-
జస్ట్ రిలాక్స్.. ఫుట్బాల్ ఆడిన సీఎం రేవంత్
సాక్షి, హైదారాబాద్: తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచారం నిన్నటి(శనివారం)తో ముగిసింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీబీజీగా గడిపిన నేతలు రిలాక్స్ అవుతున్నారు. రేపు పోలింగ్ జరనుండటంతో ప్రచారం మూడ్ నుంచి నేతలు నెమ్మదిగా బయటకు వచ్చి సేదతీరుతున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి ఆదివారం ఉదయం సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి రిలాక్స్ అయ్యారు. అక్కడి విద్యార్థులుతో కాసేపు.. ఫుట్బాల్ ఆడుతూ సరదగా సేదతీరారు. ఇక రేపు (సోమవారం) లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక.. ఇటీవల రోహిత్ వేముల కేసును రీఓపెన్ చేయాలని అతని తల్లి సీఎం రేవంత్ను కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆమెకు సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. మరోవైపు.. ఈ రోహిత్ వేముల కేసును మళ్లీ ఓపెన్ చేస్తామని హైదరాబాద్ సీసీ కొత్త శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.#Telangana Chief Minister @revanth_anumula visits @HydUniv on Sunday morning engaging in a game of football with the students.This comes after his government followed recent developments in the 2016 Dalit scholar #RohithVemula's suicide case. The police had filed a Closure… pic.twitter.com/Q48PfDbXE6— South First (@TheSouthfirst) May 12, 2024వీడియో క్రెడిట్స్: South First@TheSouthfirst -
స్మృతితో రాహుల్ ఎందుకు పోటీ పడలేదు?.. గెహ్లాట్ వివరణ!
ఉత్తరప్రదేశ్లోని అమేథీ నియోజకవర్గం 2024- లోక్సభ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా ఏళ్లుగా కాంగ్రెస్, రాహుల్ గాంధీలకు కంచుకోటగా ఉన్న ఈ స్థానం ఆ తరువాత బీజేపీకి దక్కింది. ఇక్కడి నుంచి స్మృతి ఇరానీ ఎంపీ అయ్యారు. ఈసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తిరిగి అమేథీ నుంచి పోటీ చేయనున్నారనే ప్రచారం గతంలో జోరుగా సాగినా అది కార్యరూపం దాల్చలేదు. కాంగ్రెస్ హైకమాండ్ స్మృతి ఇరానీ ఎదుట కేఎల్ శర్మను తమ అభ్యర్థిగా ప్రకటించింది. రాహుల్ గాంధీకి రాయ్ బరేలీ స్థానాన్ని అప్పగించింది. అదిమొదలు బీజేజీ ప్రతిపక్ష పార్టీపై మాటల దాడి చేస్తూనే ఉంది. స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఎందుకు పోటీకి దిగలేదంటూ ప్రశ్నిస్తోంది.దీనికి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సమాధానం ఇచ్చారు. కేఎల్ శర్మ 40 ఏళ్లుగా కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నారని, గాంధీ కుటుంబం ఆధ్వర్యంలో పగలు రాత్రి పనిచేసిన శర్మను అమేథీ అభ్యర్థిగా ఎంపిక చేయడంలో తప్పేముంది? రాహుల్ గాంధీనే అమేథీకి ఎందుకు వెళ్లాలని, కేఎల్ శర్మ సరిపోతారని గెహ్లాట్ అన్నారు.రాహుల్ గాంధీని రాయ్బరేలీ నుంచి పోటీ చేయించాలని పార్టీ భావించిందని, అక్కడ రాహుల్ గెలుస్తారని అన్నారు. అమేథీలో కెఎల్ శర్మ విపక్షాలను ఎదుర్కొంటారని పేర్కొన్నారు. శర్మ అటు పార్టీ కోసం ఇటు ప్రజల కోసం పనిచేస్తున్నారని తెలిపారు. సోనియా గాంధీ కూడా శర్మను మెచ్చుకున్నారని, అతనికి అమేథీ ప్రజల సమస్యల గురించి తెలుసని, అక్కడి సమస్యల పరిష్కారానికి ఆయన ఒక ప్రణాళిక రూపొందించారని గెహ్లాట్ వివరించారు. -
నీలేష్ కుంభాని ప్రత్యక్షం.. ‘నన్ను కాంగ్రెస్ మోసం చేసింది’
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభాని, ఆ పార్టీ డమ్మీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో అక్కడ బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాల్ ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. ఇక.. నామినేషన్ తిరస్కరణ అనంతరం సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభాని కనిపించకుండా పోయారు. ఫోన్లో కూడా ఆయన అందుబాటులో లేరని స్థానిక మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అయితే.. తాజాగా శనివారం ఆయన దాదాపు 20 రోజుల తర్వాత మళ్లీ ప్రత్యక్షం అయ్యారు. తాను ఇన్ని రోజులు మౌనంగా ఉండడానికి గల కారణాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శక్తిసిన్హ్ గోహిల్, రాజ్కోట్ లోక్సభ అభ్యర్థి పరేష్ ధనాని పట్ల గౌరవంతోనే తాను స్పందించలేదని తెలిపారు.‘నేను ద్రోహం చేశానని కాంగ్రెస్ నేతలు నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఏదిఏమైమనా కాంగ్రెస్ తొలిసారి నాకు 2017లోనే ద్రోహం చేసింది. చివరి క్షణంలోని సూరత్లోని కామ్రేజ్ అసెంబ్లీ టికెట్ను క్యాన్సల్ చేసింది. కాంగ్రెస్ నాకు మొదటి మోసం చేసింది... నేను చేయలేదు’ అని నీలేష్ కుంభాని అన్నారు. ‘నేను ఇలాంటి నిర్ణయం తీసుకునేవాడిని కాదు. కానీ, నా మద్దతుదారులు, అభిమానులు, ఆఫీసు స్టాఫ్, వర్కర్లు అంతా మనస్తాపనికి గురయ్యారు. ఎందుకుంటే కేవలం ఒక ఐదుగురు నేతలు సూరత్లో వారు పనిచేయకుండా.. వేరేవాళ్లను కూడా చేయనీయకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్, ఆప్ కూటమిలో భాగంగా.. నేను ఆప్ నేతల తరఫున ప్రచారం చేస్తే నన్ను సదరు నేతలు వ్యతిరేకించారు’ అని నీలేష్ కుంభాని తెలిపారు.నామినేషన్ తిరస్కరణ అనంతరం ఏప్రిల్ 22 నుంచి నీలేశ్ కుంభాని కనిపించకుండా పోయారు. దీంతో ఆయన్ను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. నీలేష్ కుంభాని బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా జోరుగా ప్రచారం జరిగింది. గుజరాత్లో ఒకేదశలో 26 పార్లమెంట్ స్థానాలకు మే 7న పోలింగ్ జరిగింది. ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. -
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్కు 50 సీట్లు కూడా రావు, ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Lok Sabha Election 2024: కాంగ్రెస్కు కనీసం 50 సీట్లు కూడా రావు
ఫూల్బాణీ/బోలాంగిర్/బార్గఢ్/ఛాత్రా: కాంగ్రెస్ పార్టీ కనీసం 50 చోట్ల కూడా గెలవబోదని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. విజయం కాదుకదా కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కదని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఒడిశా, జార్ఖండ్లోని ఫూల్బాణీ, బోలాంగిర్, బార్గఢ్, ఛాత్రాలలో ఎన్నికల ప్రచారసభల్లో మోదీ ప్రసంగించారు. ‘‘ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు కావాల్సిన కనీసం 10 శాతం సీట్లు కూడా కాంగ్రెస్ సాధించబోదు. వాళ్లు కనీసం 50 సీట్లు కూడా గెలవలేరు’ అని అన్నారు. రాహుల్ గాం«దీని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘ గాంధీ యువరాజు 2014 నుంచి అదే స్క్రిప్ట్ చదువుతున్నారు. నా మాటలు రాసిపెట్టుకోండి. ఎన్డీఏ అన్ని రికార్డులను బద్దలుకొట్టి 400 సీట్లు సాధిస్తుంది’’ అని అన్నారు. సొంత ప్రజల్నే కాంగ్రెస్ భయపెడుతోంది మణిశంకర్ అయ్యర్ ‘అణుబాంబు’ వ్యాఖ్యలను మోదీ ప్రస్తావించారు. ‘ పాకిస్తాన్ వద్ద అణుబాంబు ఉందని సొంత ప్రజల్నే కాంగ్రెస్ భయపెడుతోంది. వర్చువల్గా ఇప్పటికే చనిపోయిన కాంగ్రెస్ నేతలు ప్రజల గుండెల్లో నిండిన దేశ స్ఫూర్తిని చంపేస్తున్నారు. సొంత అణుబాంబుల నిర్వహణ బాధ్యతలు కూడా పాక్కు చేతకావట్లేదు. అందుకే అణుబాంబులను అమ్మేద్దామని భావిస్తోంది. బాంబులను అమ్ముదామన్నా కొనేవారు లేరు. అవి ఎంత నాసిరకానివో ఇతర దేశాలకు తెలుసు. జమ్మూకశీ్మర్ విషయంలో కాంగ్రెస్ తీసుకున్న బలహీనమై న నిర్ణయాల వల్ల ఆ ప్రాంతం ఆరు దశాబ్దా లు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంది. కాంగ్రెస్ హ యాంలో భారత్ ఎన్నోసార్లు ఉగ్రదాడుల బా రినపడింది. కఠిన నిర్ణయాలకు బదులు చర్చలకు మొగ్గుచూపింది’’ అని ధ్వజమెత్తారు.పాండియన్పై విసుర్లు తమిళనాడుకు చెందిన మాజీ ఉన్నతాధికారి పాండియన్పై మోదీ విమర్శలు గుప్పి ంచారు. ‘‘ పటా్నయక్ తన ప్రభుత్వ బాధ్యతలను ఔట్సోర్సింగ్కు ఇచ్చేశారు. బయటివ్యక్తి(ఔట్సైడర్) పాండియన్ ఒడిశాను పాలిస్తున్నారు. ముఖ్యమంత్రిని మించి సూపర్ సీఎం పాలిస్తున్నారు. ఒడిశా బిడ్డలు, కూతుళ్లకు సొంత ప్రభుత్వాన్ని నడుపుకునే సత్తా లేదా? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దమ్ము ఇక్కడి వారికి లేదా?’’ అని ప్రశ్నించారు.నవీన్ పటా్నయక్ జిల్లాల పేర్లు చెప్పగలరా? ‘‘ఒడిశాకు ఇన్నేళ్లు సీఎంగా ఉన్న నవీన్ పటా్నయక్కు ఇదే నా సవాల్. ఆయన ఒడిశాలోని అన్ని జిల్లాలు, జిల్లా కేంద్రాల పేర్లను ఏ పేపర్లో చూడకుండా, ఎవరి సాయం లేకుండా ఒడియా భాషలో చెప్పగలరా?. పేర్లే చెప్పలేని వ్యక్తి పేదల బాధలెలా తీర్చగలరు? ప్రజా సమస్యలను ఎలా అర్థంచేసుకోగలరు?’’ అని మండిపడ్డారు. -
