాతీర్పును కాలరాయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఖరి ఒక్కటేనని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోగా, అలా వచి్చన కొందరు సిగ్గులేకుండా మంత్రి పదవుల్లో కొనసాగారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ కూడా అదే పని చేస్తోందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుందని విమర్శించారు. తమ పార్టీలో చేరే వారిని రాజీనామా చేసి వస్తేనే తీసుకున్నామని చెప్పారు.ఆ రెండు పార్టీల నిర్ణయాల వల్లే రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని అన్నారు. కిషన్రెడ్డి శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రేటర్ వరంగల్లో పర్యటించారు. వందేభారత్ రైలులో సికింద్రాబాద్ నుంచి వరంగల్ రైల్వేస్టేషన్కు చేరుకున్న ఆయన.. స్టేషన్లో పనులను పరిశీలించి, చాయ్ పే చర్చ నిర్వహించారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ)ను సందర్శించారు. కాంగ్రెస్సే మా ప్రధాన శత్రువు ‘బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కపట నాటకం ఆడుతోంది. బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అని ప్రకటన చేసింది. చివరకు ఇప్పుడు 32 శాతం కూడా లేకుండా అన్యాయం చేసింది. బీసీలకు కేటాయించిన స్థానాల్లో ముస్లింలు పోటీ చేసే అవకాశం ఉంది. నిజమైన బీసీలకు రిజర్వేషన్లు దక్కడం లేదు. బీసీ జనాభాను తగ్గించి చూపి అన్యాయం చేసిన బీఆర్ఎస్ పార్టీకి బీసీ రిజర్వేషన్లపై ఒక్కమాట కూడా మాట్లాడే హక్కులేదు. కాంగ్రెస్ పార్టీయే మాకు ప్రధాన శత్రువు. ఆ పార్టీ ప్రభుత్వ అవినీతిపై పోరాటాలు చేస్తాం. హిల్ట్ పి వెనుక ఉన్న కుంభకోణంపై కూడా పోరాటాలు చేస్తాం. 22 పరిశ్రమలకు చెందిన భూములను అన్యాక్రాంతం చేయాలని చూడటం దారుణం. గ్రేటర్ వరంగల్ను వరంగల్, హనుమకొండ జిల్లాలుగా విభజించి, 27 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేసి పారిశ్రామిక వాడలను తరలించాలని ప్రభుత్వం చూడటంపై బీజేపీ పోరాటం చేస్తుంది..’అని కిషన్రెడ్డి తెలిపారు. త్వరలోనే వరంగల్కు ప్రధాని ‘దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోంది. 40 రైల్వేస్టేషన్ల పునరుద్ధరణకు రూ.కోట్లు వెచి్చంచాం. పీఎం మిత్రకింద కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఇప్పటికే 3 కంపెనీలు అగ్రిమెంట్ చేసుకుని ముందుకెళ్తున్నాయి. కాజీపేట ఆర్ఎంయూ వచ్చే ఏడాదిలో పూర్తయ్యేలా పనులు వేగవంతం చేశాం. మామునూరు ఎయిర్పోర్టుకు భూసేకరణ తది దశకు చేరుతోంది. మామునూరు ఎయిర్పోర్టు, మెగా టెక్స్టైల్ పార్కులలో భూమిపూజ చేసేందుకు త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీని వరంగల్కు తీసుకు వస్తాం..’అని కేంద్రమంత్రి చెప్పారు. ‘మోదీ ప్రధాని అయ్యాక రూ.60 వేల కోట్ల ఎంఎస్పీ చెల్లించి పత్తి కొనుగోళ్లు చేశాం. తెలంగాణలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు గతేడాది 110 ఉంటే ఈసారి 123కు పెంచాం. దేశవ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు తెలంగాణ నుంచే అత్యధికంగా పత్తి కొనుగోళ్లు జరిగాయి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు కేంద్రమే మద్దతు ధర ఇస్తోంది..’అని కిషన్రెడ్డి తెలిపారు. పలువురు బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సీఎం మార్పు ఫిక్స్ హైకమాండ్ కీలక నిర్ణయం
-
హైకమాండ్ నిర్ణయమే.. మా నిర్ణయం
కర్ణాటక అధికార పార్టీలో నెలకొన్న కాంగ్రెస్ సంక్షోభం దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ ఉదయం స్పెషల్ బ్రేక్ఫాస్ట్తో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీ కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. అనంతరం ఇద్దరూ ప్రెస్మీట్ నిర్వహించి.. నాయకత్వ విషయంలో హైకమాండ్ నిర్ణయమే మా నిర్ణయం అంటూ ప్రకటించారు. కర్ణాటక ప్రజల మద్దతుతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. వారికిచ్చిన వాగ్దానం ప్రకారం తాను సిద్ధరామయ్యతో కలిసి పని చేస్తానని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) పేర్కొన్నారు. అయితే బ్రేక్ఫాస్ట్ భేటీలో ఏం చర్చించారనే అంశంపై మాత్రం ఇద్దరూ ఐక్య ప్రకటన చేయకపోవడం గమనార్హం.ఎలాంటి గందరగోళం లేదు. మా ఇద్దరి మధ్యా ఎలాంటి విభేదాలు లేవు. ఇక ముందు కూడా ఉండబోవు. ఏఐసీసీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచనల మేరకు తాము బ్రేక్ఫాస్ట్ భేటీలో పాల్గొన్నాం. నెల రోజుల ముందు నుంచి అందరిలో ఉన్న గందరగోళానికి తెరదించేందుకే ఈ భేటీ. బీజేపీ జేడీఎస్లు అసత్య ప్రచారానికి దిగుతున్నాయి. వాటిని మేం ఉమ్మడిగా ఎదుర్కొంటాం. 2028లో కాంగ్రెస్ గెలవడమే మా లక్ష్యం. అందుకోసం హైకమాండ్ ఏం చెప్పినా వింటాం.. అని సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) అన్నారు. ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ @DKShivakumar ಅವರ ಜೊತೆಗಿನ ಉಪಹಾರ ಹಾಗೂ ಚರ್ಚೆಯ ಬಳಿಕ ಮಾಧ್ಯಮಗೋಷ್ಠಿಯಲ್ಲಿ ನನ್ನ ಮಾತುಗಳು;ಪಕ್ಷದ ವರಿಷ್ಠರ ತೀರ್ಮಾನ, ಸೂಚನೆಯಂತೆ ನಾನು ಹಾಗೂ ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಡಿ.ಕೆ.ಶಿವಕುಮಾರ್ ನಡೆದುಕೊಳ್ಳುತ್ತೇವೆ ಎಂದು ನಾವಿಬ್ಬರೂ ತೀರ್ಮಾನಿಸಿದ್ದೇವೆ. ಸಚಿವರಾಗಲಿ, ಶಾಸಕರಾಗಲೀ ಯಾರೂ ನಮ್ಮ ಸರ್ಕಾರದ ವಿರುದ್ಧವಿಲ್ಲ.… pic.twitter.com/Uwghr50TJT— Siddaramaiah (@siddaramaiah) November 29, 2025 పార్టీకి విశ్వాసపాత్రులైన సైనికుల్లా పని చేస్తున్నాం. నాయకత్వం విషయంలోనూ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్. ఇంతకాలం పార్టీ పెద్దలు తనను వేచి ఉండాలని సూచించారు. ఇంకొంతకాలం కూడా వేచి ఉండడానికి సిద్ధం. హైకమాండ్ ఏం చెప్పినా.. దానిని అందరం అనుసరిస్తాం. ప్రస్తుతం పార్టీ పలు సమస్యలు ఎదుర్కొంటోంది. అసెంబ్లీలో సమావేశాల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై చర్చించాం. 2028లో రానున్న కర్ణాటక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం అని డిప్యూటీ సీఎం శివకుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు గురించి గత పది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల టైంలో(2023).. రెండున్నరేళ్ల తర్వాత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సీఎం బాధ్యతలు అప్పగించేలా పవర్ షేరింగ్ ఒప్పందం కుదిరిందని ప్రచారం జరిగింది. అయితే మధ్యలో ఇద్దరూ దానిని ఖండిస్తూ వచ్చారు. తాజాగా ఈ గడువు రావడం.. డీకే వర్గం అధిష్టానంపై ఒత్తిడికి ప్రయత్నించడం.. ఇటు సిద్ధూ వర్గం కూడా కౌంటర్ క్యాంపెయిన్ నడపడం, అటుపై ఇద్దరి మద్య ఎక్స్ వేదికగా వార్ వర్డ్తో కర్ణాటక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ తరుణంలో రంగంలోకి దిగిన కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరిపి పరిస్థితిని ఓ కొలిక్కి తెచ్చినట్లు స్పష్టమవుతోంది. -
కర్ణాటక సీఎం చేంజ్? రేపు ఢిల్లీకి డీకే, సిద్ధరామయ్య
-
సస్పెండైన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై లైంగిక దాడి కేసు
తిరువనంతపురం: సస్పెన్షన్కు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూట్టతిల్పై శుక్రవారం లైంగిక దాడి కేసు నమోదైంది. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటంతోపాటు బలవంతంగా గర్భస్రావంచేయించారంటూ ఆయనపై గురువారం రాత్రి ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు శుక్రవారం ఉదయం వలియమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. బాధితురాలు గురువారం సీఎం విజయన్కు ఫిర్యాదు చేయడం, ఆడియో క్లిప్పులు, ఛాట్ వివరాలు బయటపెట్టడం సంచలనం రేపింది. ఈ కేసుపై ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. -
‘జూబ్లీ’యేషన్ స్టడీతో ‘జీహెచ్ఎంసీకి’ సమాయత్తం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనుభవాలను అధికార కాంగ్రెస్ పార్టీ మదింపు చేస్తోంది. ఈ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పనిచేసిన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నేతల అభిప్రాయాల మేరకు అంతర్గత నివేదికలను సిద్ధం చేస్తోంది. దీంతో పాటు ఎన్నికల ఫలితం అనంతరం సీఎం రేవంత్రెడ్డితో జరిగిన సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు, ఇతర అంతర్గత చర్చల్లో వెల్లడైన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సమర్థంగా ఎదుర్కొనేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది.ఈ ఎన్నిక సందర్భంగా గుర్తించిన పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని జీహెచ్ఎంసీలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచించనుంది. కాంగ్రెస్ పార్టీ ‘జూబ్లీ’యేషన్ మోడల్ను గ్రేటర్ హైదరాబాద్ అంతటా అమలు చేయనుంది. ఉప ఎన్నికపై అంతర్గత నివేదికలు, చర్చల్లో వెల్లడైన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..సమష్టి కృషితోనే గెలుపు⇒ రాజకీయంగా పట్టు లేని నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడం అసాధారణమైన అంశం. ఈ ఎన్నికల్లో గెలుపునకు పార్టీ నేతల సమష్టి కృషే ప్రధాన కారణం. పార్టీ అధికారంలో ఉండడం కూడా దోహదపడింది.⇒ ఇక్కడ బీఆర్ఎస్ శక్తివంచన లేకుండా పనిచేసింది. ఆ పార్టీ కేడర్ దెబ్బతినలేదు. జూబ్లీహిల్స్లోనే కాకుండా హైదరాబాద్లోని అన్ని నియోజకవర్గాల్లో కారు పార్టీ ఇప్పటికీ పటిష్టంగానే ఉంది.⇒ ఆ పార్టీ ఎలక్షనీరింగ్ కూడా పకడ్బందీగా జరిగింది. ముఖ్యంగా కుల సంఘాలను సమావేశపర్చడం, అపార్ట్మెంట్లు, బస్తీల వారీగా పోలరైజ్ చేయడంలో క్రియాశీలంగా పనిచేసింది.బీజేపీకి స్థిరమైన ఓటు బ్యాంకు⇒ బీజేపీకి స్థిరమైన ఓటు బ్యాంకు ఉందని ఫలితాలు చెపుతున్నాయి. హైదరాబాద్లో ఎక్కడ ఎంత లూజ్గా ఉన్నా ఆ పార్టీకి 15 శాతం ఓట్లు వస్తాయి. ఈ రెండు పార్టీలకు క్షేత్రస్థాయిలో ఉన్న పట్టును దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం కావాలి.⇒ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి. హైదరాబాద్లో చాలాచోట్ల పార్టీకి కమిటీల్లేవు. కాబట్టి బూత్ స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. క్రియాశీలంగా లేని వారిని గుర్తించి వారిని పార్టీ పనిలోకి తీసుకురావాలి.⇒జూబ్లీహిల్స్లో ఎంఐఎం పరిస్థితి ఆశాజనకంగా ఏమీ లేదు. ఉప ఎన్నికల సమయంలో హైప్ అయినంతగా ముస్లిం వర్గం ఆ పార్టీతో లేదు. ముస్లిం నేతల్లో చాలామంది ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నారు.మహిళలను ఆకట్టుకోవాలి⇒ మహిళలు కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తిస్థాయి విశ్వాసం కనబర్చలేదు. వారిని ఆకట్టుకునే కార్యక్ర మాలు అమలుపర్చాలి. ఒక్క హైదరాబాద్లోనే కాదు.. రాష్ట్రమంతటా మహిళల మనసు చూరగొనేలా ప్రణాళిక రూపొందించుకోవాలి.⇒ హైడ్రాపై ప్రచారం జరుగుతున్నంత స్థాయిలో వ్యతి రేకత లేదు. హైడ్రాతో ప్రత్యక్షంగా నష్టపోయిన పేద, మధ్యతరగతి వర్గాలు చాలా తక్కువ. ఎక్కువగా బడాబాబులపై మాత్రమే హైడ్రా ప్రభావం ఉంది. 10–20 శాతానికి మించి హైడ్రాపై వ్యతిరేకత లేదు.⇒ జూబ్లీహిల్స్లో పార్టీ విజయానికి మరో ప్రధాన కారణం ఎంపిక చేసిన అభ్యర్థి. స్థానికుడైన బీసీని నిలబెట్టడం చాలా ఉపకరించింది. ఇదే వ్యూహాన్ని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అమలు చేయాలి.⇒ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత కొంతమేరకు కనిపించినా, సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన తర్వాత ప్రజల ఆలోచనలో మార్పు మొదలైంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే భావనకు ప్రజలు క్రమంగా వచ్చారు.⇒ మొత్తంమీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కారణంగా సిటీ ఓటరు నాడిని పట్టుకోగలిగాం. వీరికి పార్టీల కన్నా వారి సమస్యలు, వారి పరిసరాల్లో ఉండే వాతా వరణం, ప్రభుత్వ పనితీరు లాంటివి ముఖ్యమన్నది అర్థమైంది. -
మెత్తబడ్డ డీకే శివకుమార్!.. కీలక వ్యాఖ్యలు
కర్ణాటక పవర్ పాలిటిక్స్లో పూటకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఐదేళ్లు తానే సీఎంనంటూ సిద్ధరామయ్య.. అధిష్టానం తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ ఇటు డీకే శివకుమార్లు పోటాపోటీగా ప్రచారాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఈ పంచాయితీ ఢిల్లీకి రేపోమాపో షిఫ్ట్ అవుతుందనే ప్రచారం ఇవాళ జోరుకుంది. అయితే ఈలోపే..కర్ణాటక రాజకీయం మరో మలుపు తిరిగింది. పదవీ త్యాగం నేపథ్యంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 2004లో అధికారాన్ని త్యాగం చేశారు. తనకు బదులుగా మన్మోహన్ సింగ్ను ప్రధానిని చేశారు’’ అని అన్నారాయన.కర్ణాటకలో అధికార పంపిణీపై ఊహాగానాల వేళ ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ వ్యాఖ్యల ఆంతర్యం ఏంటనే విశ్లేషణ అక్కడ నడుస్తోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ రంగంలోకి దిగి కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభం మరింత ముదరకుండా మంతనాలు జరుపుతున్నారు. సీఎం మార్పు నిర్ణయాన్ని ఇక సోనియా గాంధీకే వదిలేసినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంతో అధిష్టానంతో చర్చించేందుకు రెండ్రోజుల్లో ఢిల్లీకి సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు వెళ్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈలోపు రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ కర్ణాటక పరిణామాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘హైకమాండ్ పిలిస్తే కచ్చితంగా ఢిల్లీ వెళ్తా. అధిష్టాన నిర్ణయమే నాకు ఫైనల్. ఏ విషయంలోనూ నాకు తొందరలేదు’’ అని అన్నారు. మరోవైపు.. డీకే శివకుమార్తో ఉన్న ఫొటోను సిద్ధరామయ్య షేర్ చేయడంతో ఈ కథ సుఖాంతం అయ్యిందా? అనే చర్చ జోరందుకుంది.ಶಕ್ತಿ ಮತ್ತು ಗೃಹಲಕ್ಷ್ಮಿ ಯೋಜನೆ ಜಾರಿಯಾದ ಮೇಲೆ ತಲಾ ಆದಾಯದಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ದೇಶದಲ್ಲಿಯೇ ಮೊದಲ ಸ್ಥಾನದಲ್ಲಿದೆ. ಐಸಿಡಿಎಸ್ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಪರಿಣಾಮಕಾರಿಯಾಗಿ ಜಾರಿ ಮಾಡಿರುವ ರಾಜ್ಯಗಳಲ್ಲಿ ದೇಶದಲ್ಲಿಯೇ ಕರ್ನಾಟಕ ಮೊದಲನೇ ಸ್ಥಾನದಲ್ಲಿದೆ. ಶಕ್ತಿ ಯೋಜನೆ ಜಾರಿಯಾದ ಮೇಲೆ ಉದ್ಯೋಗಕ್ಕೆ ಹೋಗುವ ಮಹಿಳೆಯರ ಪಾಲು ಶೇ 23% ಇದ್ದರೆ, ಗ್ರಾಮೀಣ… pic.twitter.com/Hq9iz8BvvG— Siddaramaiah (@siddaramaiah) November 28, 2025 -
సీఎం చేంజ్! ఢిల్లీలో అధిష్ఠానం పెద్దల కీలక సమావేశం
-
వార్డు మెంబర్గా ఓడి.. ఎమ్మెల్యే, మంత్రిగా..
మోర్తాడ్(బాల్కొండ): సొంత గ్రామానికి సర్పంచ్గా ఎంపిక కాలేకపోయినా ఆర్మూర్ నియోజకవర్గానికి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, వివిధ శాఖలకు మంత్రిగా, ఒకసారి జడ్పీ చైర్మన్గా ఎంపికైన శనిగరం సంతోష్రెడ్డి విశేషమైన గుర్తింపును తెచ్చుకున్నారు. భీమ్గల్ మండలం ముచ్కూర్కు చెందిన సంతోష్ రెడ్డి 1971లో సర్పంచ్గా ఎంపిక కావాలనే ఉద్దేశ్యంతో వార్డు స్థానానికి పోటీ చేశారు. అప్పట్లో వార్డు సభ్యునిగా ఎంపికైన వారే మెజార్టీ సభ్యుల మద్దతుతో సర్పంచ్ పదవిని పొందేవారు. అలా వార్డు సభ్యునిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. గ్రామ రాజకీయాలు కలిసి రాకపోవడంతో ఇందిరా కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలక నేతగా గుర్తింపు పొంది 1978లో తొలిసారి ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983, 1989లో మరోసారి ఎమ్మెల్యేగా ఎంపికై ఆర్థిక శాఖ, రోడ్లు భవనాలు, భారీ పరిశ్రమల శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2002లో భీమ్గల్ జడ్పీటీసీగా గెలిచి బీఆర్ఎస్ తరఫున జిల్లా పరిషత్ చైర్మన్గా ఎంపికయ్యారు. 2004లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా కొన్ని నెలలపాటు పనిచేశారు. -
అప్పుడు సర్పంచ్.. ఇప్పుడు లెక్చరర్
నల్గొండ జిల్లా: నార్కెట్పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన సోమనబోయిన ధనలక్ష్మి 2007లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్గా గెలుపొందారు. సర్పంచ్గా కొనసాగుతూనే 2009–2010లో బీఈడీ, 2010– 2012లో పీజీ పూర్తి చేశారు. ప్రస్తుతం నకిరేకల్ మండలం చందుపట్ల గురుకుల జూనియర్ కళాశాలలో తెలుగు «అధ్యాపకురాలిగా కొనసాగుతున్నారు. ధనలక్ష్మి సర్పంచ్ గా ఉన్న సమయంలో బ్రాహ్మణ వెల్లంల గ్రామ పంచాయతీ 2007–2008 నిర్మల్ పురస్కారానికి ఎంపికైంది. ఓటు వేయాలంటే దూరం నడవాల్సిందేగట్టుప్పల్ : గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గిరిజన తండాలకు చెందిన ఓటర్లకు ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు దూరభారం తప్పడం లేదు. అంతంపేట గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్కు రంగంతండా సుమారు 1.5 కిలోమీటర్లు, అజనాతండా 3 కిలోమీటర్లకు పైగా, దేవులతండా 0.5 కిలోమీటర్లు, రాగ్యాతండా 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఈ నాలుగు తండాల్లో సుమారు 650మంది ఓటర్లు ఉన్నారు. ఆయా తండాల ప్రజలు ఏళ్లుగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అంతంపేటకు వస్తున్నారు. దీంతో వృద్ధులు, అంగవైకల్యం కల్గిన వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో కూడా అంతంపేట ప్రాథమిక పాఠశాలలోనే పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు మండల పంచాయతీ అధికారి సునీత తెలిపారు. -
క్లైమాక్స్కు చేరిన కర్ణాటకం!
సాక్షి, బెంగళూరు/శివాజీనగర: కర్ణాటక రాజకీయం క్లైమాక్స్కు చేరింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ అనుకూల వర్గాల వరుస భేటీలు, రహస్య మంతనాలు, మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల నేపథ్యంలో అధిష్టానం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. రాహుల్ గాంధీ జోక్యంతో కర్ణాటక రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తిరుగుబాటు ధోరణిపై రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు పార్టీలోని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.ఆయా అంశాలు ముఖ్యమంత్రి పీఠంపై కొనసాగడానికి సంబంధించి సిద్ధరామయ్యకు ఇబ్బందికరంగా పరిణమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వెరసి ఈ పరిణామాలు ముఖ్యమంత్రి రేసులో డీకే శివకుమార్కు అనుకూలంగా మారుతున్నట్లు కూడా పరిశీలకులు భావిస్తున్నారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం సిద్ధరామయ్యపై రాహుల్ అసహనానికి కారణాలను విశ్లేషిస్తే... అధిష్టానం ఎవరనే చర్చకు తావిచ్చిన సీఎం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై మీ సమస్యలు, విజ్ఞప్తులు ఏమైనా ఉంటే ఆయనకు తెలియజేయాలని సిద్ధరామయ్యకు రాహుల్ గాంధీ గడచిన వారాంతంలో సూచించారు. అయితే ఖర్గేను సిద్ధరామయ్య కలుసుకున్నప్పటికీ.. తాను రాహుల్తో మాత్రమే చర్చిస్తానని, నేరుగా అధిష్టానంతో తేల్చుకుంటానని చెప్పినట్లు సమాచారం. బహుషా ఈ కారణంతోనే మీడియాతో ఖర్గే మాట్లాడుతూ అధికార మారి్పడి విషయం పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని వ్యాఖ్యలు చేసి ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడే ‘పార్టీ హైకమాండ్’ ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరనే ప్రశ్న ఉత్పన్నం అయ్యింది. ఖర్గే ఈ ‘అసహాయ వ్యాఖ్యలు’ చర్చనీయాంశమయ్యాయి. దీనంతటికీ సిద్ధరామయ్య తిరుగుబాటు ధోరణే కారణమని రాహుల్ భావిస్తున్నారు. ఇక ప్రభుత్వ వ్యవహారాల్లో సీఎం కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య జోక్యం చేసుకుంటున్నట్లు నివేదికల అందడం రాహుల్ అసహనానికి మరొక కారణం. దేవరాజు అరస్ రికార్డును అధిగమించిన తర్వాత రాజీనామా? మరోవైపు ముఖ్యమంత్రి స్థానం వదులుకునేందుకు సిద్ధరామయ్య కూడా మానసికంగా సిద్ధంగా ఉన్నారని ఆయన వర్గానికి చెందిన కొందరు మంత్రులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఒత్తిడి ఎక్కువయితే ఫిబ్రవరి, మార్చి మొదటి వారంలో వచ్చే బడ్జెట్ను ప్రవేశపెట్టి తప్పుకునే అవకాశం ఉందని మాట్లాడుకుంటున్నారు. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన దేవరాజు అరస్ రికార్డును సిద్ధరామయ్య డిసెంబర్లో అధిగమిస్తారు. దీంతో అప్పటివరకు ముఖ్యమంత్రిగా పని చేసి అనంతరం తన పదవికి రాజీనామా చేసే అవకాశం కూడా ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హైకమాండ్ అంటే అదొక బృందం: ఖర్గే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితోపాటు మరో ముగ్గురు నలుగురు కీలక నాయకులను ఢిల్లీకి పిలిపించుకుని చర్చించి అన్నింటికి పరిష్కారం చూపుతామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం బెంగళూరులో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అంటే ఒకే ఒక్కరు కాదని, అదొక బృందమని, పార్టీ పెద్దలంతా కలసికట్టుగా కూర్చొని మాట్లాడుకుని రాష్ట్ర సమస్యకు పరిష్కారాన్ని తీసుకొస్తామన్నారు. సోనియాగాంధీ శుక్రవారం విదేశాల నుంచి వచ్చాక ఈ సమస్య పరిష్కారం ఒక కొలిక్కి వచ్చే వీలుంది.సీఎం, డిప్యూటీ సీఎం ‘ట్వీట్ల’ యుద్ధం!కర్ణాటక పరిణామాలు తాజాగా ‘ట్వీట్ల’ రాజకీయానికి దారితీశాయి. డిప్యూటీ సీఎం చేసినట్లు చెబుతున్న ఒక ట్వీట్కు కౌంటర్గా అన్నట్లు సీఎం మరో ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే ప్రపంచంలో పెద్ద శక్తి’ (వర్డ్ పవర్ ఈజ్ వరల్డ్ పవర్) అని డీకే శివకుమార్ ‘ట్వీట్’ చేశారు. రెండున్నరేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన మాటను డీకే ‘ఈ ట్వీట్ ద్వారా’ గుర్తు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఆ ట్వీట్ తాను చేయలేదని, అదొక నకిలీ పోస్టు అని డీకే శివకుమార్ కొట్టిపారేశారు. కాగా ‘ప్రజల కోసం మంచి ప్రపంచం నిరి్మంచలేనప్పుడు ఆ మాటకు శక్తి లేనట్లే’ అని అర్థం వచ్చేలా సీఎం ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పు ఐదేళ్ల పరిపూర్ణ బాధ్యత అని పేర్కొంటూ ప్రభుత్వ చేపట్టిన పలు పథకాలను వివరించారు. కర్ణాటక అనేది ఒక నినాదం కాదని, అది మాకు ఒక ప్రపంచమని ట్వీట్ చేశారు. -
డీకే శివకుమార్కు సిద్ధరామయ్య డైరెక్ట్ కౌంటర్
కర్ణాటకలో నాయకత్వ మార్పు ఎపిసోడ్ రసవత్తరంగా తయారైంది. డీకే, సిద్ధరామయ్య మధ్య నేరుగా ‘మాట’ల యుద్ధం మొదలైంది. డీకే శివకుమార్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేలా సీఎం సిద్దరామయ్య చేసిన ట్వీట్ పరిస్థితి తీవ్రతను అద్దం పడుతోంది. సీఎం మార్పు ఊహాగానాల వేళ అగ్రనేతల పోరు తారస్థాయికి చేరింది. ఇంతకాలం గప్చుప్గా ఉంటూ తమ వర్గీయులను ముందుంచిన సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు నేరుగా రంగంలోకి దిగారు. ఒకవైపు మీడియా మైకుల ముందు మాటలు.. ఇంకోవైపు సోషల్ మీడియా పోస్ట్లతో కర్ణాటక పాలిటిక్స్ను హీటెక్కిస్తున్నారు. ‘‘కన్నడ ప్రజలు మాకిచ్చిన తీర్పు కేవలం ఒక క్షణం కోసం కాదు.. అది ఐదేళ్ల పూర్తి బాధ్యత. నాతో సహా కాంగ్రెస్ పార్టీ మా ప్రజలకు ఇచ్చిన మాటలను చేతల్లో చేసి చూపిస్తున్నాం. కన్నడ ప్రజలకు మేం ఇచ్చిన ‘మాట’ కేవలం ఒక నినాదం కాదు.. అదే మాకు ‘ప్రపంచం’ అంటూ.. సీఎం సిద్ధరామయ్య ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. A Word is not power unless it betters the World for the people.Proud to declare that the Shakti scheme has delivered over 600 crore free trips to the women of our state. From the very first month of forming the government, we transformed our guarantees into action; not in… pic.twitter.com/lke1J7MnbD— Siddaramaiah (@siddaramaiah) November 27, 2025మాట (Word) నిలబెట్టుకోవడం కంటే గొప్ప విషయం ప్రపంచంలో మరోకటి లేదు అనే అర్థం వచ్చేలా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గురువారం ఉదయం ఎక్స్లో ఓ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. సిద్ధరామయ్య ట్వీట్ డీకే శివకుమార్కు కౌంటర్లా ఉండడం గమనార్హం. ಕೊಟ್ಟ ಮಾತು ಉಳಿಸಿಕೊಳ್ಳುವುದೇ ವಿಶ್ವದಲ್ಲಿರುವ ದೊಡ್ಡ ಶಕ್ತಿ! pic.twitter.com/klregNRUtv— DK Shivakumar (@DKShivakumar) November 27, 2025కర్ణాటకలో నవంబర్ 20వ తేదీతో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల అధికారం పూర్తి చేసుకుంది. అయితే, అధికారం చేపట్టే సమయంలో రెండున్నరేళ్ల తర్వాత సీఎం మార్పునకు సిద్ధరామయ్య, డీకే మధ్య ఒప్పందం కుదిరిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మధ్యలో ఈ ప్రచారం తెరపైకి వచ్చినా.. అలాంటిదేం లేదంటూ ఇద్దరూ ఖండించారు కూడా. తీరా టైం రావడంతో ఇప్పుడు సీటును నిలబెట్టుకునేందుకు సిద్ధరామయ్య, తాను సీఎం పీఠం మీద కూర్చునేందుకు డీకే శివకుమార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ పరిణామం ప్రభుత్వం కుప్పకూల్చే అవకాశం ఉండడంతో హైకమాండ్ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. -
KTR : కాళేశ్వరంలో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది
-
సిద్ధూ, డీకేలతో మాట్లాడతాం: ఖర్గే
సాక్షి బెంగళూరు: కర్ణాటక సీఎం వివాదంపై ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించింది. త్వరలోనే ఈ ప్రతిష్ఠంభనకు ముగింపు పలకబోతున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. త్వరలోనే పార్టీ అగ్రనేతలతో కలిసి సమావేశం నిర్వహిస్తామని ఆ మీటింగ్లో ఈ వివాదానికి ముగింపు పలుకుతామని ఖర్గే పేర్కొన్నారు.కర్ణాటకలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి పదవి కాపాడడం కోసం సిద్దరామయ్య, ఎలాగైనా సీఎం పదవి చేపట్టాలని డీకే శివకూమార్ ఇద్దరు నేతలు భీష్మించుకు కూర్చొన్నారు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ ఇటీవల వ్యాఖ్యానించడంతో కేంద్రం ఆయనను సీఎం చేస్తానని హామి ఇచ్చిందని దానికోసమే అలా మాట్లాడారని అంతా అనుకున్నారు. ఈ వరుస ఘటనలతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. అయితే తాజాగా ఆ రాష్ట్ర వ్యవహారంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. ఆయన మాట్లాడుతూ "త్వరలోనే కర్ణాటకలో జరుగుతున్న వివాదానికి ముగింపు పలుకుతాం. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇతర నాయకులతో కలిసి సమావేశం నిర్వహిస్తాం. ఆ మీటింగ్ కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీ.కే శివకుమార్ను కూడా పిలిచి వారితో చర్చిస్తాం" అని ఖర్గే తెలిపారు.ఇటీవల ఒక కార్యక్రమంలో శివకుమార్ మాట్లాడుతూ మాటకున్న శక్తి ప్రపంచంలోనే అత్యంత గొప్పదని, వాగ్దానం నిలబెట్టుకోవడం అనేది అతిపెద్ద చర్య అని అన్నారు. దీంతో సీఎం పదవినుద్దేశించే తాను మాట్లాడారని చర్చ జరిగింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ‘అంతిమంగా నిర్ణయం తీసుకునేది హైకమాండ్ఈ గందరగోళానికి పూర్తి ముగింపు పలకడానికి, హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి అని అన్నారుపవర్ షేరింగ్ ఏంటంటే..2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీ.కే శివకుమార్ చెరో రెండున్నరేళ్లు సీఎంగా ఉండనున్నట్లు అధిష్ఠానం నిర్ణయించిందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20 తారీఖుతో రెండున్నరేళ్ల కాలం ముగిసింది. దీంతో సీఎం మార్పు వ్యవహారం మళ్లీ తెరమీదకొచ్చింది. -
డీకేకి చాన్స్ ఇస్తే.. సిద్ధరామయ్య ప్లాన్ ఏంటి?
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అటు సీఎం సిద్ధరామయ్య, ఇటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టడంతో కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఒక వేళ కాంగ్రెస్ అధిష్టానం డీకేను ప్రమోట్ చేయాలనుకుంటే సిద్ధరామయ్య ‘ ప్లాన్’ ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది.సిద్ధరామయ్యే పూర్తికాలం సీఎంగా ఉంటారని డీకే శివకుమార్,ఐదేళ్లు తానే సీఎంనని సిద్ధరామయ్య ప్రకటించినప్పటికీ ఇది అంత తేలిగ్గా పరిష్కారమవుతుందా అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జోక్యం తరువాత అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను, సిద్ధరామయ్య కట్టుబడి ఉండాలని ప్రకటించి నప్పటికీ ఈ పొలిటికల్ డ్రామాకు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు.ఒక వేళ ఉప ముఖ్యమంత్రి డీకేను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే, సిద్ధరామయ్య శిబిరం ఆయన్ను పదవిలో కొనసాగించాలని ఒత్తిడి తీసుకురావడానికి సకల అస్త్రాలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బహిరంగంగా డీకే వైపే మొగ్గుచూపుతున్నారని సిద్ధరామయ్య మద్దతుదారులు భావిస్తున్నారు. ఇదే జరిగితే నిరసనకు సిద్ధంగా ఉన్నారు.పార్టీ ఇంకా కొత్త ముఖ్యమంత్రి కోసం పట్టుబడుతుంటే, వారికి ప్రత్యామ్నాయ జాబితాను అందజేయ నున్నారట. అందులో ఒకటి సిద్ధరామయ్య మద్దతుదారుడు, దళిత నాయకుడు హోంమంత్రి జి. పరమేశ్వర కావచ్చని అంచనా. ఈ సందర్భంగా తానెప్పుడూ ముఖ్యమంత్రి రేసులో ఉన్నానన్న వ్యాఖ్యలు గమనించ దగ్గవి. దీనిపై సిద్ధరామయ్య విధేయుడు, పిడబ్ల్యుడి మంత్రి సతీష్ జార్కిహోలి నేతృత్వంలో బుధవారం జరిగిన సమావేశంలో చర్చకు వచ్చినట్టు సమాచారం. మరోవైపు ఖర్గే, గాంధీలో డిసెంబరు 1 నాటికి దీనిపై ఒక నిర్ణయం ప్రకటించవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.ఎవరి పంతం నెగ్గుతుంది?మరోవైపు సిద్ధరామయ్య తన అధికారాన్ని మరింత బలపర్చుకునేందుంకు తన మంత్రివ ర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని కూడా యోచిస్తున్నారట. ఆయన ఎమ్మెల్యేల మద్దతు ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉంది. ఈ నేపథ్యంలోసిద్ధరామయ్య గెలుస్తారా లేదా డికె శివకుమార్ తను కోరుకున్నది సాధిస్తారా? 2028లో తదుపరి ఎన్నికల వరకూ దీన్ని సర్దు బాటు చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.కాగా 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించినప్పటి నుండి అత్యున్నత పదవి కోసం సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలని అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పందం చేసింది. ప్రస్తుతం, ఈ సమయం అయిపోవడంతో డీకే వర్గం నాయకత్వ మార్పు గురించి కాంగ్రెస్ అధిష్టానంపై పట్టు పెంచుతోంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఈ ఉత్కంఠకు ఎలా తెరదించుతుందో వేచి చూడాలి. -
కర్ణాటక: డిసెంబర్ ఒకటి లోగా కొత్త సీఎం?
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం అటు సిద్ధరామయ్య, ఇటు డీకే శివకుమార్ మధ్య నెలకొన్న వివాదం కీలక దశకు చేరింది. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ హైకమాండ్కు పరోక్ష హెచ్చరికలా మారాయి. ఒక కార్యక్రమంలో శివకుమార్ మాట్లాడుతూ మాటకున్న శక్తి ప్రపంచంలోనే అత్యంత గొప్పదని, వాగ్దానం నిలబెట్టుకోవడం అనేది అతిపెద్ద చర్య అని అన్నారు.ఈ వ్యాఖ్యలపై శివకుమార్ వర్గం తన అభిప్రాయం వెల్లడించింది. సీఎం పదవిని మార్చేందుకు గతంలో హైకమాండ్ ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేశారని శివకుమార్ వర్గం చెబుతోంది. ఈ పరిణామాలు కర్ణాటక రాజకీయాల్లో అధికార మార్పు జరగనుందనే ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. శివకుమార్ శిబిరం నాయకత్వ మార్పు కోసం గట్టిగా పట్టుబడుతోంది. 2023 ఎన్నికల విజయం తరువాత సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే నాడు హైకమాండ్ రొటేషన్ సీఎం పోస్టుకు అంగీకరించిందని శివకుమార్ మద్దతుదారులు చెబుతున్నారు.అయితే సిద్ధరామయ్య బృందం ఈ వాదనను తోసిపుచ్చింది. మరోవైపు గత రెండు వారాలుగా శివకుమార్ మద్దతుదారులోని పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీ పర్యటనలు చేయడం ఈ అధికార మార్పు చర్చలను మరింత పెంచింది. ఈ వివాదంపై వస్తున్న నివేదికల ప్రకారం కాంగ్రెస్ హైకమాండ్ త్వరలోనే ఈ ప్రతిష్టంభనకు ముగింపు పలకాలని యోచిస్తోంది. డిసెంబర్ ఒకటి లోపు కర్ణాటకలో నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ అంశంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ తాను, రాహుల్, సోనియా కలిసి ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఈ సమస్యపై తుది నిర్ణయం హైకమాండ్దేనని అంగీకరించారు. ‘అంతిమంగా నిర్ణయం తీసుకునేది హైకమాండ్... ఈ గందరగోళానికి పూర్తి ముగింపు పలకడానికి, హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి’ అని ఆయన అన్నారు. మరోవైపు డీకే శివకుమార్.. ‘పార్టీకి ఇబ్బంది కలిగించడం లేదా బలహీనపరచడం తనకు ఇష్టం లేదని అన్నారు. అయితే డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యల దరిమిలా డిసెంబర్ ఒకటి గడువులోగా అధికార మార్పు జరగవచ్చనే ఊహాగానాలు కర్ణాటక రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: అమెరికా: వీడని తుపాకీ హింస.. -
రాజ్యాంగంపై నిరంతరం దాడి
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంపై బీజేపీ–ఆర్ఎస్ఎస్ నిరంతరం దాడి చేస్తూ దాని ఔన్నత్యాన్ని దెబ్బతీయడానికి కుట్రలు సాగిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. రాజ్యాంగ విలువలు, సూత్రాలను ఒక పద్ధతి ప్రకారం కాలరాస్తున్నాయని, సమాఖ్య స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగం రూపకల్పనలో బీజేపీ–ఆర్ఎస్ఎస్లకు ఎలాంటి పాత్ర లేదని ఖర్గే బుధవారం ‘ఎక్స్’లో తేల్చిచెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని, రాజ్యాంగాన్ని అవమానిస్తోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని అణచివేసే బాధ్యతను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ముందుకు తీసుకెళ్తున్నారని ఆక్షేపించారు. మరోవైపు అగ్రనేత రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. రాజ్యాంగం అనేది పేదలకు ఒక రక్షణ కవచమని పేర్కొన్నారు. రాజ్యాంగంపై దాడిని సహించబోమంటూ ప్రతిజ్ఞ చేయాలని ప్రజలను కోరారు. ఈ దాడిని ఎదుర్కోవడానికి తాను ఎల్లప్పుడూ ముందంజలో ఉంటానని స్పష్టంచేశారు. రాజ్యాంగం అంటే ఒక పుస్తకం కాదని, అది ప్రజలకు ఇచ్చిన పవిత్రమైన హామీ అని ఉద్ఘాటించారు. ప్రజలందరికీ ఎలాంటి వివక్ష లేకుండా సమానత్వం, గౌరవం, న్యాయం చేకూర్చడమే రాజ్యాంగం ఇస్తున్న హామీ అని వెల్లడించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటకలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, సిద్ధరామయ్య పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని తేల్చిచెప్పారు. -
డీసీసీలపై అసంతృప్తి!
జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల ఎంపిక వ్యవహారం అధికార కాంగ్రెస్లో కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. కొన్ని చోట్ల మంత్రుల సిఫారసుల మేరకు డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేయగా, మరికొన్ని చోట్ల మంత్రుల సిఫారసులను అధిష్టానం పట్టించుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో కొందరు ఎమ్మెల్యేల మాట చెల్లుబాటు కాగా, మరికొన్ని చోట్ల పట్టించుకోలేదని ఈ నియామకాలు చెబుతున్నాయి. అయితే, తనకు అనుకూలంగా ఉండే ఎమ్మెల్యేలు, వారి అనుచరులకు డీసీసీ పదవులు ఇప్పించుకోవడంలో సీఎం రేవంత్రెడ్డి చాకచక్యంగా వ్యవహరించారని, కీలక మంత్రులైన భట్టి, ఉత్తమ్, పొంగులేటి లాంటి వారి మాటలు కూడా చెల్లుబాటు కావడం, కొన్నిచోట్ల సామాజిక న్యాయం పేరుతో కొందరు నేతలను ఎంపిక చేయగా, విప్గా ఉన్న ఎమ్మెల్యేకే డీసీసీ బాధ్యతలిచ్చారు. అయితే డీసీసీలను భవిష్యత్లో క్రియాశీలం చేయాలని భావిస్తున్న అధిష్టానం ఈ పదవుల కోసం తీవ్ర కసరత్తు చేసింది. ఏకంగా ఏఐసీసీ నుంచి వేరే రాష్ట్రాలకు చెందిన నేతలను పరిశీలకులుగా పంపింది. వారి సమక్షంలోనే బహిరంగ సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ జరిపింది. ఆ తర్వాత ఏఐసీసీ పరిశీలకులు పంపిన పేర్లను షార్ట్లిస్ట్ చేసింది. ఈ షార్ట్లిస్ట్ పేర్లపై మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంది. సీఎం రేవంత్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్లను ఢిల్లీకి పిలిపించి చర్చించింది. ఆ తర్వాత డీసీసీ అధ్యక్షులను ప్రకటించింది. ఇంత కసరత్తు జరిగినా డీసీసీ నియామకాల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వీరి నాయకత్వంలో అభ్యర్థుల ఎంపిక ఎలా ఉంటుందోననే ఆందోళన కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. » మహబూబ్నగర్ డీసీసీ పదవి ఈసారి కూడా తనకే వస్తుందని ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి ధీమాగా ఉన్నారు. కానీ సంజీవ్ ముదిరాజ్ను నియమించడంతో జి.మధుసూదన్రెడ్డి, ఆయన అనుచరుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వనపర్తి డీసీసీ అధ్యక్షుడిగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డిని నియమించడంపై ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి నారాజ్లో ఉన్నట్టు తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి లేకుండానే మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయానికి మేఘారెడ్డి భూమి పూజ చేయడం గమనార్హం. » నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా కాటిపల్లి నగేశ్రెడ్డి ఎంపికపై నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఆయన తన నియోజకవర్గానికి చెందిన బాడ్సి శేఖర్గౌడ్ కోసం ప్రయత్నం చేశారు. కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జుర్జున్ కోసం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పట్టుబట్టి సాధించారు. మల్లికార్జున్ లక్ష్మీకాంతారావు అనుచరుడు. అయితే ఇప్పటివరకు వరుసగా రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఉన్న కైలాస్ శ్రీనివాస్రావును మరోసారి కొనసాగించేందుకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గట్టి ప్రయత్నం చేసినా అది సఫలం కాలేదు. » ఉమ్మడి నల్లగొండ జిల్లా విషయానికొస్తే.. సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అనుకూల వ్యక్తిని డీసీసీ అ«ధ్యక్షునిగా నియమించారు. నల్లగొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సిఫారసుకు వ్యతిరేకంగా డీసీసీ అధ్యక్షున్ని నియమించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం తాను సిఫారసు చేసిన వ్యక్తికి ఇవ్వకపోయినా, కొత్తగా నియమించిన అధ్యక్షుని విషయంలో మంత్రికి వ్యతిరేకత కూడా లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. » ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు వర్గానికి చెక్ పెట్టేందుకు డీసీసీ అధ్యక్షుడిగా మంత్రి గడ్డం వివేక్, ఎమ్మెల్యే వినోద్ సన్నిహితుడిని ఎంపిక చేశారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కుమురంభీం ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న విశ్వప్రసాద్రావు, సీనియర్లను పక్కనబెట్టి కొత్తగా ఆత్రం సుగణకు అవకాశం ఇచ్చారు. ఆమె 2024లో పార్టీలో చేరింది. సుగుణకు ఉన్నతస్థాయిలో ఉన్న అండదండలతో స్థానికులను పట్టించుకోలేదనే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా నరేశ్జాదవ్ను ఎంపిక చేయగా, పార్టీలో రెడ్డి వర్గం నుంచి పలువురు నాయకులు పోటీ పడి నిరాశ చెందారు. » సంగారెడ్డి డీసీసీ కోసం 46 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో జహీరాబాద్కు చెందిన ఉజ్వల్రెడ్డి, నారాయణఖేడ్కు చెందిన చంద్రశేఖర్రెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహరెడ్డిల పేర్లను ప్రముఖంగా తీసుకున్నారు. కానీ అధినాయకత్వం సంగారెడ్డి డీసీసీ నియామకాన్ని పెండింగ్లో పెట్టింది. కాగా జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితోపాటు, మరికొందరు ముఖ్యనాయకులు ఉజ్వల్రెడ్డి వైపు మొగ్గు చూపగా, జహీరాబాద్ ఎంపీ సురేశ్òÙట్కార్ వర్గం వ్యతిరేకించినట్టు తెలుస్తోంది.సమన్వయం కుదరకపోవడంతో అధిష్టానం ఈ పదవిని పెండింగ్లో పెట్టింది. » రంగారెడ్డి డీసీసీ పదవి కోసం 43 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్థానికేతరుడికి డీసీసీ పీఠాన్ని కట్టబెడుతున్నారనే ప్రచారంతో 15 మంది ఆశావహులు ఇటీవల ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. డీసీసీని ప్రకటించకపోవడానికి ఇదే ప్రధాన కారణమని తెలుస్తోంది. » వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ అయూబ్కు అనూహ్యంగా దక్కింది. కొండా దంపతులు గోపాల నవీన్రాజ్, మీసాల ప్రకాశ్ పేర్లు సూచించగా, రెండో వర్గం తాజా మాజీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పేరు సిఫారసు చేశారు. ఇరువర్గాలకు కాకుండా మహ్మద్ అయూబ్కు ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష పదవి మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు ఆశించగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తన అనుచరుడు బట్టు కర్ణాకర్ ఇప్పించుకున్నారన్న చర్చ ఉంది. – సాక్షి నెట్వర్క్ -
రూ.50 వేల కోట్ల పవర్ స్కామ్
సాక్షి, హైదరాబాద్: పదేళ్లపాటు అన్ని వర్గాల సంక్షేమానికి చిరునామాగా ఉన్న తెలంగాణను రేవంత్రెడ్డి ప్రభుత్వం భారీ కుంభకోణాలకు కేంద్రంగా మార్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. రూ.50 వేల కోట్ల అతి పెద్ద పవర్ స్కామ్కు రూపకల్పన చేసి 30 నుంచి 40శాతం కమీషన్లు దండుకునేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు.రామగుండం, పాల్వంచ, మక్తల్లో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ల పేరిట రూ.15 వేల నుంచి రూ.20 వేల కోట్ల «అంచనాలు పెంచి భారీ స్కామ్కు పాల్పడుతోందని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వం ప్రతీ చర్య వెనుకా ‘కమీషన్’అనే మిషన్ దాగుంటుందని ఎద్దేవా చేశారు. హరీశ్రావు బుధవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్తో కలిసి మీడియాతో మాట్లాడారు.థర్మల్ పవర్ ప్లాంట్ల పేరిట బడా స్కామ్ ‘రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంటు నిర్మాణానికి ఎన్టీపీసీ, జెన్కోలో తక్కువ రేటుతో ముందుకు వచ్చే వారికి అవకాశమిస్తామని చెప్పడం పెద్ద డ్రామా. ఒక మెగావాట్ ఉత్పత్తికి ఎన్టీపీసీకి రూ.12.23 కోట్లు, జెన్కోకు రూ.14 కోట్లు అవుతుందని ఇప్పటికే డీపీఆర్లు ఇచ్చాయి. గతంలో యాదాద్రి ప్లాంటును రూ.8.63 కోట్లు, భద్రాద్రి పవర్ ప్లాంట్ను రూ.9.74 కోట్లకే నిర్మించాం. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం ఒక్కో మెగావాట్ ఉత్పత్తికి రూ.14 కోట్లు పెట్టేందుకు సిద్ధమవుతోంది. గతంలో యూనిట్ విద్యుత్కు రూ.5 వెచి్చంచడాన్ని తప్పుపట్టిన రేవంత్.. ఇప్పుడు రూ.8 నుంచి రూ.10 ఖర్చు చేసేందుకు సిద్దమవుతున్నాడు.800 మెగావాట్ల ఒక్కో ప్లాంటు నిర్మాణ వ్యయం రూ.10,880 కోట్లు కాస్తా పూర్తయ్యే నాటికి రూ.15 వేల కోట్లకు చేరుతుంది. అదే జరిగితే యూనిట్ విద్యుత్ వ్యయం రూ.10కి పెరుగుతుంది. మూడు 800 మెగావాట్ల సామర్ద్యం కలిగిన యూనిట్లకు రూ.50 వేల కోట్లు ఖర్చు అయితే అందులో 80 శాతం అప్పు, మరో 20శాతం జెన్కో ఖర్చు చేస్తుంది. చెప్పులు ఎత్తుకుపోయే వారికి రూ.40వేల కోట్ల అప్పు, రూ.10వేల కోట్ల పెట్టుబడి ఎలా వస్తాయో చెప్పాలి. ఎన్టీపీసీ నుంచి యూనిట్ ధర రూ.4.88 నుంచి రూ.5.96 వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. ఎన్టీపీసీ 2400 మెగావాట్లు విద్యుత్ను యూనిట్కు రూ.4.12లకు సరఫరా చేస్తామని చెప్తున్నా ప్రభుత్వం తిరస్కరించింది’అని హరీశ్రావు పేర్కొన్నారు. యాదాద్రి వపర్ ప్లాంట్ను తాము అధికారంలోకి వస్తే మూసేస్తామన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. ఇప్పుడు కొత్త థర్మల్ కేంద్రాలకు కేబినెట్లో ఆమోదం తెలిపితే.. ఎందుకు నోరుమెదపలేదని ప్రశ్నించారు. బీజేపీ డైరెక్షన్లో రేవంత్ యాక్షన్ ‘లాభాలు తెచ్చే విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కమ్)లను ప్రైవేటీకరణ చేసి కమీషన్లు దండుకునే కుట్రకు రేవంత్ తెరలేపాడు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ డైరెక్షన్లోనే రేవంత్ యాక్షన్ చేస్తుండు. రేవంత్ చేసిన అంతర్రాష్ట్ర స్కామ్ వివరాల సేకరణ 90 శాతం పూర్తయింది. త్వరలో హైదరాబాద్ అండర్గ్రౌండ్ కేబుల్, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ స్కామ్లను కూడా ఆధారాలతోసహా బయటపెడతాం. వాటాలు, కమిషన్ల కోసం కేబినెట్ మీటింగ్లు పెట్టి పంపకాల్లో తేడా రావడంతో బయటకు వచ్చి సీఎం, మంత్రులు పరస్పరం నిందలు వేసుకుంటున్నారు.పరిశ్రమల భూముల బదలాయింపులో రూ.5 లక్షల కోట్లు దండుకునే కుట్ర సీఎంతోపాటు కేబినెట్ సబ్ కమిటీది కూడా అని మంత్రులు చెబుతున్నారు. కాంగ్రెస్ కుంభకోణాలపై బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటి కాకుంటే ప్రభుత్వ కుంభకోణాలపై కేంద్రం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి’అని హరీశ్రావు చెప్పారు. -
కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభం.. రంగంలోకి రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై గత ఐదురోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. డీకే శివకుమార్ పట్టువీడకపోవడంతో వ్యవహారం మరింత జఠిలంగా మారుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభంపై రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నిన్నంతా కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటక రాజకీయంపైనే వరుస భేటీలు నిర్వహించిందని జాతీయ మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి. అందునా.. కర్ణాటకకు చెందిన పలువురు మంత్రులు, సీనియర్ నేతలతో రాహుల్ స్వయంగా చర్చలు జరిపినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆయన నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడింది అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.మరోవైపు ఢిల్లీకి చేరుకున్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే.. కర్ణాటక కాంగ్రెస్లోని ఇరు వర్గాల వాదనలను, క్షేత్రస్థాయిలో పరిస్థితులను రాహుల్కు వివరించారు. దీంతో.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ను ఢిల్లీకి పిలిచే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఈ పంచాయితీకి తెర పడే అవకాశం కనిపిస్తోంది. -
కాంగ్రెస్ అరాచకాలపై ‘విద్యార్థి రణభేరి’
సాక్షి, హైదరాబాద్: విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై విద్యార్థులు ఉద్యమ రణభేరి మోగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. విద్యారంగం అభిృద్ధికి బీఆర్ఎస్ ఎలాంటి కృషి చేయలేదంటూ కాంగ్రెస్ చేస్తున్న అబ ద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వచ్చే నెల నుంచి పోరాటాన్ని ఉధృతం చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. వేలా ది మంది విద్యార్థులను సమీకరించి ప్రతీ అసెంబ్లీ ని యోజకవర్గ కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గురుకులాల్లో కల్తీ ఆహారం మొదలుకొని, విద్యార్థుల ఆత్మహత్యల వరకు అనేక విషాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. పార్టీ విద్యార్థి విభాగం చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. సమకాలీన రాజకీయాలపై స్పందించండి ‘ప్రతీ విద్యార్థి సోషల్ మీడియా ఖాతాను కలిగి ఉండి సమకాలీన రాజకీయాలపై గట్టిగా స్పందించాలి. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టాలి. 42 శాతం బీసీ రిజర్వేషన్లు స్ధానిక సంస్ధలతోపాటు విద్య, ఉద్యోగ అవకాశాల్లోనూ అమలు చేస్తామని కాంగ్రెస్ ఇచి్చన హామీపై యువతను జాగృతం చేయాలి. పార్టీ అధినేత చేపట్టిన దీక్షా దివస్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో మహా ఘట్టంగా నిలిచిపోతుంది. విద్యార్థులు, అమరుల త్యాగ ఫలితం వల్లే రాష్ట్ర సాధన సాధ్యమైంది. నవంబర్ 29న పార్టీ చేపడుతున్న దీక్షా దివస్ను అన్ని యూనివర్సిటీలు, కాలేజీల్లో నిర్వహించాలి’అని కేటీఆర్ పిలుపునిచ్చారు.రేవంత్ అవినీతి కోసమే ‘హిల్ట్ పి’‘పారిశ్రామిక భూముల బదలాయింపు పాలసీ ‘హిల్ట్ పి’పేరిట 9,292 ఎకరాల భూమిని ధారాదత్తం చేసేందుకు రేవంత్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపింది. గతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలకు ఇచి్చన భూములను ప్రైవేటు వ్యక్తులకు పంచిపెట్టే యత్నం జరుగుతోంది. హిల్ట్ పి ద్వారా అంబానీ సరసన నిలిచేందుకు రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ భూదందాపై ప్రజలను జాగృతం చేసేలా విద్యార్థి నాయకులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి’అని కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా దీక్షా దివస్ను విజయవంతం చేయాలంటూ బీఆర్ఎస్వీ రూపొందించిన పోస్టర్ను కేటీఆర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ అంటేనే కుట్రలు, కూల్చివేతలు
సాక్షి పెద్దపల్లి/ఓదెల/జమ్మికుంట: కాంగ్రెస్ పార్టీ అంటేనే కుట్రలు, కుతంత్రాలు, కూల్చివేతలని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యం ఏలుతోందని.. టెర్రరిస్టులకన్నా కాంగ్రెసోళ్లు దుర్మార్గులని దుయ్యబట్టారు. రైతులకు అవసరమైన చెక్డ్యాంలు, హైదరాబాద్లో హైడ్రా పేరిట పేదల ఇళ్లను కూల్చడం తప్ప కాంగ్రెస్కు కట్టడం తెలియదని ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లా గుంపుల–కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల మధ్య మానేరుపై గత శుక్రవారం రాత్రి దుండగులు పేల్చేసిన చెక్డ్యామ్ను హరీశ్రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు మంగళవారం పరిశీలించారు. అనంతరం హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ మానేరుపై రూ. 24 కోట్లతో నిర్మించిన చెక్డ్యామ్ను పేల్చేసిన ఇసుక మాఫియా వెనుక కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు ఉన్నారని ఆరోపించారు. గతంలో పెద్దపల్లి మండలం భోజన్నపేట శివారులోని హుస్సేనిమియావాగు చెక్డ్యామ్ను కాంగ్రెస్ నేతలు జిలెటిన్ స్టిక్స్తో పేల్చేసేందుకు యత్నించగా రైతులు పట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. అయినా ఎవరిపైనా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అప్పుడే దోషులను శిక్షించి ఉంటే గుంపుల చెక్డ్యామ్కు ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. కరీంనగర్ ఎల్ఎండీ గేట్లు ఎత్తినప్పుడు లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కూలిపోని చెక్డ్యామ్.. నాణ్యత లోపంతో కూలిపోయిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, ఒకవేళ నాణ్యత లోపంతో కూలిపోతే చెక్డ్యామ్ నిర్మించిన కాంట్రాక్టర్ను బ్లాక్లిస్ట్లో చేర్చాలని, దోషులను పట్టుకొని రూ. 24 కోట్లు రికవరీ చేసి శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గంగుల కమలాకర్, పాడి కౌశిక్రెడ్డి, సంజయ్, దాసరి మనోహర్రెడ్డి, రసమయి బాలకిషన్, నారదాసు లక్ష్మణ్, పార్టీ నేతలు పాల్గొన్నారు. మహిళలకు చీరలు ఇచ్చిసీఎం ఓట్లడుగుతున్నారు సిద్దిపేట రూరల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మహిళలకు చీరలు ఇచ్చి ఓట్లడుగుతున్నారని హరీశ్రావు విమర్శించారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో నియోజకవర్గంలోని 3,129 మహిళా సంఘాలకు రూ. 3.61 కోట్ల వడ్డీలేని రుణాల చెక్కును అందించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ రేవంత్రెడ్డి ప్రభుత్వం మహిళా సంఘాల్లోని 46 లక్షల మందికే చీరలు ఇవ్వడం విడ్డూరమన్నారు. పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు చీరలు ఇవ్వలేదని.. వడ్డీలేని రుణాలూ ఇవ్వలేదని విమర్శించారు. -
సిద్ధరామయ్యను తప్పించాల్సి వస్తే..
పవర్ షేరింగ్ ఫార్ములాపై రకరకాల ఊహాగానాలు.. రోజుకో కొత్త ప్రచారం నడుమ కర్ణాటక రాజకీయం వేడెక్కుతోంది. అయితే.. గ్రూప్ పాలిటిక్స్ తారాస్థాయికి చేరుకుంటున్న వేళ కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. నాయకత్వ మార్పు జరిగితే పార్టీకి నష్టమా? లాభమా? అని తీవ్రంగానే పరిశీలిస్తున్నట్లు తాజా సమాచారం. ఈ క్రమంలో మూడో అభ్యర్థి అంశంపైనా ఓ స్పష్టత వచ్చింది.కర్ణాటక సీఎంను ఎట్టి పరిస్థితుల్లో మార్చే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానం లేదు. అయితే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఒత్తిడి మేరకు లాభనష్టాలను బేరీజు వేసుకుంటోంది. అంతిమ నిర్ణయం అగ్రనేతల చేతుల్లోనే ఉండడంతో అది అంత ఈజీ కాదని ఇప్పటికే ఏఐసీసీ వర్గాలు ఓ స్పష్టత వచ్చేశాయి. అయితే ఒకవేళ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను గనుక తప్పిస్తే ఆ అవకాశం డీకే శివకుమార్నే వరించనుందట!. ఈ పంచాయితీలోకి మరో సామాజిక వర్గం, మూడో అభ్యర్థికి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండబోదని పార్టీ వర్గాల లీకులతో ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది.మూడో అభ్యర్థి అవకాశాలు ఇప్పటికిప్పుడు అస్సలు కనిపించడం లేదని.. ప్రస్తుతానికైతే ఈ ఇద్దరు నేతల మధ్యే పోటీ నెలకొందని కర్ణాటక కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సిద్ధరామయ్యకు మాస్ లీడర్గా అన్ని వర్గాల నుంచి ఆదరణ ఉందని ఆయన వర్గీయులు వాదిస్తున్నాయి. అదే సమయంలో.. డీకే శివకుమార్ బలాలను కూడా ఆయన మద్ధతుదారులు ఢిల్లీ పెద్దలకు నివేదించారు. ఎలక్షన్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న డీకేశి నేతృత్వంలో వచ్చే ఎన్నికలకు వెళ్లడం పార్టీకి కలిసొస్తుందని వాళ్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరి సామర్థ్యాలను అధిష్టానం సీరియస్గానే పరిశీలించాలనే భావిస్తోంది. తాజాగా శివకుమార్ వర్గంలో ఎమ్మెల్యేల సంఖ్య కాస్త పెరిగింది. వాళ్లలో కొందరు ఇవాళ ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి తమ డిమాండ్ వినిపించారు. ఈ పరిణామంతో సిద్ధూ వర్గం అప్రమత్తమైంది. అయితే.. ఇది ఇక్కడ(కర్ణాటక) చర్చించే విషయం కాదని.. దానికంటూ ఓ సమయం, సందర్భం ఉంటుందని.. పబ్లిక్గా ఈ అంశం గురించి మాట్లాడొద్దని ఇప్పటికే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేడర్కు స్పష్టం చేశారు. అయినా కూడా పలువురు నేతలు మైక్ ముందుకు వచ్చి నాయకత్వ మార్పుపై తమ అభిప్రాయాలు చెబుతున్నారు. దీంతో సీఎం చైర్ హైడ్రామా ఇంకొన్నాళ్లు కొనసాగే అవకాశం ఉంది. -
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఆమోదం తెలిపింది. హైదరాబాద్ శివారులో ఉన్న(ORRను ఆనుకుని ఉన్న) మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. అలాగే.. అలాగే విద్యుత్ రంగం ప్రధానంగా ఈ భేటీ జరిగినట్లు మంత్రులు వెల్లడించారు.మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాటలాడుతూ.. ఆదిభట్ల, పెద్ద అంబర్పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి.. ఇలా అర్బన్ లోకల్బాడీలను జీహెచ్ఎంసీలో విలీనానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలోని ఈ 27 మున్సిపాలిటీలు ,కార్పోరేషన్ లను జీహెఎంసీ లో కలపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీని అలాగే ఉంచాలా... లేక విభజించాలా అనేది భవిష్యత్లో నిర్ణయం తీసుకుంటాం.. రాబోయే పదేళ్ళకు సరిపడే విద్యుత్ అవసరం పై సుధీర్ఘంగా చర్చించాం. 2 వేల మెగావాట్ల పంప్ స్టోరేజ్ పవర్ కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. విద్యుత్ వ్యవస్థ లో పారదర్శకత కోసమే కొత్త డిస్కం ఏర్పాటు చేస్తున్నాం. కొత్తగా స్థాపించే పరిశ్రమలకు తామంతట తామే విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించాం. ప్రభుత్వ అంతర్గత విషయాలు బయటకు చెప్పేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ అంశంపై కూడా కేబినెట్ లో చర్చ జరిగింది. దీనికి పై ఎంక్వరీ జరుగుతుంది అని శ్రీధర్బాబు అన్నారు. ఇంకా కేబినెట్ నిర్ణయాలు ఏంటంటే.. విద్యుత్ ఉత్పాదన పెంచేందుకు 3 వేల మెగావాట్ల కోసం టెండర్లకు ఆహ్వానంహైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్కు ఆమోదంవిద్యుత్ నెట్వర్క్ వైర్లన్నీ అండర్గ్రౌండ్లోనే ఉండేలా ప్రణాళిక అమలు మహా నగరాన్ని 3 విభాగాలు విభజించి అండర్ గ్రౌండ్ పనులురాష్ట్రంలో మూడో డిస్కం ఏర్పాటునకు ఆమోదం మిషన్ భగీరథ, మెట్రో వాటర్ సప్లై కొత్త డిస్కం పరిధిలోకి ఇప్పుడున్న విధానంలోనే పరిశ్రమలకు విద్యుత్ సరఫరా సోలార్ విద్యుత్ కొనుగోలుకు ఆమోదం రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ను ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్మించాలని నిర్ణయంములుగు మండలం లోని జగ్గన్న పేట గ్రామంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు 40 ఎకరాల కేటాయింపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు ఏటీసీ ఏర్పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సబ్ కమిటీ రికమండేషన్ ప్రకారమే ఇండస్ట్రియల్ పాలసీ జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల కాలుష్య రహిత నగరం గా మార్చడం కోసమే ఈ నిర్ణయం. గత ప్రభుత్వాలు ప్రయత్నాలు చేశాయి.. మేమూ చేస్తున్నాం. ఇది సరైన నిర్ణయం. హరీష్ రావు, కేటీఆర్ రాజకీయ విమర్శలు మానుకోవాలి.మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రెఫరెండం అని కేటీఆర్ సవాల్ చేశారు. గతంలో ఇండస్ట్రీ మినిస్టర్ గా కాలుష్య పరిశ్రమలను ఓ ఆర్ ఆర్ కు అవతల వైపు మల్లించాలని కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రీ ఏరియా ను హౌసింగ్ ఏరియా మార్చి డబ్బులు దండుకున్నారు. కేటీఆర్ మాటల్లో రవ్వంత నిజం కూడా లేదు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఢిల్లీ పరిస్థితి హైదరాబాద్కు రావొద్దనే ఔటర్ లోపల ఉన్న పరిశ్రమలు తరలించాలని నిర్ణయం తీసుకున్నాం. కాలుష్యం నుంచి హైదరాబాద్ ను బయటపడేందుకు పరిశ్రమల తరలింపు చేపట్టాం. జనాభా లేని చోటు కు పరిశ్రమలు తరలించడమే మా ప్రయత్నం. ప్రభుత్వం కు లబ్ది చేకూరే నిర్ణయం పై కేటీఆర్ విమర్శలు చేయడం ఏంటి?. కేటీఆర్ తనకు కావాల్సిన వ్యక్తులకు ల్యాండ్ కన్జర్వేషన్ చేశారు. ఆయనలా తన మనుషులకు లబ్ది చేసేలా మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోలేదు. మా పాలసీ అందరికీ ఉపయోగపడుతుంది అని అన్నారు. -
DK Arun: ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎన్నికల కోసమే ఇందిరమ్మ చీరలు
-
బోరబండ కార్పొరేటర్ బాబా సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బోరబండ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ కౌన్సిల్ సమావేశంలో తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపీనాథ్ చనిపోయినా ఆయన అనుచరుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. మా ఇంటికి ఇటీవల వచ్చిన బెదిరింపు లేఖలో నన్ను చంపేస్తామని రాశారు. ఎవరో తెలియని వ్యక్తి పంపిన ఆ లేఖపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.తనను హత్య చేసేందుకు పెద్ద స్థాయిలో కుట్ర జరుగుతోందని బాబా ఆరోపించారు. దానిపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. నేను, నా కుటుంబం తీవ్ర భయాందోళనలో ఉన్నాం. మాకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు.ఇటీవల వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడిన సర్దార్ మరణాన్ని తనపై మోపే ప్రయత్నం చేశారు. దీనివల్ల రాజకీయంగా తనను దెబ్బతీయాలని కొందరు యత్నిస్తున్నారని ఆరోపించారు.దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని, వారు అంతర్గతంగా విఘాతం సృష్టిస్తున్నారని బాబా తీవ్రస్థాయిలో విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలలో నవీన్ యాదవ్కు 50 వేల మెజారిటీ రావాల్సింది. అంత మెజారిటీ రాకుండా అడ్డుకున్నది కాంగ్రెస్లోని కోవర్టులే అని ఆరోపించారు. బాబా చేసిన ఈ కామెంట్లపై పోలీసులు పూర్తి దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. -
డీకే శివకుమార్ ఇంటికి నాగ సాధువులు
ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహాలు.. ప్రతివ్యూహాలు, ఇద్దరి మధ్యే ఇదంతా. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ పదవుల పంతం ఇప్పట్లో అంతమయ్యేలా కనిపించడం లేదు. అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రమే ఈ గొడవను తీరుస్తారని సీనియర్లు చెప్పేశారు. శిడ్లఘట్టలో జరిగిన ఓ ముఖ్యమైన కార్యక్రమంలో ఇద్దరు నేతలూ ఎడమొహం, పెడమొహంగానే దర్శనమిచ్చారు. ఆతీ్మయ పలకరింపులు కానరాలేదు.సీఎం కుర్చీ గొడవ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ ముఖ్యమైన కార్యక్రమాల్లో కలిసే పాల్గొంటున్నారు. చిక్కబళ్లాపుర జిల్లా శిడ్లఘట్టలో సోమవారం జరిగిన అభివృద్ధి కార్యక్రమాల సభలో పలు సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. శివకుమార్ వచ్చేవరకు వేచిఉండకుండా సీఎం సిద్దరామయ్య భూమి పూజ నెరవేర్చారు. మంత్రులు కే.హెచ్.మునియప్ప, ఎం.సీ.సుధాకర్, హెచ్.సీ.మహదేవప్ప పాల్గొన్నారు. ఆలస్యంగా చేరుకున్న డీకే వేదిక ముందు ప్రజలకు చేతులు ఊపి అభివాదం చేస్తూ తన కుర్చీ వద్దకు వచ్చారు. ఈ సమయంలో వేదికపై ఉన్న ఎమ్మెల్యేలకు, మంత్రులకు చేతులెత్తి ఆయన నమస్కారాలు చేశారు. సిద్దరామయ్య ముందు కూడా చేతులెత్తి మొక్కి సాగారు. ఇంతకు ముందు వేదికపైకి రాగానే సిద్దు, శివ చేతులు కలిపి ఆతీ్మయతతో మాట్లాడుకునేవారు. ఇప్పుడు అది కనిపించలేదు, అలాగే పక్కపక్కనే కూర్చొని పలకరించుకున్నా గత ఆత్మీయత కనిపించలేదు. ఇద్దరి ముఖాల్లో విచార భావన అగుపించింది. డీకే వర్గం ఎమ్మెల్యేల ఢిల్లీ యాత్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను ముఖ్యమంత్రి స్థానానికి పరిగణించాలని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం మళ్లీ ఢిల్లీ పర్యటన చేపట్టింది. నాలుగు రోజుల క్రితం 7, 8 మంది ఎమ్మెల్యేలు వెళ్లి మల్లికార్జున ఖర్గేతో పాటుగా సీనియర్ నాయకులకు విజ్ఞప్తులు చేశారు. హెచ్.డీ.రంగనాథ్, శరత్ బచ్చేగౌడ, ఆనేకల్ శివణ్ణ, ఎస్.ఆర్.శ్రీనివాస్, నెలమంగల ఎమ్మెల్యే శ్రీనివాస్, శృంగేరి ఎమ్మెల్యే రాజేగౌడలు బెంగళూరుకు వెనుతిరిగి వచ్చారు. సోమవారం మళ్లీ ఐదారు మంది ఎమ్మెల్యేలు ప్రయాణం కట్టారు. చన్నగిరి ఎమ్మెల్యే బసవరాజు శివగంగ, మాగడి ఎమ్మెల్యే బాలకృష్ణ, రామనగర ఎమ్మెల్యే హుసేన్ ఇక్బాల్, మద్దూరు ఎమ్మెల్యే ఉదయ్ కడలూరు, హొసకోట ఎమ్మెల్యే శరత్ బచ్చేగౌడ, మూడిగెర ఎమ్మెల్యే నయన మోటమ్మ, ఆనేకల్ ఎమ్మెల్యే శ్రీనివాస మానె ఢిల్లీ యాత్ర చేపట్టారు.డీసీఎం ఇంటికి నాగ సాధువులుడీసీఎం డీకే శివకుమార్ విశేష పూజలు జరిపిస్తున్నారు. బెంగళూరు సదాశివనగరలోని నివాసానికి సోమవారం ఉదయం కాశీ నుంచి వేదగిరి నాగ బాబా వచ్చి డీ.కే.శివకుమార్ తలపై చేయి ఉంచి ఆశీర్వదించి, భుజం తట్టారు. స్వామీజీకి ఆయన కొంత నగదును బహూకరించారు. కొంతమంది సాధువులు కూడా ఉన్నారు. ఇక గదగ జిల్లా హులిగమ్మదేవి.. రెండున్నర నెలల్లో డీ.కే.శివకుమార్ ముఖ్యమంత్రి కానున్నారని జోస్యం చెప్పింది. జోగతి బైలమ్మ కూడా ఇదే చెప్పారు. సిద్దు, శివ ఇద్దరూ కపటం లేనివారు, సిద్దరామయ్య రెండున్నర నెలల్లో అధికారాన్ని వదిలేయబోతున్నట్లు తెలిపారు.ఎమ్మెల్యేలు ఢిల్లీకి ఎందుకు వెళ్లారో: మంత్రి లక్ష్మికోలారు: రాష్ట్రంలో పవర్ షేరింగ్ విషయాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి ఎందుకు వెళ్లారో తనకు తెలియదని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ అన్నారు. కోలారులో విలేకరులతో ఆమె మాట్లాడారు. కేపీసీసీ అధ్యక్షునిగా డీకే శివకుమార్, ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ఉత్తమంగా పని చేస్తున్నారన్నారు. మిగిలిన విషయాలు అన్నీ హై కమాండ్ చూసుకుంటుందన్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తమ శాఖ గురించి చర్చించానని, ఎలాంటి రాజకీయాల గురించి మాట్లాడలేదన్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెల గృహలక్ష్మి డబ్బుల బకాయిలు త్వరలో లబి్ధదారుల ఖాతాలకు జమ చేస్తామని తెలిపారు. -
ఎవరికీ తెలియకుండానే మంత్రాంగం?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పారిశ్రామిక భూముల బదిలీ విధానం (హిల్ట్ పి) ఒక పక్క రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంటే మరోపక్క సంబంధిత పరిశ్రమల శాఖకు కూడా తెలియకుండానే కొత్త పాలసీ కేబినెట్లో చర్చకు వచ్చిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. లోతైన కసరత్తు లేకుండా కేవలం పరిశ్రమల శాఖ అధీనంలోని టీజీఐఐసీ రాసిన లేఖ ఆధారంగా పాలసీ తయారైనట్లు సమాచారం. కేబినెట్ నోట్లో ఈ అంశం గమనించే వరకు సదరు మంత్రికి కూడా అందుకు సంబంధించిన సమాచారం లేదని అధికార వర్గాలు చెబుతుండటం గమనార్హం.అత్యంత ముఖ్యమైన పాలసీ కేబినెట్లో ఆమోదం పొందినా.. మీడియాకు వివరాల వెల్లడికి పరిశ్రమల మంత్రి దూరంగా ఉన్నారని అంటున్నారు. మరోవైపు టీజీఐఐసీ నుంచి పరిశ్రమల వివరాల తీసుకుని ‘మల్టీ యూజ్ జోన్లు’గా మార్చే బాధ్యతను అప్పగించిన హెచ్ఎండీఏతో పాటు పురపాలక, రెవెన్యూ శాఖలతో కూడా పాలసీ రూపకల్పనపై సంప్రదింపులు జరపలేదని తెలుస్తోంది. ఇంకోవైపు ‘హిల్ట్ పి’ హడావుడిగా రూపొందించడం, ఆమోదించడం వెనుక జరిగిన తతంగం అనుమానాలు తావిచ్చేలా ఉందన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది.సంబంధిత శాఖ మంత్రి ప్రమేయం లేకుండానే పాలసీకి తుది రూపం ఇవ్వడమే దీని వెనుక భారీ భూ కుంభకోణం దాగి ఉందనడానికి నిదర్శనమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ విలువలో (ఎస్ఆర్ఓ రేటు) కేవలం 30 శాతానికే భూములు బదలాయించడాన్ని బీఆర్ఎస్, బీజేపీలు తప్పుబడుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వ ఖజానాకు భారీగా కన్నం పెడుతున్నారని ఆరోపిస్తున్నాయి. ఇంకోవైపు పాలసీలోని నియమ నిబంధనలపై విమర్శలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వ పరంగా సరైన స్పందన లేదనే చర్చా జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం.. ‘హిల్ట్ పి’ పేరిట జరుగుతున్న తతంగానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. టీజీఐఐసీ లేఖ ఆధారంగానే పాలసీ!ఔటర్ రింగు రోడ్డు లోపల, సమీప ప్రాంతాల్లో 9,292.53 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 22 పారిశ్రామిక వాడల్లోని 4,740.14 ఎకరాల భూమిని ఇతర అవసరాలకు వినియోగించేలా అనుమతించాలని కోరుతూ తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ) రాష్ట ప్రభుత్వానికి లేఖ రాసింది. దాని ఆధారంగానే ‘హిల్ట్ పి’కి రూపకల్పన జరిగింది. ఈ నెల 17న జరిగిన కేబినెట్ భేటీ దానికి ఆమోదం తెలిపింది.అయితే ఈ పాలసీ రూపకల్పనలో గతంలో పరిశ్రమల శాఖలో ఏళ్ల తరబడి చక్రం తిప్పిన ఓ కీలక అధికారి పాత్ర ఉన్నట్లు సమాచారం. కాగా పాలసీ రూపకల్పనకు సంబంధించి సంబంధిత శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులు ఎవరూ కూడా సమీక్ష నిర్వహించిన దాఖలాలు లేవని సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ఈ కారణంగానే పాలసీలో శాస్త్రీయత లేకపోవడంతో పాటు ‘హిల్ట్ పి’ లోపాల పుట్టగా తయారైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. హడావుడిగా ఎందుకు? ‘హిల్ట్ పి’ కింద.. పారిశ్రామిక భూములను ‘మల్టీ యూజ్ జోన్’గా మార్చి అందులో నివాస, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, హోటళ్లు, పార్కులు, కల్చరల్ సెంటర్లు వంటివి నిర్మించేలా అనుమతులు ఇస్తారు. అయితే ఈ భూ బదలాయింపు ప్రక్రియను హడావుడిగా కేవలం రెండు నెలల వ్యవధిలోనే పూర్తి చేస్తామని ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది.దరఖాస్తు పరిశీలన, ఆమోదం అందుకు అయ్యే డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు వసూలు వంటి ప్రక్రియ అంతా కేవలం 66 రోజుల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు హిల్ట్ పీ మార్గదర్శకాలు విడుదల చేసిన ఆరు నెలల వరకే దరఖాస్తులు తీసుకుంటామని తెలిపింది. అయితే వేలాది ఎకరాల భూమిని మల్టీ యూజ్ జోన్గా మార్చేందుకు సంబంధించిన దరఖాస్తుల గడువును కేవలం ఆరు నెలలుగా నిర్దేశించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ ధరతో ఖజానాకు కన్నంగతంలో (2023) మూడు పారిశ్రామిక వాడల్లోని భూములపై పూర్తి యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్ రైట్స్) కల్పిచేందుకు జారీ చేసిన ఉత్తర్వుల్లో రిజిస్ట్రేషన్ విలువ (ఎస్ఆర్ఓ)పై 100 నుంచి 200 శాతం అదనంగా చెల్లించాలని పేర్కొన్నారు. ఇలా ఫ్రీ హోల్డ్ రైట్స్ దక్కించుకున్న యజమానులు హెచ్ఎండీఏ లేదా పురపాలక శాఖకు ‘ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్’ కోసం అదనంగా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ‘హిల్ట్ పి’లో మల్టీ యూజ్ జోన్గా మార్చుకునేందుకు పరిశ్రమల యజమాన్యాలు ఎస్ఆర్ఓ విలువలో కేవలం 30 నుంచి 50 శాతం చెల్లిస్తే సరిపోతుందని పేర్కొనడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కాగా ఇలా వసూలయ్యే మొత్తంలో నుంచే హెచ్ఎండీఏ లేదా పురపాలక శాఖకు ‘ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్’ చార్జీలు చెల్లిస్తామని పేర్కొన్నారు. పారిశ్రామిక వాడల్లోని భూములకు టీజీఐఐసీ ధరతో పోలిస్తే ఎస్ఆర్ఓ విలువ తక్కువగా ఉంటుంది. కాబట్టి ‘మల్టీ యూజ్ జోన్’గా మార్చుకునేందుకు ఎస్ఆర్ఓ రేటు వసూలు చేస్తేనే ప్రభుత్వ ఖజానాకు గండిపడి, పరిశ్రమల యాజమాన్యాలకు భారీగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అలాంటిది ప్రస్తుతం ఎస్ఆర్ఓ విలువలో కేవలం 30 శాతం మాత్రమే చెల్లిస్తే చాలనడంపై విపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.పరిశ్రమల్లోని భూములపై స్పష్టత లేకుండానే..ఏళ్ల క్రితం ఏర్పాటైన పారిశ్రామిక వాడల్లో కొన్ని పరిశ్రమలు మూతపడగా, మరికొన్ని పరిశ్రమలు అనధికారికంగా చేతులు మారాయి. కొన్నిచోట్ల ప్రభుత్వం ఇచి్చన లీజు గడువు కూడా ముగిసినట్లు సమాచారం. ఈ అంశాలపై లోతైన కసరత్తు లేకుండా పాలసీని తెచ్చి బదలాయింపునకు పూనుకోవడం వెనుక కొందరు ప్రభుత్వ పెద్దలు, బడా రియల్టర్ల హస్తం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. వీటన్నిటిపై వివరణ ఇవ్వాల్సిన పరిశ్రమల శాఖ మంత్రి.. కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవోలను ప్రస్తావిస్తూ ఆరోపణలను ఖండించడమే తప్ప..‘హిల్ట్ పి’కి సంబంధించి సరైన వివరణ ఎందుకు ఇవ్వడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. -
టీడీపీకి షాక్.. వైఎస్సార్సీపీలోకి నేతల చేరికలు
సాక్షి, కర్నూలు: ఆలూరు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు క్రమంగా మారుతున్నాయి. చిప్పగిరిలో జరిగిన సమావేశంలో టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు స్థానిక నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.వైఎస్సార్ సీపీలో చేరిన నేతలు మాట్లాడుతూ.. టిడిపిలో తమకు ప్రాధాన్యత లేకపోవడం వల్ల స్థానిక సమస్యల పరిష్కారంలో పార్టీ నాయకత్వం విఫలమైంది. దాంతో వైఎస్సార్ సీపీలోకి వస్తున్నాం. టిడిపి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినా ప్రజలకు ఏమీ చేయలేదు కానీ ప్రజలను మోసం మాత్రం చేసిందని వారు విమర్శించారు. ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో ప్రజల మనసులు గెలుచుకున్నారు. 2029లో ఆయన తిరిగి ముఖ్యమంత్రి అవుతారని నమ్మకం ఉంది అని పేర్కొన్నారు.ఆలూరు నియోజకవర్గ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండటం, త్రాగునీటి ఇబ్బందులు ఎక్కువగా ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటాను. ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం అని విరుపాక్షి హామీ ఇచ్చారు. -
సీఎం సీటు నుంచి దిగేందుకు సిద్ధం?!
నాయకత్వ మార్పుపై ఊహాగానాలు నడుస్తున్న వేళ.. కర్ణాటక రాజకీయంలో బడా ట్విస్ట్ చోటు చేసుకుంది. సీఎం మార్పు ఉండొచ్చనే సంకేతాలను బలపరిచేలా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు తానే సీఎంగా కొనసాగుతానంటూ ఇంతకాలం పదేపదే చెబుతూ వచ్చిన ఆయన.. ఇవాళ సరికొత్తగా మాట్లాడడం కన్నడనాట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోమవారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయిస్తే.. ఐదేళ్లు సీఎంగా కొనసాగుతాను. ఒకవేళ సీఎంను మార్చి తీరాలని అధిష్టానం భావిస్తే అందుకు కట్టుబడి ఉంటాను. నేను మాత్రమే కాదు.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా దీనిని అంగీకరించాల్సి ఉంటుంది’’ అని అన్నారాయన. నవంబర్ 20వ తేదీన నుంచి కర్ణాటక రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్.. పవర్ షేరింగ్ ఫార్ములా ద్వారా సీఎం రేసులో ఉన్న సిద్దూ, డీకేశిలను చల్లార్చిందనే ప్రచారం ఒకటి ఉంది. రెండున్నరేళ్లు పూర్తి కావడంతో డీకే మద్దతుదారులు ఆయనకు సీఎంపగ్గాలు అప్పగించాలని గళం వినిపిస్తుండగా.. అనుభవాన్ని,సామాజిక వర్గాల సమీకరణలను పరిగణనలోకి తీసుకుని కొనసాగించాలంటూ సిద్ధరామయ్య మద్దతుదారులు ఢిల్లీ పెద్దల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో.. డీకే శివకుమార్కు శిబిర ఎమ్మెల్యేల సంఖ్య పరిమితంగా ఉండడంతో ఈ మార్పునకు అధిష్టానం సుముఖంగా లేదని నిన్నటిదాకా ప్రచారం వినిపించింది. అయితే.. అనూహ్యంగా ఆయనకు మద్దతుదారుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. వాళ్లంతా మరోసారి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్ను కలవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో.. ఇటు సిద్ధరామయ్య కూడా సీఎం సీటు నుంచి దిగేందుకు సిద్ధమంటూ తాజాగా ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతా వాళ్ల చేతుల్లోనే..కర్ణాటకలో కేబినెట్ పునర్వవ్యస్థీకరణ(పీసీసీ చీఫ్ మార్పు సహా) చేపట్టాలని సిద్ధరామయ్య తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే సీఎం సీటు పంచాయితీ తేల్చిన తర్వాతే ఆ పని చేయాలంటూ డీకే శివకుమార్ పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో.. ‘‘నాలుగైదు నెలల కిందటే హైకమాండ్ నుంచి కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు తనకు గ్రీన్సిగ్నల్ లభించిందని.. అయితే రెండున్నరేళ్ల పాలన పూర్తి అయ్యేదాకా ఆగాలని భావించానని’’ సిద్ధరామయ్య ఇవాళ మీడియాకు తెలిపారు. అయితే.. పవర్ షేరింగ్ ఫార్ములా(రెండున్నరేళ్ల తర్వాత సీఎం సీటు వదులకునేందుకు సిద్ధపడ్డారా?) అనేది ఒకటి ఉందా?.. అందుకు మీరు అంగీకరించారా? అని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు.. అంతా హైకమాండ్ చేతుల్లోనే ఉంటుంది అంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారాయన. ఆయన వస్తేనే..కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను డీకే శివకుమార్తో రీప్లేస్ చేయాలంటూ కొంత కాలంగా నడుస్తున్న రాజకీయాలతో ఢిల్లీ వేడెక్కుతోంది. ఇప్పటికే డీకే శివకుమార్ వర్గీయులు హైకమాండ్తో సంప్రదింపులు జరిపారు. మరోవైపు.. శనివారం సిద్ధూ వర్గం ఎడతెరిపి లేకుండా బెంగళూరు పర్యటనకు వచ్చిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంతనాలు జరిపింది. అయితే.. అంతిమ నిర్ణయం అగ్రనేత రాహుల్ గాంధీ చేతుల్లోనే ఉందంటూ ఖర్గే వాళ్లతో తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరు పర్యటనలో ఉన్న ఖర్గే ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటన ముగించుకుని భారత్కు తిరిగి రానున్నారు. ఆయన వచ్చాకే కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభం ఓ కొలిక్కి రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
టీపీసీసీ చీఫ్ దాతృత్వం
నిజామాబాద్ జిల్లా: టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ పెద్ద మనసు చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని తన స్వగ్రామం రహమత్నగర్లో ఆదివారం పర్యటించి గ్రామాభివృద్ధి కోసం 11 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఆయన మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం 10 ఎకరాల భూమిని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే సబ్స్టేషన్ కోసం ఒక ఎకరం భూమిని విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. టెంపుల్ కారిడార్ను తన గ్రామం మీదుగా మంజూరు చేసినందుకు సీఎం రేవంత్రెడ్డి, రోడ్లు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి మహేశ్కుమార్గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. -
ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల ఆఫర్
కర్ణాటక: కాంగ్రెస్ నాయకులు సొంత పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల ఆఫర్ ఇచ్చారు అని బీజేపీ ఎమ్మెల్సీ చలవాది నారాయణస్వామి ఆరోపించారు. ఆదివారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన, ఇంతకాలం వేరే పార్టీవారిని తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు గుర్రాల వ్యాపారం చేస్తుండేవారు. నేడు కాంగ్రెస్ నాయకులు తమ పార్టీలోనే వ్యాపారం సాగిస్తున్నారని హేళన చేశారు. తమ వైపు చేరితే ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇస్తామని హామీనిచ్చారని తెలిసిందన్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలకు 50 కోట్లతో పాటుగా ఒక ఫ్లాట్, ఒక ఫార్చునర్ కారును ఆఫర్ చేశారన్నారు. ఈ విషయాన్ని తాను ఈడీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ ఇన్చార్జి రణదీప్ సుర్జేవాలా మంత్రి పదవిని ఇప్పించడానికి ఒక్కో ఎమ్మెల్యేకు రూ.200 కోట్లు డిమాండ్ పెట్టారని ఆరోపించారు. -
‘మా ముఖ్యమంత్రి ఫిరాయింపు వారికే గుర్తింపు ఇస్తున్నారు’
జగిత్యాల : తమ ముఖ్యమంత్రి అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ పార్టీ నేత, మాజీ మంత్రి జీవన్రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కేవలం పార్టీ ఫిరాయింపు వారికే గుర్తింపు ఇస్తున్నారని చురకలు అంటించారు. జగిత్యాల జిల్లా నూతన డీసీసీ అధ్యక్షుడు నందయ్యకు తన ఇంట్లో సన్మాన కార్యక్రమానికి హాజరైన జీవన్రెడ్డి.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై మండిపడ్డారు. ‘లక్ష్మణ్ అన్నకు కోపం వచ్చినా సరే… కానీ, మా పోటీ పక్కవాళ్లతో కాదు.. ముఖ్యమంత్రి స్థాయి నాయకులతోనే. కాంగ్రెస్ కన్నతల్లి లాంటి పార్టీ. తన బిడ్డలను కాపాడుకుంటుంది. కానీ మా లాంటి వాళ్లను సీఎం రేవంత్ పట్టించుకోవడం లేదు. అసలైన కాంగ్రెస్కు కార్యకర్తలను వదిలేస్తున్నారు.. ఫిరాయింపు వారికి గుర్తింపు ఇస్తున్నారు. జగిత్యాలకు ఎమ్మెల్యే సంజయ్ చేసేందేమీ లేదు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి సంజయ్ ఏం చేశారు?’ అని ధ్వజమెత్తారు. -
‘సీఎం రేవంత్ నా గొంతు కోశారు’
సాక్షి,నల్లగొండ: నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న గుమ్ముల మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై విమర్శలు గుప్పించారు. ‘రేవంత్ రెడ్డి నా గొంతు కోశారు. ప్రతిసారి డీసీసీ పదవి అడిగినా మొండిచెయ్యి చూపించారు. పార్టీకి నష్టం చేసే వాళ్లను వెంట తిప్పుకోవడం మేము అసలు సహించము. కాంగ్రెస్లో తిడితేనే పదవులు వస్తున్నాయి. తన కులం, సీనియారిటీ, సేవలను పక్కన పెట్టి తనను పరిగణనలోకి తీసుకోలేదని మోహన్ రెడ్డి ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి అనుచరుడిని కాబట్టి నాకు అడ్డుపడ్డారు. నా సీనియారిటీ, నా సర్వీస్ ఏం పనికిరాలేదా? ఎవరిని నొప్పించకుండా రాజకీయాలు చేస్తే పక్కన పెట్టారు.డీసీసీ నియామకంలో అధిష్టానం కుల ఆధారిత నిర్ణయాలు తీసుకుందనే ఆరోపణలు కూడా మోహన్ రెడ్డి చేశారు. తన తర్వాత వచ్చిన 20 మందికి కార్పొరేషన్ పదవులు ఇచ్చారని, వలస వచ్చిన నాయకులకే కాంగ్రెస్లో పెద్దపీట వేస్తున్నారు. అంతేకాక తనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని స్పష్టంగా డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి తలుచుకుంటే 24 గంటల్లో నాకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి వస్తుంది. రేవంత్ వెంట తిరిగితే నాకు ఎమ్మెల్యే, ఎంపీ పదవులు వచ్చేవి. నేను ఎవరిని బ్లాక్ మెయిల్ చేయలేదు. మునుగోడు ఉపఎన్నికల సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తాను సపోర్ట్ చేయలేదని, అప్పటికే తనపై అనవసర అపోహలు సృష్టించారని’ధ్వజమెత్తారు. తాజా గుమ్మల మోహన్రెడ్డి కామెంట్స్తో డీసీసీ పదవి చుట్టూ వచ్చిన ఈ ఆరోపణలు జిల్లా కాంగ్రెస్లో అసమ్మతి, వర్గపోరు మరింత స్పష్టంగా బయటపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
సీఎం పదవి ఇవ్వకపోతే.. DK వార్నింగ్
-
సిద్దు, డీకే ఎఫెక్ట్.. తెరపైకి ‘ఉత్తర కర్ణాటక’ వివాదం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో సీఎం సీటుపై కర్ణాటక రాజకీయాల్లో చర్చ జోరందుకోగా.. తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలనే నినాదంపై మరోమారు దుమారం రేగింది. బెళగావిలో జరిగే శాసనసభా సమావేశాల్లో ఎమ్మెల్యే రాజుకాగెతో పాటు, ఉత్తర కర్ణాటకకు చెందిన 26 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేక రాష్ట్రం కోసం నినదించాలని నిర్ణయించినట్లు ఉత్తర కర్ణాటక పోరాట సమితి ప్రధాన కార్యదర్శి నాగేశ్ గోలశెట్టి చెప్పడంతో మళ్లీ చర్చ మొదలైంది.బెళగావిలో నాగేశ్ గోలశెట్టి విలేకరులతో మాట్లాడుతూ దీర్ఘకాలంగా ఉత్తర కర్ణాటకకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగె లేఖ రాసినట్టు చెప్పారు. ఇప్పటికే ఉత్తర కర్ణాటకకు చెందిన 1,48,91,346 మంది ప్రత్యేక రాష్ట్రం కోసం మద్దతు ఇచ్చినట్లు వెల్లడించారు. డిసెంబర్ 8న బెళగావిలో 26 మంది ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి డిసెంబర్ 11 నుంచి జరిగే శీతాకాల శాసనసభా సమావేశాల్లో ప్రత్యేక రాష్ట్రంపై గొంతు వినిపిస్తామని చెప్పారు. రాజుకాగె పోరాటానికి బెళగావి, విజయపుర, బాగలకోట, ధారవాడ, గదగ, ఉత్తర కన్నడలోని 15 జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు సిద్దు సవది, విజయానంద కాశప్పనవర, బసనగౌడ పాటిల్యత్నాల్, శరణు సలగర, శరణ ప్రకాశ పాటిల్, వినయ కులకర్ణి, అరవింద బెల్లద, జనార్దన్రెడ్డి, నారా భరత్రెడ్డి, నిఖిల్కత్తి మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఉత్తర కర్ణాటక ప్రజలు తమ డిమాండ్లు సాధించుకోవాలంటే తెలంగాణ తరహా పోరాటం చేసేందుకు సిద్ధమవ్వాలని నాగేశ్ గోలశెట్టి తెలిపారు.డీకే వర్గం కొత్త డిమాండ్.. మరోవైపు.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు సీఎం పదవి ఇవ్వాలని ఆయన వర్గం ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఎమ్మెల్యేల అభిప్రాయం సేకరించాలని, రహస్య ఓటింగ్ కూడా నిర్వహించాలని కూడా కోరుతున్నారు. ఈ మేరకు వారంతా ఢిల్లీ యాత్ర చేపట్టారు. అధిష్టానం పెద్దల వద్దకు వెళ్లి ఈ మేరకు తమ డిమాండ్ను వినిపిస్తున్నారు. బెంగళూరులోని కొందరు ఎమ్మెల్యేలు డీకే శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇళ్లకు క్యూలు కడుతున్నారు. ఇద్దరితో మాట్లాడి రాజీ కుదిర్చే ప్రయత్నాలు సాగిస్తున్నారు. డీకే శివకుమార్ మాత్రం ఎవరి మాట వినేందుకు సిద్ధంగా లేన్నట్లు సమాచారం.2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొందరు నేతల ద్వారా డీకే శివకుమార్ను బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయితే అందుకు కూడా ఆయన అంగీకరించలేదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసంటూ ప్రశ్నించినట్లు సమాచారం. గతంలో హైకమాండ్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని డీకే శివకుమార్ తేల్చిచెప్పారని తెలుస్తోంది. రెండున్నరేళ్ల వరకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, తాను ఉప ముఖ్యమంత్రిగా.. లోక్సభ ఎన్నికల వరకు కేపీసీపీ అధ్యక్షుడిగా కొనసాగాలని హైకమాండ్ నిర్దేశించిందని డీకే శివకుమార్ గుర్తు చేసినట్టు సమాచారం. ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవాలని, తనను ముఖ్యమంత్రి చేయాలని డీకే కోరుతున్నట్టు తెలుస్తోంది. -
కర్ణాటకలో ట్విస్ట్.. ఖర్గేతో భేటీలో ఏం జరిగింది?