మోదీ ఓటమి తెలంగాణ నుంచే మొదలుకావాలి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, కామారెడ్డి/తాండూరు: ‘రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవాలంటే మోదీని, బీజేపీని ఓడించడం తెలంగాణ నుంచే మొదలుకావాలి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించి రాహుల్ నాయకత్వానికి అండగా నిలవండి. తెలంగాణ ఇచ్చిన సోనియాగాందీని మీరంతా సోనియమ్మ అంటున్నారు. నన్ను మీ సోదరిగా భావించండి’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. 400 వందల సీట్లు ఇస్తే దేశ రాజ్యాంగాన్ని మారుస్తానని ప్రధాని మోదీ అంటున్నారని, ఈ రాజ్యాంగం దేశం లోని 140 కోట్ల మందిదని, ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చనివ్వమని ఉద్ఘాటించారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నాలను తెలంగాణ నుంచే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఆమె శనివారం తాండూరు, కామారెడ్డిలో నిర్వహించిన రోడ్షోలు, కార్నర్ మీటింగుల్లో సీఎం రేవంత్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. పదేళ్ల మోదీ పాలనలో పేద, మధ్య తరగతి ప్రజలు, కారి్మకులు, రైతులు, మహిళలకు ఎలాంటి మేలు జరగలేదని, తన మిత్రులకే దేశ సంపద దోచిపెట్టారని మండిపడ్డారు. వారికి రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన మోదీ, రైతులకు మాత్రం ఒక్క రూపాయీ మాఫీ చేయలేదన్నారు. కాంగ్రెస్ పథకాలకు మోదీ ఫొటో ఎన్నికల సమయంలో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ప్రియాంకా గాంధీ ధ్వజమెత్తారు. కోటీశ్వరులకే మోదీ హయాంలో వికాసం జరిగిందని, అధికారం తమ చెప్పుచేతల్లో ఉండాలన్నదే బీజేపీ లక్ష్యమని అన్నారు. నోట్ల రద్దుతో రైతులు, చిన్న వ్యాపారులు, సామాన్యుల నడ్డి విరిగిందని, దేశం ఆర్థికంగా వెనుకబడి పోయిందన్నారు. దేశంలోని మీడియా సంస్థలు ఇద్దరి ముగ్గురి చేతుల్లోకి వెళ్లాయని, వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లడం లేదని అన్నారు. పదేళ్లలో ఏం చేశారో చెప్పేంత ధైర్యం మోదీ చేయలేదని అన్నారు. కన్నీళ్లు పెట్టుకున్నారే తప్ప, దేశానికి ఏం చేశారో ప్రధాని ఒక్క వేదికపైనా చెప్పలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి తప్ప తాను ఏం చేశాడో చెప్పడం లేదన్నారు. కాంగ్రెస్ పథకాలకు మోదీ తన ఫొటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు–రంగారెడ్డికి జాతీయా హోదా ఏదీ? చిలుకూరు బాలాజీ ఉన్న పవిత్ర ప్రాంతం అంటే తనకెంతో ప్రేమ అని ప్రియాంక గాంధీ అన్నారు. ఇందిరా గాందీకి మీరంతా ప్రేమను పంచారని, తన తల్లిని సోనియమ్మ అంటూ ప్రేమతో పిలిచి తల్లి పాత్ర ఇచ్చి తనకు సోదర సమానులయ్యారని వ్యాఖ్యానించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగినా బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బీజేపీ హయాంలో ఆగిపోయిందని చెప్పారు. దేశంలో 70 కోట్ల మంది నిరుద్యోగులున్నారని, 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన వెంటనే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధరను చట్ట పరిధిలోకి తెస్తామన్నారు. వ్యవసాయ ఆధారిత వస్తువులపై జీఎస్టీ తొలగిస్తామని, రైతులకు రుణ మాఫీ ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ట్రిపుల్ ఆర్ సినిమా చూశారా అని ప్రజలను అడిగిన ప్రియాంక... మనకు డబుల్ ఆర్ అంటే రేవంత్రెడ్డి, మరో ఆర్ అంటే రాహుల్ గాంధీ అని అన్నారు. కేంద్రం రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చింది: సీఎం రేవంత్రెడ్డి పార్లమెంట్ ఎన్నికలు రావడంతో సంక్రాంతి పండగకు వచ్చే గంగిరెద్దుల్లా బీజేపోళ్లు రాష్ట్రానికి వస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. పదేళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయని చెప్పారు. వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో వికారాబాద్ జిల్లాలో కేవలం కందులే కాదు ఇతర పంటలనూ పండించేలా ప్రోత్సహించారు. నాడు రంగారెడ్డి జిల్లా ప్రజలకు సాగునీటిని అందించేందుకు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును వేల కోట్లు వెచ్చించి నిర్మాణ పనులు చేపట్టారన్నారు. తర్వాత బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు కుట్ర చేసి రద్దు చేసి గోదావరి జలాలను రాకుండా చేశాయని ధ్వజమెత్తారు. ‘మే 9న రైతు భరోసా ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తా అని ఆనాడు హామీ ఇచ్చాను. రైతు భరోసా అందిస్తే అమర వీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలని కేసీఆర్కు సవాల్ విసిరాను. మే 6న రూ.7,500 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశా. కేసీఆర్ఆర్కు ఏ మాత్రం సోయి ఉన్నా ముక్కు నేలకు రాయాలి’ అని పేర్కొన్నారు. ‘రైతు రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని హరీశ్రావు అంటున్నారు. తెలంగాణ రైతుల సాక్షిగా, అనంత పద్మనాభస్వామి వారి సాక్షిగా పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని ఒట్టు వేస్తున్నా. రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటా’ అని తెలిపారు. మోదీ వెంట ఈడీ, ఐటీ, సీబీఐ, ఢిల్లీ పోలీసులు, అంబానీ, అదానీ ఉంటే.. రాహుల్ వెంట ఇందిరమ్మ, రాజీవ్ గాం«దీల త్యాగం, సోనియమ్మ, ప్రియాంక గాంధీ, రేవంత్రెడ్డి, కోట్లాది మంది కార్యకర్తలు ఉన్నారని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో మోదీ పరివారాన్ని ఓడించి, రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడే రాహుల్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి దామోదర రాజనర్సింహ, చేవెళ్ల అభ్యర్థి రంజిత్రెడ్డి, జహీరాబాద్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు. -
రివర్స్ గేర్లో కాంగ్రెస్ సర్కార్
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడం.. బీజేపీ పదేళ్లలో ఏమీ చేయకపోవడంతో ఆ పార్టీలు ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయాయని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే టి.హరీశ్రావు చెప్పారు.కాంగ్రెస్పై ఓటర్లకు విరక్తి కలిగిందని, ఉదయ్పూర్ డిక్లరేషన్ అభాసుపాలైందని, రాష్ట్రంలో మంత్రులు అహంకారంతో మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని, అనూహ్య ఫలితాలు రానున్నాయని చెప్పారు. ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా హరీశ్రావు శనివారం సాక్షితో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే..రాహుల్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారుఅసెంబ్లీ ఎన్నికల్లో హామీలుగా ఇచ్చిన ఆరు గ్యారంటీలనే ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అలాంటిది పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త గ్యారంటీలంటూ అబద్ధపు మాటలతో ప్రజల ముందుకొస్తున్నారు. ఈ గ్యారంటీలను ప్రజలు నమ్మేపరిస్థితిలో లేరు. రాష్ట్రంలో ఏం జరుగుతుందనే అవగాహన లేకుండా సీఎం రేవంత్రెడ్డి ఏది రాసిస్తే దాన్ని రాహుల్గాంధీ చదువుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ గేర్లో నడుస్తోంది. రాహుల్ గాంధీ ఉదయ్పూర్లో చేసిన డిక్లరేషన్ అమలు చేయకపోవడంతో నాయకులు, కార్యకర్తల్లో విశ్వసనీయతను కోల్పోయారు. ప్యారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వమని చెబుతూ వచ్చి చివరకు వారికే ఎక్కువగా టికెట్ ఇచ్చి పార్టీని నమ్ముకున్నవారిని నట్టేట ముంచారు. సర్కారు నుంచి వేధింపులురాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు విరక్తి కలిగింది. హైదరాబాద్లో రాహుల్ గాంధీ సభనే దీనికి నిదర్శనం. జనాలు రాకపోతే సుమారు 45 నిమిషాలపాటు రాహుల్ బస్సులోనే ఉండిపోయారు. సభ ప్రాంగణంలోకి వెళ్లండంటూ స్వయంగా రేవంత్రెడ్డి గేట్ దగ్గరుండి కోరినా.. ప్రజలు లోపలికి పోని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ మంత్రులు అహంకారంతో మాట్లాడుతున్నారు. గాలిలో ఉన్న కాంగ్రెస్ను భూమి మీదకు దించాలంటే ఆ పార్టీ నేతలను ఓడించాలి. నిరుద్యోగులు, ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది. వ్యాపారులతోపాటు అన్ని వర్గాల వారికి ప్రభుత్వం నుంచి వేధింపులు మొదలయ్యాయి. అక్రమ కేసులు పెట్టి గౌడన్నలను జైలు పాలు చేశారు, చంచల్గూడ జైలులో ఇప్పుడు సగం మంది వారే ఉన్నారు.బీజేపీ ఒరగబెట్టింది ఏమీలేదుపదేళ్లలో బీజేపీ తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీలేదు, అందుకే దేవుని పేరుతో ఎన్నికల్లోకి వస్తున్నారు. అయోధ్యలో రామాలయాన్ని ట్రస్ట్ నిర్మించింది. ఆలయ నిర్మాణానికి చాలామంది ప్రజలు ఇచ్చారు... నేను కూడా విరాళం ఇచ్చా. అయితే, ఆ గుడిని తాము కట్టించామని బీజేపీ చెప్పుకుంటోంది. విదేశాల నుంచి నల్లధనాన్ని తెచ్చి పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేస్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వం చేయలేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసింది. బీజేపీకి చెందిన నలుగురు ఎంపీలు రాష్ట్రానికి చేసింది గుండు సున్నా. బీజేపీ ప్రభుత్వం బీడీ కార్మికులకు పెన్షన్ను దూరం చేసింది. బీడీ కట్టలకు జీఎస్టీ పెట్టడంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. తులం బంగారం తుస్సుపేదింటి ఆడ బిడ్డల పెళ్లికి ప్రభుత్వం నుంచి కల్యాణలక్ష్మి కింద ఇస్తామని చెప్పిన రూ.లక్ష చెక్ బౌన్స్ అయింది. తులం బంగారం హామీ కూడా తుస్సుమంది. వడ్లకు తరుగు తీస్తున్నారని స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకున్నారు. వడ్లకు తరుగు తీస్తున్న కాంగ్రెస్కు రైతులు ఓట్లలో తరుగు పెట్టాలి. రాష్ట్రంలో అప్పులు చూపించి.. దివాళా తీసిందని ప్రభుత్వం చెబుతుండటంతో పెట్టుబడులు రాకుండా పోతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటివరకు నా సవాల్ను స్వీకరించలేదు. ఆగస్టు 15లోపు ఆరు గ్యారంటీలు, రూ 2లక్షల రుణ మాఫీ అమలు చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పినా సీఎం ఇప్పటివరకు స్పందించలేదు. సవాల్ను స్వీకరించకపోతే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ బీజేపీలు బోగస్ సర్వేలు విడుదల చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తున్నాయి. యువత వాటిని నమ్మొద్దు.(గజవెల్లి షణ్ముఖరాజు) -
బీజేపీ మాయలో పడొద్దు..: రేవంత్రెడ్డి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దేశంలోని ప్రజల్లో మతపిచ్చి లేపి.. ప్రజలు కత్తులతో పొడుచుకుని, గొంతులు తెగి రక్తం చిందిస్తుంటే బీజేపీ అందులోంచి ఓట్లు దండుకోవాలని చూస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. మతాలు, ప్రాంతాలు, భాషల మధ్య చిచ్చు పెట్టడం దేశానికి ఏ మాత్రం మంచిది కాదన్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ మాయలో పడి అధికారాన్ని కట్టబెడితే, అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తుందని విమర్శించారు. ఆ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోందని మండిపడ్డారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగిన కాంగ్రెస్ పార్టీ రోడ్షోలో సీఎం రేవంత్ మాట్లాడారు. రిజర్వేషన్లు రద్దయితే బడుగు, బలహీన వర్గాలు ఐపీఎస్, ఐఏఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఎమ్మెల్యేలుగా పదవులు పొందే అవకాశం లేకుండా పోతుందన్నారు. దేశంలో ఇప్పటి వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికలు అభివృద్ధి, సంక్షేమం ప్రాతిపదికన జరిగితే.. ఈ ఎన్నికలు రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం మార్చాలనే ప్రాతిపదికన జరుగుతున్నాయని, దీనిపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. మోదీ, అమిత్షాలు ఏం తెచ్చారు? ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు రాష్ట్రానికి వస్తే తెలంగాణకు నిధులు తెస్తారని తాము అనుకున్నామని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, పటాన్చెరు వరకు మెట్రో పొడిగింపు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ పరిశ్రమల కోసం నిధులు ఇస్తారని అనుకున్నామని, కానీ బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి నిధులు రావాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రశాంత వాతావరణం, శాంతిభద్రతలు ఉన్నప్పుడే ఏ ప్రాంతమైనా అభివృద్ధి జరుగుతుందని, కులాలు, మతాల పేరుతో కొట్లాడుకుంటే పరిశ్రమలు, ప్రాజెక్టులు రావని అన్నారు. కుర్చీ మీద కుర్చీ వేస్తారా? బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డిని ప్రకటించడంపై రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వెంకట్రామిరెడ్డికి మల్లన్నసాగర్ నిర్వాసితులను పోలీసుల బూట్లతో తొక్కించిన చరిత్ర ఉందని అన్నారు. కేసీఆర్, హరీశ్రావులకు రూ.వంద కోట్లు ఇచ్చినందుకే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామ్రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చారన్నారు. ఎవరైనా కుర్చీ మీద.. కుర్చీ వేస్తారా అని ప్రశ్నించారు. పెగ్గు మీద పెగ్గు వేసినట్లు.. ఎమ్మెల్సీ ఉండగానే వెంకట్రామిరెడ్డికి ఎంపీ టికెట్టు ఇచ్చారని, పెగ్గులు వేసినప్పుడు టికెట్ ఇచ్చారో.. దిగేటప్పుడు ఇచ్చారో తెలియదని ఎద్దేవా చేశారు. వెంకట్రామిరెడ్డి తెల్లాపూర్లో వందల ఎకరాల భూములు కబ్జా చేసి, ఆస్తులు కూడగట్టుకున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి ఓడితే ఆయన అక్రమంగా సంపాదించిన నాలుగైదు వందల కోట్లు పోతాయే తప్ప ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందిర, వైఎస్ హయాంలోనే అభివృద్ధి మెదక్ జిల్లాలో బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్, ఇక్రిశాట్ వంటి సంస్థలు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో వస్తే.. ఔటర్, శంషాబాద్ విమానాశ్రయం వంటి సంస్థలు దివంగత సీఎం వైఎస్ హయాంలో వచ్చాయని రేవంత్రెడ్డి గుర్తు చేశారు. ఆయా సంస్థలు, పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులుగా పనిచేస్తున్నారని, ఈ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డాయని పేర్కొన్నారు. పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం వివిధ రాష్ట్రాలు, కులాలు, మతాల ప్రజలతో మినీ ఇండియాగా విలసిల్లుతోందన్నారు. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కేసు సుప్రీం కోర్టు విచారణలో ఉందని, ఈ కేసును పర్యవేక్షిస్తున్నది మంత్రి దామోదర రాజనర్సింహ అని అన్నారు. -
మోదీ ‘ఉల్లంఘన’లపై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగసభలు, రోడ్షోల్లో చేసిన ప్రసంగాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. అయితే, ప్రధాని మోదీకి బదులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన అంశంపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. గడువు పొడిగించాలని బీజేపీ కోరగా, ఈసీ మరింత సమయం ఇచ్చిది. మోదీ ఏమన్నారంటే..: నారాయణపేట, ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనగా, చిన్నపిల్లలతో ప్లకార్డులు ప్రదర్శింపజేశారని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకి అని, ఆ పార్టీ భారత దేశ ఎన్నికల్లో గెలవాలని పాకిస్థాన్ కోరుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాలపై ఈసీకి ఫిర్యాదు చేసినట్టు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ ‘సాక్షి’కి తెలిపారు.కాగా, రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కోడ్ ఉల్లంఘన, విద్వేషకర ప్రసంగాల విషయంలో వివిధ రాజకీయ పార్టీల నుంచి వివరణ కోరుతూ మొత్తం 13 నోటీసులను జారీచేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. జాతీయ పార్టీలైతే ఆయా పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు నోటీసులు జారీచేయగా, ప్రాంతీయ పార్టీలైతే వాటి అధ్యక్షులకు నేరుగా నోటీసులిచ్చారు. -
రేవంత్కు మతి భ్రమించింది
కంటోన్మెంట్ (హైదరాబాద్): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మతి భ్రమించిందని, సంచలనం కోసం ఏదిపడితే అదే మాట్లాడటం ఆయనకు అలవాటై పోయిందని బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. బీజేపీ దేశానికి కేన్సర్లా పట్టుకుందన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.ఎన్నికల ప్రచారం చివరి రోజైన శనివారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి వంశా తిలక్, బీజేపీ సీనియర్ నేత మల్క కొమురయ్యలతో కలిసి మహేంద్రాహిల్స్లో విలేకరులతో మాట్లాడుతూ...వాస్తవానికి కాంగ్రెస్ పార్టీయే దేశానికి కేన్సర్లా తయారైందన్నారు. గత రెండు పర్యాయాలుగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయిన కాంగ్రెస్కు ఈసారి కూడా అదే పరిస్థితి తప్పదని ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. పాలించే సత్తా మాకే ఉందంటూ రేవంత్రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను అవమానించారని విమర్శించారు. డీకే అరుణ గెలిస్తే, ఈటల ఆధ్వర్యంలో పనిచేయాల్సి వస్తుందనడంలో రేవంత్ ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. ప్రజల మద్దతు నాకే ఉంది కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే కంటోన్మెంట్లో డబ్బు సంచులతో దిగిపోయిందని ఈటల ఆరోపించారు. అయినప్పటికీ మల్కాజ్గిరి ప్రజలు తనకే మద్దతు ఇస్తున్నారని అన్నారు. మోదీ సమర్థ పాలనతో దేశం ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. కంటోన్మెంట్ విలీనానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఈటల రాజేందర్ అన్నారు. అయితే కంటోన్మెంట్ విలీనానికి వ్యతిరేకంగా బీజేపీకే చెందిన కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు రామకృష్ణ రాసిన లేఖ ఫేక్ లెటర్ అని కొట్టిపారేశారు. -