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అధికార, నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయమే అంతిమమని సీఎం సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. శనివారం రాత్రి ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సుమారు గంటకు పైగా సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా మారింది.ఖర్గేతో భేటీ అనంతరం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత మల్లికార్జున ఖర్గే బెంగళూరుకు రావడంతో కలిశానన్నారు. ఇదొక మర్యాద పూర్వక భేటీ మాత్రమేనని, ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని చెప్పుకొచ్చారు. పార్టీ బలోపేతంపై, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్లు తెలిపారు. నాయకత్వ మార్పు అంశంపై చర్చించలేదన్నారు. డీకే వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో చర్చలు జరపడంపై స్పందిస్తూ ఎవరైనా ఢిల్లీకి వెళ్లి హైకమాండ్తో మాట్లాడొచ్చని, అందులో ప్రత్యేకత ఏముందని ప్రశ్నించారు. సీఎం మార్పు అంశంలో ఏమి జరిగినా తాను బాధపడనని, అలాగే సంతోషపడనని కూడా చెప్పారు. ఏ విషయమైనా పార్టీ అధిష్టానం నిర్ణయమే అంతిమమని, అది తానైనా, డీకే శివకుమార్ అయినా, పార్టీ నేతలెవరైనా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చ! ఖర్గేతో భేటీలో సిద్ధరామయ్య తననే సీఎంగా కొనసాగించాలని కోరినట్లు తెలిసింది. శనివారం బెంగళూరు నగరంలోని సదాశివనగరలో ఉన్న ఖర్గే నివాసానికి తన వర్గం, నేతలు లేకుండా సీఎం సిద్ధరామయ్య ఒక్కరే వెళ్లడం గమనార్హం. ఇద్దరు నేతలు కలిసి సుదీర్ఘంగా పలు తాజా రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చ జరిగిందని సమాచారం. అంతకు ముందు సీఎం తన అనుచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర మంత్రులతో సమావేశమై చర్చించారు. సీఎం నివాసం కావేరికి మంత్రులు జమీర్ అహ్మద్ఖాన్, ఈశ్వర్ ఖండ్రే, కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లారు.ప్రస్తుత రాజకీయ సంక్షోభ సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎంతో వారు చర్చించినట్లు సమాచారం. భేటీ అనంతరం బెంగళూరు ప్యాలెస్ మైదానంలో మంత్రి డి.సుధాకర్ కుమారుడి పెళ్లికి సీఎం హాజరై అక్కడి నుంచి నేరుగా ఖర్గే నివాసానికి చేరుకున్నారు. తనకు ఎమ్మెల్యేల పూర్తి మద్దతు ఉందని ఖర్గే చెప్పినట్లు సమాచారం. అలాగే ప్రభుత్వ పాలనకు ఎలాంటి ఆటంకం లేకుండా, సుపరిపాలన కొనసాగాలంటే తానే సీఎంగా కొనసాగాల్సిన ఆవశ్యకతను వివరించినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలంటే కూడా తానే సీఎంగా కొనసాగాలని చెప్పినట్లు సమాచారం. కాగా, సీఎం సిద్ధరామయ్య, ఖర్గే భేటీపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ.. వారి భేటీకి ప్రత్యేకత ఏమీ లేదన్నారు. తాను ఉంటున్న ఇంటి నుంచి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఖర్గే నివాసం ఉందని తెలిపారు. -
సీఎం చేయకపోతే నా దారి నాదే!
సాక్షి, బెంగళూరు: ఇన మాట ప్రకారం, ముందస్తు ఒప్పందంలో భాగంగా మిగిలిన పదవీ కాలంలో తనకు సీఎం పదవి ఇవ్వాల్సిందేనని, లేదంటే తనదారి తాను చూసుకుంటానని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్య సీఎం కుర్చీని వదిలేందుకు ఏమాత్రం సిద్ధంగా లేకపోగా, మిగిలిన కాలమంతా తానే సీఎంనంటూ పదేపదే వ్యాఖ్యలు చేయడంతో డీకే శివకుమార్ తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని సిద్ధరామయ్యతో రాజీనామా చేయించాలని డీకే శివకుమార్ ఒత్తిడి తెస్తున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ప్రయోగించి తనను జైలుకు పంపించినా బేషజాలకు పోకుండా, బెదిరింపులకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా పని చేశానని అధిష్టానం వద్ద గట్టిగా చెప్పినట్లు సమాచారం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో.. డీకే శివకుమార్ సమావేశమై చర్చించారు. కేపీసీసీ అధ్యక్షుడిగా ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. హైకమాండ్ మాటకు కట్టుబడి ప్రారంభంలో సీఎం పదవిని వదులుకుని డిప్యూటీ సీఎం పదవితో సర్దుకున్నానని తెలిపారు. ఇప్పటివరకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని భిన్న స్వరాలు వినిపించినా తాను పార్టీకి విధేయుడిగానే వ్యవహరించానని తెలిపారు. సంపూర్ణంగా హైకమాండ్పై విశ్వాసాన్ని కనపరిచానని, ఇలాంటి తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టినట్లు తెలిసింది. ఢిల్లీలో రహస్య మంతనాలు ఢిల్లీలో డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్తో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇదివరకే సమావేశమై చర్చించారు. అధికార మార్పిడిపై వీరిద్దరి మధ్య సుమారు 45 నిమిషాలకు పైగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీ యాత్ర చేపట్టారు. బెంగళూరులోని కొందరు ఎమ్మెల్యేలు డీకే శివకుమార్, సీఎం సిద్దరామయ్య ఇళ్లకు క్యూలు కడుతున్నారు. ఇద్దరితో మాట్లాడి రాజీ కుదిర్చే ప్రయత్నాలు సాగిస్తున్నారు. శివకుమార్ మాత్రం ఎవరి మాట వినేందుకు సిద్ధంగా లేన్నట్లు తెలుస్తోంది. 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి సీఎం అభ్యరి్థగా ప్రకటిస్తామని ఏఐసీసీ కొందరు నేతల ద్వారా శివకుమార్ను బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అందుకు కూడా శివకుమార్ అంగీకరించలేదని, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసంటూ ప్రశ్నించినట్లు సమచారం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 140 మంది ఎమ్మెల్యేలతో స్పష్టమైన మెజారిటీ ఉందని, 2023 జూలైలో హైకమాండ్ ఇన మాటకు కట్టుబడి ఉండాలని డీకే శివకుమార్ తేల్చి చెప్పారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రెండున్నరేళ్ల వరకు సిద్దరామయ్య సీఎంగా, తాను ఉప ముఖ్యమంత్రిగా.. లోకసభ ఎన్నికల వరకు కేపీసీపీ అధ్యక్షుడిగా కొనసాగాలని హైకమాండ్ తీర్మానించిన విధంగా జరగాలని పట్టుబట్టినట్లు తెలిసింది. ఇన మాట ప్రకారం నడుచుకోవాలని, తనను ముఖ్యమంత్రి చేయాలని భీషి్మంచుకుని కూర్చొన్నారు. మరో వైపు డీకే శివకుమార్కు మద్దతుగా ఒక్కో ఎమ్మెల్యే ఢిల్లీకి తమ గొంతు వినిపిస్తున్నారు. తక్షణమే శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఎమ్మెల్యేల అభిప్రాయం సేకరించాలని, రహస్య ఓటింగ్ కూడా నిర్వహించాలని కూడా డీకే శివకుమార్ వర్గం వాదిస్తోంది. -
ఎట్టకేలకు డీసీసీ అధ్యక్షుల నియామకం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు జిల్లా పార్టీ సారథులను నియమించింది. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు మినహా అన్ని జిల్లాలు, కార్పొరేషన్లకు డీసీసీ (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షులను నియమిస్తూ శనివారం రాత్రి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురు ఎమ్మెల్యేలకు డీసీసీ పగ్గాలిచ్చారు. వీరిలో మేడిపల్లి సత్యం, బీర్ల అయిలయ్య, చిక్కుడు వంశీకృష్ణ, ఎంఎస్.రాజ్ఠాకూర్, వెడ్మ బొజ్జు ఉన్నారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె.శివసేనారెడ్డికి కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. మరో ఐదుగురు మహిళా నాయకురాళ్లను కూడా కాంగ్రెస్ అధిష్టానం డీసీసీ అధ్యక్షులుగా నియమించింది. డీసీసీ అధ్యక్షుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం సామాజిక సమతుల్యతను పాటించింది. మొత్తం 36 పదవులను ప్రకటించగా, అందులో 27 పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనాకాంగ్రెస్ లకు కేటాయించింది. ఓసీలకు తొమ్మిదింటిని కేటాయించింది. ఆయా సామాజికవర్గాల వారీగా చూస్తే..బీసీలకు 14, ఎస్సీలకు 5, ఎస్టీలకు 6, మైనార్టీలకు 2 డీసీసీ పదవులు దక్కాయి. -
అప్పులపై రేవంత్ తప్పుడు ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోపాటు గత ప్రభుత్వం చేసిన అప్పులపై పదేపదే చెబుతున్న ’కాకి లెక్కల’ డొల్లతనం కాగ్ నివేదిక ద్వారా మరోసారి పూర్తిగా బట్టబయలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాగ్ అక్టోబర్ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు, అప్పులు.. వాటికి కడుతున్న వడ్డీల లెక్కలను స్పష్టంగా పేర్కొందన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ పదేపదే అప్పులపై కాకి లెక్కలు చెప్తోందని తేలిపోయిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికే ప్రభుత్వ ఆదాయం, కొత్త అప్పులు సరిపోతున్నాయంటూ కాంగ్రెస్ చేస్తున్న దు్రష్పచారాన్ని కాగ్ తాజా లెక్కలు పూర్తిగా కొట్టిపారేశాయని ఆయన ధ్వజమెత్తారు. ప్రతి నెలా రూ. 6,000 నుంచి రూ.7,000 కోట్లు వడ్డీల కోసమే చెల్లిస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి పదేపదే చెబుతున్నారని విమర్శించారు. కానీ కాగ్ ఇచ్చిన తాజా నివేదిక కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధాల పైన మరోసారి చెంపదెబ్బ లాంటి వాస్తవాలను బయటపెట్టిందని కేటీఆర్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో మండిపడ్డారు. సగటు వడ్డీ రూ.2,361 కోట్లు ‘కాగ్ లెక్కల ప్రకారం ఏప్రిల్ 2025 నుంచి అక్టోబర్ 2025 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన మొత్తం వడ్డీ కేవలం రూ.16,529.88 కోట్లు. అంటే నెలకు సగటున కేవలం రూ. 2,361.41 కోట్లు మాత్రమే. వడ్డీల పేరిట అబద్ధాలతోపాటు చేతకానితనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దాచి పెట్టుకుంటోంది. పార్లమెంట్ లెక్కల ప్రకారం.. పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రూ.2.80 లక్షల కోట్ల అప్పులు తీసుకొస్తే, 23 నెలల కాలంలోనే దాదాపు రూ.2.30 లక్షల కోట్ల అప్పులను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో చేస్తున్న అప్పులన్నీ ఎవరి జేబుల్లోకి పోతున్నాయో ప్రజలకు తెలియజేయాలి. వడ్డీల పేరుతో పదేపదే అబద్ధాలు చెబుతూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్న రేవంత్ ప్రభుత్వం ఈ అప్పులన్నింటినీ తమ అనుచరులు, మధ్యవర్తులు, ఢిల్లీకి మూటలను పంపడానికే ఉపయోగిస్తున్నారు’అని కేటీఆర్ చెప్పారు. -
పరిశ్రమల భూములు పప్పు బెల్లాలకు అమ్మేస్తారా?
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామికవాడల్లోని సుమారు పది వేల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం పప్పు బెల్లాలకు అమ్ముకునే కుట్రకు తెరలేపిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. హైదరాబాద్ ఇండ్రస్టియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హిల్ట్ పి).. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ లూటింగ్ పాలసీగా మారుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూముల అడ్డగోలు అమ్మకం మీద దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. ఎకరాలు, గుంటలు, గజాలను కూడా వదిలిపెట్టకుండా అడ్డగోలుగా భూముల అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో భూముల అమ్మకంపై ప్రవచనాలు వల్లించిన రేవంత్.. ఇప్పుడు భవిష్యత్తు అవసరాలకు కూడా మిగలకుండా అమ్మేస్తున్నాడని మండిపడ్డారు. ‘రాష్ట్ర బడ్జెట్తో పోలిస్తే ప్రస్తుత కుంభకోణం రెండు రెట్లు పెద్దది. రెండు నెలల్లో రూ.5 లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు రేవంత్ సర్కారు స్కెచ్ వేసింది..’అని ఆరోపించారు. రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు ‘హిల్ట్ పి’తో ప్రభుత్వం తెరలేపిన విషయాన్ని మంత్రి శ్రీధర్బాబు కూడా అంగీకరించాడని పేర్కొన్నారు. కొత్త పాలసీపై ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలని సవాల్ చేశారు. శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్రావు మాట్లాడారు. తాను లేవనెత్తే ఎనిమిది అంశాలపై ప్రభుత్వం సూటిగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్ఆర్ఓ రేటునే ఎందుకు పరిగణనలోకి తీసుకున్నారు? ‘సబ్ రిజి్రస్టార్ కార్యాలయం (ఎస్ఆర్ఓ) ధరలతో పోలిస్తే టీజీఐఐసీ నిర్దేశించిన భూముల ధరలు ఎక్కువ. కానీ రేవంత్ ప్రభుత్వం ఎస్ఆర్ఓ ధరల్లో కేవలం 30 శాతం రేటు చెల్లించే వారికి భూములు కట్టబెడుతోంది. ఎస్ఆర్ఓ రేటునే ఎందుకు పరిగణనలోకి తీసుకున్నారు? హైదరాబాద్లో తక్కువగా ఉన్న ఎస్ఆర్ఓ ధరలు సవరిస్తామని చెప్పిన రేవంత్ ప్రభుత్వం, సవరణ చేయకముందే ఎవరి మేలు కోసం హడావుడిగా ‘హిల్ట్ పి’అమలు చేస్తోంది. రూ.లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు రాకుండా ఎందుకు నష్టం చేస్తున్నారు? లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) విషయంలో బీఆర్ఎస్పై ఆరోపణలు చేసి అధికారంలోకి వచి్చన కాంగ్రెస్.. పేదలు, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్లపై ఎస్ఆర్ఓపై అదనంగా 60 నుంచి 80 శాతం వసూలు చేసింది. అదే ‘హిల్ట్ పి’అమలుతో ల్యాండ్ కన్వర్షన్, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ తదితరాల రూపంలో హెచ్ఎండీఏకు రూ.13,500 కోట్లు రాకుండా రేవంత్ ప్రభుత్వం చేస్తోంది. ఓఆర్ఆర్ లోపల మాత్రమే కాకుండా ఓఆర్ఆర్ చుట్టు పక్కల భూములు కూడా కొల్లగొట్టేలా పాలసీని తయారు చేసింది నిజం కాదా? ఎస్ఆర్ఓ ధరల్లో 30 శాతం వసూలు ద్వారా వచ్చే మొత్తంతో కొత్త పారిశ్రామిక వాడలు, క్లస్టర్లు అభివృద్ధి చేస్తారా? లేక బడా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తారా? అనే అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి..’అని హరీశ్రావు డిమాండ్ చేశారు. ఎనుముల సోదరుల జేబులు నింపేందుకే.. ‘ఎనుముల సోదరుల జేబులు నింపేందుకే సీఎం ‘హిల్ట్ పి’తెచ్చారు. ఆరు నెలల క్రితమే పాలసీని రూపొందించి అది బహిర్గతం కాకమునుపే రేవంత్రెడ్డి సోదరులు అగ్రిమెంట్లు చేసుకుని కమీషన్లు, వాటాలు కూడా మాట్లాడుకున్నారు. విలువైన భూములు సగానికి సగం అనుముల బ్రదర్స్ చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఆ ఒప్పందాల వివరాలు త్వరలో బయట పెడతాం. గతంలో ఇలాంటి ప్రతిపాదన మేం తిరస్కరించాం. మంత్రి శ్రీధర్బాబు భూ కుంభకోణం పరిధిని తగ్గించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రూ.5 లక్షల కోట్ల విలువైన భూమిని రూ.5 వేల కోట్లకే ఎందుకు కట్టబెడుతున్నారో ఆయన చెప్పాలి. తిట్టినా, కేసులు పెట్టినా రేవంత్ను వదిలేది లేదు..’అని హరీశ్రావు స్పష్టం చేశారు. -
త్యాగాలకు కూడా ఓ హద్దు ఉంటుంది!
ఆయన పార్టీ కోసం ఎంతో చేశారు. అలాంటి వ్యక్తిని మోసం చేయడం వెన్నుపోటు కిందే లెక్క. త్యాగాలకు కూడా ఓ హద్దు ఉంటుంది. అది దాటితే పరిస్థితులు మరోలా మారతాయ్.. డీకే శివకుమార్ వర్గీయులు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల సారాంశం ఇది. శనివారం కర్ణాటక పవర్ పాలిటిక్స్ ఎపిసోడ్కు పుల్స్టాప్ పడుతుందనే ప్రచారం వేళ.. ఈ తరహా పోస్టులు కుప్పలుగా కనిపిస్తున్నాయక్కడి గ్రూపుల్లో!.. కర్ణాటకలో నాయకత్వం మార్పు కోరుతూ అధికార పార్టీ రాజకీయం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను సీఎం చేయాలంటూ ఆయన వర్గీయులు పట్టుబడుతున్నారు. ఇప్పటికే డజను మంది ఎమెల్యేలు ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలిసి తమ గళం వినిపించారు. ఇవాళ బెంగళూరు పర్యటనలో ఉన్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను మరోసారి కలవాలనుకుంటున్నారు. మరోవైపు.. ఈ వ్యవహారంపై బహిరంగంగా ఎలాంటి కామెంట్లు చేయని డీకే శివకుమార్ మాత్రం గప్చుప్గా జైల్లో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ములాఖత్కావడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఆయన త్యాగాలకు అంతే లేదా?.. బిహార్ ఎన్నికల ఫలితంతో తీవ్ర నిరాశలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటకలో రాజకీయ సంక్షోభాన్ని కోరుకోవడం లేదు. అందుకే నాయకత్వ మార్పు ఉండదనే సంకేతాలను కాంగ్రెస్ వర్గాలకు పంపిస్తోంది. ఇది సిద్ధరామయ్య వర్గీయులకు ఊరట ఇచ్చే విషయమే. అదే సమయంలో డీకే శివకుమార్ వర్గం మాత్రం అధిష్టానంపై ఒత్తిడి పెంచాలనే చూస్తోంది. సోషల్ మీడియాలో వినూత్న ప్రచారానికి దిగింది. ఆయనపై సింపథీ పెంచేందుకు గత త్యాగాలను గుర్తు చేస్తోంది. డీకే త్యాగాల ట్రాక్ రికార్డుడీకే శివకుమార్.. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్త. గాంధీ కుటుంబానికి వీరవిధేయుడు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాలోకి అడుగుపెట్టి 1989లో తొలిసారి సతనుర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా నెగ్గారు. యువ నాయకుడిగా పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. రెండో దఫా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఎస్ఎం కృష్ణ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూనే ఉన్నారాయన. 2004–2013 మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాలో ఉంది. ఆ సమయంలో పార్టీని నిలబెట్టడానికి డీకే శివకుమార్ విశేషంగా కృషి చేశారు. ఆ సమయంలోనే సీఎం కుర్చీ కోసం ప్రయత్నాలు చేయాలంటూ అనుచరులు ఒత్తిడి చేసినా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ వాళ్లకు సర్దిచెప్పారు. ఈలోపు 2014–2019 మధ్య కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ సమయంలో సిద్దూ సర్కార్లో మంత్రిగా పని చేశారు సిద్ధరామయ్య. అయితే.. 2019లో ED (Enforcement Directorate) దర్యాప్తు కారణంగా మంత్రిత్వ పదవి కోల్పోయారు. ఆ సమయంలో తన వ్యక్తిగత భవిష్యత్తును పక్కన పెట్టి, పార్టీ కోసం త్యాగం చేశారు.అలా ట్రబుల్ షూటర్గా దేశవ్యాప్తంగా..2019లో.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కూలకుండా.. ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకున్నారు డీకే శివకుమార్. అలా “ట్రబుల్ షూటర్”గా ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆపై 2020లో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(KPCC) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పార్టీని బలోపేతం చేసేందుకు అన్నివిధాల కృషి చేశారు. అక్కడి నుంచి 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ఆయన పేరు దేశం మొత్తం వినిపించింది. అయితే తన అనుచరులు ఆయనను ముఖ్యమంత్రి కావాలని కోరినా.. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించారు.కష్టపడి.. త్యాగాలు చేసినవాళలకు ఆశలు ఉండడం సహజమేనని.. అయినా తనకు పార్టీ నిర్ణయమే తుదిదని చెబుతూ వస్తున్న డీకేకు ఇప్పుడు మద్దతు పెరుగుతోంది. తొలి నుంచి చేస్తున్న త్యాగాలు.. పార్టీ బలోపేతం కోసం చేసిన ప్రయత్నాలు.. ప్రభుత్వం కుప్పకూలకుండా చూసిన వైనం.. పార్టీ గెలుపు కోసం చేసిన కృషి, చివరకు ప్రత్యర్థులు ఎంత ఆశ చూపినా.. అధికారం కంటే పార్టీనే ముఖ్యమనుకుంటున్న ఆయన నిజాయితీతో కూడిన రాజకీయానికి పార్టీ తగిన న్యాయం చేయాలని మద్దతుదారులు పోస్టులు పెడుతున్నారు. -
Magazine Story : 11 ఏళ్లయ్యింది! రాహులో రాహులా!!
-
తారస్థాయికి కాంగ్రెస్ వర్గపోరు
సాక్షి, బెంగళూరు : ట్రబుల్ షూటర్గా పేరొందిన కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాజకీయ చదరంగంలో వేగం పెంచారు. 2023 ఎన్నికల సమయంలో కేపీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన చేసి, పార్టీని ఏకతాటిపైకి తెచ్చి అఖండ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఆయన తన కృషికి ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని ఆశపడ్డారు. అయితే డీకే శివకుమార్ ఆశలకు సీనియర్ నేత సిద్ధరామయ్య బ్రేకులు వేశారు. ముఖ్యమంత్రి పదవికి డీకే శివకుమార్తో పోటీ పడ్డారు. బలమైన ఎమ్మెల్యేల మద్దతుతో సిద్ధరామయ్య ఢిల్లీలో చక్రం తిప్పడంతో హైకమాండ్ సిద్ధరామయ్య వైపు మొగ్గింది. దీంతో డీకే కినుక వహించడంతో రొటేషన్ పద్ధతితో చెరో రెండున్నరేళ్లు పవర్ షేరింగ్కు ఇద్దరు నేతలను ఒప్పించి.. డీకేను ఉప మఖ్యమంత్రి చేసిందని రాజకీయ వర్గాల్లో చర్చలు సాగాయి. ఈ క్రమంలో ఈ ఏడాది నవంబర్ 20తో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. అనధికార రహస్య ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి పదవిని డీకే శివకుమార్కు సిద్ధరామయ్య అప్పగించాలి. అయితే సిద్ధరామయ్య అడ్డం తిరిగి సీఎం పదవి నుంచి దిగిపోయేందుకు ససేమిరా అనేశారు. దీంతో డీకే శివకుమార్ ఖంగు తిన్నారు. హైకమాండ్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తన మద్దతుదారులను ఢిల్లీ పంపి అధిష్టానంపై వారి ద్వారా ఒత్తిడి తెచ్చేందుకు యతి్నస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం వారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి అధికార మారి్పడి ఒప్పందానికి కట్టుబడి ఉండాలని విన్నవించారు. డీకే శిబిరంలో మంత్రులు చెలువరాయస్వామి, కుణిగల్ ఎమ్మెల్యే హెచ్డీ రంగనాథ్, హొసకోటె ఎమ్మెల్యే శరత్ బచ్చేగౌడ, ఆనేకల్ ఎమ్మెల్యే శివణ్ణ, శృంగేరి ఎమ్మెల్యే రాజేగౌడ, నెలమంగల ఎమ్మెల్యే శ్రీనివాస్, గుబ్బి ఎమ్మెల్యే ఎస్ఆర్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ దినేశ్ గూళిగౌడ తదితరులు ఢిల్లీలో హైకమాండ్తో చర్చలు జరుపుతున్నారు. సీఎం కుర్చీని నేనొదలను..‘సీఎం కుర్చీని నేను వదలనుగాక వదలను’అన్నట్లుంది ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీరు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గానికి చెందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళ్లి అధికార మారి్పడి ఒప్పందాన్ని అమలు చేయాలని హైకమాండ్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకున్న సిద్ధరామయ్య వర్గం వెంటనే అలర్ట్ అయ్యింది. మంత్రులు డాక్టర్ జి.పరమేశ్వర్, డాక్టర్ హెచ్సీ మహదేవప్ప, సతీశ్ జార్కిహోళి, దినేశ్ గుండూరావు, వెంకటేశ్, మాజీ మంత్రి కేఎన్ రాజణ్ణ తదితరులు బెంగళూరులో సతీశ్ జార్కిహోళి ఇంటిలో డిన్నర్ మీటింగ్లో కలుసుకుని, ఐదేళ్ల పూర్తి కాలం ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యనే కొనసాగేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించుకున్నారు. డీకే వర్గం తరహాలో తాము కూడా ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలకు సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని మనవి చేయాలని తీర్మానించారు. మల్లికార్జున ఖర్గే చేతుల్లో నిర్ణయం?రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఎత్తుకు పైఎత్తులు, వర్గ పోరు అధికమవ్వడంతో మల్లికార్జున ఖర్గే శనివారం బెంగళూరుకు రానున్నట్లు తెలిసింది. ఇరు వర్గాల నేతలతో వేర్వేరుగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారని సమాచారం. గురువారం చామరాజనగరలో సిద్ధరామయ్య మాట్లాడుతూ ఐదేళ్లూ తానే సీఎం అని, వచ్చే బడ్జెట్ను కూడా తానే ప్రవేశపెడతానని చెప్పుకు రావడం చూస్తుంటే అధిష్టానం మద్దతు సిద్ధరామయ్యకేనని తెలుస్తోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల సిద్ధరామయ్య.. రాహుల్ గాందీ, మల్లికార్జున ఖర్గేలతో సమావేశం అవ్వడాన్ని ఉదహరిస్తున్నారు. ఇటీవల బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమితో అధిష్టానం పూర్తిగా డీలా పడిన నేపథ్యంలో కర్ణాటక విషయంలో కోరి కొరివితో తల గోక్కోవడం ఎందుకనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. -
రూ.5 లక్షల కోట్ల స్కామ్: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పారిశ్రామిక భూముల బదిలీ విధానం (ఇండ్రస్టియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హిల్టప్) పేరిట ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు ఆరోపించారు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ అని ఆయన అన్నారు.సీఎంకు సన్నిహితంగా ఉండే రాజకీయ మధ్యవర్తులు, సోదరులు, బంధువులు, రియల్ ఎస్టేట్ గ్రూపులకు లబ్ధి చేకూర్చేందుకే హిల్టప్ రూపొందించారని చెప్పారు. హిల్టప్ ద్వారా వేలాది ఎకరాల పారిశ్రామిక భూములను అతి తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మేం 200% వరకు అదనంగా వసూలు చేశాం‘హైదరాబాద్లోని బాలానగర్, జీడిమెట్ల, సనత్నగర్, ఆజామాబాద్ తదితర కీలక పారిశ్రామిక వాడల్లోని సుమారు 9,292 ఎకరాల విలువైన భూమిని క్రమబదీ్ధకరించేందుకు హిల్టప్ తెచ్చారు. ఎకరా భూమిని సగటున కనీసం రూ.50 కోట్లుగా పరిగణించి లెక్కిస్తే ఈ భూముల విలువ రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఈ భూములను రిజి్రస్టేషన్ విలువలో కేవలం 30 శాతానికే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని రేవంత్ ప్రభుత్వం చూస్తోంది. ఎస్ఆర్ఓ విలువలో కేవలం 30 శాతం వసూలు ద్వారా ప్రైవేటు వ్యక్తులకు లక్షల కోట్ల రూపాయల లబ్ధి జరుగుతుంది. గతంలో మేము ఆజామాబాద్ పారిశ్రామిక వాడలోని భూములకు ఎస్ఆర్ఓ రేట్ల కంటే 100 నుంచి 200 శాతం అదనంగా వసూలు చేసి ఖజానాకు ఆదాయం సమకూర్చాం..’అని కేటీఆర్ పేర్కొన్నారు. క్రమబద్ధీకరణకు మేం అంగీకరించలేదు‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ అనేక మంది భూ యజమానులు, బ్రోకర్లు అత్యంత తక్కువ ధరలకు క్రమబద్ధీకరణ కోసం నన్ను సంప్రదించినా తిరస్కరించా. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ ప్రయోజనాల కోసం చౌకగా ఇవ్వలేమని చెప్తే ఇప్పుడు రేవంత్ మాత్రం..అప్పనంగా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రైవేటు వ్యక్తులకు భూముల క్రమబద్ధీకరణ 45 రోజుల్లో పూర్తి చేయాలనే హిల్టప్ పాలసీ వెనుక ప్రభుత్వ తొందరపాటు కనిపిస్తోంది. ఈ పాలసీ కేబినెట్ ముందుకు రాకమునుపే రేవంత్ సోదరులు, అనుచరులు, బ్రోకర్లు ముందస్తు డీల్స్ కుదుర్చుకున్నారు. హి«ల్టప్ పాలసీ కాంగ్రెస్కు ఏటీఎమ్గా మారి, ఎంపిక చేసిన కొద్ది మందిని ధనవంతులుగా మారుస్తుంది..’అని బీఆర్ఎస్ నేత చెప్పారు.రియల్ ఎస్టేట్ ఏజెంట్లా రేవంత్ ‘సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లా వ్యవహరిస్తూ మెట్రో రైలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పారిశ్రామిక భూములపై కన్నేశారు. ఇందిరమ్మ ఇళ్లు, స్మశాన వాటికలకు కూడా భూమి దొరకని హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని రేవంత్ అనుకుంటున్నారు. తద్వారా కనీసం రూ. 50 వేల కోట్లను తన జేబులో వేసుకోవాలని చూస్తున్నాడు.హిల్టప్ కింద ఒప్పందాలు కుదుర్చుకునే పారిశ్రామికవేత్తలు భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమబదీ్ధకరణను రద్దు చేసి కుంభకోణంలో భాగస్వాములైన వారిపై చర్యలు తీసుకుంటుంది. హిల్టప్ పాలసీని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘ఫార్ములా ఈ’రేసు వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఈ విషయంలో లై డిటెక్టర్ టెస్టుకు కూడా సిద్ధమని ప్రకటించారు. -
కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లో అతిపెద్ద భూకుంభకోణానికి తెరలేపింది
-
కర్ణాటక సీఎం పీఠం కోసం కాంగ్రెస్ కొట్లాట
-
రేవంత్ ముఠా హవా.. 9300 ఎకరాల కుంభకోణం: కేటీఆర్
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణలో భూకుంభకోణం జరుగుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాలుగు లక్షల కోట్ల విలువ చేసే భూమిని కొల్లగొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ ముఠా ప్రయత్నిస్తుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఫార్ములా ఈ కారు రేసు కేసులో తాను ఏ తప్పు చేయలేదన్నారు. తనను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చేయడు అంటూ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో భూములు ఎక్కడున్నా రేవంత్ ముఠా అక్కడ వాలిపోతోంది. ఎంతో విలువైన భూములపై రేవంత్ కుటుంబ సభ్యుల కన్ను పడింది. బాలానగర్ పరిసరాల్లో సుమారు 9300 ఎకరాల భూకుంభకోణం జరుగుతోంది. బాలానగర్, కాటేదాన్, జీడిమెట్లతో తన వాళ్లకు రేవంత్ భూములిచ్చారు. నాలుగు లక్షల కోట్ల కుంభకోణం జరుగుతోంది. జపాన్లో ఉన్నప్పుడు కూడా ఆ భూమికి సంబంధించిన ఫైల్పై రేవంత్ ఆదేశాలు ఇచ్చారు.కుంభకోణంలో బీజేపీ..రేవంత్ భూకుంభకోణంపై బీజేపీ నేతలు స్పందించాలి. బీజేపీ కూడా కుంభకోణంలో భాగం. అందుకే స్పందించడం లేదు. ఏవీ రెడ్డి, కృష్ణారెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డిలకు భూములను అప్పజెప్పే యత్నం జరుగుతోంది. కుంభకోణంపై పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి భూకుంభకోణంపై న్యాయపోరాటం చేస్తాం. రేవంత్ ప్రభుత్వంతో పాటు.. భూములు పొందినవారు ఇబ్బందులు పడతారు. పారిశ్రామికవేత్తలు సీఎం రేవంత్ రెడ్డి ట్రాప్లో పడొద్దు. పెరిగిన భూముల విలువను.. రేవంత్ పేటీఎంగా మార్చుకున్నారు. మెట్రో భూములు, సెంట్రల్ యూనివర్శిటీ భూములపై రేవంత్ రెడ్డి కన్ను పడింది. ప్రజల ఆస్తిని ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు అప్పజెప్తున్నారు. మా ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా విచారణ జరుపుతాం.ప్రతీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో అతిపెద్ద భూకుంభకోణానికి తెరలేపారు. బీఆర్ఎస్ హయాంలో 2022లో భూముల రెగ్యులేషన్కు చట్టం తెచ్చాం. భూములకు వంద శాతం ఫీజు కట్టేలా నిబంధన చేర్చాం. వేరే వాళ్లకు అమ్ముకుంటే రెండు వందల శాతం చెల్లించాలి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు పట్టించుకోకుండానే భూ కేటాయింపులు చేసింది. 30 శాతం కడితే రెగ్యులర్ చేస్తామని ఉత్తర్వులు ఇచ్చారు అని ఆరోపణలు చేశారు. నేను ఏ తప్పు చేయలేదు..అలాగే, ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో గవర్నర్ ప్రాసిక్యూషన్కి అనుమతిపై కేటీఆర్ స్పందిస్తూ..‘చట్టం తన పని తాను చేసుకుంటుంది. నన్ను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చేయడు. ఫార్ములా కారు రేసింగ్లో నేను ఏ తప్పు చేయలేదు. లై డిటెక్టివ్ టెస్టుకు నేను రెడీ. కారు రేసులో ఏమీ లేదని రేవంత్కు కూడా తెలుసు. కడియం శ్రీహరిని కాపాడి దానం నాగేందర్తో రాజీనామా చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా GHMC ఎన్నికలు వస్తాయి. తర్వాత ఉప ఎన్నికలు వస్తాయి. దానం కాంగ్రెస్ గుర్తుపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి దొరికిపోయాడు. అనర్హత వేటు పడితే.. ఇజ్జత్ పోతుందని.. రాజీనామా చేపిస్తున్నారు. సాంకేతిక సాకులు చూపి.. కడియంను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక కంటే ముందే గ్రేటర్ ఎన్నికలొస్తాయి. కాంగ్రెస్, బీజేపీలు కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. తెలంగాణలో జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తుంది. మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తాం.. అన్ని లెక్కలు తెలుస్తాం’ అని హెచ్చరించారు. -
పవర్ పాలిటిక్స్ వేళ డీకే ఆసక్తికర ట్వీట్
సాక్షి, ఢిల్లీ: కర్ణాటకలో మళ్లీ పవర్ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. కర్ణాటక సర్కార్ ఏర్పడి నిన్నటితో రెండున్నరేళ్లు పూర్తైంది. దీంతో పవర్షేరింగ్ ఒప్పందం ప్రకారం సీఎం సిద్ధరామయ్యను గద్దె దించి.. తనను సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలని పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో ఆయన నేరుగా రంగంలోకి దిగకుండా.. తన అనుచరులను అధిష్టానంతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. డీకే శివకుమార్కు కర్ణాటక ప్రభుత్వంలో 20 మంది ఎమ్మెల్యేలు.. ముగ్గురు మంత్రుల మద్దతు ఉంది. ఇందులో పది మంది తాజాగా ఢిల్లీకి వెళ్లారు. నాయకత్వాన్ని మార్చాల్సిందేనని హైకమాండ్ను వాళ్ల కోరనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అప్పాయింట్మెంట్ లభించినట్లు సమాచారం. మరోవైపు.. సిద్ధరామయ్య తన మాట నిలబెట్టుకోవాలంటూ డీకే శివకుమార్ సోదరుడు, డీకే సురేష్ కోరుతున్నారు.నాయకత్వ మార్పు ప్రయత్నాల్లో వేగం పెంచిన డీకే.. ఈ ఉదయం ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ‘‘ఎక్కడ ప్రయత్నాలు ఉంటాయో.. అక్కడ ఫలితం ఉంటుంది ... ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు’’ అంటూ నర్మగర్భంగా ట్వీట్ చేశారు. ಎಲ್ಲಿ ಶ್ರಮ ಇದೆಯೋ ಅಲ್ಲಿ ಫಲವಿದೆ, ಎಲ್ಲಿ ಭಕ್ತಿ ಇದೆಯೋ ಅಲ್ಲಿ ಭಗವಂತ ಇದ್ದಾನೆ.. pic.twitter.com/7HyiIPWk1y— DK Shivakumar (@DKShivakumar) November 21, 2025అయితే ఐదేళ్లు సీఎంగా తానే కొనసాగాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు. ఇప్పటికే మంత్రి వర్గ విస్తరణకు అనుమతి కోరిన ఆయన.. తన వర్గీయులను కూడా ఢిల్లీకి పంపించే యోచనలో ఉన్నట్లు సమాచారం. క్యాబినెట్ విస్తరణతో అసమ్మతికి చెక్ పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అంతేకాదు.. పీసీసీ చీఫ్ పదవి నుంచి శివకుమార్ను తొలగించే ప్రయత్నాల్లో ఆయన సగం సక్సెస్ అయినట్లు సమాచారం. ఇక.. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఇప్పట్లో నాయకత్వ మార్పిడి లేదని సంకేతాలు ఇస్తోంది. ఎవరినీ ఢిల్లీకి రావొద్దని కోరింది. అయినప్పటికీ.. ఇరు వర్గాల ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలను ఆపడం లేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇప్పటికే నాయకత్వం మార్పిడిపై తుది నిర్ణయం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీదేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు.. కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందే తమకు శిరోధార్యమణి మరికొందరు ఎమ్మెల్యేలు చెబుతుండడం గమనార్హం. దీంతో.. సిద్ధూ, డీకే.. అధిష్టానం.. ఇలా మూడు వర్గాలుగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చీలినట్లు స్పష్టమవుతోంది. -
ఇండియా కూటమికి టాటా చెప్పే యోచనలో..
తీవ్ర సంక్షోభం దిశగా ఇండియా కూటమి రాజకీయం నడుస్తోంది. బిహార్ ఓటమికి కారణం కాంగ్రెస్ పార్టీ వైఖరేనంటూ ప్రధాన మిత్రపక్షాలు వెలేత్తి చూపిస్తున్నాయి. ప్రధానంగా ఆ పార్టీ వ్యూహాలను, నాయకత్వ లోపాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటిదాకా అంతర్గతంగా ఉన్న అసంతృప్తిని ఆ ఒక్క ఫలితం ఇప్పుడు విమర్శల రూపంలో బహిరంగ సంక్షోభంగా మార్చింది. కూటమిలోనే కొనసాగాలా? స్వతంత్ర మార్గం ఎంచుకోవాలా?.. అనే డైలామాలో ఇండియా కూటమి పార్టీలను పడేసింది. బిహార్ ఎన్నికల్లో సీట్ల పంపకాల్లో అలిగిన జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM).. స్వతంత్రంగా కూడా పోటీ చేయకుండా దూరంగా ఉండిపోయింది. కూటమి పెద్దన్న తమను మోసం చేసిందని.. ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని ఓపెన్గా కాంగ్రెస్పైనే ఆరోపణలు గుప్పించింది. తమను జూనియర్ పార్ట్నర్లా అవమానకర రీతిలో చూస్తున్న కూటమిలో కొనసాగాలా.. వద్దా? అనేది త్వరలో నిర్ణయిస్తామని ప్రకటించింది కూడా.మరో ఇండియా కూటమి పార్టీ.. శివసేన (UBT) బీహార్ ఫలితాన్ని ‘‘వేకప్ కాల్’’గా అభివర్ణించింది. వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్లు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమిష్టి వ్యూహం దెబ్బతిందని ఆరోపించింది. మిత్రపక్షాలతో జాతీయ పార్టీ సంప్రదింపులు లేకుండా ముందుకు వెళితే కూటమి నిలవదని హెచ్చరిస్తోంది. సమాజ్వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేశ్ యాదవ్ బీహార్ ఎన్నికల్లో మిత్రపక్ష కూటమి వ్యవహరించిన తీరు నుంచి లోపాల్ని ఎత్తిచూపారు. ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలని.. భవిష్యత్తులో ఇలాంటి జోక్యాలు జరగకుండా చూసుకోవాలని పరోక్షంగా కాంగ్రెస్కు హితవు పలికారు. ఈ క్రమంలో ఇండియా కూటమి బాధ్యతల నుంచి కాంగ్రెస్ తప్పుకుని.. ఆ బాధ్యతల్ని అఖిలేష్కు అప్పగించాలంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తుండడం గమనార్హం. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ది మరో పంథా. కూటమిలో మొదటి నుంచి ఆ పార్టీ స్వతంత్ర ధోరణి అవలంభిస్తోంది. రాష్ట్ర స్థాయి విస్తరణను జాతీయ వేదిక కోసం త్యాగం చేయలేమని ఇప్పటికే స్పష్టం చేసింది. అంతెందుకు బీహార్లో స్వతంత్రంగా పోటీ చేసిన ఆప్ నిర్ణయం ఓ ముందస్తు హెచ్చరిక అని.. ఈ స్వతంత్ర ధోరణి ఇతర మిత్రపక్షాలకు కూడా ఆదర్శంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. డీఎంకే ఏమందంటే.. బిహార్లో ఎన్డీయే విజయం కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి ఓ పాఠం అని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అన్నారు. కూటమి వ్యూహం, నాయకత్వం, సమన్వయంపై పునరాలోచన అవసరమని సూచించారు.అబ్బే.. అలాంటిదేం లేదుబిహార్లో బలహీన ప్రదర్శనతో కాంగ్రెస్ పైనే విమర్శలు ఎక్కువగా వినవస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కార్నర్ చేస్తూ ప్రత్యర్థులూ సెటైర్లు సంధిస్తున్నారు. ఈ తరుణంలో ఎన్నికల నిర్వహణ, అభ్యర్థుల ఎంపిక, సంస్థాగత విధానాల్లో మార్పులు చేయకపోతే కూటమి నిలవబోదంటూ మిత్రపక్షాలు హెచ్చరిస్తున్నాయి. అయితే కూటమి భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ భిన్నంగా స్పందించింది. మిత్రపక్షాలు నిష్క్రమించే యోచనలో ఉన్నాయన్న ప్రచారాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ కొట్టిపారేశారు. ‘‘ఇండియా కూటమి ఏర్పడినప్పటి నుంచి ఎలా ఉందో.. ఇప్పుడూ అలాగే ఉంది. ఏ ఓటమి కూడా కూటమిని ప్రభావితం చేయలేదు. తమిళనాడు ఎన్నికలకు డీఎంకేతో.. అసోం ఎన్నికల కోసం అక్కడి మిత్రపక్షాలతో వెళ్లబోతున్నాం. రాబోయే రోజుల్లో కూటమిని మరింత బలోపేతం చేస్తాం. ప్రాంతీయ పార్టీలతో చిన్న చిన్న సమస్యలున్నా.. జాతీయ స్థాయిలో బీజేపీ రాజకీయాలను ఎదుర్కోవడానికి మిత్రపక్షాలతో కలిసి పనిచేసి తీరతాం’’ అని ప్రకటించారాయన. అలా అయితే కష్టమే!ఇండియా కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు ఆచితూచి ఉండాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిత్రపక్షాల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు తక్షణ సంప్రదింపులు జరపాలని, సీట్ల పంపకాల విషయంలోనూ జాగ్రత్తగా కాంగ్రెస్కు సూచిస్తున్నారు. నాయకత్వ లోపాలను సవరించుకోకపోతే.. మార్పును కోరుకునే గళాలు రాబోయే రోజుల్లో పెరగొచ్చని, అది కూటమి విచ్ఛిన్నానికి దారి తీయక తప్పదని హెచ్చరిస్తున్నారు. -
పోరులో పాక్ గెల్చిందట!