Lok Sabha Election 2024: నాలుగో విడతలో బెంగాల్ లో ముక్కోణాలు
కీలక రాష్ట్రాల్లో ఒకటైన పశి్చమ బెంగాల్లో నాలుగో విడతలో సోమవారం 8 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో 42 లోక్సభ స్థానాలకు గాను మూడు విడతల్లో 10 చోట్ల పోలింగ్ ముగిసింది. నాలుగో విడత అభ్యర్థుల్లో పీసీసీ చీఫ్ అదీర్ రంజన్ చౌదరి, తృణమూల్ ఫైర్బ్రాండ్ మహువా మొయిత్రా, మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ తదితర ప్రముఖులు బరిలో ఉన్నారు...కృష్ణానగర్ఈ లోక్సభ ఎన్నికల్లో ఆసక్తికరమైన పోరుకు వేదికైన స్థానాల్లో కృష్ణానగర్ ఒకటి. పార్లమెంటులో మోదీ సర్కారుపై విరుచుకుపడే తృణమూల్ ఫైర్ బ్రాండ్ మహువా మొయిత్రా మళ్లీ బరిలో ఉండటమే అందుకు కారణం. ఆమె 2019లో తొలిసారి తృణమూల్ టికెట్ మీదే ఇక్కడ గెలిచి లోక్సభలో అడుగు పెట్టారు. లోక్సభలో అదానీ గ్రూప్కు వ్యతిరేకంగా ప్రశ్నలడిగేందుకు నగదు, కానుకలు తీసుకున్నారన్న ఆరోపణలపై సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అయినా ఆమెకే తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ మళ్లీ అవకాశమిచ్చారు. ఈసారి మరింత మెజారిటీతో నెగ్గి లోక్సభలో అడుగు పెడతానని మొయిత్రా ధీమాగా ఉన్నారు. ఆమెపై బీజేపీ నుంచి స్థానిక రాజ కుటుంబం మహరాజా కృష్ణచంద్ర రాయ్ వంశీకురాలు అమృతరాయ్ పోటీలో ఉన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఆమె బాగా పరిచయం. ఈ ఏడాదే బీజేపీలో చేరి టికెట్ సాధించారు. ఆమెకు మద్దతుగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా ముమ్మరంగా ప్రచారం చేశారు. ఇక సీపీఎం అభ్యర్థి ఎస్ఎం సాది ముస్లింలతో పాటు ఇతర వర్గాల్లోనూ మంచి పేరున్న నేత. మొయిత్రాకు పడే ముస్లిం ఓట్లను సాది గణనీయంగా చీల్చి ఫలితాన్ని ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది.బహ్రాంపూర్ పశ్చిమబెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అ«దీర్ రంజన్ చౌదరి 1999 ఎన్నికల నుంచి ఇక్కడ నాన్స్టాప్గా గెలుస్తున్నారు. ఈసారి తృణమూల్ నుంచి ప్రముఖ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ఆయనకు సవాలు విసురుతున్నారు. నిర్మల్ కుమార్ సాహాకు బీజేపీ టికెట్ లభించింది. దాంతో ముక్కోణపు పోటీకి బహ్రాంపూర్ కేంద్రంగా మారింది. 1999కి ముందు వరుసగా మూడుసార్లు ఆర్ఎస్పీ నేత ప్రమోతెస్ ముఖర్జీ ఇక్కడ నెగ్గారు. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు తృణమూల్ ఖాతాలోనే ఉన్నాయి. బహ్రాంపూర్లో 50 శాతం ముస్లింలే ఉన్నారు. వారంతా కాంగ్రెస్కే దన్నుగా నిలుస్తున్నారు. అందుకే ఈసారి అ«దీర్కు ఎలాగైనా చెక్ పెట్టేందుకు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పఠాన్ను తృణమూల్ ఎంచుకుంది. అయితే స్థానికేతరుడు కావడం ఆయనకు కాస్త మైనస్గా మారింది. ముస్లిం ఓట్లు కాంగ్రెస్, తృణమూల్ మధ్య చీలితే బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలూ లేకపోలేదు.భోల్పూర్ బెంగాల్లోని బీర్భుమ్ జిల్లా పరిధిలో ఉన్న ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో ముక్కోణపు పోటీ నెలకొంది. బోల్పూర్తో పాటు బీర్భుమ్ లోక్సభ స్థానంలోనూ టీఎంసీ విజయంలో స్థానిక నాయకుడు అనుబ్రత మోండల్ది కీలక పాత్ర. పశువుల అక్రమ రవాణా కేసులో ఆయన రెండేళ్లుగా తిహార్ జైల్లో ఉండడం ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసేదే. అయినా భోల్పూర్లో మోండల్ పేరుతోనే టీఎంసీ ఓట్లడుగుతోంది! దివంగత లోక్సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ 1985 నుంచి 2009 వరకు ఏడుసార్లు ఇక్కడి ఎంపీగా ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ అసిత్ కుమార్ మల్పైనే మరోసారి టీఎంసీ ఆశలు పెట్టుకుంది. ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లూ ఆ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి! ఇది తృణమూల్కు బాగా కలిసొచ్చే అంశం. బీజేపీ నుంచి ప్రియా షా పోటీ చేస్తున్నారు. 2014తో పోలిస్తే 2019లో బీజేపీకి ఇక్కడ ఓట్లు భారీగా పెరిగాయి. ఈసారి సీఏఏ తదితరాల దన్నుతో గెలిచి తీరతామని బీజేపీ నేతలంటున్నారు. సీపీఎం నుంచి స్థానికంగా బాగా పట్టున్న శ్యామలి ప్రధాన్ పోటీలో ఉన్నారు. భోల్పూర్ లోక్సభ స్థానం పరిధిలో సీపీఎంకు ఆదరణ కూడా ఎక్కువే. బీజేపీ, తృణమూల్ ఓట్లలో శ్యామలి వేటిని చీలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.రాణాఘాట్బెంగాల్లో ఈ విడతలో ఎక్కువ ఆసక్తి నెలకొన్న స్థానాల్లో ఇదీ ఒకటి. సిట్టింగ్ ఎంపీ జగన్నాథ్ సర్కార్నే బీజేపీ మరోసారి పోటీకి నిలిపింది. ఆయన గత ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థి రూపాలి బిశ్వాస్పై 2.33 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2009, 2014ల్లో ఇక్కడ తృణమూల్దే విజయం. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఏర్పడిన ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదు చోట్ల బీజేపీ చేతిలో, రెండు తృణమూల్ ఖాతాలో ఉన్నాయి. అయితే రానాఘాట్ దక్షిణ్ ఎమ్మెల్యే ముకుత్ మణి అధికారి బీజేపీకి ఝలక్ ఇస్తూ లోక్సభ ఎన్నికల ముందు తృణమూల్లో చేరారు. ఆయననే పార్టీ అభ్యరి్థగా మమత బరిలోకి దింపారు. దాంతో పోరు ఆసక్తికరంగా మారింది. కానీ ముకుత్కు టికెటివ్వడంతో స్థానిక తృణమూల్ నేతలు భగ్గుమన్నారు. ఆయనకు మద్దతుగా ప్రచారానికి ముందుకు రావడం లేదు. బంగ్లాదేశ్ నుంచి వలస వచి్చన మథువా సామాజికవర్గ ప్రాబల్యం ఇక్కడ ఎక్కువ. సీఏఏ అమలుతో వీరికి భారత పౌరసత్వం రానుంది. ఇది బీజేపీకి బాగా కలిసొస్తుందని భావిస్తున్నారు. సీపీఎం తరఫున అలోకేశ్ దాస్ పోటీలో ఉన్నారు.బర్ధమాన్ – దుర్గాపూర్దేశానికి ప్రపంచకప్ తెచ్చిపెట్టిన ఇద్దరు మాజీ క్రికెటర్లు బెంగాల్లో ఈ విడత బరిలో ఉండటం విశేషం. వారిలో ఒకరు 2007 టీ20 ప్రపంచ కప్ నెగ్గిన భారత జట్టు సభ్యుడు యూసఫ్ పఠాన్, మరొకరు 1983 వన్డే ప్రపంచ కప్ నెగ్గిన ‘కపిల్ డెవిల్స్’లో ఒకరైన కీర్తి ఆజాద్. వీరిద్దరూ తృణమూల్ అభ్యర్థులుగా బీజేపీకి సవాల్ విసురుతున్నారు. కీర్తి ఆజాద్ బీజేపీ మాజీ ఎంపీ. 2015లో సస్పెన్షన్కు గురై కాంగ్రెస్లో చేరారు. 2021లో తృణమూల్ గూటికి చేరారు. బర్ధమాన్–దుర్గాపూర్ లోక్సభ స్థానంలో రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ దిలీప్ ఘోష్తో తలపడుతున్నారు. నియోజకవర్గాల పునరి్వభజన అనంతరం ఏర్పడిన ఈ స్థానంలో ఓటర్లు ఏ పార్టీని రెండోసారి దీవించిన చరిత్ర లేదు. 2009లో సీపీఎం నేత సాదుల్ హక్ గెలవగా, 2014లో తృణమూల్ అభ్యర్థి ముంతాజ్ సంఘమిత్ర నెగ్గారు. 2019 ఎన్నికల్లో ముంతాజ్పై బీజేపీ నేత ఎస్ఎస్ అహ్లూవాలియా కేవలం 2,400 ఓట్లతో గట్టెక్కారు. ఈ విడత బీజేపీ అభ్యర్థి ఘోష్కు అజాద్ గట్టి పోటీ ఇస్తున్నారు. సీపీఎం ఇక్కడ సుకీర్తి ఘోషాల్ను నిలబెట్టింది.బీర్భుమ్2004 తర్వాత ఎస్సీ నుంచి జనరల్కు మారినప్పటి నుంచీ ఇక్కడ తృణమూల్ నేత, నటి శతాబ్దీ రాయ్ చక్రం తిప్పుతున్నారు. 2009 నుంచి ఆమే గెలుస్తూ వస్తున్నారు. అయితే 2014 ఎన్నికల నుంచి ఇక్కడ బీజేపీ బాగా పుంజుకుంది. 2019లో ఏకంగా 5.65 లక్షల ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. మాజీ ఐపీఎస్ అధికారి దేవాశిష్ ధార్ను అభ్యరి్థగా బీజేపీ ప్రకటించగా సాంకేతిక కారణాలతో పోటీకి అనర్హుడయ్యారు. దాంతో దేబతను భట్టాచార్య పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మిల్టన్ రషీద్ పోటీలోకి ఉన్నారు. అవినీతి, మహిళలపై నేరాలు, సీఏఏ తదితర అంశాలు ఇక్కడి ఎన్నికలపై ప్రభావం చూపించనున్నాయి. టీఎంసీ నేత అనుబ్రత మోండల్ అందుబాటులో లేకపోవడం బీజేపీకి కొలిసొచ్చేదే. అయితే ఈ లోక్సభ పరిధిలోని ఏడు స్థానాల్లో ఆరు తృణమూల్ ఖాతాలోనే ఉన్నాయి.ఆస్తుల్లో అమృతా రాయ్ టాప్ పశి్చమబెంగాల్లో నాలుగో విడతలో బరిలో ఉన్న 75 మంది అభ్యర్థుల్లో 21 మంది కోటీశ్వరులు. కృష్ణానగర్ బీజేపీ అభ్యర్థి రాయ్ రూ.554 కోట్ల ఆస్తులతో తొలి స్థానంలో ఉన్నారు. తర్వాత అసన్సోల్ తృణమూల్ అభ్యరి్థ, బాలీవుడ్ నటుడు శతృఘ్నసిన్హాకు రూ.210 కోట్లు ఉన్నాయి. రాణా ఘాట్ స్వతంత్ర అభ్యర్థి జగన్నాథ్ సర్కార్ తన వద్ద కేవలం రూ.3,586 ఉన్నట్టు చూపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కూటమి వస్తే ప్రధాని ఎవరు?