న్యూఢిల్లీ: పహల్గామ్లో ఉగ్రవాదుల పాశవిక దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ జరిపిన దాడులకు పాకిస్తాన్ దీటుగా బదులిచ్చిందని, ఆ నాలుగు రోజుల పోరులో పాక్ పైచేయి సాధించిందని అమెరికా సెనేట్లో సమర్పించిన ఓ నివేదికపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇది మోదీ సర్కార్ దౌత్యవైఫల్యానికి ప్రబల నిదర్శనమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ గురువారం ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ వేళ కొనసాగిన పరస్పర సైనిక చర్యల్లో భారత్పై పాక్ విజయం సాధించిందని అమెరికా–చైనా ఆర్థిక, భద్రత సమీక్ష కమిషన్ మంగళవారం అమెరికా ఎగువసభ అయిన సెనేట్లో 800 పేజీల నివేదికను సమర్పించింది. ‘‘108, 109 పేజీల్లో ఏప్రిల్లో పహల్గాం దాడి వెనుక పాక్ హస్తముంది. ఆపరేషన్ సిందూర్ వేళ చైనా అందించిన అత్యాధునిక ఆయుధాలతో భారత్ను పాక్ ఓడించింది. చైనా అత్యాధునిక ఆయుధాలు, నిఘా సాయంతో పాక్ పైచేయి సాధించింది. పాక్ సైన్యం మాటున చైనా తన అధునాతన ఆయుధ సంపత్తిని నేరుగా భారత్ పరీక్షించుకునే సువర్ణావకాశాన్ని సద్వినియోగంచేసుకుంది. తద్వారా తమ ఆయుధాల పనితీరును ప్రపంచానికి చాటిచెప్పి అంతర్జాతీయ ఆయుధ, రక్షణ రంగ మార్కెట్లో తన వాటాను పెంచుకోవాలని చూసింది’’ అని నివేదిక పేర్కొంది. ‘‘ అమెరికా సెనేట్లో సమర్పించిన నివేదికను చూశాకైనా ప్రధాని మోదీ మౌనం వీడతారా? భారత విదేశాంగ శాఖ తన అభ్యంతరాలను వ్యక్తంచేస్తుందా?’’ అని జైరాం రమేశ్ సూటి ప్రశ్న వేశారు. -
ఫిరాయింపులపై తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల వ్యవహారం కీలక దశకు చేరుకుంది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మందిపై విచారణ పూర్తయింది. ఇరుపక్షాల వాదనలు పూర్తయిన నేపథ్యంలో స్పీకర్ తన తుది తీర్పును రిజర్వు చేశారు. ఇప్పటివరకు స్పీకర్ నోటీసులకు స్పందించని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి తాజాగా మరోమారు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ సారథ్యంలోని ట్రిబ్యునల్ రెండు విడతలుగా విచారణ జరిపింది.రెండో విడత విచారణలో భాగంగా ఈనెల 6, 7, 14, 15 తేదీల్లో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, డాక్టర్ ఎం.సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్రెడ్డి, అరికెపూడి గాం«దీని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ప్రశ్నించారు. తిరిగి తాజాగా 19, 20 తేదీల్లోనూ ఇరుపక్షాల న్యాయవాదులు స్పీకర్ ఎదుట మౌఖిక వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్రెడ్డి, అరికెపూడి గాం«దీ, డాక్టర్ ఎం.సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, గూడెం మహిపాల్రెడ్డి, కాలె యాదయ్య, టి.ప్రకాశ్ గౌడ్పై స్పీకర్ వద్ద బీఆర్ఎస్ ఈ ఏడాది ఆరంభంలో అనర్హత పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.వారికి మూడు రోజుల గడువునాలుగు వారాల్లోగా అనర్హత పిటిషన్ల అంశం తేల్చాలంటూ సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీకర్కు ఇటీవల గడువు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి కూడా స్పీకర్ తాజాగా మరోమారు నోటీసులు జారీచేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ గడువులో ఇప్పటికే వారం రోజులు పూర్తి కాగా, స్పీకర్ తన నిర్ణయం ప్రకటించేందుకు మరో మూడు వారాల సమయం ఉంది. ఈ నేపథ్యంలో దానం, కడియంకు జారీ చేసిన నోటీసుల్లో మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పీకర్ గడువు విధించినట్లు తెలిసింది.వారి నుంచి సమాధానం అందిన తర్వాత వాటిపై బీఆర్ఎస్ తన అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఇస్తారు. ఇరువర్గాల నుంచి అందిన సమాధానాలు, అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత స్పీకర్ వచ్చే నెల మొదటి వారంలో విచారణ షెడ్యూల్ను ప్రకటించే అవకాశముంది. ఈ ఇద్దరి పిటిషన్ల విచారణ పూర్తయిన తర్వాతే పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ తుది తీర్పును ప్రకటించే అవకాశముందని సమాచారం. అయితే ఎమ్మెల్యేలు స్పీకర్ విచారణకు హాజరవుతారా లేక అంతకుమునుపే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. -
‘సీఎంగా ఇంకెన్ని రోజులు ఉంటానో తెలియదు’
కొంతకాలంగా కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. పవర్ షేరింగ్ ఫార్ములా తెర మీదకు రావడం.. తన తండ్రి రాజకీయ భవిష్యత్తుపై సీఎం సిద్ధరామయ్య కొడుకు చేసిన వ్యాఖ్యలు.. అటుపై రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలన పూర్తి కావడంతో నవంబరులో నాయకత్వ మార్పు (Karnataka CM) తథ్యమని ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో పవర్ పాలిటిక్స్పై కర్ణాటక బీజేపీ యూనిట్ వ్యంగ్యంగా స్పందిస్తోంది. మొన్నీమధ్యే.. నవంబర్ వచ్చినా డీకేకు సీఎం సీటు మాత్రం దక్కలేదని పేర్కొంటూ ఏఐ ఫన్నీ (BJPs AI video) ఏఐ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా సీఎం సిద్ధరామయ్యను ఉద్దేశించి మరో వీడియోను పోస్ట్ చేసింది. అందులో.. సిద్ధరామయ్య ఫేస్బుక్ లైవ్లో ఉంటారు. సీఎంగా రెండున్నరేళ్ల పాలన పూర్తైందని.. సీఎంగా ఇంకా ఎంత కాలం కొనసాగుతానో తెలియదని.. అందుకే మీ ముందుకు వచ్చానని అంటారు. ఈలోపు.. కింద కామెంట్ సెక్షన్లో అజ్మల్, జమాల్, రఫీక్, ఫైజ్.. అనే యూజర్లు ‘ఐదేళ్లు మీరే సీఎంగా ఉండాలి’ అంటూ కామెంట్ పెడతారు. అయితే శంకర్ కనకపుర అనే వ్యక్తి మాత్రం.. ‘ఇంకెంత కాలం సీఎంగా ఉంటారు. రాజీనామా చేసి దిగిపోండి’ అని కామెంట్ చేస్తాడు. దీంతో అగ్గి మీద గుగ్గిలం అయిన సిద్ధరామయ్య.. ఎవరా వ్యక్తి.. అతన్ని బ్లాక్ చేస్తా అంటాడు. రెండు వర్గాలను ఉద్దేశించేలా.. కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ చేసిన ఈ సెటైరిక్ ఈ వీడియో ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. నాయకత్వ మార్పు నేపథ్యంతో అంతకు ముందు బీజేపీ ఏఐ ఆధారిత వీడియోలో డీకే శివకుమార్ని టార్గెట్ చేసింది. అందులో.. రాహుల్ గాంధీ వాట్సాప్లో హాయ్ అనే మెసేజ్ పంపిస్తారు. ఆ సమయంలో రాహుల్ పక్కన సిద్ధరామయ్య కూడా ఉంటారు. ఆ తర్వాత స్క్రాచ్ కార్డు పంపుతారు. డీకే దానిని స్క్రాచ్ చేయగా..‘నో ఛైర్ నవంబర్’ (No Chair November) అనే మెసేజ్ చూసి షాక్ అవుతాడు. మరోవైపు రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య కూడా నవ్వుకుంటారు. అనంతరం స్క్రీన్పై హస్కీ డ్యాన్స్ను దీనికి జోడించారు. బీజేపీ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. శివకుమార్కు ఇది కుర్చీలేని నవంబర్ అని వ్యంగ్యాస్త్రాలు విసిరింది. View this post on Instagram A post shared by BJP Karnataka (@bjp4karnataka) -
వైఎస్ జగన్పై.. కుమ్మక్కై అక్రమ కేసులు.. కుట్రలు పన్ని దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: పదిహేనేళ్ల క్రితం కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటై కుట్రపూరితంగా వైఎస్ జగన్పై తప్పుడు కేసులు బనాయించాయి. ఓదార్పు యాత్ర చేయడానికి వీల్లేదన్న కాంగ్రెస్తో తెర వెనుక జట్టుకట్టిన చంద్రబాబు తన వాళ్లు కూడా తప్పుడు కేసులు పెట్టేలా చక్రం తిప్పారు. రాజకీయంగా వైఎస్ జగన్ను అణగదొక్కాలన్న కాంగ్రెస్, చంద్రబాబు కుట్రలకు వంతపాడుతూ ఎల్లో మీడియా నిత్యం పచ్చి అబద్ధాలు, కట్టుకథలతో తప్పుడు రాతలు రాసింది.మహానేత వైఎస్సార్ జీవించి ఉన్నంత కాలం కాంగ్రెస్ అప్పటి అధినేత్రి సోనియా గాంధీకి, అధిష్ఠానానికి మంచివాడిలా కనిపించిన వైఎస్ జగన్.. వైఎస్సార్ హఠాత్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన ఆయన అభిమానులను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర చేపట్టడంతోనే నచ్చకుండాపోయారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఓవైపు కేంద్రంలో చేతిలో ఉన్న అధికార దుర్వినియోగంతో, మరోవైపు టీడీపీతో కుమ్మక్కయి రాజకీయంగా దిగజారి వైఎస్ జగన్పై అక్రమ కేసులు నమోదు చేసింది.16 నెలలు జైల్లో అక్రమంగా నిర్బంధించింది. అయినా, వైఎస్ జగన్ వెరవలేదు. 2009 నుంచి పదేళ్ల పాటు తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రజల కోసం నిలిచారు. అధికారంలోకి వచ్చాక 2019–24 మధ్య జనం మెచ్చేలా సుపరిపాలన అందించారు. ఆత్మీయత.. విశ్వసనీయత.. దార్శనికత.. పారదర్శకత.. మానవీయత కలగలసిన ప్రజా నాయకుడిగా ఎదిగారు. దీంతో వైఎస్ జగన్పై మళ్లీ కుట్రలు, కుయుక్తులకు తెరలేపారు.గత నెల యూరప్ పర్యటనకు అనుమతిస్తూ కోర్టు సూచన మేరకు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని న్యాయస్థానం ఎదుట హాజరుకానున్నారు. కోర్టు అనుమతితో వైఎస్ జగన్ గత నెల యూరప్ పర్యటనకు వెళ్లారు. అనుమతి మంజూరు చేసే సమయంలో పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత ఈ నెల 14లోపు కోర్టు ఎదుట హాజరుకావాలని జడ్జి సూచించారు. నేరుగా హాజరైతే తగిన ఏర్పాట్లు చేయడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుందని, ఆన్లైన్లో హాజరుకు అవకాశం ఇవ్వాలని జగన్ మెమో దాఖలు చేశారు. 16 నెలల అక్రమ నిర్బంధం అనంతరం విడుదలైన వైఎస్ జగన్కు అపూర్వ స్వాగతం పలికిన అభిమానులు (ఫైల్) అయితే, నేరుగా హాజరుకావాలని నిర్ణయించుకుని ఆ మెమోను వెనక్కు తీసుకున్నారు. ఈ సందర్భంగా 21లోగా హాజరుకావాలని న్యాయమూర్తి సూచించారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ గురువారం హాజరుకానున్నారు. దీనిపైన కూడా ఎల్లో మీడియా, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. మద్యం, స్కిల్ డెవలప్మెంట్, తదితర కేసుల్లో బెయిల్పైన ఉన్న సీఎం చంద్రబాబే అసలు దోషి. బెయిల్పైన ఉండే చంద్రబాబు సీఎంగా కొనసాగుతున్నారు. దీన్ని విస్మరించి జగన్ లక్ష్యంగా ఎల్లో మీడియా, టీడీపీ నేతలు దుష్ప్రచారం సాగిస్తుండటంపై రాజకీయ పరిశీలకుల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ఓదార్పు యాత్రలో ఓ అవ్వ ఆత్మీయత(ఫైల్) తప్పుడు కేసులేనని అంగీకరించిన శంకర్రావు, ఆజాద్వైఎస్ జగన్మోహన్రెడ్డిని అణగదొక్కేందుకు చంద్రబాబు నాయుడుతో జట్టు కట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం... తమ ఎమ్మెల్యే శంకర్రావు ద్వారా తప్పుడు ఆరోపణలతో హైకోర్టులో కేసు వేయించింది. దీనికి టీడీపీ నుంచి ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు జత కలుస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, ఈ కుమ్మక్కు కొంతకాలం తర్వాత కాంగ్రెస్ నేతల మాటల్లోనే స్పష్టమైంది. ‘‘వైఎస్ జగన్ను రాజకీయంగా వేధించేందుకే కేసులు వేశా. ఆయనపై కేసులు వేసేందుకు మా పార్టీ చీఫ్ (అప్పటి) సోనియాగాంధీ పేపర్లు పంపి సంతకాలు చేయమన్నారు.నేను చేశానంతే’’ అని శంకర్రావు, ‘‘రాజకీయంగా వైఎస్ జగన్ను ఇబ్బంది పెట్టాలనే అక్రమ కేసులు వేశాం’’ అని కాంగ్రెస్ మాజీ అగ్ర నేత గులాం నబీ అజాద్ వేర్వేరు సందర్భాల్లో మీడియా ఎదుట కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, సోనియా మాట విని ఓదార్పు యాత్ర చేయకుండా కాంగ్రెస్లోనే ఉండి ఉంటే 2014కు ముందే వైఎస్ జగన్ సీఎం అయ్యేవారని స్పష్టం చేయడం గమనార్హం. ఇలా, వైఎస్ జగన్మోహన్రెడ్డిని అణగదొక్కేందుకు దశాబ్దంన్నర కిందట చేసిన కుట్రలను నేటికీ టీడీపీ, ఎల్లోమీడియా కొనసాగిస్తుండడం గమనార్హం.‘‘వైఎస్ జగన్ను రాజకీయంగా వేధించేందుకే కేసులు వేశా. ఆయనపై కేసులు వేసేందుకు మా పార్టీ చీఫ్ (అప్పటి) సోనియాగాంధీ పేపర్లు పంపి సంతకాలు చేయమన్నారు. నేను చేశానంతే’’-కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు బతికుండగా పలుమార్లు చేసిన వ్యాఖ్యలు ఇవీ... ‘‘రాజకీయంగా వైఎస్ జగన్ను ఇబ్బంది పెట్టాలనే అక్రమ కేసులు వేశాం. సోనియా గాంధీ మాట విని ఓదార్పు యాత్ర చేయకుండా కాంగ్రెస్లోనే ఉండి ఉంటే 2014కు ముందే వైఎస్ జగన్ సీఎం అయ్యేవారు’ - ఇవీ కాంగ్రెస్ మాజీ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ గతంలో చేసిన వ్యాఖ్యలు -
పని చేసేవారు ఒకరు.. లాభపడేవారు మరొకరు
నవంబర్ 20.. కర్ణాటక రాజకీయాల్లో కీలక దినంగా మారనుందా?. కాంగ్రెస్ ప్రభుత్వం సగం ఏడాది పూర్తి చేసుకుంటున్న తరుణంలో.. నాయకత్వ మార్పు ఉంటుందా? లేదా? అనే చర్చ జోరుగా నడుస్తోంది. ఈ దరిమిలా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఏమైనా సంచలన ప్రకటన చేస్తారా? అని రాజకీయ వర్గాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. నాయకత్వ మార్పు ప్రచారంపై డీకే శివకుమార్ ఎప్పటికప్పుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాను కరడుగట్టిన.. నిబద్ధత కలిగిన కాంగ్రెస్ కార్యకర్తనని చెబుతూనే.. కష్టపడి వాళ్లకు, త్యాగాలు చేసేవాళ్లకు ఆశలు ఉండడం సహజమంటూ ప్రకటనలు ఇస్తూ వస్తున్నారాయన. అయితే సీఎం మార్పు సంగతి ఏమోగానీ.. ఈలోపే డీకే శివకుమార్ మరో బాంబ్ పేల్చారు. టీపీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఇవాళ ఇందిరా గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. మనుషులు రెండు రకాలు ఉంటారు. ఒకరు పని చేస్తే.. మరొకరు లాభపడుతుంటారు. మొదటి రకంగా ఉండాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలకు దివంగత ఇందిరా గాంధీ పిలుపు ఇస్తూ ఉండేవారు. పీసీసీ చీఫ్గా ఐదున్నరేళ్లు పూర్తి చేసుకున్నా. అలాగని శాశ్వతంగా ఆ పదవిలో కొనసాగలేను. మరొకరికి ఆ అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే కార్యకర్తలకు ఒక నాయకుడిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను అని వ్యాఖ్యానించారాయన. ఇదిలా ఉంటే.. తాజాగా ఢిల్లీ పర్యటనలో పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారాన్ని డీకే శివకుమార్ తోసిపుచ్చారు. అలాంటిదేం ఉండబోదని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలదాకా తానే ఆ పదవిలో ఉంటానని.. పార్టీని గెలిపించుకుని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తానని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లి అధిష్టానాన్ని కలిసి వచ్చారు. ఏం జరిగిందో తెలియదుగానీ.. ఇవాళ ఆ పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానంటూ డీకే శివకుమార్ ప్రకటించడం గమనార్హం. 2026 మార్చికి శివకుమార్ పీసీసీ పదవీకాలం ఆరేళ్లు పూర్తి కానుంది. అయితే.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుచరులు కొత్త పీసీసీ చీఫ్ను చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ రేసులో సతీష్ జర్కీహోళీ, మంత్రి ఈశ్వర ఖాంద్రే పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ అంశంపై రేపు(గురువారం) స్పష్టమైన ప్రకటన ఉంటుందని మాజీ ఎంపీ డీకే సురేష్ చెబుతున్నారు. ఇంకోపక్క.. డీకే శివకుమార్ వర్గీయుడు ఎమ్మెల్యే హచ్డీ రంగనాథ్ సిద్ధరామయ్య ప్రభుత్వం బాగా పని చేస్తోందని.. అంతా సవ్యంగానే ఉందంటూ వ్యాఖ్యానించడంతో నాయకత్వ మార్పు ఉండకపోవచ్చనే కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. 2023 మే నెలలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ సమయంలో సీఎం సీటు కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే.. పవర్ షేరింగ్ ఫార్ములా కింద వీళ్లిద్దరినీ కాంగ్రెస్ అధిష్టానం ఒప్పించిందని.. చెరో రెండున్నరేళ్లు సీఎంలుగా ఉంటారనే ప్రచారం నడిచింది(ఇద్దరూ దానిని ఖండించారు కూడా). అదే సమయంలో.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకునేందుకు డీకే శివకుమార్ సిద్ధపడ్డారు. అయితే.. ఖర్గే, రాహుల్ గాంధీ వద్దని సూచించడంతో ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. మరోపక్క లోక్సభ ఎన్నికల దాకా డీకేనే పీసీసీ చీఫ్గా కొనసాగుతారని పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. -
మీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేద్సార్!
మీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేద్సార్! -
ఇందిరమ్మే స్పూర్తి.. కోటి మందికి చీరలు: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులకు సీఎం రేవంత్.. చీరలను అందించారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోటి చీరలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలను ఇవ్వనున్నారు. తొలి దశలో నేటి నుంచి డిసెంబరు 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరలను పంపిణీ చేయనున్నారు. రెండో దశలో మార్చి 1 నుంచి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో మహిళలకు ఇందిరమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది.ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిన సమయంలో ఇందిరా గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎంతో కృషి చేశారు. బ్యాంకుల జాతీయం, అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి పేదలకు భూములు పంచినా, పేదలకు ఇండ్లు కట్టించినా అది ఇందిరమ్మకే సాధ్యమైంది. పాకిస్తాన్తో యుద్ధం సమయంలో ధీటుగా నిలబడి ఎదుర్కొన్న ధీశాలి ఇందిరమ్మ. దేశానికి బలమైన నాయకత్వం అందించిన ఘనత ఇందిరాగాంధే. ఇందిరమ్మ స్ఫూర్తితో మా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. మహిళలకు పెట్రోల్ బంక్లు నిర్వహించుకునేలా ప్రోత్సహించాం. ఆర్టీసీలో వెయ్యి బస్సులకు మహిళలని యజమానులను చేశాం. మహిళల సంక్షేమంతో పాటు ఆర్థిక ఉన్నతి కలిగించే కార్యక్రమాలు చేపట్టాం. ఆడబిడ్డల పేరుతోనే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నాం. రాజకీయాల్లోనూ మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించాం. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులని చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాదు.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లను చేశాం. సోలార్ ప్లాంట్ మహిళలకే ఇస్తున్నాం. ఇందిరా గాంధీ స్పూర్తితో రాష్ట్రంలో ప్రజా పాలన చేస్తున్నాం. మహిళలకు స్థానిక సంస్థల్లో ప్రాతినిథ్యం ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్లు కూడా ఆడబిడ్డలకే ఇస్తున్నాం. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారె పెట్టి గౌరవించాలని భావించాం. అందుకే కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఇందిరమ్మ జయంతి రోజున ప్రారంభించిన ఈ కార్యక్రమం డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తాం. మార్చి 1 నుంచి 8 న మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తాం. ఎవరూ ఆందోళన చెందొద్దు.. ప్రతీ ఆడబిడ్డకు చీరను అందిస్తాం. మొదటి విడతలో 65 లక్షల చీరలు పంపిణీ చేయబోతున్నాం. చీరల ఉత్పత్తికి సమయం పడుతున్న నేపథ్యంలో రెండు విడతలుగా చీరలను పంపిణీ చేస్తున్నాం. మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా అధికారులు ఇందిరమ్మ చీర కట్టుకోవాలి. మీరే బ్రాండ్ అంబాసిడర్ గా మారి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటాలి అని పిలుపునిచ్చారు.వైఎస్సార్ హయంలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించారని, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ మోసం చేసింది. రాష్ట్రంలో 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మహిళలను భాగస్వామ్యులను చేస్తున్నామని నేను చెప్పాను. లబ్ధిదారులకు తప్పకుండా ఇళ్లు కట్టిస్తాం. ఇందిరా గాంధీ పాలన దేశానికి దిక్సూచి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
రైతులు చావొద్దు.. ప్రభుత్వాలను చావగొట్టాలే
భైంసా టౌన్/ఆదిలాబాద్ టౌన్: రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని.. సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను చావగొట్టా లని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుతోపాటు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును మంగళవారం ఆయన పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కపాస్ కిసాన్ యాప్తోపాటు సోయా కొనుగోళ్లకు సంబంధించి బయోమెట్రిక్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలతో పత్తి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ. 20 వేల చొప్పున పరిహారం అందించాలన్నారు. రైతులను కలవడానికి వస్తున్నామని తెలిసి ప్రభుత్వం కేంద్రంతో వీడియో కాన్ఫరెన్స్ అంటూ నాటకాలు మొదలుపెట్టిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైతులతో రాజకీయాలు చేయొద్దు.. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులతో రాజకీయాలు చేయొద్దని... ఈ అంశంపై చర్చించేందుకు కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్లో సీసీఐ ఫ్యాక్టరీని తిరిగి తెరుస్తామని హామీ ఇచ్చి గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యేలు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. 20 శాతం తేమ ఉన్న పత్తిని సైతం కొనుగోలు చేసే వరకు కొట్లాడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి రైతులపై ప్రేమ ఉంటే నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చే అంశంపై కేబినెట్లో చర్చించే వారని.. కానీ సర్కారు ప్రైవేటు వ్యాపారులతో కుమ్మక్కై యాప్లను ఏర్పాటు చేసిందని కేటీఆర్ దుయ్యబట్టారు. ఇప్పటివరకు లక్ష క్వింటాళ్లు కూడా కొనలేదు.. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది రైతులు 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారని కేటీఆర్ చెప్పారు. ఈసారి అధిక వర్షాలకుతోడు చలికాలంలో సహజంగానే పత్తిలో తేమ ఉంటుందని.. కానీ సీసీఐ మాత్రం 8 శాతం తేమ నిబంధన పేరిట ధరలో కోత పెడుతోందని ఆయన విమర్శించారు. రైతులు క్వింటాల్కు రూ. 2 వేల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కనీసం లక్ష క్వింటాళ్ల పత్తి కూడా కొనుగోలు చేయలేదన్నారు. స్థానిక బీజేపీ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే రామారావు పటేల్కు రైతులపై ప్రేమ ఉంటే కేంద్రంతో మాట్లాడి తేమ నిబంధన 20 శాతానికి పెంచేలా చూడాలన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎకరాకు 13 క్వింటాళ్ల సోయా కొనుగోలు చేశామని.. ప్రస్తుతం 7 క్వింటాళ్లకే పరిమితం చేశారని విమర్శించారు. తాము ఠంచన్గా రైతుబంధు, రుణమాఫీ, యూరియా బస్తాలు అందించామని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో ఏదీ సమయానికి అందక రైతులు ఆగం అవుతున్నారన్నారు. -
ప్రజాస్వామ్యం ఖూనీ
న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షా లను నాశనం చేసేందుకు ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ముసుగులో ఎన్నికల కమిషన్(ఈసీ) కుట్ర పన్నిందని కాంగ్రెస్ ఆరోపించింది. దీనికి నిరసనగా డిసెంబర్ మొదటివారంలో ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో భారీ ర్యాలీ చేపడతామని ప్రకటించింది. ఎస్ఐఆర్ ప్రక్రియ అమలవుతున్న సమయంలో ఈసీ వైఖరి తీవ్ర నిరుత్సాహం కలిగించిందని పేర్కొంది. లక్షిత ఓట్లను తొలగించే ఉద్దేశంతోనే ఈ ప్రక్రియ సాగిందని ఆరోపించింది. కేంద్రంలోని బీజేపీ ఛత్రం కింద పనిచేయడం లేదని ఈసీ తక్షణమే నిరూపించుకోవాలని డిమాండ్ చేసింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ–కాంగ్రెస్ సారథ్యంలోని మహాగఠ్బంధన్ అనూహ్యంగా ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం సమావేశమైంది.కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సారథ్యంలో మంగళవారంజరిగిన ఈ భేటీలో రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఎస్ఐఆర్ జరిగే 12 రాష్ట్రాల అధ్యక్షులు, శాసనసభా పక్షాల నేతలు, పార్టీ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్ష పార్టీలను నాశనం చేసేందుకు ఈసీ ప్రయత్నించడం, దేశ చరిత్రలో ఇదే మొదటిసారని పేర్కొన్నారు. ‘మేం జనంలోకి వెళతాం. డిసెంబర్ మొదటి వారంలో రాంలీలా మైదాన్లో లక్షలాది మంది ప్రజలతో భారీ ర్యాలీ చేపడతాం.ఈసీ బండారాన్ని బట్టబయలు చేస్తాం’అని వేణుగోపాల్ తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ..ఎస్ఐఆర్ ప్రక్రియ సమగ్రతపై అనుమానాలు వ్యక్తం చేశారు. నిష్పాక్షికంగా ఓటరు జాబితాను రూపొందించాల్సిన ఈసీ..రాజకీయ పక్షాలపై పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. అసలైన ఓటర్లను తొలగించేందుకే ఈ ప్రక్రియను ఈసీ హడావుడిగా చేపడుతోందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై రాజకీయంగా, సంస్థాగతంగా, న్యాయపరంగా కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు.ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడుతాంఎన్నికల ప్రక్రియ సమగ్రతను పరిరక్షించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని ఖర్గే ఎక్స్లో స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో ఇప్పటికే విశ్వాసం తగ్గిపోగా, ఎస్ఐఆర్ ప్రక్రియ సమయంలో ఈసీ వైఖరి మరింత నిరుత్సాహపూరితంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నట్లు, ఏ రాజకీయ పార్టీకి లోబడి పనిచేయడం లేదని తక్షణం ఈసీ నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఆశ్చర్యం కలిగించని పరాభవం
‘సొంత గుడిసె వేసుకోలేనోడు ఊరంతటికీ వేస్తాడా’ అని ఆఫ్రికాలో ఒక సామెత ఉంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల పరాభవంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఆ ఫలి తాలు ‘ఆశ్చర్యకరంగా’ ఉన్నాయన్నారు. కానీ అంతకన్నా భిన్నంగా ఉంటేనే ఆశ్చర్య పోవాలి. అక్కడ ఆ పార్టీ 2020లో 70 సీట్లకు పోటీ చేసి, కేవలం 19 గెల వగా... ఈసారి 61కి గానూ 6 స్థానాలు గెలిచింది. మహాగఠ్బంధన్ మొత్తంగానే ఓడినప్పటికీ, ఆ కూటమిలోని జాతీయ పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అయినందున దాని గురించి ప్రత్యేకంగా చర్చించటం అవసరమవుతున్నది. రెండేళ్ల క్రితం సగం దేశంలో ‘భారత్ జోడోయాత్ర’ జరిపిన రాహుల్ గాంధీ ఇపుడు బిహార్లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ సాగించి, దేశమంతటా ప్రజా స్వామ్య ప్రియులలో కనీసం కొందరికి కొన్ని ఆశలు కల్పించారు. కానీ, 2004లో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించినప్పటి నుంచి ఈ 21 సంవత్సరాలలో ఆయన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగలిగింది ఏమీ లేదు.నాయకత్వానికి సవాలురాహుల్ గాంధీ రాజకీయ ప్రవేశం చేసిన 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావటంలో తన పాత్ర ఏమీ లేదు. అంతకుముందటి వాజ్పేయి ప్రభుత్వం చేసిన ‘ఇండియా షైనింగ్’ ప్రచారాన్ని ప్రజలు మెచ్చనందున బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ఓడిపో యింది. తర్వాత కాంగ్రెస్ నాయకత్వాన యూపీఏ కూటమి రెండవ సారి 2009లో అధికారానికి రావటంలో కొన్ని సంక్షేమ పథకాలు, ఆర్థిక పరిస్థితి పెరుగుదల పాత్ర వహించాయి. ఆ వెనుక 2014లో కాంగ్రెస్ ఓటమిలోనూ రాహుల్ బాధ్యత లేదు. వివిధ కుంభకోణాల వల్ల అది జరిగింది. ఆ విధంగా గుర్తించవలసిందేమంటే, రాహుల్కి నాయకత్వ పరీక్ష అంటూ మొదలైంది 2014 నుంచి! అప్పటినుంచి గత 11 సంవత్సరాలుగా ఆయన ఏమి చేశారన్నది ప్రశ్న.వాస్తవానికి అంతకుముందు కూడా రాహుల్ గాంధీ కొన్ని పరి మితమైన పరీక్షలను ఎదుర్కొన్నారు. కాంగ్రెస్కు మొదటినుంచీ ఉత్తర ప్రదేశ్ ప్రధాన కార్యక్షేత్రం, బలమైన కేంద్రం. అక్కడ రైతుల పార్టీలు, దళితుల పార్టీలు, సోషలిస్టు పార్టీలు బలపడి వివిధ సామాజిక వర్గాలు దూరమైనందువల్లనే కాంగ్రెస్కు పునాది లేకుండా పోయిందని తనకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) ప్రొఫెసర్లు బోధపరచటంతో, వారి సూచనల ప్రకారం యూపీలో కాంగ్రెస్ పునరుద్ధరణకు రాహుల్ గాంధీ నడుం కట్టారు. సోదరి ప్రియాంక ఆయనకు తోడయ్యారు. ఆ రాష్ట్రాన్ని నేడు గెలిస్తే రేపు దేశాన్నంతా గెలవగలమన్నది ఆయన నిర్ణయించుకున్న లక్ష్యం. అందుకు తల్లి దీవెనలు కూడా పొందారు. కానీ, ఉత్తర ప్రదేశ్లో పార్టీ బలోపేతం అనే మొదటి పరిమిత పరీక్షలో ఆయన విఫల మయ్యారు. రెండవ పరిమిత పరీక్ష 2007లో పార్టీ ప్రధాన కార్య దర్శిగా నియమితుడై, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐలకు ఇన్ఛార్జ్ కావటం రూపంలో ఎదురైంది. అందుకు సంబంధించి మొదట తగినంత హడావిడి చేసిన ఆయన, ఆ సంస్థలను పునర్ని ర్మించలేకపోయారు.వైఫల్యాలపై అధ్యయనం శూన్యంఇటువంటి పదేళ్ల పరిమిత వైఫల్యాల నేపథ్యం నుంచి, 2014 వచ్చేసరికి రాహుల్ గాంధీపై పార్టీ బాధ్యతలు పూర్తిగా వచ్చి పడ్డాయి. అప్పటికి కాంగ్రెస్ కేంద్రంలో, పలు రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. సోనియా గాంధీ తన సమర్థతను పలు సందర్భా లలో రుజువు చేసిన దశ గడచిపోయింది. పార్టీ సాంకేతికంగా చీల లేదు గానీ పలువురు సీనియర్లు బీజేపీలో చేరటమో, మృతి చెంద టమో, వార్ధక్యం వల్ల క్రియాశీల రాజకీయాల నుంచి నిష్క్రమించ టమో మొదలైంది. పార్టీ నుంచి వివిధ సామాజిక వర్గాలు దూరం కావటం రాహుల్ రాజకీయ ప్రవేశం కన్నా చాలా కాలం క్రితం నుంచే మొదలు కాగా, ఈసరికి బాగా వేగం పుంజుకున్నది. పార్టీ మరికొన్ని రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. సోనియా తరచు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ పరిణామాలన్నింటి జమిలి స్థితి... ఆయన తీవ్రమైన పరీక్షలను ఎదుర్కోవలసి రావటం. పార్టీ నాయకులకు ఒకప్పుడు ఉండిన సలహాదారులు, సహాయకులు, వర్కింగ్ కమిటీ సభ్యులు హేమాహేమీలు కాగా, ఈ దశ వచ్చేసరికి దాదాపు అందరూ పనికిరానివాళ్లు, స్వార్థపరులు వచ్చి చేరారు. రాహుల్ గాంధీకి అది మరొక పెద్ద కొరతగా మారింది.ఇటువంటివి చెప్పుకొన్నప్పుడు రాహుల్పై కొంత సానుభూతి కలగవచ్చు. కానీ అటువంటి అవసరమేమీ లేదు. ఆ మాట అనేందుకు తగిన కారణాలున్నాయి. పైన చెప్పుకొన్నట్లు 2004–14 మధ్య పదేళ్ల కాలంలో ప్రతికూల పరిస్థితులు పరిమితమే అయి, తన పరీక్షలు కూడా పరిమితమే అయి, తన మాటకు పార్టీలో ఎంత మాత్రం ఎదురు లేకుండా ఉండినప్పటికీ, ఆయన తన నాయకత్వ సమర్థతను రుజువు చేసుకోలేక పోయారు. పార్టీ పరిస్థితి క్రమంగా క్షీణిస్తూనే పోయింది. పార్టీ ఆయా వర్గాలకు ఎటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ విధానాల వల్ల; అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి ఆచరణ వైఫల్యాల వల్ల దూరమవుతూ వస్తున్నది? ఆ పరిస్థితి మారాలంటే ఏమేమి చేయాలి? అనే అధ్యయనాలు, ప్రణాళి కలు ఆయనకు ఎప్పుడూ లేకపోయాయి. మౌలికంగా అవి ఉండి ఉంటే, 2014లో కాంగ్రెస్ ఓడి బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమించే పరిస్థితి ఎదురైనప్పుడు, ఇతరత్రా పైన పేర్కొన్న లోటుపాట్లు ఉండినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం ‘సొంత గుడిసె’ వేసేందుకు సమ కట్టగల స్థితిలో ఉండేవారు.యూపీఏ ఉన్నట్టేనా?అది రాహుల్ గాంధీలో మౌలికంగా లేనందువల్లనే 2014 నుంచి ఇప్పటివరకు ‘సొంత గుడిసె’ వేయలేక పోవటమే గాక, ‘ఊరంతటికీ వేసే ప్రయత్నాలు’ సహజంగానే నెరవేరటం లేదు. కేంద్రంలో కాంగ్రెస్ వరుసగా మూడవసారి ఓడిపోయింది. కేవలం మూడు రాష్ట్రాలలో అధికారాన్ని నిలుపుకొన్నది. యూపీఏ కూటమి గత లోక్సభ ఎన్నికలలో మంచి ఫలితాలను సాధించి కూడా కేవలం తన వల్ల అంతలోనే గందరగోళంగా మారింది. దాని అజెండా ఏమిటో అర్థం కావటం లేదనీ, ఎన్నికల తర్వాత తిరిగి ఒక్క సమా వేశమైనా జరగలేదనీ, ఇక తమకు దానితో నిమిత్తం లేదనీ, ఒంట రిగా పోటీ చేయగలమనీ, రాహుల్ అధికారంతో వ్యవహరిస్తున్నా రనీ కొందరు భాగస్వాములు ప్రకటించగా... అసలు ఆ కూటమి అన్నదే ఇక లేదని సీపీఎం నాయకుడు ప్రకాశ్ కారత్ వంటివాడు స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నా రాహుల్ గాంధీ నుంచి స్పందనలు లేక పోగా, కొందరిని బయటకు పంపేట్లు తానే వ్యవహరించారు. కొత్తగా ఒక్క పార్టీ అయినా దగ్గరకు రాలేదు. అట్టహాసపు యాత్ర లేవో చేస్తున్నా, ఆ నినాదాలు ఒక స్థాయిలో మంచివే అయినా, సాధారణ ప్రజల సమస్యలకు, వాటికి సంబంధం ఉండటం లేదు. ఈ విధమైన 21 సంవత్సరాల (2004–25) నేపథ్యాన్ని, 11 సంవత్సరాల (2014–25) నేపథ్యాన్ని పరిగణించినప్పుడు, రాహుల్ గాంధీ ‘సొంత గుడిసె’ను గానీ, ‘ఊరికి గుడిసె’ను గానీ వేయలేక పోవటంలో ఆశ్చర్యం లేదు; హరియాణా, మహారాష్ట్ర,ఢిల్లీతో మొదలైన పరాభవం ఇపుడు బిహార్లోనూ కొనసాVýæడంలో ఆశ్చర్యపడేది ఏమీలేదు.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నవంబర్ 20 ఆ.. అదేంటో జ్యోతిష్కుడిని అడగండి
సాక్షి, బెంగళూరు/ ఢిల్లీ: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మరోసారి మీడియా ముందు తన అసహనం వ్యక్తం చేశారు. ఆశలు కలిగి ఉండడంలో తప్పేముంది? అంటూ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలు జోరందుకున్న వేళ.. ఆయన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి ఇప్పుడు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్లు.. త్యాగాలు చేసినవాళ్లు ఆశలు పెట్టుకోవడం సహజం. అందులో తప్పేముంది? అని మీడియాను ఉద్దేశించి శివకుమార్ వ్యాఖ్యానించారు. నవంబర్ 20న నాయకత్వ మార్పు ప్రకటన ఉంటుందా? అనే ప్రశ్నకు.. అదేంటో జ్యోతిష్యుడినే అడగాలంటూ వ్యాఖ్యానించారాయన. అయితే.. నవంబర్ క్రాంతి, భ్రాంతి అలాంటేవీ లేవని కర్ణాటక కాంగ్రెస్ నేతలు చెబుతున్నప్పటికీ.. తెరవెనుక మాత్రం భిన్నమైన ఆట సాగుతోంది. ఈ ఊహాగానాలన్నింటికీ నవంబర్ 20 డెడ్లైన్గా కనిపిస్తోంది. ఆ రోజుకు సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన కాలాన్ని పూర్తి చేసుకోనుంది. ఈ రెండున్నరేళ్ల కాలంలో ఇతర విషయాల కంటే కూడా ముఖ్యమంత్రి మార్పు అంశమే ఎంతో ముఖ్యమైన చర్చనీయాంశంగా మారింది. సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ల ప్రకటనలు, ఢిల్లీ యాత్రలు మరింత సెగలను రాజేశాయి. అంతటా సస్పెన్స్ నవంబర్ 20లోగానే రాజకీయ పెను మార్పులు సంభవిస్తాయని కొందరి వాదన అయితే, అలాంటిది ఏదీ ఉండకపోవచ్చని సీఎం వర్గీయులు చెబుతున్నారు. కానీ వారిలోనూ సస్పెన్స్ కలుగుతోంది. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి తన పీఠాన్ని భద్రం చేసుకోవడంతో పాటు అనుచరులకు మంత్రి పదవులు కట్టటెట్టి శివకుమార్ వర్గానికి పెద్ద షాక్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 20 నుంచి రాహుల్ గాంధీ ముందు రెండు వర్గాలు తమ బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది. ఈ పరిణామాల మధ్య కర్ణాటకలో అధికారాన్ని నిలుపుకోవడంతో పాటు ప్రభుత్వాన్ని సజావుగా నడిపించడం రాహుల్గాంధీ శిబిరానికి అగి్నపరీక్ష అయ్యింది. ఢిల్లీలో డీకే మంత్రాంగం డీసీఎం డీ.కే.శివకుమార్ ఢిల్లీలో పార్టీ అగ్రనేత రాహుల్గాంధీని కలిశారు. సీఎం పదవి, మంత్రి పదవుల పంపిణీ గురించి, పార్టీ అంశాల మీద ఆయన చర్చించినట్లు చర్చ నడుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిశారు. ఆ సమయంలో సోదరుడు డీకే సురేశ్ను ఆయన వెంటబెట్టుకెళ్లారు. ఖర్గేతో సుమారు 50 నిమిషాల పాటు చర్చలు జరిపారు. తన చేతిలో ఉన్న కేపీసీసీ అధ్యక్ష స్థానం చేజారకుండా డీకే పావులు కదపడంతో పాటు, ముఖ్యమంత్రి పదవి గురించి మనసులో మాట చెప్పారు. కాగా, సోమవారం ఢిల్లీలో సీఎం సిద్దరామయ్యను కూడా డీకే శివ కలిసి మాట్లాడి, ఆపై బెంగళూరుకు పయనమయ్యారు. వెంటనే సిద్దూ కూడా..మంత్రిమండలి ప్రక్షాళన ముందుకు రావడంతో రాష్ట్ర కాంగ్రెస్లో కార్యకలాపాలు ఊపందుకున్నాయి. సీఎం సిద్దరామయ్య సోమవారం ఢిల్లీకి వెళ్లే ముందుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనతో వరుసగా భేటీ అయ్యారు. అందులో అనేకమంది మంత్రి పదవుల ఆకాంక్షులు ఉన్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు ప్రదీప్ ఈశ్వర్, అశోక్ పట్టణ్, కాశప్పనవర్, ఏ.ఎస్.పొన్నణ్ణ, కే.ఎస్.రాజణ్ణ తదితరులు ఉన్నారు. రాజణ్ణతో చాలాసేపు మాట్లాడడం కుతుహలానికి దారితీసింది. ఓట్ చోరీ గురించి రాజణ్ణ వ్యతిరేకంగా మాట్లాడి మంత్రి పదవిని పోగొట్టుకోవడం తెలిసిందే. తన గురించి నాయకత్వానికి మంచిగా చెప్పాలని సిద్దరామయ్యను కోరినట్లు తెలిసింది. ఎమ్మెల్యే విజయానంద కాశప్పనవర్ మంత్రి పదవి ఇవ్వాలని మరీ మరీ కోరారు. ఢిల్లీకి వెళ్లాక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సీఎం కలిసినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మార్పు వంటిది ఉండకుండా చూడాలని, ఆ మేరకు హైకమాండ్ను ఒప్పించాలని కోరినట్లు సమాచారం. -
50% సీలింగ్తోనే పంచాయతీ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.. సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా రిజర్వేషన్లను 50 శాతానికి మించకుండా అమలు చేస్తూ వీలైనంత త్వరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ చేసిన సిఫారసుల ఆధారంగా చేపట్టిన ఎన్నికల ప్రక్రియ కోర్టు కేసులతో అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఎన్నికలకు వెళ్లాలంటే 50 శాతం మించకుండా రిజర్వేషన్ల జాబితాను మరోసారి డెడికేటెడ్ కమిషన్ నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల సంఖ్యపై డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక కోరాలని మంత్రివర్గం తీర్మానించింది. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి.. 25న మళ్లీ మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఆమోదించాలని నిర్ణయించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై కోర్టు కేసులు కొలిక్కి వచ్చాకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో కేబినెట్ సుదీర్ఘంగా సమావేశమై ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి .. సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆ వివరాలను వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం కాల పరిమితి 2026 మార్చి 31తో ముగియనుండగా, ఆలోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే గ్రామాలకు రావాల్సిన రూ.3 వేల కోట్ల ఆర్థిక సంఘం నిధులు మురిగిపోనున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. డిసెంబరులో పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తమ ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నించినా కేంద్ర ప్రభుత్వ సహకారం లేక రాష్ట్రపతి వద్దే బిల్లులు పెండింగ్లో ఉండిపోయాయన్నారు. ప్రత్యామ్నాయంగా ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ల పెంపునకు ప్రయత్నించినా కోర్టు కేసులతో సాధ్యం కాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు ఎన్నికల్లో 42 శాతం సీట్లు కేటాయిస్తూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ⇒ హైదరాబాద్ నుంచి ఉమ్రా యాత్రకు వెళ్లిన 45 మందిలో 44 మంది సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించారు. వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే మాజీద్ హుసేన్, మైనారిటీ శాఖ అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని నిర్ణయించింది. కుటుంబసభ్యుల కోరిక మేరకు మృతులకు అక్కడే అంత్యక్రియలు చేయాలని నిర్ణయం తీసుకుంది. వారి కుటుంబం నుంచి ఇద్దరిని ప్రభుత్వ ఖర్చుతో అక్కడకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్టు షబ్బీర్ అలీ తెలిపారు. వారికి వీసాలు ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ⇒ ఇటీవల మృతి చెందిన కవి, తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ కుమారుడు ఎ.దత్తసాయికి డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాత్రను భావితరాలకు తెలియజేసేలా అందెశ్రీ స్మృతి వనం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. అందెశ్రీ రచించిన ‘జయ జయ హే తెలంగాణ’గీతాన్ని పాఠ్యపుస్తకాల్లో ప్రచురించాలని నిర్ణయించింది. ⇒ ఎస్సారెస్పీ రెండో దశ ప్రధాన కాల్వకు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి పేరు పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ⇒ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లోపల ఉన్న పరిశ్రమలను వెలుపలి ప్రాంతాలకు తరలించాలని గతంలో నోటీసులు జారీ చేశారు. ఈ పరిశ్రమల స్థలాలను మల్టీ యూజ్ జోన్స్గా మార్చేందుకు రూపొందించిన ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ’కి కేబినెట్ ఆమోదించింది. ⇒ ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగాం డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలను గ్లోబల్ సమ్మిట్ వేదికగా 8వ తేదీన ప్రజలకు వివరించనున్నారు. డిసెంబర్ 9 న తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. -
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు.. ఎప్పుడంటే?