వికారాబాద్/ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘‘ఒకవేళ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరవుతారో ఎవరైనా చెప్పగలరా? మమతా బెనర్జీయా, శరద్ పవారా? స్టాలినా? ఉద్దవ్ ఠాక్రేనా? లేక రాహుల్ బాబా ప్రధాని అవుతారా? అది వారికే తెలియదు. అలాంటి వారితో దేశమేం బాగుపడుతుంది..’’అని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. సర్జికల్ స్ట్రైక్తో మోదీ క్రూర ఉగ్రమూకలను మట్టుబెడితే.. ఈ రేవంత్రెడ్డి, రాహుల్ బాబాలు కాకులను కూడా కాల్వలేరని విమర్శించారు.లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్, వనపర్తిలలో నిర్వహించిన బీజేపీ సభల్లో ఆయన ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్ నాయకులు ప్రియాంక, రాహుల్ బాబాలకు మైనార్టీల ఓట్లు కావాలి.. అందుకే వారి భజన చేస్తున్నారు. అందుకే బీజేపీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై దాడి చేసింది కాంగ్రెస్ పార్టీయే. ముస్లింలకు మతపరంగా నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిది. బీజేపీని గెలిపిస్తే ఆ రిజర్వేషన్లను తీసేస్తాం. హైదరాబాద్ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. కాంగ్రెస్ది చైనీస్ గ్యారంటీ! నరేంద్ర మోదీ గ్యారంటీ అంటే.. అది పూర్తి చేసే గ్యారంటీ.. కాంగ్రెస్ గ్యారంటీ అంటే చైనీస్ గ్యారంటీ. అది ఉత్త డొల్ల, పూర్తికాదు. సీఎం రేవంత్రెడ్డి తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా మార్చారు. కాంగ్రెస్ దళిత, ఆదివాసీ, ఓబీసీల సంపదను దోచుకుంటోంది. ఈ అవినీతిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో రైతులకు ఏటా రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.12వేలు, మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు. ఆ హామీలేవీ నెరవేర్చలేదు. రేవంత్రెడ్డి ఫేక్ వీడియోలతో తప్పుడు స్థలంలో చేయి పెట్టారు. దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం లూటీ చేసింది. కేంద్ర నిధులతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతోంది. పీఓకేను స్వా«దీనం చేసుకుంటాం కశ్మీర్ భారత్ సొంతం. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఈ అంశాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. మోదీ వ చ్చిన పదేళ్ల పాలనలో జమ్మూకశ్మీర్ను భారత్ వశం చేశారు. ఈసారి అధికారమిస్తే పాక్ ఆక్రమిత కశీ్మర్ను స్వా«దీనం చేసుకుంటాం. ఈసారి ఎన్నికల్లో బీ జేపీ గెలుపు ఖాయం. రాహుల్గాంధీ కొంత కా లం కింద భారత్ జోడో యాత్ర చేశారు. మరికొద్ది నెల ల్లో మాయమైపోయే కాంగ్రెస్ పార్టీని వెతికే యాత్ర చేయాలి..’’అని అమిత్ షా వ్యాఖ్యానించారు. -
'నోటాకు ఓటు వేయండి': ఇండోర్ ఓటర్లకు కాంగ్రెస్ విజ్ఞప్తి
ఢిల్లీ: లోక్సభ ఎన్నికలు విస్తృతంగా జరుగుతున్న తరుణంలో ఇండోర్ లోక్సభ అభ్యర్థి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థి లేకుండా పోయారు.మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా అక్షయ్ కాంతి బామ్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈయన ఇప్పుడు ఊహించని విధంగా, తన నామినేషన్ను వెనక్కు తీసుకున్నారు. ప్రస్తుతం ఆ స్థానంలో వేరొక అభ్యర్థిని నియమించడానికి కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ ఫలితం లేకపోయింది.ఇండోర్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి లేకపోవడంతో బీజేపీకి గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. దీంతో సోమవారం జరగబోయే నాలుగో దశ ఎన్నికల్లో కార్యకర్తలు, ప్రజలు నోటా గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నోటాకు ఓటు వేసి బీజేపీకి గుణపాఠం చెప్పాలని అన్నారు.నోటాకు ఓటు వేయాలని ప్రజలొక విజ్ఞప్తి చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సజ్జన్ వర్మ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఓటర్ల పరంగా మధ్యప్రదేశ్లో అతిపెద్ద నియోజకవర్గమైన ఇండోర్ నియోజకవర్గాన్ని 35 ఏళ్లలో (1989 నుంచి) కాంగ్రెస్ గెలవలేదు, అయితే అభ్యర్థిని కూడా నిలబెట్టలేకపోవడం ఇదే మొదటిసారి.इंदौर में लोकतंत्र की हत्या के खिलाफ गांधी प्रतिमा पर आयोजित प्रदर्शन में सम्मिलित हुआ। इंदौर का मतदाता पढ़ा लिखा और जागरूक है, नोटा के साथ अपना जवाब देगा।#Indore #NOTA pic.twitter.com/NMf5FbeIux— Sajjan Singh Verma (@sajjanvermaINC) May 11, 2024 -
ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్
ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్.. ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు.మోదీ అబద్ధాలు మాట్లాడుతున్నారని, భావోద్వేగంతో దోపిడీ చేస్తారని ప్రజలు గ్రహించారని అన్నారు. తనను సజీవంగా సమాధి చేయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయన్న ప్రధాని వ్యాఖ్యలపై సిద్ధరామయ్య స్పందించారు. ఆయనను సజీవంగా సమాధి చేయాలని ఎందుకు అనుకుంటారు. బదులుగా, మోదీ చేస్తున్న రాజకీయాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. గత 10 ఏళ్లుగా ఆయన (మోదీ) ప్రధానిగా ఉన్నారు. పేదల కోసం చేసిందేమీ లేదు . దానికి తోడు ఏ ఒక్కటీ నెరవేర్చకపోవడంతో ఆయన అబద్ధాల మాస్టర్ అన్న ఆరోపణలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రధానిని ఓడించడం తప్ప, సజీవ సమాధి చేయాలని ఎవరూ కోరుకోవడం లేదని అన్నారు. ప్రధాని మోదీ శుక్రవారం మహారాష్ట్రలోని నందుర్బార్లో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న కొందరు తనను సజీవ సమాధి చేయాలని చూస్తున్నారని, దేశ ప్రజలే తనకు రక్షణ కవచమని, వారు తనకు ఎలాంటి హాని జరగనివ్వబోరని పేర్కొన్నారు.ఆ వ్యాఖ్యలపై సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ప్రధాని నిరాశలో, ఓటమి భయంతో ఉన్నారు. భయం, నిస్పృహతో ఆ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మోదీ అబ్ధాలు, భావోద్వేగంతో మాట్లాడుతున్నారని ప్రజలకు అర్థమైందని ..తమను మానసికంగా దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజలకు తెలుసునని, ఈ విషయం తెలిసి ప్రజలు ఓట్లు వేయరని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. పైకి వెళ్లిన వారు కిందకు దిగి రావాల్సిందేనన్నారు. -
‘బాబు, రేవంత్ కలిసి హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేస్తారు’
సాక్షి, కరీంనగర్: హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేసే ఆలోచనలో ఉన్నారు జాగ్రత్తగా ఉండాలని ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏపీలో చంద్రబాబు గెలిస్తే.. బాబు, రేవంత్ కలిసి హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేస్తారని అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.‘‘రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకుని హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే కుట్ర జరుగుతోంది. నేను గెలిస్తే వాటిని కొట్లాడి అడ్డుకుంటా. హైదరాబాద్ నుండి కరీంనగర్కు రైలు రాబోతుంది.. అది నేను చేసిన పని.. గెలిస్తే వస్తుంది. తెలంగాణా నిధుల కోసం మోదీని నేను కలిసినన్ని సార్లు బండి సంజయ్ కలిశాడా?. కరీంనగర్ స్మార్ట్ సిటీకి వేయి కోట్లు తెచ్చిన. యువకుల్లరా మీకు ఉద్యోగాలు కావాలా.. విధ్వంసాలు కావాలా? అభివృద్ధి కోసం నా వెంట రండి.ప్రజా స్పందన చూస్తే భారీ మెజరిటితో గెలువబోతున్నానన్న ధీమా కలుగుతోంది.పాంప్లెంట్లులో మోదీ బొమ్మ పెట్టకుండానే సంజయ్ ప్రచారం చేసిండు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం కేంద్రంలో ప్రతి మంత్రిని కలిసినా నేను. బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధి కోసం మోదీని ఏనాడూ కలువలేదు. కేబుల్ బ్రిడ్జిపైన నేడు చెత్త పేరుకు పోయింది.. అభివృద్ధి ఎటు పోతుంది? నా కళ్ళకు నీళ్లు వస్తున్నాయి. ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్న నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి. కరీంనగర్ను వైబ్రెంట్ కరీంనగర్గా మార్చి చూపిస్తా’’ అని వినోద్ కుమార్ అన్నారు. -
పాక్కు మోదీ బుల్లెట్తో సమాధానం చెప్తారు.. అమిత్ షా
తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి అమిత్షా కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. ‘పాకిస్తాన్ దగ్గర ఆణుబాంబు ఉందని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ భయపడుతున్నారు. బాంబ్ ఉందని పీవోకేని పాకిస్తాన్కు అప్పగిద్దామా? అని ప్రశ్నించారు. మీరు ఆందోళన చెందొద్దు. మోదీ మరోసారి ప్రధాని కానున్నారు. పాక్కు బుల్లెట్లతోనే సమాధానం చెబుతారని అన్నారు. అంతకుముందు, ప్రధాని మోదీ మణిశంకర్ అయ్యర్పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నిరంతరం తన సొంత దేశాన్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. జాగ్రత్త, పాకిస్థాన్లో అణుబాంబులు ఉన్నాయి' అని అంటున్నారు.ఈ బలహీనులు భారతదేశ స్ఫూర్తిని తగ్గించే ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఇలాంటి వైఖరిలోనే ఉంది. పాక్ వారి సొంత బాంబులను నిర్వహించలేని స్థితిలో ఉంది. అమ్మడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఎవరూ కొనడానికి ఇష్టపడడం లేదు. ఈ బలహీనమైన వైఖరి కారణంగా జమ్మూ కాశ్మీర్లోని ప్రజలు ఆరు దశాబ్దాలకు పైగా తీవ్రవాదాన్ని చవిచూడాల్సి వచ్చింది అని ప్రధాని మోదీ అన్నారు. -
‘ఫోర్లు, సిక్స్లు కొట్టడంలో తనకు తానే పోటీ’.. కేజ్రీపై మాన్
కేజ్రీవాల్ రిటైర్డ్ హర్ట్ మాత్రమే సిక్స్, ఫోర్లు అదే ఉత్సాహంతో కొడతారు. కాబట్టే జూన్ 4న కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో ఆప్ భాగస్వామ్యమని, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు దాటవని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు.ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్పై విడుదలైన తర్వాత ఆప్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ భగవంత్ మాన్ ప్రసంగించారు. కేజ్రీవాల్ నియంతృత్వ శత్రువు. ప్రతి చోటా నేను ఇదే మాట చెప్పాను. చెబుతున్నాను. కేజ్రీవాల్ ఒక వ్యక్తి కాదు ఒక ఆలోచన. మీరు ఆ వ్యక్తిని అరెస్టు చేయొచ్చు. కానీ ఆలోచనను కాదు అని ప్రశంసల వర్షం కురపించారు. కష్ట సమయాల్లో పార్టీకి అండగా నిలిచిన ఢిల్లీ ఆప్ కార్యకర్తలకు భగవంత్ మాన్ కృతజ్ఞతలు తెలిపారు. సమయం లేదు మిత్రమా‘కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉన్నందున కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు కేవలం 20 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 12 గంటలకు బదులుగా మాకు 18 గంటలు పని ఉంది. మొదటి మూడు రౌండ్ల సర్వేలు మోదీ 400 సీట్లు గెలవలేరని తేలింది. దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పి ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తే ఎన్నికల్లో గెలవలేరని’ ఆయన ఆరోపించారు. ఫోర్లు, సిక్స్లు కొట్టడంలోక్రికెట్ పరిభాషలో క్రేజీవాల్ను ఉద్దేశిస్తూ ‘కేజ్రీవాల్ రిటైర్డ్ హర్ట్ మాత్రమే సిక్స్, ఫోర్లు అదే ఉత్సాహంతో కొడతారని’అన్నారు. అదే ఉత్సాహంతో పంజాబ్లో ఆప్ హవా కొనసాగుతుంది. బీజేపీ, కాంగ్రెస్లు తుడిచిపెట్టుకుపోయి. మొత్తం 13 లోక్సభ సీట్లు ఆప్కే దక్కుతాయని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ జోస్యం చెప్పారు. -
కాంగ్రెస్కు ఆ హోదా కూడా దక్కదు: ప్రధాని మోదీ
ఫుల్బాని (ఒడిశా): లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 50 సీట్లు కూడా గెలవదని, ఎన్నికల తర్వాత ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఆయన ఒడిశాలోని కంధమాల్ లోక్సభ స్థానంలోని ఫుల్బానీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఒడియా భాష, సంస్కృతి తెలిసిన, అర్థం చేసుకున్న ఒడిశా బిడ్డనే రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు.అటల్ బిహారీ వాజ్పేయీ హయాంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను గుర్తుచేస్తూ.. 26 ఏళ్ల క్రితం ఇదే రోజున పోఖ్రాన్ పరీక్షలు ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్టను పెంచాయన్నారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడం ద్వారా తమ ప్రభుత్వం దేశ ప్రజల 500 ఏళ్ల నిరీక్షణకు తెర దించిదని పేర్కొన్నారు. ఒడిశాలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాలు, 21 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీకి, పార్లమెంటు స్థానాలకు ఏకకాలంలో నాలుగు దశల్లో మే 13 నుంచి జూన్ 1 వరకు ఎన్నికలు జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4 జరుగుతుంది. -
కేసీఆర్ కంటే రేవంత్ అత్యంత ప్రమాదకారి: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రోజు రోజుకు బీజేపీకి ఆదరణ పెరుగుతోంది. అంతే స్థాయిలో కాంగ్రెస్, బీఅర్ఎస్.. బీజేపీపై విష ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. శనివారం కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘‘సీఎం రేవంత్, కేసిఆర్.. తెలంగాణ ప్రజలను గొర్రెలు అనుకుంటున్నారు. మీరు ఏది చెప్పినా నమ్మేస్తారని ఊహాలోకంలో ఉన్నారు. ఇష్టమొచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నారు. మీ ప్రకటనలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. రజాకార్లతో విరోచిత పోరాటం చేసిన చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉంది. కాంగ్రెస్ అంటేనే అవినీతి. పచ్చ కామెర్లు ఉన్నోడికి అంత పచ్చగానే కనిపిస్తుంది. కాంగ్రెస్ దేశంలో అవినీతిని పెంచి పోషించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నుంచి చేసిందేమీ లేదు కాబట్టి మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు రేవంత్ నిజస్వరూపం తెలిసిపోయింది. కేసిఆర్ కంటే రేవంత్ అత్యంత ప్రమాదకారి. అధికారం కోసం ఎంతకైనా తెగించి... అబద్ధాలు అవలీలగా చెప్తారు. రేవంత్, కేసీఆర్ దొందూ దొందే. ఇద్దరు అబద్దాల ఆడటంలో ఆరిదేరారు.కాంగ్రెస్ అబద్ధాలను ఇంటి పేరుగా మార్చుకొని 75 ఏళ్లుగా రాజకీయం చేస్తుంది. ఏనాడు కాంగ్రెస్కి భద్రత దళాల మీద నమ్మకం లేదు. వారిని అవమాన పరిచే విధంగా అనేక సార్లు మాట్లాడారు.పాకిస్తాన్ దగ్గర ఆటంబాంబులు ఉన్నాయి.. వారికి మనం అణిగిమణిగి ఉండాలని కాంగ్రెస్ నేత ఒకాయన మాట్లాడుతున్నారు. ఈరోజు ఢిల్లీలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు.. బీజేపి ప్రభుత్వం. పాకిస్థానీ ఎత్తుగడలను తిప్పికొట్టి.. వాళ్ల తొక కట్ చేసి నడ్డి విరిచాం. కాంగ్రెస్ అసమర్థతతో పాకిస్తాన్ ఆడింది ఆటగా సాగింది. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉంటే భారత్ భయపడదు. అసమర్థతతో కాంగ్రెస్ పాకిస్తాన్ను పెంచి పోషించింది. ఇటువంటి కాంగ్రెస్ పుల్వామ మీద మాట్లడటామా?. కాంగ్రెస్ కూటమి వ్యక్తీ ఫరూఖ్ అబ్దుల్లా దేశంలో ఉంటూ.. పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ.. పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడతారా?’’ అని కిషన్రెడ్డి మండిపడ్డారు. -
తెలంగాణలో రాహుల్, కాంగ్రెస్కు ఇచ్చిపడేసిన అమిత్ షా
సాక్షి, వికారాబాద్: కాంగ్రెస్కు సర్జికల్ దాడులు చేసే ధైర్యం లేదన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అలాగే, బీజేపీకి ఓటేస్తే.. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు. ఇక, తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. మజ్లిస్ ఓటు బ్యాంకుకు రేవంత్ రెడ్డి భయపడుతున్నాడుని సంచలన ఆరోపణలు చేశారు.కాగా, అమిత్ షా శనివారం వికారాబాద్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ..‘పాకిస్తాన్ దగ్గర ఆటమ్ బాంబ్ ఉందని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ భయపడుతున్నారు. బాంబ్ ఉందని పీవోకేని పాకిస్తాన్కు అప్పగిస్తామా?. బీజేపీ ఉన్నంత కాలం పీవోకేను పాకిస్తాన్కు అప్పగించడం ఎవరికీ సాధ్యం కాదు. కశ్మీర్ మనదేనా కాదా?.. తెలంగాణ ప్రజలు స్పష్టంగా చెప్పాలి. సర్జికల్ దాడులు చేసి పాకిస్తాన్లో దాక్కున్న ఉగ్రవాదులను మట్టుబెట్టాం. సర్జికల్ దాడులు చేసే ధైర్యం కాంగ్రెస్కు లేదు.రామమందిర నిర్మాణానికి కాంగ్రెస్ అడ్డుపడింది. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రాహుల్, ఖర్గే, ప్రియాంక ఎందుకు రాలేదు. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వెళ్తే.. తమ ఓటు బ్యాంకు ఎక్కడ దెబ్బతింటుందో అని కాంగ్రెస్ నేతలు భయపడ్డారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే ప్రధాని కావాలా?.. వాళ్లను రక్షించే వాళ్లు కావాలా?. నరేంద్ర మోదీపై ఒక్క అవినీతి మరక కూడా లేదు. కొంచెం వేడి ఎక్కువైతే ఫారిన్ టూర్లకు వెళ్లే రాహుల్ ఒకవైపు.. దీపావళి రోజు కూడా సెలవు తీసుకోని వ్యక్తి మోదీ మరోవైపు. మోదీ, రాహుల్లలో ఎవరు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి.బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏటీఎంలా మార్చుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. బీజేపీకి ఓటేస్తే ముస్లిం రిజర్వేష్లను తొలగిస్తాం. కాళేశ్వరం అవినీతికి అడ్డాగా మారింది. ఏ అంటే అసదుద్దీన్, బీ అంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్. సర్జికల్ దాడుల గురించి రేవంత్ రెడ్డి ఎగతాళిగా మాట్లాడుతున్నారు. కశ్మీర్ మనదేనా కాదా?.. తెలంగాణ ప్రజలు స్పష్టంగా చెప్పాలి. మజ్లిస్ ఓటు బ్యాంకుకు రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు. బుల్లెట్ ట్రైన్ తొలి స్టాప్ వికరాబాద్లో రాబోతోంది. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరపాలా?. వద్దా?. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. తెలంగాణలు డబ్బులు ఢిల్లీకి చేరుతున్నాయి’ అని వ్యాఖ్యలు చేశారు. -