సాక్షి,హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుండి 9వరకు తెలంగాణ ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనుంది. ఈ వారోత్సవాల సమయంలో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా రైజింగ్ తెలంగాణ- 2047 లక్ష్యాలను క్యాబినెట్ చర్చిస్తోంది. ఈ నెల 24న హైకోర్టులో స్థానిక ఎన్నికల నిర్వహణపై పిటిషన్ విచారణకు రానుంది. దీనికి అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోనుంది. తాజాగా పరిణామాలతో డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని సమాచారం. -
ఇండియా కూటమి సారథిగా అఖిలేష్ యాదవ్!?
ప్రతిపక్ష ఇండియా కూటమికి వరుస ఎన్నికల్లో ఓటములతో ఎదురు దెబ్బలు తప్పడం లేదు. ఈ తరుణంలో నాయకత్వ మార్పు అంశం మరోసారి చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందేననే ప్రత్యక్షంగా.. పరోక్షంగా పలువురు అంటున్నారు. ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేష్ యాదవ్ ఇండియా కూటమి సారథ్య బాధ్యతలు చేపట్టాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. 2023 జులై 17వ తేదీన బెంగళూరులో జరిగిన సమావేశంలో 26 పార్టీలు ఇండియ కూటమి ఏర్పాటు ప్రకటన చేశాయి. అప్పటి నుంచి కాంగ్రెస్ సారథ్యంలోనే ఈ కూటమి ముందుకు నడుస్తోంది. అయితే.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో.. నాయకత్వ మార్పు గురించి చర్చలు మొదలయ్యాయి. సమాజ్వాది పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే తాజాగా.. ఆ పార్టీ అధినేత, కన్నౌజ్ ఎంపీ అయిన అఖిలేశ్ యాదవ్ ప్రతిపక్ష కూటమిని నడిపించాలని కోరారు. అంతేకాదు దేశ రాజకీయాల్లో అత్యంత రాజకీయ ప్రాధాన్యం కలిగిన సమాజ్వాదికి.. యూపీలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే సామర్థ్యం ఉందని కూడా వ్యాఖ్యానించారు.గత సంవత్సరం జరిగిన లోక్సభ సాధారణ ఎన్నికల్లో 37 స్థానాలు గెలుచుకున్న సమాజ్వాది పార్టీ.. లోక్సభలో కాంగ్రెస్ తర్వాత రెండవ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉంది. బిహార్ ఫలితంపై లక్నో సెంట్రల్ ఎమ్మెల్యే రవీదాస్ మాట్లాడుతూ.. ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరిగి ఉంటే ఇండియా కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేసేదన్నారు. ‘‘ఈవీఎంల పని తీరును మా అధినేత అఖిలేష్ యాదవ్ మొదటి నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగాలని.. ఆ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని కోరుతున్నారు కూడా. ఇందుకోసమైనా ఇండియా కూటమికి సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ నాయకత్వం వహించాలి. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది పార్టీ స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే సామర్థ్యం కలిగి ఉందనే విషయం గుర్తించాలి’’ అని అన్నారు.గత సంవత్సరం లోక్సభ ఎన్నికల్లో 99 స్థానాలు గెలుచుకున్న ప్రధాన ప్రతిపక్షం.. ఆ తర్వాత జరిగిన వరుస రాష్ట్ర ఎన్నికల్లో ఘోరమైన ఫలితాల్ని ఇస్తోంది. గత ఏడాది కాలంలో.. ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా ఆరింటిలోబీజేపీ, దాని మిత్రపక్షాలు విజయం సాధించాయి, అందులో హర్యానా, మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రాలు కూడా ఉన్నాయి.ఇండియా కూటమిలో నాయకత్వ చర్చ కొత్తదేం కాదు. ఎన్నికల్లో ప్లాఫ్ షో ప్రదర్శించినప్పుడల్లా ఇది చర్చకు వస్తూనే ఉంది. గతంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఆ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ బలంగా వినిపించింది. ఇండియా కూటమికి స్పష్టమైన నాయకత్వం లేదు. కాంగ్రెస్ ఆ బాధ్యతల్లో విఫలమవుతూ వస్తోంది. కాబట్టి.. స్పష్టమైన ఎన్నిక జరగాలి అని టీఎంసీ నేత కల్యాణ్ బెనర్జీ గతంలో అన్నారు. కాంగ్రెస్పై తాము విశ్వాసం ఉంచామని.. కానీ ఈ విషయంలో ఆ పార్టీ ఘోరంగా విఫలమవుతోందంటూ మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలపై ఆయన పై వ్యాఖ్య చేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఇండియా కూటమి నాయకత్వం మార్పు అవసరమని గతంలో సూచించారు. మమతా బెనర్జీకి ఆ బాధ్యతలు అప్పగించాలని కోరారు. ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్సే ఉంటుంది. అందులో ఎలాంటి తేడా ఉండబోదు కదా. అలాంటప్పుడు ఆమెకు(మమతా బెనర్జీని ఉద్దేశించి) ఇండియా కూటమికి నాయకత్వం వహించే అవకాశం ఇవ్వాలి అని లాలూ అప్పట్లో అన్నారు. -
‘ముస్లింలీగ్–మావోయిస్టు కాంగ్రెస్’ను తిరస్కరించారు
సూరత్: ముస్లింలీగ్–మావోయిస్టు కాంగ్రెస్ గా మారిన కాంగ్రెస్ పార్టీని బిహార్ ప్రజలు పూర్తిగా తిరస్కరించారని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పారని అన్నా రు. కులవాదం అనే విషాన్ని చిమ్మిన ప్రతిపక్షా నికి కర్రుకాల్చి వాత పెట్టారని వ్యాఖ్యానించారు. గుజరాత్లోని సూరత్లో శనివారం బిహారీలు నిర్వహించిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. బిహార్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్డీయే విజయం సాధించినందుకు బిహారీలు మోదీని ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్ యువరాజు (రాహుల్ గాంధీ) చర్యలను చూసి ఆ పార్టీలోని సీనియర్ నాయకులు బాధపడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్కు దశాబ్దకాలంగా ఎన్నికల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయని, ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆ పార్టీ నాయకత్వానికి సూచించారు. కాంగ్రెస్ను కాపాడుకోవడం ఇక కష్టమేనని పార్టీ నాయకులే అంటున్నారని గుర్తుచేశారు. దాదాపు 60 ఏళ్లు దేశాన్ని పాలించిన పార్టీకి ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలని చెప్పారు. అక్రమాలను అడ్డుకోవడానికే వక్ఫ్ చట్టం బిహార్లో ఎన్డీయే ఘన విజయానికి ఎం.వై.(మహిళలు, యువత) అంశమే కారణమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. నేరాలు చేసి, జైలుకు వెళ్లి బయటకు వచ్చిన కొందరు నేతలు కుల రాజకీయాలతో ఎన్నికల్లో నెగ్గాలని ఆరాటపడ్డారని విమర్శించారు. వారి ఆటలు సాగలేదని, జనం వారి కుట్రలను తిప్పికొట్టారని ప్రశంసించారు. దేశానికి ఇదొక శుభసూచకమని పేర్కొన్నారు. బిహార్లో అన్ని వర్గాల ప్రజలూ ఎన్డీయేకు అండగా నిలిచారని తెలిపారు. అధికార, విపక్ష కూటముల మధ్య 10 శాతం ఓట్ల తేడా ఉందన్నారు. బిహార్లో 38 నియెజకవర్గాల్లో దళితుల ప్రాబల్యం అధికంగా ఉండగా, అందులో 34 స్థానాలు ఎన్డీయే గెల్చుకుందని వివరించారు. దళితులు విపక్షాన్ని తిరస్కరించారని చెప్పారు. బిహార్లో భూములను, ఇళ్లను చట్టవిరుద్ధంగా ఆక్రమించి అవి వక్ఫ్ ఆస్తులు అంటున్నారని ప్రధానమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. తమిళనాడులో వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రామాలు వక్ఫ్ ఆస్తులు ఎలా అవుతాయో చెప్పాలని ప్రశ్నించారు. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికే వక్ఫ్ చట్టం తీసుకొచ్చామని వివరించారు. అధికారంలోకి వస్తే వక్ఫ్ చట్టాన్ని అమలు కానివ్వబోమని ప్రతిపక్షాలు ప్రకటించాయని, అయినా బిహార్ ఓటర్లు పట్టించుకోలేదని అన్నారు. బిహార్లో ఓటమికి కారణాలు చెప్పలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలపై, ఎన్నికల సంఘంపై నిందలు వేస్తోందని ధ్వజమెత్తారు. ఇలాంటి నిందలతో ఎక్కువ రోజులు కార్యకర్తలను మభ్యపెట్టలేరని హితవు పలికారు. -
స్థానికోత్సాహం...
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ అధిష్టానం సూత్రప్రాయంగా పచ్చజెండా ఊపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందడం ద్వారా వచ్చిన ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గకుండా చూడాలని, ఇదే ఊపుతో స్థానిక సమరానికి సిద్ధం కావాలని రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీ పెద్దలు స్పష్టమైన సంకేతాలిచ్చినట్లుగా సమాచారం. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఓ నిర్ణయానికి రావాలని సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.శనివారం ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాం«దీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్ను అధిష్టానం పెద్దలకు పరిచయం చేశారు. వారంతా నవీన్ యాదవ్ను అభినందించారు. ఈ భేటీల్లో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చ జరిగినట్లు తెలిసింది. ‘జూబ్లీ’ఊపును స్థానికంలోనూ చూపించండి... జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో సమష్టి పోరాటం ద్వారా పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించుకున్నందుకు రాష్ట్ర నేతలను రాహుల్, మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి రెఫరెండంగా భావించిన ఈ ఎన్నికలో విజయం సాధించడం పార్టీకి శుభపరిణామంగా నేతలు అభివర్ణించారు. జూబ్లీహిల్స్ గెలుపు ఇచ్చిన ఆత్మవిశ్వాసాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని, ఇదే ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొని ఘన విజయం సాధించాలని అధిష్టానం దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.స్థానిక సంస్థల్లోనూ వ్యవహరించాల్సిన తీరుపై రాష్ట్రస్థాయిలో సమగ్ర చర్చ జరిపి, మంత్రివర్గంలోనూ చర్చించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం తీసుకోవాలని అగ్రనేతలు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ భేటీల్లో స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ముఖ్యంగా రిజర్వేషన్ల అమలుపై కీలక చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీ హామీ ఇచ్చినట్లు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తూనే.. పార్టీ పరంగా వాటిని అమలు చేసే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.దీనిపై అన్ని వర్గాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని, చట్టపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలని నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తంగా, అధిష్టానం గ్రీన్ సిగ్నల్తో రాష్ట్రంలో త్వరలోనే స్థానిక ఎన్నికల సందడి మొదలుకానున్నట్లు స్పష్టమవుతోంది. అంతేగాక సోమవారం జరగనున్న కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్లో నిర్ణయం: మహేశ్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పడు నిర్వహించాలనే దానిపై సోమవారం జరగనున్న కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారని టీపీపీసీ చీఫ్ మహేశ్గౌడ్ చెప్పారు. అధిష్టానం పెద్దలను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుపై పార్టీ నిబద్ధతతో ఉందని స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్లకు బీజేపీ అడ్డంకులు సృష్టించిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు రాష్ట్ర పార్టీని, నవీన్ యాదవ్ను అధిష్టానం పెద్దలు అభినందించినట్లు తెలిపారు. సిబల్ విందుకు సీఎం రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన డిజిటల్ చానల్లో ‘దిల్సే విత్ కపిల్ సిబల్’పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఆయన ఏర్పాటు చేసిన విందుకు సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యారు. -
ఓట్లు వచ్చినా సీట్లు రాలే!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్–రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) కూటమి ఘోరంగా పరాజయం పాలయ్యింది. మహాగఠ్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విపక్ష కూటమి తరఫున అంతా తానై వ్యవహరించారు. రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించారు. ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. పలు హామీలు ఇస్తూ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. తేజస్వీ సభలకు జనం పోటెత్తారు. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ నీడ నుంచి ఆయన బయటకు వచ్చినట్లే కనిపించింది. ఎన్నికల్లో కష్టపడి పనిచేసినప్పటికీ ఓటమి తప్పకపోవడం ఆర్జేడీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకు గాను పొత్తులో భాగంగా 143 స్థానాల్లో పోటీ చేసిన ఆర్జేడీ కేవలం 25 స్థానాలు గెల్చుకుంది. అయితే, మిగతా పార్టీల కంటే ఆర్జేడీకే అత్యధికంగా ఓట్లు రావడం గమనార్హం. పోలైన మొత్తం ఓట్లలో ఆ పార్టీకి ఏకంగా 23 శాతం ఓట్లు లభించాయి. బీజేపీ, జేడీ(యూ)లకు ఇన్ని ఓట్లు రాలేదు. ఓట్ల శాతం పరంగా చూస్తే ఏకైక అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించింది. ఆ పార్టీ 2020 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లు గెల్చుకొని, 23.11 శాతం ఓట్లు దక్కించుకుంది. అంటే ఈసారి సీట్ల సంఖ్య తగ్గినా, ఓట్ల శాతం స్వల్పంగా మాత్రమే తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఆర్జేడీ పట్ల జనాదరణలో మార్పు రాలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తేజస్వీ యాదవ్ పార్టీకి 1.15 కోట్ల ఓట్లు ఆర్జేడీ ఓట్ల పరంగా కరోడ్పతిగా నిలిచింది. ఈ ఎన్నికల్లో 1,15,46,055 ఓట్లు సాధించింది. 101 సీట్లలో పోటీ చేసి, 89 సీట్లు కైవసం చేసుకొని ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీకి దక్కిన ఓట్లు కేవలం 20.08 శాతం. 2020లో 19.46 శాతం ఓట్లు లభించగా, ఈసారి స్వల్పంగా పెరిగాయి. బీజేపీకి మొత్తం 1,00,81,143 ఓట్లు దక్కాయి. బీజేపీ మిత్రపక్షం, సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్(యునైటెడ్) 101 సీట్లలో పోటీ చేసి, 85 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. ఆ పార్టీకి 19.25 శాతం ఓట్లు(96,67,118) వచ్చాయి. 2020లో 15.39 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు 3.86 శాతం పెరిగాయి. నితీశ్ కుమార్ ప్రజా వ్యతిరేకతను అధిగమించడంతోపాటు ఓట్ల శాతాన్ని మెరుగుపర్చుకోవడం విశేషం. చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ(రామ్విలాస్), హిందుస్తానీ అవామీ మోర్చా(సెక్యులర్), రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీలకు వచ్చిన ఓట్లు కూడా కలిపితే జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే)కు దక్కిన మొత్తం ఓట్లు దాదాపు 47 శాతం. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాగఠ్బంధన్కు దక్కిన మొత్తం ఓట్లు 35.89 శాతం. రెండు కూటముల మధ్య ఓట్ల తేడా 11.11 శాతంగా తెలుస్తోంది. ఎక్కువ సీట్లలో పోటీ చేయడం వల్లే.. ఆర్జేడీ ఓట్ల శాతం భారీగా ఉన్నప్పటికీ సీట్లు పెరగలేదు. ఎన్నికల్లో ఒక పార్టీ లేదా ఒక అభ్యర్థికి మొత్తం ఎన్ని ఓట్లు వచ్చాయో ఓట్ల శాతాన్ని బట్టి నిర్ధారించవచ్చు. ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో అంచనా వేయడానికి ఓట్ల శాతం తోడ్పడుతుంది. ఆర్జేడీ పాలన జంగిల్రాజ్ అంటూ ప్రత్యర్థులు పదేపదే నిందలు వేసినప్పటికీ ఆ పార్టీ పట్ల ప్రజాభిమానం చెక్కుచెదరలేదు. ఆర్జేడీ తాను పోటీ చేసిన చాలా నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఎన్డీయేకు గట్టి పోటీ ఇచ్చింది. ఆ పార్టీ ఓట్ల శాతం మెరుగ్గా కనిపించడానికి మరో కారణం కూడా చెప్పుకోవచ్చు. 143 స్థానాల్లో ఆర్జేడీ బరిలోకి దిగింది. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఇన్ని స్థానాల్లో పోటీ చేయలేదు. ఎన్డీయే భాగస్వామ్యపక్షాలైన బీజేపీ 101, జేడీ(యూ) 101 సీట్లలో పోటీకి దిగా యి. బీజేపీ కంటే 42, జేడీ(యూ) కంటే 42 ఎక్కు వ సీట్లలో ఆర్జేడీ పోటీ చేసింది. ఎక్కువ సీట్లలో పోటీపడింది కాబట్టే ఎక్కువ ఓట్లశాతం కనిపిస్తోందని, ఇందులో ఆర్జేడీ కొత్తగా బలం చాటింది ఏమీ లేదని కొందరు విశ్లేషకులు అంటున్నారు. గెలిచిన, ఓడిపోయిన నియోజకవర్గాల్లో పార్టీకి పోలైన మొత్తం ఓట్లను కలిపితే ఆర్జేడీకి 23 శాతం ఓట్లు పడినట్లు చెబుతున్నారు. ఆర్జేడీకి 2010 ఎన్నికల్లో 22 సీట్లు లభించాయి. ఆ తర్వాత అతి తక్కువ సీట్లు దక్కింది మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గిరిజన యోధులను విస్మరించారు
గాందీనగర్: దేశ స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనులు చిరస్మరణీయమైన పాత్ర పోషించారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. కానీ, 60 ఏళ్లపాటు అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ మన గిరిజన యోధులను ఏనాడూ పట్టించుకోలేదని, పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. గిరిజనుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని తప్పుపట్టారు. స్వాతంత్య్ర పోరాట ఘనత ‘కొన్ని కుటుంబాలకే’ దక్కాలన్నదే కాంగ్రెస్ అసలు ఉద్దేశమని విమర్శించారు. గిరిజన వీరుడు భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా శనివారం గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని దెడియాపాద పట్టణంలో నిర్వహించిన ‘జనజాతీయ గౌరవ్ దివస్’లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రూ.9,700 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఇందులో రూ.2,320 కోట్లతో నిర్మించే 50 ఎకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా ఉన్నాయి. అలాగే ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ధర్తీ–ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్‡్ష అభియాన్ కింద నిర్మించిన లక్ష ఇళ్ల గృహ ప్రవేశాన్ని వర్చువల్గా నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... దేశ ప్రతిష్ట, ఆత్మగౌరవం, స్వాతం్రత్యాన్ని కాపాడే విషయంలో ఎల్లప్పుడూ గిరిజన బిడ్డలే ముందంజలో ఉంటున్నారని ప్రశంసించారు. అడవి బిడ్డల నుంచి ఎంతోమంది స్వాతంత్య్ర పోరాట యోధులు ఉద్భవించారని గుర్తుచేశారు. గుజరాత్లో గోవింద్ గురు, రూప్సింగ్ నాయక్, మోతీలాల్ తేజావత్ వంటి గిరిజనులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. ఈ ఉద్యమంలో లెక్కలేనన్ని అధ్యాయాలు గిరిపుత్రుల ధైర్యసాహసాలతో నిండిపోయాయని అన్నారు. న్యాయం చేయాలని సంకల్పించాం ‘‘దేశ స్వేచ్ఛ కోసం రక్తం చిందించిన గిరిజనులకు తగిన గుర్తింపు దక్కలేదు. కొందరి కుట్రల కారణంగా వారు తెరవెనుకే ఉండిపోయారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాలకులు గిరిజనుల త్యాగాలను, అంకితభావాన్ని పూర్తిగా విస్మరించారు. 2014 కంటే ముందు భగవాన్ బిర్సా ముండాను ఎవరూ స్మరించుకోలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆయనకు గౌరవం దక్కింది. జార్ఖండ్లో బిర్సా ముండా ఇంటిని సందర్శించిన మొట్టమొదటి ప్రధానమంత్రిని నేనే. జనజాతీయ గౌరవ్ దివస్ అనేది గిరిపుత్రులకు జరిగిన అన్యాయాన్ని గుర్తుచేసుకోవడానికి దక్కిన అవకాశం. అడవి బిడ్డల పట్ల కాంగ్రెస్ నిర్వాకాలు ఏమిటో ప్రజలు తెలుసుకోవాలి. గిరిజనులకు శ్రీరాముడితో అనుబంధం ఉంది. వారు శ్రీరాముడి కాలానికి చెందినవారు. అయినా ఆ సంగతి కాంగ్రెస్ ప్రభుత్వాలకు పట్టలేదు. వారి జీవితాలను మెరుగుపర్చాలని ఏనాడూ ఆలోచించలేదు. మేయు గిరిజనుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. వారికి న్యాయం చేకూర్చాలని సంకల్పించాం. గిరిజనుల కోసం కేంద్రంలో ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ఘనత అటల్ బిహారీ వాజ్పేయిదే. నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహిస్తున్నాం మేరీ కోమ్, దుతీ చంద్, బైచుంగ్ భూటియా వంటి గిరిజన యువతీ యువకులు అంతర్జాతీయ వేదికపై మన దేశ కీర్తి ప్రతిష్టలను పెంచారు. గిరిజన ప్రాంతాల నుంచి ఎంతోమంది క్రీడాకారులు వస్తుండడం సంతోషంగా ఉంది. పోటీల్లో పాల్గొంటూ పతకాలు సాధిస్తున్నారు. ఇటీవల మహిళల క్రికెట్ ప్రపంచ్ కప్ సాధించిన మన క్రీడాకారుల బృందంలో ఒక గిరిజన బిడ్డ కూడా ఉండడం గర్వకారణం. మన ప్రభుత్వం గిరిజనుల్లో నైపుణ్యాలను గుర్తించి, ప్రోత్సహిస్తోంది. అణగారిన వర్గాలకు సైతం అందరితోపాటు సమాన అవకాశాలు దక్కాలి. అందుకోసం నిరంతరం శ్రమిస్తున్నాం. గత ఐదేళ్లలో మోడల్ గిరిజన పాఠశాలల నిర్మాణానికి రూ.18,000 కోట్లకుపైగా నిధులు ఖర్చు చేశాం. విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఫలితంగా గిరిజన పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య ప్రతిఏటా భారీగా పెరుగుతోంది’’ అని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. పండోరి మాత ఆలయంలో పూజలు నర్మదా జిల్లాలోని దేవమోగ్రా గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవం పండోరి మాత ఆలయాన్ని ప్రధానమంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు సూరత్ నగరంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ పురోగతిని మోదీ సమీక్షించారు. బిర్సా ముండాకు నివాళులు స్వాతంత్య్ర సమరయోధుడు, గిరిజన విప్లవకారుడు భగవాన్ బిర్సా ముండా 150 జయంతి సందర్భంగా ప్రధాని మోదీ శనివారం ఘనంగా నివాళులరి్పంచారు. పరాయి పాలకుల దౌర్జన్యాలపై ఆయన సాగించిన పోరాటాలు, చేసిన త్యాగాలు ప్రతి తరానికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఉద్ఘాటించారు. బిర్సా ముండా జయంతిని ‘జనజాతీయ గౌరవ్ దివస్’గా దేశమంతటా నిర్వహించారు. -
అంకగణితం ప్లస్ అనైతికత!
ఎన్నికల్లో మూడింట రెండొంతుల సీట్లను గెలుచుకుంటేనే గొప్ప విజయంగా పరిగణించడం మీడియాలో ఒక సంప్ర దాయం. ఇక ఆరింట ఐదొంతుల సీట్లు గెలిస్తే చెప్పేదేముంది! బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి సరిగ్గా అటువంటి విజయం లభించింది. భారత జాతీయ బడా మీడియా సంస్థలన్నీ కాషాయ దీక్షను స్వీకరించాయన్న సంగతి జగమెరిగిన సత్యం. మరి కాషాయ పార్టీ నాయకత్వంలోని కూటమి అంతటి భారీ గెలుపును నమోదు చేస్తే భజించకుండా బజ్జోవు కదా! శరభ నాట్యాన్ని ప్రదర్శించాయి. అసోయ్ దూలాకు అసలు తగ్గలేదు. మొత్తం 243 స్థానాలున్న సభలో 202 స్థానాలను కైవసం చేసు కోవడమంటే మాటలు కాదు.ఈ అంక గణితంలో ఇంకో పార్శా్వన్ని కూడా గమనించాలి. ప్రతిపక్ష కూటమికి క్యాప్టెన్గా వ్యవహరిస్తున్న ఆర్జేడీ పార్టీకి 23 శాతం ఓట్లు పోలయ్యాయి. ఐదేళ్ల కింద జరిగిన ఎన్నికల్లో కూడా దాదాపు ఇంతే శాతం ఓట్లను ఆ పార్టీ దక్కించుకున్నది. ఈసారి పెద్దగా తగ్గిందేమీ లేదు. బీజేపీకి ఇప్పుడు 20 శాతం ఓట్లు పడ్డాయి. ఐదేళ్ల కింద కూడా అంతే! 19.8 శాతం ఓట్లను సాధించింది. గణనీయమైన పెరుగుదలేమీ కాదు. జేడీ (యు)కు అప్పుడు 16 శాతం, తాజాగా 19 శాతం ఓట్లు లభించాయి. మూడు శాతం పెరుగుదల! మహాగuЇబంధన్ (ఎంజీబీ) కూటమికి వైస్ క్యాప్టెన్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడూ ఇప్పుడూ కూడా కూటమికి గుదిబండగానే మారింది. కాకపోతే దాని ఓట్ల శాతంలో పెద్దగా తేడా లేదు. అప్పుడు తెచ్చుకున్న తొమ్మిది శాతం ఓట్లను దాదాపుగా కాపాడుకోగలిగింది.ఒక కూటమిగా ఎంజీబీకి 2020లో 37.23 శాతం ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో అదే కూటమి సాధించిన ఓట్లు 37.5 శాతం. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్య క్రమం తర్వాత గతంతో పోలిస్తే బిహార్ ఓటర్ల సంఖ్య నికరంగా 47 లక్షలు తగ్గింది. అయినా ఎంజీబీ ఓట్లు తగ్గలేదు. కానీ, సీట్ల లెక్కల్లో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకోవలసివచ్చింది. ఈ రకమైన ఫలితాల లోగుట్టు పెరిగిన పోలింగ్ శాతంలో ఉన్నది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి తొమ్మిది శాతం పైచిలుకు ఓట్లు అదనంగా పోలయ్యాయి. ఈసారి ఎన్ని కల్లో తొమ్మిది శాతానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. పురుష ఓటర్ల కంటే తొమ్మిది శాతం అధికంగా మహిళలు ఈసారి ఓటేశారు. గత ఎన్నికల్లో 37.26 శాతం ఓట్లు సాధించిన ఎన్డీఏ ఈసారి తొమ్మిది శాతం అదనంగా 46.7 శాతం ఓట్లను సంపాదించింది. సాధారణంగా పురుషులు, స్త్రీల పోలింగ్ శాతాల్లో ఒకటి రెండు శాతం కంటే ఎక్కువ తేడాలుండవు. కానీ బిహార్లో ఈసారి మహిళల ఓటింగ్ శాతం పురుషులతో పోలిస్తే తొమ్మిది శాతం ఎక్కువగా ఉంది. గతంలో పోలైన ఓట్ల కంటే ఈసారి పెరిగిన ఓట్ల శాతంతో మహిళా ఓట్ల పెరుగుదల సమానంగా ఉండటం ఒక విశేషం. అంతేకాదు. ఎన్డీఏ కూటమి ఓట్ల పెరుగు దల కూడా ఇంతే స్థాయిలో ఉండటం మరో విశేషం. ఇక్కడొక విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. బిహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సరిగ్గా వారం రోజుల ముందట నితీశ్ కుమార్ ప్రభుత్వం ‘మహిళా రోజ్గార్’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద మహిళలందరికీ ఏటా పదివేల రూపాయలుఅందజేస్తారు. కేవలం ప్రకటించడమే కాదు. దాదాపు కోటి యాభై లక్షల మంది మహిళలకు పదివేల రూపాయల చొప్పున నగదు బదిలీ చేశారు. ఈ బదిలీ కార్యక్రమం షెడ్యూల్ విడుదలై ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత కూడా యథేచ్ఛగా కొనసాగిందని ప్రతిపక్షం చేసిన ఫిర్యాదు చెవిటివాని ముందు శంఖం ఊదినట్లయింది.ఆంధ్రప్రదేశ్లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికలను ఈ సంద ర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవడం అవసరం. ‘వైఎస్సార్ చేయూత’ అనే పథకాన్ని అప్పటికి నాలుగేళ్లుగా జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్నది. ఆ సంవత్సరం గడువు ప్రకారం విడదల చేసిన 4 వేల కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతా లకు చేరకుండా ఎన్నికల సంఘం నిలిపివేసింది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతనే ఆ నిధులను విడుదల చేశారు. ఈ రెండు ఉదంతాలు ఎన్నికల సంఘం ‘నిష్పాక్షికత’కు నిలువెత్తు అద్దాల నుకోవాలి. మహిళల ఓట్లను ఇలా టోకున కొనుగోలు చేయడంతోపాటు మహిళల సాంస్కృతిక విశ్వాసాలను సైతం ఎన్డీఏ కూటమి బాగానే మార్కెటింగ్ చేసుకున్నది. ఛట్ పూజ అనేది ఉత్తరాదిన మరీ ముఖ్యంగా బిహార్లో మహిళలు చేసుకునే పూజా కార్యక్రమం. తమ భర్తల క్షేమం కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం నదీ తీరాల్లో మహిళలు సూర్యదేవుడిని, ఆయన సోదరి ఛట్ దేవిని వేడుకుంటారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ పూజ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఏర్పాట్లు చేశాయి. చిత్తం పూజ మీద, భక్తి ఓట్ల మీద!ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఒక జాతీయ పార్టీగా తన ఆరోపణలకు తగిన ఆధారాలను సమర్పించవలసిన బాధ్యత కూడా ఆ పార్టీదే! లేకపోతే ‘ఆడలేక మద్దెల ఓడు’ అనే సామెత చందంగా ఆ పార్టీ పరిస్థితి మారుతుంది. ఆర్జేడీ హుందాగా ప్రజా తీర్పును అంగీకరించింది. ఓటమిలో విచారాన్ని, గెలుపులో గర్వాన్ని చూడబోమని ప్రకటించింది. నిరంతరం జనజీవితంతో మమేక మవుతామని వెల్లడించింది. ఎమ్జీబీలో ఆర్జేడీ మినహా మరో బలమైన పార్టీ లేకపోవడం ఆ కూటమికి పెద్ద బలహీనత. తన సంప్రదాయ ఓటు బ్యాంకుల్ని కోల్పోయి కాంగ్రెస్ పార్టీ ఓకుంటి గుర్రంగా మారింది. అయినా 64 సీట్లకు తగ్గేదే లేదని మొండికేసింది. ఆపైన మరికొన్ని సీట్లలో ‘స్నేహపూర్వక పోటీ’ పేరుతో కూటమిని ఇబ్బందులకు గురిచేసింది. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 75 సీట్లకు పోటీచేసి కూటమి ఓటమికి కార ణమైంది. అప్పుడు దాదాపు విజయ తీరాలకు వచ్చిన తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ) కాంగ్రెస్ కారణంగా అధికారాన్ని కోల్పో యారు. ఇప్పుడు కూడా ఆ పార్టీ వైఖరిలో మార్పు రాలేదు.కూటమిలో భాగస్వాములైన లెఫ్ట్ పార్టీల పలుకుబడి కేవలం ఓ పాతిక సీట్ల వరకే పరిమితం. వాటిలో ఈసారి సీపీఎమ్ఎల్ (లిబరేషన్) పార్టీ రెండు సీట్లలో, సీపీఎం ఒక్క సీటులో గెలిచాయి. ఇండియన్ ఇన్క్లూజివ్ పార్టీ అనే మరో అల్పప్రాణి కూడా ఈ కూటమిలో ఉన్నది. దానికీ ఒక సీటు లభించింది. ఎమ్జీబీ అలయెన్స్ కూర్పు ఓ బలహీనత. ఇక తేజస్వీ యాదవ్ తన సాంప్రదాయిక ప్రాబల్యాన్ని దాటిమరింత విస్తరించలేకపోవడం మరో బలహీనతగా మారింది. ముస్లిం – యాదవ్ (ఎమ్వై) కాంబినేషన్ ముప్ఫయ్యేళ్ల క్రితం సత్ఫలితాలను ఇచ్చి ఉండవచ్చు. మిగిలిన బలహీన వర్గాలు కూడా జాగృతమైన ఈ పరిస్థితుల్లో తన పరిధిని విస్తరించు కోకుండా తేజస్వి తన ఆశయాన్ని నెరవేర్చుకోలేరు. లాలూ రాజకీయ చతురత ఇప్పటి కాలానికి సరిపోకపోవచ్చు. పైగా అనారోగ్యం, వయోభారం. ఆయనిక పొలిటికల్ గేమ్స్ ఆడ లేరు. ఆడవలసింది తేజస్వీ యాదవే! కొత్త తరానికి సరిపోయే ఆటను ఆయన నేర్చుకోకపోతే, ప్రత్యామ్నాయ శక్తులు రంగంలోకి రావచ్చు.ఎమ్జీబీ కూటమి కూర్పుకు పూర్తి భిన్నంగా ఎన్డీఏ వ్యవహరించింది. విజయానికి అవసరమైన అంకెలను దృష్టిలో పెట్టుకొని అలయెన్స్కు రూపకల్పన జరిగింది. గతంలో ఒంట రిగా 130 సీట్లలో పోటీచేసి, ఐదు శాతానికి పైగా ఓట్లు తెచ్చు కున్న చిరాగ్ పాశ్వాన్ పార్టీని కూటమిలోకి తెచ్చుకున్నారు. 29 స్థానాలు కేటాయిస్తే ఆయన పార్టీ అందులో 19 గెలిచింది. మిగిలిన సీట్లలో బీజేపీ, జేడీయూ అభ్యర్థులకు పాశ్వాన్ పార్టీ ఉపయోగపడింది. దళితుల్లో అత్యంత వెనుకబడిన వర్గాలకు మాజీ ముఖ్యమంత్రి మాంఝీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పార్టీ ‘హిందూస్థానీ అవావ్ు మోర్చా’ కూడా భాగస్వా మిగా ఐదు సీట్లు గెలిచి కూటమికి ఉపయోగపడింది. వెనుక బడిన తరగతుల్లో కుష్వాహ వర్గానికి ప్రాతినిధ్యం వహించే ఆర్ఎల్ఎమ్ కూడా ఎన్డీఏకు ప్లస్ పాయింట్గా మారింది. ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలోరంగంలోకి దిగిన ఎమ్ఐఎమ్ ఐదు సీట్లలో గెలవడమే కాక పలుచోట్ల ఎమ్జీబీ అభ్యర్థుల ఓటమికి కారణమైంది.సామాజిక సమీకరణాలను పక్కా లెక్కలతో కూర్పు చేసు కున్న ఎన్డీఏ కూటమికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అంగబలం, అర్థబలంతోపాటు ఎన్నికల సంఘం ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయనేందుకు ‘మహిళా రోజ్గార్’ పథకమే ఉదాహరణ. వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న తరుణంలో ప్రతి ఏటా పదివేల పథకాన్ని ప్రకటించే నైతిక హక్కు ఏ విధంగా ఉంటుంది? దీనికి ఎన్నికల సంఘమే జవాబు చెప్పాలి. ఈ రకమైన అనైతికతకు తోడు అంకగణిత కూర్పులతో బిహార్ను ఎన్డీఏ గుప్పెట్లో పెట్టుకున్నది. అంతే తప్ప అక్కడ ఒక మహా ప్రభంజనం వీచి ఆర్జేడీని కూకటివేళ్లతో సహా పెకిలించిందేమీ లేదు. ఆ పార్టీ కొత్త శ్రేణు ల్లోకి విస్తరించలేకపోయింది. అంతే తప్ప తన పునాదిని పోగొట్టుకోలేదు. కాంగ్రెస్ పార్టీకి కొత్తగా జరిగిన శృంగభంగం కూడా ఏమీ లేదు. ఆ పార్టీ ముక్కూచెవులను బిహారీలు ఏనాడో కోసిపారేశారు.భారతీయ జనతా పార్టీ పచ్చి మితవాద పార్టీ. తన మతవాద ముద్రను కూడా దాచుకునే ప్రయత్నం చేయడం లేదు. ఆర్థిక, సామాజిక విషయాల్లో పచ్చి సోషలిస్టు వ్యతిరేకి. కానీ తన ప్రాబల్య విస్తరణ కోసం భావజాల సారూప్యత లేని పార్టీలతో సైతం చెలిమికి వెనకాడటం లేదు. నవభారత నిర్మాత పండిత్ జవహర్లాల్ నెహ్రూను, ఆయన సోషలిస్టు ఆర్థిక విధా నాలను రోజూ విమర్శించే బీజేపీ బిహార్లో అంటకాగుతున్నది ఎవరితో? భారతీయ సోషలిస్టు పార్టీ స్థాపకులైన రామ్మనో హర్ లోహియా విచారధార లోంచి ప్రవహించినవాడే నితీశ్ కుమార్. దిగ్గజ సోషలిస్టు జార్జి ఫెర్నాండెజ్ అడుగుజాడల్లోనే నితీశ్ కుమార్ రాజకీయ అడుగులు పడ్డాయి. నెహ్రూకూ, లోహియా వాదులకూ విభేదాలుండవచ్చు. అంతిమ లక్ష్యం సామ్యవాదమే కదా! అంతెందుకు బిహార్లోని ఆర్జేడీ, జేడీయూ... రెండూ ఒకే తాను ముక్కలు. నితీశ్ పార్టీకి ఆయన తర్వాత వారసత్వ నాయకత్వం లేదు. ఆయన ఆరోగ్యం కూడా అంతంతమాత్రం. ఇప్పుడు పెద్ద పార్టీగా గెలిచిన బీజేపీ నితీశ్ను మరికొంతకాలం కొనసాగనిచ్చి తర్వాత తానే పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నితీశ్ తదనంతరం ఆయన పార్టీని కూడా బీజేపీ తనలో లీనం చేసుకోవచ్చనే అభిప్రాయం ఉన్నది.హిందీ మాట్లాడే ‘కౌ బెల్ట్’ ప్రాంతంలో ఒక్క బిహార్ మాత్రమే పూర్తిస్థాయిలో బీజేపీకి చేజిక్కలేదు. అనతికాలంలోనే ఈ గోక్షేత్రమంతా కాషాయ ఛత్రఛాయలోకి రావడం ఖాయ మన్న ఆశాభావం బీజేపీలో ఇప్పుడు బలపడింది. ఇక మిగిలింది ఆర్యావర్త సంపూర్ణ కాషాయీకరణ! త్రివేణుల్లో ఒకటైన సరస్వతీ నది ఒకనాడు అదృశ్యమైనదని భావిస్తున్న నేటి రాజస్థాన్, గుజరాత్ ప్రాంతం నుంచి గంగా ప్రవాహపు ఆఖరి మజిలీ వంగభూమి వరకు విస్తరించిన ఆర్యావర్తంలో బీజేపీకి ఇప్పటిదాకా అందని రాష్ట్రం బెంగాల్ మాత్రమే. నిన్నటి విజ యోత్సవ ర్యాలీలో నరేంద్ర మోదీ బెంగాలే తమ తదుపరి లక్ష్యమని ప్రకటించారు. బీజేపీ విజయయాత్రను మమతా దీదీ నిలువరించగలరా... లేదా? ఇంకో ఏడాది వేచి చూడాలి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
నవీన్ యాదవ్కు రాహుల్ అభినందనలు
సాక్షి, ఢిల్లీ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఎన్నికలో గెలిచిన వల్లాల నవీన్ యాదవ్తో పాటు తెలంగాణ కాంగ్రెస్నూ ఆయన అభినందించారు. శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, జూబ్లీహిల్స్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హస్తినలో రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జయకేతనం ఎగుర వేశారు. తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి మాగంటి సునీతపై 25 వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే ఇది అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం.కాంగ్రెస్ విజయంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేశారు. క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేలా సీఎం చర్యలు చేపట్టారు. -
‘పొత్తు వద్దంటే చిత్తే’.. ‘ఇండియా కూటమికి’ మజ్లిస్ షాక్
న్యూఢిల్లీ: హైదరాబాద్కు చెందిన ఏఐఎంఐఎం (మజ్లిస్) పార్టీ బిహార్ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించింది. సీమాంచల్ ప్రాంతంలోని 29 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఈ పార్టీ ఐదు సీట్లు గెలుచుకుంది. కేవలం ఆరు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీతో దాదాపు సమానమైన విజయాన్ని నమోదు చేసింది.బిహార్ అసెంబ్టీ ఎన్నికల్లో మజ్లిస్ రెండు శాతం ఓట్లను దక్కించుకుంది. ఇది ఆ పార్టీకి పెరుగుతున్న ఆదరణను సూచిస్తుంది. దేశవ్యాప్తంగా ముస్లింలకు ప్రతినిధిగా తన పార్టీని విస్తరించాలని ఓవైసీ ప్రయత్నిస్తుండగా, బిహార్ లాంటి రాష్ట్రాలలో ఆయనకు ఆదరణ లభిస్తోంది. 2015 బిహార్ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన మజ్లిస్, కిషన్గంజ్లో ఒక స్థానం గెలిచింది. అయితే అదే సమయంలో ప్రధానంగా కాంగ్రెస్-ఆర్జేడీ కూటమికి పడే ముస్లిం ఓట్లను పెద్దఎత్తున చీల్చింది.2020లో ఈ బలం మరింత పెరిగి ఏకంగా ఐదు సీట్లు గెలుచుకుంది. దీంతో ముస్లిం ఓటును విభజించడం ద్వారా ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రాకుండా అడ్డుకుని, పరోక్షంగా బీజేపీకి లాభం చేకూర్చిందన్న విమర్శలు మజ్లిస్పై వచ్చాయి. దీంతో కాంగ్రెస్, ఆర్జేడీలు మజ్లిస్పై కినుక వహించాయి. కాగా బీజేపీకి అవకాశం ఇవ్వకుండా ఉండాలనే లక్ష్యంతో ఓవైసీ, ఈసారి బీహార్లోని ఇండియా కూటమిలో భాగస్వామి కావడానికి ప్రయత్నించారు. అయితే, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ మజ్లిస్ను కూటమిలోకి చేర్చుకోవడానికి నిరాకరించారు.దీంతో మజ్లిస్ ఒంటరిగా 29 స్థానాల్లో పోటీ చేసి మళ్లీ ఐదు సీట్లు గెలుచుకుంది. అలాగే ఓట్ల శాతాన్ని రెండుకు పెంచుకోవడం ద్వారా కాంగ్రెస్ కూటమికి తీవ్ర నష్టం కలిగించింది. ముస్లిం ఓట్ల విభజన కారణంగా కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి 30 కంటే ఎక్కువ స్థానాలు కోల్పోయిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో కాంగ్రెస్ కంటే ఏఐఎంఐఎంకు ఎక్కువ మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం. ఇది కూడా చదవండి: Bihar Election: డబుల్ షాక్లో ‘బిహార్ సింగం’ -
బిహార్లో కాంగ్రెస్ కనుమరుగు!!