27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని సీఎం రేవంత్రెడ్డి తన భుజాలపై వేసుకొని తెలంగాణ అంతా చుట్టివచ్చారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరిగిన జన జాతర సభతో ఆ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచా రం మొదలవగా 27 రోజుల్లో 57 సభలు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలలో రేవంత్ పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి ముఖ్యమంత్రి పలు సభల్లో పొల్గొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదే శాల మేరకు కర్ణాటక, కేరళలలోనూ పర్యటించి బహిరంగ రోడ్ షోలలో ప్రచారం చేపట్టారు.ఈ ప్రచారంలో సీఎం ప్రధానంగా బీజేపీని, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం అవుతుందని ఆయన వ్యాఖ్యనించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఆయన చేసిన ప్రసంగాలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు కలిసి వచ్చాయని ఆ పార్టీ భావిస్తోంది. రేవంత్ వ్యాఖ్యలపై మోదీ, అమిత్ షా మొదలు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వరకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందని పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అదేవిధంగా రాష్ట్రానికి బీజేపీ ‘గాడిద గుడ్డు’ తప్ప ఏమిచ్చిందనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సీఎం విజయం సాధించారని పేర్కొన్నారు. తమ ప్రచారానికి అనూహ్య రీతిలో ప్రజా స్పందన వచ్చిందని.. అందువల్ల 14 సీట్లలో గెలుస్తామన్న ధీమాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. -
బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ’’బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దవుతుంది.. ప్రజాస్వామ్యా నికి ముప్పు ఏర్పడుతుంది.. రిజర్వేషన్లు పోతా యి, ప్రజల ప్రాథమిక హక్కులనూ తొలగిస్తా రు’’ అని ఆఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దేశంలో ప్రజల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పోరాడుతోందని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి, మోదీకి ఒక్కసీటు కూడా రావద్దని, వస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టేనన్నారు.శుక్రవారం నల్లగొండ జిల్లా నకిరేకల్లో జరిగిన కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్రెడ్డి ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాజ్యాంగం రక్షించే కాంగ్రెస్ పార్టీకి, రాజ్యాంగం రద్దు చేయాలని చూసే బీజేపీకి మధ్య ఈ ఎన్నికలు జరుగుతు న్నాయన్నారు. పొరపాటున బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుతంత్రాలు పన్నుతాయని ధ్వజమెత్తారు.అదానీ, అంబానీలపై ఐటీ దాడులు చేయించగలరా?మోదీ దేశాన్ని ధనవంతులైన తన మిత్రులకు ప్రభుత్వరంగ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నా రని ఖర్గే ఆరోపించారు. పదేళ్ల బీజేపీ పాలనలో దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచి పెట్టి తిరిగి కాంగ్రెస్పైనే ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి అదానీ, అంబానీ ట్రక్కులు, టెంపోలలో డబ్బులు పంపుతున్నా రని అమిత్షా, మోదీ మాట్లాడుతున్నారని, వా రు డబ్బులు పంపిస్తుంటే మరి మోదీ, అమిత్షా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ధైర్యముంటే అదానీ, అంబానీలపై ఈడీ, ఐటీ దాడులు చేయించాలని ఖర్గే సవాల్ విసిరారు. ఆటో డ్రైవర్లుకు ఏటా రూ.12 వేలిస్తాంతెలంగాణలో కాంగ్రెస్ వంద రోజుల పాలనలో అన్ని గ్యారంటీలు అమలవుతున్నాయని ఖర్గే వెల్లడించారు. ఉచిత బస్ప్రయాణం, ఆరోగ్యశ్రీ, రూ.500కే గ్యాస్ సిలిండర్ అమలు చేస్తున్నామ ని, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే వారికి ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. ఆగస్టు 15వ తేదీన రూ.2 లక్షల రుణ మాఫీ చేసి తీరుతా మన్నారు. ఆటో వారికి ఏటా రూ.12 వేలు ఇస్తామని స్పష్టం చేశారు. కులగణన తరువాత కుటుంబ యజమాని అయిన మహిళల ఖాతాలో ఏటా రూ.లక్ష జమ చేస్తామన్నారు.ఇవన్నీ నెరవేరాలంటే హస్తం గుర్తుకు ఓట్లు వేసి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. సభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ భువనగిరి లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, నకిరేకల్, తుంగతుర్తి ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామేలు పాల్గొన్నారు.ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదుఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ బంద్ కావడం ఖాయమని ఖర్గే జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి మద్దతు పలుకుతున్న విషయం ప్రజలకు అర్థమైందని, అందుకే ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. మోదీ రాజ్యాంగాన్ని మారు స్తామని చెప్పినా దానిపై కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ఆయన నిలదీశారు. -
నా గడ్డపైకొచ్చి నన్నే అవమానిస్తావా?
సాక్షి, రంగారెడ్డి జిల్లా, సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్, అబిడ్స్‘నల్లమల మట్టిలో పుట్టిపెరిగాను. సాధారణ కార్యకర్తగా, జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేశా. ఒక్కో మెట్టు ఎదుగుతూ స్వశక్తితో నేడు ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నా. రాజకీయాల్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా. ప్రధాని మోదీ నన్ను అభినందించాల్సింది పోయి అక్రమార్కులను, అవినీతి పరులను పక్కన పెట్టుకుని, నాపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు.ఎవరు అవినీతి పరులో, అక్రమార్కులో చర్చకు సిద్ధమా? నేను అక్రమ వసూళ్లకు, అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే షాద్నగర్ అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా ముక్కు నేలకు రాసేందుకు సిద్ధం. ఒక వేళ నిరూపించకపోతే.. ప్రధాని మోదీ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పగలరా?’ అని సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం మహబూబ్నగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డికి మద్దతుగా రోడ్షో అనంతరం షాద్నగర్ అంబేడ్కర్ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్లో, నారాయణపేట జిల్లా మక్తల్లో నిర్వహించిన జనజాతర బహిరంగసభల్లో సీఎం మాట్లాడారు.అదేవిధంగా శుక్రవారం రాత్రి హైదరాబాద్ బేగంబజార్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగించారు. ఆయా సభల్లో రేవంత్ మాట్లాడుతూ.. ’’బీజేపీ అభ్యర్థి డీకే అరుణ కుటుంబం దొంగసార అమ్మింది. భూములు కొల్లగొట్టింది. కల్లు దుకాణాల నుంచి వసూళ్లకు పాల్పడింది. ఇసుకు దందా చేసింది. అలాంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుని, నా గడ్డకు వచ్చి నన్ను అవమానిస్తావా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు?’’ అని మోదీని నిలదీశారు.బీజేపీ వస్తే వందేళ్లు వెనక్కి..పొరపాటున బీజేపీకి ఓటేస్తే మతాల మధ్య చిచ్చు, మనుషుల మధ్య పంచాయితీలు పెట్టి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తుందని, అభివృద్ధి వందేళ్లు వెనక్కి వెళుతుందని రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. ‘బీజేపీ గెలిస్తే ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చుపెట్టి పెట్టుబడులు రాకుండా చేస్తారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉన్నా ఎందుకు పెట్టుబడులు పోతలేవు. నిత్యం పంచాయితీలు, విషం చిమ్ముతూ ఆ రాష్ట్రాన్ని నాశనం చేశారు.పార్లమెంట్ నుంచి 30 నిమిషాల దూరంలోనే నోయిడా సిటీ ఉన్నా బీజేపీ నేతలకు చిత్తశుద్ధి లేక అభివృద్ధికి నోచుకోలేదు. తప్పిపోయి బీజేపీ కేంద్రంలో మళ్లీ వస్తే అభివృద్ధి వందేళ్లు వెనక్కు పోతుంది.’ అని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్కు ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, గోదావరి జలాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు.బీజేపీకి 400 సీట్లు కలేకేంద్రంలో 400 సీట్లు రావాలని కలలు కంటున్న బీజేపీకి అవి పగటి కలలుగానే మిగిలిపోతాయని రేవంత్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ బీజేపీకి అమ్ముడు పోగా, బీజేపీ, మజ్లిస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో బీజేపీ, మజ్లిస్లు గొడవలకు దిగి హైదరాబాద్లో శాంతిభద్రతల సమస్యను సృషించాలని చూస్తున్నాయన్నారు. హైదరాబాద్లో శాంతిభద్రతల సమస్యలు ఏర్పడితే రాష్ట్రానికి వచ్చే మలీ్టనేషనల్ కంపెనీలను గుజరాత్కు తరలించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని విమర్శించారు. -