న్యూఢిల్లీ: సరిగ్గా 40 ఏళ్ల క్రితం బిహార్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100కుపైగా స్థానాల్లో విజయపతాక ఎగరేసింది. శుక్రవారం వెలువడిన ఎన్నికల్లో కేవలం ఆరు చోట్ల గెలిచింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్పై నీలినీడలు కమ్ముకున్నాయి. 1952 ఎన్నికల్లో 41.38 శాతం ఓట్లను ఒడిసిపట్టిన కాంగ్రెస్ ప్రభ 1990వ దశకం నుంచి తగ్గుతూ వస్తోంది. ఈసారి 50కిపైగా స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్.. అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని ఏఐఎంఐఎం, జితన్ రామ్ మాంఝీ సారథ్యంలోని హిందుస్తానీ అవామ్ మోర్చా(హెచ్ఏఎం)ల స్థాయికి పడిపోయింది. ఎంఐఎం, హెచ్ఏఎంలు చెరో 5 చోట్ల గెలిచాయి. 15 ఏళ్ల క్రితంతో పోలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటు షేరు కాస్తంత పెరిగింది. 2010లో పోలైన ఓట్లలో కాంగ్రెస్కు 8.17 శాతం ఓట్లు పడితే ఈసారి కాస్తంత ఎక్కువగా 8.75 శాతం ఓట్లు పడ్డాయి. తిరుగుబాటు నేతలను దారి తెచ్చుకోవడం, కీలక నేతల మధ్య సమన్వయం పెంచడం, ఓడిన స్థానాల్లో తిరిగి పట్టుసాధించి విజయం సాధించే క్రమంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమవుతోంది. 1985లో వందకుపైగా సీట్లు గెలిచిన పార్టీ తర్వాత 1990లో కేవలం 71 స్థానాలకు పరిమితమైంది. అప్పటి నుంచి గెలుపు కోత మొదలైంది. 1995లో 29 చోట్ల, 2000లో 23 చోట్ల గెలిచింది. ఇక 2005లో పదంటే పది చోట్ల విజయం సాధించింది. శుక్రవారం ఫలితాలను చూస్తే హెచ్ఏఎం(సెక్యులర్) నేత చేతిలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్కుమార్ సైతం ఓడిపోయారు. ‘కుటుంబ’నియోజకవర్గంలో హెచ్ఏఎం అభ్యర్థి లలన్రామ్ .. రాజేశ్ కంటే 21,525 ఓట్లు ఎక్కువ సాధించారు. రాహుల్గాంధీ తలకెత్తుకున్న ఓటు చోరీ నినాదం బిహార్లో ఏమాత్రం పనిచేయలేదు. రాహల్ చేసిన ఓటర్ అధికార్ యాత్ర, ఓటర్లజాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)పై విమర్శలు, ప్రజాస్వామ్యాన్ని జెన్ జెడ్ యువతరం కాపాడాలన్న పిలుపులకు ఓటర్ల నుంచి ఎలాంటి స్పందనాలేదు. గతంతో పోలిస్తే బిహార్లో మౌలికవసతుల అభివృద్ధి వేగంగా జరగడంతో ఓటర్లు ఎన్డీఏ వైపు మొగ్గుచూపడంతో కాంగ్రెస్ ఓటమి రూపంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కొన్ని చోట్ల ఆర్జేడీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యరి్థని నిలపలేకపోవడం, ఉన్న కొన్ని ఓట్లను కొత్తగా వచ్చిన జనసురాజ్ పార్టీ చీల్చడంతో మరికొన్ని స్థానాలు కాంగ్రెస్ చేతుల్లోంచి జారిపోయాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం విప్లవాత్మకంగా సంస్థాగత సంస్కరణలకు తెగించకపోతే అధికారాలను కోల్పోయే పరంపర కొనసాగుతుందని రాజకీయ పండితులు విశ్లేíÙంచారు. -
గఠ్బంధన్ను ముంచిన ‘ఎం’ ఫ్యాక్టర్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ కూటమిపై ఓట్ల చోరీ విమ ర్శనాస్త్రం సంధించి, బిహార్ యువత, మహిళలు, ముస్లింలు, మల్లాలుసహా ప్రతి వర్గంపై హామీల వరద పారించిన మహాగఠ్బంధన్ కూటమి గెలు పుపై పెట్టుకున్న గంపెడాశలు గంగపాలయ్యాయి. ముఖ్యంగా ‘ఎం ఫ్యాక్టర్’గా పిలిచే మహిళలు, ముస్లింలు, మల్లాలు తమకు ఓట్ల పోరులో తోడుగా నిలబడి విజయకేతనం ఎగరేస్తా రనుకుంటే అధికార కూటమికి విజయపతాకం కట్టబెట్టి విపక్ష కూటమి కంగుతినేలాచేశారు. కుటుంబానికో ప్రభు త్వ ఉద్యోగం, వేలాది మంది తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్దీకణ ఇలా అన్ని వర్గాలపై హామీల వర్షం కురిపించిన మహాగఠ్బంధన్ కూటమి బిహారీల మనసుల్ని గెల్చుకోలేకపోయింది. ఎన్నికలకు ఆరు నెలల నుంచి ముందునుంచి సీట్ల పంపకాలపై చర్చలు మొదలైనా అవి అధికార ఎన్డీఏతో పోలిస్తే వేగంగా తేలలేదు. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దు బాటు సరిగా కుదర్లేదు. కొన్ని స్థానాల్లో విపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని నిలపడంలో ఘోరంగా విఫల మయ్యాయి. కాంగ్రెస్, ఆర్జేడీ అభ్యర్థులు పోటా పోటీగా ఒకే స్థానంలో పోటీకి దిగి ఇద్దరూ ఓడిపో యారు. ఓట్లు కాంగ్రెస్, ఆర్జేడీల మధ్య చీలిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. సీఎం అభ్యర్థిని చాలా ఆలస్యంగా ప్రకటించడం, ప్రచార పర్వంలో కాంగ్రెస్, ఆర్జేడీ అగ్రనేతల సమన్యయ లోపం సైతం కూటమి విజయావకాశాలను దెబ్బతీశాయి. తమ ఎన్నికల హామీతో అండగా ఉంటారనుకున్న మహి ళలు హఠాత్తుగా చేయివ్వగా, తమతో కలిసివస్తార నుకు న్న ముస్లింలు ఇరువర్గాల వైపు చీలిపోయారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వజూపినా వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) పార్టీ చీఫ్ ముఖేశ్ సహానీ ఆసక్తి కనబర్చకపోవడంతో ఆ పార్టీకి చెందిన మల్లా వర్గపు ఓటర్లు సైతం విపక్షకూటమి వైపు కన్నెత్తి చూడలేదు. ఇలా ఎన్నో కారణాలు విపక్షాలను విజయతీరాలకు చేర్చకుండా మధ్య లోనే ముంచేశాయి. అండగా నిలవని ముస్లింలు..బిహార్లో 10 కోట్ల జనాభాలో 1.75 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. అంటే జనాభాలో 17.7 శాతమున్న ముస్లింలు కేవలం మహాగఠ్బంధన్కు ఓటేయకుండా అధికారకూటమి వైపూ మొగ్గుచూపారు. దీంతో ఓట్లు భారీగా చీలిపోయి మహాగఠ్బంధన్ విజయావకాశాలు పూర్తిగా నశించాయి. 243 స్థానాలకుగాను 87 స్థానాల్లో ముస్లింల ప్రాబల్యం ఎక్కువ. అందుకే 20 చోట్ల మహాగఠ్బంధన్ ముస్లింలకు సీట్లిచ్చింది. అయినాసరే ఇక్కడ మొత్తంగా గెల్చింది ఐదు సీట్లే. ముస్లింలకు 14 శాతం జనాభా ఉన్న యాదవులు కలిస్తే ఓటు బ్యాంక్ 32 శాతానికి పెరిగి తమకు బాగా కలిసి వస్తుందని మహాగఠ్బంధన్ వేసిన లెక్కలు తారుమార య్యాయి. దళిత, ఆదివాసీలు కలిసొస్తే కనీసం 40 శాతం ఓట్లు వస్తాయని కాంగ్రెస్ భావించింది. వాస్తవంలో కాంగ్రెస్కు కేవలం 8 శాతం, ఆర్జేడీకి 21 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ముఖ్యంగా చాలా స్థానాల్లో ముస్లిం ఓట్లు చీలిపోయాయి. అనేక చోట్ల బీఎస్పీకి 4 నుంచి 6 శాతం ఓట్లు వచ్చింది. కొత్తగా ఏర్పడిన జనసురాజ్ పార్టీ మహాగఠ్బంధన్ విజయావకాశాలను దెబ్బతీసింది. విపక్షాలు పోటీ చేసిన స్థానాల్లో ముస్లిం ఓట్లు జనసురాజ్ పార్టీ చీల్చింది. సీమాంచల్లో 11 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం 5 స్థానాలు గెలిచింది. 60 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 6 చోట్ల మాత్రమే గెలిచింది. అధిక శాతం ఉన్న ముస్లింలను కాదని, మల్లా వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేయడం సైతం ముస్లింలకు కోపం తెప్పించింది. దర్భంగా, మధుబని, సివాన్, గోపాల్గంజ్, తూర్పు చంపారన్, భగల్పూర్ వంటి ప్రాంతాల్లో ముస్లిం ఓట్లు భారీగా చీలిపోయాయి. వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) చీఫ్ ముఖేశ్ సహానీకి చెందిన మల్లా వర్గం ఓటర్లు మిథిలాంచల్, సీమాంచల్, ముజఫర్పూర్, దర్భంగా, సుపాల్, వైశాలి, సీతామడి, షెయోహర్, కిషన్గంజ్, సహర్సా, ఖగారియా, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్ జిల్లాలలో ఎక్కువ. ఆయా జిల్లాల్లో గెలుపుపై విపక్షకూటమి గంపెడాశలు పెట్టుకుంటే కేవలం 18 చోట్ల గెలిచింది. వీఐపీ పార్టీ మల్లాలు అధికంగా ఉన్న 15 చోట్ల పోటీ చేస్తే అన్ని చోట్లా ఓడింది.పెరిగిన ఓట్ల శాతం శరాఘాతమే..మహిళా ఓటర్లు తమ వెంటే ఉన్నా రని కూటమి తొలినుంచీ భావిస్తోంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఏకంగా 66.91 శాతం పోలింగ్ నమోదు కాగా, ఇందులో మహిళా ఓటర్లలో 71.6 శాతం పోలింగ్ నమోదైంది. ఓటేసిన మహిళలే రాష్ట్రంలో అధికంగా గెలుపోటములను నిర్దేశించారని తేటతెల్లమైంది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు 1.5 కోట్ల మంది మహిళల ఖాతాల్లో నితీశ్ ప్రభుత్వం ఏకంగా ఒకేసారి రూ.10,000 నగదు జమచేయడంతో వాళ్లంతా అధికార పార్టీకే కొమ్ముకాశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, ఉచిత సైకిల్ పథకం వంటివి ఎన్డీఏకు కలిసొచ్చాయి. ఇవి విపక్షాలకు ప్రతిబంధకాలుగా తయారయ్యాయి. ఆర్థికంగా వెనుకబడిన మహి ళలకు ఏటా రూ. 30వేల ఆర్ధిక సాయం, జీవికా దీదీల ఉద్యో గాల క్రమబద్ధీకరణ, రూ. 30 వేల గౌరవవేతనం, ‘మా’ (ఇల్లు, వంట సరుకులు, ఆదాయం) పథకం ప్రతి మహిళకు భరోసా ఇస్తామని హామీ ఇచ్చినా మహిళలు విపక్షాల మాటలను నమ్మలేదు. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ సీఎంగా ఉన్నప్పుడు ఆటవికంగా పరిపాలించారంటూ ఎన్డీఏ కూటమి చేసిన ప్రచారాన్ని జనం గుర్తుంచుకుని ఆర్జేడీ మాటలను విశ్వసించడం మానేశారు. కాంగ్రెస్ వరస వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా పాత వ్యూహాలనే అమలు చేయడం సైతం విజయపథంలో దూసుకుపోకుండా అడ్డుకుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. -
కలిసికట్టుగా.. కాంగ్రెస్ విజయం
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల పాలనకు అగ్నిపరీక్షగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో లభించిన ఘన విజయంతో, అధికార కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. గత రెండేళ్ల పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతున్న వేళ జరిగిన ఎన్నికలో విజయం లభించడంతో సీఎం, మంత్రులు, పార్టీ నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు. పార్టీ నేతలంతా పని విభజన చేసుకుని ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయడంతోనే ఈ స్థాయిలో విజయం సాధ్యమయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించడం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యవేక్షణ, పోల్ మేనేజ్మెంట్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జీహెచ్ఎంసీ నేతలు, చివరకు ఇతర జిల్లాలకు చెందిన నాయకులు నియోజకవర్గంలోనే ఉండి పని చేయడం పార్టీ గెలుపునకు బాటలు వేసిందని అంటున్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో ఓటర్లను కలవడం, ఓటర్లు మెచ్చేలా వారికి హామీలివ్వడం లాంటి అంశాలు కాంగ్రెస్కు ఉపకరించాయని రాజకీయ వర్గాలంటున్నాయి. సీఎం... సీరియస్గా.. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో వచ్చిన ఉప ఎన్నికను సీఎం రేవంత్రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. ఎన్నిక షెడ్యూల్ రాకముందు నుంచే సమావేశాలు, సమీక్షలు నిర్వహించిన ఆయన.. పోలింగ్ సమయం సమీపించే కొద్దీ ఫోకస్ మరింత పెంచారు. ముఖ్యంగా మంత్రులు, ఎన్నికల బాధ్యులతో పలుమార్లు సమావేశమై ఈ ఎన్నిక ఎందుకు గెలవాలన్న దానిపై దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికలో గెలుపోటములు తనతో సహా అందరిపై ప్రభావం చూపుతాయని, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించి సానుకూల ఫలితం రాబట్టాలని పలుమార్లు హెచ్చరించారు. ప్రచార పర్వాన్ని స్వయంగా ముందుండి నడిపించారు. రెండు దఫాలుగా ఆరు రోజుల పాటు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో రోడ్షోలు, సభలు నిర్వహించారు. ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేయడంతో పాటు నవీన్ను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. చివరి మూడు, నాలుగు రోజులు పార్టీ బలగాన్ని ఉరుకులు పెట్టించేలా కార్యాచరణ రూపొందించడం ద్వారా తన పాలనకు రెఫరెండంగా భావించిన ఉప ఎన్నికలో పార్టీని గెలిపించడమే కాకుండా తన పట్టు కూడా నిరూపించుకున్నారు. ఇక పీసీసీ చీఫ్గా మహేశ్కుమార్గౌడ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన తొలి ఉప ఎన్నిక కావడం, ప్రభుత్వంతో పాటు పార్టీకి కూడా లిట్మస్ టెస్టుగా మారిన నేపథ్యంలో.. విజయం దక్కడంతో పార్టీ ఊపిరి పీల్చుకుంది. బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచి.. ఉప ఎన్నికలో విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు గాం«దీభవన్లో బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచారు. డప్పులు వాయిస్తూ నృత్యాలు చేశారు. మంత్రి వాకిటి శ్రీహరి, మాజీ ఎంపీ వి.హన్మంతరావు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, టీపీసీసీ నేతలు కుమార్రావు, సంగిశెట్టి జగదీశ్వరరావు, కైలాశ్నాగేశ్, అల్లం భాస్కర్, గజ్జి భాస్కర్ తదితరులు ఈ సంబురాల్లో పాల్గొన్నారు. ఇక ఫలితాలు వెలువడుతున్న సమయంలో కొందరు మంత్రులు జూబ్లీ క్లబ్లో సమావేశమయ్యారు. ఫలితం వెలువడిన వెంటనే సీఎం రేవంత్రెడ్డి నివాసానికి పార్టీ నేతలు, మంత్రులు క్యూ కట్టారు. -
బాధ్యత పెరిగింది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో ఎవరి పాత్ర ఏంటో, ఎవరి బాధ్యతలేంటో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తేల్చేసిందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి చెప్పారు. తమ రెండేళ్ల పనితీరు, ప్రతిపక్షాల వ్యవహారశైలిని నిశితంగా పరిశీలించిన ప్రజలు.. ఎవరు ఏ పాత్ర పోషించాలో, ఎవరు ఏ బాధ్యతలు నిర్వర్తించాలో స్పష్టం చేశారని వ్యాఖ్యానించారు. ఈ గెలుపు తమ బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును మరింత బాధ్యతతో ముందుకు తీసుకెళ్లాలని ప్రజలు తమను ఆశీర్వదించారని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం, హైదరాబాద్ అభివృద్ధి ప్రణాళిక, బీఆర్ఎస్..బీజేపీల వ్యవహారశైలి, ఎమ్మెల్యేల అనర్హత, స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం మాట్లాడారు. 51% ఓట్లతో విలక్షణ తీర్పు ‘మేము ప్రభుత్వంలోకి వచ్చి రెండేళ్లవుతున్న సందర్భంగా జూబ్లీహిల్స్ ప్రజలిచ్చిన తీర్పు మా బాధ్యతను మరింత పెంచింది. ఈ గెలుపును బాధ్యతగా స్వీకరిస్తామే తప్ప.. గెలిచినప్పుడు ఉప్పొంగిపోవడం, ఓడిపోయినప్పుడు కుంగిపోవడం కాంగ్రెస్ పార్టీకి తెలియదు. ఈ ఎన్నికలో మాకు 51 శాతం ఓట్లు వేయడం ద్వారా జూబ్లీహిల్స్ ప్రజలు విలక్షణ తీర్పునిచ్చారు. రెండేళ్ల మా పనితీరును గమనించి ఓ నిర్ణయానికి వచ్చి ఇచ్చిన తీర్పు ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ఎవరి పాత్ర ఏంటో ప్రజలు స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవడం, మౌలిక వసతులు కల్పించడం, ఉద్యోగ, ఉపాధి ప్రణాళికలు రూపొందించడం కోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ట్రిపుల్ ఆర్, రేడియల్ రోడ్లు, మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తర ణ, నగరానికి కృష్ణా, గోదావరి జలాలు, ట్రాఫిక్ సమస్య, ఎలివేటెడ్ కారిడార్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిల నిర్మాణం, పారిశుధ్య నిర్వహణ, చెరువులు,నాలాల కబ్జాల నియంత్రణ లాంటి కార్యక్రమాలతో హైదరాబాద్ను అన్నివిధాలా తీర్చిదిద్దుతాం..’అని రేవంత్ చెప్పారు. కేటీఆర్ అహంకారం,హరీశ్ అసూయ తగ్గించుకోవాలి ‘బీఆర్ఎస్ సోషల్ మీడియాలో విష ప్రచారం చేసింది. పెయిడ్ ఆర్టికల్స్, ఫేక్ సర్వేలతో అవహేళన చేసి అవమానించి అసభ్యకర భాషలో మమ్మల్ని దూషించారు. హరీశ్రావు అసూయను తగ్గించుకోవాలి. కేటీఆర్ అహంకారాన్ని తగ్గించుకోవాలి. వయసులో నా కంటే చిన్నవాడైన కేటీఆర్ ఇంకా చాలా కాలం రాజకీయాల్లో ఉండాల్సి ఉంది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. వారసత్వ సంపద కాదు. ప్రతిపక్షం ఇప్పటికైనా సంయమనం పాటించాలి. కానీ ఇప్పుడు కూడా కేటీఆర్ తన మాటలను మార్చుకోవడం లేదు. హరీశ్రావు అసూయ తగ్గించుకుంటే మంచిది. ఆయన అసెంబ్లీలో కూర్చున్నప్పుడు మా వైపు తీక్షణంగా చూస్తాడు. ఆయన చూపులకే గనుక శక్తి ఉంటే మా వైపు కూర్చున్న వాళ్లంతా మాడి మసై పోతారేమోనని అనిపిస్తుంది. ఈ ఇద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని ఎలా అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఎన్నికలకు ఇంకో మూడేళ్ల సమయముంది. చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దాం. మరో రెండేళ్లు రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. మంచి సూచనలు చేయండి.. చర్చించండి.. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఇప్పటికైనా హైదరాబాద్ను మంచి నగరంగా తీర్చిదిద్దే మా ప్రయత్నానికి సహకరించండి..’అని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఆరోగ్యం అంతంత మాత్రమే.. ‘కేసీఆర్ను ఆ కుర్చీ నుంచి తప్పించాలని హరీశ్రావు, కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. దీన్ని అర్థం చేసుకున్న కేసీఆర్ ఓసారి వాళ్లకు కూడా అవకాశమిస్తే అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ప్రచారానికి రానట్టున్నారు. అయినా ఆయన అంత క్రియాశీలకంగా లేరు. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఆయన రాజకీయాల్లో క్రియాశీలంగా లేనప్పుడు విమర్శించడం భావ్యం కాదు..’అని సీఎం వ్యాఖ్యానించారు. నిధులు ఇవ్వనందుకే బీజేపీకి ఈ దుస్థితి ‘ఇప్పుడు అభివృద్ధిపై ఫోకస్ పెడతాం. ఆదాయం పెంచుకుంటాం. వనరులు సమకూర్చుకుంటాం. కేంద్రం నుంచి తేవాల్సిన అనుమతులు, నిధుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సహాయ నిరాకరణ చేస్తున్నారు. మూసీ ప్రక్షాళన చేపడితే ప్రతి నిమిషం అడ్డు తగిలారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, గోదావరి జలాలు, ట్రిపుల్ ఆర్ లాంటి వాటికి వీలున్నంత మేర అడ్డు తగులుతున్నారు. దీన్ని గమనించిన జూబ్లీహిల్స్ ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో 65 వేల ఓట్లు వచ్చిన బీజేపీకి..ఇప్పుడు 17 వేల ఓట్లు మాత్రమే వేశారు. కిషన్రెడ్డికి వచ్చిన ఓట్లలో 25 శాతం ఓట్లే ఇప్పుడు వచ్చాయి. ఆ పార్టీ డిపాజిట్ జప్తయింది. ఇది భూకంపం వచ్చే ముందు కనిపించే చిన్న ప్రకంపన లాంటిది. దీన్ని గమనించి ఇప్పటికైనా వ్యవహారశైలి మార్చుకోకపోతే ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను తేనందుకే బీజేపీకి ఈ పరిస్థితి దాపురించింది. కేంద్రంలో పెండింగ్లో ఉన్న పనుల గురించి, అనుమతుల గురించి చర్చించేందుకు కిషన్రెడ్డి సచివాలయానికి రావాలి..’అని రేవంత్ అన్నారు. బిహార్ ఎన్నికలపై సమీక్ష జరపలేదు ‘బిహార్ ఎన్నికల గురించి ఇంకా సమీక్షించలేదు. రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే అధికారాన్ని అధిష్టానం ఇస్తుంది కనుకనే ఇక్కడ ఎంఐఎంతో కలిసి పనిచేశాం. ఎమ్మెల్యేల అనర్హత అంశం స్పీకర్, సుప్రీంకోర్టు చేతిలో ఉంది. స్థానిక ఎన్నికల గురించి ఈ నెల 17వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో చర్చిస్తాం. న్యాయస్థానంలో ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని మంత్రులందరి సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటాం.’అని సీఎం చెప్పారు. అందరితో కలిసి ముందుకెళ్తాం.. ‘2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 39.5 శాతం ఓట్లు వచ్చాయి. 2024 పార్లమెంటు ఎన్నికల్లో 41 శాతం వస్తే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా ఓట్లు 51 శాతానికి పెరిగాయి. కాంగ్రెస్ పార్టీ ఏకతాటిపై నిలబడి పని చేస్తే ఎవరూ ఓడించలేరని మరోమారు రుజువయింది. బూత్ అధ్యక్షుడి నుంచి పీసీసీ అధ్యక్షుడి వరకు, వార్డు మెంబర్ నుంచి సీఎం వరకు అందరూ కలిసి పనిచేశారు. మాకు మద్దతిచ్చిన ఓటర్లకు, మీడియాకు, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం, టీజేఎస్లకు, ఇతర సంఘాలకు కృతజ్ఞతలు. అందరితో కలిసి ముందుకెళ్తాం. మాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. అభినందనలు..’అని రేవంత్ అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ బి.మహేశ్కుమార్గౌడ్, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వివేక్, వాకిటి శ్రీహరి, సీతక్క, జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, నగర కార్పొరేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
విపక్ష కూటమికి బి‘హారర్’
అయిదేళ్ల క్రితం బిహార్లో అంతంతమాత్రంగా గెలిచి అధికారంలోకొచ్చిన ఎన్డీయే కూటమి ఈసారి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంటున్న దాఖలా కనబడుతోంది. శుక్రవారం ఉదయం ఈవీఎంలు తెరిచినప్పటినుంచి ఆ కూటమి అప్రతిహతంగా పురోగ మించటం తప్ప వెనుకంజ లేదు. దాని ధాటికి దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ విపక్షాల కంచుకోటలనుకున్నవి కుప్పకూలుతున్నాయి. అంగప్రదేశ్, భోజ్పూర్, మగద్, మిథిలాంచల్, సీమాంచల్, తిరుత్ తదితర ప్రాంతాలన్నిటా ఎన్డీయే కూటమి విపక్షాలకు అందనంత దూరంలో ఉందంటే... విపక్ష మహాగఠ్బంధన్ (ఎంజీబీ)కి సారథ్యం వహించిన ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవే తన స్థానాన్ని నిలుపుకోవటానికి యాతన పడ్డారంటే ఇక ఇతరుల గురించి చెప్పేదేముంది? గత ఎన్నికల్లో ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ ఇప్పుడు కనుమరుగయ్యే స్థితికి చేరువైంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మధ్యలో కొన్నాళ్లు కూటమికి దూరమై... వెనక్కొచ్చినా ఎన్డీయేపై దాని ప్రభావం లేకపోవటం గమనించదగ్గది. 243 స్థానాలున్న అసెంబ్లీలో దాదాపు 200 స్థానాలకు ఎగబాకే దిశగా అది దూసుకెళ్తుండగా కనీసం 40 అయినా వస్తాయా అనే సందిగ్ధంలో ఎంజీబీ పడింది. తన ప్రాభవం గతించి దశాబ్దాలవుతుండగా ఎన్నిక లొచ్చి నప్పుడల్లా ‘తగుదునమ్మా...’ అంటూ అధిక స్థానాల కోసం పట్టుబట్టే కాంగ్రెస్ షరా మామూలుగా 61 తీసుకుని బొక్కబోర్లా పడింది. కూటమికి తాను పెద్ద గుదిబండనని రుజువు చేసుకుంది. గతంలో 70 సీట్లు తీసుకుని కేవలం 19 గెల్చుకున్న కాంగ్రెస్... ఇప్పుడు కేవలం 6తో సరిపెట్టుకునేలా కనబడుతోంది. సీమాంచల్లో ఎంఐఎం గతంలో గెల్చుకున్న అయిదు స్థానాలూ నిలుపుకోవటమేకాక రీ కౌంటింగ్ సాగుతున్న ఆరో స్థానంలోనూ నువ్వానేనా అన్నట్టుంది. వామపక్షాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే(సర్) పేరిట ఎన్నికల సంఘం(ఈసీ) ఆదరాబాదరాగా మొదలెట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై విపక్షాలు ఎంత హడావుడి చేసినా, సుప్రీంకోర్టుకెక్కినా... కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఓట్ చోరీ ప్రచారం చేసినా ఓటర్లు దాన్ని పెద్దగా పట్టించుకోలేదని ఫలితాల సరళి చెబుతోంది. అంతేకాదు... కుటుంబాని కొక సర్కారీ ఉద్యోగమిస్తామని ఆర్జేడీ చేసిన వాగ్దానం ఎన్డీయే నగదు బదిలీ ముందు వెలవెలబోయింది. 75 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చే మహిళా రోజ్గార్ యోజన ద్వారా యేటా రూ. 10,000 ఇస్తామని చెప్పటమే కాక సెప్టెంబర్ 26న తొలి వాయిదాను అందించటం జనానికి నచ్చింది. బాగా వెనకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ వంటి చిన్న పార్టీలను కలుపుకొన్నా 2020 నాటి తన 37.23 శాతం ఓట్లనూ పెంచుకోవటంలో ఎంజీబీ విఫలమైంది. అదే సమయంలో ఎన్డీయే గతం కన్నా పది శాతం మేర పెంచుకుంది. గతం కన్నా మహిళలు ఎన్డీయే వైపు మొగ్గటం,గతంలో అలిగి విడిగా పోటీచేసిన ఎల్జేపీ తిరిగి వెనక్కురావటం బాగా కలిసొచ్చింది. పెద్దమాటలు చెబుతూ వచ్చిన ప్రశాంత్ కిశోర్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక తీసుకొచ్చి విపక్షాలను దెబ్బతీశారు.ఆధిపత్య కులాల్లో ఓటు బ్యాంకును నిలుపుకొంటూనే బాగా వెనకబడిన ఎంబీసీ కులాలు, మహాదళిత్ల ఆదరణ పొందటం ఎన్డీయేకు లాభించింది. ఆ వర్గాలకు ప్రాతి నిధ్యం వహిస్తున్న పార్టీలకు తగినన్ని సీట్లివ్వటమే ఇందుకు కారణం. దీని ముందు ఆర్జేడీ ముస్లిం–యాదవ్ కలయిక పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 87 స్థానాల్లో దాదాపు 20 శాతం మించి ముస్లిం ఓట్లున్నా అందుకు దీటుగా సీట్లు కేటాయించటంలో ఆర్జేడీ విఫలమైంది. కొద్దోగొప్పో సీమాంచల్లో ఇచ్చినా ముస్లింలు ‘గెలిచే సత్తా’ ఉన్న అభ్య ర్థుల వైపే మొగ్గారు. ఈ ఎన్నికల్లో ఈసీ వ్యవహార శైలి కూడా అధికార పక్షానికి కొంతమేర లాభించింది. 2024లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అయిదేళ్లుగా ఉన్న పథకాలను సైతం ఎన్నికల ముందు నిలిపేసిన ఈసీ... పెద్ద మనసు చేసుకుని బిహార్లో సరికొత్త మహిళా రోజ్గార్ యోజన జోలికి పోలేదు. ఎన్డీయే నెగ్గితే మళ్లీ నితీశ్ సీఎం అవుతారా లేదా అన్న సంశయం మొదట్లో ఉన్నా, ఫలితాల సరళి చూస్తే ఆ విషయంలో బీజేపీ పట్టుబట్టక పోవచ్చు. ఏదేమైనా ఇది ప్రధాని నరేంద్ర మోదీ, ‘సుశాసన్ బాబు’ నితీశ్ కుమార్ కలిసి సాధించిన ఘన విజయం. -
ఏడు రాష్ట్రాలు.. 8 ఉప ఎన్నికలు.. ఏ పార్టీలు గెలిచాయంటే?
ఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లో జరిగిన 8 అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో రెండు చోట్ల బీజేపీ, రెండు చోట్ల కాంగ్రెస్ గెలుపు సాధించాయి. తెలంగాణ, రాజస్థాన్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాయి. తెలంగాణ, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్, మిజోరాం, ఒడిశా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగాయి. జమ్మూ కశ్మీర్ నగ్రోటలో బీజేపీ అభ్యర్థి దేవయాని రానా గెలుపొందారు. బడ్గాంలో పీడీపీ అభ్యర్ధి సయ్యద్ ముంతజీర్ విజయం సాధించారు.జార్ఖండ్లో ఘట్సిల ఉప ఎన్నికల్లో జేఎంఎం అభ్యర్థి సోమేశ్ చంద్ర విజయం సాధించగా.. రాజస్థాన్లో అంట ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ జైన్ గెలుపొందారు. తెలంగాణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. పంజాబ్లో తరణ్ ఉప ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి హర్మిత్ సింగ్ సందు గెలుపొందారు. మిజోరాంలో డంప ఉప ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ అభ్యర్థి లాల్ తమ్గ్ లినా గెలుపొందారు. ఒడిశాలో నౌపడ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జై దొలాకియా విజయం సాధించారు. -
నవీన్యాదవ్ రాత మార్చిన ‘నవంబర్’
సాక్షి, హైదరాబాద్: హోరాహోరీగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. నవంబర్ నెల ఆయన రాత మార్చేసింది. నవీన్ యాదవ్ 1983 నవంబరు 17న పుట్టారు. 2023 నవంబరు 15న కాంగ్రెస్లో చేరారు. 2025 నవంబరు 14నే కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం.అధికార పార్టీ కావడంతో పలువురు సీనియర్లు, హేమాహేమీలు పోటీ పడినప్పటికీ.. యువ నేత అభ్యర్థితానికి కాంగ్రెస్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ ఉప ఎన్నికలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి నవీన్ యాదవ్ రెండు పర్యాయాలు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పక్షాన పోటీ చేసి 41వేల 656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు.ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ ఎన్నికల బరికి దూరం పాటించడంతో.. ఆ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 18వేల 817 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరినా.. పార్టీ టికెట్ దక్కలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో అవకాశం దక్కింది. ఈ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు.పేరు: వల్లాల నవీన్ యాదవ్తండ్రి పేరు: వి.చిన్న శ్రీశైలం యాదవ్వయసు: 42 సంవత్సరాలువిద్యార్హతలు: బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ట్రాజకీయ అరంగ్రేటం: మజ్లిస్ఎన్నికల్లో పోటీ:2014లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.2023లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిక2025లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో విజయం -
ఈ ఫలితాలు భూకంపం ముందొచ్చే హెచ్చరికలాంటివి: రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రజలు సంక్షేమానికి పట్టం కట్టారని.. ఈ గెలుపు రెండేళ కాంగ్రెస్ పాలనకు రెఫరెండం అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపుపై ఆయన స్పందిస్తూ.. జూబ్లీహిల్స్లో విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.‘‘ఈ గెలుపు నా బాధ్యతను మరింతగా పెంచింది. హైదరాబాద్ ప్రజలు మాకు అండగా నిలిచారు. బాధ్యతతో ముందుకు వెళ్ళమని మమల్ని ప్రజలు ఆశీర్వదించారు. గెలుపులో భాగమైన అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు. గెలుపులో అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు. ఎన్నికల్లో నెగ్గితే ఉప్పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం మాకు తెలియదు. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల కోసం పోరాటంలో భాగం అవుతాం. అధికారంలో ఉంటే ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం. దశాబ్ద కాలంగా ప్రజల మధ్య కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధిస్తోంది...పాలైన ఓట్లలో 51 శాతం కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ప్రజాబలం కాంగ్రెస్ పార్టీకి చెందింది. 2 సంవత్సరాలు ప్రజలు గమనించి మాకు ఈ తీర్పు ఇచ్చారు. 60 నుండి 65 శాతం ఆదాయం జంట నగరాల నుండే వస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి కిషన్ రెడ్డి సహాయనిరాకరణ చేస్తున్నారు. కిషన్ రెడ్డికి వచ్చిన ఓట్లలో 25 శాతం మాత్రమే ఇప్పుడు వచ్చాయి. ఇది భూకంపం వచ్చే ముందు వచ్చే చిన్న ప్రకంపన లాంటిది. ఇప్పుడు అలర్ట్ కాకపోతే కిషన్ రెడ్డి భూ స్థాపితం అవుతారు. ఇప్పటికైనా కిషన్ రెడ్డి తన పద్దతి మార్చుకోవాలి. ఎవరి పాత్ర ఏంటో, ఎవరి బాధ్యత ఏంటో ప్రజలు స్పష్టంగా చెప్పారు..హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. నగరంలో చెత్త ప్రధాన సమస్యగా మారింది. చెరువులు, నాలాలు, కుంటాల కబ్జాలపై దృష్టి పెట్టాం. అసహ్యకరమైన భాషతో అబద్ధాలను బీఆర్ఎస్ ప్రచారం చేసింది. గంజాయి, డ్రగ్స్ లను రూపుమాపడానికి ఈగల్ ఫోర్స్ తీసుకువచ్చాం. కబ్జాలను అడ్డుకోవడానికి హైడ్రా తీసుకువచ్చాం. నగర అభివృద్ధికి బీఆర్ఎస్ సహకరించకపోగా, అడ్డుపడుతోంది. మేం ఎన్నికలప్పుడే రాజకీయ విమర్శలు చేస్తాం. కిషన్ రెడ్డి సచివాలయానికి రండి. కేంద్రంలో పెండింగ్ ఉన్న రాష్ట్ర అంశాలను చర్చిద్దాం’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించి నివేదిక సిద్ధం చేయాలని భట్టి విక్రమార్కకి రేవంత్రెడ్డి సూచించారు. ..కేటీఆర్ తన అహంకారాన్ని తగ్గించుకోవాలి. హరీష్ తన అసూయను తగ్గించుకోవాలి. కేసీఆర్ కాలికి బలపం కట్టుకొని తిరిగినా మాకు 65 సీట్లు ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓటు శాతం పెరిగింది. మేం పార్లమెంట్ ఎన్నికల్లో రెండవ లిట్మస్ టెస్ట్ లో పాస్ అయ్యాం. బీఆర్ఎస్, బీజేపీ కలిసినా మా ఓటు శాతాన్ని చేరుకోలేకపోయారు. హరీష్ చూపులకు శక్తి ఉంటే ఎదుటివాళ్ళు కాలిపోయే ప్రమాదముంది. అధికారం పోయినా కేటీఆర్ కి అహంకారం పోలేదు. చివరి సంవత్సరంలో రాజకీయం చేద్దాం..రెండు సంవత్సరాలు ప్రజల కోసం పనిచేయడానికి సహకరించండి. ఫేక్ న్యూస్ నువ్వే రాయించి, నువ్వే చదివి నిజమనుకుంటే ఎలా?. ఫేక్ సర్వేల వెనుక ఎవరున్నారో నాకు తెలుసు. పక్క రాష్ట్రాల లాగా మీడియాపై దురుసుగా ప్రవర్తించకూడదు అని అనుకుంటున్నాం. మీడియా విశ్వసనీయత పోగొట్టుకోకండి’’ అంటూ రేవంత్రెడ్డి హితవు పలికారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ బీజేపీ పెద్ద మనుషులు మారరు. కాంగ్రెస్ను చూసి బీజేపీ నేతలు నేర్చుకోవాలి. ఇలా చేస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు’అని వ్యాఖ్యానించారు. -
జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం.. నవీన్ యాదవ్ రియాక్షన్
-
గెలుపుపై నవీన్ యాదవ్ ఫస్ట్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. గెలుపుపై నవీన్ యాదవ్ స్పందిస్తూ.. తన మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. సీఎం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. ‘‘నా కుటుంబ సభ్యులపై బీఆర్ఎస్ అనేక ఆరోపణలు చేసింది. పదేళ్లలో చేసింది ఏమిలేక...ఏం చెప్పుకోలేక మాపై ఆరోపణలు చేశారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.‘‘నేను కక్షపూరిత రాజకీయాలు చేయను. అధిక నిధులు తీసుకొచ్చి జూబ్లీహిల్స్ని మరింత అభివృద్ధి చేస్తా. అభివృద్ధే నా అజెండా. జూబ్లీహిల్స్ ప్రజలు నన్ను భారీ మెజారిటీతో గెలిపించారు. జూబ్లీహిల్స్ ప్రజలకు పాదాభివందనం’’ అంటూ నవీన్యాదవ్ చెప్పుకొచ్చారు. నన్ను నా కుటుంబం, వ్యక్తిత్వంపై దెబ్బతిస్తూ ఓట్లు ఆడిగారు. అందుకు జూబ్లీహిల్స్ ప్రజలు గట్టి సమాధానం ఇచ్చారు. రిగ్గింగ్,దౌర్జన్యం అనేవి తప్పుడు మాటలు. అధిక బడ్జెట్తో జూబ్లీహిల్స్ని మరింత అభివృద్ధి చేస్తానని నవీన్ యాదవ్ అన్నారు. -
కాంగ్రెస్ చిత్తుచిత్తు.. 200 మార్క్ వైపు దూసుకుపోతున్న NDA
-
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఘన విజయం..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 25వేల మెజార్టీతో విజయం సాధించింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రెండో స్థానంలో నిలిచారు. ఇక, మూడో స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన సమయం నుంచి నవీన్ యాదవ్ ముందంజలోనే కొనసాగడం విశేషం. మరోవైపు.. జూబ్లీహిల్స్ గెలుపుతో సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ పెరిగింది. జూబ్లీహిల్స్లోని అన్ని డివిజన్లలో రేవంత్ రెడ్డి విస్తృతంతా ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి డివిజన్ స్థాయిలో ప్రచారం చేయడం ఏంటని విమర్శలు చేసిన ఆయన పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్కు ఇది రెండో విజయం. ిచివరి నాలుగు రోజులు రేవంత్ ప్రచారంతో కాంగ్రెస్ విజయ అవకాశాలు మరింత మెరుగైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
సంబరాల్లో కాంగ్రెస్ నేతలు.. స్టెప్పులేసిన వీహెచ్
-
కాంగ్రెస్ ఘన విజయం.. గాంధీభవన్లో హస్తం నేతల సంబరాలు (ఫొటోలు)
-
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా! గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ సంబరాలు
-
గాంధీ భవన్లో సంబరాలు.. పొన్నం కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి ఆకాంక్షించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కంటోన్మెంట్ మాదిరిగానే ఇక్కడ అభివృద్ధి కోసం ప్రజలు ఆలోచించారు అని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ సానుభూతి, డైవర్షన్ పాలిటిక్స్ పనిచేయలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. గాంధీభవన్లో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి.జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ..‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజా పాలన ప్రభుత్వ కార్యక్రమాల ఆలోచన సరళి, ఆ నియోజకవర్గ అభివృద్ధికి ఆకాంక్షించి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారు. కంటోన్మెంట్ మాదిరి ఇక్కడ అభివృద్ధి కోసం ప్రజలు ఆలోచించారు. మహిళల సెంటిమెంట్ వాడుకోవడానికి బీఆర్ఎస్ అన్ని రకాల ప్రయత్నం చేశారు. అయినా కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం, రేషన్ కార్డులు పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు వడ్డీలేని రుణాలు, ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగ నియామకాలు, గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు మాకు అండగా ఉన్నారు.మా ప్రభుత్వం అన్ని అంశాలు క్షేత్ర స్థాయిలో చేరేలా పని చేస్తున్నాం.. ఈ ఫలితం ప్రభుత్వ కార్యక్రమాలకు నిదర్శనం. బీఆర్ఎస్ చేసిన దుష్ప్రచారం పరిగణనలోకి తీసుకొని మా ప్రభుత్వం మరింత బలంగా పని చేస్తుంది. ఓడిపోతున్నామని అసహనంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రిగ్గింగ్ ఆరోపణలు చేసింది.. వాళ్ళే మా పార్టీ కార్యాలయంపై దాడి కి ప్రయత్నం చేశారు. మీ సంగతి చూస్తా అనే మాటలు ఆశ్చర్యం కలిగించింది. పోలీసులు మా నాయకులు అక్కడ ఉండవద్దు అని కేసులు పెట్టారు. వాళ్ళలో అనేక మంది బయట వాళ్ళు ఉన్నారు.. సికింద్రాబాద్ కార్పొరేటర్ అక్కడే ఉండి టీవీలకు బైట్ ఇచ్చారు. వాళ్ళే అన్ని రకాల ప్రయత్నాలు చేశారు.. అసహనంతో ఇలా మాట్లాడుతున్నారు.కంటోన్మెంట్ ప్రజలు అభివృద్ధి ఆకాంక్షించి గెలిపించారు.. ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి ఆకాంక్షించి గెలిపిస్తున్నారు. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో గెలుస్తుంది. ముందు నుండి చెప్తున్నట్టు బీజేపీకి 10వేల ఓట్లు కూడా రావు. \కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. బీఆర్ఎస్తో కుమ్మక్కు అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి సహకరించినందుకు కిషన్ రెడ్డి గురు దక్షిణ కింద బీఆర్ఎస్కి సహకరించారు. దీనికి కిషన్ రెడ్డి జవాబు చెప్పాలి. ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ ఉండే ఇప్పుడు గల్లీలో కూడా దోస్తీగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు సహకరిస్తే మంచిది.. లేకపోతే తెలంగాణ ప్రజలు మీ ఆఫీసుకి తాళాలు వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి’ అని హెచ్చరించారు. -
రెండో రౌండ్ లో కాంగ్రెస్ 189 ఓట్ల ఆధిక్యం
-
అభివృద్ధికే జూబ్లీహిల్స్ ఓటర్ల పట్టం: మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్, సాక్షి: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ వేళ.. ఎర్లీ ట్రెండ్స్పై తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి సాక్షితో స్పందించారు. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టబోతున్నారని శుక్రవారం ఉదయం అన్నారాయన. ‘‘జూబ్లీహిల్స్ ఓటర్లు మూడు పర్యాయాలు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు. కానీ అభివృద్ధి కాలేదు. అధికారం కోల్పోయి.. ఇప్పుడు సిట్టింగ్ స్థానం కోల్పోతున్నామనే బీఆర్ఎస్ అడ్డగోలుగా మాట్లాడుతోంది. వాళ్లు ప్రజలను ప్రలోభాలకు గురి చేసినట్టు మేము కూడ చేస్తామనుకుంటున్నారు, వాళ్లు చేసినట్లు మద్యం, డబ్బులు పంచుతామని అనుకున్నారు. కానీ.. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడిగాం. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. ప్రజలకు చిన్నచిన్న కోరికలు ఉన్నాయి. బీఆర్ఎస్ వాళ్ల పదేళ్ల కాలంలో ఆ కోరికలను కూడా తీర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది అని అన్నారాయన. -
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలకు సంబంధించి... -
నేడే జూబ్లీహిల్స్ తీర్పు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. స్థానికులు ఇచ్చిన తీర్పు వెలువడనుండగా..అన్ని పార్టీలు, ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు..కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో పాటు బీజేపీకి కూడా ఇక్కడ గెలుపు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని బట్టి ఆయా ప్రాంతాలు, బూత్ల వారీగా తమకు పడిన ఓట్ల సంఖ్యపై అంచనాలు వేయడంలో పార్టీలు నిమగ్నమయ్యాయి. శుక్రవారం మధ్యాహ్ననికల్లా ఫలితం వెలువడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంతంత మాత్రంగానే పోలింగ్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో..ఇంకా మూడేళ్ల సమయం ఉండగానే జూబ్లీహిల్స్ సీటుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ముఖ్యనేతలు, బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీశ్రావు తదితరులు, బీజేపీ నుంచి కేంద్రమంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు ఆధ్వర్యంలో బండి సంజయ్, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు చురుగ్గా ప్రచారం చేశారు. ఉవ్వెత్తున సాగిన ప్రచారంతో ఓటింగ్ 55–60 శాతం నమోదవుతుందని భావించారు. కానీ చివరకు 48.42 % మాత్రమే నమోదైంది. మొత్తం 407 పోలింగ్ బూత్లకు గాను 34 కేంద్రాల్లో 60 శాతానికి పైగా, 192 కేంద్రాల్లో 50 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. దీంతో ఆయా బూత్ల ఓటర్లే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉదయం 8 గంటలకే మొదలు పార్టీలు గెలుపోటములపై విశ్లేషణలతో పాటు, వివిధ పోలింగ్ బూత్లలో ఆయా వర్గాల వారీగా పోలైన ఓట్లు, పార్టీల వారీగా అనుకూల ప్రాంతాలు, తదితర అంశాల ఆధారంగా విజయావకాశాలను బేరీజు వేసుకుంటున్నాయి. ఉప ఎన్నిక త్రిముఖ పోరుగా సాగితే..అనూహ్య ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయనే ప్రచారం తొలుత జరిగింది. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులు, పోలింగ్ శాతం నమోదు, తదితరాలు గమనిస్తే మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కింపు మొదలుపెడతారు. బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు నిలవడంతో అందుకు అనుగుణంగా కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు పది రౌండ్లలో ముగించనున్నారు. లెక్కించే ఓట్లను బట్టి ఎప్పటికప్పుడు ఫలితాలను ఈసీ వెబ్సైట్లో పొందుపరుస్తారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 15 ప్లాటూన్లతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
జూబ్లీహిల్స్ ఫలితం.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఫలితాలు రేపు(శుక్రవారం) వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలో గెలుపుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ మెజార్టీలో కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘జాబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు పక్కా ఖాయమైంది. ఫలితాల కోసం రేపటి వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఉప ఎన్నికలో 20వేల మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుంది. పోలైన ఓట్లలో 70 శాతం ఓట్లు కాంగ్రెస్కే పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 90 శాతం స్థానాల్లో విజయం సాధిస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(బీఆర్ఎస్) మృతితో ఉప ఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ ఉంది. బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ భార్య సునీత, కాంగ్రెస్ పక్షాన నవీన్ యాదవ్, బీజేపీ తరఫున లంకల దీపక్రెడ్డి పోటీ చేస్తున్నారు. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఎన్నికను అధికార పార్టీ, ప్రతిపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లు ఇచ్చే తీర్పుపై ఆసక్తి నెలకొంది. మరోవైపు.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఓటర్లు కాంగ్రెస్కు పట్టం కట్టినట్లు తెలుస్తోంది.ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా ఉన్నాయి..పీపుల్స్ పల్స్ -కాంగ్రెస్ 48శాతం, బీఆర్ఎస్-41శాతం, బీజేపీ-6శాతంచాణక్య స్ట్రాటజీస్- కాంగ్రెస్-46శాతం, బీఆర్ఎస్-43శాతం, బీజేపీ-6శాతంహెచ్ఎంఆర్ సర్వే.. కాంగ్రెస్-48.3 శాతం, బీఆర్ఎస్- 43.18శాతం, బీజేపీ 5.84 శాతం ఓట్లు -
Jubilee Hills bypoll: ‘జూబ్లీహిల్స్లో’ చిత్ర విచిత్రం
హైదరాబాద్: అన్ని ప్రధాన పార్టీలకు హేమాహేమీల్లాంటి నాయకులు ప్రచార పర్వంలో పాల్గొన్నారు. విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తించారు. తెలుగు రాష్ట్రాల్లోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావించారు. కానీ.. ఓటింగ్ శాతం పెరగకపోవడం విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు, పార్టీల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ 48.49 శాతమే నమోదు కావడానికి కారణాలెన్నో కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ పక్షాన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్తో పాటు ఏపీలోని బీజేపీకి చెందిన కేంద్రమంత్రులు, మన రాష్ట్ర మంత్రులు, ప్రముఖ నేతలు ప్రచారం చేసినా ఓటింగ్ 50 శాతం కూడా నమోదు కాకపోవడం గమనార్హం. సుమారు నాలుగు లక్షల ఓటర్లతో ఉన్న జూబ్లీహిల్స్లో ఓటింగ్ శాతం దాదాపుగా 55 శాతానికి పైగా రావచ్చనే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అంచనాలు వేశాయి. హేమాహేమీల ప్రచారంతో పాటు అన్ని పారీ్టలు గెలుపు ధీమాతో ఓటర్లను ఆకట్టుకోనే ప్రయత్నాలు చేశాయి. కారణాలివీ.. గందరగోళం: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బడుగు, బలహీన వర్గాలు అధికం. ఈ ప్రాంతంలో అత్యధికంగా బస్తీలున్నాయి. కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లు, కాలనీలు ఉన్నాయి. సినిమాలు, టీవీ సీరియళ్లలో పనిచేసే టెక్నీషియన్లు, కూలీలు, వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులు అధికం. కానీ.. ప్రధాన సమస్య ఏమిటంటే.. ఒక కుటుంబంలో 5 ఓట్లుంటే అవి దూర ప్రాంతంలో వేర్వేరు పోలింగ్ బూత్లలో ఉండటం గమనార్హం. కుటుంబంతో ఇంకొకరు అదనంగా ఓటర్గా చేరితే అదే అడ్రస్ ఉన్నా కానీ ఓటు మాత్రం ఎక్కడో వేరేచోట పోలింగ్ బూత్లో ఉన్నాయి. ఒక్కోసారి గత అసెంబ్లీలో ఒక బూత్లో వేస్తే ఈ ఉప ఎన్నికలకు వచ్చే సరికి మరోచోట ఉండటం సమస్యగా మారింది. ఓ ప్రైవేట్ ఉద్యోగి ఉద్యోగానికి బయలుదేరి ఓటు వేద్దామని బూత్ దగ్గరకు వెళ్తే అక్కడ తన ఓటు లేదని.. మరోచోట ఉందని చెప్పడంతో సదరు వ్యక్తి అసహనానికి గురై ఓటు వేయకుండా వెళ్లిపోయిన ఘటనలున్నాయి. చుట్టూ తిరిగి రాలేక: అంతేకాకుండా ఎర్రగడ్డలోని పలు బస్తీల్లోని వ్యక్తుల ఓట్లు వారికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలోని డాన్బాస్కో స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఉండటంతో వారు ఓటు వేయడానికి ముందుకు రాలేదు. 10 నుంచి 15 బూత్ల ఓట్లు ఒకే చోట ఏర్పాటు చేయడం ప్రధాన సమస్యగా మారింది. అదనంగా ఓటర్లు రావడానికి మధ్యలో ఉన్న పోలింగ్ బూత్ల దారులు పోలీసులు మూసివేశారు. దీంతో వారు ఆటోలలో రావడానికి చుట్టూ మూడు కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమస్యలు ఒక్క ఎర్రగడ్డలోనే కాకుండా అన్ని డివిజన్లలో నెలకొంది. నిరాసక్తత: అపార్ట్మెంట్వాసులు కూడా ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా, పనుల నిమిత్తం బయట ఉండటంతో మనం ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అనే నిరాసక్తత చూపించారు. ఇక్కడి ప్రాంతాల ప్రజలు ఓటు హక్కును పొంది, మరోచోటకు మారుతూ ఉంటున్నారు. అందులో ప్రధానంగా సినీ, చిరు వ్యాపారులు, ఉపాధి అవకశాలకోసం వచ్చే హాస్టల్ విద్యార్థులు, ఇతర రాష్ట్రాల కూలీలు అధికం. ఇలాంటి ఓట్లు కూడా వేలల్లో ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా ఎంతో ప్రతిష్టాత్మకంగా, వ్యూహాత్మకంగా, భారీ ప్రచారాలకు తెరలేపినా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటింగ్ పెరగకపోవడానికి కారణాలను మరింత లోతుగా ఈసీ విశ్లేషించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
మళ్లీ ఐదేళ్లు కాంగ్రెస్కు ఢోకా లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరోమారు కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్ వ్యాఖ్యానించారు. మళ్లీ ఐదేళ్ల పాటు కాంగ్రెస్కు ఢోకా లేదని అన్నారు. ‘రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి సమర్థవంతంగా పాలన సాగిస్తున్నారు. అటు ఎమ్మెల్యేలు, ఇటు పార్టీ నేతలు ఈ విషయంలో సంతృప్తిగా ఉన్నారు. ఆయనే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. నాయకత్వ మార్పు ప్రశ్నే రాదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్గా నేను వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటాం. ఆ ఎన్నికల్లో గెలుపును అధిష్టానానికి కానుకగా ఇవ్వాలనేది నా కోరిక..’అని మహేశ్గౌడ్ తెలిపారు. బుధవారం గాం«దీభవన్లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 100 స్థానాల్లో విజయం సాధిస్తాం ‘రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. వారిలో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. వచ్చేసారి గెలిచేది కూడా మేమే. 100 స్థానాల్లో విజయం సాధిస్తాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేం మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. అక్కడ ఓడిపోతున్నట్టు తెలిసే బీఆర్ఎస్ మాపై నిందలు వేస్తోంది. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పక్షాన కేసీఆర్ కుటుంబమంతా ప్రచారం చేసింది. కవిత ఒక్కరే మిస్సింగ్. ప్రచారానికి కేసీఆర్ ఎందుకు రాలేదో కేటీఆర్ను అడిగితే తెలుస్తుంది. ఆయన ప్రచారానికి రాకపోయినా ప్రముఖులు, ముఖ్యులతో ఫోన్లో మాట్లాడారనే సమాచారం మాకుంది. అయితే కేసీఆర్, బీఆర్ఎస్లను ప్రజలు మర్చిపోతున్నారు. నేను గతంలో చెప్పినట్టుగా వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ ఉండదు. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా బిహార్లో మహాగఠ్ బంధన్ విజయం సా«ధిస్తుంది..’అని పీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు.త్వరలో ‘స్థానిక’భేటీ ‘ఇక స్థానిక సంస్థలకు ఎన్నికలపై దృష్టి సారిస్తాం. హైకోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత ఏఐసీసీ పెద్దలతో మరోమారు మాట్లాడతాం. భవిష్యత్ కార్యాచరణపై రెండు, మూడు రోజుల్లో సీఎంతో పాటు సీనియర్ నేతలతో సమావేశమవుతాం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకంపై హైకమాండ్ ఎప్పుడైనా ప్రకటన చేయవచ్చు. నాకు మంత్రి అవ్వాలని, లేదా ఉప ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన లేదు. పార్టీపై మక్కువ ఉన్న వ్యక్తిని. మంత్రి హోదా కంటే పీసీసీ అధ్యక్ష స్థానానికే ప్రాధాన్యతనిస్తా. ఏదైనా అధిష్టానం నిర్ణయం శిరోధార్యం..’అని మహేశ్గౌడ్ వ్యాఖ్యానించారు. -
Adilabad: పిడిగుద్దులతో రెచ్చిపోయిన కాంగ్రెస్, బీఆర్ఎస్
-
విజయం మాదే...!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు తమ దేనన్న ధీమా అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కనపడుతోంది. అటు పోలింగ్ సరళి, ఇటు పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఉప ఎన్నికలో కచ్చితంగా విజయం సాధిస్తామని ఆ పార్టీ నేతలంటున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి పోలింగ్ ముగిసేంత వరకు పార్టీ పరంగా అమలు చేసిన వ్యూహాలన్నీ సఫలమయ్యాయని చెబుతున్నారు. ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ పక్కాగా జరిగినట్లు పోలింగ్ సరళి చెబుతోందని అంటున్నారు. మిత్రపక్షమైన ఎంఐఎం మద్దతు, పార్టీ కేడర్ సహకారంతో తమ అభ్యర్థి నవీన్కుమార్ యాదవ్కు 10వేల ఓట్ల మెజార్టీ లభిస్తుందనే ధీమా గాంధీభవన్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.స్థానికతకు తోడు అభివృద్ధి నినాదం, మంత్రుల మోహరింపు, సీఎం ప్రచారం, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల బలహీన తలు, ముస్లిం మైనార్టీల మద్దతు తమకు అనుకూలంగా మారిందని చెబుతున్నారు. అయితే, బీఆర్ఎస్ నుంచి కూడా గట్టి పోటీ ఎదురైందనే అభిప్రాయంతో వారు ఏకీభవిస్తు న్నారు. కాగా, మంగళవారం ఉదయం పోలింగ్ మొదలైన సమయం నుంచి ముగిసేంతవరకు సీఎం రేవంత్రెడ్డితో పాటు ఉప ఎన్నిక కోసం ఇన్చార్జులుగా నియమితులైన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు ఎప్పటికప్పు డు పోలింగ్ సరళిని ఆరా తీశారు. స్థానిక నేతలతో మాట్లా డుతూ పోలింగ్ ప్రక్రియలో ఇబ్బందుల్లేకుండా, తమ ఓట ర్లను పోలింగ్ స్టేషన్లకు చేర్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు.పెద్ద మెజార్టీతో గెలుస్తున్నాం: పీసీసీ చీఫ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకా ల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు తమకు మద్దతిచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్ చెప్పా రు. తమ అభ్యర్థి నవీన్కుమార్ యాదవ్ పెద్ద మెజార్టీతో గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసిందని, ఈ ఎన్నికలో కష్టపడి పనిచేసిన పార్టీ నేత లు, కార్యకర్తలందరికీ ఆయన ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పోలింగ్ 48.47 శాతమే
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం ఉదయం మందకొడిగా మొదలైన పోలింగ్, సాయంత్రం వరకు కూడా అంతంత మాత్రంగానే సాగింది. అయితే చివరి గంటలో మాత్రం పోలింగ్ బూత్లలో ఓటర్ల సందడి కనిపించింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ గడువు ముగియడంతో గేట్లు మూసివేసి అప్పటివరకు క్యూ లైన్లలో ఉన్న వారిని మాత్రమే ఓటు వేసేందుకు అనుమతించారు. మొరాయించిన ఈవీఎంలు పలు పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఉదయమే ఓట్లు వేసి డ్యూటీలు, వివిధ పనులకు వెళ్లాలనుకున్న ఓటర్లు తీవ్ర ఇబ్బంది గురయ్యారు. తర్వాత పరిస్థితి చక్కబడినా సాయంత్రం వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వైపు పెద్దగా రాలేదు. బస్తీల్లో మాత్రమే కొంత హడావుడి కనిపించింది. ఇక నియోజకవర్గంలో ఓటు ఉన్న ప్రముఖులు, సినీ తారలు, అధికారులు మాత్రం ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా కోడ్ ఉల్లంఘన, దొంగ ఓట్లు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడంపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు పర్సపరంగా ఆరోపణలు చేశాయి. ప్రధాన పక్షాల అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులు పోలింగ్ బూత్లు తిరుగుతూ ఓటింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద స్థానికేతర నేతలు తిరుగుతున్నారన్న ఆరోపణలపై ఎన్నికల కమిషన్ స్పందించి ఆదేశాల ఇవ్వడంతో పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. మరోవైపు పోలీస్ యంత్రాంగం సాంకేతికతను వినియోగిస్తూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే తెలిసేలా 136 డ్రోన్లతో పర్యవేక్షించింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పలు పొలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వివాదం, తోపులాటలు వంటివి చోటు చేసుకున్నాయి. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. పోలింగ్ ముగిసే సమయంలో..యూసుఫ్గూడలో దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక కాంగ్రెస్ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ అభ్యర్థి సునీత, ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి, స్థానిక కార్పొరేటర్తో కలిసి ఆందోళనకు దిగారు. దీనిని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని కార్యకర్తలను చెదరగొట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు షేక్పేట్ డివిజన్ అపెక్స్ హైసూ్కల్ పోలింగ్ బూత్ వద్ద కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు లాఠీచార్జి చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. ఇక యూసుఫ్గూడ సవేర ఫంక్షన్ హాల్ వద్ద కూడా బీఆర్ఎస్ అభ్యర్థి సునీత, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతి బూత్కీ ఎందుకు తిరుగుతున్నారంటూ బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. శ్రీకష్ణానగర్లోని ఎ బ్లాక్ పోలింగ్ బూత్లో దొంగఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తూ సునీత బైఠాయించారు. షేక్పేట్ అల్ఫల స్కూల్, సమత కాలనీల వద్ద గల పోలింగ్ స్టేషన్లలో భారీగా బోగస్ ఓటింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ ఆయా పోలింగ్ బూత్ల ముందు బైఠాయించారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒక పోలింగ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఉండడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ కూడా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దాదాపు 1 శాతం అధికంగా పోలింగ్ చివరిసారిగా అందిన సమాచారం మేరకు ఈ ఉప ఎన్నికలో 48.42 శాతం పోలింగ్ నమోదైంది. అయితే దాదాపు రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 47.58 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద హడావుడి చూసి తాజా ఎన్నికలో 50 శాతానికి పైగా పోలింగ్ ఉంటుందని పలువురు భావించినప్పటికీ ఎప్పటి మాదిరే నమోదైంది. రాజకీయ పార్టీలు.. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్లు ఎన్నికలకు ఎంతోకాలం ముందునుంచే ఇంటింటికీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు తప్పకుండా ఓట్లు వేయాల్సిందిగా కోరినప్పటికీ ఫలితం కన్పించలేదు. అధికారుల అవగాహన కార్యక్రమాలను కూడా స్థానికులు పట్టించుకోలేదు. -
తెలంగాణ AICC కో-ఇన్ఛార్జ్గా సచిన్ సావంత్ నియామకం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కో-ఇన్ఛార్జ్ నియామకం విషయంలో ఎఐసీసీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. సచిన్ సావంత్ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కో-ఇన్ఛార్జ్గా నియమించింది. తాజా రాజకీయ మార్పుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ కొత్త నియామకం చేపట్టింది. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు కో-ఇన్ఛార్జ్లను నియమించినట్టు కేసీ వేనుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు సచిన్ సావంత్ పార్టీకి దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఇన్ఛార్జ్గా ఉన్న మీనాక్షీ నటరాజన్కు సహాయకుడిగా సచిన్ సావంత్ సేవలందించనున్నారు.యువ నాయకత్వం, జాతీయ స్థాయిలో పార్టీపై నిబద్ధత చూపిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. తెలంగాణలో రాబోయే మున్సిపల్, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతం చేయడం, కేడర్ను సమన్వయం చేయడం లక్ష్యంగా ఆయన నియామకాన్ని హైకమాండ్ నిర్ణయించింది. -
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. గెలిచేది ఆ పార్టీనే?
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఓటర్లు కాంగ్రెస్కు పట్టం కట్టినట్లు తెలుస్తోంది. పీపుల్స్ పల్స్ -కాంగ్రెస్ 48శాతం,బీఆర్ఎస్-41శాతం,బీజేపీ-6శాతంచాణక్య స్ట్రాటజీస్- కాంగ్రెస్-46శాతం,బీఆర్ఎస్-43శాతం,బీజేపీ-6శాతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న ఉదయం 7 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించింది.ఈ ఎన్నికల్లో మొత్తం 58 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా..బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఈ రేసులో ముందంజలో ఉన్నారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14 (శుక్రవారం) విడుదల కానున్నాయి. ఇదీ చదవండి: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ -
Maganti Sunitha: ఆకు రౌడీలూ.. గుర్తుపెట్టుకోండి.. 14 తర్వాత ఒక్కొక్కడినీ..
-
డబ్బులు పంచుతూ అడ్డంగా బుక్కైన కాంగ్రెస్ నేత
-
డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిన కాంగ్రెస్ నేత
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నేతలు ప్రలోభాల పర్వానికి తెర తీశారు. వెంగళరావు నగర్ డివిజన్లో ఓటర్లకు డబ్బుల పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. బూత్ నెం.205, జవహర్నగర్లో ఓటర్లకు డబ్బులు పంచుతూ స్థానిక కాంగ్రెస్ నేత అడ్డంగా దొరికిపోయారు. ఆ నేతను బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకుని అధికారులకు అప్పచెప్పారు.నాన్ లోకల్ నేతలపై ఎన్నికల సంఘం ఆగ్రహంనాన్ లోకల్ నేతలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలింగ్ బూత్కు రావడంపై సీరియస్ అయ్యింది. బీర్ల అయిలయ్య, రామచంద్రనాయక్, శంకర్ నాయక్పై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. రిటర్నింగ్ అధికారికి బీఆర్ఎస్ 60 ఫిర్యాదు చేసింది. స్థానికేతర ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇంకా జూబ్లీహిల్స్లోనే ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రలోభపెడుతున్నారని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. -
నేడే పోలింగ్.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠకు తెరలేపిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చివరి అంకానికి చేరుకుంది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లలో 4 లక్షల మందికిపైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించడంతోపాటు డ్రోన్ల ద్వారా కూడా పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు తెలుసుకోనుంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని ప్రకటించనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంతో జరుగుతున్న ఈ ఉపఎన్నికలో గెలుపే ధ్యేయంగా ప్రధాన రాజకీయ పక్షాలన్నీ సర్వశక్తు లూ ఒడ్డాయి. నెలరోజులకు పైగా జరిగిన ప్రచారపర్వంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీ తలపడ్డాయి. ప్రచారం ముగిసిన మరుక్షణం నుంచే.. ఎన్నికల ప్రచారం ముగియగానే రాజకీయ పార్టీలు ప్ర లోభాలకు తెరలేపాయి. ఓటర్లను రహస్యంగా కలుస్తూ నగ దు పంపిణీకి తెరలేపాయి. ఆది, సోమవారాల్లో గుట్టుగా ఇంటింటికీ వెళ్లి ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ. 2,500 చొప్పున నగదు పంపిణీ చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు తాయిలాలు కూడా అందిస్తున్నాయని తెలుస్తోంది. బోరబండ, రహమత్నగర్ డివిజన్లలోని మహిళల కు నగదుతోపాటు చీరలు కూడా పంచినట్లు సమాచారం. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఓ ప్రధాన రాజకీ య పార్టీ గట్టిగా దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆ పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చిందని.. ఓటరుగా ఉన్న వారికి నగదు ఇవ్వడంతోపాటు గ్రూపు సభ్యులుగా ఉన్న మహిళలకు అదనంగా రూ. 2,500, గ్రూపు లీడర్లకు రూ. 5 వేల చొప్పున నగదు పంచినట్లు తెలుస్తోంది. మరో ప్రధాన పార్టీ ఓటర్లకు రూ. 1,000 నగదు పంపిణీని పూర్తి చేసిందని సమాచారం.పోలింగ్ పర్యవేక్షణ కోసం... నేడు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆయా పార్టీల నేతలు, కార్యకర్తల కు ఆదేశాలు అందాయి. పోలింగ్ బూత్ ఏజెంట్ నుంచి అభ్యర్థి వరకు అందరూ సాయంత్రం పోలింగ్ ముగిసి బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూంలకు తరలేంత వరకు జాగ్రత్తగా ఉండాలని దిశానిర్దేశం చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం అందుబాటులో ఉన్న మంత్రులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ భేటీలో పార్టీ ప్రచార తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారని.. మంగళవారం పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ పోలింగ్ సరళి పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. -
కర్ణాటకలో సీఎం మార్పు?.. సిద్ధరామయ్యకు నో అపాయిట్మెంట్
ఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి మార్పుపై ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లి పార్టీ అధిష్టానంతో భేటీ కావాలని ప్రయత్నించినా, కాంగ్రెస్ సీనియర్ నేతలు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంటుండగా.. నవంబర్లో సీఎం మార్పు జరిగే అవకాశాలపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గత కొన్ని నెలలుగా అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు.తాజా పరిణామాల్లో, సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లినా, పార్టీ పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. అయినా కూడా, సిద్ధరామయ్య ఢిల్లీలో జరిగిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం, కర్ణాటకలో జరిగిన ఓ సభలో సిద్ధరామయ్య మాట్లాడుతూ, తన ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని, రాబోయే రెండున్నరేళ్లూ తామే అధికారంలో ఉంటామని, తదుపరి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్దే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా, సిద్ధరామయ్య శిబిరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఆయన సోదరుడు, కొప్పల్ ఎంపీ రాజశేఖర్ హిట్నాల్ తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఇది పేరుకే విందు అయినా.. అంతర్గతంగా సిద్ధరామయ్య బల ప్రదర్శనగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక యమ కాస్ట్లీ గురూ!
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారానికి తెరపడగా, పంపకాల పర్వానికి ప్రధాన పార్టీలు తెరతీశాయి. ఉప ఎన్నికలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. గెలవడం వాటికి ప్రతిష్టాత్మకంగా మారింది. గత మూడు రోజుల నుంచి బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లు అనే తేడా లేకుండా అంతటా యథేచ్ఛగా ‘ఓటుకు నోటు’ బేరం సాగుతోంది. ఓటర్లకు ఏ పార్టీ ఎంత పంపిణీ చేస్తోందన్న విషయాన్ని ఒకదానికొకటి ఆరా తీస్తున్నాయి. తామే ఎక్కువ డబ్బులను పంచాలనే ప్రణాళికలు రూపొందించుకుని గడపగడపనూ టచ్ చేస్తున్నాయి. కొన్ని పార్టీలైతే అపార్ట్మెంట్లో రూ.2,500, బస్తీల్లో రూ.3,000 చొప్పున పంచుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఏ పార్టీవారైనా ఓటర్లకు డబ్బులు, చీరలు, కుక్కర్లు పంపిణీ చేస్తే.. ప్రత్యర్థి పార్టీ వారు పోలీసులకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసేవారు. ఇప్పుడు ఎవరూ ఫిర్యాదులు చేయడం లేదు. ‘డబ్బులు తీసుకోండి.. ఓటు మాత్రం మాకు వేయండి..’ అంటూ బహిరంగంగానే ఓటర్లకు పిలుపు ఇస్తున్నారు. తాము ఫలానా పార్టీవాళ్లమని కొందరు ఓటర్లు చెప్పినా ‘ఫర్వాలేదు. ఉంచుకోండి’ అంటూ బొట్టుపెట్టి అప్పగింతలు చేసినట్లే చెప్పేస్తున్నారు. ఆయా బస్తీల్లో మహిళా నేతలకు ఈ పంపిణీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. మధ్యవర్తులకు పండుగే పండుగ.. గత కొద్దిరోజుల నుంచి వివిధ పార్టీల ప్రచారాలకు జనాన్ని తీసుకువెళ్లడంలో కొందరు మధ్యవర్తులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రచారానికి వచ్చిన జనాలకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున రోజువారీగా ఇస్తున్నారు. అయితే కొందరు మధ్యవర్తులు రూ.300 నొక్కేసి రూ.200 చొప్పున మాత్రమే ఇస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తాజాగా పారామౌంట్ కాలనీలో తమకు రూ.500 ఇవ్వాల్సిందేనంటూ ప్రచారానికి హాజరైన మహిళలు మధ్యవర్తి ముందు బైఠాయించారు. ‘రూ.200 ఇస్తాను తీసుకోండి.. లేదంటే వెళ్లండి’ అంటూ సదరు మధ్యవర్తి తెగేసి చెప్పడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇటు మధ్యవర్తులు, అటు కిందిస్థాయి నేతలు అందినంత జేబులో వేసుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా కాస్ట్లీగా మారింది. ఉప ఎన్నిక సందర్భంగా అడుగు తీసి అడుగు వేస్తే పరిస్థితి డబ్బులు మయమైపోయిందని నేతలు వాపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డబ్బుల ప్రవాహానికి అంతులేకుండా పోయిందని గత మూడు దశాబ్దాలుగా ఇక్కడ ఎన్నికల తీరును చూస్తున్న కొందరు ఓటర్లు పెదవి విరుస్తున్నారు.మూగబోయిన మైకులు బంజారాహిల్స్: గడిచిన 18 రోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పర్వంలో హోరెత్తిన ప్రచారానికి ఆదివారం సాయంత్రం 6 గంటలతో తెరపడింది. ప్రచార రథాలకు ఏర్పాటుచేసిన మైక్లను సరిగ్గా 6 గంటల సమయంలో నిర్వాహకులు తొలగించడంతో ప్రచారంలో మైకులు మూగబోయాయి. గల్లీ గల్లీలో 58 మంది అభ్యర్ధులు తమ ప్రచార రథాలకు మైకులు ఏర్పాటుచేసుకుని వారి సందేశాలు వినిపించారు. స్వతంత్ర అభ్యర్ధులు కూడా తమ స్థాయికి తగ్గ ప్రచార రథాన్ని తయారుచేసుకుని ఒక మైక్ తగిలించి గెలిస్తే తాము ఏమి చేస్తామో పాటల రూపంలో, ప్రసంగం రూపంలో వివరించి ప్రజలను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మూడు ప్రధాన పారీ్టలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రచార రథాలు గల్లీగల్లీలో కదం తొక్కాయి. పాటలు, ప్రసంగాలు తమ పార్టీ మేనిఫెస్టోను తెలియజేస్తూ మైక్ల్లో ఊదరగొట్టారు. ప్రచార రథాలకు ఉన్న మైకులు తొలగిపోవడంతో ప్రచారం కాస్తా ఆకర్షణ కోల్పోయిందనే చెప్పారు. రథానికి మైక్ ఉంటేనే ఉర్రూతలూగించి పార్టీ పాటలతో వచ్చిన జనం ఎక్కువ సేపు ఉండేవారు. కాగా ప్రచార పర్వం ముగియడంతో ఆయా పారీ్టల అభ్యర్థులు పోలింగ్పై దృష్టిపెట్టారు. మంగళవారం ఎన్నికల పోలింగ్ రోజున అనుసరించాల్సిన వ్యూహాలపై తమ అనుచరులు, ఇతర నేతలతో మంతనాలు జరుపుతున్నారు. మనీ, మద్యం పంపకాలపైనా తెరచాటు వ్యవహారాలు ప్రారంభించినట్లు గుసగుసలు విని్పస్తున్నాయి. ఎలాగైనా గెలిచి తీరాలనే తలంపుతో ప్రధాన పారీ్టల నేతలంతా ముమ్మర కసరత్తు చేస్తున్నారు. చివరికి విజయం ఎవరిని వరిస్తుందో ఈ నెల 14న ఫలితాల వెల్లడి రోజు తెలియనుంది. -
అద్వానీపై శశిథరూర్ ప్రశంసలు.. కాంగ్రెస్కు టెన్షన్!
న్యూఢిల్లీ: బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అద్వానీకి శనివారం 98వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేత శశి థరూర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘకాలం దేశానికి సేవలందించిన అద్వానీ వంటి నేత గుణగణాలను కేవలం ఒకే ఒక్క ఘటనతో నిర్థారించడం సరికాదంటూ అభిప్రాయపడ్డారు.అదేవిధంగా, చైనాతో జరిగిన యుద్ధంలో ఓటమి కారణంగా అప్పటి ప్రధాని నెహ్రూను, దేశంలో అత్యవసర పరిస్థితి విధించినందుకు ఇందిరాగాంధీ వ్యక్తిత్వాన్ని లెక్కగట్టలేమని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయం, లాల్ కృష్ణ అద్వానీకి వర్తిస్తుందని తెలిపారు. అదెంత ప్రాముఖ్యం కలిగినదై నప్పటికీ కేవలం ఒకే ఒక్క పరిణామాన్ని ప్రాతిపదికగా తీసుకుని, వారి సుదీర్ఘ సేవలను బేరీజు వేయడం అన్యాయమన్నారు. అద్వానీ నిరాడంబరత, యోగ్యత, ఆధునిక భారత దేశ పథాన్ని నిర్ణయించడంలో ఆయన పాత్ర ఎవరూ కాదన లేనిదన్నారు. ఇక, 1990లో రామ జన్మభూమి ఉద్యమాన్ని దేశ వ్యాప్త రథయాత్రతో ముందుండి నడిపిన అద్వానీ, బీజేపీని జాతీయ రాజకీయాల్లో ప్రబల శక్తిగా తీర్చిదిద్దిన నేతగా ఖ్యాతి గడించారు. మరోవైపు.. థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. ఈ క్రమంలో.. అద్వానీని ప్రశంసిస్తూ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ పేర్కొంది. అవి ఆయన వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలే అని వివరణ ఇచ్చింది. ఇక, అద్వానీపై శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై పలు కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. శశిథరూర్ వ్యాఖ్యలను ‘ఎక్స్’లోనే ఓ న్యాయవాది విమర్శించారు. రామజన్మభూమి ఉద్యమం సందర్భంగా రథయాత్రతో దేశంలో అద్వానీ విద్వేష బీజాలు నాటారని, ఆయన చేసింది ప్రజాసేవ కాదని పోస్టు చేశారు. దీనికి థరూర్ సమాధానమిస్తూ, ఒక్క ఘటనతో సుదీర్ఘకాలం పాటు ఆయన చేసిన సేవలను తక్కువ చేయడం సమంజసం కాదన్నారు.Wishing the venerable Shri L.K. Advani a very happy 98th birthday! His unwavering commitment to public service, his modesty & decency, and his role in shaping the trajectory of modern India are indelible. A true statesman whose life of service has been exemplary. 🙏 pic.twitter.com/5EJh4zvmVC— Shashi Tharoor (@ShashiTharoor) November 8, 2025 -
బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు వేస్తే నోటాకు వేసినట్టే
సాక్షి, హైదరాబాద్: ఉపఎన్నికలో బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు వేస్తే.. నోటాకు వేసినట్టేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. 30 నుంచి 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. ఆదివారం యూసుఫ్గూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు మంత్రులతో కలిసి ఆయన మాట్లాడారు. పదేళ్ల పాలన చూసి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ప్రజలు ఓడించినా, ఉపఎన్నికలో మాత్రం ఫేక్ సర్వేలు చేసుకొని భ్రమ పడుతుందని ఎద్దేవా చేశారు. రెండేళ్ల పాలన చూసి ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుండటంతో బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ అభ్యర్థిపై విష ప్రచారమని దుయ్యబట్టారు. ఇతర కుటుంబాల్లో తలదూర్చే ఆలోచన కాంగ్రెస్కు లేదని, కానీ, మాగంటి ఇంటి వ్యవహారం బజారున పడింది కాబట్టి కేటీఆర్ మాగంటి తల్లికి సమాధానం చెప్పాల్సిన అవసరముందన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తుందన్నారు. బలహీన వర్గాల వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచి్చందని, పదవి లేకుండానే అనేక సామాజిక కార్యక్రమాలు చేసిన నవీన్యాదవ్ సేవకుడని, అతడిని గెలిపించాలని పిలుపునిచ్చారు. మూడేళ్ల అభివృద్ధి కోసం కాంగ్రెస్ను గెలిపించాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్కార్డు కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం అధికారంలో రాగానే రేషన్ కార్డులు ఇచ్చామని గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ చట్టం చేసిన సందర్భంలో బలహీనవర్గాల బిడ్డకు జూబ్లీహిల్స్లో టికెట్ ఇచ్చిందని చెప్పారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ను మూడు పర్యాయాలు ప్రజలు గెలిపించినా, ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఈ ఉపఎన్నికలో ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కు లేదన్నారు. మంత్రి శ్రీహరి మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ ఇక్కడ చేసింది ఏమీ లేదని, గెలిపిస్తే కూడా చేసేదేమీ ఉండదన్నారు. కాంగ్రెస్తోనే మూడేళ్లలో అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ కారుకు ఓటు వేస్తే కమలంకు ఓటు వేసినట్టేనన్నారు. ఫేక్ వీడియోలతో ప్రచారం చేస్తూ లబి్ధపొందాలని బీఆర్ఎస్, బీజేపీలు ప్రయతి్నస్తున్నాయని ఆరోపించారు. -
ప్రచారం సమాప్తం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ ఉత్కంఠను రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కీలక ఘట్టం ముగిసింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయానికి ప్రచార గడువు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల మైకులు బందయ్యాయి. నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన నాటి నుంచి బహిరంగంగా, అంతకుముందు అంతర్గతంగా ప్రచార పర్వంలో నిమగ్నమై కాళ్లకు బలపాలు కట్టుకొని నియోజకవర్గమంతా చుట్టివచి్చన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రచారం ముగియడంతో సేద దీరారు.అయితే, ప్రచారం ముగిసిన నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రలోభాలకు తెరలేచాయనే చర్చ జరుగుతోంది. ఈ ఉపఎన్నికలో గెలుపే ధ్యేయంగా పనిచేస్తోన్న మూడు ప్రధాన రాజకీయ పక్షాలతోపాటు ఇతర అభ్యర్థులు కూడా ఓటర్లను ప్రలోభపర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే నేరుగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడంతోపాటు పలు రకాల తాయిలాలు ఇస్తున్నారని, గల్లీలు, బస్తీలు, అపార్ట్మెంట్లు, కులాలు, వర్గాల వారీగా విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది.ముఖ్యంగా ఈసారి ఓటుకు రూ. 1,500 నుంచి రూ.5,000 వరకు ఇస్తున్నారని, ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అపార్ట్మెంట్ ఓటర్లకు రూ.3 వేలు, బస్తీల్లో రూ.5 వేల వరకు పంచేందుకు రాజకీయ పక్షాలు వెనుకాడడం లేదని, చివరి క్షణాల్లో గెలుపునకు అవసరమైన అన్ని కార్యక్రమాలను బహిరంగంగానే నిర్వహిస్తున్నారన్నది ఇప్పుడు జూబ్లీహిల్స్లో బహిరంగ రహస్యంగానే మారిందనడంలో అతిశయోక్తి లేదు. మొత్తంమీద ప్రచార పర్వం ముగియడంతో సోమవారం ప్రలోభాలు మరింత తీవ్రమవుతాయని రాజకీయ పరిశీలకులంటున్నారు. ఇప్పటివరకు రోడ్షోలు, కార్నర్ మీటింగ్లు, పాదయాత్రలు, సభలు, సమావేశాలు, గడప గడపకూ ప్రచారాలతో హోరెత్తిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇప్పుడు ప్రలోభాలతో సందడిగా మారింది. పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్న ఈసీ మంగళవారం జరగనున్న పోలింగ్కు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. నియోజకవర్గంలో 407 పోలింగ్ బూత్లలో దాదాపు రెండువేలకు పైగా సిబ్బందిని పోలింగ్ నిర్వహణకు నియమించారు. 2,494 బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించి ఈ పోలింగ్ నిర్వహించేందకు అన్ని ఏర్పాట్లను ఈసీ పూర్తి చేసింది. పోలీసు బందోబస్తు కోసం వేల సంఖ్యలో సిబ్బందిని నియమించారు. సోమవారం రాత్రికి పోలింగ్స్టేషన్ల వారీగా అటు ఎన్నికల నిర్వహణ, ఇటు బందోబస్తు సిబ్బందిని పంపడం ద్వారా పోలింగ్ సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికార వర్గాలంటున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
2034 వరకు మేమే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘నేను చెబుతున్నది గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీ ఎన్నికలు 2028 డిసెంబర్లో రావు. 2029 జూన్లో జమిలి ఎన్నికలు వస్తాయి. ఆ తర్వాత ఐదేళ్లకు ఎన్నికలు జరుగుతాయి. 2034 జూన్ వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంటుంది. పదేళ్లు టీడీపీ, పదేళ్లు కాంగ్రెస్, పదేళ్లు కేసీఆర్కు ప్రజలు అవకాశమిచ్చారు. మాకు కూడా పదేళ్లు అధికారమిస్తారు. ఈ పదేళ్లలో 100 ఏళ్లకు అవసరమైన అభివృద్ధి ప్రణాళికలను రచించి ముందుకు తీసుకెళ్తాం. 2004–14 వరకు జరిగి ఆ తర్వాత ఆగిపోయిన అభివృద్ధిని 2024–34 మధ్య కొనసాగిస్తాం. ఇప్పటికి రెండేళ్లయింది. ఇంకో ఎనిమిదేళ్లలో అన్నీ పూర్తి చేస్తాం’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఓ హోటల్లో నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. రెండేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్–2047ను వచ్చే నెలలో ఆవిష్కరిస్తామన్నారు. ఆ తర్వాత విలేకరుల ప్రశ్నలకు సీఎం బదులిచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ‘కాళేశ్వరం’పై సీబీఐ దర్యాప్తులో ముందడుగేదీ?కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలకు బాధ్యులెవరో నిగ్గుతేల్చేందుకు ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ నేతలు మాపై ఆరోపణలు చేశారు. అందుకే దీనిపై అసెంబ్లీలో చర్చించి ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాం. కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లోనే నిందితులను జైల్లో పెడతామని కిషన్రెడ్డి అన్నారు. కానీ ఇప్పటికి 3 నెలలైనా విచారణ ఇంకా మొదలుకాలేదు. సీబీఐ కాళ్లకు బంధం వేస్తున్నదెవరో మీరే (మీడియా) తేల్చాలి. కాలేజీల బంద్తో ‘ఫీజు’సమస్య పరిష్కారం కాదు... నేను ఇవ్వాల్సింది ప్రతి విద్యార్థికి రూ. 35 వేలే. కానీ కాలేజీలు రూ. లక్షల్లో డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. యాజమాన్యాల కోరికలు తీర్చలేదనే పగతో కళాశాలలు బంద్ చేస్తామంటున్నారు. బంద్ చేస్తే పిల్లలు నష్టపోయే విద్యాసంవత్సరాన్ని ఎవరు తెచ్చిస్తారు? బంద్ బందూకుల వల్ల సమస్య పరిష్కారం కాదు. రూల్ బుక్ ప్రకారం ఏం చేస్తున్నారో చూద్దాం. మీడియా, విజిలెన్స్, కళాశాలల యాజమాన్యాలతో నిజనిర్ధారణ చేద్దాం. 100 శాతం కరెక్టుగా ఉందని ఈ కమిటీ నిర్ధారిస్తే ఆ కళాశాల కోసం తల తాకట్టు పెట్టయినా ఆ రోజే 100 శాతం రీయింబర్స్మెంట్ ఇస్తా. బీఆర్ఎస్ను గెలిపించాలని కేసీఆర్ కోరలేదేం? బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల మద్దతు అడిగితే బాగుండేది. కానీ ఆ పార్టీ నాయకుడే శాసనసభకు రాడు. టీఆర్ఎస్ పుట్టుక నుంచి మరణశయ్యపైకి చేరుకొనే సమయంలో ఆ పార్టీకి ఎప్పుడైనా సున్నా సీట్లు వచ్చాయా? కేసీఆర్ బతికి ఉన్నప్పుడే, కేటీఆర్ నాయకత్వంలో గుండుసున్నా వచ్చాక ఎవరి కోసం ఈ బుకాయింపులు? వాళ్ల పనైపోయింది. బీఆర్ఎస్ కాలగర్భంలో కలవబోతోంది. ఆ బాధతోనే కేసీఆర్ బయటకు రావట్లేదు. ఇప్పటివరకు ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరలేదు. ఇది దేనికి సంకేతం? కేసీఆర్ను సానుభూతితో చూడాల్సిన పరిస్థితులే వచ్చాయి తప్ప ప్రత్యర్థిగా చూడాల్సిన పరిస్థితుల్లేవు. ఫార్ములా–ఈ రేసులో అవకతవకలపై నమోదైన కేసులో కేటీఆర్ను అరెస్ట్ చేసేందుకు అనుమతి కోరుతూ 3 నెలల క్రితమే గవర్నర్కు లేఖ రాసినా ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. నేను కాంగ్రెస్ కార్యకర్తను.. నాది కార్యకర్త మనస్తత్వం. పార్టీ ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా నేను ఇంట్లో కూర్చోను. నా మనసు ఒప్పుకోదు. హుజూరాబాద్, హుజూర్నగర్, నాగార్జునసాగర్, మునుగోడు ఎన్నికల్లోనూ ఇలాగే తిరిగా. నేను కాంగ్రెస్ కార్యకర్తను.. ఆ తర్వాత ఎమ్మెల్యేను.. ఆ తర్వాతే ముఖ్యమంత్రిని. సెక్యూరిటీ వాళ్లు అనుమతిస్తే గడపగడపకూ ప్రచారం చేసేవాడిని. పంచాయతీ ఎన్నికలపై... బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసమే పంచాయతీ ఎన్నికలు కొంత ఆలస్యమయ్యాయి. ఆ మేరకు రిజర్వేషన్లు కలి్పంచి త్వరలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం. మాకు ఆర్థికంగా సమస్యలున్నాయి కానీ మా ఆలోచనలు, ప్రణాళికల్లో లోపం లేదు. కేంద్ర సాయానికి కిషన్రెడ్డే అడ్డంకి.. కేంద్రంతో విభేదాలు, తగాదాలు మేం పెట్టుకోదల్చుకోలేదు. గతంతో పోలిస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరిగాయి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చామో ప్రజలకు వివరిస్తా. బీజేపీలోనూ కిషన్రెడ్డితో తప్ప మిగిలిన వారితో ఇబ్బంది లేదు. హైదరాబాద్ సమస్యల పరిష్కారంలో కేంద్ర సాయానికి కిషన్రెడ్డి అడ్డుపడుతున్నాడు. కేటీఆర్, కిషన్రెడ్డి ఇద్దరూ బ్యాడ్ బ్రదర్స్. బ్యాడ్ మైండ్సెట్లో ఉన్నారు. వైఎస్, కేసీఆర్ పాలనను ప్రజలు పోల్చి చూడాలి.. ఎవరిది అగ్రికల్చర్.. ఎవరిది డ్రగ్స్ కల్చర్ ప్రజలే నిర్ణయించుకోవాలి. కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిస్తే అక్కడి సమస్యలను పరిష్కరించగలిగాం. ఈ నిబద్ధత మీద తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో 2004–09 మధ్య, ఆ తర్వాత 2009–14 మధ్య రెండుసార్లు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంతో 2014–23 మధ్య కేసీఆర్ ఆధ్వర్యంలో రెండుసార్లు ఏర్పాటైన ప్రభుత్వాన్ని ప్రజలు పోల్చి చూడాలి. నాడు కాంగ్రెస్ రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్, రూ. 69 వేల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని అప్పగిస్తే ఆ తర్వాత పదేళ్లు పాలించిన కేసీఆర్ మాకు రూ. 8.11 లక్షల కోట్ల అప్పుతో అప్పగించాడు. రెండు పార్టీల పాలనలను పోల్చుకొని ప్రజలు ఓటేయాలని అడుగుతున్నా. మైనారిటీలంతా మావైపే... మైనారిటీల మద్దతుతోనే మేం అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు జూబ్లీహిల్స్లోనూ ముస్లింలు సహా మైనారిటీలంతా మా వైపే ఉంటారు’అని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. సీనియర్ జర్నలిస్ట్ రవికాంత్రెడ్డి ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా వ్యవహరించగా, మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్రెడ్డి, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు శ్రీగిరి విజయ్కుమార్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్ వరికుప్పల తదితరులు పాల్గొన్నారు. ‘జూబ్లీహిల్స్’లో గెలుపు కాంగ్రెస్దే.. ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బీఆర్ఎస్ ఓడిపోతుంది. కిషన్రెడ్డికి చెబుతున్నా... మీకు డిపాజిట్ రాదు. మీ దోస్తు ఈ ఎన్నికల్లో ఓడిపోతాడు. మీరు ఎన్ని గూడుపుఠాణీలు చేసినా 14న సాయంత్రం ఇదే ఫలితం వస్తుంది. పదేళ్లు అధికారం చెలాయించిన వాళ్లు,పన్నెండో సంవత్సరం అధికారంలో కొనసాగుతున్న వారు ఇద్దరూ ఏకమై మాపై ముప్పేట దాడి చేస్తున్నారు. జూబ్లీహిల్స్లో బీజేపీ ఒకవేళ గెలిస్తే దేశంలోనే కాదు.. బంగ్లాదేశ్, పాకిస్తాన్లోనూ ఆ పార్టీ గెలిచినట్టే. -
ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ సర్కార్ దగా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఓట్ల కోసం ప్రజలను మోసం చేయాలని చూస్తోన్న కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్లో మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపిస్తే.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పతనం ప్రారంభం అవుతుందంటూ వ్యాఖ్యానించారు.జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చే షాక్కి అసలు మూడేళ్లు రేవంత్ రెడ్డి ఈ పదవిలో ఉంటారో.. లేక మూడు నెలల్లోనే దిగిపోతారో తేలిపోతుందన్నారు. రేవంత్ రెడ్డి పనితీరు చూసి.. ఢిల్లీలో వాళ్ల అధిష్టానం కూడా కత్తులు నూరుతోందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజల తరఫున బుద్ధి చెప్పే అవకాశం జూబ్లీహిల్స్ ప్రజలకి వచ్చిందని… ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్నారు.గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం కానీ.. రేవంత్ రెడ్డి అంత చిల్లరగా వ్యవహరించిన నాయకుడిని చూడలేదంటూ కేటీఆర్ మండిపడ్డారు. పెన్షన్ పెంచాలని అడిగినా.. ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని నిలదీసినా రేవంత్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అడిగితే.. రేవంత్ రెడ్డి కాలేజీ యాజమాన్యాలను బెదిరిస్తూ వారిని విద్యకు దూరం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి విద్యార్థులు దాకా ప్రతి వర్గానికి మొండి చేస్తున్న రేవంత్ రెడ్డి కొత్తగా అభివృద్ధి చేస్తామంటే ప్రజలు నమ్మరని కేటీఆర్ అన్నారు. అసలు గెలిచిన ఎమ్మెల్యేలకే ఏమీ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం.. జూబ్లీహిల్స్ను అభివృద్ధి చేస్తుందంటే మాత్రం ఎవరు నమ్ముతారంటూ మండిపడ్డారు.పదేళ్ల కేసీఆర్ పాలన ఉండేదో.. రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని కోరారు కేటీఆర్. పదేళ్ల పాటు అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకున్నారని గుర్తు చేశారు. అన్ని రంగాల్లో తెలంగాణను, హైదరాబాద్ను అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. ఒకవైపు అభివృద్ధితో పాటు.. మరోవైపు సంక్షేమానికి కూడా సమ ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కేసీఆర్దేనని స్పష్టం చేశారు. -
మంత్రిగా రేపు అజారుద్దీన్ బాధ్యతల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: మంత్రిగా అజహరుద్దీన్ రేపు(నవంబర్ 10, సోమవారం) బాధ్యతలు స్వీకరించనున్నారు. అజహరుద్దీన్కు మైనారిటీల సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. అజహరుద్దీన్ గత నెల 31న మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.కాగా, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ వద్ద ఉండేది. తాజాగా అజహరుద్దీన్కు ఆ శాఖలను కేటాయించారు. ఇప్పుడు సీఎం రేవంత్ వద్ద హోం, విద్య, శాంతి భద్రతలు, వాణిజ్య పన్నులు, పురపాలక, సాధారణ పరిపాలన శాఖలతో పాటు ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు మిగిలి ఉన్నాయి. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ, వయోవృద్ధుల, ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖలు మిగిలాయి. -
బిహార్లో ముగిసిన రెండో విడుత ఎన్నికల ప్రచారం
పాట్నా: బిహార్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. రెండో విడుతలో ఎల్లుండి 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇవాళ చివరిరోజు అగ్రనేతలు రంగంలోకి దిగారు. కూటమి తరుఫున సభలు,రోడ్షోలు, సమావేశాల్లో ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. బిహార్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆర్జేడీ వామపక్షాలతో కూడిన మహాగట్ బంధన్(మహా కూటమి)తరుఫున రాహుల్గాంధీ ఎన్నికలు ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ కిషన్గంజ్, అమోర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో చుట్టేశారు. 1302 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. -
జూబ్లీహిల్స్లో ముగిసిన ఉప ఎన్నిక ప్రచారం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారం ఇవాళ సాయంత్రం ముగిసింది. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది. 6 గంటల తర్వాత స్థానికేతరులు నియోజకవర్గం వదిలి వెళ్లాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పరిధిలో వైన్స్, పబ్బులు మూసివేయాలని ఆదేశించింది. నవంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.4,01,365 మంది ఓటర్లు...జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ మీడియా సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 4,01,365 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. రేపు రాత్రి ఈవీఎంలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ స్టేషన్లకు తరలిస్తామని ఆయన వెల్లడించారు. ఈసారి ఒక్కో పోలింగ్ స్టేషన్ లో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. 139 పోలింగ్ లొకేషన్స్లో 407 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశాం. మూడంచెల భద్రత ఉంటుంది. 45 FST, 45 SST టీమ్స్ నియోజకవర్గం లో పని చేస్తున్నాయి. 2,060 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారని ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు.పారా మిలిటరీ బలగాలు..‘‘561 కంట్రోల్ యూనిట్లు, 595 వీవీ ప్యాట్స్, 2,394 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. పోలింగ్ స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. అన్ని పోలింగ్ స్టేషన్స్ వద్ద హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తున్నాం. ఓటర్ల క్యూ మెయింటెన్ చేయడానికి NCC వాలంటీర్లు పని చేయనున్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం...అక్కడ పారామిలిటరీ బలగాలు బందోబస్తులో ఉంటాయి. డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేస్తాం. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఓటర్లకు డబ్బులు పంపే అంశంపై ఆర్బీఐతో మీటింగ్ పెట్టాం. ఆర్బీఐ మానిటరింగ్ ఉంటుంది. ఇప్పటినుంచి 11 సాయంత్రం వరకు వైన్ షాప్లు క్లోజ్ ఉంటాయి. ఓటర్లందరూ ముందుకు వచ్చి ఓటు వినియోగించుకోవాలి’’ అని ఆర్వీ కర్ణన్ తెలిపారు.226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు..హైదరాబాద్ జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ.. 65 లొకేషన్స్ లో 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద పారా మిలిటరీ బలగాలు ఉంటాయి. అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద పోలీసుల బందోబస్తు ఉంటుంది. ఎన్నికల ఉల్లంఘన కేసులు 27 నమోదయ్యాయి. ఇప్పటివరకు 3 కోట్ల 60 లక్షల నగదు పట్టుకున్నాం. ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాం. ఇప్పటివరకు ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఘటనలు జరగలేదు. 230 రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశాం. 1,761 లోకల్ పోలీసులు బందోబస్తులో ఉంటారు. 8 కంపెనీల CISF బలగాలు బందోబస్తులో ఉంటాయికాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఈ ఉపఎన్నిక కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డి ప్రచారం చేశాయి. ప్రత్యేకించి అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని హోరెత్తించాయి. మరోవైపు బీజేపీ సైతం గెలుపు కోసం తీవ్రంగా శ్రమించింది. అయితే విజయం ఎవరిని వరిస్తుందో, ప్రజానాడి ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.సుమారు 4 లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో తమ మనోగతాన్ని వెల్లడించేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీ ప్రజాపాలనకు లేదా బీఆర్ఎస్ను ప్రజలు మళ్లీ ఆదరిస్తే ఆ పార్టీ చెబుతున్న ప్రజావ్యతిరేకతకు ఈ ఉపఎన్నిక ఫలితం రెఫరెండం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి మూడు విడతల్లో ఏకంగా ఆరు రోజులపాటు నియోజకవర్గమంతా చుట్టేయడం ఈ ఉపఎన్నిక తీవ్రతకు అద్దంపడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంత్రులకు సైతం డివిజన్లవారీగా ప్రచార బాధ్యతలు అప్పగించడం, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలంతా ఇంటింటి ప్రచారంలో తలమునకలవడం చూస్తే ఈ గెలుపును కాంగ్రెస్ ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోందో తెలుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. -
రైతును రాజు చేసింది YSR.. అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ హయాంలో
-
ఇచ్చిన మాట కోసం ఎన్నో త్యాగాలు చేశాం: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రతీ పథకాన్ని పక్కాగా అమలు చేసినట్టు తెలిపారు. ఇదే సమయంలో రేండేళ్ల కాంగ్రెస్ పాలనను, పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చవద్దన్నారు. బీఆర్ఎస్ కారణంగా తెలంగాణ పూర్తిగా దివాలా తీసిందని ఘాటు విమర్శలు చేశారు.తాజాగా మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగింది. ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిదే. రూ.1300 కోట్ల బకాయిలు రద్దు చేసిన ఘటన వైఎస్సార్దే. వ్యవసాయాన్ని పండుగ చేసిన గొప్ప నేత వైఎస్సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు అండగా నిలిచింది. రైతుల సంక్షేమం కోసం అనేక ప్రాజెక్ట్లు నిర్మించింది. కాంగ్రెస్ పాలనలో అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాం. ప్రతీ పథకాన్ని పక్కాగా అమలు చేశాం.వృద్ధిరేటులో దేశంలోనే రంగారెడ్డి టాప్.. ప్రపంచాన్ని శాసించే సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి. ఇవన్నీ తెలంగాణ గ్రోత్ ఇంజిన్గా మారాయి. వృద్ధిరేటులో దేశంలోనే రంగారెడ్డి జిల్లాలో మొదటి స్థానంలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక ఆదాయం హైదరాబాద్ నుంచే వచ్చింది. బీఆర్ఎస్ పాలనలో సచివాలయం, కమాండ్ కంట్రోల్, ప్రగతి భవన్తో ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా?. కాళేశ్వరంలో ఒక్క ఎకరానికైనా నీరు ఇచ్చారా?. కాళేశ్వరం లేకున్నా దేశంలో అత్యధిక వరి దిగుబడి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో వరి ఉత్పత్తి లేదు. రూ.20లక్షల కోట్లతో నికరంగా ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా?.సంక్షేమం ఇదే కదా..రేండేళ్ల కాంగ్రెస్ పాలనను, పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చకండి. అన్ని రంగాల్లో బకాయిలు పెట్టి రూ.8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని మాకు అప్పగించారు. వందేళ్లు పూర్తి అయిన ఉస్మానియా ఆసుపత్రిని కూడా కట్టలేదు. తెలంగాణను పూర్తిగా దివాలా తీశారు. తాడు తెగితే పాతాళంలో పడే పరిస్థితికి తెచ్చారు. వాళ్లు దొడ్డు బియ్యం ఇస్తే, మేము సన్న బియ్యం ఇస్తున్నాం. కొత్త రేషన్కార్డులు ఇచ్చాం. రైతు రుణమాఫీ చేశాం. రైతు భరోసా పెంచాం. షాద్ ముబారక్ కొనసాగించాం. రూ.500లకే సిలిండర్ ఇచ్చాం. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఆపలేదు. వాటిని కొనసాగిస్తున్నాం. ఎర్రగడ్డ, అల్వాల్, ఎల్బీనగర్, వరంగల్ ఆసుపత్రులను ఏడాదిన్నరలోగా పూర్తి చేస్తాం.తెలంగాణలో అభివృద్ధి జరగవద్దా?బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే అభివృద్ధి జరగాలా?. తెలంగాణలో మాత్రం అభివృద్ధి జరగవద్దా?. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్కు తీసుకువచ్చాం. మూసీ అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పారదర్శకంగా జరుగుతోంది. ప్రతీ రూపాయిని పారదర్శకంగా ఖర్చు చేస్తున్నాం. తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేస్తోంది. ఐటీఐఆర్ కారిడార్ వస్తే హైదరాబాద్కు లక్షల ఉద్యోగాలు వచ్చేవి. ఐటీఐఆర్ కారిడార్ను కేసీఆర్, మోదీ కలిసి రద్దు చేశారు. కిషన్రెడ్డి.. గుజరాత్కు ఎన్నాళ్లు గులాంగా ఉంటావు. తెలంగాణ అభివృద్ధి నీకు అవసరం లేదా?. తెలంగాణ అభివృద్ధికి ఎందుకు సహకరించడం లేదు అని ప్రశ్నించారు. కేటీఆర్, కిషన్ రెడ్డి తోడు దొంగలు. మూసీ వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ నేతలు ఎందుకు పర్యటించలేదు?. మూసీ ప్రక్షాళన చేస్తానంటే అడ్డుకున్న వారు, వరదలు వచ్చినప్పుడు ఎందుకు అడ్డుగా పడుకోలేదు? అని ప్రశ్నించారు. చరిత్ర ఇదే.. జైపాల్ రెడ్డి కృషి వల్లే హైదరాబాద్కు మెట్రో వచ్చింది. ఇది చరిత్ర.. ఇది కేసీఆర్ చెరిపేస్తే చెరిగేది కాదు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క కొత్త యూనివర్సిటీనైనా తీసుకొచ్చారా.. కనీసం వీసీలను నియమించలేదు. ఐదువేల పాఠశాలలు మూసేశారు. పేదలకు విద్య, రైతులకు వ్యవసాయాన్ని, మహిళలకు రాజ్యాధికారాన్ని దూరం చేశారు. దశ సరిగ్గా లేని వాడి కోసం వాస్తు పేరుతో దిశ మారిస్తే ప్రయోజనం ఉంటుందా?. మా ప్రభుత్వంలో 7100 కోట్లు ఉచిత బస్సు కోసం ఖర్చు చేశాం. ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల వైపు నడిపించాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచాం. 3 వేల కోట్లతో ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తున్నాం. 100 ఎకరాల్లో హైకోర్టు నిర్మిస్తున్నాం. బీసీ కుల గణన చేసి కేంద్రం జనగణనతోపాటు కుల గణన చేసేలా చేశాం. ఎస్సీ వర్గీకరణ చేసి చూపించాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, పోలీస్ స్కూల్ ఏర్పాటు చేశాం. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. హైదరాబాద్ నగరానికి పదేళ్లలో ఒక్క చుక్క అదనంగా తాగునీరు తీసుకొచ్చారా. మేం వచ్చాక 20 టీఎంసీల గోదావరి జలాలు తెచ్చేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చాక 20 వేలకు పైగా నోటిఫికేషన్లు వేశాం, 60 వేలకు పైగా ఉద్యోగాలకు భర్తీ చేశాం. ఎవరిది అగ్రికల్చర్.. ఎవరిది డ్రగ్స్ కల్చర్ మీరే ఆలోచించండి. ఎవరిది పబ్ కల్చర్.. ఎవరిది సామాన్యులతో కలిసే కల్చర్. ఎవరు సినీ తారలతో తిరిగే కల్చర్.. ఎవరిది సినీ కార్మికుల కోసం కృషి చేసే కల్చర్ మీరు ఆలోచించండి.జూబ్లీహిల్స్ కాంగ్రెస్దే.. పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది.. ప్రాధాన్యత వారీగా పరిష్కరిస్తాం. నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాపై ఉంది. జూబ్లీహిల్స్ గెలవాల్సిందే అభివృద్ధి జరగాల్సిందే. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుస్తోంది. బీఆర్ఎస్కు గతమే తప్ప.. భవిష్యత్ లేదు. పంతులు లేని బడిలాగా బీఆర్ఎస్ తయారైంది. జాబ్లీహిల్స్లో బీఆర్ఎస్కు బీజేపీ సాయం చేస్తోంది. నాది లీడర్ మైండ్ సెట్ కాదు. కేడర్ మైండ్ సెట్, అందుకే నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా. నేను గల్లీలోనే కాదు.. ఇంటింటికీ తిరుగుతాను. బీజేపీ డిపాజిట్ కూడా రాదు’ అని జోస్యం చెప్పారు. -
'జూబ్లీ'యేషన్ ఎవరికో!?
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడనుండగా మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఈ ఉపఎన్నిక కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ప్రత్యేకించి అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మరోవైపు బీజేపీ సైతం గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే విజయం ఎవరిని వరిస్తుందో, ప్రజానాడి ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. సుమారు 4 లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో తమ మనోగతాన్ని వెల్లడించేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీ ప్రజాపాలనకు లేదా బీఆర్ఎస్ను ప్రజలు మళ్లీ ఆదరిస్తే ఆ పార్టీ చెబుతున్న ప్రజావ్యతిరేకతకు ఈ ఉపఎన్నిక ఫలితం రెఫరెండం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రచార బరిలోకి సీఎం.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి మూడు విడతల్లో ఏకంగా ఆరు రోజులపాటు నియోజకవర్గమంతా చుట్టేయడం ఈ ఉపఎన్నిక తీవ్రతకు అద్దంపడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంత్రులకు సైతం డివిజన్లవారీగా ప్రచార బాధ్యతలు అప్పగించడం, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలంతా ఇంటింటి ప్రచారంలో తలమునకలవడం చూస్తే ఈ గెలుపును కాంగ్రెస్ ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోందో తెలుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే హైడ్రా చేపట్టిన పేదలు, సామాన్యుల ఇళ్ల కూల్చివేతలు, ఆరు గ్యారంటీల అమల్లో అక్కడక్కడా తలెత్తిన లోపాలు, అర్హులందరికీ రేషన్ కార్డులు పూర్తిస్థాయిలో అందకపోవడం ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్కు ప్రతికూల అంశాలుగా మారే అవకాశం ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో రియల్టీ రంగం ఆశించిన స్థాయిలో పుంజుకోలేదని, ప్రభుత్వ బడ్జెట్ పరిమితుల దృష్యా చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి జరగలేదని వారు చెబుతున్నారు. అందుకు తగ్గట్టే ఇప్పటివరకు వెలువడిన సర్వేలన్నీ విపక్ష బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. కానీ అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్థానికులకు కొన్నేళ్లుగా చిరపరిమితుడు కావడం.. గతంలోనూ పోటీ చేసి ఉండటం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశమని అంటున్నారు. అలాగే సుమారు 30 శాతం ఉన్న ముస్లిం ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అజహరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం, మజ్లిస్ మద్దతిస్తుండటం ఆ పార్టీకి సానుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజావ్యతిరేకత చాటాలని బీఆర్ఎస్.. సిట్టింగ్ స్థానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలన్న కృతనిశ్చయంతో విపక్ష బీఆర్ఎస్ ప్రచారపర్వాన్ని పరుగులు పెట్టిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అధికార కాంగ్రెస్ను ఓడించడం ద్వారా ప్రజావ్యతిరేకతను గట్టిగా చాటేందుకు ఆ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోందని చెబుతున్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనను పదేళ్ల కేసీఆర్ పాలనతో పోలుస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఆ పార్టీ ప్రచారంలో అధిక ప్రాధాన్యం ఇస్తోందని వారు వివరిస్తున్నారు. ప్రత్యేకించి హైదరాబాద్ను తాము చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు ప్రచారంలో పేర్కొంటున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. నగరం నలుమూలలా పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇవ్వడం, బీఆర్ఎస్ హయాంలో సాగిన 42 ఫ్లైఓవర్ల నిర్మాణం, జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు ఉచిత తాగునీరు ఇవ్వడం, ఆ పార్టీ హయాంలో ఐటీ సంస్థలకు ఇచ్చిన తోడ్పాటు వంటి అంశాలు బీఆర్ఎస్కు ఈ ఎన్నికలో కలిసి వచ్చే అంశాలు కావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం, ఆయన సతీమణి బరిలో నిలవడం కూడా బీఆర్ఎస్కు ఈ ఎన్నికలో దోహదపడే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. బీజేపీ సైతం ఆశల పల్లకీలో.. ఇక బీజేపీ సైతం ఉపఎన్నికలో సత్తా చాటేందుకు ప్రచారంలో వేగం పెంచింది. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ ప్రచారపర్వాన్ని బస్తీల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఆ పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని.. ఆ పార్టీలను గెలిపించొద్దని కోరుతున్నారు. ప్రధాని మోదీ చొరవతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని.. తమ పార్టీ అభ్యర్థి దీపక్రెడ్డికే పట్టం కట్టాలని కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లలో గెలవడం ద్వారా గతంతో పోలిస్తే పుంజుకున్నామని.. అదే స్థాయిలో ఈ ఉప ఎన్నికలోనూ గెలిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధిస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓ వర్గం ఓటర్లపై బీజేపీ పెద్దగా ఆశలు పెట్టుకోనప్పటికీ ఇతర వర్గాల ఓటర్లంతా ఏకతాటిపైకి వచ్చి తమకు అండగా నిలుస్తారని ఆ పార్టీ భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఓటర్ల మౌనం.. పదేళ్ల బీఆర్ఎస్, రెండేళ్లలో కాంగ్రెస్ పాలనలో మంచిచెడుల గురించి బహిరంగంగా మాట్లాడేందుకు ఓటర్లు నిరాకరిస్తున్నారు. ఎవరు గెలుస్తారో ఇప్పుడే చెప్పలేమని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరేం చెప్పినా, ఎవరికి ఓటు వేయాలని సూచించినా పోలింగ్ రోజు మనసులో ఉన్న దానిని బట్టి ప్రాధాన్యతలను తేల్చుకుంటామని ఇంకొందరు బస్తీలవాసులు అంటున్నారు. అయితే ఆటో కార్మీకులు, చిరువ్యాపారులు, కూలీలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోలు నడపలేని పరిస్థితి ఉందని ఆటో డ్రైవర్లు... రియల్టీ నిదానించడం వల్ల ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయని భవన నిర్మాణ కూలీలు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలన్నీ అమలు చేస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. దశలవారీగా అయినా రాబోయే రోజుల్లో గ్యారెంటీలు అమలవుతాయనే ఆశాభావం సైతం కొందరిలో కనిపించింది. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, గ్యాస్ సబ్సిడీ, ఉచిత విద్యుత్ వంటి అంశాలను బస్తీ ఓటర్లు ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. కాగా, పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పక్షాలు ప్రలోభాల పర్వాన్ని మొదలుపెట్టాయి. -
ఈ రెండేళ్లలో ఏం చేశారో రేవంత్ చెప్పలేకపోయారు
సాక్షి, హైదరాబాద్: పీజేఆర్ కొడుక్కి సీటు ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్రెడ్డికి నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. తాజాగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు శనివారం హరీష్రావు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో సంచలన ఆరోపణలే చేశారాయన. సీఎం రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే. కేసీఆర్ కట్టిన భవనాల్లో వాళ్ల పాలన కొనసాగుతోంది. కాంగ్రెస్ సర్కార్ వచ్చాకే వృద్ధి రేటు పడిపోయింది. రేవంత్కు పరిపాలన చేత కావడం లేదు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు ఉండటం రేవంత్కు ఇష్టం లేదు. అందుకే కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి వెళ్లి కూర్చుంటున్నారు. ఈ రెండేళ్లలో ఏం చేశారో రేవంత్ నిన్న చెప్పలేకపోయారు. 2004-2014 కాంగ్రెస్ పాలన చూసి ఓటేయాలని అడుగుతున్నారు. పీజేఆర్ కొడుక్కి టికెట్ ఇవ్వని రేవంత్కు.. ఆయన పేరు తీసే నైతికత లేదు. పీజేఆర్ను మానసికంగా వేధించి చనిపోయేలా చేసిందే కూడా కాంగ్రెస్ పార్టీనే అని హరీష్రావు ఆరోపించారు. .. రేవంత్ రెడ్డి, బీజేపీది ఫెవికాల్ బంధం. ఢిల్లీలో భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగితే ఎందుకు బయటకు రాలేదు?. భట్టి ఢిల్లీ వెళితే తెలంగాణ భవన్ లో ఉండరు. గురుగ్రామ్లోని అత్తగారి ఇంట్లో ఉంటారు. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే భట్టి ఇంట్లో జరిగిన ఐటీ రైడ్స్ బయటకు రాలేదు. భట్టి ఇంట్లో హార్డ్ డిస్క్ లు కూడా ఐటీ అధికారులు తీసుకెళ్ళారు. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే మంత్రి పొంగులేటి బయట ఉన్నారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం ఉంది. రేవంత్ ఢిల్లీ పోతే ఎవర్ని కలిసేది.. ఎవరి కారులో తిరిగేది బయటకు వస్తున్నాయి అని హరీష్రావు వ్యాఖ్యానించారు. -
ట్రంప్ రాడా?.. అయితే మోదీ కచ్చితంగా వెళ్తారు
దక్షిణాఫ్రికాలో జరగబోయే టీ20 సదస్సును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిష్కరించారు. తాను మాత్రమే కాదు.. అమెరికా తరఫున ప్రతినిధులెవరూ ఆ సదస్సుకు హాజరు కాబోరని స్పష్టం చేశారాయన. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను నవంబర్ 22-23 తేదీల్లో సౌతాఫ్రికాలో జరగబోయే జీ20 సదస్సును బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కాబట్టి తనను తాను విశ్వగురుగా ప్రకటించుకున్న వ్యక్తి కచ్చితంగా ఆ సదస్సుకు వెళ్లి తీరతారు అంటూ మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ శనివారం ఓ ట్వీట్ చేశారు.ఇక.. 2014లో మోదీ ప్రధానిగా తొలిసారి ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటిదాకా జీ20 సదస్సులన్నింటికీ హాజరవుతూ వస్తున్నారు మోదీ. బ్రిస్బేన్, అంటాల్యా, హాంగ్జౌ, హాంబర్గ్, బ్యూనస్ ఎయిర్స్, ఓసాకా, రియాద్ (కరోనా కారణంగా వర్చువల్), రోమ్, బాలి, న్యూఢిల్లీల్లో జరిగిన జీ20 సదస్సుల్లో పాల్గొన్నారు. అయితే.. ట్రంప్ నేపథ్యంతో మోదీని ఇలా జైరాం టార్గెట్ చేయడం తొలిసారేం కాదు. భారత్పై ట్రంప్ సుంకాల మోత మోగించాక.. ఈ ఇరు దేశాధినేతలు ఎదురుపడింది లేదు. మొన్నీమధ్యే కౌలాలంపూర్(మలేషియా)లో జరిగిన ఏషియన్ సదస్సు మోదీ గైర్హాజరు కావడాన్ని తీవ్రంగా తప్పుబట్టారాయన. రష్యా చమురు వాణిజ్యంపై ట్రంప్ అభ్యంతరాలు, అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ట్రంప్కు ఎదురు పడడం ఇష్టం లేకనే మోదీ హాజరు కాలేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఎద్దేవా చేశారు. అయితే.. అక్టోబర్ 26-28 తేదీల నడుమ కౌలాలంపూర్ వేదికగా ఏషియన్ సదస్సు జరిగింది. దీపావళి పండుగ నేపథ్యంతో ఈ సదస్సుకు మోదీ హాజరు కాలేకపోయారు. వర్చువల్గా హాజరై ప్రసంగించారు. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యక్షంగా హాజరయ్యారు. అయితే.. ఏషియన్ సదస్సుకు అనుబంధంగా జరిగిన ఈస్ట్ ఏషియా సదస్సుకు మాత్రం భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరై ప్రసంగించారు. అంతకు ముందు.. అక్టోబర్ 13వ తేదీన ఈజిప్ట్ నగరం శర్మ ఎల్ షేక్లో జరిగిన గాజా శాంతి సదస్సుకు కూడా మోదీ గైర్హాజరయ్యారు. చివరి నిమిషంలో ఆహ్వానం అందినందువల్ల రాలేకపోతున్నాంటూ వివరణ ఇచ్చారు. అంతేకాదు.. తన తరపున ప్రత్యేక ప్రతినిధిగా విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్దన్ సింగ్తో సందేశాన్ని పంపించారు. ఈ సదస్సు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసీ ఆధ్వర్యంలో జరిగిందన్నది తెలిసే ఉంటుంది. ఇదే వేదికగా ట్రంప్పై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రశంసలు గుప్పిస్తూ.. భారత్-పాక్ యుద్ధాన్ని ఆపారంటూ ప్రకటించారు కూడా. ట్రంప్ ఆరోపణలపై సౌతాఫ్రికా స్పందనఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణాఫ్రికాపై చాలాకాలంగానే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రెండోసారి అధ్యక్షుడైన కొన్నిరోజులకు.. ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసాను వైట్హౌజ్కు రప్పించుకుని మరీ శ్వేత జాతీయుల్ని ఊచకోత కోస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడేమో.. ఆ దేశంలో ఉన్న తెల్లజాతీయుల్ని నల్లజాతీయుల్ని హత్యలు చేస్తూ.. వాళ్ల భూములు, పొలాలు లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో దక్షిణాఫ్రికాలో జీ20 సదస్సు నిర్వహించడం సిగ్గుచేటు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఈ తరుణంలో 2026లో ఫ్లోరిడాలోని మియామీలో జీ20 సదస్సుకు తాను ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే.. ట్రంప్ ఆరోపణలను దక్షిణాఫ్రికా ప్రభుత్వం కొట్టిపారేసింది. తమ దేశంలో వర్ణవివక్ష పాలన ముగిసిన తర్వాత కూడా శ్వేత జాతీయులు ఆఫ్రికన్ల కంటే మెరుగైన పరిస్థితుల్లోనే జీవిస్తున్నారంటూ చెబుతోంది. దక్షిణాఫ్రికాలో 1948 నుంచి 1994 వరకు వర్ణవివక్ష విధానం కొనసాగింది. తెల్లవాళ్లకు (white minority) అధిక హక్కులు, అధికారం ఉండేది. నల్లజాతీయులు (Black majority) సొంతగడ్డపైనే వివక్షను ఎదుర్కొనేవారు. 1994లో నెల్సన్ మండేలా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. ఈ వివక్షకు ఫుల్స్టాప్ పడి సమానత్వం మొదలైంది. -
రేవంత్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు: కిషన్ రెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు.బీజేపీ ఆఫీసులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల హామీల గురించి సీఎం రేవంత్రెడ్డి ఒక్కమాట మాట్లాడరు. హామీలు ఏం అమలు చేశారో సీఎం రేవంత్రెడ్డి చెప్పరు. సీఎం రేవంత్ నాపై చేసిన వ్యాఖ్యలను నిరూపించాలి. ఆయన నాపై వ్యక్తిగత విమర్శలు చేసినా నేను భయపడను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు రేవంత్ ఏం చేశారో చెప్పాలి. రేవంత్ రెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించడం లేదు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది.ఆరు గ్యారెంటీల గురించి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడటం లేదు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓటమి తథ్యం. వాస్తవాలకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. నన్ను విమర్శించే నైతిక హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. ఫోన్ ట్యాపింగ్, విద్యుత్, ధాన్యం కొనుగోళ్ల కేసు ఏమైంది?. ఫార్మా కంపెనీలు, పారిశ్రామికవేత్తలను బెదిరించి వేల కోట్లు వసూలు చేశారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో నాకు రేవంత్ రెడ్డి, కేసీఆర్ సర్టిఫికెట్ నాకు అవసరం లేదు. నేను ఏం చేశాను అనేది ప్రజలకు తెలుసు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ బ్యాడ్ బ్రదర్స్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పార్టీలు. బీజేపీ కుటుంబ పార్టీ కాదు. చిన్న అవినీతి ఆరోపణలు లేకుండా కేంద్రంలో పని చేస్తున్నాం. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఫేక్ వీడియోలు తయారు చేసి గెలిచిన కాంగ్రెస్, బీఆర్ఎస్. ఇప్పుడు జూబ్లీహిల్స్ సైతం అదే విధంగా గెలవాలని చూస్తున్నారు. కేసీఆర్ కుటుంబం నుంచి లక్ష కోట్లు కక్కిస్తామని ఊరూరా ప్రచారం చేశారు. లక్ష రూపాయలైన కక్కించరా?. ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్, కాంగ్రెస్కు ఒప్పందం కుదిరింది నిజం కాదా?.బీఆర్ఎస్ నేతలపై అవినీతి ఆరోపణలు చేశారు. మరి కనీసం ఒక్కరి మీద అయిన కేసులు ఎందుకు పెట్టలేదు?. ఖర్చు లేనిది కాబట్టి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం. హైదరాబాద్కు కేంద్రం చేసిన అభివృద్ధిపై వివరాలు ఇచ్చాను. మీరు టైమ్ ఇస్తే హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధం. రాహుల్-కేసీఆర్ బ్రదర్స్. కేసీఆర్ను కాపాడుతోంది రాహుల్ గాంధీ కాదా?. కాకుంటే కేసీఆర్ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. రేవంత్ ది ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. రేవంత్ తెలంగాణకు పట్టిన శాపం. తెర వెనుక రాజకీయాలు చేయడంలో రేవంత్ దిట్ట అని ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: కిషన్ రెడ్డి, కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్: రేవంత్ రెడ్డి -
లక్ష ఓట్ల లక్ష్యమే జూబ్లీహిల్స్ గెలుపు!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల నుంచి హేమాహేమీలైన రాష్ట్ర నేతలు గల్లీలు, బస్తీల్లో తిరుగుతున్నారు. వందల సంఖ్యల్లో పెద్ద నేతలు తమ ఇళ్ల ముందుకు వస్తుండటం చూసి ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. ప్రతి ఒక్క ఓటు కోసం ఎంతో ఆరాటపడుతున్నారు. ఏ ఒక్క ఓటూ ప్రత్యర్థికి పోవద్దని భావిస్తున్నారు. ఇంతకీ, జూబ్లీ‘హిల్స్’ను ఎక్కాలంటే ఎన్ని ఓట్లు రావాలో అవలోకిస్తే.. ప్రస్తుతం జరగనున్న ఉప ఎన్నికలో అర్హులైన ఓటర్లు దాదాపు 4 లక్షల మంది ఉన్నారు. నగరంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా పోలింగ్ శాతం తక్కువగా ఉంటోంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ 50 శాతానికంటే తక్కువ పోలింగే నమోదైంది. ఈసారి పార్టీల ప్రయత్నాలతో ఎక్కువ పోలింగ్ జరుగుతుందనుకున్నా 50 శాతం పోలింగ్ నమోదైతే 2 లక్షల ఓట్లన్న మాట. వాటిల్లో సగం అంటే లక్ష ఓట్లు వచ్చిన అభ్యర్థి గెలుపు ఖాయమే. ఓట్లు ఎక్కువగా చీలి అందరు అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తే 50 వేలు వచ్చినా ఆశ్చర్యం లేదు. మొత్తం మీద లక్ష ఓట్లు పొందడం ఇప్పుడు కీలకం. గత ఎన్నికల సరళి చూసినా 50 వేల ఓట్లు దాటిన అభ్యర్థులే గెలిచారు. నియోజకవర్గం ఏర్పడ్డాక తొలి ఎన్నికలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్రెడ్డికి దాదాపు 54 వేల ఓట్లు, మలి ఎన్నికలో గెలిచిన గోపీనాథ్కు దాదాపు 51 వేల ఓట్లే వచ్చాయి. ఆ తర్వాతి ఎన్నికల్లో ఓట్లు పెరిగే కొద్దీ మెజార్టీ పెరిగింది. మూడు పర్యాయాలు గెలిచిన గోపీనాథ్ 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ నుంచి గెలిచారు. విష్ణువర్థన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ఇక గత ఎన్నికల్లో గోపీనాథ్కు 80 వేల ఓట్లు రావడంతో..సునీతకు ఈసారి లక్ష లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పనిచేస్తున్నారు. ఓట్ షేరింగ్ ఇలా.. పోలైన ఓట్లలో గెలిచిన అభ్యర్థులకు తొలి రెండు ఎన్నికల కంటే, మలి రెండు ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగింది. 2014లో గోపీనాథ్కు కేవలం 31 శాతం ఓట్లు రాగా, 2023కు దాదాపు 44 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు లక్ష ఓట్లు వస్తే (పోలింగ్ శాతం భారీగా పెరిగినా) గెలుస్తారన్నమాట. కానీ, కనిపిస్తున్న పోటీ తీవ్రత దష్ట్యా అన్ని కూడా అవసరం కాబోదని కొందరు లెక్కలేస్తున్నారు. సంపన్న ప్రాంతం కాదు గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం 2008 డీలిమిటేషన్తో ఏర్పడింది. తొలిసారిగా 2009లో ఎన్నికలు జరిగాయి. జూబ్లీహిల్స్ అనగానే సంపన్న ప్రాంతమనే గుర్తుకొస్తుంది. కానీ, సంపన్న ప్రాంతాల కంటే పేద ప్రాంతాలే ఎక్కువ. ఉన్నతవర్గాల ప్రజలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఉండే ప్రాంతాలు ఈ నియోజకవర్గంలోనే అనుకుంటారు కానీ. వారంతా ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా ఉన్నారు. డీలిమిటేషన్ సందర్భంగా రాజకీయ కారణాలు కావచ్చు. ఇతరత్రా కావచ్చు కానీ ఈ నియోజకవర్గమే గందరగోళంగా ఉంది. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, రోడ్నెంబర్ 36, ఫిల్మ్నగర్ వంటి ప్రాంతాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటాయనే అనుకుంటారు. కానీ అవి ఈ నియోజకవర్గంలో లేవు. నియోజకవర్గం షేక్పేట నుంచి గోల్కొండ దాకా విస్తరించి ఉండటంతో నియోజకవర్గ సరిహద్దులు అధికారులకు తప్ప సామాన్యులకు అర్థం కావు. సినీపరిశ్రమలో పనిచేసే జూనియర్ ఆర్టిస్టులు, కార్మికులు, తదితరులుండే యూసుఫ్గూడ, బోరబండ వంటి ప్రాంతాలు మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఇక నియోజకవర్గంలోని దాదాపు 24 శాతం మైనార్టీ ఓటర్లు అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించే పరిస్థితిలో ఉన్నారు. అయోమయంగా సర్వేలు ఇక వివిధ చానళ్లు, యూట్యూబ్ సంస్థల సర్వేలూ ప్రజల్లో గందరగోళం రేపుతున్నాయి. వాటిని సైతం నమ్మే పరిస్థితి లేదంటున్నారు. చివరి వరకు అన్నింటినీ మనీ మేనేజ్ చేస్తుందంటున్నారు. పోలింగ్ నాటినుంచే మొదలయ్యే అవినీతితో గెలిచేవారెవరైనా..ఏ మేరకు నీతిమంతులుగా మిగులుతారో కాలమే సమాధానం చెబుతుంది. టఫ్ ఫైట్ కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో ఏ పార్టీ గెలుస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎవరి గెలుపైనా నేరోగానే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో రెండు పార్టీలూ ఒక్క ఓటును కూడా ఎంతో కీలకంగా భావిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ నుంచి ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు, బీఆర్ఎస్ నుంచి మాజీలైన మంత్రులు, కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు రెండు పారీ్టల్లోని తాజా, మాజీ ఎమ్మెల్యేలు, తదితరులు వందల సంఖ్యలో గల్లీ, బస్తీ, కాలనీ అనే తేడా లేకుండా ఇల్లిల్లూ ఒక్కసారి కాదు రెండు మూడు పర్యాయాలు తిరుగుతున్నారు. అంతేకాదు. కులాలు, వర్గాలు, మతాల వారీగానూ గంపగుత్త ఓట్ల కోసం వెంపర్లాడుతున్నారు. ఎంత డబ్బు వెదజల్లడానికైనా వెనుకాడటం లేరనే ప్రచారం జరుగుతోంది. -
‘హిల్స్’లో అమీతుమీ
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వంలో ప్రధాన రాజకీయ పక్షాలు తమ పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో మోహరించడంతో నియోజకవర్గం యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు వివిధ పార్టీల తరఫున ప్రచార యుద్ధాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉప ఎన్నిక ఫలితాన్ని జీవన్మరణ సమస్యగా భావిస్తున్నాయి. ప్రచార పర్వం క్లైమాక్స్కు చేరటంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. దీంతో ప్రచార పోరు చివరి నిమిషం వరకు కొనసాగించేలా షెడ్యూల్ను సిద్ధం చేసుకున్నాయి. ‘హస్త’గతానికి సీఎం రేవంత్ పావులు తమ రెండేళ్ల పాలనను చూపుతూ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా కాంగ్రెస్ ప్రచారాన్ని భుజాన వేసుకొని క్షేత్రస్థాయిలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రెండేళ్ల పాలనలో అమలు చేసిన మహాలక్షి్మ, గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్, సన్న బియ్యం వంటి పథకాలను బలంగా ప్రచారం చేస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య దోస్తీ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, ఫోర్త్ సిటీ వంటి అంశాలను కాంగ్రెస్ నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు.ప్రతి ఓటర్ను చేరుకునేలా 14 మంది మంత్రులు, 35 మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు గడపగడపకూ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, తుమ్మల, వాకిటి శ్రీహరి, శ్రీధర్బాబు, లక్ష్మణ్, కొండా సురేఖ, దామోదర్ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్కు డివిజన్లవారీగా ప్రచారం, సమన్వయ బాధ్యతలు అప్పగించారు. సోషల్ ఇంజనీరింగ్ పేరిట యాదవులు, ఎస్సీలు, ముస్లిం, రెడ్డి, కమ్మ సామాజికవర్గం ఓటర్లపై కాంగ్రెస్ ఫోకస్ చేసినట్లు ప్రచార శైలిని బట్టి తెలుస్తోంది. కమ్యూనిస్టు, ఎంఐఎం, తెలంగాణ జన సమితి పార్టీలు కూడా కాంగ్రెస్ అభ్యరి్థకి మద్దతుగా ప్రచారం చేస్తున్నాయి. కమల వికాసానికి కిషన్రెడ్డి వ్యూహాలు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండటంతో ఉప ఎన్నిక ప్రచారాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో మాగంటి గోపీనాథ్పై పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమైన లంకల దీపక్రెడ్డినే ఈసారి కూడా బరిలో నిలిపింది. ఏపీలో ప్రభుత్వ భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన కూడా బీజేపీకి మద్దతు పలుకుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుని విస్తృతంగా పర్యటిస్తున్నారు.పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్.రాంచందర్రావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రూపంలో తొలి పరీక్షను ఎదుర్కొంటున్నారు. ర్యాలీలు, పాదయాత్రలు, బైక్ ర్యాలీలు, మారి్నంగ్ వాక్ల రూపంలో ప్రచారం సాగుతోంది. కేంద్ర మంత్రులు బండి సంజయ్, శ్రీనివాసవర్మ, గజేంద్ర షెకావత్, ఎంపీలు రఘునందన్రావు, ఈటల రాజేందర్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి, ఉప నేత పాయల్ శంకర్తోపాటు ఏపీ మంత్రి సత్యకుమార్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు.కారు స్టీరింగ్ను తిప్పుతున్న కేటీఆర్కాంగ్రెస్, బీజేపీ కంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్.. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత అభ్యరి్థత్వాన్ని ఇతర పార్టీల కంటే ముందే ఖరారు చేసింది. నియోజకవర్గం పరిధిలోని డివిజన్లకు ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలను ఇన్చార్జీలుగా ప్రకటించి మూడు నెలల ముందే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది. పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి నివాసం నుంచే పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీతో వార్రూమ్ను ఏర్పాటు చేశారు. మాజీ మంత్రులు జగదీశ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్తో పాటు 40 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొందరు ముఖ్య నేతలను ప్రధాన ప్రచారకర్తలుగా ప్రకటించారు.నియోజకవర్గాన్ని 61 క్లస్టర్లుగా, 200కు పైగా బ్లాకులుగా విభజించి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు ఆ స్థాయి నేతలు 60 మందికి ప్రచార సమన్వయ బాధ్యతలు అప్పగించారు. అన్ని రకాల ప్రచార పద్ధతులను బీఆర్ఎస్ ఆచరణలో పెడుతూ ప్రతి ఓటర్ను చేరుకునే ప్రయత్నం చేస్తోంది. రేవంత్ ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీల అమల్లో వైఫల్యాలు, బీఆర్ఎస్ హయాంలో జరిగిన నియోజకవర్గ అభివృద్ధి, హైడ్రా కూల్చివేతలను ప్రచార అ్రస్తాలుగా సంధిస్తోంది. కేటీఆర్ బీఆర్ఎస్ ప్రచారానికి సారథ్యం వహిస్తూ రోడ్ షోల ద్వారా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. చివరి రోజున కేటీఆర్, హరీశ్రావు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని చుట్టి వచ్చేలా వేర్వేరుగా బైక్ ర్యాలీలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 11వ తేదీన జూబ్లీహిల్స్ ఓటర్లు తీర్పు ఇవ్వనున్నారు. 14న ఫలితాలు ప్రకటించనున్నారు. -
‘నేను బిహార్లో ఓటేశా.. ఇక మీ వంతు..!’
పట్నా: ఆమెది పుణె. కాకపోతే బిహార్లో ఓటు వేసినట్లు ఆమెనే చెబుతోంది., మీరు కూడా బిహార్ వెళ్లి ఓటు వేయండి అని కూడా స్పష్టం చేసింది. ఆమె పేరు ఊర్మి. ఆమె ఒక న్యాయవాది. కాకపోతే బిహార్ తొలిదశ ఎన్నిక తర్వాత ఆమె షేర్ చేసిన ఫోటోపై రాజకీయ దుమారం రేగుతోంది. ‘ఎక్స్’ వేదికగా ఆమె పోస్ట్ చేసిన ఫోటో అనేక ప్రశ్నలకు తావినిస్తోంది. నిజంగానే బిహార్లో ఆమె ఓటు వేసిందా?.. లేక ఇది డ్రామానా? అనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తే కానీ తెలియదు.దీనిపై కాంగ్రెస్ మండిపడుతోంది. మల్లీ స్టేట్ వోటింగ్ అనేది బీజేపీకి న్యూ స్టార్టప్నే కాదు.. కొత్త పెట్టుబడి దారు కూడా అంటూ ఆ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ రేష్మ అలమ్ విమర్శించారు. లోక్సభ ఎన్నికలకు మహారాష్ట్రలో ఓటు వేసిన ఆమె.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల కోసం బిహార్లో ఓటు వేసిందని, ఇది ఓట్ చోరీ కాక మరేమిటని మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అతుల్ లోందే పాటిల్ ద్వజమెత్తారు. Voted for a Modi-fied India! 🇮🇳Jaai ke Vote daali, Bihar! pic.twitter.com/kkWMwShqSh— Urrmi (@Urrmi_) November 6, 2025 ఈ ఫోటోపై ఓటరు గుర్తింపు, నివాస ప్రమాణాలు, ఎన్నికల నిబంధనలు ప్రకారం విచారణ జరగవలసిన అవసరం ఉంది. దీనిపై ఎన్నికల సంఘం స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. ఇటీవల ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బ్రెజిలియన్ మోడల్ ఫోటోతో హర్యానాలో పలు ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. ఇప్పుడు బిహార్ ఎన్నికకు సంబంధించి తాజా ఫోటో వైరల్ కావడంతో ఎన్నికల పారదర్శకతకు సంబంధించి అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.लोकसभा में महाराष्ट्र में वोट करूंगी विधानसभा में बिहार में वोट करूंगी मोदी के लिए वोट चोरी करूंगी 🧐🧐 pic.twitter.com/xDrrLoXMbj— Atul Londhe Patil (INDIA Ka Parivar)🇮🇳 (@atullondhe) November 6, 2025ఇవీ కూడా చదవండి: ‘పిచ్చి పని’.. కంగుతిన్న మోడల్ఈసీపై రాహుల్ హైడ్రోజన్ బాంబు -
సీఈసీ అధికారులతో బీఆర్ఎస్ ఎంపీల సమావేశం
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. దీనిలో భాగంగా ఈరోజు(శుక్రవారం, నవంబర్ 7వ తేదీ) సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో బీఆర్ఎస్ ఎంపీలు కె ఆర్ సురేష్ రెడ్డి, దామోదర్ రావులు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి, మంత్రులు కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వారు కోరారు. అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్న నేపథ్యంలో కేంద్ర బలగాల ఆధ్వ్యంలో ఎన్నికల నిర్వహించాలని ఈసీని కోరారు బీఆర్ఎస్ ఎంపీలు. జూబ్లీహిల్స్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడ మహిళా అధికారులను నియమించాలని విజ్ఞప్తి చేశారు. అలా జరగని పక్షంలో దొంగ ఓట్లు వేసే అవకాశం ఉందనే విషయాన్ని సీఈసీకి తెలిపినట్లు మీడియాకు బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి స్పష్టంచేశారు.