CM Jagan: కదిలించిన కడప చైతన్యం
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘ఈరోజు కడప జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతోందో మీ అందరికీ తెలుసు. కడప జిల్లాలో ఉన్నంత రాజకీయ చైతన్యం రాష్ట్రంలో బహుశా అతి కొద్ది జిల్లాలకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది.. నాన్నగారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నన్ను ఏ విధంగా ఇబ్బందులు పెట్టిందో మీరంతా చూశారు. ఆ సమయంలో మీ బిడ్డ ఇదే కడప గడ్డ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాక సింబల్ వచ్చి కేవలం 14 రోజులు మాత్రమే అయినా మీ బిడ్డతో మీరంతా నిలబడి 5,45,000 మెజారిటీ ఇచ్చారు. మీరు ఇచ్చిన ఆ రికార్డు మెజారిటీతో మీ బిడ్డ ఆరోజు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేస్తుంటే పార్లమెంట్ భవనంలో ఉన్న ప్రతి తలకాయ కూడా ఎవరీ జగన్? అని చూసింది. అంతటి చైతన్యం ఉన్న జిల్లా నా కడప’’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కడప వన్టౌన్ సమీపంలోని మద్రాస్ రోడ్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. ఎవరు నిర్ణయించాలి?ఇటువంటి కడప రాజకీయాన్ని మన ప్రజలు, వైఎస్సార్ మీద అభిమానం ఉన్న వారు నిర్ణయించాలా? లేక ఆ పేరే కనపడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వైఎస్సార్ శత్రువులు నిర్ణయించాలా? అనేది మీరంతా ఆలోచన చేయాలని కోరుతున్నా. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో, రాష్ట్ర విభజన చేసిన దుర్మార్గులతో మన ప్రజలు జత కట్టాలా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రాజకీయంగా వైఎస్సార్ కుటుంబాన్ని అణగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మీ బిడ్డ మీద ప్రయోగించిన వారితో కలిసిపోయి.. అదే కాంగ్రెస్, అదే టీడీపీతో ప్రత్యక్షంగా ఒకరితో, పరోక్షంగా ఇంకొకరితో కలిసిపోయి వైఎస్సార్ అనే పేరే కనపడకుండా చేయాలనే కుట్రలో వీరందరూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఇలాంటి వాళ్లా వైఎస్సార్ వారసులు?దుర్మార్గంగా అబద్ధాల ప్రచారం...వైఎస్సార్ మరణం తర్వాత ఆయన పేరును, ఆ కీర్తి ప్రతిష్టలను సమాధి చేయాలని చూసిన పార్టీ, ఆయన పేరును ఛార్జ్షీట్లో పెట్టిన పార్టీ ఆయన కుమారుడిని అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టింది. ఆ 16 నెలలు నాకు ఎవరు ఇస్తారు? ఇంత అన్యాయంగా జైల్లో పెట్టిన పార్టీ ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం మరింత బరి తెగించింది. ఆ ఛార్జ్షీట్లో నాన్నగారి పేరును మనంతట మనమే పెట్టించామట! ఇంత దుర్మార్గంగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారంటే అసలా పార్టీకి మానవతా విలువలు ఉన్నాయా? ఆ పార్టీకి కృతజ్ఞత అనే పదానికి అర్థం తెలుసా?రాజకీయ శూన్యత సృష్టించి...నా పక్కన అవినాష్ ఉన్నాడు. నాకన్నా 13 ఏళ్ల చిన్నోడు. మా అందరికన్నా చిన్న పిల్లోడు. ఈ పిల్లోడి జీవితం నాశనం చేయడం కోసం చంద్రబాబు దగ్గర నుంచి కుట్రలు పన్నుతున్నారు. ఈనాడు నుంచి ఆంధ్రజ్యోతి, టీవీ 5 దాకా కుట్రలు పన్నుతున్నారు. కడప జిల్లాలో ఒక రాజకీయ వ్యాక్యూమ్ క్రియేట్ చేసి అందులోకి వాళ్లు రావాలని కుట్రలు పన్నుతూ ఈ పిల్లాడి జీవితం నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న వీళ్లంతా మనుషులేనా? అవినాష్ ఎలాంటి వాడో మీకు, నాకు తెలుసు. అవినాష్ మీద నాకు, మీ అందరికీ నమ్మకం ఉంది. అవినాష్ను గొప్ప మెజారిటీతో గెలిపించమని మీ అందరినీ కోరుతున్నా. ఇన్నేళ్లకు ఇడుపులపాయకు..నాన్న 2009లో హఠాన్మరణం పాలైతే ఆ తర్వాత వైఎస్సార్ కుటుంబాన్ని వాళ్లు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో మీ అందరికి తెలుసు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నాన్న సమాధి దగ్గరకి వాళ్లు వస్తారట! ఇడుపులపాయ దగ్గరకు వస్తారట! చూడటానికి వస్తారట! ఢిల్లీ నుంచి వస్తారట! ఇన్నేళ్ల తర్వాత ఎన్నికల వేళ వస్తారట..! ఎన్నికల కోసం వస్తారట! ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వైఎస్సార్ అభిమానులు ఏనాడో సమాధి కట్టారు. కాంగ్రెస్కి ఓటు వేస్తే వైఎస్సార్ పేరు కనపడకుండా చేసే కుట్రలో భాగస్తులం అయినట్లే. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన కళ్లను మనమే పొడుచుకున్నట్లే. కాంగ్రెస్కు ఓటు వేస్తే అది నేరుగా మన ఓట్లను చీల్చి టీడీపీని, ఎన్డీఏని గెలిపించడం కాదా?పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్తో కాపురం..ఎన్నికల వేళ వీళ్లు ఎందుకు మన రాష్ట్రానికి వస్తున్నారో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. చంద్రబాబును గెలిపించడం కోసం ఏ రకంగా కుట్రలు జరుగుతున్నాయో గమనించండి. చంద్రబాబును గెలిపించడం కోసం, మన ఓట్లను చీల్చడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రంగప్రవేశం చేసింది. చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి. ఈ పెద్దమనిషి చంద్రబాబు పట్టపగలు బీజేపీతో కాపురం చేస్తాడు, రాత్రి పూట కాంగ్రెస్తో కాపురం చేస్తాడు! రాజకీయాలు ఎంత దిగజారిపోయాయో గమనించండి. నాన్నగారు బతికున్నప్పుడు ఎవరితో విబేధించి యుద్ధం చేశారో, ఆయన్ను అభిమానించే ప్రతి కార్యకర్తా ఎవరితో యుద్ధం చేశారో, ఇవాళ వైఎస్సార్ వారసులు అని చెప్పుకుంటున్న వాళ్లు అదే ఈనాడుతో, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో, చంద్రబాబుతోనూ చెట్టాపట్టాలు వేసుకుని వాళ్లను గెలిపించడం కోసం మన ఓట్లను చీల్చే యత్నం చేస్తున్నారంటే ఇంతకంటే హేయమైన రాజకీయాలు రాష్ట్ర చరిత్రలో ఉంటాయా? -
Respect Pakistan: అయ్యర్ వీడియో కలకలం
న్యూఢిల్లీ: వరసబెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేతల జాబితాలో మణిశంకర్ అయ్యర్ చేరిపోయారు. దక్షిణభారత వాసులు ఆఫ్రికన్లలా ఉంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్యామ్ పిట్రోడా వివాదం ముగిసేలోపే అయ్యర్ పాత వీడియో ప్రస్తుతం బీజేపీ ఎన్నికల ప్రచారాస్త్రంగా మారిపోయింది. పాక్ పట్ల కాంగ్రెస్ పక్షపాత ధోరణి మరోసారి బట్టబయలైందని బీజేపీ దుమ్మెతిపోయగా అవి అయ్యర్ వ్యక్తిగత అభిప్రాయాలని, పారీ్టతో సంబంధం లేదని కాంగ్రెస్ ఖరాకండీగా చెప్పేసింది. అయ్యర్ అన్నదేంటి? ఏప్రిల్లో ‘చిల్పిల్ మణిశంకర్’ పేరిట జరిగిన ఒక ఇంటర్వ్యూలో అయ్యర్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ‘‘ పొరుగుదేశమైన పాకిస్తాన్కు మనం గౌరవం ఇవ్వాల్సిందే. ఎందుకంటే అది కూడా సార్వ¿ౌమ దేశమే. దాయాది దేశంతో తగాదాలకు పోతే భారత్పై అణుబాంబు వేయాలనే దుర్బుద్ధి పాక్ పాలకుల్లో ప్రబలుతుంది. పాక్తో కఠినంగా వ్యవహరించొచ్చు. కానీ చర్చలైతే జరపాలికదా. సరిహద్దుల్లో తుపాకీ పట్టుకుని తిరిగినంతమాత్రాన ఒరిగేదేమీ ఉండదు. ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతాయి. పాక్లో పిచ్చోడు అధికారంలోకి వస్తే భారత్కు ప్రమాదమే కదా. పాక్ వద్ద కూడా అణుబాంబులు ఉన్నాయి. మన అణుబాంబును లాహోర్లో పేలిస్తే తిరిగి దాని రేడియోధారి్మక ప్రభావం కేవలం ఎనిమిది సెకన్లలోనే మన అమృత్సర్పై పడుతుంది. అందుకే పాక్తో చర్చల ప్రక్రియ మొదలెట్టాలి’’ అని అన్నారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
వంద కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక
48 గంటల ముందు ప్రచారం నిలిపివేత
అభివృద్ధి చేశా.. ఆశీర్వదించండి
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
●తీరనున్న తాగునీటి సమస్య
పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన జేసీ
పుష్పగిరిలో కనుల పండువగా కల్యాణోత్సవాలు
కోపంగా ఉంటే.. ఇక్కడికొచ్చి కేకలేయండి చాలు!
పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు పక్కాగా ఉండాలి
ప్రచారం.. పరిసమాప్తం!
తప్పక చదవండి
- ఎన్నికల వేళ సినిమా రేంజ్లో పోలీసులు ఛేజింగ్.. భారీగా డబ్బు స్వాధీనం
- మథర్స్ డే వెనకాల మనసును కథలించే కథ!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- Weekly Horoscope: ఈ రాశి వారికి జీవితాశయం నెరవేరి ఉత్సాహంగా గడుపుతారు
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- చట్టం మీ బాబు చుట్టమా రామోజీ?
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు.. 300 మందికి పైగా మృతి
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- AP: వ్యవసాయం పండగ
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement