Congress Party
-
కాంగ్రెస్ గ్యారంటీ కార్డు.. కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. మీ పదవుల గ్యారంటీ కోసం ఉన్న శ్రద్ద.. తెలంగాణ ప్రజలకు మీరిచ్చిన గ్యారంటీ కార్డు అమలుపై లేకపాయే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం రైతుభరోసా పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు కుటిల యత్నాలను తెలంగాణ గమనిస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ట్విట్టర్ వేదికగా.. ఎనకటికి ఎవడో ఏదీ అడగకుంటే .. సచ్చిందాక సాకుతా అన్నాడట. ఏస్తున్న రైతు భరోసా సరే మరి.. ఎగ్గొట్టిన రైతుభరోసా సంగతి ఏంది?. ఎగ్గొట్టిన వడ్ల బోనస్ సంగతి ఏంది?ఎగ్గొట్టిన తులం బంగారం, కళ్యాణలక్ష్మి పరిస్థితి ఏంటి?ఎగ్గొట్టిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పరిస్థితి ఏంటి?ఎగ్గొట్టిన రూ.2500 మహాలక్ష్మి పథకం పరిస్థితి ఏంటి?ఆడబిడ్డలకు ఎలక్ట్రిక్ స్కూటీల పరిస్థితి ఏంటి?ఆగిపోయిన రైతుబీమా పరిస్థితి ఏంటి?ఆగిపోయిన రుణమాఫీ పరిస్థితి ఏంటి?శాసనసభ ఎన్నికల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిలోక్ సభ ఎన్నికల కోసం దేవుళ్ల మీద ఒట్లేసిఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం రైతుభరోసా పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు కుటిల యత్నాలను తెలంగాణ గమనిస్తుంది.మీ పదవుల గ్యారంటీ కోసం ఉన్న శ్రద్ద - తెలంగాణ ప్రజలకు మీరిచ్చిన గ్యారంటీ కార్డు అమలుపై లేకపాయే అని కామెంట్స్ చేశారు. -
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు
సాకక్షి,హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ పేరిట మహేష్ కుమార్ గౌడ్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయనకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. హామీలు అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ సర్కారు తన చేతికానీతాన్ని కప్పిపుచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమపై, తమ పార్టీ నేతలపై ఇంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. మహేష్ కుమార్ గౌడ్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
Birthday Celebrations: అట్లుంటది.. హనుమంతన్న తోని
-
‘మరో పదేళ్లు కాంగ్రెస్దే అధికారం’
సాక్షి,హైదరాబాద్: మరో పదేళ్లు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి జోస్యం చెప్పారు. ఇవాళ రైతునేస్తం వేదిక నుంచి బటన్ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధుల్ని జమచేశారు.9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా జమ చేస్తామని ప్రకటించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. ‘రైతు ఆశీర్వాదం లేకపోతే ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. ఎమ్మెల్యేగా గెలవాలన్నా, పార్లమెంటుకు వెళ్లాలన్నా, ముఖ్యమంత్రి అవ్వాలన్నా రైతులు అండగా ఉంటేనే సాధ్యం. గతంలో పదవులు అనుభవించిన వాళ్లు, పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయనివారు వీధి వీధినా నాటకాలకు బయలుదేరారు.పదేళ్ల పాలనలో నెత్తిమీద అప్పు.. చేతిలో చిప్ప పెట్టారు. వాళ్లు పదేళ్లలో చేసిన విధ్వంసం వందేళ్లయినా కోలుకోలేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రాన్ని దిగజారిన ఆర్ధిక వ్యవస్థగా మార్చి మనకు అప్పగించారు. అద్దాల మేడలు కట్టి, రంగుల గోడలు చూపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్, రైతు రుణమాఫీ చేయలేని పరిస్థితికి తీసుకొచ్చారు.వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. వరి వేయండి చివరి గింజ వరకు కొనే బాధ్యత మాది అని చెప్పిన ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం. పేదలకు సన్న బియ్యం ఇచ్చేందుకు రైతులను సన్న వడ్లు పండించేందుకు ప్రోత్సహించాం. సన్న వడ్లకు రూ. 500 బోనస్ ప్రకటించి రాష్ట్రంలో 60 శాతం సన్న వడ్లు పండించేలా ప్రోత్సహించాం.మీరు సన్న వడ్లు పండించడం వల్లే ఇవాళ పేదలకు సన్న బియ్యం అందించగలుగుతున్నాం. వరి పండించడంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నాం.. తెలంగాణ ముఖ్యమంత్రిగా నాకు ఇంతకంటే ఇంకేం కావాలి. పదేళ్లలో 8లక్షల 20 వేల కోట్ల అప్పు మా నెత్తిపై మోపి నడుం వంగిపోయే పరిస్థితి తెచ్చారు. అప్పులు మన నెత్తిపై పెట్టి ఇవాళ మనల్ని విమర్శలు చేస్తున్నారుఒక్కొక్కటిగా సరి దిద్దుకుంటూ..ముందుకు వెళుతున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతులకు 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా అందించేందుకు ఇక్కడికి వచ్చాం.రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. 18 నెలల్లోనే రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. ఏ గ్రామంలోనైనా సవాల్ విసురుదాం.. గ్రామ సభలు పెడదాం, గ్రామాల్లో చర్చ పెడదాం. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి ఆత్మ గౌరవంతో బ్రతికే పరిస్థితి కల్పించాం. చావుల పునాదులపై అధికారంలోకి రావాలని దురాలోచనతో ప్రతిపక్షం ప్రయత్నిస్తుంది.కొంత కాలమైనా సమయం ఇవ్వరా..? సరిదిద్దుకొనివ్వరా?. భార్యాభర్తలు మాట్లాడుకున్నా ఫోన్ ట్యాపింగ్ చేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను కల్పించాం. ఏడాదిలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. మీ భవిష్యత్ బాగుంటేనే మాకు ఆనందం. ఆ దిశగా మిమ్మల్ని తీర్చిదిద్దడమే మా కర్తవ్యం.రైతులకు సోలార్ పంపుసెట్లతో ప్రయోజనం, వాణిజ్య పంటలు, ఇతర పంటలపై కలెక్టర్లు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఈ వేదికగా ఆదేశిస్తున్నా. రైతులు పంట మార్పిడి చేయండి. భూమి రైతుకు ఆత్మగౌరవం.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎవరు ఎన్ని ధర్నాలు చేసినా, బట్టలు చించుకున్నా పదేళ్లు మన ప్రభుత్వమే ఉంటుంది. -
తెలంగాణలో రేపటి నుంచి రైతు భరోసా
-
తెలంగాణ రైతులకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రేపటి నుంచి రైతుల అకౌంట్లలో రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ చేయనుంది. ఈ మేరకు మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఎకరాలతో సంబంధం లేకుండా రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లలో జమకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం (జూన్16) 1,034 రైతు వేదికల్లో ‘రైతునేస్తం’కార్యక్రమం ప్రారంభమైంది. ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేదికపై తెలంగాణ రైతు భరోసా విధి విధానాల్ని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది -
మంత్రి పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేసిన రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని తప్పుబట్టారు. కేబినెట్లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అంటూ పీసీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపైన వేరొకరు మాట్లాడ్డం ఏంటని పీసీసీ ప్రశ్నించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పార్టీతో సంప్రదించకుండా ఎలాంటి ప్రకటనలు చేయోద్దని, మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాలను మాట్లాడాలని సెన్సిటివ్ అంశాలను, కోర్టు పరిధిలో అంశాలను మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నేతల్ని సున్నితంగా మందలించారు. -
నిలకడగా సోనియా గాంధీ ఆరోగ్యం
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కీలక విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక, ఆదివారం ఉదయం అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో సోనియా గాంధీ చేరిన విషయం తెలిసిందే.తాజాగా సోనియా గాంధీ ఆరోగ్యంపై గంగారామ్ ఆస్పత్రి చైర్మన్ అజయ్ స్వరూప్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సోనియా గాంధీ గ్యాస్ కారణంగా కడుపు నొప్పి కారణంగా బాధ పడుతూ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యులు నిరంతరం ఆమెను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. According to Dr. Ajay Swaroop, Chairman, Sir Ganga Ram Hospital, Smt. Sonia Gandhi was admitted to Sir Ganga Ram Hospital at 9:00 PM Sunday under Department of Surgical Gastroenterology for stomach related issue. She is currently stable anddoctors is closely monitoring her health pic.twitter.com/iGOALuOBbH— Healthwire (@HealthwireMedia) June 16, 2025 -
TPCC ప్రధాన కార్యదర్శిగా శ్రీనుబాబు
-
పాక్ ముస్లిం లీగ్.. జైరామ్ రమేష్ ఒక్కటే: బీజేపీ ఘాటు విమర్శ
న్యూఢిల్లీ: కాంగ్రెస్- బీజేపీల మధ్య మరోమారు దుమారం చెలరేగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన సైనిక కవాతుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ను అమెరికా ఆహ్వానించిందని కాంగ్రెస్ వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. అమెరికా ఈ నకిలీ వార్తలను ఖండించిందని పేర్కొన్న బీజేపీ.. పాకిస్తాన్న్కు కాంగ్రెస్ మౌత్పీస్గా మారిందని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ వైఖరి అంతర్జాతీయ వేదికపై భారతదేశాన్ని ఇబ్బంది పెట్టిందని పేర్కొంది.పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అమెరికా వెళ్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ పేర్కొన్నారని, దీనిపై విలేకరుల సమావేశంలో ప్రస్తావించారని, అయితే మునీర్ అమెరికా వెళ్లడం లేదని తేలిందని బీజేపీ నేత చెందిన నిషికాంత్ దూబే మీడియాకు తెలిపారు. కాంగ్రెస్.. పాక్కు మౌత్ పీస్ మాదిరిగా ప్రవర్తిస్తూ, ప్రజలను ఇలా తప్పుదారి పట్టిస్తున్నదని, పాకిస్తాన్ ముస్లిం లీగ్- జైరామ్ రమేష్ మధ్య తేడా ఏమిటని దూబే ప్రశ్నించారు. पाकिस्तान मुस्लिम लीग और कांग्रेस पार्टी में कोई अंतर है तो हमें ज़रूर बताएँ https://t.co/DhjDypN3Fa— Dr Nishikant Dubey (@nishikant_dubey) June 15, 2025ఖలిస్తానీ తీవ్రవాదం పెరగడం, ఫలితంగా ఏర్పడిన అంతర్జాతీయ పరిణామాలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాల విదేశాంగ విధానమే కారణమని దూబే ఆరోపించారు. దీనికి ఉదాహరణగా 1970లనాటి ఖలిస్తానీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న కెనడా కేసును ఆయన ఉదహరించారు. 1970- 1984 మధ్య కాలంలో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఖలిస్తానీలపై చర్య తీసుకోవాలని కోరుతూ, కెనడా ప్రధాని పియరీ ఎలియట్ ట్రూడోకు ఏడు లేఖలు రాశారని, అయితే వాటిపై ఎటువంటి అర్థవంతమైన స్పందన రాలేదని ఆయన పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ఇరాన్ వరుస క్షిపణి దాడులు.. ఇజ్రాయెల్లో నిరంతర హెచ్చరిక సైరన్లు -
బీజేపీలోకి స్వప్న?
తాండూరు: మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాటికొండ స్వప్నపరిమళ్ కాంగ్రెస్ను వీడి కాషాయదళంలో చేరనున్నారా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అధికార పార్టీలో తనకు సరైన గౌరవం దక్కడం లేదని అసంతృప్తిగా ఉన్న ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది తాండూరులో హాట్టాపిక్గా మారింది. పలువురు మాజీ కౌన్సిలర్లు సైతం స్వప్న బాటలో నడవనున్నట్లు సమాచారం.మహేందర్రెడ్డి వర్గం నుంచి..2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పట్నం మహేందర్రెడ్డి వర్గం నుంచి చైర్పర్సన్ అభ్యర్థిగా స్వప్న రేసులోకి వచ్చారు. మరో వైపు ఇదే పార్టీ నుంచి రోహిత్రెడ్డి వర్గం తరఫున పట్లోల్ల దీపనర్సింహులు చైర్పర్సన్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేశారు. 36 వార్డులున్న తాండూరులో మహేందర్రెడ్డి వర్గీయులు ఎక్కువమంది కౌన్సిలర్లుగా గెలుపొందారు. దీంతో చైర్పర్సన్ కుర్చీ కోసం పోటీ నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు నాయకులు కల్పించుకుని, చైర్పర్సన్ పదవీకాలాన్ని ఇద్దరూ చెరి సగం పంచుకోవాలని సూచించారు. మొదటిసారి స్వప్నకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో దీపకు వైస్ చైర్పర్సన్ కుర్చీ ఇచ్చి బుజ్జగించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు, కోర్టు కేసుల నేపథ్యంలో పదవీ కాలమంతా స్వప్ననే కొనసాగారు. ఈ నేపథ్యంలో కౌన్సిల్ సమావేశాలు నిర్వహించిన ప్రతీసారి గొడవలే జరిగాయి.రాష్ట్ర కమిటీ ఎన్నిక తర్వాతే..గత అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత స్వప్న కాంగ్రెస్లో చేరారు. అయితే పదవీ కాలం ముగిసిన తర్వాత ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ఆమెకు ఆహ్వానం ఆగిపోయింది. ఈ విషయమై తన సన్నిహితుల వద్ద పలుమార్లు ఆవేదన వ్యక్తంచేశారు. ఈక్రమంలోనే బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల పలు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర కమిటీ నియామకం తర్వాతే కాషాయ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. -
వచ్చే ఎన్నికల్లో నేను.. నా కోడలు పోటీచేస్తాం
హన్మకొండ చౌరస్తా: వచ్చే ఎన్నికల్లో నేను.. నా కోడలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు. హనుమకొండ అశోకా కన్వెన్షన్ హాల్లో గురువారం మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ఆమె మాట్లాడారు. పార్టీలకతీతంగా నాటి యతిరాజారావు నుంచి మొన్నటి దయాకర్రావు వరకు పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యులుగా ఉంటున్నాం.. అంతకుముందు ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని జంగా రాఘవరెడ్డి తమను కోరాగా.. పార్టీలతో సంబంధం లేకుండా దయాకర్రావుకు సపోర్ట్ చేశామన్నారు.అవమానాలు భరించలేకే రాజకీయాల్లోకి..దయాకర్రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డబుల్బెడ్రూం ఇళ్ల కోసం సొంత ఖర్చుతో స్థలం కొనుగోలు చేసి ఇచ్చాం. స్థలం ఇచ్చే ముందు నా భర్త పేరుపెడతామని చెప్పి చేయలేదు. అప్పటి ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు శానిటేషన్ ప్యాడ్స్ పంపిణీ నిలిపివేస్తే, మా సంస్థ ఆధ్వర్యాన ఇవ్వడానికి ముందుకొచ్చాం. ఆ కార్యక్రమానికి దయాకర్రావు రాలేదు. కలెక్టర్, స్కూల్ ఉపాధ్యాయులను సైతం రానివ్వకుండా చేశాడు. మేము చేసే అనేక కార్యక్రమాలను అడ్డుకుంటూ నన్ను అవమానించాడు. అమెరికా వెళ్లాక ఏనాడు రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. దయాకర్రావు చేసిన అవమానాలను తట్టుకోలేకే రావాల్సి వచ్చింది. మంత్రిగా దయాకర్రావు నా ఫోన్ను సైతం ట్యాపింగ్ చేయించారు. ఫోన్ ట్యాపింగ్, సీ్త్రనిధి నిధుల గోల్మాల్, పంచాయతీ రాజ్ నిధుల్లో అక్రమాలు ఇలా అనేక విషయాల్లో ఆయన జైలుకు పోవడం ఖాయమన్నారు. -
ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంట్లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..
యాదగిరిగుట్ట: ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) నివాసంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి ఉరివేసుకుని మృతిచెందారు. గంధమల్ల రవి అనే వ్యక్తి యాదగిరిగుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే అయిలయ్య ఇంట్లోని పెంట హౌస్లో అద్దెకు ఉంటున్నారు. తాను ఉంటున్న గదిలోనే రవి ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు. అయితే ఇటీవల రవిని ఎమ్మెల్యే మందలించినట్లు సమాచారం. రెండు రోజులుగా మృతుడి సొంత గ్రామమైన సైదాపురంలోనే ఉన్న అతను.. ఎమ్మెల్యే ఇంట్లోనే ఉరి వేసుకుని మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఒకవేళ ఆత్మహత్యకు పాల్పడాలంటే సైదాపురంలోని ఇంట్లో ఉరివేసుకుని ఉండ వచ్చునని గ్రామస్తులు అంటున్నారు. భార్యతో కలిసి గత కొన్నేళ్లుగా ఎమ్మెల్యే ఇంట్లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, రాత్రికి రాత్రి రవి మృత దేహాన్ని భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని అయిలయ్య సందర్శించారు. -
కేటీఆర్పై ఎమ్మెల్సీ వెంకట్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. .హైదరాబాద్ సీసీఎస్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. అనంతరం, ఎమ్మెల్సీ వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతూ సీఎంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాను. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్.. ముఖ్యమంత్రి కూర్చిని గౌరవించాలని మాట్లాడారు. మరి ఇప్పుడు ఆయన బుద్ధి ఏమైంది?.కేటీఆర్ వ్యాఖ్యలు బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు కొట్లాడుకునే విధంగా ఉన్నాయి. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్కు విఘాతం కలిగించే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నాడు. కింది స్థాయిలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు.. కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకొని శాంతి భద్రతలకు భంగం కలిగించాలని చూస్తున్నారు. ఆ విషయంపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. బాధ్యతాయుత పదవిలో ఉన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ లో ఇలాంటి వ్యాఖ్యలు పోస్ట్ చేశారు.కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారాలపై అసెంబ్లీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తాం. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలందరికీ సీఎం. ఆయనపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో ఇలాంటి వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై నియంత్రణ చేయకుంటే.. మేం కూడా మీరు చేసిన స్కాంలు, అరాచకాలపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లపై ఈడీ దాడులు
బనశంకరి: కర్ణాటకలో సంచలనం రేకెత్తించిన మహర్షి కర్ణాటక వాల్మీకి గిరిజన అభివృద్ధి మండలి (కేఎం వీఎస్టీడీసీ)లో కోట్ల రూపాయల కుంభకోణంలో కేంద్ర ఈడీ అధికారులు మరోసారి దాడులు నిర్వహించారు. బుధవారం ఉదయమే ఉమ్మడి బళ్లారి జిల్లాలో, బెంగళూరులో పలువురు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేల నివాసాలు, ఆఫీసుల్లో ముమ్మరంగా సోదాలు జరిపారు. బళ్లారి జిల్లా ఎంపీ తుకారాం, కంప్లి ఎమ్మెల్యే గణేశ్, కూడ్లిగి ఎమ్మెల్యే ఎన్టీ శ్రీనివాస్, బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి, బళ్లారి రూరల్ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర పీఏ గోవర్ధన్ ఇళ్లు, బెంగళూరులోని ఆఫీసుల్లో సోదాలు చేశారు. వారి సన్నిహితులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. అక్రమ నగదు బదిలీ నియంత్రణ చట్టం కింద చేపట్టిన ఈ తనిఖీలు కర్ణాటక రాష్ట్రంలో కలకలం రేపాయి. వాల్మీకి అభివృద్ధి మండలి స్కాం గతేడాది ఫిబ్రవరిలో బయటకు వచ్చింది. ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడాలని ఒత్తిళ్లు వస్తున్నాయని లేఖ రాసి మండలి ఉద్యోగి ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలి ఖాతాల నుంచి ఓ మంత్రి రూ.94 కోట్లు తమ ఖాతాలకు బదిలీ చేసి తెలంగాణ శాసన సభ ఎన్నికలు, బళ్లారి లోక్సభ ఎన్నికల్లో ఖర్చు చేశారని ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో అప్పటి మంత్రి బి.నాగేంద్ర రాజీనామా చేశారు. తరువాత ఈడీ ఆయన్ని అరెస్టు చేసింది. మండలి మేనేజింగ్ డైరెక్టర్ను, కొందరు ఉన్నతాధికారులను రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఈడీ తాజాగా దాడులు ప్రారంభించింది. మళ్లించిన నిధుల నుంచి కంప్లి ఎమ్మెల్యే గణేశ్కు రూ.3 కోట్లు, ఎంపీ తుకారాంకు రూ.10 కోట్లు, ఎన్టీ శ్రీనివాస్కు కూడా కొంత నగదు చేరినట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. -
11 ఏళ్లలో 33 తప్పులు
కలబురిగి: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 11 ఏళ్లలో 33 తప్పులు చేసిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కేవలం అబద్ధాలు, మోసాలతో మోదీ కాలం గడిపే స్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చాక యువతను నిలువునా దగా చేశారని, ఓట్ల కోసం పేదలను వాడుకున్నారని మోదీపై మండిపడ్డారు. ప్రధానమంత్రి మోసాలపై పార్లమెంట్లోనూ తాను గళమెత్తానని తెలిపారు. తాను 65 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, ఇందులో 55 ఏళ్లు పదవుల్లో ఉన్నానని, నరేంద్ర మోదీ లాంటి మోసకారి ప్రధానమంత్రిని ఏనాడూ చూడలేదని ధ్వజమెత్తారు. బుధవారం కర్ణా టకలోని కలబురిగిలో మల్లికార్జున ఖర్గే మీడియా సమావేశంలో మాట్లాడారు. చెప్పింది మోదీ ఏనాడూ చేయలేదని, అదేమిటని ప్రశ్నిస్తే ఆయన దగ్గర సమాధానం ఉండదని విమర్శించారు. ఆయనకు అబద్ధాలు తప్ప మరొకటి తెలి యదన్నారు. మోదీ తప్పుల జాబితాలో పెద్దనోట్ల రద్దు, ఉద్యోగాల సృష్టి జరగకపోవడం, పంటలకు కనీస మద్దతు దక్కపోవడం వంటివి ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఇవన్నీ తప్పులన్న విషయం ప్రధాని అంగీకరించడం లేదని విమర్శించారు. చేసిన తప్పులకు ప్రజలకు క్షమాపణ చెప్పకపోగా మాటలతో మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. 11 ఏళ్లు గడిచిపోయానని, ఇప్పటిదాకా చేసిందేమీ లేదని ఆక్షేపించారు. డిప్యూటీ స్పీకర్ను నియమించాలి లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఖాళీగా కొనసాగిస్తుండడాన్ని ఖర్గే తప్పుపట్టారు. రాజ్యాంగం ప్రకారం డిప్యూటీ స్పీకర్ను నియమించాలని సూచిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశానని చెప్పారు. రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వం నడుచుకోవాల న్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత డిప్యూటీ స్పీకర్ పోస్టు ఖాళీగా ఉన్న దాఖలాలు ఏనాడూ లేవని వెల్లడించారు. -
సామాజిక న్యాయంతో కేబినెట్ కూర్పు: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: ‘కర్ణాటకలో చేపట్టే కులగణన అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిధ్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో చర్చించేందుకే ఢిల్లీకి వచ్చా. రాష్ట్రంలో మంత్రులకు శాఖల కేటాయింపుపై పెద్దగా చర్చ జరగలేదు. డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు లేకుండా శాఖల కేటాయింపుపై ఎలా చర్చిస్తాం? తెలంగాణ చేసింది కేవలం కులగణన సర్వే మాత్రమే కాదు. సామాజిక, ఆర్ధిక, ఉద్యోగ, రాజకీయ, ఉపాధి, విద్య అంశాల సర్వే. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి వ్యక్తిగత డేటా పూర్తిగా మా వద్ద ఉంది. 97 శాతం మంది సర్వేలో పాల్గొన్నారు. సర్వే చేయడంతో ఆగిపోకుండా ఆ మేరకు సామాజిక న్యాయంతో రాష్ట్ర కేబినెట్ కూర్పు చేశాం. చరిత్రలోనే తొలిసారి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ జనాభాలో 15 శాతం ఉన్న ఎస్సీలకు 27 శాతం పదవులిచ్చాం. 4 మంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవి ఎస్సీలకిచ్చాం. ఎస్టీలకు ఒక మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇచ్చాం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 8 మంది రెడ్లు, 4 వెలమలకు మంత్రులుగా అవకాశమిచ్చి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేవలం మూడు మంత్రి పదవులే ఇచ్చారు..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. పార్టీ అధిష్టానంతో భేటీ నిమిత్తం మూడ్రోజుల కిందట ఢిల్లీ వచ్చిన సీఎం.. బుధవారం తన అధికారిక నివాసంలో మీడియాతో చిట్చాట్ చేశారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. స్థానిక సంస్థల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే పార్టీగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 42 శాతం రిజర్వేషన్లను పార్టీ పరంగా అమలు చేస్తాం. ఈ మేరకు ఇతర పార్టీలను కూడా కోరతాం. కేంద్రం ఆమోదిస్తే అధికారికంగానూ అమలు చేస్తాం.కులగణన ఆధారంగా నిమ్న వర్గాలకు అభివృధ్ధి, సంక్షేమ ఫలాలు అందించే విషయమై జస్టిస్ సుదర్శన్రెడ్డి కమిటీని నియమించాం. ఆ కమిటీ సిఫారసుల మేరకు ముందుకు వెళతాం. స్థానిక సంస్థల ఎన్నికలు కోర్టులో కేసులు తేలిన వెంటనే నిర్వహిస్తాం. ప్రక్షాళన ప్రచారంలో నిజం లేదు పాత మంత్రుల్లో ఎవరైనా తమకు పనిభారం ఎక్కువగా ఉందని చెబితే, వారి శాఖల మార్పుపై నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్ర మంత్రివర్గంలోకి కొత్తగా చేరిన వారికి తన వద్ద ఉన్న శాఖలను పంచుతా. శాఖల ప్రక్షాళనపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. నా వద్ద 12 శాఖలు ఉన్నాయి. వీటినే కొత్త మంత్రులకు పంచాలని భావిస్తున్నా. మిగతా వారివద్ద ఏయే శాఖలున్నాయి, ఎక్కువ శాఖలున్న మంత్రులు ఎవరిపైనైనా పని భారం ఉందా? అన్న దానిపై చర్చిస్తాం. ఎవరైనా పనిభారం ఉందంటే శాఖలను మారుస్తాం. హైదరాబాద్లో అందరితో మాట్లాడి నిర్ణయం చేస్తాం. ‘కాళేశ్వరం’పై రెండ్రోజుల్లో ప్రజల ముందుకు.. కాళేశ్వరం అక్రమార్కులపై కచ్చితంగా చర్యలుంటాయి. రెండ్రోజుల్లో హైదరాబాద్లో ప్రెస్మీట్ పెట్టి కాళేశ్వరంపై నా అభిప్రాయాన్ని, గతంలో జరిగిన తప్పిదాలను ప్రజల ముందు ఉంచుతా. కాళేశ్వరం ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకుందని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు ఆరోపణలు చేస్తే, ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ మాత్రం కాళేశ్వరంలో అంతా బాగానే ఉందని చెప్పడం ఏంటి? రాష్ట్రాభివృద్ధికి కేంద్రమంత్రి కిషన్రెడ్డే వంద శాతం అడ్డంకి. తెలంగాణ సమస్యలపై ఆయన కేంద్ర కేబినెట్లో ఒక్కసారైనా మాట్లాడారా? రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు. నిర్మలా సీతారామన్ చెన్నైకి, ప్రల్హాద్ జోషి కర్ణాటకకు మెట్రో తీసుకెళ్లారు. అలాంటిది తెలంగాణ మెట్రోకు కిషన్రెడ్డి ఎందుకు అడ్డుపడుతున్నారు? కేటీఆర్ వ్యతిరేకిస్తున్నారు కాబట్టే కిషన్రెడ్డి కూడా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై రివ్యూ జరుపుతానంటే హైదరాబాద్ సచివాలయంలో లేదంటే.. ఢిల్లీలో.. ఎక్కడైనా అధికారులతో కలిసి సమీక్షకు నేను రెడీ. కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రానికి శత్రువులు కేసీఆర్ కుటుంబం రాష్ట్రానికి దుష్మన్లు (శతువులు). వారిని, బీఆర్ఎస్ నేతలను నేను ఉన్నంతవరకు కాంగ్రెస్ పారీ్టలో చేర్చుకునేది లేదు. కేసీఆర్ ఫ్యామిలీ కొరివి దెయ్యాల ఫ్యామిలీ అని గతంలోనే చెప్పా. కేటీఆర్, హరీశ్రావు, కవిత అసెంబ్లీ రౌడీ సినిమాలో ‘బాషా’బ్యాచ్ లాంటివాళ్ళు. వాళ్ల కుటుంబ పంచాయితీ ఆ సినిమా మాదిరిగానే ఉంది. మీడియా దృషిŠిట్న తమ వైపు తిప్పుకునేందుకు డ్రామాలు ఆడుతున్నారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని కవిత చెప్పింది. ఇప్పటివరకూ దానిపై కేసీఆర్ మాట్లాడలేదు. అసమానతలున్నంత కాలం నక్సలిజం అంతం కాదు నక్సలిజం సామాజిక సమస్య. దేశంలో సామాజిక అసమానతలున్నంత కాలం నక్సలిజం అంతం కాదు. ఎవరూ అంతం చేయలేరు. సామాజిక అసమానతలను తొలగించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో చర్యలను చేపట్టింది. ప్రధానిగా ఇందిరాగాంధీ భూ సంస్కరణలు తీసుకువచ్చారు. ‘దున్నేవాడిదే భూమి’అనే నినాదం ఆదర్శంగా తెలంగాణలో నిరుపేదలకు లక్షల ఎకరాలు పంచారు. ఇళ్లు కట్టించారు. వీటివల్ల నక్సలిజం తగ్గింది. కులగణన సర్వే అమలుతోనూ నక్సలిజం తగ్గుతుంది. -
నేను ఉన్నంత వరకు కవితకు నో ఎంట్రీ..!
-
వివేక్కు ఏ శాఖ ఇస్తరో..!
గత ఏడాదిన్నరగా ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర మంత్రిమండలిలో ప్రాతినిధ్యం లేక ప్రజలు, నాయకులు, అధికారులకు పరిపాలనలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. తాజాగా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్కు మంత్రి పదవి రావడంతో ఊరట దక్కింది. మరోవైపు రాష్ట్రం ఏర్పడ్డాక, తూర్పు జిల్లా నుంచి తొలిసారిగా మంత్రి పదవి లభించింది. గత ప్రభుత్వంలో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం ఉండగా.. ఈసారి మంచిర్యాల జిల్లాకు అవకాశం లభించింది.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పరిపాలన తదితరవన్నీ జిల్లాకు మంత్రి లేకపోవడంతో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం అన్ని పథకాల అమలులో ఇన్చార్జి మంత్రి కీలకంగా మారారు. ప్రస్తుతం మంత్రి సీతక్క ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొనసాగుతున్నారు. జిల్లాల వారీగా జరుగుతున్న అభివృద్ధి, పథకాల అమలుపై సమీక్షలు, సమావేశాలు, నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇకపై వివేక్ ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దీంతో ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పర్యవేక్షణలో సులువు కానుంది. ప్రభుత్వ పరంగా వేడుకలు, అధికారిక కార్యక్రమాలు మంత్రి హోదాలో జరగనున్నాయి.శాఖలపై కసరత్తురెండో విడతలో మంత్రులుగా ముగ్గురు ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్కుమార్, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్ ప్రమాణం స్వీకారం చేశారు. వీరికి ఇంకా శాఖలు కేటాయించలేదు. మంత్రి మండలిలో ఖాళీగా హోం, మున్సిపల్, గనులు, కార్మిక, పశుసంవర్ధక, పాడి, సంక్షేమ శాఖలు, ఇతర శాఖలు ఖాళీగా ఉండడంతోపాటు రెండేసి, మూడేసి శాఖలు నిర్వహిస్తున్న మంత్రులు ఉన్నారు. ఈ క్రమంలో కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న వారికి ఎవరికి ఏ శాఖ ఇస్తారోనని ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీనిపై కసరత్తు చేస్తుండగా, త్వరలోనే స్పష్టత రానుంది.వివేక్పైనే ఆశలుగత పదిహేడు నెలలుగా ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా లేకపోవడంతో నాయకులతోపాటు ప్రజలకు లోటు ఏర్పడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో నలుగురిలో ఒకరికై నా మంత్రి పదవి వస్తుందని ముందు నుంచి ప్రచారం ఉంది. పలుమార్లు వాయిదా పడ్డాయి. తాజాగా వివేక్నే ఖరారు చేయడంతో ఆయనపై ఉమ్మడి జిల్లా వాసుల ఆశలు ఉన్నాయి. నిధులు, విధులు, బడ్జెట్ కేటాయింపులు, ఖర్చు తదితరవన్నీ ఉమ్మడి జిల్లా నుంచి బలంగా వినిపించాల్సి ఉంటుంది. తన నియోజకవర్గం చెన్నూరుతోపాటు మిగతా ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాల్సి ఉంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, గిరిజన ప్రాంతాలు, సింగరేణి తదితర అనేక సమస్యలు ఉన్నాయి.సీఎంను కలిసిన మంత్రి, ఎంపీచెన్నూర్: రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా అవకాశం కల్పించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేశారు. -
మంత్రులకు శాఖల కేటాయింపుపై రేవంత్ క్లారిటీ.. హోం మంత్రి ఎవరికి?
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖ కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలనే మంత్రులకు కేటాయించనున్నట్టు రేవంత్ వెల్లడించారు. దీంతో, ఏయే శాఖలను రేవంత్ వదులుకుంటారనే ఆసక్తి నెలకొంది. హోంశాఖ కేటాయింపు ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. సీఎం ప్రకటనతో పాత మంత్రుల వద్ద ఉన్న శాఖల్లో మార్పులు లేనట్టుగా తెలుస్తోంది.ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ.. 'నేను ఢిల్లీకి వచ్చింది.. తెలంగాణ, కర్ణాటకలో విజయవంతమైన కుల గణన వివరాలు పంచుకోవడానికి మాత్రమే. నేను హైదరాబాద్ వెళ్లగానే కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తాను. నా దగ్గర ఉన్న శాఖలనే మంత్రులకు కేటాయిస్తాను' అని చెప్పుకొచ్చారు. కిషన్ రెడ్డినే ప్రధాన అడ్డంకితెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డినే ప్రధాన అడ్డంకిగా మారారని సీఎం రేవంత్ విమర్శించారు. 'కిషన్రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే. నేను అధికారంలో ఉన్నంత వరకూ కాంగ్రెస్ పార్టీలోకి కేసీఆర్ కుటుంబానికి నో ఎంట్రీ. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులు. నేను ఉన్నంత వరకు కవితకు కాంగ్రెస్లోకి ప్రవేశం లేదు. కవిత చేస్తున్న దంతా అసెంబ్లీ రౌడీ సినిమా తరహా డ్రామా. కేటీఆర్ చెప్పినట్టే కిషన్రెడ్డి నడుచుకుంటున్నారు. తెలంగాణపై ఒక్కరోజు కూడా కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించలేదు. రీజినల్ రింగ్ రోడ్డు సహా అనేక ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్కు భూసేకరణ నేనే క్లియర్ చేశాను. సామాజిక అంతరాలు ఉన్నంత వరకు నక్సలిజం ఉంటుంది. నక్సలిజం ఎప్పటికీ అంతం కాదు. ఇప్పుడు కొంత తగ్గినా వివిధ రూపాల్లో మళ్లీ వస్తుంది’ అని చెప్పుకొచ్చారు. 11 శాఖల్లో ఏది.. ఎవరికి?మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్ క్లారిటీ ఇవ్వడంతో కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతానికి సీఎం రేవంత్ వద్ద కీలకమైన విద్యాశాఖ, మున్సిపల్, హోంశాఖ, క్రీడా శాఖతో పాటు 11 శాఖలు ఉన్నాయి. ఈ శాఖల్లో ఏయే శాఖలు కొత్త మంత్రులకు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. విద్యాశాఖ, హోంశాఖపై ప్రధానంగా చర్చ నడుస్తోంది. -
మంత్రి పదవి లేకపోయినా.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై తాజాగా రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తాను మంత్రిగా లేకపోయినా, పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతానని చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణ కేబినెట్లో నూతనంగా నియమితులైన మంత్రులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రజలకు సేవ చేయడంలో వారికి సంపూర్ణ విజయం కోరుకుంటున్నాను. నాకు రాజకీయాలు అంటే పదవులు గానీ, అధికారాలు గానీ కాదు. ప్రజల పట్ల నా నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కలలే నాకు ప్రేరణగా నిలిచాయి. అదే కారణంగా నేనే తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చాను.ఈరోజు నేను మంత్రిగా లేకపోయినా, పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతాను. ప్రజల సమస్యలు వినడంలో, వారి హక్కుల కోసం పోరాడడంలో, వారి గొంతుకను ప్రభుత్వం వరకు తీసుకెళ్లడంలో నేను ఎప్పటికీ ముందుంటాను. నా రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదు. కొన్నిసార్లు, పదవి లేకుండానే ప్రజల మధ్య పనిచేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుతుంది. అదే మార్గాన్ని నేను ఎంచుకున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్లో నూతనంగా నియమితులైన మంత్రులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రజలకు సేవ చేయడంలో వారికి సంపూర్ణ విజయం కోరుకుంటున్నాను.నాకు రాజకీయాలు అంటే పదవులు గానీ, అధికారాలు గానీ కాదు. ప్రజల పట్ల నా నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కలలే నాకు ప్రేరణగా నిలిచాయి. అదే…— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) June 11, 2025 -
రేవంత్ మంత్రి వర్గంలో భారీ మార్పులు!.. హైకమాండ్కు జాబితా
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రుల శాఖల మార్పులపై కసరత్తు కొనసాగుతోంది. తాజాగా మంత్రుల శాఖల మార్పుల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. హైకమాండ్కు పంపించారు. ఇక, మంగళవారం శాఖల మార్పులపై సునీల్ కనుగోలుతో కలిసి సీఎం రేవంత్ కసరత్తు చేశారు. అనంతరం, అధిష్టానానికి కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, పలువురికి శాఖల మార్పుపై రేవంత్ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ముఖ్యమంత్రి రేవంత్ ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉండి కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపారు. అయితే, పలువురు సీనియర్ మంత్రుల శాఖల మార్పుపై తర్జనభర్జనలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అభిప్రాయంపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది.ఇక, సీఎం రేవంత్రెడ్డి వద్ద ఉన్న పలు కీలక శాఖలు ఇతర సీనియర్ మంత్రులకు కేటాయించాలని హైకమాండ్ సూచించినట్లు తెలిసింది. ఇందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా శాఖల కేటాయింపు, శాఖల మార్పు ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్తగా మంత్రివర్గంలో చేరిన ముగ్గురు మంత్రులు కొత్తవారే అయినందున వారికి ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను కేటాయించి, సీనియర్ మంత్రులకు న్యాయ, హోంశాఖ, విద్యా శాఖలను ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కొందరు మంత్రుల పనితీరు పరిగణనలోకి తీసుకుని శాఖల మార్పు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు మంగళవారం రోజంతా డిప్యూటీ సీఎం భట్టితో హైకమాండ్ ఫోన్లో మంతనాలు జరిపింది. అయితే ఉత్తమ్ ఢిల్లీ వెళ్లిన కొద్దిసేపటికే భట్టికి కూడా అక్కడినుంచి పిలుపు వచ్చిందని, ఆయన కూడా విమానం ఎక్కుతున్నారనే ప్రచారం జరిగింది. కానీ, భట్టి మంగళవారం రాత్రి వరకు ఢిల్లీ వెళ్లలేదు. హైదరాబాద్లోనే ఉన్న ఆయన సమీక్షల్లో పాల్గొంటూనే పార్టీ పెద్దలతో మంతనాలు జరిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రులు, పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. త్వరలో వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంతో పాటు 10–15 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్ల నియామకం కూడా త్వరలోనే జరుగుతుందని, దీనిపై కూడా పార్టీ పెద్దలతో రేవంత్ చర్చించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. -
‘డిప్యూటీ స్పీకర్ పదవి’పై ప్రధానికి మల్లికార్జున ఖర్గే లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ డిప్యూటీ స్పీకర్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ లేవనెత్తింది. డిప్యూటీ స్పీకర్ పదవికి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ పదవిని ఖాళీగా ఉంచడం భారత ప్రజాస్వామ్య రాజకీయాలకు మంచి సంకేతం కాదని, ఇది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నారు. జూలై 21 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఖర్గే ఈ డిమాండ్ చేశారు.‘లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీకి సంబంధించిన ఆందోళనకరమైన విషయంపై మీ దృష్టిని ఆకర్షించడానికే నేను ఈ లేఖ రాస్తున్నాను’అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రధానికి రాసిన తన లేఖలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరినీ ఎన్నుకోవడానికి వీలు కల్పిస్తుంది. రాజ్యాంగపరంగా, డిప్యూటీ స్పీకర్ లోక్సభ స్పీకర్ తర్వాత రెండవ అత్యున్నత ప్రిసైడింగ్ అధికారి. సంప్రదాయంగా లోక్సభ రెండవ లేదా మూడవ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ ఎన్నికవుతారని... లోక్సభలో కార్యనిర్వహణ, విధాన నియమాలలోని 8(1) నిబంధన ప్రకారం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తేదీని స్పీకర్ నిర్ణయిస్తారు అనేది ఒకే తేడా అని ఖర్గే తెలిపారు.మొదటి లోక్సభ నుంచి పదహారవ లోక్సభ వరకు ప్రతి సభలో ఒక డిప్యూటీ స్పీకర్ ఉన్నారని ఖర్గే అన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ సభ్యుల నుంచి డిప్యూటీ స్పీకర్ను నియమించడం ఒక ఆనవాయితీ అని... స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా, ఈ పదవి వరుసగా రెండు లోక్సభ పర్యాయాలు ఖాళీగా ఉందని ఖర్గే విమర్శించారు. పదిహేడవ లోక్సభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కాలేదని.. ఇదే విధా నం పద్దెనిమిదవ లోక్సభలో కూడా కొనసాగుతోందన్నారు. ఇది భారతదేశ ప్రజాస్వామ్య రాజకీయాలకు మంచి సంకేతం కాదని.. ఇది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమే అని ఖర్గే ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అందువల్ల సభ సంప్రదాయాలను, పార్లమెంటు ప్రజాస్వామ్య విలువలను దృష్టిలో ఉంచుకుని, లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ఇక ఆలస్యం చేయకుండా ప్రారంభించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు కోరారు. -
సీఎం శాఖలు సీనియర్లకు!
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, ప్రస్తుత మంత్రుల శాఖల మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ముగిసింది. పార్టీలో సీనియార్టీ, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి, ఏ శాఖ కట్టబెట్టాలన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి వద్ద ఉన్న పలు కీలక శాఖలు ఇతర సీనియర్ మంత్రులకు కేటాయించాలని హైకమాండ్ సూచించినట్లు తెలిసింది. ఇందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా శాఖల కేటాయింపు, శాఖల మార్పు ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్తవారికి పాత మంత్రుల శాఖలు శాఖల కేటాయింపు అంశంపై చర్చించేందుకు సోమవారం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాం«దీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు శాఖల కేటాయింపుపై చర్చించారు. భేటీలో సీనియర్ మంత్రుల వద్ద, సీఎం వద్ద ఉన్న శాఖలతో పాటు ప్రాధాన్యత గల శాఖలపై కీలక చర్చలు జరిగాయి. హోంశాఖ సహా మునిసిపల్, విద్య, న్యాయ, మైనింగ్ వంటి కీలక శాఖలు ఇప్పటికీ ముఖ్యమంత్రి వద్దే ఉన్న నేపథ్యంలో వాటిని ఇతర సీనియర్ మంత్రులకు కేటాయించాలని పార్టీ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది. కొత్తగా మంత్రివర్గంలో చేరిన ముగ్గురు మంత్రులు కొత్తవారే అయినందున వారికి ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను కేటాయించి, సీనియర్ మంత్రులకు న్యాయ, హోంశాఖ, విద్యా శాఖలను ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కొందరు మంత్రుల పనితీరు పరిగణనలోకి తీసుకుని శాఖల మార్పు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే ఎవరి శాఖల మార్పు జరుగుతుందనేది బుధవారం ఉదయం వెల్లడయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎవరూ పార్టీ వీడకుండా చూడండి మంత్రి పదవులు ఆశించినా దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న నేతల అంశం సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. మంత్రి పదవులు లభించని సీనియర్ నేతలు సుదర్శన్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ప్రేంసాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి తదితరులకు ఎలాంటి భరోసా కల్పించాలన్న దానిపై చర్చించారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలు కానీ, వారి అనుచరులు కానీ ఎవరూ పార్టీని వీడకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. అవసరమైతే నేరుగా నేతలను తమతో మాట్లాడించాలని చెప్పినట్లు సమాచారం. అయితే సీనియర్ నేత సుదర్శన్రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు మరో మైనార్టీ నేతకు అవకాశం ఇస్తే సమన్యాయం జరిగినట్టవుతుందని ముఖ్యమంత్రి అన్నారని, దీనిపై మున్ముందు నిర్ణయం చేద్దామని హైకమాండ్ నేతలు చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి సాయంత్రం పార్టీ పెద్దల నుంచి పిలుపు రావడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మరోవైపు మంగళవారం రోజంతా డిప్యూటీ సీఎం భట్టితో హైకమాండ్ ఫోన్లో మంతనాలు జరిపింది. అయితే ఉత్తమ్ ఢిల్లీ వెళ్లిన కొద్దిసేపటికే భట్టికి కూడా అక్కడినుంచి పిలుపు వచ్చిందని, ఆయన కూడా విమానం ఎక్కుతున్నారనే ప్రచారం జరిగింది. కానీ భట్టి మంగళవారం రాత్రి వరకు ఢిల్లీ వెళ్లలేదు. హైదరాబాద్లోనే ఉన్న ఆయన సమీక్షల్లో పాల్గొంటూనే పార్టీ పెద్దలతో మంతనాలు జరిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రులు, పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. త్వరలో వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంతో పాటు 10–15 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్ల నియామకం కూడా త్వరలోనే జరుగుతుందని, దీనిపై కూడా పార్టీ పెద్దలతో రేవంత్ చర్చించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో బహిరంగ సభలకు యోచన కులగణన, ఎస్సీల వర్గీకరణ, రాజ్యాంగ పరిరక్షణ సభలను తెలంగాణలో ఏర్పాటు చేయాలని రాహుల్గాంధీ భావిస్తున్నారని తెలిసింది. ఈ సభలను భారీ ఎత్తున నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆలోచనలను దేశమంతా వివరించే యోచనలో రాహుల్ ఉన్నారని, వాటి నిర్వహణపై కూడా చర్చ జరిగిందని సమాచారం. మరోవైపు 11 ఏళ్ల బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరో బహిరంగ సభ నిర్వహణ యోచనలోనూ కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సభలకు ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీ ఎవరో ఒకరు హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు, తేదీలను త్వరలోనే ఖరారు చేయనున్నారని సమాచారం. -
మళ్లీ కులగణన.. అధిష్టానం ఆదేశాలతో కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మళ్లీ కులగణన చేపట్టాలని భావిస్తోంది. అధిష్టానం ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మంగళవారం సూచన ప్రాయంగా ప్రకటించారు. అయితే కుల గణన అంశంపై సమీక్ష జరిపేందుకు ఎల్లుండి (జూన్ 12న) కర్ణాటక కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇదిలా ఉంటే. . కర్ణాటకలో 2015లోనే అప్పటి ప్రభుత్వం కుల గణన జరిపింది. హెచ్ కాంతారాజ్ నేతృత్వంలో కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్ ఈ సర్వేను నిర్వహించింది. ఆ సమయంలో కోటి 35 లక్షల ఇళ్లను సర్వే చేశారు. 51 ప్రమాణాల ఆధారంగా 5.98 కోట్ల మంది డాటాను సేకరించారు. అయితే.. రాజకీయపరమైన కారణాలు, ఇతర కారణాల దృష్ట్యా ఆ నివేదికను సీల్డ్ కవర్లోనే ఉంచారు. ఈ ఏడాది ఏప్రిల్లో కేబినెట్ ముందుకు ఆ నివేదిక వచ్చింది. అప్పటి నుంచి దఫ దఫాలుగా కేబినెట్ భేటీ అవుతూ.. కర్ణాటక సోషియో ఎకనమిక్ అండ్ ఎడ్యుకేషన్ సర్వేపై చర్చలు జరుపుతోంది. అయితే ఆ నివేదికలోని ఓబీసీ రిజర్వేషన్లను 51 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అదేసమయంలో లింగాయత్, వక్కలింగ కులాలు ఈ నివేదికను తోసిపుచ్చుతున్నాయి.మరోవైపు .. మళ్లీ కుల గణన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఇటు రాజకీయ వర్గాలు, అటు మేధో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా టీచర్లను సర్వేలో భాగం చేయడం వల్ల అకడమిక్ ఇయర్కు విఘాతం కలిగే అవకాశం ఉందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జన గణనతో పాటే కుల గణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మరోసారి కుల గణన జరపాలని అనుకుంటుండడం విశేషం. కేబినెట్ సబ్కమిటీ లేదంటే లెజిస్లేటివ్ కమిటీ ద్వారా కుల గణన సర్వేపై తుది నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
TPCC: టీపీసీసీ కార్యవర్గం ప్రకటన
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది ఏఐసీసీ. ఈ మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్లు లేకుండా పోమవారం రాత్రి పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది ఏఐసీసీ. తాజా టీపీసీసీ కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా 27 మందిని నియమించింది. అదే సమయంలో ప్రధాన కార్యదర్శులుగా 69 మంది నియమించింది. -
తొలిసారి ఎమ్మెల్యే.. తొలిసారే మంత్రి..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో మరో పాలమూరు వాసికి చోటు దక్కింది. వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. అంచెలంచెలుగా ఎదిగిన మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని అమాత్య పదవి వరించింది. ఈ మేరకు హైదరాబాద్ రాజ్భవన్లో ఆదివారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు మంత్రి పదవి రావడంతో బీసీ సంఘాలతో పాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఉమ్మడి మహబూబ్నగర్ పరిధిలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. తాజాగా వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కడం పాలమూరుకు వరమని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.తొలిసారి ఎమ్మెల్యే.. తొలిసారే మంత్రి.. 2023 ఎన్నికల్లో మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వాకిటి శ్రీహరి కాంగ్రెస్ అభ్యరి్థగా తొలిసారి పోటీచేసి గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన.. వెంటనే మంత్రి పదవి చేపట్టి ఘనత సాధించారు. గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి ఎల్కోటి ఎల్లారెడ్డి (మక్తల్), పి.చంద్రశేఖర్ (మహబూబ్నగర్), చిత్తరంజన్దాస్ (కల్వకుర్తి), శ్రీనివాసరావు (నాగర్కర్నూల్), పులి వీరన్న (మహబూబ్నగర్)కు ఈ అవకాశం దక్కగా.. శ్రీహరి వారి సరసన చేరడం విశేషం. కాగా, వాకిటి శ్రీహరితో పాటు ఆయన కుటుంబసభ్యులందరూ విద్యావంతులే. శ్రీహరితో పాటు ఆయన భార్య, ఆయన తమ్ముడు, మరదలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రజాసేవలోనే ఉన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి.. మక్తల్ పట్టణం నేతాజీ నగర్కు చెందిన వాకిటి శ్రీహరిది తొలుత వ్యవసాయ కుటుంబం కాగా.. కాంగ్రెస్లో చేరి క్రమక్రమంగా రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్తో పాటు పార్టీలో మండల, ఉమ్మడి జిల్లా, విభజన అనంతరం నారాయణపేట జిల్లాలో వివిధ హోదాల్లో సేవలందించారు. వాకిటి శ్రీహరి తల్లి రాములమ్మ స్టాఫ్ నర్స్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. స్థానికంగా వేలాది మంది నిరుపేద మహిళలకు ఉచితంగా కాన్పులు చేసి రాములమ్మ సిస్టర్గా పేరు సాధించారు. తండ్రి వాకిటి నరసింహులు వ్యవసాయంతో పాటు చిన్నపాటి కాంట్రాక్టర్గా పనిచేశారు. వీరికి మొత్తం ఆరుగురు సంతానం కాగా.. నాలుగో కాన్పులో శ్రీహరి జని్మంచారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్న ఆయన డిగ్రీ (బీఏ) దాకా విద్యాభ్యాసం కొనసాగించారు. 1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన మక్తల్ సర్పంచ్గా, జెడ్పీటీసీ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా సామాజిక సమీకరణాల్లో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గంలోకి తీసుకుంది. మంత్రి శ్రీహరిని సన్మానించిన ఎమ్మెల్యే యెన్నం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మక్తల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరిని ఆదివారం మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్, నాయకులు బెక్కరి మధుసూదన్రెడ్డి, ముకుందం రమేష్ పాల్గొన్నారు. విధేయత.. సామాజిక సమీకరణాలు.. వాకిటి శ్రీహరి విద్యార్థి దశలో యూత్ కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి ఆ పారీ్టలోనే కొనసాగారు. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయుడిగా ముద్రపడిన ఆయనకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో మంచి సాన్నిహిత్యం ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. దీంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన క్రమంలో మంత్రివర్గంలో బీసీలకు, అందులోనూ ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారికి చోటు కలి్పంచాలన్న డిమాండ్ పెరిగింది. లోక్సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ సైతం ముదిరాజ్కు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన ఎమ్మెల్యేలలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే శ్రీహరి ఒక్కరే కాగా.. విధేయత, సామాజిక సమీకరణాలు ఆయనకు కలిసి వచ్చాయని.. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.రాజకీయ నేపథ్యం.. వాకిటి శ్రీహరి 1990 నుంచి 1993 వరకు ఎన్ఎస్యూఐ మక్తల్ మండల ప్రెసిడెంట్గా.. 1993–1996 వరకు యూత్ కాంగ్రెస్ మక్తల్ మండల అధ్యక్షుడిగా.. 1996 నుంచి 2001 వరకు మక్తల్ మండల కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. 2001–2006 వరకు మక్తల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అత్యధిక మెజార్టీ సాధించి రికార్డుల్లోకెక్కారు. 2001–2006 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. 2006 నుంచి 2011 వరకు వాకిటీ శ్రీహరి సతీమణి వాకిటి లలిత దాసర్పల్లి ఎంపీటీసీ సభ్యురాలిగా ఉన్నారు. 2006 నుంచి 2011 వరకు ఆమె కాంగ్రెస్ మక్తల్ మండల అధ్యక్షురాలిగా పనిచేశారు. 2006 నుంచి 2012 వరకు వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి మక్తల్ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్గా.. 2006 నుంచి 2014 వరకు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 2014 నుంచి 2018 వరకు వాకిటి శ్రీహరి మక్తల్ జెడ్పీటీసీ సభ్యుడిగా సేవలందించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే రెండో మెజార్టీ స్థానంలో నిలిచారు. 2014 నుంచి 2018 వరకు కాంగ్రెస్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా.. 2014 నుంచి 2018 వరకు మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2018 నుంచి వాకిటి శ్రీహరి కృష్ణా జలాల పరిరక్షణ సమితి సభ్యుడిగా ఉన్నారు. పరిగి ఎమ్మెల్యే రాంమోహన్రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డితో కలిసి పనిచేశారు. 2019లో వాకిటి శ్రీహరి సోదరుడి భార్య రాధిక మక్తల్ మున్సిపాలిటీ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. 2022 సెపె్టంబర్ 03 నుంచి 2024 ఫిబ్రవరి వరకు నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి.. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డిపై 17,525 ఓట్లతో గెలుపొందారు. తాజాగా రెండో దఫాలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కేబినెట్లో చోటుదక్కించుకున్నారు. -
ఢిల్లీకి రేవంత్.. మంత్రుల శాఖలు ఫిక్స్!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. ఈ సందర్భంగా కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులపై హైకమాండ్తో చర్చించనున్నారు.వివరాల ప్రకారం.. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 10.20 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ క్రమంలో మంత్రులకు శాఖల కేటాయింపులపై పార్టీ హైకమాండ్తో చర్చలు జరపనున్నారు. అలాగే, పార్టీ కార్యవర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు.. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ బహిరంగ సభలు పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సభల తేదీలను ఫైనల్ చేయనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. కొత్త మంత్రులకు ఏయే శాఖలు కేటాయిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్రెడ్డి తన వద్ద ఉన్న శాఖల నుంచే కొన్ని శాఖలను కేటాయిస్తారా? లేక ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను ప్రక్షాళన చేస్తారా చూడాలి. అయితే.. ఇప్పుడిప్పుడే పాలన కుదురుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి శాఖల ప్రక్షాళన వరకు వెళ్లే అవకాశం లేదని, తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు విభజించే యోచనలో సీఎం ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి సీఎం రేవంత్రెడ్డి వద్ద సాధారణ పరిపాలన శాఖతోపాటు హోం, విద్య, మున్సిపల్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశుసంవర్థకం, మైనింగ్ తదితర శాఖలున్నాయి.ఇందులో మున్సిపల్ శాఖను రెండుగా విభజించి ఒకటి తన వద్దనే ఉంచుకొని, మరోటి ఇచ్చే అవకాశాలున్నాయి. ఇక, విద్యాశాఖను ఎవ్వరికీ ఇవ్వబోనని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమావేశంలో సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ముగ్గురూ తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే కావడంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్, ఇతర కీలక కేసులున్న నేపథ్యంలో ప్రాధాన్యమైన హోంశాఖను వారికి అప్పగించకపోవచ్చనే చర్చ జరుగుతోంది. కార్మిక, పశుసంవర్థకం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం, మైనింగ్ శాఖలను కొత్త మంత్రులకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. కొత్తగా మంత్రుల కోసం సచివాలయంలో ఫ్లోర్లు, చాంబర్ల కేటాయింపు అనంతరం ఒకట్రెండు రోజుల్లో కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం అమలుకు ప్రాధాన్యం ఇచ్చింది. సుదీర్ఘకాలం తర్వాత పూర్తిగా ఎస్సీ, బీసీలతో మంత్రివర్గ విస్తరణ పూర్తిచేసింది. సీఎం కాకుండా.. కొత్తగా చేరిన ముగ్గురితో కలిపి మొత్తం 14 మంది మంత్రులలో 57 శాతం(8 మంది) ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. మొత్తం 14 మందిలో ఓసీలు ఆరుగురు, ఎస్సీలు 4, బీసీలు ముగ్గురు, ఎస్టీ ఒకరు ఉన్నారు. కొత్తగా ప్రమాణం చేసిన వారిలో ఇద్దరు ఎస్సీలు. అడ్లూరి లక్ష్మణ్.. మాదిగ, గడ్డం వివేక్.. మాల సామాజికవర్గానికి చెందిన వారు కాగా వాకిటి శ్రీహరి బీసీల్లో అత్యధిక జనాభా గల ముదిరాజ్ వర్గీయుడు. -
అదే కాంగ్రెస్ ప్రారబ్ధం!
శశి థరూర్ను కాంగ్రెస్ గొప్ప సొత్తుగా భావిస్తుందని అను కున్నా. పార్టీకున్న అత్యంత విలు వైన సభ్యులలో ఒకరిగా,తామెంతో గర్వించదగిన వ్యక్తిగా ఆయన్ను గౌరవిస్తుందని భావించా. కానీ, పార్టీ ఆయనను ఒక ద్రోహిగా పరిగణిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక తిరుగుబాటు దారునిగా, కట్టు బాటు తప్పిన వ్యక్తిగా చూస్తోంది. నాయకత్వం థరూర్ పట్ల ముభావంగా, అంటీ ముట్టనట్లుగా ఉండటమే కాదు, అసలు ఆయన పొడ గిట్టనదిగా వ్యవహ రిస్తున్నట్లు కనిపిస్తోంది. అది అసూయతోనా? అభద్రతా భావంతోనా? లేక శత్రు త్వంతోనా? అనేక మంది కాంగ్రెస్ నాయకులకు అనేక స్థాయిలలో శశి ఎసరుపెట్టగలిగిన వ్యక్తిగా ఉన్నారనడంలో నాకెలాంటి సందేహమూ లేదు. శశిలో కనిపించే అధునా తనత్వం, వాక్పటిమ లేనివారు ఆయన్ని చూసి అసూయ పడవచ్చు. సొంతంగా విజయం సాధించగలగడంపైన కానీ, అర్హతలపైన కానీ నమ్మకం లేనివారు అభద్రతా భావానికి లోనవడం కూడా సహజం. శశికున్నంత ప్రతిభ, ప్రాచుర్యం తమకూ ఉన్నాయని, తాము ఆయనకు ఏమీ తీసిపోమని భావించేవారు ఆయనను ఒక ప్రత్యర్థిగా భావించవచ్చు. ఆ మూడు రకాలవారూ శశిని పార్టీ నుంచి బయటకు గెంటే యలేకపోయినా, ఆయన ప్రాబల్యాన్ని, స్థాయిని తగ్గించా లని బలంగా కోరుకుంటున్నారు. రాజకీయాల్లో ఇదంతా అనివార్యమేనని మీరు అను కోవచ్చు. మనం తరచూ చూస్తున్న తెరచాటు, వంచనా యుత రాజకీయాల్లో ఇది మామూలేనని అనుకోవచ్చు. ఇతర పార్టీలలోని యువ ప్రతిభావంతులను ఆ పార్టీలలోని సహ చరులు సమానంగా చూస్తున్నారు. కనీసం, వారిని కించ పరచే మార్గాలను అనుసరించడం లేదు. సగటు మానవులు, తమను మించి ఎదిగిపోగలరని భావించినవారిని చూసి సహించలేరు. అందులోనూ, రాజకీయ నాయకుల విషయంలో అది మరింత వాస్తవం. నేను దానితో విభేదించడం లేదు. దానిని అర్థం చేసుకోగలను. శశిలోని ఆత్మవిశ్వాసపు చిరునవ్వు, అతిశయం... మిగిలిన నాయకులకు చాలా కాలంగా కంటగింపుగా ఉండవచ్చు. లోలోపల కోపంతో రగిలిపోతూ ఉండవచ్చు. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా, ఆయన చాలా మంది శత్రువులను పోగేసుకున్నారు. కానీ, భారత దేశపు వాణిని వినిపించేందుకు శశి విదే శాలలో ఉన్నప్పుడు, అదీ ఆయనకు అప్పగించిన బాధ్యత లను అద్భుతంగా నిర్వహిస్తున్నప్పుడు ఆడిపోసుకోవడమే అర్థం కాకుండా ఉంది. ఆయనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం, విలన్గా చిత్రించడమే విస్మయం కలిగిస్తోంది. ఇది ఆత్మవినాశనాన్ని కొనితెచ్చుకోవడమే అవు తుంది. అటు కాంగ్రెస్ పార్టీ గానీ, ఇటు ఆ పార్టీలోని కొందరు వ్యక్తులు గానీ దానివల్ల సంతరించుకున్న ప్రతిష్ఠ ఏమీ లేదు. పైగా, వారు సంకుచిత మనస్కులుగా, స్ఫూర్తిని ప్రదర్శించలేని వారుగా, ఇంకా చెప్పాలంటే బుద్ధిలేని వారుగా ముద్రను మూట గట్టుకుంటున్నారు. పాకిస్తానీ తండాలు ఉగ్రదాడులకు పాల్పడినపుడు, ప్రతిగా గతంలోనూ భారత్ నియంత్రణ రేఖను దాటిన దృష్టాంతాలు ఉన్నప్పటికీ, అనుకోకుండానో లేదా ఉద్దేశపూర్వకంగానో శశి వాటిని మరచిపోవడమో లేదా పట్టించుకోకపోవడమో చేసి నప్పటికీ, ఇది ఆయనపై విమర్శలకు దిగడానికి మాత్రం సరైన సమయం కాదు. ఇది శశిని సరిదిద్దవలసిన సందర్భం అంతకంటే కాదు. శశి విదేశాల్లో ఉన్నప్పుడు, ప్రజా బాహుళ్యం మధ్య లేనపుడు చేయవలసిన పని కాదు. శశి మన దేశ ప్రజలకు ప్రశంసలను, అభినందనలను గడించి పెడుతున్న సమయంలో చేయాల్సిన పని అస్సలు కాదు. ఆ మూడింటి దృష్ట్యానూ ఈ సమయంలో ఆయనపై విమర్శ లకు దిగడం ఆత్మహత్యా సదృశమే అవుతుంది. మరొకటి, శశిపై ఇపుడు చేస్తున్న విమర్శలకు దేశ పౌరుల నుంచి వత్తాసు లభించడం లేదు. ఇపుడే కాదు, శశిపై అటువంటి ప్రయత్నాలు ఎన్నటికీ ఫలించకపోవచ్చు. ప్రజలు కూడా స్వాగతిస్తారని, సానుకూలంగా స్పందిస్తారని గట్టిగా భావించినపుడు మాత్రమే చతురత కలిగిన ఏ రాజకీయ పార్టీ అయినా బహిరంగంగా ఆయనను మందలించే ప్రయత్నం చేయవచ్చు. ఈసారి పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. కాంగ్రెస్ తనను తాను నవ్వులపాలు చేసుకుంది. శశిని కొనియాడేవారు ఇదివరకే కోకొల్లలుగా ఉన్నారు. ఇపుడు అభినందన చందనాలు ఆయనకు ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడ్డాయి. ప్రత్యర్థులను సున్నాలో ఉంచి, ఆయన మ్యాచ్ గెలిచే స్థితిలో ఉన్నారు. నిజానికి, కాంగ్రెస్ ప్రతిష్ఠను మూటగట్టుకునేందుకు ఇది బంగారం లాంటి అవకాశాన్ని తెచ్చిపెట్టింది. దాన్ని చేజేతులా పాడుచేసుకుని కాంగ్రెస్ దోషిలా నిలిచే సంకటంలో పడింది. కాంగ్రెస్ శాంతంగా, ఆవేశరహితంగా ఆలోచించుకుని ఉంటే, వ్యూహాత్మకంగా, యుక్తితో వ్యవహ రిస్తూ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేయగలిగిన, దెప్పిపొడుస్తూ కవ్వించగలిగిన స్థితిలో ఉండగలిగేది. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. కొంత మాయోపాయాన్ని ప్రదర్శిస్తూ అయినా గడసరిగా వ్యవహరించి ఉండవలసింది. శశిని ఆడిపోసుకునే బదులు బాహాటంగా ప్రశంసించి ఉండవలసింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా పత్రికా సమా వేశాన్ని ఏర్పాటు చేసి, ‘చూడండి! శశి థరూర్ వంటి కాంగ్రెస్ ఎంపీలు దేశ సేవకు నిస్వార్థంగా ఎలా తరలివెళుతున్నారో! కాంగ్రెస్ నాయకుల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని ఇది నిరూపిస్తోంది. వారు లేనిదే, భారతదేశ అవసరాలు తీరేవా?’ అని చెప్పుకొని ఉండాల్సింది. ఆ విధంగా, కాంగ్రెస్ తన భుజాన్ని తానే తట్టుకుని ఉండాల్సింది. దాన్ని ఎవరూ తప్పు పట్టేవారు కాదు. పైగా, చాలా మంది ప్రజలు సంతోషంగా దానికి సమ్మతి తెలిపేవారు. కాంగ్రెస్ మరో అడుగు ముందుకు వేసి, ‘మాతో సరిపోల్చదగినవారు బీజేపీలో ఎవరూ లేరు. భారత్ గొంతు కను వినిపించాలంటే, కాంగ్రెస్ గొంతుకల వల్లనే అవుతుంది. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన దేశమైన అమె రికాకి, ఈ కారణంగానే ఒక కాంగ్రెస్ నాయకుని నేతృత్వంలో ప్రతినిధి బృందం వెళ్ళింది’ అని కూడా ఘనంగా చాటుకుని ఉండవచ్చు. నా ఈ మాటల్లో కొంత అతిశయోక్తి ఉండవచ్చు. కానీ, నేను చెప్పదలచుకున్న సంగతికి అదొక్కటే మార్గం. ఇది ఖ్యాతిని దక్కించుకోవలసిన సమయం. అదీ స్నేహపూర్వక మైన మార్గాల్లో ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ పైచేయి సాధించి ఉండవచ్చు. కానీ, శశి మీద వ్యతిరేకతతో అందివచ్చిన అవకాశాన్ని అది కాలరాసుకుంది. దీన్ని అంతకంటే ఎలా భావించగలం? అదే కాంగ్రెస్ ప్రారబ్ధం!కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అసంతృప్తులు.. బుజ్జగింపులు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కని నేతల్లో పార్టీ పట్ల అసంతృప్తికి తావివ్వకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, ఇన్చార్జ్ సెక్రటరీలు విశ్వనాథన్, విష్ణునాథ్ సహా రాష్ట్ర నేతలకు సూచనలు చేసింది. అసంతృప్త నేతలతో నేరుగా మాట్లాడాలని చెప్పింది. ఈ మేరకు ఆదివారం మీనాక్షి నటరాజన్కు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్లో మాట్లాడి కీలక సూచనలు చేశారు. భవిష్యత్లో కచ్చితంగా అవకాశాలు దక్కుతాయనే భరోసా ఇవ్వాలని సూచించారు. అవసరమైతే అసంతృప్త నేతలను ఢిల్లీకి తీసుకురావాలని సైతం సూచించినట్టు సమాచారం. రాష్ట్రంలో అసంతృప్తులు చల్లారే వరకు ఇన్చార్జ్తో సహా సెక్రటరీలు హైదరాబాద్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు.దీంతో మంత్రి పదవి ఆశించి..విస్తరణలో చోటు దక్కని నేతలను బుజ్జగించే పని ఆదివారం ఉదయమే ప్రారంభమైంది. కేబినెట్లో చోటు దక్కిన వారి పేర్లు బయటకు వచ్చిన అరగంటలోపే టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్గౌడ్ అప్రమత్తమయ్యారు. అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ను తీసుకొని ఆయన ముఖ్య నేతల ఇళ్లకు వెళ్లి వారిని బుజ్జగించారు. నిజామాబాద్ సీనియర్ నేత పి.సుదర్శన్రెడ్డి, ఆదిలాబాద్కు చెందిన ప్రేమ్సాగర్రావు, రంగారెడ్డి జిల్లా నేత మల్రెడ్డిలను వారి నివాసాలకు వెళ్లి కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణల నేపథ్యంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, భవిష్యత్లో వచ్చే అవకాశాల్లో కచ్చితంగా ప్రాధాన్యం ఇస్తామని వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ⇒ సుదర్శన్రెడ్డితో అర గంటకుపైగా మీనాక్షి, మహేశ్గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీ అనిల్కుమార్యాదవ్లు కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన ఆవేదనను సుదర్శన్రెడ్డి వెలిబుచ్చగా, మరోమారు తప్పకుండా అవకాశం ఇస్తామని మీనాక్షి చెప్పినట్టు తెలిసింది. ⇒ ఆ తర్వాత ప్రేమ్సాగర్రావు నివాసంలో మీనాక్షి, మహేశ్గౌడ్లు గంటకు పైగా చర్చలు జరిపారు. గత కొన్ని దశాబ్దాలుగా పారీ్టకి తాను చేస్తున్న సేవలను వివరించిన ప్రేమ్సాగర్రావు.. అకారణంగా తనను పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ⇒ రంగారెడ్డి జిల్లా నేత మల్రెడ్డి రంగారెడ్డి కూడా తనకు మంత్రి పదవి రాకపోవడానికి సామాజిక సమీకరణలే కారణమయితే తాను రాజీనామా చేస్తానని, తన స్థానంలో ఎవరినైనా గెలిపించి వారికైనా మంత్రిపదవి ఇవ్వా లని కోరినట్టు సమాచారం. రాష్ట్రంలోనే 42 శాతం జనాభా కలిగిన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలాకు మంత్రి వర్గంలో స్థానం కల్పించక పోవడాన్ని మల్రెడ్డి ప్రశి్నంచారు. గతంలో అరుగురు మంత్రులు ఈ జిల్లాల్లో పనిచేసినట్లు వెల్లడించారు. ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం పడొచ్చని మల్రెడ్డి వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ వారంలోనే కార్యవర్గంమంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చినందున టీపీసీసీ పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఈ వారంలోనే ప్రకటించే అవకాశాలున్నాయి. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, 35 మంది వైస్ ప్రెసిడెంట్లు, 75 మంది ప్రధాన కార్యదర్శులతో కార్యవర్గాన్ని మొదట ప్రకటించి, తర్వాత జిల్లాల అధ్యక్షుల పేర్లు ప్రకటిస్తారు. దొరకని రాజగోపాల్ సుదర్శన్రెడ్డితో బుజ్జగింపుల అనంతరం నేరుగా రాజ గోపాల్రెడ్డి ఇంటికి వెళ్లాలని మీనాక్షి, మహేశ్గౌడ్లు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఇద్దరు నేతలు ఆ తర్వాత కూడా రాజగోపాల్ అందుబాటులోకి రాకపోవడంతో ప్రేమ్సాగర్రావు ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి రాజగోపాల్ ఇంటికి వెళ్దామనుకున్నా రాత్రి వరకు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. -
సామాజిక న్యాయానికే పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సామాజిక న్యాయానికే పెద్దపీట వేసింది. ఇప్పటికే ఉన్న కేబినెట్ కూర్పును బేరీజు వేసుకొని మరీ సామాజిక న్యాయం కల్పించామనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లేలా మంత్రులను ఎంపిక చేసింది. ఇద్దరు ఎస్సీ, ఒక బీసీ నాయకుడికి మాత్రమే విస్తరణలో అవకాశం కల్పించింది. విస్తరణకు ముందు రాష్ట్ర కేబినెట్లో ఉన్న 12 మంది మంత్రుల్లో (ముఖ్యమంత్రితో సహా) నలుగురు రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఏడుగురు అగ్రవర్ణాలకు చెందిన మంత్రులున్నారు.వీరితోపాటు ఇద్దరు బీసీ, ఇద్దరు ఎస్సీ, ఒక ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారు కేబినెట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో ముగ్గురు బీసీ, ఎస్సీ నేతలకు కేబినెట్లో అవకాశం కల్పించింది. దీంతో ప్రస్తుతం కేబినెట్లోని 15 మంది సభ్యు ల్లో అగ్రవర్ణాల కంటే అధికంగా 8 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకు స్థానం కల్పించినట్టయ్యింది. ఓసీ నేతలను ఏడుగురికి మాత్రమే పరిమితం చేసింది. కేబినెట్లో ఓసీల కంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులను ఎక్కువ మందికి అవకాశం కల్పించడం ద్వారా సగానికిపైగా ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతలుండేలా జాగ్రత్త తీసుకుందని స్పష్టమవుతోంది.గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, సీఎం రేవంత్రెడ్డిలతో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వాకిట శ్రీహరి, సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, భట్టి విక్రమార్క, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఇందుకోసం రెడ్డి సామాజిక వర్గాల నేతల్లో మంత్రి పదవులు చేపట్టేందుకు అర్హులైన సుదర్శన్రెడ్డి, రాజగోపాల్రెడ్డి, వెలమ వర్గానికి చెందిన ప్రేమ్సాగర్రావు లాంటి నేతలను కూడా పట్టించుకోలేదు. ఇదే క్రమంలో సుదర్శన్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్, ప్రేమ్సాగర్రావుకు అవకాశం ఇవ్వాలన్న డిప్యూటీ సీఎం భట్టిల విజ్ఞప్తులు, మంత్రి పదవి ఇస్తామని అటు అసెంబ్లీ, ఇటు లోక్సభ ఎన్నికలకు ముందు రాజగోపాల్రెడ్డికి ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ అధిష్టానం పక్కన పెట్టడం గమనార్హం. కీలక పదవులూ వారికే మంత్రివర్గం సంగతి అటుంచితే.. అసెంబ్లీలో మిగిలిన పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకే ప్రాధాన్యం లభించింది. అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్కుమార్ (ఎస్సీ) ఉండగా ఎస్టీ (లంబాడా) వర్గానికి చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్కు డిప్యూటీ స్పీకర్గా అవకాశం కల్పించనుంది. ప్రస్తుతం విప్గా ఉన్న అడ్లూరి లక్ష్మణ్కుమార్ (ఎస్సీ)కి మంత్రివర్గంలో అవకాశం కల్పించగా, మిగిలిన ఇద్దరు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్యలు బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారే. ఈ నేపథ్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్థానంలో ఖాళీ అయిన విప్తోపాటు చీఫ్ విప్ పదవులు మాత్రమే అగ్రవర్ణాలకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.లేదంటే అడ్లూరి లక్ష్మణ్ స్థానాన్ని మరోమారు ఎస్సీ నేతతో భర్తీ చేస్తే..ఒక్క చీఫ్ విప్ మాత్రమే రెడ్డి సామాజికవర్గానికి వస్తుంది. ఈ పదవిని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డిలలో ఒకరిని వరించే అవకాశాలున్నాయి. స్థానిక ఎన్నికల అనంతరం మరోమారు కేబినెట్ విస్తరణ ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆదివారం జరిగిన విస్తరణ అనంతరం కేబినెట్లో నియమించుకునేందుకు వీలున్న మూడు స్థానాలను అప్పుడు భర్తీ చేయొచ్చు.అప్పుడు కూడా కేవలం ఒక్కటి మాత్రమే అగ్రవర్ణాలకు వస్తుందని, ఒకటి బీసీ, మరోటి ఎస్టీ లేదా మైనార్టీ సామాజికవర్గాలకు కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద తాజా విస్తరణ తరహాలోనే భవిష్యత్లో జరిగే విస్తరణలోనూ అగ్రవర్ణాలతో పోలిస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలకే ప్రాధాన్యం ఇవ్వాలని, అగ్రవర్ణాలకు ఇతర పదవులు కేటాయించాలనే యోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టు అర్థమవుతోంది. -
కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
-
కాంగ్రెస్లో ‘కేబినెట్ బెర్త్’ హీట్.. ముగ్గురు అసంతృప్తి నేతల దారెటు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణ వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి పదవి ఆశించి భంగపడిన నేతలు.. హైకమాండ్ నిర్ణయంపై ఆగ్రహంతో ఉన్నారు. కేబినెట్ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించే ప్రయత్నాల్లో పార్టీ సీనియర్ నేతలు బిజీ అయ్యారు.తాజాగా కాంగ్రెస్ పార్టీలో బుజ్జగింపుల పర్వం మొదలైంది. ముఖ్యంగా నిజామాబాద్కు చెందిన సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులు తమకు కేబినెట్లో స్థానం ఉంటుందని ఆశించారు. ఇదే విషయాన్ని తరచూ అనుచరులు, కార్యకర్తలతో చెప్పుకుంటూ వచ్చారు. చివరకు అనూహ్యంగా వారికి అధిష్టానం మొండిచేయి చూపడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగారు.ఇద్దరు నేతలు ఎక్కడ?తాజాగా సుదర్శన్ రెడ్డి ఇంటికి తెలంగాణ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేరుకున్నారు. మరో సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్సాగర్ రావుతో కూడా పార్టీ నేతలు భేటీ కానున్నారు. అయితే, ప్రేమ్సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి మాత్రం అందుబాటులో లేకపోవడంతో హస్తం పార్టీలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ క్రమంలో వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ నడుస్తోంది. ఇక, మరో కాంగ్రెస్ సీనియర్ నేత మల్రెడ్డి రంగారెడ్డి సైతం మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్టు స్పష్టం చేశారు. మరో నేత బీర్ల ఐలయ్య సైతం.. హైకమాండ్పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. రోజంతా ఉత్కంఠ..రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశం శనివారం రోజంతా చర్చనీయాంశమైంది. మాదిగ సామాజికవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లేదా కవ్వంపల్లి సత్యనారాయణకు అవకాశం లభించవచ్చని చర్చల మధ్య అడ్లూరి స్థానం దక్కింది. ఇక, రెడ్డి సామాజికవర్గానికి ఈసారి విస్తరణలో అవకాశం లేదనే చర్చ మొదటి నుంచి జరిగింది. ఒకవేళ లభిస్తే మాత్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత పి.సుదర్శన్ రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నాయనే వార్తలు చక్కర్లు కొట్టాయి. మరోవైపు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అనే చర్చ ఎక్కడా జరగలేదని తెలుస్తోంది. ప్రస్తుతం కేబినెట్లో ఖాళీగా ఉన్న ఆరు బెర్తులకు గాను మూడు స్థానాలు పూర్తి అయ్యాయి. -
తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ముగ్గురి పేర్లు ఫైనల్
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. కేబినెట్లో ఖాళీగా ఉన్న ఆరు బెర్తులకు గాను మూడు లేదా నాలుగు బెర్తులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త మంత్రులు ఆదివారం మధ్యాహ్నం 12:19 గంటలకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నారు.కొత్త మంత్రులుగా వాకిటి శ్రీహరి ముదిరాజ్ (మక్తల్), గడ్డం వివేక్ (చెన్నూరు), అడ్లూరి లక్ష్మణ్ పేర్లు ఖరారయ్యాయి. ముగ్గురు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. ఇక, ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి వివేక్ పేరు ఖరారు చేయగా.. మాదిగ సామాజికవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు అవకాశం లభించింది. బీసీ ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరికి అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో ముగ్గురు ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి ,వివేక్ ,అడ్లూరి లక్ష్మణ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ముగ్గురు నేతలకు శుభాకాంక్షలు తెలిపారు.మరోవైపు.. హైదరాబాద్ రాజ్భవన్లో ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్భవన్ దర్బార్ హాల్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.. కొత్త మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇప్పటికే గవర్నర్ కార్యాలయానికి సమాచారం అందించిన ప్రభుత్వం. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్న సాధారణ పరిపాలన శాఖ అధికారులు. ఆదివారం ఉదయమే ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, ప్రోటోకాల్ అధికారులు రాజ్భవన్ చేరుకున్నారు. హైకమాండ్ కసరత్తు..ఇక, మంత్రి వర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిల పేర్లు మొదటి నుంచీ వినిపించినా ప్రస్తుతానికి ఎస్సీ, బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్ఠానం చెప్పినట్లు తెలిసింది. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి అవకాశం ఇస్తే ఆయన సోదరుడు, మంత్రి వెంకట్రెడ్డిని కూడా కొనసాగించడం కష్టమని, ఇద్దరిలో ఒకరికి మాత్రమే చోటు కల్పించాల్సి ఉంటుందని అధిష్ఠానం స్పష్టంచేయడంతో ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కనపెట్టినట్లు తెలిసింది.చర్చల అనంతరం..గతంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్లతో కాంగ్రెస్ అధిష్ఠానం చర్చించింది. అందరి అభిప్రాయాలు విన్న తర్వాత ఎవరెవరికి చోటు కల్పించాలో నిర్ణయం చెబుతామన్న అధిష్ఠానం శనివారం తన అభిప్రాయాన్ని తెలిపినట్లు సమాచారం. అనంతరం పార్టీకి సంబంధించిన పలువురు నాయకులతో ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలిసింది. నాలుగో పేరును ప్రస్తుతానికి పక్కనపెట్టి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముగ్గురికి అవకాశం కల్పిస్తే మరో మూడు స్థానాలు ఖాళీగా ఉంటాయి. వీటితోపాటు చీఫ్ విప్ పదవి భర్తీకి కూడా కసరత్తు సాగుతోంది. బీసీల నుంచి ఆది శ్రీనివాస్ ప్రస్తుతం శాసనసభలో విప్గా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరూ లేనందున వికారాబాద్ ఎమ్మెల్యే, సభాపతి ప్రసాద్కుమార్ను మంత్రివర్గంలోకి తీసుకుని అదే సామాజికవర్గానికి చెందిన మరొకరికి సభాపతి పదవి ఇస్తే ఎలా ఉంటుందనే అంశం కూడా పార్టీ పరిశీలనలో ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. -
పాలమూరు ఎవరికి వారు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ నేతలు పోట్ల గిత్తల్లా తలపడుతున్నారు. ఇతర పార్టీల నుంచి వచి్చన వారితో కుదురుకోలేక కొందరు, ఇతర పార్టీల నేత లను ప్రోత్సహిస్తూ మరికొందరు, పార్టీలోని వారితో కలిమి లేక ఇంకొందరు, గొంతెమ్మ కోర్కెలతో ఇంకా కొందరు ఎవరికి వారే వివాదాస్పదమవుతున్నారు. ఈ గ్రూపు గొడవలు, గట్టు పంచాయతీలు తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ నిర్వహించిన లోక్సభ నియోజకవర్గాల వారీ సమీక్షల్లో బట్టబయలు కావడం.. ఒకరిపై ఇంకొకరు ఫిర్యాదు చేసుకోవడం.. ఆమె ముందే వాదులాడుకోవడంలాంటి ఘటనలు సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీని సతమతం చేస్తున్నాయి. గద్వాల నుంచి ఆలంపూర్ వరకు, వనపర్తి నుంచి జడ్చర్ల వరకు అటు ఎమ్మెల్యేలు, ఇటు పార్టీ నేతలు వివాదాలకు కారణమవుతూ వీలున్నంత మేర పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు పోటీలు పడుతుండటం గమనార్హం. చాప కింద నీరులా.. చాలా కాలంగా ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ నేతలు బహిరంగ కొట్లాటలకు దిగుతున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్రెడ్డి ఏకంగా రాష్ట్రంలోని ఓ కీలక మంత్రితో పంచాయతీకి దిగారు. అప్పట్లో ఆయన నేతృత్వంలోనే కొందరు ఎమ్మె ల్యేలు డిన్నర్ భేటీ అయ్యారన్న వార్త రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. అయితే, టీకప్పులో తుపానులా ఆ వివాదం ముగిసినా, గద్వాల రాజకీయం గట్టు దాటింది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేతో ఓ ఎంపీ ఘర్షణకు దిగారన్న వార్తలు కూడా హల్చల్ చేశాయి. అక్కడి ఎమ్మెల్యేకు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి మధ్య సఖ్యత కుదర్చడం రాష్ట్ర పార్టీకి కూడా సాధ్యం కావడం లేదు. ఇద్దరూ పట్టిన పట్టు వీడకుండా పార్టీని ఇరుకున పెడుతూనే ఉన్నారనేది బహిరంగ రహస్యమే. ఇక, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మధ్య ఘర్షణ వాతావరణం నిత్యకృత్యమైందనే చర్చ జరుగుతోంది. ప్రొటోకాల్ మొదలు పార్టీ పదవుల వరకు ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే ఉంది. మహబూబ్నగర్ నియోజకవర్గంలోని పార్టీ నేతల మధ్య విభేదాలు లేకపోయినా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న దేవరకద్ర ఎమ్మెల్యే జీఎమ్మార్, స్థానిక ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్రెడ్డి మధ్య ఆధిపత్యపోరు జరుగుతోందనే చర్చ ఉంది. మక్తల్ నియోజకవర్గంలో కూడా పార్టీ నేతలు సామాజిక వర్గాల వారీగా చీలిపోయారని, ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వొద్దంటూ పోస్టర్లు కూడా వేశారని తెలుస్తోంది. అవిగో నష్టాలు... ఇవిగో ఆధారాలు నాగర్కర్నూల్ జిల్లాలో బీఆర్ఎస్ సెగ కాంగ్రెస్ను గట్టిగానే తాకుతోంది. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడం ఆ నియోజకవర్గంలో తీవ్ర విభేదాలకు దారితీస్తోంది. దీనికి తోడు తాజాగా ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడుని ఇటీవల కాంగ్రెస్ ఎంపీ మల్లురవి సత్కరించడం దుమారానికి దారి తీసింది. ఈ విషయమై ఆలంపూర్ నియోజకవర్గ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ఇతర నేతలు కలిపి 26 మంది రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశారు. నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి, మాజీ జడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్దన్రెడ్డి కలిసి అటు ఆలంపూర్లోనూ, ఇటు జోగులాంబ గద్వాల జిల్లాలోనూ పార్టీకి నష్టం చేస్తున్నారని సంతకాలు చేసి మరీ ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకులకు చెందిన పెండింగ్ బిల్లులను మంజూరు చేయించి 10 శాతం కమీషన్ తీసుకున్నారంటూ మల్లురవిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఇక, కాంగ్రెస్ కేడర్ అడుగుతున్న విధంగా ఆలంపూర్ నియోజకవర్గంలో మల్లమ్మకుంట ప్రాజెక్టును కాకుండా బీఆర్ఎస్ నేతల మాటలు విని చిన్నోనిపల్లి రిజర్వాయర్ను తెరపైకి తెచ్చి కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని కూడా ఆరోపించారు. ఈ మేరకు ఇటీవలే టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్గా నియమితులైన మల్లురవి మీదనే కాంగ్రెస్ ఇంచార్జికి లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వడం గాం«దీభవన్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. మంత్రులకు... మేం తక్కువా? పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఓ విచిత్ర డిమాండ్ను తెరపైకి తెస్తూ మంత్రివర్గాన్నే సవాల్ చేస్తున్నారు. మంత్రులకంటే తామేం తక్కువ కాదని, మంత్రుల నియోజకవర్గాలకు ఎన్ని నిధులిస్తారో అన్ని నిధులు తమ నియోజకవర్గాలకూ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రెండు దఫాలుగా వారు మీనాక్షి నటరాజన్ను కలిసి ఈమేరకు వినతిపత్రం కూడా ఇచ్చారు. మంత్రులతో సమానంగా నిధులివ్వాలని అడిగినట్లు స్వయంగా వారు మీడియాకు వెల్లడించడం గమనార్హం. గాంధీభవన్లో జరిగిన లోక్సభ నియోజకవర్గ సమీక్షలోనూ వారు ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. అదేవిధంగా పాలమూరు లోక్సభ పరిధిలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా తమకు సహకరించడం లేదంటూ వారు కొత్త రాగాన్ని అందుకోవడం గమనార్హం. ఈవిధంగా సొంత పార్టీ నేతలతో, ఇతర పార్టీల నాయకులతో, మంత్రులతో, అధికారులతో పంచాయతీలు పెట్టుకుంటూ ముందుకు సాగుతున్న ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ రాజకీయం ఎటువైపునకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే! -
ముగ్గురా? నలుగురా?
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. కేబినెట్లో ఖాళీగా ఉన్న ఆరు బెర్తులకు గాను మూడు లేదా నాలుగు బెర్తులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త మంత్రులు ఆదివారం మధ్యాహ్నం 12:15 గంటలకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కొత్త మంత్రులుగా వాకిటి శ్రీహరి ముదిరాజ్ (మక్తల్), గడ్డం వివేక్ (చెన్నూరు) పేర్లు ఖరారయ్యాయి. మాదిగ సామాజికవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లేదా కవ్వంపల్లి సత్యనారాయణకు అవకాశం లభించవచ్చని సమాచారం. అడ్లూరివైపే పార్టీ పెద్దలు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. రెడ్డి సామాజికవర్గానికి ఈసారి విస్తరణలో అవకాశం లేదనే చర్చ జరుగుతోంది. ఒకవేళ లభిస్తే మాత్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత పి.సుదర్శన్ రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నాయి. కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నారు. రోజంతా ఉత్కంఠ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశం శనివారం రోజంతా చర్చనీయాంశమైంది. ఆదివారం ఉదయమే విస్తరణ ఉంటుందని, కాదుకాదు మధ్యాహ్నం అంటూ విస్తృతంగా ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, విస్తరణపై ఏఐసీసీ కానీ, టీపీసీసీ కానీ శనివారం అర్ధరాత్రి వరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ శనివారం ఢిల్లీలోనే ఉన్నారు. అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్కు చేరుకుంటారని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. ఆదివారం ఉదయం శిల్పకళావేదికలో జరిగే హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మక«థ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ కార్యక్రమం మినహా మరో కార్యక్రమం గవర్నర్ షెడ్యూల్లో లేదని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి కూడా హాజరు కానున్నారు. దీంతో ఈ కార్యక్రమం అనంతరం రాజ్భవన్లో మధ్యాహ్నం తర్వాత కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందనే ప్రచారం జరిగింది. కానీ, సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)కి కానీ, రాజ్భవన్కు కానీ ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్ల కోసం ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో అసలు విస్తరణ ఉంటుందా? ఉండదా? ఉంటే ఎన్ని బెర్తులు భర్తీ చేస్తారన్న దానిపై ఉత్కంఠ వీడలేదు. శనివారం అర్ధరాత్రి ఈ అంశంపై స్పష్టత వచ్చింది. మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు చేయాలని జీఏడీ నుంచి గవర్నర్ కార్యాలయానికి సమాచారం అందించారు. దీంతో నేటి మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అందుబాటులో ఉండండి కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు రేగిన నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శనివారం సాయంత్రం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేలు, కాలె యాదయ్య, వేముల వీరేశంలు సీఎం రేవంత్ను కలిసి తమ సామాజిక వర్గానికి కేబినెట్లో స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన రేవంత్.. కేబినెట్ విస్తరణ ఎప్పుడైనా జరగొచ్చని, ఆదివారం ఐదుగురు హైదరాబాద్లోనే అందుబాటులో ఉండాలని సూచించారు. మరోవైపు అధిష్టానానికి తాను ప్రతిపాదనలు మాత్రమే పంపగలనని, తుది నిర్ణయం ఢిల్లీ పెద్దలదేనని ఆ ఎమ్మెల్యేలతో సీఎం చెప్పినట్టు సమాచారం. -
‘రాహుల్ జీ.. నేనూ మీలాగే పెళ్లి చేసుకోను’
పాట్నా: రాహుల్జీ రాజకీయాల్లో మీరే మాకు స్పూర్తి. నేను మీలాగే వివాహం చేసుకోకూడదనుకుంటున్నా. సమాజసేవ చేస్తా’ అంటూ ఓ యువతి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ల మధ్య జరిగిన సంభాషణ వైరల్గా మారిందిఈ ఏడాది సెప్టెంబర్ తర్వాత జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రాహుల్ గాంధీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా శనివారం బీహార్ రాష్ట్రం గయాలో పర్యటించారు. పర్యటనలో మహిళలు సైతం రాజకీయాల్లో ప్రవేశించేలా కాంగ్రెస్ మహిళా సంవాద్ అనే కార్యక్రమాన్ని తలపెట్టింది. ఆ కార్యక్రమంలో రాహుల్ గాంధీ.. మహిళలతో రాజకీయాలతో పాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా బీహార్లో పాడ్ గర్ల్గా సుపరిచితురాలైన ‘రియా పాశ్వాన్’ రాహుల్తో మాట్లాడారు. ప్రత్యేకంగా మహిళలు విద్యా రంగం తరహాలో ఇతర రంగాల్లోకి ప్రవేశించడం లేదు. మహిళల రక్షణ కోసం కాంగ్రెస్ చేపట్టిన శక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా మేం బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాం. తద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే, ఆ సమస్య పరిష్కారం కోసం మా వద్దకు వచ్చేలా తీర్చిదిద్దాం అని తెలిపారు. आज गया में Shakti Samvad कार्यक्रम के मंच से मैंने अपनी आवाज़ उठाई – महिलाओं के मुद्दे, मोहल्ले की समस्याएं, और जनता की सच्चाई को Rahul Gandhi ji के सामने रखा।मैं Riya Paswan हूं, और मैं हर ग़लत के खिलाफ खड़ी हूं। pic.twitter.com/7ymZftN8W0— Riya Kumari (@kumarir6529) June 7, 2025 అయితే, ఆమె ప్రసంగం ఆకట్టుకోవడంపై రాహుల్ స్పందించారు. మీ ప్రసంగం బాగుంది అంటూ రియా పాశ్వాన్పై ప్రశంసలు కురిపించారు. అందుకు రియా పాశ్వాన్ స్పందించింది. మీలా నేనూ పెళ్లి చేసుకోకూడదని అనుకుంటున్నాను. ప్రజా సేవ చేయాలని చెప్పడంతో సభలో నవ్వులు కురిశాయి. నాయకురాలిగా మారాలని, ప్రజల కోసం పని చేయాలని ఉంది. రాజకీయాల్లోకి రావాలని ఉంది. శక్తి అభియాన్లో భాగమయ్యాక రాజకీయాలు అంటే ఏమిటో నాకు అర్థమైంది’ అని వ్యాఖ్యానించారు.పాడ్ గర్ల్ రియా పాశ్వాన్ దీంతో ఆ బీహార్ పాడ్ గర్ల్ రియా పాశ్వాన్ ఎవరనేది చర్చాంశనీయంగా మారింది. ఎందుకంటే? ఈ పాడ్ గర్ల్ 2022లో ఓ సెన్సేషన్. 2022లో బీహార్ (Bihar) రాజధాని పాట్నాలో విద్యార్ధిని రియా పాశ్వాన్ ఐఏఎస్ అధికారిణి హర్జోత్ కౌర్ భమ్రాల మధ్య జరిగిన సంభాషణ నాడు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. రియా పాశ్వాన్ వర్సెస్ కలెక్టర్ హర్జోత్ కౌర్ భామ్రాబీహార్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ హర్జోత్ కౌర్ భామ్రా ఆ సమయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం ఎన్నో ఉచితాలను అందజేస్తోంది. అలాంటిది 20-30రూ. ఉండే శానిటరీ పాడ్స్ ఉచితంగా ఇవ్వలేదా? అని రియా పాశ్వాన్ ప్రశ్నించింది. దానికి హర్జోత్ బదులిస్తూ.. ‘‘రేపు ప్రభుత్వం ఉచితంగా జీన్ ప్యాంట్స్ పంచాలని మీరు అడుగుతారు. ఆ తర్వాత అందమైన షూస్ కావాలని అడుగుతారు. అంతెందుకు ఫ్యామిలీ ఫ్లానింగ్ పద్దతుల్లో ఒకటైన కండోమ్లు పంచమని కూడా అడుగుతారు’’ అంటూ ఆమె పేర్కొన్నారు. 🔊Girl - Can the govt give sanitary pads at ₹ 20-30?IAS Harjot Kaur Bharma - You will eventually expect the govt to give you family planning methods, condoms, too.🔊Girl - Govt comes to us for votes.IAS Kaur - This is height of stupidity. Don't vote, then. Become Pakistan pic.twitter.com/V4NKdekLuc— Samarg (@aaummh) September 28, 2022నేను భారతీయురాలిని. నేనెందుకు అలా చేస్తా ఆ వెంటనే.. ఓట్లేసి ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నాం కదా అంది ఆ విద్యార్థిని. దానికి హర్జోత్ కాస్త కటువుగానే బదులిచ్చింది. ‘‘ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట. అలా అనిపిస్తే ఓటేయకు. అప్పుడు మన దేశం పాకిస్తాన్ అవుతుంది. డబ్బు, సేవల కోసమే ఓటేస్తావా? అని ఆ విద్యార్థిని నిలదీసిందామె. దీంతో ఆ విద్యార్థిని ‘నేను భారతీయురాలిని. నేనెందుకు అలా చేస్తా’ అంటూ గట్టి సమాధానం ఇచ్చింది. ఆ వెంటనే.. అసలు ప్రభుత్వం నుంచి ప్రతీది ఎందుకు ఆశిస్తారని?.. ఆ ఆలోచనే తప్పని, సొంతంగా చేసుకునేందుకు ప్రయత్నించాలంటూ ఉచిత సలహా ఇచ్చింది హర్జోత్. అయితే ఈ వాడివేడి చర్చ ఇక్కడితోనే ఆగిపోలేదు.ఇంతలో మరో విద్యార్థిని పైకి లేచి.. ఆస్పత్రిలో టాయిలెట్ బాగోలేదని, తరచూ బాలురు కూడా వస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. దీనికి హర్జోత్ కౌర్ భామ్రా స్పందిస్తూ.. ఇంట్లో నీకు వేర్వేరుగా టాయిలెట్స్ ఉంటాయా?.. వేర్వేరు ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. ఇలా అడగడం ఎంత వరకు సమంజసం అంటూ ఎదురు ప్రశ్నించడంతో కంగు తినడం విద్యార్థిని వంతు అయ్యింది. -
ఖమ్మం జిల్లాలో మహిళా ఎస్ఐపై కాంగ్రెస్ నేత దాడి
-
హైకమాండ్ గ్రీన్ సిగ్నల్.. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈనెల 10 లోపు కేబినెట్ విస్తరణ చేసే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేబినెట్లో ఎస్సీ, బీసీ, ఓసీలకు అవకాశం ఇవ్వనుంది. ఓసి నుంచి సుదర్శన్ రెడ్డి ,బీసీ నుంచి వాకిటి శ్రీహరి ,ఎస్సీ నుంచి గడ్డం ప్రసాద్లకు మంత్రి వర్గంలోకి తీసుకోనుండగా.. ప్రస్తుతం స్పీకర్గా ఉన్న గడ్డం ప్రసాద్ స్థానంలో మరొకరికి అవకాశం కల్పించే దిశగా కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. గత కొంత కాలంగా తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఊహాగాలు ఊపందుకున్నాయి. ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా..ఇందులో నాలుగు స్థానాలను భర్తీ చేయనుందనే చర్చ జరిగింది. మైనారిటీలకు ఇవ్వాలనుకుంటే మరొకరికి అవకాశం కల్పించాల్సి ఉంది. ఇక మంత్రి పదవి రేసులో పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వారిలో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలు ఉన్నారు. ఈ అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
‘మేడిగడ్డలో రెండు పిల్లర్స్ కూలితే.. కాళేశ్వరమే కూలిపోయిందా?’
సాక్షి, తెలంగాణభవన్: రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మేడిగడ్డలో రెండు పిల్లర్స్ కూలితే కాళేశ్వరమే కూలిపోయిందని దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో బనకచర్లపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.కాళేశ్వరం ప్రాజెక్ట్లపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. ‘నీళ్లిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్పై అభాండాలు వేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ గొంతు పిసికే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క పిల్లర్ కుంగితే మేడిగడ్డ కొట్టుకుపోయినట్టుగా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి. మేము చెప్పే విషయాలు నూటికి నూరుపాళ్లు నిజం. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నారు.కాళేశ్వరం కూలిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామన్ డైలాగ్ చెబుతున్నారు. మేడిగడ్డలో 85 పిల్లర్స్ ఉంటే రెండు పిల్లర్సే కూలాయి. మేడిగడ్డలో రెండు పిల్లర్స్ కూలితే కాళేశ్వరమే కూలిపోయిందని దుష్ప్రచారం చేశారు. కానీ, బనకచర్లపై కాంగ్రెస్ నేతలు మాట్లాడటం లేదు. తెలంగాణలో కమీషన్ల పాలన సాగుతోంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.అంతకుముందు మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..‘దేశంలో ఏ మంత్రి పని చేయని విధంగా హరీష్ రావు అద్భుతంగా పనిచేశారు. తక్కువ కాలంలోనే ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత హరీష్ రావు గారిది. తెలంగాణ తెచ్చుకున్న నీళ్ళు నిధులు నియామకాలు టాగ్ లైన్ ఎప్పుడో పోయింది. నిందలు, దందాలు, చందాలు ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ పాలన. సుంకిశాల, slbc టన్నెల్ కూలినా.. కేంద్ర బృందం ఇప్పటివరకు రాలేదు. టన్నెల్ కూలిపోయి కూలీలు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.చిన్న పిల్లర్ మెడిగడ్డలో కూలితే దాన్ని రాద్దాంతం చేస్తోంది. గుజరాత్లో బ్రిడ్జ్ కూలి 140 మంది చనిపోతే.. ఏ రిపోర్ట్ ఉండదు.. బాధ్యులపై చర్యలు ఉండవు. బీహార్లో రోజుకో బ్రిడ్జి కూలిపోతే ఏ రిపోర్ట్ ఉండదు. కూలిన రెండు రోజుల్లోనే ndsa వచ్చింది.. పనికిమాలిన రిపోర్ట్ ఇచ్చింది. Ndsa రిపోర్ట్ బీజేపీ ఆఫీసులో తయారైంది. కాంగ్రెస్, బీజేపీ కుమక్కు రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ కమీషన్తో కాంగ్రెస్ కేంద్ర పార్టీ కార్యాలయం నిర్మించారు. L and T సంస్థ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించింది. అదే సంస్థ మేడిగడ్డ బ్యారేజినీ నిర్మించింది. బనకచర్లతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు మాట్లాడటం లేదు అని అన్నారు. -
కాంగ్రెస్ నేత చెంప చెళ్లుమనిపించిన మహిళా SI
-
మహిళా ఎస్ఐతో అనుచిత ప్రవర్తన.. అర్ధరాత్రి హోటల్ వద్ద ఉద్రిక్తత..
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై దాడి చేశారు. ఆమె బాడీపై చేయి వేసి పక్కకి తోసేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అనంతరం.. నిందితుడిని, అతని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వివరాల ప్రకారం.. ఖమ్మంలోని కల్లూరు ఎన్ఎస్పీలోని ఓ హోటల్ వద్ద తల్లాడ మండలానికి చెందిన కాంగ్రెస్ నేతలకు, హోటల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో కల్లూరు ఎస్ఐ హరిత.. హోటల్ వద్దకు చేరుకున్నారు. ఇరు వర్గాలకు ఆమె.. సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు.కాంగ్రెస్ నాయకుడు రాము.. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ హరిత పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. మహిళా అని కూడా చూడకుండా ఆమె భుజాన్ని బలంగా నెట్టివేశారు. దీంతో, అక్కడి ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఎస్ఐపై దాడి చేసిన రాముతో పాటుగా అతడి అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. -
పదేళ్లు పగ్గాలివ్వండి
సాక్షి, యాదాద్రి: కాంగ్రెస్ పార్టీకి పదేళ్లు పాలించే అధికారం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. తెలంగాణను అన్నివిధాలా అభివృద్ధి చేసి తీరుతామని ఆయన చెప్పారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొడతానని ఆనాడు తొడగొట్టి చెప్పి పట్టు పట్టినం.. పడగొట్టినం. ఇవాళ ముఖ్యమంత్రిగా మీ ముందున్నా. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే నా కర్తవ్యం’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిర్మలాపురంలో రూ. 1,051.45 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రధానంగా రూ. 574.56 కోట్లతో గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం, రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, రూ. 183 కోట్లతో మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపనతోపాటు మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేపట్టారు. అనంతరం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అధ్యక్షతన తిర్మలాపురంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన–ప్రగతిబాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.దేశంలో ఎవరూ చేయని విధంగా కులగణన ద్వారా బీసీల లెక్క తేల్చి 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం చేశామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కులగణన చేసే అనివార్యతను కల్పించామన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసి దశాబ్దాల కలను నెరవేర్చామని చెప్పారు. మోత్కుపల్లి నర్సింహులు లాంటీ సీనియర్ నేత ఎస్సీ వర్గీకరణపై తనను అభినందించారని సీఎం చెప్పారు.గత ప్రభుత్వం గంధమల్ల, మూసీ కాలువల ఆధునీకరణ, ఎస్ఎల్బీసీ, డిండి వంటి ఉమ్మడి నల్లగొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్ నిలదీశారు. గంధమల్లకు నీళ్లు ఎలా ఇస్తారని కొందరు అడుగుతున్నారని.. నిధులిచి్చన తమకు గంధమల్లకు నీళ్లు ఎలా ఇవ్వాలో తెలియదా? అని సీఎం బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. గోదావరి జలాలను అందించడానికి ఎస్సారెస్పీ, మిడ్ మానేరు కట్టింది కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాదా అని ఆయన అడిగారు. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ప్రభుత్వం ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలను కోటీశ్వరులను చేసే బృహత్తర కార్యక్రమం చేపట్టిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. మహిళా సంఘాలకు రూ. 21 వేల కోట్ల మేర బ్యాంకు లింకేజీ రుణాలతోపాటు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో పాఠశాలల నిర్వహణను ఆడబిడ్డల చేతిలో పెట్టామన్నారు. ప్రజాపాలనలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాసంక్షేమమే «ధ్యేయంగా పనిచేస్తున్నామని రేవంత్ వివరించారు. తిరుమల తరహాలో త్వరలో యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మేం మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా? ‘బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారు. గతేడాది నవంబర్ 8న పాదయాత్ర చేసి మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరతామని మాట ఇచ్చా. ఎవరు అడ్డుపడినా మూసీ నదిని పునరుజ్జీవం చేసి తీరుతాం. ప్రధాని మోదీ సబర్మతి, యమునా నదుల ప్రక్షాళన, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ గంగానది ప్రక్షాళన చేసుకోవచ్చుగానీ మేం మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా?’అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. వాసాలమర్రిని బాగుచేస్తా.. కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌస్కు రోడ్డు వేసుకోవడానికి వాసాలమర్రి ప్రజలను మోసం చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. ‘ఆనాడు వాసాలమర్రికి వచ్చి ఆకుల ఆగవ్వకు అల్లనేరేడు పండు ఇచ్చి ఆసుపత్రిపాలు చేసిండు. వాసాలమర్రిలో ఇళ్లు కూలగొట్టి శ్మశానంగా మార్చిండు. ఆయన ఆగం చేసినా వాసాలమర్రి గ్రామ పరిస్థితిని బాగు చేస్తా’అని సీఎం రేవంత్ చెప్పారు. ఇందుకోసం గ్రామ పరిస్థితిని అధ్యయనం చేయాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డికి సూచించారు. ఆలేరును అభివృద్ధి చేస్తా.. బలహీనవర్గాల బిడ్డ బీర్ల ఐలయ్యను ఎమ్మెల్యేగా గెలిపించిన ఆలేరు ప్రజలకు అండగా ఉంటానని సీఎం రేవంత్ అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివద్ధి చేస్తామని అందరికీ మాట ఇస్తున్నా అని చెప్పారు. అడగకున్నా ఐలయ్యకు ప్రభుత్వ విప్ పదవి ఇచ్చానని సీఎం చెప్పారు. దెయ్యాల రాష్ట్ర సమితిగా పిలవండి బీఆర్ఎస్ను ఇకపై దెయ్యాల రాష్ట్ర సమితి (డీఆర్ఎస్)గా పిలవాలని సీఎం రేవంత్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో దెయ్యాలు ఉన్నాయని ఆ ఇంటి బిడ్డనే బయటపెట్టినా ఆ దెయ్యాల నాయకుడు సమాధానం చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. ఈ కొరివి దెయ్యాలను తెలంగాణ రాష్ట్రం పొలిమేరల వరకు తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఒక్క నోటీసు ఇస్తేనే ఆయన ఆగమాగం అయితుండు. కోర్టుకు వచ్చి జవాబు చెప్పాల్సింది పోయి విమర్శలు చేస్తుండు’అని విమర్శించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు లాంటి వ్యక్తులే కోర్టుకు హాజరయ్యారని రేవంత్ గుర్తుచేశారు. ఉద్యోగులకు అండగా ఉంటాం.. రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామని సీఎం రేవంత్ చెప్పారు. గత ప్రభుత్వం విడతలవారీగా వేతనాలు ఇచి్చందని.. కానీ ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంచన్గా జీతాలు ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో 60 వేల ఉద్యోగాలు ఇచి్చన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని చెప్పారు రూ. వెయ్యి కోట్లకు శంకుస్థాపన చరిత్రాత్మకం: మంత్రి ఉత్తమ్ ఆలేరు నియోజకవర్గానికి రూ. వెయ్యి కోట్లు కేటాయించి శంకుస్థాపన చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. దేశ చరిత్రలోనే 80 శాతం జనానికి సన్నబియ్యంతో కడుపునిండా అన్నం పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. గత ప్రభుత్వం రూ. 11 వేల కోట్లు ఖర్చు చేసి దొడ్డు బియ్యం ఇచి్చందన్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న గంధమల్ల చెరువుకు జీవం పోసేందుకు రూ. 574.56 కోట్లతో 1.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నామన్నారు. ఎవరు అడ్డుపడినా గంధమల్ల రిజర్వాయర్ను పూర్తి చేసి 60 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి కోమటిరెడ్డి పేదలందరికీ రూ. 5 లక్షల చొప్పున ఖర్చు చేసి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. రూ. 210 కోట్లు ఖర్చు చేసి ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చేలా పైపాప్లైన్ పనులను ప్రారంభించామన్నారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో ఈ పైప్లైన్లను మూడు నెలల్లో పూర్తి చేసి భగీరథ నీళ్లు అందిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, సోనియా గాంధీ కలలు కన్న తెలంగాణాను, రాహుల్ గాంధీ ఆలోచనలను నిజం చేస్తున్న నాయకుడు రేవంత్రెడ్డి అని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కొనియాడారు. ఆలేరు నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినందుకు సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలన్నారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వర్రావు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి, ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, శంకర్నాయక్, శ్రీపాల్రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించనుంది. 15 రోజులకోసారి మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు.విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆలస్యం లేకుండా వేగం పెంచాలని.. అందుకే రెండు మూడు నెలలకోసారి కాకుండా కేబినెట్ను నెలకు రెండు సార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా సమీక్షలు జరపనున్నారు.మంత్రులతో ఎప్పటికప్పుడు చర్చించేందుకు వీలుగా రెండు వారాలకోసారి మంత్రి వర్గ సమావేశం ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ప్రతి నెలలో మొదటి, మూడో శనివారం రోజున మంత్రివర్గ సమావేశం నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు 17 సార్లు కేబినేట్ భేటీలు జరిగాయి. -
అదానీ, చైనాలకు ‘నరేందర్–సరెండర్’
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ విమర్శల దాడిని పెంచింది. పారిశ్రామికవేత్త అదానీతోపాటు చైనాకు సైతం నరేందర్– సరెండర్ అంటూ వ్యాఖ్యానించింది. షోలే సినిమాలో జై–వీరూల జోడీని అదానీ, మోదీల ధ్వయం మించిపోయిందని కాంగ్రెస్ నేత అజొయ్ కుమార్ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నో సంవత్సరాల ప్రాక్టీస్ తర్వాత ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు లొంగిపోవడమనే ప్రక్రియ పూర్తయింది. నరేంద్ర మోదీ ఎక్కడికెళ్లిన, అదానీ కోరిన విధంగా ఒక కాంట్రాక్ట్ మాత్రం గ్యారెంటీ. భారత ప్రధాని దౌత్య సంబంధాలు అంతర్జాతీయంగా పోర్టులు, ఎయిర్పోర్టులు, విద్యుత్, బొగ్గు గనులు, ఆయుధాలు వంటి రంగాల్లో పారిశ్రామిక వేత్త అదానీకి అనుకూలంగా ఉంటాయి’అని పేర్కొంటూ ఆయన కొన్ని ఉదాహరణలను ప్రస్తావించారు. మోదీ చైనాకు సైతం మోకరిల్లారన్న అజొయ్ కుమార్.. 2020లో భారత భూభాగాన్ని ఆక్రమించినా కూడా ఆ దేశానికి క్లీన్చిట్ ఇచ్చిన ‘నరేందర్– సరెండర్’దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఎల్ఆర్ఎస్ ఇప్పట్లో తేలేనా?
సాక్షి, హైదరాబాద్: అనధికార లేఅవుట్లలో ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు. లక్షలాది మంది తమ ప్లాట్లు అనధికార లేఅవుట్లలో ఉన్నాయని తెలిసినా, క్రమబద్ధీకరణకు ముందుకు రావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ కింద గత ప్రభుత్వ హయాంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. 2020 నాటికి దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కల్పించింది. దాదాపు మూడు నెలలుగా ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. క్రమబద్ధీకరణకు యోగ్యమైనవిగా అధికారులు నిర్ణయించిన వాటిలో ఇప్పటివరకు కనీసం 25 శాతం ప్లాట్ల దరఖాస్తులకు క్రమబద్ధీకరణ ఫీజులు చెల్లించకపోవడం గమనార్హం. 2020లో మొత్తం 25,67 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. అందులో 20,11 లక్షల దరఖాస్తులు ప్లాట్ల క్రమబద్ధీకరణకు అర్హత ఉన్నవిగా తేల్చిన అధికారులు.. ఆ మేరకు సంబంధిత ప్లాట్ల యజమానులకు సమాచారం ఇచ్చారు. మీరు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఫీజులు చెల్లిస్తే.. ఈ ప్లాట్లను క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేశారు. తద్వారా కనీసం రూ.పదివేల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని భావించింది. అయితే ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. ఫీజు చెల్లింపు గడువును మూడుసార్లు పొడిగించినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన 2020 కటాఫ్ ఏడాది తర్వాత ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం తాజాగా ఈ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత మరో 46,255 దరఖాస్తులు కొత్తగా వచ్చాయి. వీటిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. క్రమబద్ధీకరణకు యోగ్యమైన 20.11 లక్షల దరఖాస్తుల్లో ఫీజులు చెల్లించిన వారు కేవలం 5,77 లక్షలు మాత్రమే ఉన్నారు. మిగిలిన 15 లక్షలకు పైగా దరఖాస్తు చేసుకున్నవారు ఫీజుల రూపంలో డబ్బులు చెల్లించడానికి ముందుకు రావడం లేదు. డబ్బు చెల్లించిన తర్వాత.. జరిమానా రూపంలో డబ్బు చెల్లించిన 5.77 లక్షలలో ఇప్పటి వరకు క్రమబద్ధీకరణ చేసినవి 1,77,435 వరకు ఉన్నాయి. ఫీజుల చెల్లించి, మిగిలిన పత్రాలు సరిగా జతచేయని వారిని నుంచి అవసరమైన పత్రాల కోసం అధికారులు వారికి మళ్లీ సమాచారం ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు కూడా చేపడుతున్నారు. అనధికార లేఅవుట్లు, ప్లాట్లు అధికంగా ఉన్న జిల్లాలు, అక్కడ నుంచి వచ్చిన దరఖాస్తులు, చెల్లించిన ఫీజులు చూస్తే.. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లోనే అత్యధికంగా అనధికార లేఅవుట్లు ఉన్నట్టు స్పష్టం అవుతోంది. ఇప్పటి వరకు ఫీజుల రూపంలో ప్రజలు చెల్లించిన మొత్తాల్లో రంగారెడ్డి జిల్లా మొదటిస్థానంలో, రెండోస్థానం మేడ్చల్, మూడోస్థానంలో హెచ్ఎండీఏ నాలుగో స్థానంలో జీహెచ్ఎంసీ, ఐదోస్థానంలో వరంగల్ అర్బన్, ఆ తర్వాత స్థానంలో సంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. పురపాలక శాఖలోని అధికారుల పాత్ర లేకుండా వేల లేఅవుట్లు, ప్లాట్లు రావడం సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అత్యల్పంగా ఆదాయం సమకూరిన జిల్లా ములుగు అయితే..అత్యధిక ఆదాయం వచ్చిన జిల్లా రంగారెడ్డి. మరోసారి పొడిగింపు.. ప్రజలకు తమ ప్లాట్లను క్రమబద్ధీకరణ చేయించుకోవడానికి మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు పురపాలక శాఖ అధికారులు ప్రభుత్వానికి ఫైల్ పంపినట్టు చెబుతున్నారు. గతవారంలో పురపాలక శాఖ కార్యదర్శి ఇలంబర్తి, సీఎంఓలో పురపాలక వ్యవహారాల చూసే మాణిక్రాజ్లు లేని కారణంగా పొడిగింపు ఉత్తర్వులు రాలేదని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో పొడిగింపునకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నట్టు తెలిసింది. -
దేశ సేవ నేరమా?
వాషింగ్టన్: దేశ ప్రయోజనాల కోసం పని చేయడం నేరమా? అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ప్రశ్నించారు. దేశానికి సేవ చేయడం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా భావించేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలని పరోక్షంగా కాంగ్రెస్ నాయకత్వానికి చురక అంటించారు. వారిని వారు ప్రశ్నించుకుంటే అసలు నిజం ఏమిటో తెలుస్తుందన్నారు. కాంగ్రెస్కు రాజీనామా చేసే ఉద్దేశం లేదని స్పష్టంచేశారు. ఆపరేషన్ సిందూర్పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహిస్తున్న శశిథరూర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. తాజాగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానంటూ తనపై కొందరు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలపై స్పందించారు. దేశానికి సేవ చేస్తున్నప్పుడు ఇలాంటి చిల్లరమల్లర విమర్శలు, ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. తాను బీజేపీలో చేరబోతున్నానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రజలు తనను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకున్నారని, ఎంపీగా పదవీ కాలం మరో నాలుగేళ్లు ఉందని, ఇలాంటి సమయంలో పార్టీ మార్పు ప్రశ్న ఎందుకు చర్చకు వస్తోందో తనకు అర్థం కావడం లేదన్నారు. పార్టీ మారాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలు ‘చిన్న విషయం’అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదుట ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారని, అందుకే పాకిస్తాన్పై యుద్ధం హఠాత్తుగా ఆపేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన ఆరోపణల పట్ల శశి థరూర్ స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పారీ్టలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం సహజమేనని కొట్టిపారేశారు. అయినా తాము ఇక్కడికి రాజకీయ కార్యక్రమం కోసం రాలేదని, ఐక్య భారత్ ప్రతినిధులుగా వచ్చామని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశ సందేశానికి ప్రపంచ దేశాలకు చేరవేస్తున్నామని ఉద్ఘాటించారు. అఖిలపక్ష బృందంలో వేర్వేరు పార్టీల నేతలు సభ్యులుగా ఉన్నారని గుర్తుచేశారు. ఇది కూడా భిన్నత్వంలో ఏకత్వానికి సంకేతమని వివరించారు. మన మధ్య రాజకీయ విభేదాలు ఏవైనా ఉంటే అవి దేశ సరిహద్దుల్లోనే ఆగిపోవాలని, సరిహద్దు దాటితే మనమంతా భారతీయులమేనని గతంలో ఒక సందర్భంలో తాను చెప్పినట్లు గుర్తుచేశారు. భారత్–పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని ఆపేశానంటూ ట్రంప్ పదేపదే చెబుతుండడంపై ప్రశ్నించగా, ‘‘ట్రంప్ వ్యాఖ్యలు, వాటిపై రాహుల్ విమర్శలు నిజానికి చిన్న విషయాలు’’ అంటూ థరూర్ ఆసక్తికరంగా స్పందించారు. ‘‘అమెరికా అధ్యక్షునిగా ట్రంప్పై భారత్కు ఎంతో గౌరవముంది. ఇలాంటి ఉదంతంతో ద్వైపాక్షిక సంబంధాలు సంక్లిష్టం కావడం భారత్కు ఇష్టం లేదు. ఒక్కటి మాత్రం సుస్పష్టం. మధ్యవర్తిత్వం కోసం ఎవరినో ప్రాధేయపడాల్సిన అవసరం భారత్కు లేదు. పాక్ దాడి చేస్తే గట్టిగా బదులిస్తామని, ఆపేస్తే తామూ ఆపేస్తామని భారత్ మొదట్లోనే చెప్పింది. అలాంటప్పుడు పాక్పై దాడులు ఆపాలని మాకు ఇంకెవరో చెప్పే సందర్భమే తలెత్తదు’’ అని కుండబద్దలు కొట్టారు. ఆపరేషన్ సిందూర్ను తట్టుకోలేక పాకే అమెరికా శరణుజొచ్చిందేమో. లేదంటే కాల్పుల విరమణ కోసం అమెరికాయే పాక్పై ఒత్తిడి చేసి ఉండొచ్చు’’ అన్నారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ఏం పని?
సాక్షి, హైదరాబాద్: అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడును నాగర్కర్నూలు ఎంపీ మల్లు రవిని ఇంటికి పిలిపించుకొని మాట్లాడాల్సిన అవసరం ఏంటని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కలిసి ఎంపీ తిరుగుతున్నారంటూ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. గురువారం నాగర్కర్నూలు, మహబూబ్నగర్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశం గాం«దీభవన్లో జరిగింది. పార్టీ నిర్మాణం, ప్రభుత్వ పథకాల ప్రచారంపై విశ్లేషణ వంటి అంశాలపై చర్చించారు. అయితే స్థానిక అంశాలపైనే మూడు నియోజకవర్గాల నాయకులు మాట్లాడినట్టు తెలిసింది.⇒ నాగర్కర్నూల్ సమావేశంలో ఎంపీ మల్లు రవిని లక్ష్యంగా చేసుకొని మాజీ ఎమ్మెల్యే సంపత్, ఆయన వర్గం నాయకులు మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశారు. పదేళ్లు కష్టపడిన మమ్మల్ని పక్కన బెట్టి ఇతరులకు ప్రియార్టీ ఇస్తారా అని సంపత్ వర్గం మల్లు రవిపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ⇒ మహబూబ్గర్ పార్లమెంట్ సమావేశంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ప్రతినిధులుగా తాము చెప్పే విషయాలు అధికారులు వినడం లేదని మీనాక్షికి చెప్పినట్టు సమాచారం. వరంగల్ పార్లమెంటు సమావేశంలో స్థానిక అంశాలను ఇన్చార్జ్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మూడు నియోజకవర్గాల నాయకులకు దిశానిర్దేశం చేశారు. గాందీభవన్లో మూడు నియోజకవర్గాలకు విడివిడిగా జరిగిన సమావేశాల్లో ఆమె మాట్లా డుతూ పథకాల ప్రభావం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తుందని, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని రాబోయే ఎన్నికల్లో అనుకూలంగా మలచుకోవాలని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ సీనియర్లు, జూనియర్లు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. సమావేశాల్లో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మూడు నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. శుక్రవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరగనుంది. -
బెంగళూరు ఘటన: అల్లు అర్జున్ ప్రస్తావన! విమర్శలపై కాంగ్రెస్ సర్కార్ ఏమందంటే..
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విక్టరీ పరేడ్ తొక్కిసలాట ఘటన.. రాజకీయ రంగు పులుముకుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని, డీకే శివకుమార్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. ప్రతిగా కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది.బెంగళూరు తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సినీ నటుడు అల్లు అర్జున్ పేరు ట్రెండింగ్లోకి వచ్చింది. తాజా ఘటనలో ఎవరిని అరెస్ట్ చేస్తారంటూ సోషల్ మీడియాలో విస్తృత చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి శోభా కరెంద్లాజె(Shobha Karandlaje) కర్ణాటక ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘పుష్ఫ చిత్రం సమయంలో థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఒకరు చనిపోతే.. సినీ నటుడు అల్లు అర్జున్ను ఇంటికెళ్లి మరీ అరెస్ట్ చేశారు. పొరుగున్న ఉన్న రాష్ట్రం(తెలంగాణ)లో ఉన్నది మీ ప్రభుత్వమే కదా!. అలాంటిది ఇక్కడ 11 ప్రాణాలు పోయినా పట్టించుకోరా?. ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారు సీఎం సిద్ధరామయ్యా?, డిప్యూటీ సీఎం శివకుమారా?.. ఎవరిని అరెస్ట్ చేస్తారు?. ఇద్దరూ తక్షణమే రాజీనామా చేయాలి. ఘటనలో ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం ఉంది. ఎంక్వైరీ కోసం మెజిస్ట్రేట్ ఎంక్వైరీకి ఆదేశించారట. జిల్లా స్థాయి అధికారిని నియమించడం ఏంటి?. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి’’ అని డిమాండ్ చేశారామె.VIDEO Credits: NEWS18 KannadaNews18 Kannadaమరోవైపు ఈ అంశంపై కర్ణాటక బీజేపీ నేతలు గురువారం ప్రెస్మీట్ నిర్వహించారు. విధాన సౌధలోనే ఆర్సీబీ ఆటగాళ్లను సన్మానం చేయాల్సిన అవసరం ఏంటి?. అనుమతి లేదని చెప్పి అక్కడే ఎందుకు నిర్వహించారు. ఆర్సీబీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలనుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అత్యాశా ఫలితమే ఈ తొక్కిసలాట. ఘటనకు బాధ్యత వహిస్తూ సిద్ధరామయ్య రాజీనామా చేయాలి. డీకే శివకుమార్ను అరెస్ట్ చేయాలి అని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రతీ విషయంలో కేంద్రాన్నిప్రశ్నించే రాహుల్ గాంధీ..ఈ అంశంపై ఎందుకు మాట్లాడరు అని ఎంపీ సంబీత్ పాత్రా ప్రశ్నించారు. అయితే.. బీజేపీ విమర్శలను కాంగ్రెస్ ప్రభుత్వం తిప్పికొట్టింది. ఆ పార్టీవి డర్టీ పాలిటిక్స్ అని డీకే శివకుమార్ అన్నారు. తల్లిదండ్రులకు శోకం మిగిలిందంటూ కంటతడి పెట్టారు. మరోవైపు సిద్ధరామయ్య సైతం బీజేపీపై మండిపడ్డారు. తొక్కిసలాటలో 11 మంది చనిపోతే బీజేపీ ఎందుకింత రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 50 నుంచి60 మంది చనిపోయారు. అప్పుడు మేం ఏమైనా అన్నామా? సిద్ధరామయ్య అన్నారు. విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. ఆర్సీబీ ప్రాంచైజీనే హడావిడిగా సంబురాలు ఏర్పాటు చేసుకుందని ప్రకటించారు హోంమంత్రి పరమేశ్వర ప్రకటించడం గమనార్హం. ఇక.. ఈ ఘటనపై చర్చించేందుకు కర్ణాటక కేబినెట్ అత్యవసర సమావేశం నిర్వహించింది.తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బాధ్యులు ఎవరనేది మాత్రం ఎఫ్ఐఆర్లో ప్రస్తావించలేదు. ఘటనపై దర్యాప్తు జరిపి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. మరోవైపు.. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కర్ణాటక హైకోర్టు విచారణ జరపనుంది. -
తొక్కిసలాటపై రాజకీయ దుమారం.. సీఎం నోట కుంభమేళా మాట
సాక్షి, బెంగళూరు: గెలుపు సంబరాల్లో ఘోరం చోటుచేసుకుంది.. అభిమానుల కేరింతలు, కోలాహలంతో సందడిగా ఉన్న ప్రాంగణం ఒక్కసారిగా ఆర్తనాదాలతో మార్మోగింది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తొలిసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయోత్సవాలకు అసంఖ్యాకంగా అభిమానులు తరలిరావడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద పరిస్థితి అదుపుతప్పి భారీ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతిచెందగా 47 మంది గాయపడ్డారు. ఈ విషాదంపట్ల ప్రధాని మోదీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య... మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ), ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్ కలిసి రూ. 5 లక్షల చొప్పున అందిస్తామని ప్రకటించాయి. మరోవైపు ఈ ఘటనపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పరస్పర రాజకీయ విమర్శలకు దిగాయి. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ‘‘ప్రభుత్వం ప్రజలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. సరైన ప్రణాళిక లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అందుకే ఈ ఘోరం జరిగింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి’’ అని ఆరోపిస్తోంది. ఇంకోవైపు.. జేడీఎస్ కీలక నేత, కేంద్ర మంత్రి కుమారస్వామి డిప్యూటీ సీఎం శివకుమార్ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. ‘‘క్రికెటర్లను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్టుకు ఎవరు వెళ్లారు?. ఈవెంట్కు డిప్యూటీ సీఎం మద్దతుదారులు ఎందుకు వచ్చారు?. అమాయకమైన అభిమానుల మృతికి బాధ్యత ఎవరు వహిస్తారు?’’ అని ప్రశ్నించారు. అయితే ఈ ఘటనకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని బుధవారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్మీట్లో సీఎం సిద్ధరామయ్య స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన నోట కుంభమేళా తొక్కిసలాట ప్రస్తావన రావడం గమనార్హం.‘‘ప్రభుత్వం ప్రజలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. సరైన ప్రణాళిక లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అందుకే ఈ ఘోరం జరిగింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి’’ అని ఆరోపించింది. కాగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఖౌy్చ∙ఇజ్చి ్ఛnజ్ఛటటఆ్ఛnజ్చ uటu) విజయోత్సవ కార్యక్రమం సందర్భంగా అధిక సంఖ్యలో అభిమానులు చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకున్నారు. ఇలాంటి తొక్కిసలాట ఘటనలు జరిగేవే. ఇంతకంటే దారుణమైనవి కూడా జరిగాయి. ఈ ఏడాది ఆరంభంలో.. మహా కుంభమేళాలోనూ ఇది జరిగింది. ఆ ఘటనలో 50 నుంచి 60 మంది చనిపోయారు కదా. అలాగని ఇప్పుడు జరిగిన ఘటన నుంచి తప్పించుకోవాలని మేం అనుకోం. ఇది ప్రభుత్వం నిర్వహించిన ఈవెంట్ కాదు. క్రికెట్ అసోషియేషన్ నిర్వహించింది. ఈవెంట్కు ప్రభుత్వం కేవలం అనుమతి మాత్రమే ఇచ్చింది. పూర్తి బందోబస్తును అందించింది. అయినప్పటికీ.. స్టేడియం కెపాసిటీ 35 వేలు అయితే.. మూడు లక్షల మంది వచ్చారు. ఘటనలో 11 మంది మరణించగా.. గాయపడిన వాళ్లంతా త్వరగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అదృష్టవశాత్తూ.. విధాన సౌధ వద్ద జనం గుమిగూడినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదు అని సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. ఈ ఏడాది మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించారని, 60 మంది గాయపడ్డారని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఏం జరిగిందంటే? ఆర్సీబీ అభిమానులు మంగళవారం రాత్రి నుంచే బెంగళూరులో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ జట్టు తమ హోం గ్రౌండ్లో అభిమానుల సమక్షంలో ఆనందం పంచుకోవాలని భావించింది. అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయానికి జట్టు సభ్యులు వచ్చారు. ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేరుగా హెచ్ఏఎల్ విమానాశ్రయానికి వెళ్లి వారికి స్వాగతం పలికారు. షెడ్యూల్ ప్రకారం ముందుగా విధాన సౌధ వద్ద కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ కార్యక్రమం సజావుగానే సాగింది. అక్కడి నుంచి ఓపెన్ టాప్ బస్సులో ‘విక్టరీ పరేడ్’తో చిన్నస్వామి స్టేడియానికి ఆటగాళ్లు చేరుకోవాల్సి ఉంది. అయితే.. అభిమాన ఆటగాళ్లను చూసేందుకు అప్పటికే భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియానికి పోటెత్తడంతో మైదానం పూర్తిగా నిండిపోయింది. అయినప్పటికీ బయట కూడా భారీగా ఫ్యాన్స్ నిరీక్షిస్తూ ఉండిపోయారు. ప్రాథమిక విచారణ ప్రకారం.. భారీ సంఖ్యలో జనం గుమిగూడడంతో అక్కడ ఉన్న డ్రెయిన్ కూలిపోయింది. దీంతో ఆందోళనకు గురైన వాళ్లంతా చెల్లాచెదురుకాగా.. చివరకు ఇదే తొక్కిసలాటకు దారితీసింది. వారిని నియంత్రించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ తోపులాటలో శ్వాస అందక కొందరు సొమ్మసిల్లారు. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించేందుకు కూడా వీల్లేని స్థితిలో అభిమానులు పోటెత్తారు. చివరకు క్షతగాత్రులను బౌరింగ్ ఆస్పత్రికి, వైదేహీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రణాళికా లోపమే కారణం?దాదాపు ఏడాది క్రితం భారత టి20 జట్టు వరల్డ్ కప్ గెలిచి వచ్చిన తర్వాత ముంబైలో ఓపెన్ టాప్ బస్సులో విజయయాత్ర జరిగింది. అయితే అంతటి మహానగరంలో కూడా ఎక్కడా ఎలాంటి సమస్య రాకుండా అధికారులు, పోలీసులు చక్కటి ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పుడు ఆర్సీబీ వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది. నిజానికి టీమ్ మేనేజ్మెంట్ చాలా హడావుడిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఫైనల్ జరిగిన 24 గంటల్లోపే బెంగళూరు వచ్చేసి ఇలాంటి ఈవెంట్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సన్నాహాలకు కనీస సమయం కూడా ఇవ్వకుండా ప్రోగ్రామ్ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి టీమ్ ఫ్యాన్స్కు పిలుపు ఇచ్చేసింది. మంగళవారం రాత్రి నుంచి ఇంకా గెలుపు ఆనందంలోనే ఉన్న అభిమానులకు ఈ కార్యక్రమం దానికి కొనసాగింపులా కనిపించి అంతా ఒక్కసారిగా దూసుకొచ్చారు. పోలీసులు చివరకు పరిస్థితిని వివరించి ఓపెన్ టాప్ బస్సు ర్యాలీ జరగకుండా నిలువరించినా... అప్పటికే పెద్ద నష్టం జరిగిపోయింది. ఒకవైపు తొక్కిసలాటతో మైదానం బయట పరిస్థితి విషాదం నెలకొన్నప్పటికీ మరోవైపు స్టేడియంలో వేడుకలు కొనసాగాయి. అయితే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఆర్సీబీ అధికారులకు ఫోన్ చేసి వెంటనే కార్యక్రమం ఆగిపోయేలా చేశారు. జనాన్ని అదుపు చేయడం చాలా కష్టంగా మారిందని, పోలీసులు ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. -
పార్టీ పరిశీలకులు గ్రామాలకు వెళ్లాలి
సాక్షి, హైదరాబాద్: పార్టీ పరిశీలకులుగా నియమితులైన నేతలందరూ గ్రామాలకు వెళ్లాలని, కార్యకర్తలకు భరోసా కల్పించే దిశలో తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కోరారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలని సూచించారు. బుధవారం గాం«దీభవన్లో ఆమె ‘జై భీమ్.. జై బాపూ.. జై సంవిధాన్’కార్యక్రమ సమన్వయకర్తలు, పీసీసీ పరిశీలకులతో సమావేశమయ్యారు. జిల్లాల వారీగా పరిశీలకులతో భేటీ తర్వాత ఆమె వారితో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం గురించి ఆమె.. నేతలకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లో పరిశీలకులు బాధ్యతగా పనిచేయాలని, మండల కమిటీలను ఎంపిక చేసే ప్రక్రియను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రతి మండలంలోని 5 గ్రామాలను యూనిట్గా చేసి కార్యకర్తల్లో చైతన్యం తీసుకురావాలని, ప్రతి యూనిట్కు ఒకరు చొప్పున మండల కమిటీలోకి తీసుకోవాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకుల్లో నామినేటెడ్ పోస్టులకు అర్హులెవరన్న దానిని గుర్తించాలని సూచించారు. జై బాపూ, జై భీమ్.. కార్యక్రమం తెలంగాణలో బాగా జరుగుతోందని, దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందున్నామని చెప్పిన ఆమె, సమన్వయకర్తలకు రాహుల్ గాంధీ పక్షాన ప్రశంసలు తెలియజేశారు. ఫోన్ చేసి మాట్లాడిన మీనాక్షి సమావేశంలో భాగంగా ప్రతి జిల్లాలో పార్టీ కమిటీల నియామకం ఎంత వరకు వచ్చిందన్న అంశాన్ని మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. పరిశీలకులు సమర్పించిన నివేదికలు చూసిన ఆమె, బాగా పనిచేసిన నేతలకు అభినందనలు తెలిపారు. కమిటీల నియామకంలో తాత్సారం చేస్తున్నారన్న నివేదికల మేరకు మహబూబ్నగర్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, నల్లగొండకు చెందిన ఓ ఎమ్మెల్సీకి ఆమె నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. పార్టీ కమిటీల నియామకాలను వాయిదా వేయవద్దని వారికి సూచించారు. మంత్రితో ముఖాముఖి కాగా, బుధవారం గాం«దీభవన్లో ‘మంత్రితో ముఖాముఖి’కార్యక్రమం జరిగింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దాదాపు మూడు గంటల పాటు గాం«దీభవన్లో ఉండి ప్రజల నుంచి వారి సమస్యలపై దరఖాస్తులు తీసుకున్నారు. మొత్తం 100కు పైగా వినతిపత్రాలు వచ్చాయని, తక్షణమే పరిష్కరించగలిగిన వాటిపై అధికారులతో అప్పటికప్పుడే మాట్లాడి పరిష్కరించారని, మిగిలినవి ఆయా శాఖలకు పంపామని మంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, హైదరాబాద్లో డబుల్ బెడ్రూం ఇళ్లు, రేషన్కార్డులు, కరెంటు బిల్లులు, ఇతర సంక్షేమ పథకాల కోసం ప్రజలు దరఖాస్తులిచ్చారని తెలిపారు. కాగా, మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ కూడా మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నాయకులారా ఖబడ్దార్.. కేసీఆర్కు నోటీసులిస్తారా?
సాక్షి, హైదరాబాద్/కవాడిగూడ: తెలంగాణ సస్యశ్యామలం కావాలని 16 టీఎంసీల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును 141 టీఎంసీలకు పెంచినందుకా మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చారా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడమంటే యావత్ తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచి్చనట్టేనని ధ్వజమెత్తారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్తో నోటీసులు జారీ చేయించిన కాంగ్రెస్ నాయకులారా ఖబడ్దార్ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం కమిషన్ కాదు..అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్ అని విమర్శించారు. కమిషన్పై మాకు నమ్మకం ఉందని, కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి విశ్వాసం లేదన్నారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు నోటీసు జారీ చేయడాన్ని నిరసిస్తూ బుధవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జాగృతి కార్యకర్తలు, పలు సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత ప్రసంగించారు. దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, కేసీఆర్ను బద్నాం చేయడానికి మాత్రమే కాళేశ్వరం కమిషన్ వేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తోందని, 90 శాతం పంప్హౌస్ల పనులు చేసిన కాంట్రాక్టర్ను ఎందుకు వదిలేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 15 పంప్హౌస్లు నిర్మించిన మెఘా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్రెడ్డికి లేకపోవడం సిగ్గుచేటన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు జలదోపిడీ చేసినా బీజేపీ ప్రశ్నించడం లేదు ఏపీ సీఎం చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నందున జలదోపిడీ చేసినా రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రశ్నించడం లేదని, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమీ తేవడం లేదని మండిపడ్డారు. బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ కూడా మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదని, తెలంగాణ నీళ్లను ఏపీకి తరలించుకుపోతుంటే రేవంత్ ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు. -
లుకలుకలు.. కుమ్ములాటలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు. ఒకటి అధికార కాంగ్రెస్, రెండోది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, మూడవది జాతీయ పార్టీ బీజేపీ. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతుంటాయి. ప్రజల దృష్టిని తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయతి్నస్తుంటాయి. కానీ ప్రస్తుతం.. ఈ మూడు ప్రధాన రాజకీయ పక్షాలూ వేటికవే తమతమ పార్టీల్లో అసమ్మతి స్వరాలు, అసంతృప్తి జ్వాలలు, అంతర్గత కుమ్ములాటలు, విభేదాలతో సతమతమవుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీలో లుకలుకలు స్పష్టంగా కని్పస్తున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని చెప్పే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి సహజమే అయినా క్రమశిక్షణకు మారుపేరని భావించే బీజేపీ, ఏకఛత్రాధిపత్యం కింద నడిచే ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్లో కూడా రాజకీయ రచ్చ కొనసాగుతుండటం గమనార్హం. అయితే గ్రూపులు, గొడవలకు పుట్టినిల్లు లాంటి కాంగ్రెస్ పార్టీలో రహస్య కొట్లాటలు జరుగుతుంటే, బీజేపీ, బీఆర్ఎస్లలో మాత్రం విభేదాలు బహిరంగమవుతుండటం మరో విశేషం. కాంగ్రెస్లో పదవులు, ప్రాధాన్యం రభస రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. ఏడాదిన్నరలోనే ప్రభుత్వ పాలన, ప్రభుత్వ.. పార్టీ పదవులు, ప్రాధాన్యత, మంత్రివర్గ విస్తరణ, మంత్రుల వ్యవహారశైలి తదితర అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. అంతర్గత విభేదాలకు, ఫిర్యాదులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ అంశం ఏడాదిన్నర తర్వాత కూడా కొలిక్కి రావడం లేదు. ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా, హైదరాబాద్లో చర్చలు జరిగినా తేలడం లేదు. అదిగో విస్తరణ...ఇదిగో విస్తరణ అంటూ ఎప్పటికప్పుడు దాటవేతతో విసుగు వచ్చిన ఇద్దరు ఆశావహ ఎమ్మెల్యేలు.. కేబినెట్లో బెర్తు కేటాయించకపోతే తమ దారి తాము చూసుకుంటామని సన్నిహితుల వద్ద నిరసన గళం విని్పంచినట్టుగా బయటకు రావడం పార్టీలో కలకలం రేపింది. మరోవైపు పదవుల లొల్లి కూడా ఆ పార్టీని కుదిపేస్తోంది. చాలా కాలం తర్వాత నియమించిన కమిటీల్లో కొంత సామాజిక న్యాయ కోణం కనిపించినా సీనియర్లు, జూనియర్లు అనే విభేదాలు మరింత పెరిగాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూనియర్లకు, ప్యారాచూట్ల (బయటి పార్టీల నుంచి వచ్చిన వారికి)కు కమిటీల్లో ప్రాధాన్యతనిచ్చారనే అసంతృప్తి వ్యక్తమవుతుండటం గమనార్హం. ఇంకోవైపు మహిళా కాంగ్రెస్ నేతలు గాం«దీభవన్లోని టీపీసీసీ అధ్యక్షుడి చాంబర్ ముందు తమకు ప్రాధాన్యత లభించడం లేదంటూ ధర్నాకు దిగడం కూడా చర్చనీయాంశమైంది. అయితే, టీ కప్పులో తుపాను మాదిరి ఆ వివాదం ముగిసినా, పార్టీలో ప్రాధాన్యత అంశం అంతర్గతంగా అగ్గిని రాజేస్తూనే ఉంది. మంత్రులపై ఫిర్యాదులు..పాలనపై విమర్శలు సీఎంకు, మంత్రులకు మధ్య సఖ్యత లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుండగా, కొందరు మంత్రుల పనితీరుపై ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేసేంతవరకు పరిస్థితి వెళ్లిపోయింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కూడా పార్టీలో తీవ్రంగానే చర్చ జరుగుతోంది. ఎంత చేసినా ప్రజల మన్ననలు రావడం లేదని పార్టీ నేతలు చెబుతుంటే, తాము చేసినవన్నీ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదనే అభిప్రాయంతో ప్రభుత్వ పెద్దలున్నారు. ఈ క్రమంలో వీలున్నంత త్వరగా మంత్రివర్గ విస్తరణ జరగాల్సిందేనని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి పట్టు నిరూపించుకోకపోతే పార్టీ గ్రాఫ్ డౌన్ కావడం ప్రారంభమవుతుందని కాంగ్రెస్ నేతలే బహిరంగ వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. గులాబీకి ‘కుటుంబ ముళ్ల’ పోటు బీఆర్ఎస్లో ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీలో ఆమె ఇప్పుడు రె‘బెల్స్’ మోగిస్తున్నారు. తండ్రి కేసీఆర్ను విమర్శించకుండా వ్యూహాత్మక వ్యాఖ్యలు చేస్తూ, ప్రశ్నలు వేస్తూ గులాబీ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి వరంగల్లో పార్టీ రజతోత్సవ సభకు ముందు అంతర్గత చర్చలకే పరిమితమైన ఆమె, ఆ తర్వాత గేర్ మార్చారు. సభ నిర్వహణ గురించి కేసీఆర్కు స్వదస్తూరితో రాసిన లేఖ బీఆర్ఎస్లో అశాంతిని బహిర్గతం చేసింది. ఆ లేఖ లీక్ కావడం, ఆ లీకేజీ వెనుక ఎవరున్నారన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతుండడం అటు బీఆర్ఎస్నే కాదు, ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాలను కూడా కుదిపేశాయి. కేసీఆర్ దేవుడని, అయితే ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. అమెరికా నుంచి వచ్చిన వెంటనే శంషాబాద్ విమానాశ్రయంలోనే ఆమె పేల్చిన బాంబు మంటలు ఇంకా చల్లారలేదు. ఆ తర్వాత ఆమె స్పీడ్ మరింత పెంచారు. ఇష్టాగోష్టిలో బాంబు పేల్చిన కవిత మీడియాతో ఇష్టాగోష్టి పేరుతో కవిత మరో రాజకీయ ఆటం బాంబు పేల్చారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీఆర్ఎస్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని, దాన్ని అడ్డుకుంటున్నందుకే తనను బయటకు పంపాలని చూస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు అధినేత కేసీఆర్ను సైతం ఇరకాటంలో పడేశాయి. అంతటితో ఆగని కవిత తెలంగాణ జాగృతి పేరుతో బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్తో సమాంతరంగా జాగృతిని తీసుకెళ్తానని చెప్పకనే చెపుతున్న ఆమె, పరోక్షంగా పార్టీని సవాల్ చేస్తూ ధర్నాకు దిగుతున్నారు. కేసీఆర్కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు ఇవ్వడానికి నిరసనగా చేపడుతున్న ధర్నాతో.. బీఆర్ఎస్ చేయలేని పనిని తాను చేస్తున్నానని పార్టీ కేడర్కు సంకేతాలిచ్చే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. ఈ కుటుంబ పంచాయతీ కేడర్ను అయోమయానికి గురి చేస్తోంది. ఇలావుండగా.. ఎప్పుడూ లేని విధంగా ఇటీవల హరీశ్రావు ఇంటికి కేటీఆర్ వెళ్లడం కూడా అటు బీఆర్ఎస్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారి తీస్తోంది. ఇంత జరుగుతున్నా.. కేటీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నించే రీతిలో కవిత అస్త్రాలు సంధిస్తున్నా కేసీఆర్ మాత్రం మౌన ముద్రలోనే ఉండడం గమనార్హం. కమలం.. కలహాల కాపురం సాధారణంగా బీజేపీలో అంతర్గత విభేదాలు బహిర్గతం కావు. ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ భావజాలంతో నడిచే ఆ పార్టీలో ఎంతటి వివాదాలు, భిన్నాభిప్రాయాలైనా లోలోపలే పరిష్కరించుకుంటారు. కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రూపులుగా విడిపోయి వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదని, ఎంపీల్లోని ఏ ఇద్దరూ ఒక్కచోట కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి లేదని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో పెద్ద రచ్చే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతగా అంటే అసలు ఏ నాయకుడిని ఎంపిక చేయాలో పార్టీ అధిష్టానానికి కూడా అంతుపట్టనంతగా ఈ పదవి కోసం నేతలు పోట్లాడుకుంటున్నట్టు బీజేపీలో జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత కూడా కిషన్రెడ్డినే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారంటే ఆ పార్టీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపిక వ్యవహారంలోనూ బహిరంగ విమర్శలు వ్యక్తమయ్యాయి. రాజాసింగ్ టార్గెట్ ఎవరో? రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా, ఫైర్బ్రాండ్గా గుర్తింపు పొందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రచ్చ రచ్చ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి, ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి వచ్చి కమలం గుర్తుపైనే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అయితే, ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజాసింగ్ స్టైల్ మార్చారు. ఎప్పటిలాగా ఎంఐఎంను కాకుండా ఈసారి సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి. ‘మా పార్టీ నేతలకు ప్యాకేజీలు ఇస్తే ఏ పార్టీనయినా విలీనం చేసుకుంటారు..’ అంటూ ఆయన వ్యాఖ్యానించడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఆయన్ను మరోమారు సస్పెండ్ చేస్తారనేంత వరకు ఈ వ్యవహారం వెళ్లింది. అయితే ఆ అంశంపైనా ఆయన తీవ్రంగా స్పందించారు. తనను సస్పెండ్ చేస్తే ఒక్కొక్కరి జాతకాలు బయట పెడతానంటూ హెచ్చరించడం పార్టీ నేతలను ఇరకాటంలో పెట్టింది. ఈ నేపథ్యంలో ఆయన అసలు రాష్ట్ర పార్టీలో ఎవరిని టార్గెట్ చేశారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాష్ట్ర శాఖ అధ్యక్షుడి ఎంపిక, పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో.. అధిష్టానం పట్టీపట్టనట్టుగా ఉండటం, ఎలాంటి జోక్యం చేసుకోకపోవడం పార్టీ వర్గాల్లో హాట్టాపిక్ అవుతోంది. ఈ విధంగా.. ఎన్నికలకు మూడేళ్లకు పైగా సమయం ఉన్నప్పుడే ఈ మూడు ప్రధాన పార్టీల్లో జరుగుతున్న లొల్లి, అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎంత తీవ్రంగా మారుతుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. -
గాంధీ భవన్కు భద్రత పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్కు భద్రతను పెంచారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ చర్యలకు దిగినట్లు.. అందుకు కేబినెట్ విస్తరణే కారణమన్నట్లు సమాచారం. ఆశించిన వారు పదవి దక్కకపోతే తమ వర్గీయులతో ఆందోళనకు దిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే భద్రతను పెంచినట్లు తెలుస్తోంది. -
ఇది సఫ(బ)ల తెలంగాణ
మన ఉపనిషత్తులు, శాస్త్రాలు... స్త్రీని సాధికారత కలిగిన స్వరూపంగా పేర్కొన్నాయి. అలాంటి మహిళకు తెలంగాణ వచ్చాక ఎలాంటి ఆదరణ లభించలేదు. సంక్షేమ పథకాల నుంచి మొదలుకొని కేబినెట్ బెర్త్ల దాకా అడుగడుగునా అన్యాయమే. కానీ 2023 డిసెంబర్ 7న గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు స్త్రీ సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నది. ఆడబిడ్డల మోములపై నవ్వులు చిందుతుండగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించింది. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇక తమ ఆకాంక్షలన్నీ నెరవేరుతాయనుకున్న యువత, ముఖ్యంగా మహిళల ఆశలు అడియాసలే అయ్యాయి. బీఆర్ఎస్ మొదటి కేబినెట్లో ఒక్క మహిళను కూడా తీసుకోకుండా అతివలను అతి ఘోరంగా అవమానించింది. ఇతర పదవులూ ఇవ్వలేదు. కానీ... కాంగ్రెస్ సర్కారు మహిళలకు పెద్దపీట వేసింది. కేబినెట్లోకి ఆదివాసీ బిడ్డ ధనసరి సీతక్కను, బీసీ బిడ్డ కొండా సురేఖను తీసుకున్నది. అలాగే, ‘తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’, ‘తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్’ల చైర్మన్లుగా, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలిగా అతివలకు అవకాశం కల్పించింది. తెలంగాణలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి తెలంగాణ కాంగ్రెస్ సర్కారు అతివల ఇంటి కష్టాలను తీర్చుతున్నది. స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం విద్యార్థులు, పోలీసుల యూనిఫామ్ కుట్టే పనిని అప్పగించింది. దీంతో మహిళలకు స్థిరమైన ఆదాయం వస్తున్నది. అలాగే మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను అందిస్తున్నది. దీంతోపాటు ‘రాజీవ్ యువ వికాసం’ ద్వారా రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల దాకా స్వయం ఉపాధికి సాయం అందజేస్తున్నది. మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు, ప్రభుత్వం 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను మహిళల స్వయం సహాయక సంఘాల ద్వారా ఏర్పాటు చేయిస్తున్నది. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తిరగడమే కాదు... ఆ బస్సులకు వారినే ఓనర్లను చేసే మరో మహత్తర కార్యక్రామానికి శ్రీకారం చుట్టింది. మహిళల స్వయం సహాయక సంఘాల ద్వారా 150 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయించి, వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇప్పించింది. మరో 450 బస్సులను కూడా అద్దెకు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇదీ చదవండి: World Bicycle Day 2025 డయాబెటిస్కు, ఊబకాయానికి చెక్మహిళలు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు శిల్పారామంలో డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేసింది. ఈ బజార్లు స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తి అయిన వస్తువులకు మార్కెట్ను అందిస్తాయి. దీనివల్ల మహిళల ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతున్నది. అలాగే, మహిళల స్వయం సహాయక సంఘాల ద్వారా 196 ‘ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు’ ఏర్పాటు చేసింది. ఈ క్యాంటీన్లు మహిళలకు స్వయం ఉపాధిని అందిస్తున్నాయి. మహిళలంతా ఒకేచోట చేరి తమ పురోగతికి ప్రణాళికలు రచించుకునేలా 22 ‘ఇందిరా మహిళా శక్తి’ భవనాలను నిర్మించింది. ఇవి మహిళలకు కార్యాలయాలుగా, వ్యాపార కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. మహిళలకు ‘మీ సేవా’ కేంద్రాలను అప్పగించి, వారికి ఉపాధి కల్పిస్తున్నది. డైరీ సహకార రంగంలో 40 వేల మంది మహిళలకు శిక్షణ ఇప్పించింది. మహిళలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించి, ఆర్థిక భద్రతకు భరోసానిస్తున్నది. ఇలా నేటి ప్రభుత్వం మహిళా సాధికారతకు పాటుపడటంతో పాటు ఆర్థికంగా ఆగమైపోయిన రాష్ట్రాన్ని అత్యంత క్రమశిక్షణతో ఒక్కో పువ్వేసి బతుకమ్మను పేర్చినట్టు పునర్నిర్మిస్తున్నది. -ఇందిరా శోభన్కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు -
2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1గా తెలంగాణ: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్ల ఎకానమీగా తీర్చిదిద్దడంలో తెలంగాణ అగ్రభాగాన నిలువనుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రైజింగ్–2047 నినాదంతో పదేళ్లలో రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్ది, 2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. దేశంలోనే గాక ప్రపంచంలోనే తెలంగాణను నంబర్ వన్గా నిలిపే దిశగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు. పారదర్శక పాలనతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించే ప్రయత్నంలో ప్రజలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జపాన్లోని కితాక్యూషూ నగర మేయర్ కజుహిసా టకేచి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం సీఎం ప్రసంగించారు. రాష్ట్ర ప్రజల కలలను సాకారం చేసిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అమర వీరులకు ఘన నివాళులు అరి్పంచారు. తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతికి చేస్తున్న కృషిని, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. అన్ని వ్యవస్థలనూ చక్కదిద్దుతున్నాం.. ‘రాష్ట్రం వచ్చి పదేళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. కట్టు బానిసత్వాన్ని తెలంగాణ సమాజం సహించదు. అందుకే పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి.. ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. మేము అధికారం చేపట్టే నాటికి వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆ వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దుతున్నాం. ప్రజా ఆలోచనలే ఆచరణగా ముందుకు సాగుతున్నాం. నిర్లక్ష్యానికి గురైన యూనివర్సిటీలకు వీసీలను నియమించాం. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం. సమాచార కమిషనర్లను, లోకాయుక్త, హెచ్ఆర్సీ సభ్యులను నియమించుకుని, వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నాం. ఇందిరా మహిళా శక్తి మిషన్ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీని ఆవిష్కరించుకున్నాం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే రూ.21 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశాం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించే బాధ్యతను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించాం. మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయించాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. బస్సులకు మహిళలను యజమానులుగా మార్చే కా ర్యక్రమాలను చేపట్టాం. ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ఇప్పటికే 150 బస్సులను అందజేశాం. మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత వి ద్యుత్, ఇందిరమ్మ ఇళ్లులాంటి పథకాలు అమలు చేస్తున్నాం. రైతన్న సంక్షేమానికి పెద్దపీట రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. కేవలం 8 నెలల్లో 25,35,964 మందికి రూ.20,617 కోట్లు మాఫీ చేశాం. వారికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.12 వేలకు పెంచాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు ఇస్తున్నాం. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూ భారతి–2025 చట్టాన్ని తీసుకువచ్చాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నాం. యువతే మన భవిష్యత్తు.. యువతే మన భవిష్యత్తు అనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే 60 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, నియామక పత్రాలను అందించాం. డీఎస్సీ ప్రకటించి 10 వేల మందికి పైగా టీచర్లను నియమించాం. సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రీ స్కూల్ విధానం తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నాం. అన్నివర్గాల విద్యార్థులు ఒకేదగ్గర ఉండేందుకు వీలుగా తొలిదశలో రూ.11,600 కోట్లతో 58 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపట్టాం. కులగణనతో దేశానికి ఆదర్శంగా.. కులగణన ద్వారా దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపాం. తెలంగాణ బాటలోనే కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టేందుకు సిద్ధమైంది. ఎస్సీ ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించి చట్టబద్ధత కల్పించాం. నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇళ్లు ఇళ్లు లేని నిరుపేదలు ఇంటిని నిర్మించుకునేందుకు ఇందిరమ్మ పథకం ద్వారా రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు నిర్మించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. పేదల ఆకలి తీర్చడమే కాదు.. వారు ఆత్మగౌరవంతో జీవించేలా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించాం. తెలంగాణలో 3 కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. సంక్షేమ పథకాల చరిత్రలో సన్న బియ్యం ఒక ట్రెండ్ సెట్టర్. తెలంగాణను పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. దావోస్, సింగపూర్, జపాన్ లాంటి దేశాల్లో పర్యటించి ఇప్పటివరకు రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఐటీ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, హెచ్సీఎల్, కాగ్నిజెంట్ వంటి పెద్ద కంపెనీలు హైదరాబాద్లో తమ సంస్థలను విస్తరిస్తున్నాయి. తెలంగాణ రైజింగ్లో ఇదొక తొలి మెట్టు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ మూసీని పునరుజ్జీవింప చేయడంతో పాటు బాపూఘాట్ను అంతర్జాతీయ స్థాయిలో గాంధీ సరోవర్గా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయబోతున్నాం. హైదరాబాద్ నగర అభివృద్ధి లక్ష్యంగా దాదాపు రూ.18 వేల కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాం. రూ.24 వేల కోట్లతో మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టును చేపడుతున్నాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘భారత్ సమ్మిట్’కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాం. దేశ సమగ్రత కోసం రాజకీయాలకు అతీతంగా..ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం కల్పించాం. 100కు పైగా దేశాల నుంచి పోటీల్లో పాల్గొన్నారు. వారంతా తెలంగాణ చారిత్రక కట్టడాలను, టూరిస్ట్ ప్రదేశాలను సందర్శించి తెలంగాణ చారిత్రక వైభవాన్ని ‘తెలంగాణ.. జరూర్ ఆనా’అంటూ ప్రపంచం నలుదిశలా చాటారు. పహల్గాం దాడి నేపథ్యంలో మన సైన్యానికి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. కవులు, కళాకారులకు రూ.కోటి చొప్పున పురస్కారంతెలంగాణ ఆవిర్భావ వేడుకలను పరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, జపాన్లోని కితాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీ తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం.. వివిధ పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖలకు చెందిన పోలీసులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ జరిపిన కవాతు ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా జానపద కళాకారులు ప్రదర్శనలిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, తెలంగాణ ప్రజాపోరాటానికి స్ఫూర్తినిచ్చిన 9 మంది కవులు, కళాకారులకు సీఎం రేవంత్రెడ్డి కోటి రూపాయల చొప్పున నగదు పురస్కారం అందజేశారు. 2024 డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా 9 మందికి ఒక్కొక్కరికి కోటి రూపాయల నగదు పురస్కారం అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు పురస్కారాలను చెక్కుల రూపంలో అందించిన సీఎం.. వారి సేవలను కొనియాడారు. అవార్డు అందుకున్న గద్దర్ సతీమణి.. దివంగత ప్రజాకవి గద్దర్ తరఫున ఆయన సతీమణి విమల, గూడ అంజయ్య తరఫున ఆయన సతీమణి హేమనళిని, బండి యాదగిరి తరఫున ఆయన కుటుంబసభ్యులు నగదు పురస్కారాన్ని అందుకున్నారు. గోరటి వెంకన్న విదేశాల్లో ఉండడంతో ఆయన కుమార్తె సుప్రజ స్వీకరించారు. వీరితోపాటు అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, శిల్పి ఎక్కా యాదగిరి రావు, జర్నలిస్టు పాశం యాదగిరికి నగదు పురస్కారాలు అందజేశారు. బహు భాషా సాహితీవేత్త నలిమెల భాస్కర్కు కాళోజీ పురస్కారం అందించి గౌరవించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 19 మంది పోలీస్ అధికారులకు మెడల్ ఫర్ గ్యాలంట్రీ, మరో 11 మందికి మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులను సీఎం రేవంత్రెడ్డి అందజేశారు. -
స్వేచ్ఛ ఉందని లక్ష్మణ రేఖ దాటొద్దు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది కదా అని నేతలెవరూ లక్ష్మణ రేఖ దాటొద్దని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామిక వాతావరణం ఉంటుందని.. పార్టీ నాయకులు ఏదైనా మాట్లాడాలనుకుంటే నాలుగు గోడల మధ్య అభిప్రాయాలను తెలియజేయాలని సూచించారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా నియమితులైన తర్వాత తొలిసారి ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చిన మల్లు రవి నేరుగా గాంధీ భవన్కు వచ్చి అక్కడ మాజీ చైర్మన్ జి.చిన్నారెడ్డి నుంచి బా«ధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు కమిటీ సభ్యులు కూడా బాధ్యతలు తీసుకున్నారు.ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులెవరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరాదన్నారు. క్రమశిక్షణ గీత దాటకుండా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా చూడాలని కోరారు. తాను మూడు సార్లు ఎంపీగా, ఓసారి ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించానని.. పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ పదవి రావడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. ఈ అవకాశం ఇచ్చిన ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మీనాక్షీ నటరాజన్, సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో సామాజిక న్యాయమే లక్ష్యంగా పాలనసాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో సామాజిక న్యాయమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో పాలన కొనసాగుతోందని మల్లు రవి తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గత ప్రభుత్వాలు దోపిడీ చేశాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయమే లక్ష్యంగా పలు పథకాలు, కార్యక్రమాలను చేపట్టిందని పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఏడాదిన్నరకాలంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఆశయాలకు అనుగుణంగా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. -
రాష్ట్రంలో ఓ కుటుంబ డ్రామా నడుస్తోంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పుడు ఓ కుటుంబ డ్రామా నడుస్తోందని, అధికారంలో ఉన్నప్పుడు దండుకున్న సొమ్మును పంచుకోవడంలో తలెత్తిన గొడవలే ఇందుకు కారణమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ వర్క్షాప్లో ఆయన మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలు చేసి దోచుకున్న ఆస్తుల కోసం జరుగుతున్న గొడవల్లో మనం పాత్రధారులం కావాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. కేంద్రంలో మూడుసార్లు అధికారంలోకి వచి్చన ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో మచ్చలేని పాలన సాగిస్తోందన్నారు. మోదీ పాలనపై ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమన్నారు. విద్యుత్, ఎరువులు, రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమా? అని కాంగ్రెస్కు సవాలు విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలన్నారు. రాహుల్ గాం«దీకి దేశ చరిత్ర తెలియదని ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. కాగా, తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. బీజేపీ జిల్లా, మండల పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు. వర్క్షాప్కు పలువురు డుమ్మా.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వర్క్షాప్కు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గైర్హాజరయ్యారు. మొత్తం 11 మంది ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల్లో కేవలం నలుగురు మాత్రమే హాజరయ్యారు. పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఆర్.కృష్ణయ్య, కొండా విశ్వేశ్వర్రెడ్డి, రఘునందన్రావు హజరయ్యారు. ఎంపీ కె.లక్ష్మణ్ నిజామాబాద్ పర్యటనలో ఉన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు అర్వింద్, గోడెం నగేశ్ గైర్హాజరయ్యారు. -
మొన్నటి కాంగ్రెస్ కమిటీల్లో నా పేరు లేదు అంటే..: విజయశాంతి
హైదరాబాద్: ఇటీవల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి కనబడుతోంది. తాము సీనియర్లమైనా తమకు ఈ కమిటీల్లో అవకాశం ఇవ్వలేదని లోలోన మదనపడుతున్నారు పలువురు కాంగ్రెస్ నాయకులు. ఇప్పటివరకూ దీనిపై నేరుగా ఏ కాంగ్రెస్ నేత నేరుగా విమ ర్శలు చేయకపోయినా ఈ కమిటీల్లో తమను ఎంపిక చేసి ఉండి ఉంటే బాగుంటుందనేది వారి అభిప్రాయంగా ఉంది. కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు అంశం తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా తనకు ఈ కమి టీల్లో ఏ పదవి ఇచ్చినా ఓకే అంటూ స్ప ష్టం చేశారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయశాంతి మీడియాతో చిట్ చాట్ లో.. ‘సరైన సమయంలో సరైన వ్యక్తులకు పదవులు వస్తాయి. ఎవరికి ఏ పదవులు ఇవ్వాలో అధిష్టానికి తెలుసు. మొన్నటి కమిటీలలో నా పేరు లేదు అంటే.. మరో కమిటీలో అవకాశం ఉంటుందేమో’ అనే ఆశాభావం వ్యక్తం చేశారు. అంటే ఇక్కడ విజయశాంతి కూడా కమిటీలో తనను ఎంపిక చేసే ఉంటే బాగుండేదని పరోక్షంగా సంకేతాలిచ్చారు.కాగా, రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలకు ఏఐసీసీ ఆమోదం తెలిపిన సంగతి విదితమే. పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అడ్వైజరీ కమిటీలతో పాటు డీలిమిటేషన్, పీసీసీ క్రమశిఓణ కమిటీలకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.22 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, అడ్వైజరి కమిటీలో 15 మందికి చోటు కల్పించారు. 16 మందితో ఏర్పాటయ్యే సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీలో మొత్తం ఏడు మంది సభ్యులను నియమించారు. ఇలా పలు కమిటీలకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది.పీఏసీ(పొలిటికల్ అఫైర్స్ కమిటీ)లో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్రెడ్డిలు, ఇక అడ్వైజరీ కమిటీలో రేవంత్, జానారెడ్డి, మధుయాష్కీ, గీతారెడ్డిలు ఉండనున్నారు. డీలిమిటేషన్ కమిటీ చైర్మన్ గా వంశీచందర్ రెడ్డి నియమించారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మల్లు రవి, 16 మందితో ఏర్పాటయ్యే సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్గా పి. వినయ్ కుమార్లను నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. -
పాలకుర్తిలో ఉద్రిక్తత.. కాంగ్రెస్-బీఆర్ఎస్ల మధ్య ఘర్షణ
జనగామ: జిల్లాలోని పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు అంశం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్ శ్రేణులు కొత్త నమూనా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాలనే ప్రయత్నం చేస్తుండగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. పాత నమూనా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. దాంతో ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్-బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అక్కడ భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకోవడంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో పాలకుర్తిలో పోలీసులను మోహరించి పరిస్థితిని చక్కదిద్దే యత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య కూడా తోపులాట చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెపట్టాయి. దాంతో పోలీసులను భారీగా మోహరించారు. -
అటు అభివృద్ధి.. ఇటు సంక్షేమం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి అటు అభివృద్ధి, ఇటు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రతిష్టాత్మక పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపాయి. అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు చేపట్టిన అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలతో కూడిన ప్రగతి నివేదికను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. పథకాలు.. కార్యక్రమాలు.. ప్రజాభవన్కు మహాత్మా జ్యోతిబా ఫూలే పేరు పెట్టి ప్రజలందరికీ ప్రవేశం కల్పించినప్పటి నుంచి సంగారెడ్డి జిల్లాలో ఇటీవల సీఎం రేవంత్రెడ్డి మచ్నూర్ కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించే వరకు చేపట్టిన కార్యక్రమాలను ప్రగతి నివేదికలో ప్రభుత్వం పొందుపరిచింది. ప్రజావాణి, ప్రజాపాలన, హైదరాబాద్ రైజింగ్, మహాలక్ష్మి పథకం అమలు, చేయూత, రాజీవ్ ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి, రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్గాంధీ సివిల్స్ అభయ హస్తం, రాజీవ్ యువవికాసం, పంట రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లు, ఉచిత విద్యుత్, రైతు బీమా, ఇందిరమ్మ ఆత్మీమయ భరోసా, రైతు నేస్తం, రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు, సన్నబియ్యం తదితర పథకాల అమలును నివేదికలో వివరించింది. వివిధ శాఖల్లో అమలు చేసిన కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, గత ప్రభుత్వ అప్పులకు చేసిన చెల్లింపులను అందులో పేర్కొంది. అలాగే తెలంగాణ వేదికగా బయో ఆసియా, ఏఐ గ్లోబల్ సమ్మిట్, లీడర్షిప్ సమ్మిట్, కామన్వెల్త్ మీడియేషన్, ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు, సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు, ఆటోమోటివ్స్ ఫెస్టివల్, సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్, భారత్ సమ్మిట్ మొదలైనవి జరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అభివృద్ధి ప్రణాళికలు కూడా.. సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వే–2024 కోసం చేపట్టిన చర్యలను నివేదికలో ప్రభుత్వం వివరించింది. బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీల వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానాలు చేసిన తీరును వివరించడంతోపాటు ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం చేసిన ప్రణాళికలను వెల్లడించింది. మెట్రో విస్తరణ, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, హైడ్రా ఆవిర్భావం, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యల గురించి తెలియజేసింది. కొత్త ఉద్యోగ నియామకాలను శాఖలవారీగా వెల్లడించింది. భూభారతితోపాటు స్పీడ్ పథకం కింద చేపట్టిన 19 ప్రాజెక్టులు, మూసీ పునరుద్ధరణ లాంటి కార్యక్రమాల అమలు గురించి వివరించింది. సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించింది.సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 1,266 కోట్ల సాయం ప్రగతి నివేదికలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా అందించిన సాయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. సీఎంఆర్ఎఫ్ కార్యక్రమంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని.. ప్రజాప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి 2.87 లక్షల మందికి ఈ నిధి ద్వారా రూ. 1,266 కోట్ల సాయం అందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. -
సెల్ఫోన్ టార్చ్తో ట్రీట్మెంట్పై హరీష్రావు ఫైర్
హైదరాబాద్, సాక్షి: జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో(Zaheerabad Govt Hospital Incident) సెల్ ఫోన్ వెలుతురులో వైద్యం చేసిన ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు(Harish rao) స్పందించారు. పాలన పడకేసిన రాష్ట్రంలో చివరకు ఇలాంటి దుస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారాయన.ఒకవైపు కరెంట్ కోతలు, మరోవైపు ఆసుపత్రిలో ఉన్న జనరేటర్ పని చేయదు.. చివరకు సెల్ ఫోన్ లైట్ వెలుతురులో(Cell Phone Torch Treatment) చికిత్స చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఎక్స్లో ఆయన ఓ పోస్ట్ చేశారు.రోజుకు 300కు పైగా పేషెంట్లు వచ్చే జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా(Zaheerabad Area Hospital) ఆసుపత్రి పరిస్థితి ఇలా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇతర ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉన్నట్లు అని ప్రశ్నించారు. ఏడాదిన్నరగా పాలన పడకేసిందని, పేదలకు వైద్యం అందకుండా పోతున్నది అన్నారాయన. ‘‘సీఎం రేవంత్ రెడ్డి గారూ.. గాలిలో మెడలు కట్టడం మానేసి, కనీస సౌకర్యాలు కల్పించండి’’ అని రేవంత్ను ట్యాగ్ చేస్తూ హరీశ్రావు పోస్ట్ చేశారు.ఒకవైపు కరెంట్ కోతలు, మరోవైపు ఆసుపత్రిలో ఉన్న జనరేటర్ పని చేయదు. చివరకు సెల్ ఫోన్ లైట్ వెలుతురులో చికిత్స చేయాల్సిన దుస్థితి.300 పైగా పేషెంట్లు వచ్చే జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పరిస్థితి ఇలా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇతర ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉన్నట్లు.ఏడాదిన్నరగా… pic.twitter.com/rm1o4SKaXS— Harish Rao Thanneeru (@BRSHarish) May 31, 2025 -
మూడోరోజూ కొనసాగిన కాంగ్రెస్ సమీక్షలు
సాక్షి హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ సమీక్షలు కొనసాగుతున్నాయి. మూడోరోజు శుక్రవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో నల్లగొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల నేతలతో మాట్లాడారు. రెండు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో ముఖాముఖి మాట్లాడిన ఆమె ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ పరిస్థితి, రాజకీయ సమీకరణలు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రచారం, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై నాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.జనగామ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కొమ్మూరి ప్రతాపరెడ్డి ఓటమిపై మీనాక్షి ఆరా తీసినట్టు తెలిసింది. ‘మీరు ఎందుకు ఓడిపోయారు?’అని ప్రతాపరెడ్డిని మీనాక్షి ప్రశ్నించగా.. కాంగ్రెస్ పార్టీ నేతలే ఇందుకు కారణమని ఆయన చెప్పినట్లు సమాచారం. కాగా, మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.ఉదయం 11 గంటల నుంచి ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష అనంతరం ఆదివాసీ విభాగం సమావేశంలో వారు పాల్గొంటారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు బలరాం నాయక్, రఘురామ్ రెడ్డి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ నాయకులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారని తెలిపాయి. -
త్వరలోనే ఆ బండారాన్ని ఆధారాలతో బయటపెడతా: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: కూట్లో రాయి తీయని వాడు ఏట్లో రాయి తీసినట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అంటూ మాజీ మంత్రి హరీష్రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం చేతకాని అసమర్థ రేవంత్ సర్కారు.. హిమాచల్ ప్రదేశ్ లో హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవడం మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అనే సామెతను గుర్తు చేస్తోంది’’ అంటూ హరీష్రావు ట్వీట్ చేశారు.అప్పులు పుట్టడం లేదని, తమను ఎవరు నమ్మడం లేదని ప్రతీ వేదిక మీద తన చేతకాని తనాన్ని ప్రదర్శిస్తున్న రేవంత్రెడ్డి.. 6,200 కోట్ల రూపాయలతో హిమాచల్ ప్రదేశ్లో తెల్ల ఏనుగు లాంటి హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి టీజీ జెన్కోను రంగంలోకి దింపడం ఇంకో తుగ్లక్ చర్య తప్ప మరొకటి కాదు. హిమాచల్లో హైడల్ ప్రాజెక్టు నిర్మాణ పనుల నుంచి మోసర్ బేర్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీ పారిపోయినా, ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వరంగ కంపెనీ 3 ఏండ్ల తర్వాత సాధ్యం కాదని వదిలేసిన 510 మెగావాట్ల ప్లాంట్ని కట్టేందుకు టీజీ జెన్ కో ఒప్పందం ఎందుకు చేసుకుందో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అంటూ హరీష్రావు డిమాండ్ చేశారు.‘‘రెండు దశాబ్దాల కాలంలో ఒక్కరు కూడా కట్టేందుకు ముందు రాని ప్రాజెక్ట్ను ఎందుకు నేడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టవలసి వస్తోంది?. డీపీఆర్ లేకుండానే తెలంగాణ ప్రభుత్వం హిమాచల్ ప్రభుత్వంతో ఎంవోయు చేసుకొని అప్ ఫ్రంట్ ప్రీమియం కింద 26 కోట్ల రూపాయలు చెల్లించి మరో 26 కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్ధపడడాన్ని బట్టి తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసిందని సీఎం రేవంత్ రెడ్డి చెపుతున్న మాటలు ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికేనని తేలిపోయాయి’’ అంటూ హరీష్రావు ట్వీట్ చేశారు...2009లోనే మోసర్ బేర్ కంపెనీ 64 కోట్ల అప్ ఫ్రంట్ ప్రీమియం చెల్లించి హిమాచల్ ప్రదేశ్ లోని ప్రతిపాదిత సేలి, మియార్ లో హైడ్రో పవర్ ప్రాజెక్టులు కట్టాలని భావించింది. కానీ సాంకేతికంగా, ఆర్థికంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అనంతరం తాము చెల్లించిన 64 కోట్ల ప్రీమియంని హిమాచల్ ప్రభుత్వం తిరిగి ఇవ్వనందుకు గాను ఆ రాష్ట్ర హై కోర్టును ఆశ్రయించింది. హిమాచల్ హైకోర్టు మోసర్ బేర్ కంపెనీకి వడ్డీతో సహా తీసుకున్న డబ్బును 2023 జనవరిలోనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.కూట్లో రాయి తీయని వాడు ఏట్లో రాయి తీసినట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు.రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం చేతకాని అసమర్ధ రేవంత్ సర్కారు హిమాచల్ ప్రదేశ్ లో హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవడం మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అనే సామెతను గుర్తు చేస్తోంది.…— Harish Rao Thanneeru (@BRSHarish) May 30, 2025..10 గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఢిల్లీలోని హిమాచల్ భవన్ ను వేలం వేసి ఆ డబ్బుని కంపెనీకి చెల్లించాలని 2024 నవంబర్ లో హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 7 నెలలకు పైగా అత్యధికంగా మంచు కురిసే ప్రాంతంలో హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ సాధ్యం కాదని 2019లో ఒప్పందం చేసుకున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్టీపీసీ కూడా చేతులు ఎత్తేసి ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అలాంటి అనువు కాని ప్రాంతం లో 6,200 కోట్ల రూపాయల ప్రాథమిక అంచనాతో 510 మెగా వాట్ల హైడ్రల్ ప్రవర్ ప్రాజెక్టులకు ఎందుకు రేవంత్ రెడ్డి సర్కారు ఉబలాటపడుతుందో శ్వేతా పత్రం విడుదల చేయాలని భట్టి విక్రమార్కను డిమాండ్ చేస్తున్నాం.ఫీజిబిలిటీ రిపోర్ట్లు, డీపీఆర్ లు లేకున్నా, జెన్ కో బోర్డు ఆమోదం లేకున్నా కూడా ఎంవోయూ చేసుకొని 26 కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని, అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేస్తున్నాం. రెండు కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య జరుగుతున్న గూడు పుఠాణి ఏందో గల్లీ కాంగ్రెస్ చెప్తుందా? ఢిల్లీ కాంగ్రెస్ చెప్తుందా? హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చెప్తుందా?. సాధ్యం కాదు అని 20 ఏండ్లుగా కట్టని ప్రాజెక్టును ఎవరి లాభం కొరకు, ఎవరి మెప్పు కోసం కడుతున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి.రైతు రుణమాఫీకి డబ్బు లేదంటారు.. రైతు బంధుకు డబ్బు లేదంటారు. రైతు బీమాకి డబ్బు లేదంటారు. ఆసరా పెన్షన్ కి డబ్బు లేదంటారు. మహాలక్ష్మి కింద నెలకు 2500 రూపాయలు ఇచ్చే పథకానికి డబ్బు లేదంటారు. తులం బంగారానికి డబ్బు లేదంటారు. విద్యార్థులకు ఫీ రీయింబర్స్మెంట్కి డబ్బు లేదంటారు. విద్యా భరోసాకి డబ్బు లేదంటారు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకు డబ్బు లేదంటారు. ఉద్యోగుల డీఏలకు, పీఆర్సీకి దిక్కు లేదంటారు. చివరికి అప్పు కూడా పుడుతలేదు అని అన్న రేవంత్ రెడ్డికి హిమాచల్లో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్కు 6,200 కోట్లు ఎక్కడ నుండి వస్తాయో చెప్పాలి. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని నిర్థిష్టమైన సమాచారం మా వద్ద ఉంది. త్వరలోనే కాంగ్రెస్ అవినీతి బండారాన్ని పూర్తి ఆధారాలతో బయటపెడతాం’’ అంటూ హరీష్రావు హెచ్చరించారు. -
రేవంత్ రెడ్డికి సంబీత్ పాత్రా చురకలు
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ సంబీత్ పాత్రా(Sambit Patra) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)ను శంకించే బదులు.. పోయి పాకిస్తాన్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించుకోవాలంటూ చురకలంటించారు. శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ విషయంలో కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి (Revanth Reddy) తదితరులు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ, ఆయన పార్టీ నేతలు.. పాకిస్తాన్లో ఎన్ని ఎయిర్బేస్లు ధ్వంసం అయ్యాయి?. ఉగ్రవాదులు ఎంతమంది చనిపోయారు? అని వాళ్లు అడగడం లేదు. కేవలం ఎన్ని రఫెల్స్ యుద్ధ విమానాలు పాక్ నేల కూల్చిందని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్లో ఇప్పుడు రెండు వర్గాలు తయారయ్యాయి. ఒకటి పాకిస్తాన్కు మద్దతు తెలిపేది. రెండో వర్గం.. వీళ్ల కారణంగా భారత్కు మద్దతు గళం వినిపించలేకపోతున్నది... మీ జై హిందూ యాత్ర(Jai Hind Yatra).. పాకిస్తాన్ హింద్ యాత్రలా తయారైంది. మీరు మీ యాత్రను ఆపేస్తే మంచిది. అలాగే వెళ్లి పాకిస్తాన్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించుకోండి అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ సంబీత్ పాత్రా ఎద్దేవా చేశారు.అలాగే అఖిలపక్ష ఎంపీల బృందాన్ని.. టెర్రరిస్టులతో పోలుస్తూ(ఎంపీలు ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు.. ఉగ్రవాదులూ ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు అనే కామెంట్) జైరామ్ రమేష్ వ్యాఖ్యలు చేశారు. వాళ్లేం సరదా పర్యటనలకు వెళ్లలేదు. ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరును ప్రపంచానికి తెలియజేసేందుకే వెళ్లారు. అందులో మీ ఎంపీలు కూడా ఉన్నారనే విషయం గుర్తిస్తే మంచిది’’ అని జైరామ్ను ఉద్దేశించి సంబీత్ పాత్రా అన్నారు.ఇదిలా ఉంటే.. ఉగ్రవాదంపై పోరు, పీవోకేను తిరిగి భారత్లో విలీనం చేసే చర్యలకుగానూ కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాదు పాక్ను రెండు ముక్కలు చేయడానికి తన మద్దతు పూర్తిగా ఉంటుందని తెలిపారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబితేనే మోదీ ప్రభుత్వం యుద్ధాన్ని ఆపేసి వెనక్కి వచ్చిందన్న అంశంపై రేవంత్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.‘‘ప్రధాని మోదీ వేల కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి రఫెల్ యుద్ధ విమానాల(Rafale Fighter Jets)ను కొనుగోలు చేశారు. అలాంటప్పుడు ఆ యుద్ధ విమానాల్లో ఎన్నింటిని పాక్ నేల కూల్చింది? ఈ విషయంపై చర్చ జరగదా?. వీటికి సమాధానాలు తెలియాల్సిందే’’ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో బీజేపీ చేపట్టిన తిరంగా ర్యాలీని ఆయన తప్పుబట్టారు. బీజేపీ తన చర్యలతో భారత సైనికుల్లో మనోస్థైర్యాన్ని దెబ్బ తీసిందని, ఆ పార్టీ చేపట్టిన తిరంగా ర్యాలీకి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ ‘జై హింద్ యాత్ర’ చేపడుతోందని తెలంగాణ సీఎం అన్నారు.ఇదీ చదవండి: తప్పు చేసి ఉంటేనే క్షమాపణలు చెబుతా! -
కాంగ్రెస్కు హార్ట్ బ్రేక్.. ఆర్టికల్ 370 రద్దు ప్రశంసనీయం.. హస్తం నేత వ్యాఖ్యలు
ఢిల్లీ: ఇటీవలి కాలంలో కొందరు కాంగ్రెస్ నేతలు కేంద్రంలోని బీజేపీ సర్కార్ను ప్రశంసిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. కేంద్రం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను కొనియాడుతున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ముందు వరుసలో ఉండగా.. ఇక, తాజాగా ఆ లిస్టులోకి కాంగ్రెస్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కూడా చేరిపోయారు. జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని ఆయన ప్రశంసించడంతో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370 విషయమై ఖుర్షీద్ ప్రస్తావిచడంపై కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత దౌత్య బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండోనేషియాకు వెళ్లిన బృందంలో సల్మాన్ ఖుర్షీద్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఇండోనేషియా ప్రతినిధి బృందంతో సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడారు. జమ్ము కశ్మీర్కు సంబంధించి ఆర్టికల్ 370ని రద్దు చేయడం అభినందనీయం. ప్రత్యేక హోదా ఇచ్చే రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్, భారతదేశంలోని మిగతా ప్రాంతాల నుంచి జమ్ముకశ్మీర్ వేరుగా ఉందనే భావన చాలా కాలంగా ఉంది. కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో ఈ భావన ముగిసింది. దీంతో, జమ్ముకశ్మీర్ కూడా భారత్లోని ప్రాంతమనే భావన ఏర్పడిందన్నారు. ఇదే సమయంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత, జమ్ము కశ్మీర్లో అభివృద్ధి, ఇటీవల జరిగిన ఎన్నికల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో 65 శాతం ఓటర్ల భాగస్వామ్యం ఉంది. ఇది కశ్మీర్లో ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు దోహదపడిందని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.ఇదిలా ఉండగా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ చేసిన తర్వాత కేంద్రం నిర్ణయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నేతలు తప్పుబట్టారు. ఆర్టికల్ 370ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ రద్దు కారణంగా జమ్ముకశ్మీర్ ప్రజలకు ఉన్న ప్రత్యేక హక్కులు కోల్పోతారని కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. -
క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా మల్లు రవి
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధిష్టానం పలు పీసీసీ కమిటీలను నియమించింది. మొత్తం 70 మంది సభ్యులతో కూడిన కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర మంత్రులకు ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు. అత్యధికంగా 22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే 15 మందితో సలహా కమిటీ, ఏడుగురితో డీలిమిటేషన్ కమిటీ, 16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీ, ఆరుగురితో క్రమశిక్షణ చర్యల కమిటీని నియమించారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా తెలంగాణకు చెందిన ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల బాధ్యులకు అవకాశం కల్పించారు. క్రమశిక్షణ చర్యల కమిటీని నాగర్కర్నూలు ఎంపీ మల్లు రవి చైర్మన్గా, ఎ. శ్యామ్ మోహన్ వైస్ చైర్మన్గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని వేణుగోపాల్ పేర్కొన్నారు. కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమింకుండానే పార్టీ అధిష్టానం వారికి బాధ్యతలు మాత్రం అప్పగించడం గమనార్హం. రాజకీయ వ్యవహారాల కమిటీ... మీనాక్షీ నటరాజన్ బి. మహేశ్కుమార్గౌడ్ ఎ. రేవంత్రెడ్డి భట్టి విక్రమార్క మల్లు ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి దామోదర్ రాజనర్సింహ చల్లా వంశీచంద్రెడ్డి జి. రేణుకాచౌదరి పోరిక బలరాంనాయక్ డి. శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి డి.అనసూయ (సీతక్క) మొహమ్మద్ అలీ షబ్బీర్ మహ్మద్ అజహరుద్దీన్ ఆది శ్రీనివాస్ వి. శ్రీహరి ముదిరాజ్ బీర్ల ఇల్లయ్య పి. సుదర్శన్రెడ్డి కె. ప్రేంసాగర్రావు జెట్టి కుసుమ్కుమార్ ఈరవత్రి అనిల్కుమార్ ఎక్స్ అఫీషియో సభ్యులు వీరే.. తెలంగాణకు అనుబంధంగా ఉన్న ఏఐసీసీ కార్యదర్శులు తెలంగాణకు చెందిన ఏఐసీసీ కార్యదర్శులు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల ప్రధాన బాధ్యులు ప్రత్యేక ఆహ్వానితులు... రాష్ట్ర కేబినెట్ మంత్రులు సలహా కమిటీ... మీనాక్షీ నటరాజన్ ఎ. రేవంత్రెడ్డి బి. మహేశ్కుమార్గౌడ్ వి.హనుమంతరావు కె. జానారెడ్డి కె. కేశవరావు మధుయాష్కీగౌడ్ జి. చిన్నారెడ్డి జె. గీతారెడ్డి ఎం. అంజన్కుమార్ యాదవ్ టి. జయప్రకాశ్రెడ్డి జాఫర్ జావేద్ టి. జీవన్రెడ్డి సిరిసిల్ల రాజయ్య ఎస్. రాములు నాయక్ డీలిమిటేషన్ కమిటీ... చల్లా వంశీచంద్రెడ్డి గద్వాల విజయలక్ష్మి ఆది శ్రీనివాస్ కవ్వంపల్లి సత్యనారాయణ డా. శ్రావణ్ కుమార్రెడ్డి పవన్ మల్లాది డి. వెంకట్రమణ సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ... పి వినయ్కుమార్ అద్దంకి దయాకర్ కె. శంకరయ్య ఎన్. బాలు నాయక్ అరకాల నర్సారెడ్డి ఆత్రం సుగుణ రాచమల్ల సిద్ధేశ్వరుడు సంతోష్ కోల్కొండ పులి అనిల్కుమార్ జూలూరి ధనలక్ష్మి మజీద్ఖాన్ డా. జి. రాములు అర్జున్రావు సౌరి కొల్లం వల్లభరెడ్డి వేణ్మం శ్రీకాంత్రెడ్డి క్రమశిక్షణా చర్య కమిటీ... మల్లు రవి, ఎంపీ (చైర్మన్) ఎ. శ్యామ్మోహన్ (వైస్ చైర్మన్) ఎం. నిరంజన్రెడ్డి బి. కమలాకర్రావు జాఫర్ జాయెద్ జి.వి. రామకృష్ణ -
ఎంఐఎంతో మన వైఖరి ఏంటి?
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం విషయంలో పార్టీ వైఖరేంటో స్పష్టం చేయాలని హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ను కోరారు. ఎన్నికల సమయంలో తాము ఎంఐఎంతో ప్రాణాలకు తెగించి కొట్లాడతామని, ఎన్నికలయ్యాక కాంగ్రెస్ ముఖ్యనేతలు ఆ పార్టీతో దోస్తానా చేస్తారని, ఇలాగైతే హైదరాబాదులో పార్టీ ఎలా అభివృద్ధి అవుతుందని వారు ప్రశ్నించారు. ఎంఐఎం విషయంలో ఒక వైఖరి తీసుకుని ముందుకెళ్తే తాము కూడా రాజకీయంగా ఏం చేయాలనేది నిర్ణయించుకుంటామని స్పష్టం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో భేటీ అవుతున్న మీనాక్షి నటరాజన్ రెండో రోజు గురువారం మహబూబ్నగర్, చేవెళ్ల, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని నేతలతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ నేతలు ఎంఐఎం అంశాన్ని ఆమె వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. జిల్లాలో పార్టీకి పెద్దదిక్కు లేదు. ’హైదరాబాద్ జిల్లాలో పార్టీకి పెద్దదిక్కు లేదు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు హైదరాబాద్ జిల్లాకు చెందిన ఒక నాయకుడికి కూడా నామినేటెడ్ పదవి ఇవ్వలేదు. ఎంఐఎంతో కొట్లాడినప్పుడు మా మీద కేసులు పెట్టారు. ఆ కేసులు ఎత్తేయాలని కోరినా పట్టించుకునే నాథుడు లేడు. జిల్లా ఇన్చార్జి మంత్రి మమ్మల్ని కలవరు. సీఎం అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వరు’ అని మీనాక్షి నటరాజన్ వద్ద హైదరాబాద్ నేతలు మొరపెట్టుకున్నట్టు తెలిసింది. వారి విజ్ఞాపనలు విన్న మీనాక్షి అన్ని అంశాలు పార్టీతో మాట్లాడతానని, హైదరాబాద్ జిల్లాలో పార్టీ అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్దామని చెప్పినట్లు తెలిసింది. చేవెళ్ల, మహబూబ్గర్ లోక్సభ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేతలు కూడా మీనాక్షితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత గురించి వారితో మాట్లాడినట్టు తెలిసింది. పాలమూరు లోక్సభ నియోజకవర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మంత్రులు తమ నియోజకవర్గాలకు అధిక నిధులు తీసుకెళ్తున్నారని, దీనివల్ల తమకు నష్టం జరుగుతోందని, మంత్రులతో సమానంగా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నచోట్ల కూడా నిధులిచ్చేలా చూడాలని మీనాక్షిని కోరినట్లు తెలిసింది. -
కాంగ్రెస్ మునిగే నావ నేనెందుకు చేరతా: కవిత
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ మునిగి పోయే పడవ. ఆ పార్టీలో నేనెందుకు చేరతా?. చేరితే ఏంటి లాభం? నేను కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరిపినట్లు జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధం. నేను కేసీఆర్కు రాసిన లేఖను కుట్రపూరితంగా లీక్ చేశారు. 2013 తర్వాత నేను కాంగ్రెస్ నేతలు ఎవరితోనూ మాట్లాడలేదు. రెండు జాతీయ పార్టీలు.. కాంగ్రెస్, బీజేపీతో తెలంగాణకు నష్టమే. అయినా బీఆర్ఎస్ను కొందరు నేతలు బీజేపీకి అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు 101 శాతం ప్రయత్నాలు జరిగాయి. నేను మద్యం కేసులో జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదనను నా వద్దకు తీసుకు వస్తే వ్యతిరేకించా. బీఆర్ఎస్ స్వతంత్రంగా ఉండాలన్నదే నా అభిమతం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, ఆరు నెలలు కాదు.. ఏడాదైనా జైల్లో ఉంటా.. పార్టీని బీజేపీలో విలీనం చేయొద్దని కోరా. అప్పటినుంనే నా తండ్రి కేసీఆర్ నుంచి నన్ను విడదీసే కుట్రలు, పార్టీకి, కుటుంబానికి దూరం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నన్ను పార్టీ నుంచి బయటకు పంపితే జరిగే లాభం ఎవరికి?’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్కు ఆమె రాసిన లేఖ బయటకు రావడం, ఆ నేపథ్యంలో కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించడం, తదితర పరిణామాల నేపథ్యంలో..కవిత గురువారం తన నివాసంలో మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. పార్టీ పనితీరు, నేతల వ్యవహారశైలి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అన్న కేటీఆర్ పేరు ప్రస్తావించకుండా ఆయనపై.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు కవిత మాటల్లోనే.. పార్టీని కేసీఆర్ కాపాడుకోవాలి.. కేసీఆర్కు 25 ఏళ్లుగా వందల లేఖలు రాస్తున్నా. అందులో తప్పేముంది. సాధారణంగా లేఖను చదివిన కేసీఆర్ చింపేస్తారు. నా కర్మ బాగా లేకో మరొకటో తెలియదు. కానీ ఎవరో కుట్ర పూరితంగా లేఖను బయటకు లీక్ చేశారు. లీకు వీరులను బయట పెట్టి చర్యలు తీసుకోవాలని కోరుతుంటే గ్రీకు వీరుల్లా ప్రవర్తిస్తున్నారు. నేను మా నాన్నకు లేఖ రాస్తే మీకు నొప్పేంది? నాపై ప్రతాపం చూపడం మానుకుని కాంగ్రెస్, బీజేపీపై చూపండి. నేను అసలే మంచిదాన్ని కాదు.. నోరు విప్పితే తట్టుకోలేరు. లేఖలో నేను సూచించిన అంశాల్లో ఒక్కటైనా తప్పుందా? కోవర్టులే పార్టీకి నష్టం చేస్తున్నారు. గతంలో పార్టీలో ఉన్న పెద్ద నాయకులు ఇప్పుడు రేవంత్ దగ్గర ఉన్నారు. నాతో ఉన్న నాయకులు ఎవరూ కాంగ్రెస్లో చేరలేదు. నేను ఎన్నడూ పదవులు అడగలేదు. ఆత్మాభిమానం మాత్రమే కోరుకుంటా. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించను. నల్లి కుట్ల రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు చేయకుండా ఏ అంశంపైనైనా నేరుగా మాట్లాడతా. నేను బీఆర్ఎస్కు వ్యతిరేకం కాదు. కొత్త పార్టీ అవసరం లేదు. ఉన్న పార్టీని బాగా చూసుకుంటే చాలు. పార్టీని కేసీఆర్ కాపాడుకోవాలి. వారిద్దరూ ఎవరికి దగ్గరో అందరికీ తెలుసు రాజ్యసభ ఎంపీ దామోదర్రావు, గండ్ర మోహన్రావును నా వద్దకు ఎవరు పంపారో తెలియదు. కానీ వారిద్దరూ ఎవరికి దగ్గరో అందరికీ తెలుసు. వారు నాతో చర్చించింది ఒకటి.. బయటకు లీక్ చేసింది మరొకటి. ఇతర నేతల విషయాల్లో స్పందిస్తున్న పార్టీ నాయకత్వం.. నేను పార్టీ ఎమ్మెల్సీని అయినా నాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఎందుకు స్పందించడం లేదు? లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నేను కారణమైతే నాపై, లేదంటే అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. పెయిడ్ ఆర్టిస్టులతో నాపై తప్పుడు ప్రచారం చేయిస్తూ సోషల్ మీడియాలో మహాభారతం కేరక్టర్లు వేస్తున్నారు. ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మంచిదేనా? లీకు వీరులను కట్టడి చేయకుండా పెయిడ్ ఆర్టికల్స్ రాయిస్తే భయపడేది లేదు. 2006లో తెలంగాణ జాగృతి స్థాపించింది మొదలుకుని ఎనిమిదేళ్లు కేసీఆర్ నీడలో సైనికురాలిగా పనిచేశా. కడుపులో బిడ్డను పెట్టుకుని ఉద్యమంలో నా శక్తి మేరకు పనిచేశా. కేసీఆర్ వారించడంతోనే రాజీనామాపై వెనక్కి ఢిల్లీ మద్యం కేసులో కేసు నమోదు చేస్తే ఎమ్మెల్సీకి, పార్టీ పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్కు చెప్పా. కానీ కుట్రతో బీజేపీ కేసులు పెట్టిందని కేసీఆర్ వారించడంతోనే పదవిలో కొనసాగుతున్నా. 2019లో లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీచేస్తే సొంత పార్టీ వారే కుట్రపూరితంగా ఓడించారు. ఎమ్మెల్యేలు నా గెలుపు కోసం పనిచేయలేదు. అయితే అదే నిజామాబాద్ జిల్లాలో నాకు ప్రొటోకాల్ ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ నాకు మండలి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరినొకరు ఓడించుకున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి పదవుల కోసం పోటీ పడి ఒకరినొకరు ఓడించుకున్నారు. కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ ఏం కార్యాచరణ తీసుకుంది? నేతలు ఎవరూ ఎందుకు స్పందించలేదు? క్షేత్రస్థాయిలో ఉద్యమ కార్యాచరణ ఎందుకు చేపట్టడం లేదు? నోటీసులపై కార్యాచరణ చేపట్టకుండా అమెరికాలో పార్టీ రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తే ఏం లాభం? నన్ను రేవంత్రెడ్డి కోవర్టు అనడం ఎంత వరకు కరెక్ట్? ట్విట్టర్ మెసేజ్లు సరిపోతాయా? పార్టీ నేతల కాలేజీలపైకి బుల్డోజర్లు పోతుంటే ఎందుకు అడ్డుకోవడం లేదు? వారు పార్టీ తరఫున పోటీ చేయడమే తప్పా? తెలంగాణ సోయిలో పరిపాలన జరగడం లేదని బీఆర్ఎస్ నాయకులు గళం ఎత్తి పోరాడకుంటే పార్టీ ఎలా ముందుకు పోతుంది? మీడియా సెల్ పెట్టుకుని దాడులు చేస్తూ క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయకుండా ట్విట్టర్లో మెసేజ్లు పెడితే సరిపోతాయా? నీటిపారుదల అంశంపై ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. ట్వీట్లకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఉద్యమం చేయాలి. బీఆర్ఎస్లో ఒకేఒక్క లీడర్ కేసీఆర్ కేసీఆర్ కృషితోనే వరంగల్ సభ విజయవంతం అయింది. కొందరు నేతలు కేసీఆర్ నీడలోనే బతుకుతున్నామనే విషయాన్ని గుర్తించి, కేసీఆర్ను తామే మోస్తున్నామనే భ్రమ నుంచి బయటకు రావాలి. నా కుటుంబాన్ని వదిలి నేను ఎందుకు వెళ్తాను? నేను ఎవరి నాయకత్వం కిందా పని చేయను. బీఆర్ఎస్లో ఒకేఒక్క లీడర్ కేసీఆర్. ఆయన బలమైన నాయకుడు. ఆయన నాయకత్వంలో మాత్రమే పనిచేస్తా. ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. కేటీఆర్కు వర్కింగ్ ప్రెసిడెంట్గా గౌరవం ఇస్తా. చంద్రబాబు ఏం చేసినా కేంద్రం అడ్డుకోవడం లేదు ఏపీ సీఎం చంద్రబాబు ఏం చేసినా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవటం లేదు. ఏపీ చేపట్టనున్న బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీరని నష్టం జరుగుతుంది. ప్రజాభవన్లో రేవంత్తో మీటింగ్ తర్వాతే చంద్రబాబు బనకచర్లపై ప్రకటన చేశారు. గోదావరి జలాల్లో తెలంగాణకు వాటా లేకుండా చేయాలనే కుట్రలో భాగంగానే 200 టీఎంసీల ప్రాజెక్టును తెరమీదకు తెచ్చారు.జాగృతిని విస్తృతం చేస్తా..మరో 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటా నేను మరో 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటా. పార్టీ చేయని పనులు సగం మేర నేనే చేస్తున్నా. ఉద్యమ సంస్థగా ఏర్పడిన తెలంగాణ జాగృతి పది విభాగాలతో బలంగా ఉంది. దీనిని మరింత విస్తరించడంతో పాటు కార్యాలయాన్ని అశోక్నగర్ నుంచి బంజారాహిల్స్కు మారుస్తాం. త్వరలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించడంతో పాటు నీటిపారుదల, బీసీలకు సంబంధించిన అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలతో స్పీడ్ పెంచుతాం. సింగరేణిని అమ్మే కుట్రలపై, కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ కార్యాచరణ చేపట్టాలి. లేనిపక్షంలో తెలంగాణ జాగృతి తరఫున కార్యాచరణ ప్రకటిస్తాం.పులిబిడ్డ ఎక్కడికీ పోదు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యాఖ్యలు సేవాలాల్ ఆలయంలో పూజలకు హాజరైన ఎమ్మెల్సీ కవితమేడ్చల్: గుండ్లపోచంపల్లి హనుమాన్ గడ్డ సమీపంలో గల సేవాలాల్ తండాలోని సేవాలాల్ ఆలయంలో వార్షికోత్సవ పూజలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. గురువారం మధ్యాహ్నం తన నియోజకవర్గంలోని ఆలయానికి విచ్చేసిన కవితకు పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి అనుచరులతో కలిసి స్వాగతం పలికారు. ఉదయం కవిత కార్యక్రమం ఖరారు కాగానే ఎమ్మెల్యే కార్యాలయం నుంచి పార్టీ కేడర్కు సందేశాలు వెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో గుండ్లపోచంపల్లికి చేరుకున్నారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి అరగంట ముందే అక్కడికి చేరుకుని ఏర్పాట్లు పర్యవేక్షించారు. గిరిజన సంప్రదాయ బద్ధంగా డప్పులు, బ్యాండు మేళాలతో, బోనాలతో స్వాగత ఏర్పాట్లు చేశారు. అందరికీ గులాబీ రంగు పగిడీలు ఏర్పాటు చేయించారు. అరగంట సేపు ఆలయం వద్ద ఉన్న కవిత.. ఇటీవలి పరిణామాలపై ఏమీ మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. మీడియా మాట్లాడించే ప్రయత్నం చేసినా చిరునవ్వుతో దాట వేశారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ.. కవిత పులిబిడ్డ అని, పుట్టిన బిడ్డ పులివద్దనే ఉంటుందని, ఎక్కడికీ పోదని అన్నారు. కవిత ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ను వీడి వెళ్ళరని, ఎవరూ ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. -
భారతీయుల ఆత్మగౌరవం ట్రంప్ దగ్గర తాకట్టా?: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులతో ప్రధాని మోదీ పాకిస్తాన్తో యుద్ధం విరమించారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని, దేశ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. ‘అమెరికా ఒత్తిడికి తలొగ్గి యుద్ధాన్ని అర్ధాంతరంగా ఆపేస్తారా? భారతీయుల ఆత్మగౌరవాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెడతారా? యుద్ధం అంటే ధైర్యం, వెన్నెముక, యుద్ధతంత్రం ఉండాలని ప్రగల్భాలు పలికిన ప్రధాని మోదీ నాలుగు రోజుల యుద్ధం తర్వాత అర్ధాంతరంగా ఎందుకు ఆపేశారు? పాకిస్తాన్తో యుద్ధంలో రఫేల్ విమానాలు ఎన్ని నేలకూలాయో లెక్క చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం బాచుపల్లి వీఎన్ఆర్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకూ జైహింద్ యాత్ర కొనసాగింది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్రెడ్డి ప్రసంగించారు. కాంగ్రెస్ హయాంలోని యుద్ధ విమానాలే పాకిస్తాన్తో యుద్ధంలో దేశ ఆత్మ గౌరవాన్ని కాపాడాయని, మోదీ కొనుగోలు చేసిన రఫేల్ విమానాలు మాత్రం యుద్ధంలో నేలకూలాయని ఎద్దేవా చేశారు. యుద్ధం చేయాలనుకున్నప్పుడు అఖిలపక్షాన్ని పిలిచారని.. యుద్ధం ఆపేసినప్పుడు అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. యుద్ధంపై ఉపన్యాసాలు చెప్పడం కాదు. దేశ ప్రజలకు మోదీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇందిరను స్ఫూర్తిగా తీసుకోవాలి పాకిస్తాన్తో యుద్ధంలో అపరకాళీ ఇందిరా గాంధీని ప్రధాని మోదీ స్ఫూర్తిగా తీసుకుంటే బాగుండేదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గతంలో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు యుద్ధం ఆపాలని ఇందిరా గాం«దీని అప్పటి అమెరికా అధ్యక్షుడు బెదిరించారని, కానీ ఆమె అమెరికా బెదిరింపులకు లొంగలేదన్నారు. భారత్ వైపు ఎవరు కన్నెత్తి చూసినా కనుగుడ్లు పీకేస్తామని.. చైనాకు ఇందిరాగాంధీ వార్నింగ్ కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆనాడు చైనాపై యుద్ధం ప్రకటించి గట్టిగా బుద్ధి చెప్పిన ఘనత ఇందిరమ్మదన్నారు. భారత ఆర్మీ కల్నల్ సంతోష్ను చైనా పొట్టన పెట్టుకుంటే మోదీ కనీసం చైనాకు బుద్ధి చెప్పే ప్రయత్నం కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 1971లో భారత్–పాక్ యుద్ధ సమయంలో అమెరికా మధ్యవర్తిత్వం అవసరం లేదని ఇందిరా గాంధీ నిర్మొహమాటంగా చెపారని, యుద్ధంలో ఇందిరమ్మ పాకిస్తాన్ను రెండు ముక్కలు చేసి చూపారన్నారు. ఇందిరమ్మ స్ఫూర్తితో పాక్ను రెండు ముక్కలు చేయాలని.. తాము మద్దతుగా ఉంటామని చెప్పారు. పాకిస్తాన్కు గుణపాఠం చెప్పడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని రేవంత్ కోరారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్లో కలుపుకొనేందుకు పాక్పై యుద్ధం చేయాలని, రాజకీయాలకు అతీతంగా అండగా ఉంటామని చెప్పామన్నారు. భారత్పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారని, ఉగ్రవాదులను తుదముట్టించే వరకూ సైన్యానికి అండగా ఉంటామని తెలిపారు. రాహుల్ గాంధీపై విమర్శలా? అమెరికాకు తలొగ్గి యుద్ధం విరమించిన బీజేపీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాందీపై విమర్శలు చేయడం విడ్దురంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. భారత్ 1967లో చైనాను, 1971లో పాకిస్తాన్ను ఓడించినందుకు కాంగ్రెస్ను విమర్శిస్తున్నారా ఎద్దేవాచేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, గాంధీ కుటుంబానిదన్నారు. మోదీకి వీరతిలకం దిద్ది పాకిస్తాన్పై యుద్ధం చేయాలని చెబితే.. ఎందుకు వెనుకడుగు వేశారో బీజేపీ నేతలే చెప్పాలన్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని, మీ సొంత వ్యవహారం కాదని ధ్వజమెత్తారు. గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తారన్నారు. భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని బీజేపీ దెబ్బతీస్తే.. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు కాంగ్రెస్ జైహింద్ యాత్ర చేపట్టిందని చెప్పారు. రాహుల్ గాందీని దేశానికి ప్రధానిగా చూసే వరకు మనం విశ్రమించొద్దని పార్టీ కార్యకర్తలకు రేవంత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
షర్మిలలా అమ్ముడుపోను.. అధికారం కోసం పాకులాడే రకం కాదు
-
కాంగ్రెస్ నేతల విమర్శలకు శశి థరూర్ కౌంటర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) సొంత పార్టీ నేతలు తనపై గుప్పిస్తున్న విమర్శలకు స్పందించారు. సర్జికల్ స్ట్రైక్స్పై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను గత యుద్ధాల గురించి ఏమాత్రం ప్రస్తావించలేదని స్పష్టం చేశారాయన. ఈ క్రమంలో.. తనను విమర్శించిన నేతలకూ తనదైన శైలిలో చురకలంటించారు.‘‘గతంలో నియంత్రణ రేఖ(LOC) అవతల భారతీయ పరాక్రమం గురించి నాకు తెలియదని అనుకునే ఉత్సాహవంతుల(zealots) కోసమే ఇది. నేను ప్రస్తుతం జరిగిన ఉగ్రదాడుల గురించి మాత్రమే మాట్లాడాను. గత యుద్ధాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు’’ ఎక్స్లో శశి థరూర్ పోస్ట్ చేశారు. అయితే ఎప్పటిలాగే తన అభిప్రాయాలపై విమర్శలు, ట్రోల్స్ చేసేవాళ్లకు స్వాగతం చెబుతూ.. చేయడానికి తనకెన్నో మంచి పనులు ఉన్నాయంటూ పోస్టులో పేర్కొన్నారు. After a long and successful day in Panama, i have to wind up at midnightvhere with departure for Bogota, Colombia in six hours, so I don’t really have time for this — but anyway: For those zealots fulminating about my supposed ignorance of Indian valour across the LoC: in tge…— Shashi Tharoor (@ShashiTharoor) May 29, 2025థరూర్ ఏమన్నారంటే.. ఐదు దేశాల్లో పర్యటిస్తున్న అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న శశి థరూర్ పనామాలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ గతంలో ఉగ్రదాడులను భారత్ భరిస్తూ వచ్చిందని, కానీ, ఇటీవలి కాలంలో మాత్రం దెబ్బకు దెబ్బ తీస్తోందని పేర్కొన్నారు. మోదీ హయాంలో జరిగిన ఉరీ(2016), పుల్వా మా, పహల్గాం ఉగ్రదాడులను ప్రస్తావిస్తూ.. ఈ దాడుల అనంతరం పాకిస్థాన్లోకి వెళ్లి మరీ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామని ప్రసంగించారు. అయితే 2016లో ప్రధాని మోదీ సారథ్యంలో తొలిసారి భారత సైన్యం పాక్లోకి చొచ్చుకుపోయిందని శశి థరూర్ చెప్పారని విమర్శించిన కాంగ్రెస్ నేత ఉదిత్రాజ్.. థరూర్ను బీజేపీ సూపర్ అధికార ప్రతినిధిగా నియమించాలి అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరోవైపు థరూర్కు బీజేపీ నేతలు మద్దతుగా నిలవడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా థరూర్కు మద్దతు తెలుపుతూ.. కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు.ఇదీ చదవండి: థరూర్ లక్ష్మణ రేఖ దాటారా? -
కాంగ్రెస్, బీజేపీ మధ్య చిచ్చు పెట్టిన శశిథరూర్ వ్యాఖ్యలు
-
Shashi Tharoor: లక్ష్మణ రేఖ దాటినా.. అనూహ్య మద్దతు
గత కొంత కాలంగా బీజేపీ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్(Shashi Tharoor).. ఎల్వోసీపై తాజాగా చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే తీవ్ర దుమారం రేపాయి. సొంత పార్టీ నేతలు ఆయన్ని తిట్టిపోస్తుంటే.. అనూహ్యంగా బీజేపీ నేతల నుంచి ఆయనకు మద్దతు లభిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.పార్టీ వైఖరికి భిన్నంగా శశి థరూర్(Shashi Tharoor) మాట్లాడుతున్నారని, ఒకరకంగా ఆయన ‘లక్ష్మణరేఖ’ను దాటారని పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారంటూ తాజాగా పీటీఐ వార్తాసంస్థ వెల్లడించింది. ఈ వివాదంలో కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ శశి థరూర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ప్రియమైన శశి థరూర్.. మిమ్మల్ని బీజేపీ సూపర్ అధికార ప్రతినిధిగా నియమించేలా ప్రధాని మోదీని ఒప్పించగలిగితే ఎంతో బాగుండేది. మీరు భారత్కు తిరిగి వచ్చేలోగానే మిమ్మల్ని విదేశాంగ మంత్రిగా ప్రకటించగలిగితే ఇంకా బాగుండేది. మోదీ ప్రధానమంత్రి కాక పూర్వం భారత్ ఆధీనరేఖను దాటిపోలేదని మీరన్నారు. తద్వారా కాంగ్రెస్ భవ్యచరిత్రను అప్రతిష్ఠపాలు చేశారు’’ అని ఉదిత్రాజ్ అన్నారు. ‘‘1965లో భారత్ పాకిస్థాన్లోని లాహోర్ సెక్టారులో పలుప్రాంతాల్లోకి చొచ్చుకుపోయింది. 1971లో భారత్ పాకిస్థాన్ను రెండుగా విడగొట్టింది. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉండగా అనేక సర్జికల్ స్ట్రైక్లు(Surgical Strikes) నిర్వహించారు. అయితే ఆ విజయాల నుంచి రాజకీయ ప్రయోజనం పొందేందుకు అప్పట్లో డప్పు వాయించుకోలేదు’’ అని ఉదిత్రాజ్ పోస్ట్ చేశారు.My dear @ShashiTharoor Alas ! I could prevail upon PM Modi to declare you as super spokesperson of BJP , even declaring as foreign minister before landing in India . How could you denigrate the golden history of Congress by saying that before PM Modi , India never crossed LOC… https://t.co/c88b8rX2bq— Dr. Udit Raj (@Dr_Uditraj) May 28, 2025కాంగ్రెస్ నేత పవన్ఖేరా స్పందిస్తూ.. యూపీఏ హ యాంలో పాకిస్థాన్ మీద పలుమార్లు సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించామని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ స్వయంగా చెప్పిన వీడియోను శశి థరూర్కు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ అనేవి మోదీ ప్రధాని అయిన తర్వాతనే ప్రారంభం కాలేదని, గతంలోనూ అనేకసార్లు జరిగాయని, అయితే, దేశభద్రతకు సంబంధించిన అటువంటి సున్నిత సమాచారాన్ని తాము ఎన్నడూ రాజకీయ ప్రచారానికి వాడుకోలేదని అన్నారాయన.థరూర్ ఏమన్నారంటే.. ఐదు దేశాల్లో పర్యటిస్తున్న అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న శశి థరూర్ పనామాలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ గతంలో ఉగ్రదాడులను భారత్ భరిస్తూ వచ్చిందని, కానీ, ఇటీవలి కాలంలో మాత్రం దెబ్బకు దెబ్బ తీస్తోందని పేర్కొన్నారు. మోదీ హయాంలో జరిగిన ఉరీ(2016), పుల్వా మా, పహల్గాం ఉగ్రదాడులను ప్రస్తావిస్తూ.. ఈ దాడుల అనంతరం పాకిస్థాన్లోకి వెళ్లి మరీ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామని ప్రసంగించారు. బీజేపీ మద్దతుగా.. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్థాన్పై భారత వైఖరిని వివిధ దేశాలకు స్పష్టం చేసేందుకు కేంద్రం పంపిన అఖిలపక్ష పార్టీల ప్రతినిధి బృందంలో శశి థరూర్ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్ ఆయన్ని పక్కనపెట్టినప్పటికీ.. కేంద్రం ఆయనకు అందులో చోటు ఇవ్వడం గమనార్హం. అయితే.. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే థరూర్పై దాడి జరుగుతోందని, దేశం కన్నా గాంధీ కుటుంబమే కాంగ్రెస్కు ముఖ్యమని బీజేపీ విమర్శించింది. అసలు కాంగ్రెస్ ఎవరికి మద్దతిస్తోంది? దేశం కోసం మాట్లాడటం ఆ పార్టీలో నిషేధమా? అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఏం కావాలి. వారికి దేశం పట్ల నిజంగా ఎంత శ్రద్ధ ఉంది?. భారత ఎంపీలు విదేశాలకు వెళ్లి భారత్కు, ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడాలని కోరుకుంటోందా?. రాజకీయ వైరాగ్యానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది’’ అని కిరణ్ రిజిజు ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. మరోవైపు.. What does the Congress party want & How much they really care for the country? Should the Indian MPs go to foreign nation and speak against India and its Prime Minister? There’s limit to political desperation! https://t.co/JiuYqpW2tN— Kiren Rijiju (@KirenRijiju) May 28, 2025బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా థరూర్కు మద్దతు పలికారు. "శశి థరూర్ గాంధీ కుటుంబానికి కాకుండా, దేశానికి ప్రథమ స్థానం ఇచ్చారు కాబట్టే ఆయనపై కాంగ్రెస్ దాడి చేస్తోంది. పార్టీ ప్రయోజనాల కన్నా జాతీయ ప్రయోజనాల గురించి, ఓటు బ్యాంకు రాజకీయాల కంటే జాతీయ విధానానికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టే ఆయన లక్ష్యంగా మారారు" అని పూనావాలా పేర్కొన్నారు. "పాకిస్థాన్కు క్లీన్ చిట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎక్కువ ఆసక్తి చూపుతోంది. నేడు కాంగ్రెస్, పాకిస్థాన్ డీజీలా మాట్లాడుతూ సొంత నేతపైనే విమర్శలు చేస్తోంది" అని పూనావాలా ఘాటుగా వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: చీకటి ఆ కుటుంబాన్ని చిమ్మ చీకట్లోకి నెట్టేసింది! -
ఆంధ్రజ్యోతిది జర్నలిజమా.. శాడిజమా?: కవిత
సాక్షి, హైదరాబాద్: పార్టీలో సముచిత స్థానం ఇవ్వకుంటే తాను కొత్త పార్టీ పెడతానంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనంపై ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కాంగ్రెస్లో చేరేందుకు రాయబారం చేస్తున్నారని వచ్చిన కథనంపైనా ఆమె మండిపడ్డారు. హస్తం గూటికి చేరుకునేందుకు మధ్యవర్తి ద్వారా కవిత సంప్రదింపులు జరుపుతున్నారంటూ ఆ పత్రికలో రాయడంపై బుధవారం ‘ఎక్స్’వేదికగా సీరియస్ అయ్యారు. ‘కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాసిన పత్రికది జర్నలిజమా లేక శాడిజమా?’అని ప్రశ్నించారు. కేసీఆర్తో తాడోపేడో తేల్చుకోవాలని కవిత అనుకుంటున్నారని సదరు పత్రికలో వచ్చిన కథనంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మన ప్రత్యర్థి బీఆరెస్సా.. బీజేపీనా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీలో తాజా పరిణామాలు ఏంటి? అని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ ఆరా తీశారు. బుధవారం ఆమె ఏడు పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన నేతలతో ముఖాముఖి సమావేశమయ్యారు. హైదరాబాద్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులతో విడివిడిగా సమావేశమయ్యారు. ‘క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితేంటి? కార్యకర్తలు ఏమనుకుంటున్నారు? రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు ఎలా జరుగుతోంది? ప్రభుత్వం గురించి ప్రజలేమనుకుంటున్నారు? పార్టీ పదవులు ఇచ్చేందుకు పరిగణనలోకి తీసువాల్సిన ప్రాతిపదిక ఏంటి? తెలంగాణలో అసలైన రాజకీయ ప్రత్యర్థిగా బీఆర్ఎస్ను పరిగణించాలా? బీజేపీని తీసుకోవాలా? ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? ఆదిలాబాద్ జిల్లాల్లో పార్టీ పూర్తిగా వెనుకబడటానికి కారణమేంటి? అని నేతలను ప్రశ్నించినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, పార్టీ నేతల జవాబులను ఆమె నోట్ చేసుకున్నారని, ఈ సమాచారాన్ని క్రోడీకరించి అధిష్టానానికి నివేదిక అందజేస్తారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వంతో సమన్వయం ఉండాలి ఒక్కో నేతకు 10 నిమిషాల సమయం ఇచ్చిన మీనాక్షి.. పలు అంశాలపై సమాచారం రాబట్టారు. సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు లాంటి పథకాలు ప్రభుత్వానికి ప్రజల్లో మైలేజీ తెస్తున్నాయని కొందరు ఎమ్మెల్యేలు చెప్పగా.. మరికొందరు పలువురు మంత్రుల వ్యవహారశైలిపై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఆపరేషన్ సిందూర్ను అకస్మాత్తుగా విరమించుకోవటంతో బీజేపీ, ప్రధాని మోదీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని, బీఆర్ఎస్లో కుటుంబ కలహాలతో కేడర్ నిస్తేజంగా మారిందని కొందరు నేతలు తెలిపారు. ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే సానుకూల ఫలితాలు వస్తాయని సూచించినట్లు సమాచారం. నేతల మధ్య సమన్వయ లేమితోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినట్లు కొందరు తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్లు తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరినట్టు సమాచారం. సరస్వతి పుష్కరాల సందర్భంగా అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని పెద్దపల్లి ఎంపీ వంశీ, ఆయన తండ్రి వివేక్ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం ఉండాలని.. అందరూ సర్దుకుపోయి పనిచేయాలని మీనాక్షి నేతలకు సూచించినట్లు సమాచారం. గురువారం మిగిలిన లోక్సభ నియోజకవర్గాల నేతలతో మీనాక్షి నటరాజన్ సమావేశమవుతారని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. పార్టీ బలోపేతం గురించి అడిగారు: రేఖా నాయక్ మీనాక్షితో భేటీ తర్వాత పలువురు ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు మీడియాతో మాట్లాడారు. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్ మాట్లాడుతూ.. పార్టీని భవిష్యత్తులో ఎలా బలోపేతం చేయాలన్న అంశంపై మీనాక్షి మాట్లాడారని చెప్పారు. ఇందుకు గల వ్యూహం గురించి, భవిష్యత్తు సవాళ్లను ఎలా అధిగమిస్తారనే విషయాల గురించి మాట్లాడారని వివరించారు. డీసీసీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పినట్లు తెలిపారు. నేను చెప్పాల్సింది చెప్పా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్కు తాను చెప్పదల్చుకున్న విషయాలన్నింటినీ చెప్పానన్నారు. తనకు మీడియాలో కనిపించాలన్న తాపత్రయం లేదన్న ఆయన.. అన్ని విషయాలను ఇన్చార్జికి వివరించినట్లు వెల్లడించారు. తాను కూడా మంత్రిపదవికి అర్హుడనేనని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ పేర్కొన్నారు. చాలా రోజుల క్రితమే తన మనసులో మాటను సీఎం రేవంత్రెడ్డికి చెప్పానని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కూడా అడిగానని వెల్లడించారు. మీనాక్షి ఓ డాక్టర్ మీనాక్షి నటరాజన్ డాక్టర్ పని చేస్తున్నారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. త్వరలోనే సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్లతో కలిసి ఆమె తగిన ట్రీట్మెంట్ కూడా ఇస్తారని, పారీ్టలో అన్నీ సెట్ చేస్తారని చెప్పారు. తన నియోజకవర్గ సమస్యలేవైనా ఉంటే లేఖ రూపంలో ఇవ్వాలని మీనాక్షి అడిగారని వెల్లడించారు. కార్యకర్తలపై ఫోకస్ పెట్టాలని సూచించినట్లు పేర్కొన్నారు. -
యంగ్ ఇండియా నా బ్రాండ్.. మీరే నా అంబాసిడర్లు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పాతికేళ్లు వచ్చే వరకు కష్టపడిన ప్రతి వ్యక్తి జీవితంలో స్థిరపడతారని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. ప్రతి మనిషికి మొదటి పాతిక సంవత్సరాలు ముఖ్య కాలమని, అందులోనూ 15 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు అత్యంత కీలకమైనదని తెలిపారు. ఈ సమయంలో క్రమశిక్షణతో, నిబద్ధతతో ఉండాలని సూచించారు. రంగుల ప్రపంచానికి ఆకర్షితులు కాకుండా కెరీర్పై దృష్టి సారిస్తేనే జీవితంలో మంచి స్థానానికి చేరుకుంటారని విద్యార్థులకు హితబోధ చేశారు. బుధవారం బంజారాహిల్స్లోని బాబూ జగ్జీవన్రామ్ ఆడిటోరియంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ నిర్వహించిన 2024–25 ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి సీఎం ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఐఐటీలు, ఎన్ఐటీలు, మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించిన గురుకుల విద్యార్థులకు ల్యాప్టాప్లు బహూకరించారు. గురుకులాల్లో ఇంటర్మీడియట్, పదోతరగతి చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పదోతరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలకు రూ.5 లక్షల చొప్పున చెక్కులు బహూకరించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా గురుకులాలను తయారు చేస్తున్నామని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని తెలిపారు. ఒక్కో పాఠశాలకు రూ.200 కోట్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు. యంగ్ ఇండియా తన బ్రాండ్ అని, గురుకుల విద్యార్థులే తన బ్రాండ్ అంబాసిడర్లు అని పేర్కొన్నారు. కులవృత్తుల పేరుతో బీఆర్ఎస్ మోసం కులం పేరుతో ఎవరికీ అవకాశాలు రావని, కష్టపడి చదువుకున్న వాళ్లకు మాత్రమే అవకాశాలు వస్తాయని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. చదువు వల్ల వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు కులవృత్తుల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక పేదలు, బడుగుల జీవితాలు మారుతాయని అందరూ భావించారు. కానీ పదేళ్లపాటు పాలించిన బీఆర్ఎస్ అన్ని వర్గాలను అణిచివేసింది. చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని తెలిసినప్పటికీ.. మెరుగైన విద్య అందించకుండా కులవృత్తులు చేసుకోవాలని.. బర్రెలు, గొర్రెలు కాయాలంటూ వాటిని పంపిణీ చేసి చేతులు దులుపుకుంది. కష్టపడి చదువుకున్న వాళ్లు ప్రభుత్వ కొలువుల కోసం ఏళ్లపాటు నిరీక్షించారు. కానీ, గత పాలకుడి ఇంట్లో ఒక్క మనిషికి ఉద్యోగం లేకపోతే ఆరు నెలల్లోనే ఎన్నికలు పెట్టి మరీ కొలువు ఇప్పించుకున్నారు’అని ధ్వజమెత్తారు. దళితులకు సముచిత స్థానం ఇచ్చాం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే 59 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంతటి చరిత్రాత్మక నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. 65 రోజుల్లోనే 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేసినట్లు వెల్లడించారు. గ్రూప్–1 పరీక్షల ఫలితాలు ఇచ్చిన తర్వాత కొందరు ఉద్దేశపూర్వకంగా నియామకాలను ఆపారని విమర్శించారు. గ్రూప్–1 ఉద్యోగాలకు అర్హత సాధించిన వారిలో 89 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందినవారే ఉన్నారని తెలిపారు. ‘వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి గతంలో ఒక్క దళితుడు కూడా వైస్ చాన్స్లర్ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓయూకు వీసీగా దళిత మేధావిని నియమించింది. అంబేద్కర్ వర్సిటీ వీసీగా, ఉన్నత విద్యా మండలి కార్యదర్శిగా, విద్యా కమిషన్ చైర్మన్గా, రాష్ట్ర ఎన్నికల సంఘం చైర్మన్గా, అసెంబ్లీ స్పీకర్గా దళిత బిడ్డలకు అవకాశాలు వచ్చాయి. హెచ్సీయూలో చదివిని మేధావి భట్టి విక్రమార్క ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేస్తూ ఆర్థిక వ్యవస్థను క్రమపద్ధతిలో నడుపుతున్నారు’అని పేర్కొన్నారు. వాళ్లు ఎగ్గోడితే.. మేము ఖర్చు చేస్తున్నాం: భట్టి ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సబ్ప్లాన్ చట్టాన్ని తీసుకువచ్చిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుర్తుచేశారు. కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు నిధులు కేటాయించినప్పటికీ ఖర్చు చేయకుండా ఎగ్గొట్టిందని విమర్శించారు. అలా ఎగ్గొట్టిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కించి క్యారీ ఫార్వర్డ్ చేసి ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేస్తోందని వెల్లడించారు. ఎస్సీలకు రూ.13,223 కోట్లు, ఎస్టీలకు 1,296 కోట్లు క్యారీఫార్వర్డ్ చేసినట్లు వివరించారు. 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్వయం ఉపాధి కోసం ఏడాది కాలంలోనే రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 102 సమీకృత గురుకులాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్రెడ్డి, ఎంపీలు మల్లు రవి, కడియం కావ్య, గడ్డం వంశీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. -
సీఎం రేవంత్ రైతులకు క్షమాపణ చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్ విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చేసిన వాదనలు తప్పులతడక అని తేలిన నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు తరహాలో మేడిగడ్డ బరాజ్ను పునరుద్ధరించాలన్నారు. నాణ్యత లేనిది కాళేశ్వరం ప్రాజెక్టులో కాదని, కాంగ్రెస్, బీజేపీలే చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కనీస నాణ్యత పరీక్షలు చేయకుండా, శాస్త్రీయడేటాను సేకరించకుండా ఎన్డీఎస్ఏ రూపొందించిన నివేదికను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ తిరస్కరించడమే దీనికి సాక్ష్యమని పేర్కొన్నారు. లండన్ పర్యటనలో ఉన్న కేటీఆర్ ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ను బదనాం చేసేందుకు, పార్టీని దెబ్బతీసేందుకు ఎన్డీఎస్ఏ ఈ నివేదిక ఇచ్చిందని మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ నివేదిక బూటకం ఎల్అండ్టీ తాజా ప్రకటనతో మేడిగడ్డ బరాజ్పై ఎన్డీఎస్ఏ ఇచి్చన నివేదిక బూటకమని బయట పడిందని కేటీఆర్ అన్నారు. ఊహాజనితమైన నివేదికను క్రూర రాజకీయ ఎజెండాతో కాంగ్రెస్, బీజేపీ కేంద్ర కార్యాలయాల్లో తయారు చేశారని మండిపడ్డారు. పనికిరాని ఆ నివేదిక తమకు ప్రామాణికమని సీఎం రేవంత్ చెప్పడం ప్రభుత్వ అసమర్థ, దివాలాకోరు విధానాలకు నిదర్శనమని పేర్కొన్నారు. రేవంత్ నిర్వాకం వల్ల ఏడాదిన్నరగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో పంట ఎండి, 500మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండా ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను ఎల్అండ్టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని కేటీఆర్ అన్నారు. ఏ మూలకు వెళ్లినా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని కేటీఆర్ అన్నారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన బీఆర్ఎస్కు చెందిన ఎన్ఆర్ఐ నేతలతో సమావేశమయ్యారు. యునైటెడ్ కింగ్డమ్ (యూకే) లోనూ పార్టీ రజతోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. అలాగే అమెరికాలోని డాలస్ నగరంలో జూన్ 1వ తేదీన సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇదే క్రమంలో త్వరలో యూకేలోను సంబరాలు నిర్వహిస్తామని, ఈ సంబరాలకు స్వయంగా తాను హాజరు కావడంతో పాటు పార్టీ సీనియర్ నేతలు, తెలంగాణ కళాకారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వస్తారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న దోపిడీ, అరాచకాలు, ప్రజలపై వేధింపులను బాగా ఎండగడుతున్నారని యూకే ఎన్ఆర్ఐ నేతలను కేటీఆర్ ప్రశంసించారు. ఇంగ్లండ్లో ఉన్న సోషల్ మీడియా వారియర్స్పై కూడా అక్రమ కేసులు పెట్టినా ఎక్కడా తగ్గకుండా రేవంత్ ప్రభుత్వ దాషీ్టకాలను ప్రశ్నిస్తున్నారన్నారు. అలాగే తెలంగాణ ప్రగతికి బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. అనిల్ కూర్మాచలంకు పరామర్శ గుండెకు సంబంధించిన అనారోగ్యంతో శస్త్ర చికిత్స చేయించుకుని లండన్లో కోలుకుంటున్న బీఆర్ఎస్ నాయకుడు, ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలంను కేటీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్యస్థితిపై వాకబు చేశారు. -
పాపం కమల్ హాసన్.. సిద్ధరామయ్య సెటైర్లు
బెంగళూరు: కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందన్న ప్రముఖ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యలపై(Kamal Kannada Comment) కన్నడనాట తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అన్నాయి. ఈ క్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కమల్ కామెంట్పై స్పందించారు.కన్నడ భాషకు(Kannada Language) ఎంతో చరిత్ర ఉంది. పాపం కమల్ హాసన్కు ఆ విషయం తెలియకపోయి ఉండొచ్చు అంటూ సిద్ధరామయ్య అన్నారు. మరోవైపు కర్ణాటక బీజేపీ చీఫ్ విజయేంద్ర యడియూరప్ప సైతం కమల్ వ్యాఖ్యపై మండిపడ్డారు. ‘‘మాతృభాషను ప్రేమించడం మంచిదే అయినా.. ఇతర భాషలను అవమానించడం సరైంది కాదని అన్నారాయన. ఇది కన్నడ ప్రజలను మాత్రమే కాదు.. శివరాజ్ కుమార్ లాంటి అగ్రనటుడిని కూడా అవమానించడమే. కన్నడ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన కమల్ తక్షణమే క్షమాపణలు చెప్పాలి’’ అని విజయేంద్ర డిమాండ్ చేశారాయన. చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ చిత్ర(Thug Life) ఈవెంట్లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ను ఉద్దేశిస్తూ ‘‘మీ భాష(కన్నడ) కూడా తమిళం నుంచే పుట్టింది’ అని అన్నారు. ఈ కామెంట్పై ఇటు రాజకీయంగా, అటు సోషల్ మీడియాలోనూ కమల్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కన్నడ పరిరక్షణ సంస్థ కర్ణాటక రక్షణ వేదిక కమల్ వ్యాఖ్యలపై భగ్గుమంది. క్షమాపణలు చెప్పకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించింది. మణిరత్నం డైరెక్షన్లో కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి లీడ్ రోల్స్లో నటించిన థగ్ లైఫ్ సినిమా జూన్ 5వ తేదీన విడుదల కావాల్సి ఉంది. ఇదీ చదవండి: ఖబడ్దార్ కమల్.. నల్ల ఇంకు పోస్తాం -
ఎందుకీ సాగదీత?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం మరోమారు చర్చనీయాంశమవుతోంది. గత నాలుగైదు రోజులుగా ఢిల్లీ వేదికగా రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయం నడుస్తుండడం, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ పార్టీ పెద్దలతో చర్చల కోసం వెళ్లడం, నీతి ఆయోగ్ సమావేశం కోసం వెళ్లిన సీఎం రేవంత్ ఆ తర్వాత ఒకరోజంతా అక్కడే వేచి ఉండడం, పీసీసీ అధ్యక్షుడితో సమావేశమైన అధిష్టానం పెద్దలు ఈనెల 30న మరోమారు రావాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సమాచారమిచ్చిన నేపథ్యంలో అసలేం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.ఈ నేపథ్యంలో గత ఏడాది కాలంగా అదిగో.. ఇదిగో అంటూ ఊరిస్తున్న కేబినెట్ విస్తరణ కోసం ఆశావహ ఎమ్మెల్యేలు ఎదురుచూస్తుండగా, అధిష్టానం ఈసారైనా అనుమతిస్తుందా..లేదా? అన్న సంశయం రాష్ట్ర కాంగ్రెస్ నేతలను వెంటాడుతోంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మంత్రివర్గ విస్తరణ విషయంలో అనేక అంశాలు బేరీజు వేసుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానం లేనిపోని తలనొప్పులు ఇప్పుడెందుకనే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ నెల 30 తర్వాత పీసీసీ కార్యవర్గ ప్రకటనతోనే సరిపెడుతుందని, మరికొన్ని రోజుల తర్వాతే కేబినెట్ విస్తరణ ఫైల్ను కదిలిస్తుందనే అభిప్రాయం గాం«దీభవన్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.ఈ పీటముడులు వీడవా?రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ విషయంలో పడిన పీటముడులు వీడేవి కావనే అభిప్రాయానికి అధిష్టానం పెద్దలు వచ్చారనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. జనగణనలో కులగణన చేసి బీసీల లెక్క తేల్చాలని, ఎవరి వాటా ఎంతో తేల్చాలని కోరుతున్న కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు రాష్ట్ర మంత్రివర్గంలో బీసీ నేతలకు ఎన్ని బెర్తులిస్తారన్న దానిపై స్పష్టత లేదు. ఇప్పుడున్న రెండింటికి తోడు మరొకటి వస్తుందని అనుకుంటున్నా.. ఆ తర్వాత ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు.ఇక జిల్లాలు, సామాజిక వర్గాల వారీగా కుదరని పొంతన, టీపీసీసీ కార్యవర్గానికి, కార్పొరేషన్ చైర్మన్ పోస్టులకు, అసెంబ్లీలో ఇచ్చే పదవులకు మంత్రివర్గ విస్తరణతో లింకు పెట్టడం, అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధిష్టానం పక్షాన ఇచి్చన హామీలను నెరవేర్చడం, సీఎం అభిప్రాయం, ఇతర సీనియర్ల ప్రతిపాదనలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ నివేదికలు... ఇలా కావాల్సినన్ని పీటముడులు ఉన్న ఈ అంశం అసలు పరిష్కారమయ్యే మార్గం కూడా దొరకడం లేదనేది బహిరంగ రహస్యమని అంటున్నారు. మరోవైపు ఇద్దరు, ముగ్గురు మంత్రుల పనితీరు ఆశాజనకంగా లేదన్న రిపోర్టులు కూడా ఈ సాగదీతకు కారణమని తెలుస్తోంది. దీంతో మంత్రివర్గ విస్తరణతో పాటు ప్రక్షాళన కూడా చేయాలనుకుంటే ఇంకో ఆరు నెలల సమయమిచి్చ, పనితీరు సరిగా లేని వారిని కూడా పక్కనపెట్టి, వారి సామాజిక వర్గాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఒకేసారి విస్తరణ పూర్తి చేస్తే బాగుంటుందనే యోచనలో కాంగ్రెస్ పెద్దలున్నట్టు సమాచారం.ఏకాభిప్రాయమెలా సాధ్యం? మంత్రివర్గ విస్తరణ కోసం అటు ఢిల్లీ పెద్దలు, ఇటు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులు పలుమార్లు చర్చలు జరిపారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా దీపాదాస్ మున్షీ ఉన్నప్పటి నుంచే ఇటు సీఎం నివాసం, అటు ఏఐసీసీ కార్యాలయం వేదికగా చాలాసార్లు సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి, సీనియర్ మంత్రి ఉత్తమ్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్లు భేటీ అయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాందీతో కూడా చర్చోపచర్చలు జరిపారు.చివరకు మార్చి నెలలో పార్టీ పెద్దలను కలిసిన సందర్భంగా ఇక అన్ని చర్చలు అయిపోయాయని, తమ ప్రతిపాదనలన్నింటినీ అధిష్టానం ముందుంచామని, విస్తరణ బంతి అధిష్టానం కోర్టులో ఉందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్రెడ్డి మాత్రం మంత్రివర్గ విస్తరణ అంశం ఫ్రీజ్ అయిందని (స్తంభించిందని), ఈ వ్యవహారాన్ని అధిష్టానమే పరిష్కరిస్తుందని అధికారికంగానే చెప్పారు. అయితే ఇంతా జరిగి, ఇన్ని చెప్పిన తర్వాత మళ్లీ ఢిల్లీ వేదికగా మంత్రివర్గ విస్తరణ చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు దేనికి సంకేతమని పార్టీ నేతలు అంటున్నారు.గతంలో కుదరని ఏకాభిప్రాయం ఇప్పుడెలా సాధ్యమవుతుందని, ఏకాభిప్రాయం పేరుతో ఈ సాగదీత ఎందుకనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పారీ్టలోని ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రివర్గ విస్తరణ జాప్యం అంశంలో అసహనంతో ఉన్నారని, వీలున్నంత త్వరలో తమకు కేబినెట్ హోదా ఇవ్వకుంటే అమీతుమీ తేల్చుకుంటామని, తమ దారి తాము చూసుకునే పని ప్రారంభిస్తామని తమ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారన్న వార్తలు ఇప్పుడు హాట్టాపిక్గా మారాయి.అయితే.. అనూహ్యమేప్రస్తుత పరిస్థితుల్లో ఈనెల 30వ తేదీ తర్వాత కూడా పీసీసీ కార్యవర్గ ప్రకటన మాత్రమే ఉంటుందని, మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం మరికొంత సమయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఒకవేళ మంత్రివర్గ విస్తరణకు గ్రీన్సిగ్నల్ వస్తే అది అనూహ్యమేనని, అలా జరిగినా రెండు లేదా మూడు బెర్తులు మాత్రమే భర్తీ చేస్తారని సమాచారం. మరికొంత సమయం తర్వాత మంత్రివర్గ ప్రక్షాళన చేస్తామనే సంకేతాలను ఇచ్చి ఈ బెర్తులను భర్తీ చేసే అవకాశముంటుందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. -
విరమణే సరా?
గణనీయంగా బలహీనపడటంతో పాటు దారీతెన్నూ లేకుండా సాగుతున్న నక్సలైట్ ఉద్యమం గురించిన చర్చలు ‘ఆపరేషన్ కగార్’ కన్నా కొన్నేళ్ల ముందు నుంచే జరుగుతున్నాయి. అందుకు కారణాలు రెండు. ఒకటి – నక్సలిజం పట్ల గత కాంగ్రెస్ ప్రభుత్వాల కన్నా మౌలికంగానే భిన్నమైన విధానం గల బీజేపీ అధికారానికి వచ్చింది. రెండు – యథాతథంగా ఆ ఉద్యమం బలహీనపడటం 1990ల నాటికి మొదలై, 2010లు వచ్చేసరికి బాగా పెరిగింది. ఇక్కడ చెప్పుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటున్నది. నక్సలైట్ ఉద్యమకారుల త్యాగాలు వృథా ప్రయాసగా మారుతున్నాయన్న భావనలు సాధారణ సమాజంతోపాటు, వారిపట్ల ఏదో ఒక మేర సానుభూతిగల వర్గాలలోనూ కొంతకాలం నుంచి ఉండగా, ఇటీవల పెరిగాయి. ఈ అభిప్రాయాలన్నింటి సారాంశం, ఉద్యమం ఇక ముందుకు సాగే అవకాశం లేదు గనుక విరమించుకోవటం మంచిదని!తగ్గిన జనాదరణదేశం దశాబ్దాల తరబడి ఉద్యమించి 1947లో స్వాతంత్య్రాన్ని సాధించుకోగా, 20 ఏళ్లు గడిచేసరికి దేశంలో వేర్వేరు వర్గాల అసంతృప్తి, అశాంతి, అందులో భాగంగా నక్సలైట్ ఉద్యమం ఎందుకు మొదలైనట్లు? అది బలహీనపడినప్పటికీ 55 ఏళ్లు గడిచినా ఎందుకు కొనసాగుతున్నట్లు? అనే చర్చ ఎట్లున్నా, అది మరెంతో కాలం సాగే అవకాశాలు లేవన్నది స్పష్టం. అందుకు కారణాలు అనేకం. స్వీయ లోపాల వల్ల, ప్రభుత్వ అణచివేతల కారణంగా ఉద్యమం బలహీనపడింది. స్వీయ లోపాలు అనేవి సైద్ధాంతికమైనవి, నాయకత్వపరమైనవి, వ్యూహాలూ, ఎత్తుగడలకు సంబంధించినవి, ప్రజాదరణతో నిమిత్తం గలవి. ఈ నాలుగింటిని నక్సలైట్లు సరిదిద్దుకొని తేరుకోగల సూచనలు ఎంతమాత్రం కనిపించటం లేదు. వీటిలో ప్రజాదరణ అన్నింటి కన్న కీలకమైనది. అది ఉన్నట్లయితే తక్కిన మూడింటిలో కొన్ని లోటుపాట్లు ఉన్నా ముందుకు పోగలరు. ఈ సూత్రం ఏ ఉద్యమానికైనా, ఏ సాధారణ రాజకీయ పార్టీకైనా వర్తిస్తుంది.నక్సలైట్లు తొలి దశాబ్దాలలో ఉండిన ప్రజాదర ణను మలి దశాబ్దాలు వస్తుండగా కోల్పోవటం మొద లైంది. అందుకు కారణాలు అనేకం. కొన్ని ప్రభుత్వ అణచివేతలు, దానితోపాటు అభివృద్ధి–సంక్షేమ కార్య క్రమాలలో ఉన్నాయి. మరికొన్ని సమాజం వైపునుంచి. అవి – కొత్త తరాలు ఉనికిలోకి రావటం, వారి ఆలోచనలూ, కోరికలూ, వ్యవహరణా శైలి కొత్తది కావటం, తమ తల్లిదండ్రులు అనుభవించిన స్థాయి పేదరికానికి గురికాక పోవటం, వ్యవసాయ సంక్షోభా లతో నిమిత్తం లేకపోవటం, గ్రామాలతో సంబంధాలు తగ్గి పట్టణీకరణలూ ఆధునికీకరణలలోకి ప్రవేశిస్తుండటం వంటివి కొత్త సామాజిక మార్పులయ్యాయి. పాత తరాలకు కూడా నక్సలిజం పట్ల ఉండిన గురి వివిధ కారణాల వల్ల తగ్గటం మొదలైంది.పోతే, అణచివేతలు, వాటిని తట్టుకోలేక పోవ టాలు, కలిగే నష్టాలను ఒకప్పటి వలె పూడ్చుకోలేక పోవటాలు సరేసరి కాగా, ప్రభుత్వ అభివృద్ధి–సంక్షేమ చర్యల ప్రభావాలు కూడా ఉన్నమాట నిజం. విరమిస్తే ఏం చేయొచ్చు?నక్సలైట్ ఉద్యమం మొదలైన తర్వాత ఆ తొలి దశాబ్దాల ఉధృతి, మలి దశాబ్దాల బలహీనతల దశకు చివరన చెప్పుకోవలసింది ఏమంటే, ఒకవైపు ఉద్య మానికి ఆ పరిస్థితులలో ముందుకు పోవటం ఎట్లా గన్న సైద్ధాంతిక స్పష్టత లేకపోయింది. ప్రజలను, వారి భాగస్వామ్యం కేంద్రంగా చేసుకుని ఉద్యమ నిర్మాణానికి బదులు మిలిటరిజానికి పెద్దపీట అయింది. దాని నష్టాలు, సమస్యలు దానివయ్యాయి. ఆ దశకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాలు ద్వంద్వ వ్యూహం అనుసరించి విజయవంతమయ్యాయి. నక్సలిజాన్ని తీవ్రంగా అణచివేస్తూనే, అది కేవలం శాంతిభద్రతల సమస్య కాదని, అభివృద్ధి సమస్య కూడానని చెప్పటం విధానం అయింది. ఆ రెండు విధాల చర్యలు వ్యూహంగా మారాయి. వాటి ఫలితంగా ఉద్యమం దెబ్బతింటుండగా, ఉద్యమా నికి మైదాన ప్రాంతాల ప్రజలు, బీసీ, ఎస్సీలు దూరం కాసాగారు. ఆర్థిక మార్పులతో కొత్త తరాల దృక్పథం మారి వారు దూరమయ్యారు. పలు ప్రాంతాలలో గిరిజన శ్రేణులు కూడా! బీజేపీ అధికారానికి వచ్చే సరికే సమాజ వర్గాలకు, ఉద్యమానికి సంబంధించి ఈ మార్పులు స్థిరపడుతుండగా, కొత్త అధికార పార్టీ కొత్త విధానాన్ని ముందుకు తేవటం మొదలు పెట్టింది. సామాజిక దృష్టికి కాంగ్రెస్ తరహాలో నటనా పరంగానైనా చోటు లేకపోయింది. ఉద్యమం విషయానికి వస్తే, వర్తమాన స్థితిని, భవిష్యత్ అవకాశాలను లేదా అవకాశ రాహిత్యాన్ని, వీటన్నింటితోపాటు మొదట చెప్పుకున్న విధంగా వ్యక్తమవుతున్న విస్తృతాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు నక్సలైట్ నాయకత్వం ఉద్యమ విరమణను ప్రకటించటమే సరైనదిగా తోస్తుంది. నిర్ణయం తేలిక కాదు. ఇటువంటి నిర్ణయాలు ఎప్పుడైనా కష్టమైనవే. కానీ పరిస్థితులనుబట్టి తప్పనివి. సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకపోవటం వల్ల ఎదురయ్యే నష్టాలు మరింతగా ఉంటాయి. తమతోపాటు ప్రజలకు కూడా! శాంతి చర్చలని ప్రాథేయపడిన స్థాయిలో ఇంతగా విజ్ఞప్తులు చేయటమే ఉద్యమం ఎన్నడూ లేనంత బలహీనపడినట్లు చెప్తున్నది. చర్చలని పౌరసమాజం నుంచి మాట్లాడు తున్నవారు ఎంత సహేతుక కారణాలు, తర్కాలు చెబుతున్నా ప్రభుత్వం అణుమాత్రం సడలింపు చూపకపోవటం కనిపిస్తున్నదే! ఒకవేళ ఉద్యమ విరమణ జరిగినట్లయితే అనంతరం ఏమి చేయాలన్నది వేరే విషయం. ప్రధాన స్రవంతిలో కలిసి ప్రజల సమస్యల పరిష్కారానికి సాధారణ ప్రజా ఉద్యమాలు జరపాలనీ, ఇప్పటికే గల వామపక్షాలతో కలిసి పని చేయాలనీ, ఎన్నికలలో పోటీ చేయాలనీ, ఇవేవీ కావనుకుంటే తమకు తోచిన ప్రజాస్వామిక మార్గాలను అనుసరించవచ్చుననే సూచనలు వస్తున్నాయి. సమాజంలో సమస్యలు కొల్లలుగా ఉన్నాయనీ, ప్రజలలో అసంతృప్తి తక్కువ కాదనీ, వివిధ పార్టీ ప్రభుత్వాలే గాక ప్రతిపక్షాల వైఫల్యాలు అనేకం కనిపిస్తున్నాయనీ, కనుక వాటి ఆధారంగా, ప్రజాస్వామిక వ్యవస్థ కల్పించే అవకాశాలను వినియోగించుకుని కృషి చేయవచ్చుననీ పలువురి నుంచి వినవస్తున్న సలహా. నక్సలైట్ నాయకత్వం తన విజ్ఞతతో ఏ నిర్ణయం తీసుకోగలదో చూడాలి.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
కవిత కొత్త పార్టీ ప్రకటన అప్పుడే.. చేరబోయేది ఎవరంటే
సాక్షి,హైదరాబాద్: ‘మై డియర్ డాడీ అంటూ’ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత .. తండ్రి కేసీఆర్కు రాసిన ఆరు పేజీల లేఖ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పుట్టించింది. అయితే, ఆ లేఖ బీఆర్ఎస్తో పాటు, ఆ పార్టీ కీలక నేతల్ని ఇరుకున పెట్టేలా ఉండడంతో నాటి నుంచి ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్ కీలక నేతల గురించి, అంతర్గత వ్యవహారాల గురించి ఎక్కడో చోట మాట్లాడుతూనే ఉన్నారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్నారని ఒకరు? కాదు, కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ మరొకరు బహిరంగ ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. తాజాగా, మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇదే తరహా సంచలన వ్యాఖ్యలు చేశారు.జూన్ 2న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లేందుకు కవిత సిద్ధమయ్యారు. కొత్త పార్టీ పెట్టిన తర్వాత కవిత పాదయాత్ర చేయనున్నారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతున్న తరుణంలో కొత్త పార్టీ పేరుతో కేసీఆర్ కుటుంబం డ్రామా ఆడుతున్నట్లు కనిపిస్తోందన్నారు. వారి కుటుంబంలో ఎవరికి ఎవరు నచ్చకపోయినా కవిత పార్టీలోకి వెళ్లేందుకు ఇలా చేస్తున్నారని అన్నారు రఘునందన్ రావు. కేసీఆర్కు కవిత లేఖఇటీవల కేసీఆర్కు కవిత రాసిన లేఖ వెలుగులోకి వచ్చిన సమయంలో రఘునందన్ రావు కవిత, బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. కవిత రాసిన లేఖ రాజకీయ పంచాయతీ నా , ఆస్తుల పంచాయతీ నా? కవిత చెప్పినా చెప్పకున్నా తెలంగాణలో బీజేపీ బలపడుతున్నది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ కుటుంబంలో వారసత్వ చిచ్చు వచ్చింది నిజమని తెలుస్తోంది. కవితను బయటకు పంపించడం కోసం బావా, బామ్మర్దులు ఒక్కటి అయ్యారు అనే సంకేతం వారి మీటింగ్ ద్వారా ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు కొత్త పార్టీ కవిత లేఖ రాసిన రోజే కాంగ్రెస్కు సంబంధించిన పత్రిక, టీవీలలో వార్త ప్రముఖంగా వచ్చింది. కవిత కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. సీఎం ఈ డ్రామా వెనకా ఉన్నట్టుగా కనిపిస్తున్నది. లేదా ఇటీవలే బీఆర్ఎస్ సిద్ధాంత కర్త, పునాది అని చెప్పుకునే వ్యక్తి హరీష్తో కొత్త పార్టీ పెట్టించాలని అన్నారు. ఇప్పుడు కవితతో పార్టీ పెట్టించి కాంగ్రెస్కు దగ్గరయ్యే ప్రయత్నం సాగుతున్నది. ఎవరేం చేసినా వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారం చేపట్టడం ఆపడం ఎవరి తరం కాదు’ అని వ్యాఖ్యానించారు. ఇవాళ ఏకంగా కవిత కొత్త పార్టీ పెట్టడమే కాదు, అందులో చేరబోయే నేతల గురించి ప్రస్తావిస్తూ రఘునందన్ రావు వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఐఏఎస్ అధికారిణికి బీజేపీ ఎమ్మెల్సీ క్షమాపణలు
బెంగళూరు: కర్ణాటక బీజేపీ నేత, ఎమ్మెల్సీ ఎన్ రవికుమార్ ఐఏఎస్ అధికారిణి ఫౌజియా తరణమ్(Fouzia Taranum)కు క్షమాపణలు చెప్పారు. ఆమె పాకిస్తాన్ నుంచి వచ్చారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి అక్కడ. అయితే.. తాను ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్య చేయలేదంటూ మంగళవారం ఆయన క్షమాపణలు తెలియజేశారు. ‘‘ఆ సమయంలో ేనేను భావోద్వేగంలో ఉన్నా. మా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. అలాంటి పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. అందుకు క్షమాపణలు చెబుతున్నా అని ఎన్డీటీవీతో ఎన్ రవికుమార్(N Ravikumar) అన్నారు.అసలేం జరిగిందంటే..బీజేపీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష చలవాడి నారాయణస్వామి(Chalavadi Narayanaswamy) ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే(ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు)ను ఉద్దేశిస్తూ.. ‘కుక్క’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కన్నడనాట రాజకీయ దుమారం రేపాయి. భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు నారాయణస్వామి గెస్ట్ హౌజ్ వద్ద నిరసనలు తెలిపారు. అయితే.. అధికార పార్టీకి కొమ్ముకాస్తూ.. నారాయణస్వామికి భద్రతా కల్పించడంలో డిప్యూటీ కమిషనర్ ఫౌజియా తరణమ్ విఫలమయ్యారంటూ ఎమ్మెల్సీ రవికుమార్ పార్టీ అనుచరులతో నిరసనలకు దిగారు.ఈ క్రమంలో.. ఫౌజియాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘కలబురాగి డిప్యూటీ కమిషనర్ ఇక్కడ ఐఏఎస్ అధికారిణేనా? లేదంటే పాకిస్తాన్ నుంచి వచ్చారా? ఆమె తీరు చూస్తుంటే పాక్ నుంచి వచ్చినట్లే ఉంది’’ అంటూ రవికుమార్ వ్యాఖ్యానించారు.మతపరమైన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై స్థానికంగా పీఎస్లో ఫిర్యాదు నమోదుకాగా.. రవికుమార్పై కేసు ఫైల్ అయ్యింది. మరోవైపు.. ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించబోమని.. తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలంటూ ఐఏఎస్ అధికారుల సంఘం ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. ఈ తరుణంలోనే ఆయన క్షమాపణలు చెప్పారు. ఇంకోవైపు.. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని, రవికుమార్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ్ని ఆరా తీస్తానని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మీడియాకు వెల్లడించారు. -
కర్రు కాల్చి వాత పెట్టాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలి. ఇది ఆవేశంతో చెప్పడం లేదు బాధతో చెప్తున్నా. మనతోనే ఉండి మనకు వెన్నుపోటు పొడిచి పార్టీని విడిచి వెళ్లిన పది మంది ఎమ్మెల్యేలకు కర్రు కాల్చి వాత పెట్టాలి. ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. కాంగ్రెస్ దరిద్రాన్ని ఇంకా ఎన్ని రోజులు చూడాలని ప్రజలు బాధ పడుతూ వారిని గద్దె దించేందుకు ఏదైనా మార్గం చూపమని అడుగుతున్నారన్నారు. గద్వాల నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో చేరారు. రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా కాంగ్రెస్, బీజేపీకి బుద్ధి చెప్పేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జూన్ నెలాఖరులో పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభిస్తామని, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నూతన కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గద్వాల నియోజకవర్గంలో సామాన్యుడికి టికెట్ ఇస్తామని, జెట్ స్పీడ్తో పార్టీ గెలుపు ఖాయమన్నారు. అపరిచితుడిలా సీఎం వైఖరి కాంగ్రెస్ ఇచి్చన అభయహస్తం శతాబ్దపు అతి పెద్ద మోసమని, ఆ పారీ్టకి 55 ఏళ్లు అధికారం ఇచ్చినా ప్రజలకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి మాటల మనిషి కాదని, మూటల మనిషి అని ఎద్దేవా చేశారు. రుణమాఫీపై అనేకమార్లు మాట మార్చాడన్నారు. సీఎం మానసిక పరిస్థితిపై తనకు అనుమానాలు ఉన్నాయని, ఆయన వైఖరి అపరిచితుడిలా ఉందని ఆరోపించారు. రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లినా ఆ పార్టీ అగ్రనేతలు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో డిప్యూటీ సీఎం భట్టికి 20 నుంచి 30 శాతం కమిషన్లు నడుస్తున్నాయని, భట్టికి మినహా రాష్ట్రంలో అందరికీ అప్పులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లలో తాము బలమైన పునాదులు వేస్తే కాంగ్రెస్ను నమ్మి ప్రజలు బొక్కబోర్లా పడ్డారన్నారు. టీజేఎఫ్ పోస్టర్ ఆవిష్కరణ తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవ సంబురాల పోస్టర్ను ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణతో కలిసి కేటీఆర్ విడుదల చేశారు. తెలంగాణ విముక్తి కోసం కేసీఆర్ ఆధ్వర్యంలో సాగిన ఉద్యమంలో ప్రజలను చైతన్యపరచడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారన్నారు. -
కుదరని ఏకాభిప్రాయం!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన చర్చలు మళ్లీ అసంపూర్తిగానే ముగిశాయి. ఆశావహుల తుది జాబితాపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలిసింది. సామాజిక సమీకరణాల మేరకు తుది జాబితాను ఖరారు చేయడంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపై మరోసారి భేటీ కావాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావించినట్లు సమాచారం. దీంతో కేబినెట్ విస్తరణపై ఏదో ఒకటి తేల్చుకుని హైదరాబాద్ తిరిగి వెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఢిల్లీలోనే వేచి ఉన్నప్పటికీ ఫలితం దక్కలేదు. చివరకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాం«దీతో కూడా భేటీ కాకుండానే ఆయన తిరుగు పయనమయ్యారు. కాగా ఈ నెల 30న ఢిల్లీలో మరోసారి తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో అధిష్టానం సమావేశం కానుంది. శుక్రవారం మళ్లీ ఢిల్లీకి రావాలని సీఎంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్కు అధిష్టానం సూచించింది. ముఖ్యమంత్రి వేచి చూసినా.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై ఆదివారం రాత్రి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్లు జరిపిన చర్చలకు కొనసాగింపుగా.. సోమవారం కూడా చర్చలు ఉంటాయని భావించారు. ఈ చర్చల్లో పాల్గొనేందుకే ముఖ్యమంత్రి సోమవారమంతా ఢిల్లీలో ఎవరినీ కలవకుండా వేచిచూశారు. అయితే సోమవారం సాయంత్రం 5 గంటలకు రాహుల్గాంధీతో సమావేశమైన కేసీ వేణుగోపాల్.. ఆదివారం రాత్రి సీఎం, పీసీసీ అధ్యక్షుడితో జరిపిన చర్చల సారాంశాన్ని వివరించారు. ముఖ్యమంత్రి అభిప్రాయాలను సైతం వెల్లడించారు. ఈ భేటీ కొనసాగుతున్న సమయంలోనే రాహుల్ కార్యాలయం నుంచి మహేశ్గౌడ్కు పిలుపు రావడంతో ఆయన వెంటనే తన కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్ని కలిశారు. ఈ సందర్భంగానే మహేశ్గౌడ్ మంత్రి పదవులు ఆశిస్తున్న వారి వివరాలను, పార్టీతో వారికి ఉన్న అనుబంధం, సీనియారిటీ, సామాజిక సమీకరణాలతో కూడిన ఒక నివేదికను రాహుల్ గాం«దీకి అందజేశారు. పీసీసీ కార్యవర్గ కూర్పులో ప్రాధాన్యత ఇస్తున్న వారికి సంబంధించిన వివరాలతో మరో నివేదిక ఇచ్చారు. ఈ అన్ని అంశాలపై కేసీ వేణుగోపాల్, మహేశ్గౌడ్లతో సుమారు గంటపాటు రాహుల్ చర్చలు జరిపారు. ఆ సమయంలోనే ముఖ్యమంత్రికి కూడా పిలుపు వస్తుందని అందరూ భావించినప్పటికీ, ఈ మేరకు రేవంత్రెడ్డికి ఎలాంటి సమాచారం రాలేదు. అయితే రాహుల్తో భేటీ అనంతరం మహేశ్గౌడ్ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. రాహుల్తో చర్చల సారాంశాన్ని వివరించారు. ఆ తర్వాత రేవంత్రెడ్డి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15న చివరిసారిగా రాహుల్గాందీతో వ్యక్తిగతంగా సమావేశమైన రేవంత్రెడ్డి రాజకీయ అంశాలపై చర్చించారు. ఆ తర్వాత ఇప్పటివరకు వారి మధ్య భేటీ జరగలేదు. ఆ పేర్లపైనే మరోసారి చర్చ సోమవారం రాహుల్తో జరిగిన సమావేశంలో మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఇదివరకే గుర్తించిన పేర్లపైనే మరోమారు చర్చ జరిగినట్లు తెలిసింది. మహబూబ్నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్ జిల్లా నుంచి పి.సుదర్శన్రెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, బాలూనాయక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్సాగర్రావు, గడ్డం వివేక్, కరీంనగర్ జిల్లా నుంచి ఆది శ్రీనివాస్, మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ, అమేర్ అలీఖాన్, ఫహీమ్ ఖురేïÙల పేర్లు తుది జాబితాలో ఉన్నాయి. వీరితో పాటు మహిళా కోటాలో ఎమ్మెల్సీ విజయశాంతి పేరును పరిశీలించినట్టు సమాచారం. కాగా వీరి విషయంలో ఏఐసీసీ ఆలోచనలకు, పీసీసీ ప్రతిపాదనలకు, ముఖ్యమంత్రి ఉద్దేశాలకు మధ్య వైరుధ్యం ఉందని అంటున్నారు. సామాజికవర్గాల వారీగా, జిల్లాల వారీగా ఆశావహుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలోనే చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు తెలుస్తోంది. అయితే ఒకరిద్దరు ఆశావహులకు మంత్రి పదవులు ఖచి్చతంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి పట్టుదలతో ఉండడం చర్చలు అసంపూర్తిగా ముగియడానికి ఒక కారణమనే వాదన కూడా వినిపిస్తోంది. అలాగే ఒకరిద్దరి విషయంలో ఏఐసీసీ కూడా తీవ్ర పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీసీ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మహేశ్గౌడ్ కోరుతున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం అంశాలపై చర్చించేందుకు ఈ నెల 30న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. -
సిరిసిల్లలో హైటెన్షన్ కేటీఆర్ ఆఫీసులో కాంగ్రెస్ గొడవ
-
సిరిసిల్లలో హైటెన్షన్.. కేటీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడి
రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కేటీఆర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రోటోకాల్ పాటించాలంటూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. ఎమ్మెల్యే కేటీఆర్ కార్యాలయంలో ప్రోటోకాల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టలేదంటూ కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణా తల్లి ఫోటోలతో కాంగ్రెస్ నాయకులు రాగా.. పోలీసులు అడ్డుకున్నారు.దీంతో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పగిలిపోవడంతో కాంగ్రెస్ నాయకులు కోపోద్రిక్తులయ్యారు. తెలంగాణా తల్లి, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు తీసుకొని క్యాంపు కార్యాలయాన్ని ముట్టడికి కాంగ్రెస్ నాయకులు యత్నించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.లాఠీఛార్జ్లో బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. తోపులాటలో టౌన్ సిఐ కృష్ణ వేలికి గాయమైంది. ప్రోటోకాల్ విషయంలో ఇరువర్గాల పరస్పరం వాగ్వాదంతో రచ్చ రచ్చగా మారింది. క్యాంపు కార్యాలయంలో కొత్త సీఎం ఫోటో ఉండాలని.. కానీ పాత సీఎం కేసీఆర్ ఫోటో ఉందని సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఈ విషయంపై వివాదం నెలకొంది. -
బనకచర్లతో తెలంగాణకు భారీ నష్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాగు నీటి ప్రయోజనాలు కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు కడుతుంటే అడ్డుకోవలసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఆ పార్టీ ఎంపీలు.. తమకేమీ పట్టనట్లుగా ఉన్నారని ధ్వజమెత్తారు. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జల దోపిడీ మళ్లీ షురూ ఉమ్మడి పాలనలో సాగిన జల దోపిడీ, నేడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలైందని, ఎప్పటిలాగే పదవుల కోసం పెదవులు మూసుకుంటున్నారని హరీశ్రావు విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలకు నీళ్లొదిలి సీఎం రేవంత్రెడ్డి గురు దక్షిణ చెల్లించుకుంటూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. బనకచర్ల ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు ఏపీ కుట్ర చేస్తోందన్నారు.ఇందుకు సహకరిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం..ఈ ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని విమర్శించారు. నాడు తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేయాలని, అనుమతులు ఇవ్వొద్దని లేఖలు రాసిన చంద్రబాబు నేడు మిగులు జలాలను తీసుకుంటున్నట్లు చెప్పడం శోచనీయమన్నారు. ఏ ఒక్క అనుమతి లేకుండా, నిబంధనలు బుల్డోజ్ చేస్తూ, కేంద్రం జుట్టు తమ చేతిలో ఉందని ఏపీలో రాత్రికి రాత్రి పనులు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అనుమతుల్లేని ప్రాజెక్టుకు నిధులెలా ఇస్తారు? గత అసెంబ్లీలో నీతి అయోగ్ బహిష్కరిస్తాం అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అందరి కంటే ముందే నీతి అయోగ్ మీటింగ్కు వెళ్లారని, బనకచర్లను అడ్డుకుంటారని భావిస్తే ఏమీ మాట్లాడకుండా వచ్చారని హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఎలాంటి అనుమతులు లేని ప్రాజెక్టుకు 50 శాతం కేంద్రం గ్రాంటు ఇవ్వడంతో పాటు, మరో 50 శాతం ఎఫ్ఆర్బీఎంను మించి రుణం తీసుకునే వెసులుబాటు కల్పిస్తారని చెపుతున్నారని.. నిబంధనలు ఉల్లంఘించి నిర్మించే ప్రాజెక్టుకు ఇలా నిధులు, అనుమతులు, రుణాలు ఎలా ఇస్తారని నిలదీశారు. కిషన్రెడ్డి చొరవ చూపి ఈ ప్రాజెక్టును ఆపాలన్నారు. లేదంటే ఢిల్లీ సీడబ్ల్యూసీ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. తెలంగాణపై ఎందుకింత కక్ష? పోలవరానికి జాతీయ హోదా ఇచి్చ..కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వరని హరీశ్రావు ప్రశ్నించారు. పోలవరానికి రూ.80 వేల కోట్లు, బనకచర్లకు రూ.80 వేల కోట్లు కలిపి రూ.1.6 లక్షల కోట్లు ఏపీకి ఇస్తున్నప్పుడు, తెలంగాణ ప్రాజెక్టులకు అందులో ఒక్క శాతం అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణపై బీజేపీకి ఎందుకింత కక్ష, సవతి తల్లి ప్రేమో అర్థం కావడం లేదన్నారు.కృష్ణాలో వాటా కోసం కేసీఆర్ పోరాటం చేసి సెక్షన్ 3ని సాధించారని,. కొత్త ట్రిబ్యునల్ సాధించారని చెప్పారు. గోదావరి మీద కూడా భవిష్యత్తులో కొత్త ట్రిబ్యునల్ వస్తుందని భావించి ప్రాణహితకు 160 టీఎంసీల నీటి కేటాయింపులు ఉంటే, కాళేశ్వరానికి 240 టీఎంసీల నీటి కేటాయింపులు చేసినట్లు తెలిపారు. ఈ విధంగా పలు ప్రాజెక్టులు చేపట్టి కొన్నింటిని పూర్తి చేశామని వివరించారు. కాంగ్రెస్ వాళ్లు ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఉండబట్టే నీళ్లు కిందకు వెళుతున్నాయని అన్నారు. -
బీసీల సాధికారతపై నేడు కాంగ్రెస్ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: బీసీల సాధికారతపై కాంగ్రెస్ పార్టీ సోమవారం కీలక సమావేశం నిర్వహించనుంది. ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో కాంగ్రెస్ అగ్రనేత, రాహుల్గాం«దీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేల నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న తాజా, మాజీ పీసీసీ అధ్యక్షులు, బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకావాలని ఇప్పటికే అధిష్టానం ఆదేశించింది. టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ రెండురోజుల క్రితమే కులగణనపై కాంగ్రెస్ అధిష్టానానికి ఇందిరాగాంధీ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం తెలిసిందే.అప్పటి నుంచి ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. సోమవారం జరిగే సమావేశంపై కాంగ్రెస్ పెద్దలతో కలిసి చర్చల్లో పాల్గొంటారు. తెలంగాణలోని బీసీ మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఈ భేటీకి హాజరవుతారు. ఆదివారం మాణిక్యం ఠాగూర్, మహేశ్గౌడ్ సహా పలువురు నేతలు కులగణనకు సంబంధించి సమావేశ నిర్వహణపై చర్చించారు. కులగణనపై దేశవ్యాప్తంగా వర్క్షాపులు నిర్వహించాలని అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఇచి్చన హామీ మేరకే తెలంగాణలో కులగణన సర్వే జరిగిందని, కాంగ్రెస్ ఒత్తిడి వల్లే కేంద్రం కులగణన ప్రకటన చేసిందనే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఏఐసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లేదా బిహార్లో కులగణన ప్రకటనలో కీలకపాత్ర పోషించిన రాహుల్కు ధన్యవాద సభ, భారీ ర్యాలీ నిర్వహించాలని యోచిస్తోంది. -
కేసీఆర్ అవినీతిని ఈటల బయట పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్కు రాష్ట్ర పార్టీ తరఫున పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన అవినీతిని ఈ సందర్భంగా కమిషన్ ముందు బయట పెట్టాలని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫెయిల్ అయ్యాయని కిషన్రెడ్డి విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, కాంగ్రెస్ పాలనలో అదే పరిస్థితి పునరావృతం అవుతోందని చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ చేతగానితనాన్ని బీజేపీపై రుద్దుతున్నారని విమర్శించారు. కేసీఆర్కు కవిత లేఖ రాయడంపై మాట్లాడుతూ దోచుకున్న డబ్బు పంచుకోవడం కోసం లేఖలు రాసుకున్నారని కిషన్రెడ్డి ఆరోపించారు. -
సొరంగం పనులు ముందుకు సాగేదెప్పుడు?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకం పనులు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద ఉన్న ఔట్లెట్లో టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) బేరింగ్ పాడై 2023 జనవరిలోనే పనులు ఆగిపోగా, దోమలపెంట వద్ద ఇన్లెట్లో షియర్ జోన్ కారణంగా బురద నీరు ఉబికి రావడంతో 2019 నుంచి పనులు ఆగిపోయాయి. ఏడాదిన్నర కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సొరంగం తవ్వకం పనులు పూర్తి చేయడంపై దృష్టి సారించింది. అయినా వివిధ కారణాలతో టన్నెల్ తవ్వకం పనులకు అవాంతరాలు తప్పడం లేదు. ఔట్లెట్లో టీబీఎంకు అమర్చాల్సిన బేరింగ్ను తెప్పించినా, స్పేర్ పార్ట్స్కు అవసరమైన డబ్బులు లేవంటూ కాంట్రాక్టు సంస్థ చేతులెత్తేయడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఇటీవల ఇన్లెట్లో 14వ కిలోమీటరు వద్ద సొరంగం కుప్పకూలిపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంపై ఉన్నత స్థాయి టెక్నికల్ కమిటీ నివేదిక వస్తేనే గానీ ముందుకు సాగలేని పరిస్థితి నెలకొంది. ఏళ్లు గడిచిపోతున్నా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4.15 లక్షల ఎకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు రక్షిత తాగునీటిని అందించే లక్ష్యంతో 2005లో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు పనులు చేపట్టారు. అయితే అనేక అవాంతరాలతో ఏళ్లు గడిచిపోతున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని పూర్తి గ్రావిటీ ద్వారా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వరకు తరలించేందుకు ప్రభుత్వం సొరంగం తవ్వకాన్ని చేపట్టింది. 43.930 కిలోమీటర్ల పొడవైన సొరంగం పూర్తిగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం కావడంతో వన్యప్రాణులు, పర్యావరణ రక్షణ కోసం డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానం కాకుండా టీబీఎం ద్వారా పనులు చేపట్టింది. ఇన్లెట్, ఔట్లెట్ కలిపి 34.37 కిలోమీటర్లు మేర టన్నెల్ తవ్వకం పూర్తికాగా, ఇంకా 9.56 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. ఔట్లెట్లో బేరింగ్ పాడై..వచ్చినా లోపలికి వెళ్లక ఔట్లెట్లో 20.435 కిలోమీటర్లు సొరంగం తవ్వకం పూర్తి కాగా, మరో 3.545 కిలోమీటర్ల తవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో టీబీఎం బేరింగ్ పాడైపోవడంతో 2023 జనవరిలో పనులు ఆగిపోయాయి. అదే ఏడాది డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సొరంగం పూర్తి చేయాలని నిర్ణయించింది. అమెరికా నుంచి బేరింగ్ తెప్పించేందుకు నిర్ణయించి గత ఏడాదే రాబిన్స్ కంపెనీకి ఆర్డర్ ఇవ్వడంతో అది గత నెల 18వ తేదీన మన్నెవారిపల్లికి చేరింది. నెల దాటినా.. అమెరికా నుంచి బేరింగ్ అయితే వచ్చింది. కానీ బేరింగ్ను టీబీఎంకు ఫిట్ చేసేందుకు అవసరమైన పరికరాలతోపాటు మరికొన్ని పరికరాలను కెనడా నుంచి తెప్పించాల్సి ఉందని కాంట్రాక్టు సంస్థ పేర్కొంది. అందుకు రూ.70 కోట్లు కావాలని విన్నవించింది. వాస్తవానికి ఆ నిధులను కాంట్రాక్టు సంస్థే వెచ్చించాలి. కానీ తమ వద్ద డబ్బుల్లేవని, ప్రభుత్వం ఇస్తేనే ముందుకు పోతామని స్పష్టం చేయడంతో బేరింగ్ను వచ్చినా టన్నెల్ లోపలికి తీసుకెళ్లని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం దీనిపై కాంట్రాక్టు సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది. ఔట్లెట్లో ఇంకా 3.545 కిలోమీటర్లే తవ్వాల్సి ఉంది. అయితే టీబీఎంకు మిగిలి ఉన్న సామర్థ్యం, అక్కడి మట్టి పొరలు, రాక్ ఫార్మేషన్ పరిస్థితులను బట్టి ఇంకా 2 కిలోమీటర్ల వరకే తవ్వే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత 200 మీటర్ల పొడవునా షియర్ జోన్ ఉండటంతో ఆ తర్వాత పరిస్థితి ఏంటన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇన్లెట్లో పనులకూ అవాంతరాలు సొరంగం ఇన్లెట్ దోమలపెంట వైపు నుంచి 13.935 కిలోమీటర్ల తవ్వకం గతంలోనే పూర్తయింది. ఇంకా 6.015 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. అయితే 14వ కిలోమీటరు కంటే ముందు షియర్ జోన్ కారణంగా పెద్ద ఎత్తున బురద, మట్టి ఉబికి వస్తుండటంతో 2019లోనే పనులు ఆగిపోయాయి. అ యితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పనుల కొనసాగింపుపై దృష్టి పెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన టీబీఎంతో తవ్వుతుండగా సొరంగం పైకప్పు కూలిపోవడం, టీబీఎం ముక్కలైపోవడం తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది గల్లంతవగా ఇప్పటివరకు ఇద్దరు కార్మికుల మృతదేహాలు మాత్రమే బయ పడ్డాయి. కాగా మిగతా కార్మికుల వెలికితీత పనులను కూడా ప్రభుత్వం ఇటీవల నిలిపివేసింది. ప్రస్తుతం సొరంగం పనులు ఎప్పుడు మొదలవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది.ఇన్లెట్లో పనులు మొదలయ్యేదెప్పుడో..సొరంగం ఇన్లెట్ నుంచి తవ్వకాలు చేపట్టే టీబీఎం పూర్తిగా ధ్వంసం కాగా, ఇకనుంచి డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలోనే సొరంగం తవ్వకం సాధ్యమవుతుందని నిపుణులు ప్రభుత్వానికి నివేదించారు. ఇన్లెట్లో 14వ కిలోమీటరు వద్ద కుప్పకూలిన ప్రాంతాని కంటే ముందు నుంచి 50 మీటర్ల వరకు పక్కకు జరిగి, అక్కడి నుంచి సొరంగానికి సమాంతరంగా తవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వివిధ సంస్థలకు చెందిన నిపుణులతో ఉన్నత స్థాయి సాంకేతిక కమిటీని ఏర్పాట చేసింది. పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక సమర్పించనుంది. ఆ తర్వాతే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రమాదం నేపథ్యంలో నిపుణుల సూచన మేరకు డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో తవ్వకం పనులు చేపట్టాలంటే కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. -
కేసీఆర్ ఉంటేనే కేటీఆర్, కవిత.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖపై కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత లేఖ తో నష్టం జరుగుతుంది అనేది వారి కుటుంబ వ్యక్తిగత అంశం. కేసీఆర్ ఉంటేనే కేటీఆర్, హరీష్ రావు, కవిత లీడర్లు అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ను దేవుడు అంటూనే దెయ్యాలు అని సంబోధించడం దేనికి సంకేతం. కవిత వ్యవహారం చూస్తే తన కొమ్మను తాను నరుకున్నట్టు ఉంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో ఏదో జరిగిపోతుందనే చర్చ జోరుగా సాగుతుంది. కొత్త పార్టీ అనే చర్చ అన్ని రాజకీయ పక్షాల్లో నడుస్తుంది. కవిత లేఖతో కాంగ్రెస్కు వచ్చే నష్టమేమీ లేదు. కాంగ్రెస్ ఆనాటి నుండి ఈనాటి వరకు బలంగా ఉంది.. భవిష్యత్లోనూ బలంగానే ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో బలహీన పార్టీ బీజేపీ. బీఆర్ఎస్ ఉధ్యమం పేరుతో బలమైన పార్టీగా అవతరించింది. రాష్ట్ర విభజన కోణంలోనే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. పరిపాలన దక్షతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. వస్తుంది. మతం, హిందుత్వ పేరుతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. బలమైన పార్టీలుగా మొదటి స్థానంలో కాంగ్రెస్, రెండో స్థానంలో బీఆర్ఎస్, మూడో స్థానంలో బీజేపీ ఉంది. కమ్యూనిస్టు పార్టీలు ఉన్నప్పటికీ అధికారంలోకి వచ్చే పరిస్థితిలో లేవు.కేసీఆర్తోనే ఉనికి..కవిత లేఖతో నష్టం జరుగుతుంది అనేది వారి కుటుంబ వ్యక్తిగత అంశం. కవిత లేఖతో కేసీఆర్ కుటుంబంలో గొడవలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భావించే అవకాశం ఉంది. కవిత లేఖ వల్ల బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. కాంగ్రెస్లో బలమైన క్యాడర్ ఉండడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కంటే బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. కేసీఆర్ కుటుంబంలో ఉన్న వారు తామే గొప్ప అనే భావన మంచిది కాదు. కేసీఆర్తోనే బీఆర్ఎస్ ఉనికి ఉంటుంది. కేసీఆర్ ఉంటేనే కేటీఆర్, హరీష్ రావు, కవిత లీడర్లు.బీజేపీకి ప్లస్ అవుతోంది..తండ్రి కూతురుగా కవిత లీడర్గా ఎదిగారు. కేసీఆర్ను దేవుడు అంటూనే దెయ్యాలు అని సంబోధించడం దేనికి సంకేతం?. కేసీఆర్ దేవుడు అంటూనే కేసీఆర్ను రాజకీయ సమాధి చేసేలా కవిత వ్యవహారం ఉంది.కవిత వ్యవహారం చూస్తే తన కొమ్మను తాను నరుకున్నట్టుగా ఉంది. కవిత లీకుల వ్యవహారం బీజేపీని బలపర్చేలా ఉంది. కవిత డిప్రెషన్లో ఉండి లేఖ విడుదల చేసినట్లుగా ఉంది. బీఆర్ఎస్ ఉనికిని దెబ్బతీస్తూ బీజేపీని పెంచి పోషించేలా బీఆర్ఎస్ వ్యవహారం ఉంది. లేఖలు, లీకులు మీడియాలో వార్తలకు పనిచేస్తాయి కానీ.. మీ మనుగడ దెబ్బతీస్తుందనే విషయం మర్చిపోతే ఎలా?. బీజేపీకి లేని బలాన్ని బీఆర్ఎస్ ఇస్తుంది. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అలర్ట్ కావాలి అని హెచ్చరించారు. కవితకు అవగాహన లేదు..బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ వైపు తిప్పుకునే వ్యూహం మేము అమలు చేయాలి. దీనిపై పీసీసీ, సీఎంతో మాట్లాడుతాను. నాయకత్వం లేని బీజేపీకి బీఆర్ఎస్ ఎందుకు అవకాశం ఇస్తుందో అర్దం కావడం లేదు. కేసీఆర్ లోతైన ఆలోచన చేస్తాడు. పిల్లలు దారి తప్పారని కేసీఆర్ భావిస్తున్నట్లు ఉంది. తండ్రి గురించి కవితకు పూర్తి అవగాహన లేకపోవడం దురదృష్టకరం. కుటుంబానికి వారసుడు కొడుకే అవుతాడు. కొడుకు లేని పక్షంలో కూతురు వారసురాలు అవుతుంది. కవిత ఏదో రాష్ట్ర రాజకీయాలను తిప్పేస్తుందని కాదు.. కానీ చర్చల వల్ల నష్టం జరుగుతుంది. కేసీఆర్ కూతురు కాబట్టే మీడియాలో కవితకు ప్రాధాన్యత. కవిత లేఖలు.. మా శత్రువు బీజేపీకి ఉపయోగపడుతాయనే మా బాధ’ అంటూ కామెంట్స్ చేశారు. -
అధైర్యపడొద్దు..
పూంచ్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం జమ్మూకశ్మీర్లోని పూంచ్ పట్టణంలో పర్యటించారు. ఈ నెల 7 నుంచి 10వ తేదీ దాకా పాకిస్తాన్ సైన్యం దాడు ల్లో మృతిచెందినవారి కుటుంబ సభ్యులను పరామర్శించి, సంఘీభావం ప్రకటించారు. గంటకుపైగా బాధితులతో మాట్లాడారు. వారి ఆవేదన విని చలించిపోయారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. బాధితుల సమస్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్తామని, అందరికీ తెలియజేస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు. నియంత్రణ రేఖకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూంచ్ టౌన్లో క్రిస్ట్ స్కూల్ను రాహుల్ సందర్శించారు. మే 7న ఉదయం పాక్ సైన్యం దాడుల్లో ఈ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. అయాన్, అరూబా అనే 13 ఏళ్ల ఇద్దరు కవలలు, రమీజ్ ఖాన్ అనే మరో విద్యార్థి మరణించాడు. తమ మిత్రులు దూరం కావడాన్ని ఈ స్కూల్ విద్యార్థులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. రాహుల్ వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. అంతా త్వర లోనే సర్దుకుంటుందని అన్నారు. ‘‘మీకు ఎదురైన సమస్యలకు ప్రతిస్పందనగా చదువులపై దృష్టి పెట్టండి’’అని సూచించారు. చక్కగా చదువుకోవాలని, చక్కగా ఆడుకోవాలని, ఎంతోమంది స్నేహితులను సంపాదించుకోవాలి అంటూ విద్యార్థులను ఓదార్చారు. పూంచ్ నుంచి ఓ కుటుంబం కారులో సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోతుండగా పాకిస్తాన్ క్షిపణితో దాడి చేసింది. ఈ దాడిలో కారులో ఉన్న 13 ఏళ్ల బాలుడు విహాన్ భార్గవ్ ప్రాణాలు కోల్పోయాడు. విహాన్ భార్గవ్ కుటుంబాన్ని కూడా రాహుల్ పరామర్శించారు. -
పదేళ్లు రాష్ట్రాన్ని లూటీ చేశారు: భట్టి విక్రమార్క
వైరా: గత పదేళ్లు అధికారంలో ఉన్నవారు రాష్ట్రాన్ని లూటీ చేశారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. వాళ్లే ఇప్పుడు ఫామ్హౌస్లో నిద్రపోతూ అన్యాయం జరుగుతోందని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వైరాలో శనివారం ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పదేళ్లలో గ్రూప్–1 పోస్టులు భర్తీచేయకపోవటంతో నిరుద్యోగ యువత వారి తల్లిదండ్రులకు భారంగా మిగిలారని, మరికొందరు ఆవేదనతో రోడ్లపై తిరిగారని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి 56 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాని యువతకు స్వయం ఉపాధి కోసం రూ.9 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం ద్వారా తోడ్పాటు ఇవ్వనున్నామని వెల్లడించారు. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ద్వారా గిరిజనులకు పంపిణీ చేసిన 6.70 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చేలా రూ.12,600 కోట్లతో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించినట్లు వివరించారు. బీఆర్ఎస్ పాలనలో గిరిజనులు అటవీ భూముల్లో పంటలు సాగుచేయకుండా ఇబ్బంది పెట్టారని, మహిళలను కూడా చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనలు ఉన్నాయని విమర్శించారు. కాగా, జాబ్మేళాలో 92 కంపెనీలు పాల్గొనగా, సుమారు 8 వేల మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఇందులో 4,448 మందికి వివిధ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్, సింగరేణి సీఎండీ బలరామ్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్... శని కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్రెడ్డి అని, రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ దెయ్యాన్ని, శనిని వదిలించాలన్నదే తమ ప్రయత్నమని పేర్కొన్నారు. ‘కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు’ఉన్నాయంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ ఈమేరకు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘అంతర్గత విషయాలను ప్రస్తావించేందుకు పార్టీ వేదికలు ఉంటాయి. అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉంటుంది. ఆఫీసు బేరర్స్ను కలిసి చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుటుంది. ఈ సూత్రం వాళ్లకు వీళ్లకు కాదు.. పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ వర్తిస్తుంది. ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన బీఆర్ఎస్లో అధ్యక్షుడు కేసీఆర్కు లిఖితపూర్వకంగా లేదా మౌఖికంగా సూచనలిస్తూ ఎవరైనా లేఖలు రాయొచ్చు. అయితే పార్టీలో ఏ హోదాలో ఉన్న వారైనా కొన్ని అంతర్గత విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది’అని కేటీఆర్ అన్నారు. ‘లోక్సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్ష పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఎలా ముందుకు పోవాలని వేల మంది కార్యకర్తలతో గంటలకొద్దీ చర్చించాం. ఆ క్రమంలో చాలామంది నేరుగా మైక్లో మాట్లాడారు. మరికొందరు కేసీఆర్కు ఇవ్వమంటూ లేఖలు ఇచ్చారు. మా పార్టీలో బహిరంగ చర్చను ప్రోత్సహిస్తాం. ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన మా పార్టీ అధ్యక్షుడికి ఎవరైనా సూచనలు చేయొచ్చు, ఉత్తరాలు రాయొచ్చు’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల్లో ఉన్నట్లు బీఆర్ఎస్లోనూ రేవంత్ కోవర్టులు ఉండొచ్చని, సరైన సమయంలో వారంతటే వారు బయటపడతారన్నారు. ఓటుకు నోటు కేసులో ‘బ్యాగ్మ్యాన్’ ‘యంగ్ ఇండియా నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్లో చేర్చడం రాష్ట్రానికి అవమానకరం. ఈ కేసులో రేవంత్ పేరు వచ్చిందన్న వార్తను కొన్ని పత్రికలు అసలు రాయనే లేదు. మీడియా ఎంత తాపత్రయపడ్డా.. ఎన్ని ప్రకటనలు తీసుకున్నా రేవంత్ ఒక లొట్ట పీసు ముఖ్యమంత్రి అని ప్రజలకు అర్థమైపోయింది. మీడియా ఎన్ని దాచినా సోషల్ మీడియాతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తూనే ఉంటాయి. ఓటుకు నోటు కేసులో బ్యాగ్మ్యాన్ అని పేరు తెచ్చుకున్న రేవంత్ వైఖరి మారలేదని ఈడీ చార్జిïÙట్లో బయటపడింది. కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎంగా మారగా, ఢిల్లీ కాంగ్రెస్కు అవసరమైనప్పుడల్లా భారీ మొత్తంలో ఇస్తూ రేవంత్ తన పదవి కాపాడుకుంటున్నాడు. నైతికత ఉంటే రేవంత్ సీఎం పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఆయనను పదవి నుంచి తప్పించాలి. ప్రధాని మోదీ, అమిత్ షాతో ఒప్పందం కుదుర్చుకునేందుకే రేవంత్ ఢిల్లీ వెళ్లారు. 17 నెలల్లో 44 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ కేసుల నుంచి తప్పించాలని చీకట్లో అమిత్ షా కాళ్లు పట్టుకుంటున్నాడు. రేవంత్కు రాహుల్ గాంధీ అధికారిక బాస్ కాగా, మోదీ, అమిత్ షా అనధికార బాస్లుగా వ్యవహరిస్తున్నారు. ఏడాదిన్నరగా బీఆర్ఎస్పై నిందలు, బిల్డర్లు కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ బాస్లకు రూ.వేలకోట్ల చందాలు అనే రీతిలో రేవంత్ పాలన సాగుతోంది. రేవంత్ అవినీతిపై రాహుల్ మాట్లాడాలి. ఈడీ చార్జిïÙట్లో సోనియా, రాహుల్ పేర్లు ఉన్నా జపాన్ టూర్ పేరిట రేవంత్ స్పందించకుండా తప్పుకున్నాడు’అని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నడుమ అపురూప బంధం ‘నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు మౌన మునుల్లా మారిపోయారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూదందా అక్రమాలకు రేవంత్ వత్తాసు పలుకుతున్నందుకే మౌనమా’అని కేటీఆర్ ప్రశ్నించారు. రూ.187 కోట్ల వాల్మీకి స్కామ్, ట్రిపుల్ ఆర్ టాక్స్, హెచ్సీయూ భూముల్లో అక్రమాలు, పౌర సరఫరాల కుంభకోణం జరుగుతున్నా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు స్పందించడం లేదు. రేవంత్కు రక్షణ కవచంలా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వం స్పందించకుంటే నెల రోజుల తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తాం. ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్ను కోరతాం’అని చెప్పారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ రవీందర్రావు, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, రాజయ్య పాల్గొన్నారు. -
రేవంత్ రాజీనామా చేయాల్సిందే.. బీజేపీ నేతలెందుకు స్పందించరు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు బట్టబయలైంది. నీతి, నిజాయితీ ఉంటే రేవంత్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హస్తిన పెద్దల కాళ్లు పట్టుకోవడానికే రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారు. బీజేపీ నాయకత్వం కాంగ్రెస్ నేతలను కాపాడుతోందని సంచలన ఆరోపణలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ..‘ఓటుకు నోటు కుంభకోణం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు తెలంగాణ ఏటీఎంలా మారిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు పంపిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. పీసీసీ పదవి కోసం రేవంత్ రూ.50 లక్షలు ఇచ్చారని కాంగ్రెస్ నేతలే ఆరోపణలు చేశారు. ఇప్పుడు సీటుకు రూట్ కుంభకోణం బయటపడింది. రేవంత్ రెడ్డి వైఖరితో దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు పోయింది.నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు బట్టబయలైంది. రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించి నిష్ఫక్షపాతంగా విచారణ చేయించాలి. రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో అర్థమవుతోంది. హస్తిన పెద్దల కాళ్లు పట్టుకోవడానికే రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీ బాసులకు రేవంత్ రెడ్డి వేల కోట్లు చందాలు ఇస్తున్నారు. లీడర్లు, కాంట్రాక్టర్లతో రేవంత్ దందాలు చేశారు. రేవంత్ జపాన్ పర్యటనపై మాకు అప్పుడే సందేహాలు వచ్చాయి. యంగ్ ఇండియా పేరుతో దందా చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో భారీ వసూళ్లను పాల్పడ్డారు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు. నీతి, నిజాయితీ ఉంటే రేవంత్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలి. లేకుంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కుర్చీ నుంచి రేవంత్ను తప్పించాలి.మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు చేస్తే ఇప్పటి వరకూ బీజేపీ నేతలు స్పందించలేదు. వాల్మీకి స్కాంపై నోరు మెదపరు. సివిల్ సప్లయ్ స్కాంపై ఎలాంటి చర్యలు లేవు. బీజేపీకి నిజాయితీ ఉంటే ఈ స్కాంలపై స్పందించాలి. తెలంగాణలో ఎవరు ఎవరితో కుమ్మక్కు అవుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. గవర్నర్ని కలిసి సీఎం అవినీతిపై చర్యలకు డిమాండ్ చేస్తాం. నెల రోజుల్లో చర్యలు తీసుకోకుంటే మా పార్టీ కార్యచరణ తీసుకుంటాం అని హెచ్చరించారు. యడ్యూరప్పపై విమర్శలు వస్తే రిజైన్ చేయాలని కర్ణాటక కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయలేదా?. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని అందరికీ తెలుసు. డీకే శివకుమార్ను తొలగించాలని కర్ణాటకలో బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కానీ, తెలంగాణలో మాత్రం బీజేపీ నేతలకు ఏమైంది?. హెరాల్డ్ కేసుపై రేవంత్ ఎందుకు స్పందించలేదు?. బీజేపీ నాయకత్వం కాంగ్రెస్ నేతలను కాపాడుతోంది. బీజేపీ నేతలకు దమ్ముంటే రేవంత్ వ్యవహారంపై వెంటనే స్పందించాలి’ అని డిమాండ్ చేశారు. -
మూణ్నాళ్ల ముచ్చటగా మారిన కాంగ్రెస్ హామీ
‘హైదరాబాద్ నగర శివారులోని మౌలాలీకి చెందిన బాలకృష్ణ కుటుంబం రూ.500 గ్యాస్ సిలిండర్ వర్తింపునకు అర్హత సాధించింది. రీఫిల్ డోర్ డెలివరీ కాగానే మార్చి నెల వరకు ఠంచన్గా బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ నగదు జమ అవుతూ వచ్చింది. కాగా.. మార్చి నుంచి రెండు పర్యాయాలు సిలిండర్ బుక్ చేస్తే .. రీఫిల్ డోర్ డెలివరీ అయింది కానీ సబ్సిడీ నగదు బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు. బాలకృష్ణ కుటుంబానికే ఎదురైన సమస్య కాదు.. గ్రేటర్ పరిధిలో గ్యాస్ సబ్సిడీకి అర్హత సాధించిన చాలా కుటుంబాలదీ ఇదే పరిస్థితి’సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కింద రూ.500కు వంట గ్యాస్ సబ్సిడీ నగదు జమ మూణ్నాళ్ల ముచ్చటగానే తయారైంది. గ్యాస్ సబ్సిడీకి అర్హత సాధించి రీఫిల్ డోర్ డెలివరీ కాగానే సబ్సిడీ నగదు రూపంలో కొన్ని నెలలు బ్యాంక్ ఖాతాలో జమ అయినా.. ఆ తర్వాత ఆగిపోవడం విస్మయానికి గురిచేస్తోంది. దీంతో కేవలం కేంద్ర ప్రభుత్వ స్లాబ్ సబ్సిడీకి పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. మూడు లక్షల కుటుంబాలకు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మహాలక్ష్మి పథకం కింద రూ. 500 కు వంట గ్యాస్ వర్తింపునకు కేవలం మూడు లక్షల కుటుంబాలు మాత్రమే అర్హత సాధించాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాల పరిధిలో సుమారు 40.18 లక్షల ఎల్పీజీ కనెక్షన్దారులున్నారు. ప్రజాపాలనలో సుమారు 24.74 లక్షల కుటుంబాలు గ్యాస్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో 19.10 లక్షల కుటుంబాలకు మాత్రమే తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. సబ్సిడీ గ్యాస్ మాత్రం కేవలం మూడు లక్షలలోపు కనెక్షన్దారులకు మాత్రమే వర్తించినట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మిగతా 16 లక్షల కనెక్షన్దారులు అర్హులుగా ఉన్నా.. సబ్సిడీ వర్తింపు మాత్రం అందని ద్రాక్షగా మారింది. తాజాగా అర్హత సాధించిన కుటుంబాల్లో సైతం కొందరికి సబ్సిడీ నగదు బ్యాంక్ ఖాతాలో జమకావడం మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. కొందరి ఖాతాల్లోనే నగదు జమ.. రాష్ట్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ బ్యాంక్ ఖాతాలో నగదు జమ కాకపోవడంతో మళ్లీ వంట గ్యాస్ ఆర్థిక భారంగా తయారవుతోంది. మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేయక తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం సిలిండర్పై సబ్సిడీ రూపంలో రూ.40.71 జమ చేస్తోంది. ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా అర్హత సాధించిన వంట గ్యాస్ లబి్ధదారులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సిలిండర్ ధరలో రూ.500, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ మినహాయించి మిగతా సొమ్మును నగదు బదిలీ ద్వారా వినియోగదారులు ఖాతాలో చేస్తూ వస్తోంది. తాజాగా సిలిండర్పై కొద్ది మందికి మాత్రమే సబ్సిడీ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. మిగతా వారికి జమ కావడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల్లో కొరవడిన స్పష్టత.. వంట గ్యాస్ సబ్సిడీ నగదు జమ కొన్ని లబ్ధి కుటుంబాలకు నిలిచిపోవడంపై పౌరసరఫరాల అధికారులకు సైతం స్పష్టత లేకుండా పోయింది. సిలిండర్ల వినియోగం దాటడమే సబ్సిడీ నగదు జమ కాకపోవడానికి కారణమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 12 సిలిండర్లపై సబ్సిడీ వర్తింప జేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గత మూడేళ్లలో వినియోగించిన సిలిండర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గరిష్టంగా ఏటా ఇవ్వాల్సిన సిలిండర్ల సంఖ్య ఎనిమిదిగా నిర్ధారించింది. లబి్ధదారుల సిలిండర్ సంఖ్య ఎనిమిది పరిమితి దాటనప్పటికీ.. గతంలో వినియోగించిన సంఖ్య తక్కువగా ఉంటే దాని ప్రకారమే సబ్సిడీ వర్తింపజేస్తున్నట్లు సమాచారం. -
ఈడీ కేసులో రేవంత్.. పొంగులేటి రూటేనా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం గత ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా వేల కోట్లకు చేరిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాలుగు కోట్ల ప్రజల ముందు ముఖ్యమంత్రి అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో కుడితిలో పడిన ఎలుకలా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటోంది అని ఎద్దేవా చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో.. సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడింది. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ నమోదు చేసిన చార్జిషీట్ తో సీఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైంది. అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండబద్దలు కొట్టినట్టయింది.వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం గత ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా వేల కోట్లకు చేరింది. దివ్యమైన తెలంగాణని దివాళా తీసి వేల కోట్లు కొల్లగొట్టడం వల్లే ఈడీ కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి – పొంగులేటి తరహాలో చీకట్లో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుంటాడా ?. ఈడీ, కేవలం చార్జిషీటులో పేరు పెట్టడం వరకే పరిమితం అవుతుందా?. లేక రేవంత్ రెడ్డిని విచారణను పిలిచి మొత్తం అవినీతి కుంభకోణాలను కక్కిస్తుందా?.నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో.. సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడింది. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ నమోదు చేసిన చార్జిషీట్ తో సీఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైంది. అధికారం కోసం ముఖ్యమంత్రి… pic.twitter.com/fsb8uT8Sc9— KTR (@KTRBRS) May 23, 2025రాష్ట్ర కాంగ్రెస్లో రోజురోజుకూ పేట్రేగిపోతున్న అంతర్గత కుమ్ములాటలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కకావికలమైంది. పెరిగిపోతున్న తిరుగుబాట్లతో సీఎం కుర్చీ ఎప్పుడూ కూలిపోతుందో అనే భయం రేవంత్ రెడ్డిని అడుగడుగునా వెంటాడుతోంది. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్, ముఖ్యమంత్రి.. అటెన్షన్ డైవర్షన్ కోసం రోజురోజుకూ చేస్తున్న చిల్లర చేష్టలు, కొత్త కుట్రలకు తెరపడినట్టే.సీఎం రేవంత్ కు పిల్లనిచ్చిన మామ సూదిని పద్మారెడ్డియే స్వయంగా కాళేశ్వరంలో అవినీతి జరగలేదనడంతో ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు ఒక్కసారిగా ఎగిరిపోయినై.. కమీషన్లు లేనిదే ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క ఫైలు కదలడం లేదని స్వయంగా కేబినెట్ మంత్రి కొండా సురేఖ కుండబద్దలు కొట్టడంతో కాంగ్రెస్ నిర్వాకాలన్నీ వరుసగా వెలుగుచూస్తున్నాయి.30 శాతం పర్సెంటేజీలు ఇవ్వనిదే సొంత ప్రభుత్వంలో పనులు కావడం లేదని సాక్షాత్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆ పార్టీ బట్టలిప్పడంతో కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది. నాలుగు కోట్ల ప్రజల ముందు ముఖ్యమంత్రి అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో కుడితిలో పడిన ఎలుకలా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటోంది. పచ్చని రాష్ట్రంలో చిచ్చుపెట్టడమే కాకుండా వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీచేస్తూ, పేదల జీవితాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి పాపం పండింది. చివరికి ధర్మం గెలుస్తుంది. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ కామెంట్స్ చేశారు. -
సోనియా, రాహుల్కు తీర్పు అనుకూలమైతే ఏమంటారు?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ నేతల తప్పులు ఎత్తి చూపిస్తే కోర్టు తీర్పులను అపహాస్యం చేస్తారా? అని ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేపు ఒకవేళ కోర్టులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు అనుకూలంగా తీర్పు ఇస్తే.. తప్పు అని చెప్తారా? అంటూ వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘మహేష్ కుమార్ గౌడ్ గారు.. మీ నాయకుడు రాహుల్ గాంధీ న్యాయ యాత్రలు చేస్తుంటారు. మీ కాంగ్రెస్ నాయకులు మాత్రం న్యాయాన్ని, కోర్టులను, తీర్పులనూ అపహాస్యం చేస్తుంటారు. మీకు అనుకూలం కాకుంటే అది నిజం కాదు! మీకు నచ్చకపోతే అది న్యాయం కాదు?. నేషనల్ హెరాల్డ్ కేసులో రేపు ఒకవేళ కోర్టులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు అనుకూలంగా తీర్పు ఇస్తే తప్పు అని చెప్తారా?. కంచె గచ్చిబౌలి అయినా, పాలమూరు ప్రాజెక్ట్ అయినా.. మీ తప్పులు ఎత్తి చూపిస్తే కోర్టు తీర్పులను అపహాస్యం చేస్తారా?’ అంటూ ప్రశ్నించారు. Absolutely appalled by the comments of TPCC president Mahesh Kumar Goud garu on the Honourable Supreme court’s dismissal of Special Leave Petition (SLP) in Palamuru-Rangareddy Lift Irrigation Scheme projectIt is not just demeaning to the Supreme Court but the constitution of…— KTR (@KTRBRS) May 23, 2025 -
నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్రెడ్డి
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు పవన్ బన్సల్తోపాటు దివంగత నేత అహ్మద్ పటేల్ పేర్లు తెరపైకి వచ్చాయి. గత నెలలో కోర్టుకు సమర్పించిన చార్జిషిట్లో వీరి పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రస్తావించింది. కానీ, వీరిని నిందితులుగా చేర్చలేదు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాందీ, రాహుల్ గాంధీతోపాటు మరో ఐదుగురిని నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా కొట్టేయడానికి కుట్ర జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఆస్తులను కాజేయాలన్న ఉద్దేశంతోనే యంగ్ ఇండియా సంస్థను స్థాపించినట్లు చెబుతోంది. ఈ సంస్థ ఏర్పాటుకు పలువురు కాంగ్రెస్ నాయకులతోపాటు ఇతరులు 2019–22 మధ్య విరాళాల రూపంలో డబ్బులు సమకూర్చారు. అందుకు ప్రతిఫలంగా పదవులు, ప్రయోజనాలు కట్టబెడతామని ప్రస్తుత తెలంగాణ సీఎం (అప్పటి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు) రేవంత్రెడ్డి, పవన్ బన్సల్, అహ్మద్ పటేల్ ప్రలోభ పెట్టారని ఈడీ చార్జిషిట్లో పేర్కొంది. సాక్షులను విచారించిన తర్వాతే ఈ విషయం నిర్ధారించుకున్నట్లు స్పష్టంచేసింది. ఈడీ ఆరోపణలపై రేవంత్రెడ్డి, పవన్ బన్సల్ ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉండగా,యంగ్ ఇండియా సంస్థ ఏర్పాటు కోసం రూ.30 లక్షలు విరాళంగా ఇచ్చానని కాంగ్రెస్ నేత అరవింద్ విశ్వనాథ్ సింగ్ చౌహాన్ ఈడీ విచారణలో అంగీకరించారు. అహ్మద్ పటేల్ సూచన మేరకే ఈ డబ్బులు ఇచ్చినట్లు తెలిపారు. కాగా, ఈడీ గతంలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, మాజీ మంత్రి గీతారెడ్డి, గాలి అనిల్కుమార్కు కూడా నోటీసులిచ్చి విచారించిన విషయం తెలిసిందే. -
కొలువుల కుదింపు... వేతనాల్లోనూ కోత!
సాక్షి, హైదరాబాద్: అసంఘటిత రంగ కార్మీకుల కనీస వేతన సవరణ ప్రక్రియలో ప్రతిచోటా కోతల పర్వం కొనసాగుతోంది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన వేతన సవరణ తుది ఉత్తర్వుల్లో ఖరారు చేసిన ఉద్యోగాలు, వేతనాలకు సంబంధించి కత్తెర పడుతోంది. సర్వీసు నిబంధనల్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కార్మికుల కనీస వేతన సవరణ చివరిసారిగా 2006లో జరిగింది. అప్పుడు చేసిన సవరణకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడేందుకు దాదాపు ఆరేళ్లు పట్టింది. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా వేతన సవరణ ఊసే లేదు. దీనిపై కార్మీక సంఘాలు తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రంలో ఏర్పాటైన మొదటి, రెండో కనీస వేతన సలహా బోర్డులు లోతుగా కసరత్తు చేసి గత ప్రభుత్వానికి వివిధ ఎంప్లాయిమెంట్లకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించాయి. వీటిపై గత ప్రభుత్వం కసరత్తు చేపట్టి ఐదు ఎంప్లాయిమెంట్లకు తుది ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ గెజిట్లు విడుదల కాకపోవడంతో అమలుకు నోచుకోలేదు. మరో 12 ఎంప్లాయిమెంట్లకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వం ఆమోదించినా ఉత్తర్వులు వెలువడలేదు. మిగిలిన ఎంప్లాయిమెంట్లు ప్రతిపాదన దశలోనే ఉండిపోయాయి. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం 73 రకాల ఎంప్లాయిమెంట్లకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్లను గతేడాది జనవరి 29న జారీ చేయగా.. ఇప్పుడున్న కనీస వేతన సలహా బోర్డు తుది ప్రతిపాదనలు రూపొందిస్తోంది. నాలుగు అంశాలు కొలిక్కి... ఈ బోర్డు గతేడాది డిసెంబర్లో ఏర్పాటు కాగా.. అప్పట్నుంచి ఏడుసార్లు సమావేశమైంది. ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్లపై సుదీర్ఘంగా చర్చించి ఐదు ఎంప్లాయిమెంట్లకు సంబంధించి ప్రతిపాదనలను దాదాపు సిద్ధం చేసింది. ఇందులో నాలుగు రకాల అంశాలపై కీలకంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కార్మీకుల వేతనాలకు సంబంధించి బేసిక్ వేజ్, వీడీఏ ఖరారుతో పాటు, ఉద్యోగ హోదా (డిజిగ్నేషన్), సర్వీసు నిబంధనలకు సంబంధించిన ఫుట్ నోట్లను కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది. కట్.. కట్... కట్... కనీస వేతన సలహా మండలి సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకున్న అంశాలపై కార్మీక సంఘాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బోర్డు నిర్ణయాలు అధికారికంగా బహిర్గతం కానప్పటికీ.. చర్చించిన అంశాలు, మినిట్స్ తదితర సమాచారం బయటకు రావడంతో సంఘాలు భగ్గుమంటున్నాయి. కార్మిక సంఘాల ద్వారి తెలిసిన సమాచారం ప్రకారం.. కనీస వేతన సలహా బోర్డు సెక్యూరిటీ సర్వీసెస్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, స్టోన్ బ్రేకింగ్ అండ్ స్టోన్ క్రషింగ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ప్రైవేట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయిమెంట్స్కు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. ఫుట్ నోట్స్ కీలకం.. కార్మీకుల సర్వీసు నిబంధనల్లో ఫుట్ నోట్స్ కీలకం. ఈ ఫుట్నోట్స్ ఆధారంగా కార్మీకుడి గ్రేడ్ పెంచుతూ వేతనాలను సవరిస్తారు. ఉదాహరణకు ఒక కేటగిరీలో కార్మీకుడు ఐదేళ్లపాటు పనిచేస్తే ఆరో సంవత్సరం కార్మీకుడి గ్రేడ్ పెంచుతూ అధిక వేతనం ఇవ్వాలి. నైట్ షిఫ్ట్ అలవెన్సు 25 శాతం, రిస్క్ అలవెన్స్ 20 శాతం, అధిక ఎత్తులు, భూమి లోపల పనిచేసే వారికి అదనపు వేతనం జారీ తదితర నిబంధనలున్న ఫుట్ నోట్లను తగ్గించినట్లు సమాచారం. కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎంప్లాయిమెంట్ 21 ఫుట్నోట్లను 5కు పరిమితం చేశారు. ఏకంగా 16 ఫుట్నోట్లు రద్దు చేశారు. ఇలా అన్ని సెక్టార్లలోనూ ఫుట్నోట్లకు కోత పడింది. హైలీ స్కిల్డ్ వేతనంలో రూ.7,234 కోత 2021 జూన్లో ప్రభుత్వం ఐదు కేటగిరీలకు కనీస వేతనాలకు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా బోర్డు ప్రతిపాదించిన వేతనాలను పరిశీలిస్తే గతంలో కంటే భారీగా కోత పెట్టినట్లు తెలుస్తోంది. హైలీ స్కిల్డ్ కేటగిరీలో రూ.7,234 కోత పడగా.. అన్స్కిల్డ్లో రూ.3,018 కోత పడింది. వాస్తవానికి రోజుకురోజు నిత్యావసర సరుకుల ధరలు, రోజువారీ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో ఐదేళ్ల క్రితం నిర్దేశించిన వేతనాలకంటే 10 శాతం నుంచి 20 శాతం మేర కోత పెడుతూ బోర్డు ప్రతిపాదనలు తయారు చేయడంపై కార్మీక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.భారీగా ఉద్యోగాల కోతలు గతంలో హైలీస్కిల్డ్–1, 2, 3, 4, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ కేటగిరీలుండగా... ఇప్పుడు వాటిని హైలీస్కిల్డ్, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ కేటగిరీలకే పరిమితం చేశారు. 3 ఉద్యోగ కేటగిరీలు తొలగించడంతో ఉపాధి సంస్థల్లో భారీగా ఉద్యోగులు తగ్గిన ట్లేనని కార్మీక సంఘాలు అంటున్నాయి. సెక్యూరిటీ సర్వీసెస్ ఎంప్లాయిమెంట్లో 26 జూన్ 2021లో జారీ చేసిన జీఓఎంఎస్ 21 ప్రకారం 66 ఉద్యోగాలున్నాయి. గతేడాది విడుదలైన ప్రాథమిక నోటిఫికేషన్లో వీటి సంఖ్య 11కు తగ్గించారు. వీటిని బోర్డు ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇక్కడే 55 ఉద్యోగాలకు కోత పడింది. అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎంప్లాయిమెంట్లో 611 ఉద్యోగాలను 58కి కుదించడంతో 533 ఉద్యోగాలకు కోతపడింది. స్టోన్ బ్రేకింగ్ అండ్ స్టోన్ క్రషింగ్ ఎంప్లాయి మెంట్లో 196 ఉద్యోగాలను 69కి కుదించారు. ఇలా ప్రతి ఎంప్లాయిమెంట్లో ఉద్యోగాల సంఖ్య తగ్గిస్తూ కనీస వేతన సలహా బోర్డు ప్రతిపాదనలు తుదిరూపుకు తెచ్చినట్లు సమాచారం. ఉద్యోగుల సంఖ్య కుదించడంతో ఉన్న కార్మికులపై పనిఒత్తిడి పడనుంది. -
సీఎం రేవంత్లో అపరిచితుడు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిలో ఒక అపరిచితుడు ఉన్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆయనకు ’మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్’ అనే భయంకరమైన మానసిక రుగ్మత ఉండటంతో ఒకే అంశంపై రోజుకో రీతిలో మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ భవన్లో గురువారం కేటీఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ‘పర్సంటేజీల పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు అంటూ కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోంది. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారం సుప్రీంకోర్టు సాక్షిగా తేలి పోయి నిజాలు బయటకు వచ్చాయి. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీ కలసికట్టుగా చేస్తున్న దు్రష్పచారం కూడా త్వరలో తేలిపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ తన విచారణ పూర్తయిందని, నివేదిక సిద్ధంగా ఉందని చెప్పారు. కానీ తిరిగి కమిషన్ గడువును ఎందుకు పొడిగించారో చెప్పాలి’అని డిమాండ్ చేశారు. కాళేశ్వరం అంశానికి సంబంధించి కేసీఆర్, హరీశ్రావుకు నేరుగా నోటీసులు అందినట్లు సమాచారం లేదని కేటీఆర్ తెలిపారు. నోటీసులు అందిన తర్వాత విచారణకు హాజరు కావడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బరాజ్లను కూలగొట్టి మళ్లీ టెండర్లు పిలవడం ద్వారా 20 నుంచి 30 శాతం కమీషన్లు తీసుకోవాలన్నదే ఈ నోటీసుల వెనుక ఉన్న అసలు ఎజెండా అని ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. రాష్ట్రంలో 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం అందాల పోటీల్లో తలమునకలై ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. అన్నదాతల ధాన్యం వర్షంలో కొట్టుకుపోతుంటే.. రేవంత్ అందాల పోటీలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గుల్జార్ హౌస్లో అతిపెద్ద అగ్ని ప్రమాదం జరిగితే కనీసం చూడటానికి కూడా వెళ్లని సీఎం.. అందాల పోటీలకు మాత్రం నాలుగు సార్లు హాజరయ్యారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఒక్క రూపాయి కూడా లేదంటూనే అందాల పోటీలకు రూ.200 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. మంత్రులంతా మిస్వరల్డ్ పోటీదారులకు టూర్ గైడ్లుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. మిస్ వరల్డ్ పోటీదారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులను చూపిస్తున్నారని, నిజాంలు, కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు మినహా చూపించేందుకు కాంగ్రెస్ కట్టిన ఒక్క ప్రాజెక్టు కూడా లేకుండా పోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అభిప్రాయభేదాలు సహజంరాజకీయ పార్టీల్లో అభిప్రాయ భేదాలు సహజమని కేటీఆర్ అన్నారు. ‘నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లోనే కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు వస్తాయి. అలాంటిది లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీలో అభిప్రాయ భేదాలు ఉండడం సహజమే. వాటిని పక్కనపెట్టి అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వారి గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలి’అని సూచించారు. గురువారం హైదరాబాద్లో తనను కలిసిన నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
కేసీఆర్కు కవిత లేఖ.. ఆది శ్రీనివాస్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్లో ముసలం తారాస్థాయికి చేరుకుందని.. కల్వకుంట్ల కవిత రాసిన లేఖతో లుకలుకలు బయటపడ్డాయంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందంటూ మేం చెబుతున్న మాటలను కవిత సమర్థించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కేసీఆర్ సిద్దమతున్నారని కవిత చెప్పకనే చెప్పింది. బీజేపీపైన పల్లెతు మాట మాట్లాడకుండా.. కేసీఆర్ వ్యవహరించిన తీరును కవిత కడిగి పారేసింది’’ అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.‘‘భవిష్యత్తులో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయి. బీఆర్ఎస్ బలహీనపడటం వల్లనే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నట్లు కవిత అంగీకరించారు. కవిత పచ్చి నిజాలు మాట్లాడారు.. ఆ మాటలనే మేం చాలా కాలంగా చెబుతున్నాం. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నియంతృత్వ వైఖరిని కూడా కవిత నిలదీశారు. పార్టీ రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ ఒక్కరే ప్రసంగించడాన్ని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ వైఖరిని ఆయన కూతురే తప్పుపడుతోంది. ఇక ప్రజలకు వాళ్లేమీ సమాధానం చెబుతారు. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని కవిత తేల్చి చెప్పింది’’ అని ఆది శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.‘‘పార్టీ నాయకులను కలవకుండా ఏకపక్ష పోకడలకు పోతున్నారని ఆమె ధ్వజమెత్తారు. కవిత లేఖ పైన బీఆర్ఎస్ నాయకత్వం స్పందించి ప్రజలకు సమాధానం చెప్పాలి. మా సీఎం రేవంత్ రెడ్డి మీద ఒంటి కాలిపైన లేస్తున్న కేటీఆర్ ముందు తన చెల్లికి సమాధానం చెప్పాలి. కవితకు సమాధానం చెప్పకుండా ఇతర పార్టీలను విమర్శించే నైతిక హక్కు కేటీఆర్కు లేదు. కల్వకుంట్ల కుటుంబంలో లుకలుకలు ఉన్నాయి. అలిగిన హరీష్ రావు ఇంటికి వెళ్లి కేటీఆర్ బతిమాలుకున్నాడు...కవిత లేఖతో బీఆర్ఎస్ పార్టీ ఇద్దరికి మాత్రమే పరిమితం అయిందని తేలింది. గత పదేళ్లలో కేసీఆర్ హయాంలో జరిగిన దోపిడి గురించి కూడా కవిత ప్రశ్నిస్తే బాగుంటుంది. పంపకాలు, పదవుల్లో తేడా వచ్చి కుటుంబంలో లేఖలు రాసుకుంటున్నారు. బీఆర్ఎస్ పని ఇక అయిపోయింది. కేటీఆర్.. ముందు నీ ఇళ్లు సరిదిద్దుకో. అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్లోనే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడు. కేసీఆర్ తీరును ఆయన కూతురే తప్పుపడుతోంది.. ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలి.’’ అంటూ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. -
‘సీఎం రేవంత్ పనైపోయింది.. అదొక లొట్టపీసు కేసు’
సాక్షి, తెలంగాణ భవన్: లొట్టపీసు కేసులతో సీఎం రేవంత్ చేసేది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణాలు, ఇతర అంశాలపై మాట్లాడారు. ‘తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బ్యారేజ్లో రెండు పగుళ్లు వస్తే ఏదో అయినట్లు చేస్తున్నారు. టైమ్ పాస్ కోసమే కమిషన్ నోటీసులు పంపింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు అందాయో? లేదో? తెలియదు. కాళేశ్వరం విషయంలో నిజం నిలకడగా తేలుతుంది.మిస్ వరల్డ్ ప్లెక్సీలో రేవంత్ రెడ్డి ,బట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు ఫొటోలు ఉన్నాయి. వీరిలో ఎవరు మిస్ వరల్డో అర్థం కావడం లేదు. కమిషన్లు దండుకోవడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది.కేసీఆర్ వరంగల్కు కదలగానే ఈ ప్రభుత్వానికి భయం పట్టుకుంది. అందుకే కమిషన్ నోటీసుల పేరుతో డైవర్ట్ పాలిటిక్స్ చేసేందుకు సిద్ధమయ్యారు.కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిజం నిలకడగా తెలుస్తుంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనైపోయింది. లొట్టపిసు కేసులతో ఏం కాదు. కోటిమంది మహిళలను కోటీశ్వరలను చేస్తామని అంటున్నారు. అవి అలవికాని హామీలు. ప్రతిపక్షంలో ఉంటూ రేవంత్ నిద్ర పట్టకుండా చేస్తున్నాం. ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని నిలదీస్తున్నాం’ అని అన్నారు. జూన్ ,జూలైలో బీఆర్ఎస్ నూతన మెంబర్షిప్ ప్రారంభమవుతుంది. ఆ తరువాత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. పార్టీ బలోపేతం కోసం అందరం కలిసి కట్టుగా చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశా నిర్ధేశం చేశారు. -
సీఎం రేవంత్రెడ్డిది పర్సంటేజీ పాలన: కేటీఆర్
నల్లగొండ టూటౌన్: ఎన్నికల వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం కుట్ర పూరితంగా ఇచ్చే నోటీసులకు, విచారణలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. నల్లగొండ పట్టణంలో బుధవారం ఓ వివాహానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్రెడ్డి ప్రభుత్వానిది ప్రజాపాలన కాదని, పర్సంటేజీల పాలన అని విమర్శించారు. కమీషన్లు ఇవ్వనిదే ఈ ప్రభుత్వంలో పనులు కావని స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలే బహిరంగ వేదికలపైనే చెబుతున్నారని అన్నారు. 20 శాతం, 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు రాష్ట్ర సచివాలయంలోనే ధర్నా చేశారని గుర్తుచేశారు. ఈ కమీషన్ల వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కమిషన్ల ఏర్పాటు, నోటీసులు అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇది దద్దమ్మ ప్రభుత్వం: ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కేటీఆర్ విమర్శించారు. ‘ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయి గురువారానికి మూడు నెలలు పూర్తవుతుంది. అందులో చనిపోయినవారి శవాలను కూడా తీసుకురాలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటివరకు విచారణ లేదు. అందుకు కారణమైన సంస్థపై చర్యలు లేవు. కాంగ్రెస్ వచ్చాక వట్టెం పంపుహౌస్ మునిగింది. పెద్దవాగు రెండుసార్లు కొట్టుకుపోయినా చర్యలు లేవు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా ప్రచారం చేస్తున్నా ప్రజలకు వాస్తవాలు తెలుసు. దేశంలో చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద తమకు సంపూర్ణ నమ్మకం ఉంది. ఎన్ని నోటీసులు ఇచ్చినా న్యాయం, ధర్మమే గెలుస్తుంది. తెలంగాణకు మేలు చేసినవారిని ఆ దేవుడే కాపాడుతాడు. ఎన్ని నోటీసులు ఇచ్చినా హామీలు అమలు చేసేంతవరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు’అని తేల్చి చెప్పారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి తదితరులు ఉన్నారు. -
కేసీఆర్కు నోటీసులపై కేటీఆర్ రియాక్షన్
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రయోగంగా చూపించేందుకు కాంగ్రెస్, బీజేపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని.. అందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు(Notices To KCR) జారీ అయ్యానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(Kalvakuntla Rama Rao) అన్నారు. పాలన చేతకాక ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకమని మండిపడ్డారాయన. రేవంత్ సర్కార్(Revanth Sarkar)కు కమీషన్లు తప్ప.. పాలన చేత కాదు. ప్రజాపాలన కాస్త పర్సంటేజీల పాలనగా మారింది. 20 నుంచి 30 శాతం కమీషన్లు, పర్సంటేజీలు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వంలో ఏ పని జరగదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే బహిరంగంగా చెపుతున్నారు. తమ అవినీతి కమిషన్ల నుంచి దృష్టి మరల్చేందుకే కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) నోటీసుల డ్రామా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోంది. అందులో భాగంగానే ఈ నోటీసులు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం ఓ చిల్లర ప్రయత్నం. ఇలా ఎన్నో నోటీసులు ఇచ్చినా దుదీ పించల్లా ఎగిరి పోతాయి. కమిటీల పేరుతో, కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తూ.. ఆరు గ్యారంటీల(Six Guarantees) అమలును పక్కనపెడదామనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలను చూస్తూ ఊరుకోబోం. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి’’ అని కేటీఆర్ అన్నారు. ఇదీ చదవండి: కేసీఆర్ చట్టానికేమైనా అతీతుడా? -
తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు: మల్లు రవి వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయన్నారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇదే సమయంలో ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లారు.. కేసీఆర్ చట్టానికి అతీతులా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఎంపీ మల్లు రవి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేయబోతున్నాయి. ముగ్గురు కలిసి ప్రజా ప్రభుత్వం మళ్ళీ రాకుండా కుట్ర చేస్తున్నారు. వీళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజా ప్రభుత్వమే వస్తుంది. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చట్టానికి అతీతులా?. ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళారు. బీహార్లో లాలు ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లలేదా?. కేసీఆర్, హరీష్, ఈటల.. కమిషన్ ముందు హాజరు కావాలి. నోటీసులు అందకపోవడానికి మనం ఏమైనా అమెరికాలో ఉన్నామా?. విద్యుత్ కమిషన్ విషయంలో కేసీఆర్ తప్పు చేశారు. ఇప్పుడైనా కాళేశ్వరం కమిషన్కు సహకరించాలి’ అని వ్యాఖ్యలు చేశారు. -
నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్పై ఈడీ సంచలన ఆరోపణ
సాక్షి, ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ద్వారా రూ.142 కోట్లు ఆదాయాన్ని సోనియా, రాహుల్ గాంధీ వాడుకున్నారని తెలిపింది. నిందితులు నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనుభవిస్తున్నారని పేర్కొంది.నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ అంశంపై ఢిల్లీ ప్రత్యేక కోర్టులో బుధవారం జరిగిన విచారణలో భాగంగా ఈడీ వాదన వినిపించింది. ఈ సందర్భంగా నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ద్వారా రూ.142 కోట్లు ఆదాయాన్ని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వాడుకున్నారని ఈడీ తెలిపింది. AJLకి రూ.50 లక్షలు చెల్లించి యంగ్ ఇండియన్ కంపెనీ రూ.90.25 కోట్లు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సుమన్ దూబే , సామ్ పిట్రోడా నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు. సోనియా, రాహుల్ యంగ్ ఇండియన్ కంపెనీలో 76% వాటాను కలిగి ఉన్నారు.నిందితులు నేషనల్ హెరాల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తి నుండి వచ్చే అద్దె కూడా తీసుకున్నారు. నిందితులు నేరం చేయడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనుభవిస్తున్నారు. నవంబర్ 2023లో ఆస్తులను అటాచ్ చేశాం. నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంపాదించినప్పుడు, వారు ఆదాయాన్ని తమ వద్దే ఉంచుకోవడం కూడా మనీలాండరింగ్గా పరిగణించాలి. ఈ క్రమంలో వచ్చిన డబ్బులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయి. ప్రాథమికంగా మనీలాండరింగ్ కేసు నమోదు చేశాం’ అని చెప్పుకొచ్చింది.మరోవైపు.. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియాపై ఈడీ ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై రౌస్ అవెన్యూ కోర్టులో అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరుగుతోందని జూలైకి విచారణకు వాయిదా వేయాలని కోరారు. సింఘ్వీ అభ్యర్థనను అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వ్యతిరేకించారు.The Rouse Avenue Court began hearing the National Herald money laundering case. Notices were issued to Sonia Gandhi, Rahul Gandhi, Sam Pitroda, and others.Special counsel for ED, Zoheb Hossain submitted that the property derived from any criminal activity is a proceed of crime.…— ANI (@ANI) May 21, 2025ఇదిలా ఉండగా.. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలతో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ అధికారులు గతంలో పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారన్న ఫిర్యాదుల మేరకు ఈడీ, సీబీఐ దర్యాప్తు చేశాయి. సీబీఐ విచారణ మధ్యలోనే నిలిచినప్పటికీ.. ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది. ఈ కేసులో 2023, నవంబరులో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు ప్రారంభించింది. -
ఎవరి పనితీరు ఏంటో నివేదికల్లో ఉంది
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా మీ ఆలోచనలేంటో చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. ఎమ్మెల్యేలకు ఉన్న ప్రజాసంబంధ అవసరాలు, బాధలు వినేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలతో ముఖాముఖిలో భాగంగా మంగళవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆయన నాగర్కర్నూల్, మెదక్, మల్కాజ్గిరి పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అయితే, గతంలో మాదిరి కాకుండా ఈసారి ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా భేటీ అయినట్టు తెలిసింది. ప్రతీ ఎమ్మెల్యేతో 10–15 నిమిషాలపాటు మాట్లాడిన రేవంత్.. ఎమ్మెల్యేల అభిప్రాయాలను వినడంతోపాటు వారికి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.విశ్వసనీయ సమాచారం ప్రకారం... ముఖాముఖి భేటీలో భాగంగా వారి పనితీరు గురించి రేవంత్రెడ్డి కుండబద్దలు కొట్టారు. ఎవరి పనితీరు ఏంటో తన దగ్గర ఉన్న నివేదికలు చెబుతున్నాయని, ఎవరెవరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారో, ఎవరు ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తున్నారో తనకు తెలుసునని, పనితీరు మార్చుకోవాల్సిన వారు వెంటనే మారితే మంచిదని, లేదంటే తాను కూడా ఏమీ చేయలేనని హెచ్చరించినట్టు తెలిసింది. ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు వస్తాయని, ఆ నివేదికల ఆధారంగానే పార్టీ ముందుకెళ్తుందని కూడా చెప్పినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ తీర్చే బాధ్యత తనపై ఉందని, ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని ఎమ్మెల్యేలకు చెప్పారు. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసుకురావాలని, కాంగ్రెస్ నుంచి గెలిచిన ప్రతి ఎమ్మెల్యే తనకు సమానమేనని, అందరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు. నల్లమల డిక్లరేషన్ సహా అన్నింటినీ అమలు చేస్తానని చెప్పారు. ఒక్కసారి గెలవడం గొప్ప కాదని, రెండోసారి, మూడోసారి గెలిచేలా ప్రజలను ఆకట్టుకోవడంలోనే ఎమ్మెల్యేల పనితీరు తెలుస్తుందని, రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి వచ్చినప్పుడు అసలు రాజకీయం ఏంటో అర్థమవుతుందని రేవంత్ వ్యాఖ్యానించారు. సీఎంతో భేటీ అయిన వారిలో వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, గద్వాల ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఉన్నారు. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేశ్ అమెరికా పర్యటనలో ఉండటంతో భేటీలో పాల్గొనలేదు. -
‘అఖిలపక్షం వేళ’ అనైక్యత!
దేశం కోసం సమష్టిగా కదలాల్సిన సందర్భాల్లో సైతం కలవలేనంతగా అధికార విపక్షాలు ఎడ మొహం పెడమొహంగా మారాయి. పెహల్గామ్లో గత నెల 22న ఉగ్రవాదులు సాగించిన మారణ కాండ మొదలు మన ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్, ఈ నెల 10న కాల్పుల విరమణ, పాకిస్తాన్ దురాలోచనలూ వగైరా ప్రపంచానికి తెలియజెప్పేందుకు అధికార, విపక్ష ఎంపీలతో ఏర్పాటు చేసిన ఏడు అఖిలపక్ష బృందాల కూర్పు ప్రక్రియ వివాదాస్పదంగా మారటం దీన్ని చాటుతోంది. మన దేశంనుంచి సమష్టి స్వరం వినబడితే దాని ప్రభావం వేరుగా వుంటుంది. పాకిస్తాన్ సైతం ఇదే తరహాలో అఖిలపక్ష ప్రతినిధి బృందాలను పంపటానికి సన్నాహాలు చేసుకుంటున్నది. కనీసం ఇందుకోసమైనా విభేదాలు పక్కనబెట్టి ఒక్కటై నిలబడదామన్న స్పృహ అటూ ఇటూ కరువవుతోంది. ఏ దేశంలోనూ ఇలా వుండదు. అమెరికాలో ప్రపంచ వాణిజ్య కేంద్రం (డబ్ల్యూటీసీ)పై ఉగ్రదాడి మొదలు ఇందుకు ఎన్నయినా ఉదాహరణలివ్వొచ్చు. ‘ఉగ్రవాదంపై యుద్ధం’ పేరుతో అమెరికా అఫ్గాన్ను వల్లకాడు చేసింది. చివరకు ఒరిగిందేమీ లేదు. అఫ్గాన్నుంచి అవమానకరంగా నిష్క్రమించాల్సి వచ్చింది. అయినా అక్కడి విపక్షం మౌనంగా ఉండిపోయింది. కానీ ఇక్కడలా కాదు. యూపీఏ హయాంలో ముంబైపై ఉగ్రదాడి, దానికి వెనకాముందూ జరిగిన అనేకానేక ఉదంతాల్లో మన దేశంలో అధికార పక్షంపై విపక్షం విరుచుకుపడటం, యక్షప్రశ్నలు వేసి ఇరుకున పడేసే ప్రయత్నం చేయటం రివాజుగా మారింది. యూపీఏ హయాంలో బీజేపీ విపక్షంలోవుండి ఏం చేసేదో, ఇప్పుడు కాంగ్రెస్ సైతం ఆ పనే చేస్తోంది. పుల్వామా ఉగ్రదాడి సమయంలో మరీ దారుణం. జవాన్ల త్యాగాలూ, వారు దెబ్బకు దెబ్బ తీసిన వైనమూ 2019 లోక్సభ ఎన్నికల సమయంలో చర్చనీయాంశంగా మారటం ఆశ్చర్యపరిచింది. ఈ ఉదంతాలను బీజేపీ తనకను కూలంగా మలుచుకునే ప్రయత్నం చేయగా, ప్రభుత్వ వైఫల్యంపై విపక్షం చాటింపు వేసింది. అయితే మన దేశంలోనూ ఒకప్పుడు అధికార, విపక్షాలు కలిసికట్టుగా పనిచేసిన ఉదంతాలు లేకపోలేదు. ఇందుకోసం ఎన్నడో 1971 నాటి భారత్–పాక్ యుద్ధం వరకూ పోనవసరం లేదు. 1994లో కశ్మీర్పై భారత్ వైఖరిని వివరించటానికి నాటి ప్రధాని పీవీ నరసింహారావు రూపొందించిన అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహించింది అప్పటి విపక్ష నేత అటల్ బిహారీ వాజపేయి! పాతికేళ్ల క్రితం కార్గిల్ యుద్ధ సమయంలో నాటి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమూ, కాంగ్రెస్తోసహా విపక్షాలూ దేశభద్రత కోసం కలిసికట్టుగా పనిచేశాయి. కానీ ఇప్పుడెందుకు పరస్పరం తప్పులు వెదుక్కొనే తాపత్రయాన్ని ప్రదర్శిస్తున్నట్టు? దేశంలో తక్షణం వచ్చే ఎన్నికలేమీ లేవు. అయినా పెహల్గామ్ను రాజకీయంగా వినియోగించుకోవటానికి అటూ ఇటూ పోటీపడుతున్నారు. త్రివిధ దళాల అధికార ప్రతినిధులు చెప్పేవరకూ ఆగకుండా ఇష్టానుసారం ఉన్నవీ లేనివీ ప్రచారం చేసి, విపక్షాలను పాకిస్తాన్ అనుకూలురుగా, దేశద్రోహులుగా చూపటానికి బీజేపీ శ్రేణులూ, సాను భూతిపరులూ చేయని ప్రయత్నం లేదు. తొలి ప్రధాని నెహ్రూ ఉదారంగా పాకిస్తాన్కు నదీజలాలు, భారీయెత్తున సొమ్ము కట్టబెట్టారని బీజేపీ నేతలు ఇంకా ఆరోపణలు గుప్పిస్తూనే వున్నారు. ఒకపక్క అఖిలపక్షాన్ని పంపుతూ మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? వీటిని ఎలా ఎదుర్కొనాలో తెలియక ఇష్టానుసారం మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు చులకనవుతున్నారు. యుద్ధ విమానాలు ఎన్ని కూలాయి... మనవైపు జరిగిన నష్టమెంత అంటూ రాహుల్గాంధీ ప్రశ్నించారు. ఇవి అడగకూడని ప్రశ్నలేమీ కాదు... కానీ అందుకు తగిన వేదికను ఎంచుకోవాలని కూడా ఆయనకు తోచదు. ఇంతకూ అఖిలపక్ష బృందాల కూర్పుపై ఇంత వివాదం ఎందుకొచ్చినట్టు? విపక్షాలను విశ్వా సంలోకి తీసుకుని, వారు పంపిన పేర్లనుంచి ఎంపికచేసే కనీస మర్యాద అధికార పక్షం పాటించివుంటే సమస్య తలెత్తేది కాదు. విపక్షానికి ఆలోచించే శక్తిసామర్థ్యాలు లేవన్నట్టు సర్కారు ప్రవర్తించింది. కాంగ్రెస్ పార్టీ నలుగురు సభ్యుల పేర్లు పంపితే వారిలో ఒక్కరినే ఎంపిక చేసింది. పోనీ సర్కారు ఎంచుకున్నది కూడా సమర్థుల్నే కదా అనే సర్దుబాటు ధోరణి కాంగ్రెస్కు లేదు. అసలు ఆ పార్టీ నుంచి వెళ్లిన జాబితాలో సల్మాన్ ఖుర్షీద్, శశిథరూర్, మనీష్ తివారీ తదితరుల పేర్లు ఎందుకు లేకుండా పోయినట్టు? సీనియర్ నేత ఖుర్షీద్ను ఎంపిక చేసిన ప్రభుత్వం తీరా ఆయన సీనియారి టీని కాదని జేడీ(యూ) నేత సంజయ్ ఝాకు సారథ్య బాధ్యతలు ఎందుకిచ్చినట్టు? సమష్టి స్వరం వినబడాల్సిన ఈ సమయంలో ఇన్ని లుకలుకలుండటం మంచిదేనా? ఇంత రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ చివరకు ఈ వివాదాన్ని పొడిగించదల్చుకోలేదని చేతులెత్తేసింది. కానీ ఎప్పుడూ వీరంగం వేసే అలవాటున్న తృణమూల్ మాత్రం ప్రభుత్వం ఎంపిక చేసిన సభ్యుణ్ణి తప్పుకోమని చెప్పింది. దాంతో ప్రభుత్వం తగ్గి ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ సూచించిన నేతకు స్థానం కల్పించింది. అఖిలపక్షం పంపటంలోని ఉద్దేశమే సమష్టితత్వాన్ని, ఈ దేశ సంకల్పాన్ని, పాకిస్తాన్ కుయుక్తులను చాటడానికైనప్పుడు సభ్యుల ఎంపిక వివాదాస్పదం కాకుండా ప్రభుత్వం చూడాల్సింది. ఈమధ్య ఆపరేషన్ సిందూర్ మొదలుకొని పార్టీ వైఖరికి భిన్నంగా పలు ప్రకటనలిస్తూ సంచలనం సృష్టిస్తున్న శశిథరూర్ను కాంగ్రెస్ ఎంపిక చేయకపోవటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన్ను ఏరికోరి ఎంపిక చేయటం కాంగ్రెస్ను ఇరకాటంలో పెట్టడానికేనన్న విషయంలో ఎవరికీ సందేహం అక్కర్లేదు. ఏదేమైనా ఇలాంటి సంక్షోభ సమయాల్లో అవసరమైన సంయమనం, హుందాతనం ఇరువైపులా కనబడకపోవటం దురదృష్టకరం. -
కాంగ్రెస్ మిమ్మల్ని అవమానిస్తోందా?.. ఎంపీ శశి థరూర్ రియాక్షన్ ఇదే
ఢిల్లీ: ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్ను ప్రపంచ దేశాల్లో ఎండగట్టేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష నేతల్లో కేంద్ర ప్రభుత్వం తనను ఎంపిక చేయడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సమర్థించుకున్నారు. తాను కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏ రాజకీయ కోణంలో చూడడం లేదు. ఇది దేశానికి సేవ చేయాల్సిన సమయం’ అని స్పష్టం చేశారు.ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్ తీరును ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా ప్రపంచ దేశాల్లో ఎండగట్టడానికి, ఉగ్రవాదంపై భారత్ వైఖరిని వివరించడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష నేతలతో ఏడు బృందాలు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రతిపాదించిన నాలుగు పేర్లను పక్కనపెట్టి, ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ను ఎంపిక చేయడం సంచలనాత్మకంగా మారింది. అంతేకాకుండా ఓ బృందానికి శశి థరూర్ నేతృత్వం వహిస్తారని ప్రకటించడం గమనార్హం. ఈ ఎంపికపై శశిథరూర్ స్పందించారు. ‘మాజీ విదేశాంగ వ్యవహారాల శాఖ అనుభవం కారణంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తాను ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాలని అడిగారు. కిరణ్ రిజిజు అడిగిన వెంటనే నేను అందుకు అంగీకరించాను. ఇది దేశ సేవకు సంబంధించింది. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఒక పౌరుడిని సహాయం కోరితే ఇంకేం సమాధానం ఇవ్వాలి?అని ప్రశ్నించారు. తాను తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ అసంతృప్తిగా ఉందా? అన్న ప్రశ్నకు ఆ విషయం పార్టీకి, కేంద్రానికి సంబంధించింది. మీరు కాంగ్రెస్ను అడగాలి’ అని సూచించారు. పార్టీ మిమ్మల్ని అవమానించిందా? అన్న ప్రశ్నకు.. నన్ను అంత తేలికగా అవమానించలేరు. నా విలువ నాకు తెలుసని సమాధానమిచ్చారు. దేశంపై దాడి జరిగినప్పుడు, అందరం ఒకే స్వరం వినిపించడం, ఐక్యతగా నిలబడటం దేశానికి మంచిది. కేంద్రం ఆయనను దేశ ప్రతినిధిగా ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
రేపటి నుంచే భూముల రీసర్వే.. రెవెన్యూ వర్గాల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని పైలట్ పద్ధతిలో భూముల రీసర్వేకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడ్రనైజేషన్ ప్రోగ్రామ్ (డీఐఎల్ఆర్ఎంపీ) మార్గదర్శకాలకు అనుగుణంగా డ్రోన్లు లేదా ప్యూర్ గ్రౌండ్ ట్రూతింగ్ పద్ధతి ద్వారా ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లో ఈ సర్వే సోమవారం నుంచి నిర్వహించనుంది.ఇందుకోసం ఆయా గ్రామాల్లో 4–5 రోజులుగా భూముల సరిహద్దుల నిర్ధారణ జరుగుతుండగా రేపట్నుంచి సర్వే బృందాలు అక్కడకు వెళ్లనున్నాయి. ముందుగా మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్నగర్, జగిత్యాల జిల్లా భీర్పూర్ మండలం కొమ్మనాపల్లి (కొత్త), ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ గ్రామాల్లోనే సర్వే నిర్వహించాలనుకున్నా ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం సాహెబ్నగర్, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు గ్రామాలను కూడా కలిపారు. ఈ ఐదు గ్రామాల్లో పైలట్ సర్వే నిర్వహించేందుకు మూడు ఏజెన్సీలను ఎంపిక చేశారు. భూముల రీసర్వేను సర్వే, సెటిల్మెంట్ శాఖ పర్యవేక్షించనుంది.గ్రామ పటాలు, కమతాల పటాల తయారీ.. భూముల రీసర్వేకు ప్రస్తుతం ఎంపిక చేసిన ఐదు గ్రామాల పటాలతోపాటు ప్రతి కమతానికి సరిహద్దులు నిర్ధారించి ఆయా కమతాల పటాలు కూడా రూపొందించనున్నారు. ఇందుకోసం ఆ గ్రామంలో ఎంత భూమి ఉంది.. ఎన్ని సర్వే నంబర్లున్నాయనే వివరాల ఆధారంగా సర్వేయర్లను మోహరించి ప్రతి సర్వే, బైసర్వే నంబర్లలోని కమతాలకు విడివిడిగా పటాలను తయారు చేయనున్నారు. ఇప్పటికే గ్రామాల్లో అందుబాటులో ఉన్న ఛెస్సలా, ఖాస్రా పహాణీ రికార్డులతో వాటిని సరిపోల్చి వివాదాల్లేని కొత్త పటాలను రెవెన్యూ రికార్డుల్లో చేర్చనున్నారు. ఈ గ్రామాల్లో ఎదురయ్యే అనుభవాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే మార్గదర్శకాలు తయారవుతాయని సర్వే శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ గ్రామానికి నక్ష లేదు! భూముల రీసర్వే కోసం ప్రభుత్వం ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లోని రెండు గ్రామాల స్థితిగతులపై ‘సాక్షి’క్షేత్రస్థాయి సమాచారం సేకరించింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ, మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్నగర్ గ్రామాల్లో పరిస్థితుల గురించి స్థానిక రెవెన్యూ యంత్రాంగాన్ని అడిగి తెలుసుకుంది. ములుగుమడ గ్రామం తొలుత బ్రిటిష్ పాలన అమలైన నాటి ఆంధ్ర ప్రాంతంలో ఉండేది. అలాగే నిజాం పాలించిన తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుత కంచికర్ల మండలంలో ఉన్న పరిటాల అనే గ్రామం ఉండేది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు జిల్లాల సరిహద్దుల మార్పుల్లో భాగంగా పరిటాలను గుంటూరు జిల్లాలో చేర్చి ములుగుమడను ఖమ్మం జిల్లాలో చేర్చారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించాక కూడా ములుగుమడ తెలంగాణకే వచ్చింది.అయితే, భూరికార్డుల ప్రక్షాళన జరిగే వరకు ఆ గ్రామంలో భూముల రికార్డులు సెంట్ల రూపంలోనే ఉండేవి. గుంటలు, ఎకరాలుగా ఉండేవి కావు. భూరికార్డుల ప్రక్షాళన తర్వాత దాన్ని గుంటల్లోకి మార్చారు. కానీ ఆ గ్రామ నక్షను అప్పటి నుంచి ఇప్పటిదాకా తయారు చేయలేదు. దీంతో ములుగుమడ గ్రామానికి అధికారికంగా గ్రామ సరిహద్దులే లేకుండా పోయాయి. ఇప్పుడు ఈ గ్రామాన్ని పైలట్ సర్వే కింద ప్రభుత్వం ఎంపిక చేసింది. మొదటగా స్థానిక రెవెన్యూ యంత్రాంగం గ్రామ సరిహద్దులను నిర్ధారించింది. ఈ మేరకు గ్రామ నక్షను కూడా తయారు చేయనున్నాయి. ఈ గ్రామంలో మొత్తం 103 సర్వే నంబర్లకు 845 ఎకరాల వరకు భూమి ఉంది.ఈ భూమిలోని ప్రతి కమతాన్ని సర్వే, బైసర్వే నంబర్లవారీగా రీసర్వే నిర్వహించి ఆయా కమతాల హద్దులు నిర్ధారించి పటాలు తయారు చేయనున్నారు. ఇక మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్నగర్ అనే గ్రామానిక నక్షతోపాటు ఇతర రెవెన్యూ రికార్డులన్నీ ఉన్నాయి. ఈ గ్రామంలోనూ ఇతర గ్రామాలతో సరిహద్దులను గుర్తించారు. ఈ గ్రామంలో 122 సర్వే నంబర్లలో 422 ఎకరాల భూమి ఉంది. సోమవారం నుంచి ఈ భూమిని కమతాల వారీగా సర్వే నిర్వహించి హద్దుల నిర్ధారణ ద్వారా కమతాలవారీగా పటాలు రూపొందించనున్నారు. ఏమవుతుందో... ఏమో? భూముల రీసర్వే విషయంలో రెవెన్యూ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. తెలంగాణలో నెలకొన్న భౌగోళిక పరిస్థితులు, రెవెన్యూ రికార్డులను బట్టి సర్వే జరిపితే ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో సమస్యలు వస్తాయని అంటున్నారు. ఈ విషయమై ఓ తహసీల్దార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘ఓ గ్రామంలోని 311 సర్వే నంబర్లో 200 ఎకరాలకు రికార్డు ఉంది. కానీ ఆ సర్వే నంబర్లో 300 ఎకరాల భూమి ఉంది. ఆ మేరకు రైతులకు 300 ఎకరాలకు పాసుపుస్తకాలున్నాయి.కానీ, రెవెన్యూ రికార్డును మార్చలేకపోతున్నాం’అని అన్నారు. మరోవైపు భూకబ్జా ఓ సర్వే నంబర్లో ఉంటే రికార్డు మరో సర్వే నంబర్లో ఉంటుందని.. రాష్ట్రంలోని మొత్తం భూముల్లో 35–40 శాతం భూములకు ఇదే సమస్య వస్తుందన్నారు. రీసర్వేలో ఇదే విషయం తేలితే ఆయా గ్రామాల్లోని రికార్డులు, రైతుల పాసుపుస్తకాలన్నింటినీ మార్చాల్సి వస్తుందని చెప్పారు. రీసర్వే సులభమైనప్పటికీ అనంతరం ఎదురయ్యే సమస్యల పరిష్కారమే పెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డారు. -
కాంగ్రెస్కు బిగ్ షాక్
న్యూఢిల్లీ: పాకిస్తాన్పై భారత్ ప్రారంభించిన దౌత్య యుద్ధం కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపింది. ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్ తీరును ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా ప్రపంచ దేశాల్లో ఎండగట్టడానికి, ఉగ్రవాదంపై భారత్ వైఖరిని వివరించడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష నేతలతో ఏడు బృందాలు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రతిపాదించిన నాలుగు పేర్లను పక్కనపెట్టి, ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ను ఎంపిక చేయడం సంచలనాత్మకంగా మారింది. అంతేకాకుండా ఓ బృందానికి శశి థరూర్ నేతృత్వం వహిస్తారని ప్రకటించడం గమనార్హం. కాంగ్రెస్కు, థరూర్కు మధ్య ఇటీవల దూరం పెరుగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ పట్ల ఆయన సానుకూలంగా మాట్లాడుతుండడం కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. ఏడు బృందాలకు సారథ్యం వహించే నేతల పేర్లను కేంద్రం ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మీడియా ఇన్చార్జి జైరామ్ రమేశ్ స్పందించారు. తాము ప్రతిపాదించని వ్యక్తిని ఎంపిక చేయడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు రాహుల్ గాందీతో మాట్లాడారు. విదేశాలకు పంపించే ప్రతినిధి బృందాల్లో నియమించడానికి నలుగురు ఎంపీల పేర్లను ప్రతిపాదించాలని కోరారు. దాంతో రాహుల్ గాంధీ మా పార్టీ నుంచి ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, సయ్యద్ నజీర్ హుస్సేన్, అమరీందర్సింగ్ రాజా వారింగ్ పేర్లను ప్రతిపాదిస్తూ కిరణ్ రిజిజుకు లేఖ రాశారు’’అని జైరామ్ రమేశ్ చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్కు దూరం! శశి థరూర్ వైఖరి కొన్ని నెలలుగా కాంగ్రెస్ పారీ్టలో చర్చనీయాంశంగా మారుతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తు న్నారు. పాకిస్తాన్తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్య చేసుకోవడం పట్ల బీజేపీని విపక్షాలన్నీ తప్పుపట్టగా, శశి థరూర్ మాత్రం వెనుకేసుకొ చ్చారు. ఆయన లక్ష్మణ రేఖ దాటారని కాంగ్రెస్ నాయకు లు మండిపడ్డారు. కానీ, ఒక భారతీయుడిగా తన సొంత అభిప్రాయాలు వెల్లడించానని, తన వ్యాఖ్యలతో కాంగ్రెస్కు సంబంధం లేదని థరూ ర్ వివరణ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తో శశి థరూర్ వేదిక పంచుకున్నారు. తమను ఒకే వేదికపై చూసి కొందరికి నిద్ర పట్టదని కూడా ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. గొప్ప గౌరవంగా భావిస్తున్నా: థరూర్ అఖిలపక్ష బృందానికి నాయకత్వం వహించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం తనకు కల్పించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చెప్పారు. ‘‘నా సేవలు అవసరమని కేంద్రం భావిస్తే అందుకు సిద్ధంగా ఉన్నా. దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం నా వంతు సేవలు కచ్చితంగా అందిస్తా.. జైహింద్’’అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
‘హరీష్ పై కేటీఆర్కు ఎందుకంత ప్రేమో..’
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందంటూ ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని స్పష్టం చేసిన రామచంద్రనాయక్.. ఎప్పుడూ లేని విధంగా హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లడమే ఉదాహరణగా చెప్పుకొచ్చారు.‘పార్టీ ప్లీనరీ సమయంలో హరీష్ రావు కు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయనకు అంత సీను లేదని చెప్పారు. రెండు గంటలకు పైగా హరీష్ రావుతో చర్చలు జరిపారు. గతంలో ఎప్పుడూ హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లలేదు.హరీష్ రావు ఇంట్లో గతంలో పంక్షన్ జరిగినా కేటీఆర్, ఆయన కుటుంబం దూరంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు సడన్గా హరీష్ రావు పైన కేటీఆర్కు ఎందుకంత ప్రేమ వచ్చిందో చెప్పాలి. హరీష్ రావు కొత్త పార్టీ పెడుతున్నాడని ప్రచారం జరుగుతోంది. కల్వకుంట్ల కవిత ఇప్పటికే పార్టీ కి వ్యతిరేకంగా బహిరంగంగా విమర్శలు చేస్తున్నాడు. తన మీద దుష్పచారం జరుగుతోందని, దాని వెనుక ఎవరున్నారో తనకు తెలుసునని కవిత అంటోంది. మొత్తంగా కల్వకుంట్ల కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్యపోరు జరుగుతోంది. రాజకీయ ఆధిపత్యం కోసం కొట్లాడుకుంటున్నారు. హరీష్ రావు తో చర్చల మతలబు ఏమిటో ప్రజలకు కేటీఆర్ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.హరీష్రావు నివాసానికి కేటీఆర్హరీష్రావు నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు హరీష్తో భేటీ అయ్యారు. ఇటీవల అస్వస్థతకు గురైన హరీష్ రావు తండ్రి ఆరోగ్య వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. కోకాపేట హరీష్రావు నివాసంలో సమావేశమైన ఇరువురు నేతలు.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.హరీష్ రావు పార్టీ మారతారన్న ప్రచారంపై సైబర్ సెల్కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాను పార్టీ లైన్ దాటనని ఇటీవల హరీష్రావు ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని హరీష్రావు మరోసారి స్పష్టం చేశారు. కేటీఆర్కు పార్టీ పగ్గాలు అప్పగించిన కానీ.. పని చేస్తానని హరీష్రావు తెలిపారు. వరంగల్ సభ తర్వాత పార్టీలో హరీష్రావు ప్రాముఖ్యత తగ్గిందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మండిపడుతోంది. దీంతో నేరుగా హరీష్ రావుతో మాట్లాడి సమస్యకు పుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే కేటీఆర్ సమావేశమైనట్లు సమాచారం. -
‘సీఎంకు, డిప్యూటీ సీఎంకు మధ్య విబేధాలు’
హైదరాబాద్: రాష్ట్రం దివాలా తీసిందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి వర్గం అసంతృప్తిగా ఉందన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఈ రోజు(శుక్రవారం) మీడియాతో చిట్ చాట్ లో భాగంగా మాట్టాడుతూ.. ‘ సీఎం రేవంత్ కు, డిప్యూటీ సీఎంకు మధ్య విబేధాలు ఉన్నాయి. అందుకే సీఎం కామెంట్స్ ను మంత్రులు ఎవరూ సమర్థించలేదు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ రెండుగా చీలిపోయింది. రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు బాధపడుతున్నారు. మంత్రి వర్గ విస్తరణను సీఎం రేవంత్ అడ్డుకుంటున్నారు. కొత్తగా వచ్చేవారు సైతం వ్యతిరేకంగా ఉంటారని సీఎం రేవంత్ భావన. అందుకే గందరగోళ నివేదికలు హైకమాండ్ కి పంపి అడ్డుకుంటున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఎక్కడ బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సి వస్తుందోనని జగన్నాటకం ఆడుతున్నారు. రేవంత్ లోపాలు, తప్పిదాలు అన్ని హైకమాండ్ దగ్గర ఉన్నాయి. లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే సీఎంను మార్చాలని హైకమాండ్ ఎదురుచూస్తోంది’ అని మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
‘సురేఖ వ్యాఖ్యల ఎఫెక్ట్.. రేవంత్ కమీషన్ల సంగతేంటి?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రులు కమీషన్లు తీసుకోకుండా సంతకాలు చేయరు అని మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. దీంతో, ఆమె వ్యాఖ్యలపై తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. ఏయే మంత్రి ఎంత కమీషన్లు తీసుకున్నారో దర్యాప్తు చేపట్టాలని రేవంత్ సర్కార్ను డిమాండ్ చేశారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కొండా సురేఖ మంత్రులు కమిషన్లు తీసుకోవడం కామన్ అనడం బాధాకరం. అంటే రాష్ట్రంలో మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని ఒప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఇదే డిమాండ్ చేస్తున్నాం. ఏయే శాఖ మంత్రి ఎంత తీసుకున్నారో దర్యాప్తునకు ఆదేశించాలి. మంత్రులు తీసుకున్న కమీషన్లు బయట పెట్టాలి అని వ్యాఖ్యలు చేశారు.రాజకీయాలకు అతీతంగా తిరంగా యాత్ర..ఇదే సమయంలో తిరంగా యాత్రపై మాట్లాడుతూ.. పహల్గాం ఘటనలో 26 మందిని ఉగ్రమూకలు హతమార్చారు. మానవత్వం లేకుండా పిల్లల ముందు తండ్రిని, భార్య ముందు భర్తను పేర్లు అడిగి హతమార్చారు. మానవ సమాజానికే సవాల్ గా మారిన ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పాకిస్తాన్లో 9 ఉగ్రవాద స్థావరాలను పేల్చివేశాం. ఆపరేషన్ సిందూర్ను విజయవంతం చేయడం జరిగింది. ఉగ్రవాద చర్యలతో మనదేశం బలవుతూనే ఉంది. జమ్ముకశ్మీర్లోనే 46 వేల మందిని ఉగ్రమూకలు బలితీసుకున్నాయి. మన సైనికులు నూతన చరిత్రను ప్రారంభించారు.గతంలో ఉగ్రమూకలు దాడి చేసినప్పుడు.. మరణించినవారి ఫోటో దగ్గర గులాబీ పువ్వు పెట్టడం వరకే పరిమితం అయ్యే వాళ్ళం. 2009లో 40 మందిని ఊచకోత కోశారు. భారత్పై దాడి చేస్తే ప్రతీకారం ఎలా ఉంటుందో చూపించాం. ఉగ్రవాదుల శిక్షణ కార్యక్రమాలు, ఉగ్రవాదుల నివాసాలను ధ్వంసం చేశాం. కరడుకట్టిన ఉగ్రవాదులను అంతం చేశాం. పాకిస్తాన్ పిల్ల చేష్టలతో దాడికి ఒడిగట్టింది.. భారత సైన్యం తిప్పికొట్టింది. ఆపరేషన్ సిందూర్ ఆగలేదు.. ఇంకా కొనసాగుతోంది. రక్షణ రంగంలో ప్రతి సైనికుడు రాణించారు. S-400, బ్రహ్మాస్త్రం పనితీరు దేశ ప్రజలు గమనించారు. భారత ఆర్మీకి అన్ని రకాలుగా సమకూర్చడం జరిగింది.ఆర్మీకి అవసరమైన వాటిలో 35 శాతం మనమే సమకూర్చుకున్నాం. మిథానీ, DRDAలో వసతులు మెరుగు పరుస్తున్నాం. ఆర్డినెన్సు ఫ్యాక్టరీలను మరింత సంసిద్ధం చేసుకున్నాం. పాకిస్తాన్ను ప్రపంచం ముందు దోషిగా నిలబెడతాం. భారత సైనికులు అనుసరించిన స్ట్రాటజీని ప్రపంచం మొత్తం చూసింది. రాజకీయాలకు అతీతంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఆహ్వానిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు. -
‘కొండా సురేఖకు నా అభినందనలు’: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: మంత్రి కొండా సురేఖకు మాజీ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. మంత్రులు కమిషన్లు తీసుకోకుండా ఏ పనిచేయరంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో ‘కనీసం ఇప్పటికైనా కొన్ని నిజాలు బయట పెట్టినందుకు మంత్రి కొండా సురేఖకు నా హృదయపూర్వక అభినందనలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘కమీషన్ సర్కార్’గా మారిపోయింది. ఇది రహస్యమే కాదు. ఓపెన్ సీక్రెట్. అంతేకాదు, ఈ ప్రభుత్వంలో ఫైల్స్పై సంతకం చేసేందుకు మంత్రులు, వారి సహచర మంత్రులు 30శాతం కమిషన్ తీసుకుంటున్నారు. ఇదే కమిషన్ల వ్యవహరంలో సచివాలయంలో పలువురు కాంట్రాక్టర్లు ధర్నా చేసిన విషయం గుర్తుందా? అని ప్రశ్నించారు. ఆ ఘటనే ఈ ప్రభుత్వంలో మంత్రుల కమిషన్ల భాగోతాన్ని బహిర్గతం చేసింది. ఈ సందర్భంగా కొండా సురేఖని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కమిషన్లు తీసుకుంటున్న మంత్రుల వివరాల్ని బయటపెట్టాలి. ప్రజల ముందు బహిర్ఘతం చేయాలని అన్నారు. ఇదే అంశంపై రాహుల్ గాంధీ,రేవంత్రెడ్డిలు వారి సొంత కేబినెట్ మంత్రి చేసిన ఆరోపణలపై మీరు దర్యాప్తుకు ఆదేశించగలరా?’అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. Many congratulations to Minister Konda Surekha garu for finally speaking some truths!Congress in Telangana runs a “commission sarkaar”, and it's unfortunate this has become an open secret in TelanganaIn this 30% commission government, ministers, according to their own… https://t.co/3dMd2yDfb5— KTR (@KTRBRS) May 16, 2025 -
మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తీసుకోకుండా మంత్రులు ఏ పనిచేయరూ అంటూ ఆమె చేసిన బహిరంగ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. వరంగల్లోని కృష్ణ కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో రూ.5 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించిన నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.‘నా దగ్గరకు కొన్ని కంపెనీల ఫైల్స్ వస్తుంటాయి. మామూలుగా మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్ క్లియర్ చేస్తుంటారు. నేను అలా చేయను.. సమాజ సేవే చేయమంటాను. నాకు నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పా. స్కూల్ డెవలప్మెంట్ చేయమని కోరా’ అని వ్యాఖ్యానించారు. అయితే, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. నేను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తూ.. అయితే, తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం కావడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. ‘నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. నేను వరంగల్లో చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం. ప్రతి ఫైలుకు డబ్బులు తీసుకున్నారో లేదో గత ప్రభుత్వంలోని మంత్రులకు తెలుసు. నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారు. నేను మాట్లాడిన దాంట్లో ముందు వెనక కట్ చేసి చిన్న క్లిప్లను కావాలని ట్రోల్ చేస్తున్నారు. మా కేబినెట్ మంత్రుల మధ్య గొడవలు పెట్టాలని కొందరు కుట్ర చేస్తున్నారు. పని చేస్తున్న మంత్రులపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఒక్కో మెట్టు ఎక్కి మంత్రినయ్యాను నాపై తప్పుడు ప్రచారాలు చేసే ఏ ఒక్కరిని వదిలిపెట్టను. గత ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ నేతలు చర్చకు సిద్ధమా? ఎక్కడికి వస్తారో రండి’ అంటూ సవాల్ విసిరారు. -
ఆపరేషన్ సరే.. పహల్గాం నిందితులు చనిపోయారా?: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు: పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై ప్రతిపక్ష కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేశారు. ఆపరేషన్ సిందూర్తో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. భారత దాడుల్లో మరణించింది ఎవరు?. పహల్గాంలో దాడి చేసిన వారు మృతుల్లో ఒక్కరైనా ఉన్నారా?. సరిహద్దులో ఎందుకు భద్రత లేదు?. పహల్గాం ఘటన జరిగిన తర్వాత వారు ఎలా తప్పించుకున్నారు? అని ప్రశ్నలు సంధించారు.కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోతూర్ మంజునాథ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఆపరేషన్ సిందూర్ భారత్కు ఎలాంటి ప్రయోజనం అందించలేదు. ఈ ఆపరేషన్లో ఏమీ చేయలేదు. కేవలం గొప్పగా చూపించుకోవడానికే ఇదంతా చెబుతున్నారు. ఓ నాలుగు విమానాలు సరిహద్దులు దాటి వెళ్లి.. మళ్లీ తిరిగి వచ్చాయి. అంతే తప్ప ఇంకేమీ జరగలేదు. భారత దాడుల్లో మరణించిన వారు ఎవరు?. పహల్గాంలో దాడి చేసిన వారు మృతుల్లో ఎవరైనా ఉన్నారా?. అధికారులు ఒకటి చెబితే.. టీవీలు మరొకటి చెబుతున్నాయి. మరొకరు ఇంకేదో అంటున్నారు. మనం ఎవరిని నమ్ముతాము? అధికారిక ప్రకటన ఎక్కడ?’ అని ప్రశ్నించారు.అలాగే, భారత్ దాడుల్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు మృతిచెందినట్టు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఎవరు నిర్ధారించారు?. మన సరిహద్దును దాటిన ఆ ఉగ్రవాదులు ఎవరు? వారి గుర్తింపు ఏంటి? సరిహద్దులో ఎందుకు భద్రత లేదు? వారు ఎలా తప్పించుకున్నారు? ఉగ్రవాద మూలాలు, శాఖలను గుర్తించి వాటిని నిర్మూలించాలి. పహల్గాం ఘటన పూర్తిగా నిఘా వైఫల్యమే. పహల్గాం దాడి బాధితుల కుటుంబాలకు న్యాయం చేయడంలో కేంద్రం విఫలమైంది. పహల్గాం బాధితులకు కేంద్రం పరిహారం ఇచ్చిందా?. కర్ణాటక, పాకిస్తాన్, చైనా లేదా బంగ్లాదేశ్లో ఎక్కడైనా పౌరులపై జరిగే దాడులను మేము వ్యతిరేకిస్తాం’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ‘ఆపరేషన్ సిందూర్’లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని చెప్పారు. పాక్ దాడులు చేస్తే తిరిగి దాడులు చేస్తామని పేర్కొన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్, పీవోకేలోని తొమ్మిది ఉగ్ర శిబిరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. భారత్.. నూర్ఖాన్, రఫీకీ, షోర్కోట్, మురిద్, సుక్కోర్, సియాల్కోట్, పసురూర్, చునియన్, సర్గోదా, భోలారీ, జకోబాబాద్లో దాడులు చేసింది. దాడికి ముందు.. తర్వాత ఇక్కడినుంచి సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో నష్టం తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జకోబాబాద్లోని షాబాజ్ బేస్ చాలావరకు ధ్వంసమై కనిపిస్తోంది. ఇక భారత పదాతి దళం జరిపిన దాడిలో నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనిక స్థావరాలు, ఉగ్ర బంకర్లు నాశనమయ్యాయి. -
ఆ భయంతోనే కులగణనకు మోదీ అంగీకారం
దర్భంగా/పట్నా: దేశంలో అణగారిన వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతోనే కులగణనకు ప్రధాని నరేంద్ర మోదీ అంగీకారం తెలిపారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. కులగణనకు మద్దతుగా ప్రజల తరఫున ప్రతిపక్షాలు గళం విప్పాయని అన్నారు. గురువారం బిహార్ రాష్ట్రం దర్భంగా జిల్లాలోని మిథిలా యూనివర్సిటీ అంబేడ్కర్ హాస్టల్లో ‘శిక్షా న్యాయ్ సంవాద్’లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. దళిత, వెనుకబడిన వర్గాల విద్యార్థులతో సమావేశమయ్యారు. అంతకుముందు యూనివర్సిటీకి చేరుకోకుండా అధికారులు అడ్డంకులు సృష్టించినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. యూనివర్సిటీ గేటు వద్ద తన వాహనాన్ని నిలిపివేశారని, దాంతో వాహనం దిగి మరో మార్గంలో నడుచుకుంటూ వచ్చానని రాహుల్ తెలిపారు. ప్రజలు తనకు కొండంత బలం ఇచ్చారని, అందుకే బిహార్ ప్రభుత్వం తనను అడ్డుకోలేకపోయిందని అన్నారు. ఈ ప్రజాబలం ముందు ప్రధాని మోదీ సైతం తలవంచాల్సిందేనని స్పష్టంచేశారు. భారత రాజ్యాంగాన్ని తలతో తాకాలని మోదీకి చెప్పామని, చివరకు ఆయన ఆ పని చేయక తప్పలేదని అన్నారు. దేశమంతటా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశామని, దానికి కూడా ఒప్పుకున్నారని గుర్తుచేశారు. పేదలు, అణగారిన వర్గాల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్న భయంతోనే మోదీ ఈ రెండింటికీ అంగీకరించారని రాహుల్ గాంధీ వెల్లడించారు. అంబానీ, అదానీల సేవలో మోదీ సర్కారు తరిస్తోందని మండిపడ్డారు. దేశంలో కేవలం ఐదు శాతం ఉన్న ధనవంతుల బాగు కోసమే మన వ్యవస్థలు పని చేస్తున్నాయని ఆరోపించారు. దళితులు, గిరిజనుల, ఓబీసీలను పట్టించుకొనే దిక్కే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం, కార్పొరేట్ ప్రపంచం, మీడియాలో వారికి స్థానం దక్కడం లేదన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లోనూ రిజర్వేషన్లు మూడు ప్రధాన డిమాండ్లపై యువత ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గొద్దని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించినట్లుగానే దేశవ్యాప్తంగా కులగణన పక్కాగా నిర్వహించాలని అన్నారు. ప్రైవేట్ కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని తేల్చిచెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద కేటాయించిన నిధులను ఆయా వర్గాల సంక్షేమం కోసం జాప్యం లేకుండా విడుదల చేయాలన్నారు. ఎన్డీయే పాలనలో పెద్దగా ఆశించలేమని.. కేంద్రంలో, రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక యువత సంక్షేమం, అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యాసంస్థల్లో వెనుకబడిన వర్గాల వారి పట్ల వివక్ష కొనసాగుతోందని, మీడియాలో బీసీల ప్రాతినిధ్యం లేదని, ఈ అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించాలని రాహుల్ గాంధీని ఓ విద్యార్థి కోరారు. ‘ఫూలే’ చిత్రం తిలకించిన రాహుల్ రాహుల్ గాంధీ గురువారం బిహార్ రాజధాని పాట్నాలోని సినిమా హాల్లో హిందీ చిత్రం ‘ఫూలే’ను తిలకించారు. బిహార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సైతం రాహుల్తో కలిసి ఈ సినిమా చూశారు. 19వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత సామాజిక ఉద్యమకారుడు, సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల జీవితం ఆధారంగా ఫూలే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. -
‘రైతుల ప్రాణాలంటే తెలంగాణ ప్రభుత్వానికి లెక్కలేదు’
హైదరాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతు చనిపోతే రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతుల ప్రాణాలంటే తెలంగాణ ప్రభుత్వానికి లెక్కలేదని విమర్శించారు. ఈ రోజు(గురువారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ‘40 కేజీల వరి ధాన్యం బస్తా నుంచి 4 కేజీల తరుగు తీస్తున్నారు. 13 లక్షల క్వింటాళ్ల ధాన్యం తరుగు రూపంలో పక్కదారి పడుతుంది. 6 వేల కోట్ల రూపాయల తరుగు రూపంలో రైతుల నుంచే కొట్టేస్తున్నారు. ఇది ఎవరి ఖాతాల్లో చేరుతోంది. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన రైస్ మిల్లు లు ఎన్ని ?, బ్లాక్ లిస్ట్ లో పెట్టిన రైస్ మిల్లులకు మళ్ళీ ఎందుకు ధాన్యం పంపుతున్నారు ? ,గతంలో ధాన్యం తీసుకుని సీఎంఆర్(CMR)ఇవ్వని రైస్ మిల్లులకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ?, ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం CBI తో దర్యాప్తు చేయించాలి. బీఆర్ఎస్ పాలనలో సివిల్ సప్లై శాఖలో అవినీతి జరిగిందని ఆరోపించిన రేవంత్, ఉత్తమ్... ఎందుకోసం విచారణ చేయడం లేదు ?’ అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. -
కాంగ్రెస్ ప్రభుత్వమైనా కలిసి రావాలి: బండి సంజయ్
హైదరాబాద్: రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రానికి సహకరించలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా కలిసి రావాలన్నారు.తెలంగాణ రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు అంశానికి సంబంధించి మాట్లాడిన బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుస్నాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైనిక స్కూల్ ను ఏర్పాటు చేయాలని గత నెలలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు విజ్ఞప్తి చేశాను. నా విజ్ఞప్తికి రాజ్ నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు.రాష్ట్ర ప్రభుత్వం సైనిక స్కూలు ఏర్పాటు కోసం వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో అన్ని పార్టీలు కలిసి రావాలి. ఇక్కడ రాజకీయ పార్టీల వైఖరిని పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కలిసి రావాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రానికి సహకరించలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వమైనా కలిసి రావాలని కోరుతున్నా’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. -
రాజధాని పేరుతో ఒకే ప్రాంతంలో వేల కోట్లు పెట్టుబడి పెట్టడం బాధాకరం
-
కాంగ్రెస్ సర్కార్పై వరుస పోరాటాలు
సాక్షి, హైదరాబాద్: ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంతమొందించే శక్తి బీఆర్ఎస్కు మాత్రమే ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ప్రజలను మోసం చేస్తూ ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్, వాటిని అమలు చేయకుండా తుంగలో తొక్కిందని, ఆ పార్టీ ద్రోహాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఇటీవల పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో మంగళవారం రాత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ సభతో కాంగ్రెస్ అంతానికి ఆరంభం షురూ అయిందన్నారు. ఇప్పుడైనా, ఎప్పుడైనా రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు బీఆర్ఎస్సేనని, సభ తర్వాత ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ ఓ పాజిటివ్ ఎనర్జీ వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలపై అలుపెరగని పోరాటం చేసే ఉత్సాహం ఈ సభ ద్వారా కలిగిందని కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సర కాలంలోనే ప్రజల్లో ఇంత వ్యతి రేకతను మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని తాను ఇప్పటి వరకు చూడలేదని చెప్పారు. అనుభవలేమి, మోసం, అత్యాశ, అందినకాడికి దోచుకోవడం అనే లక్షణాలు పుష్కలంగా ఉన్న రేవంత్ సర్కార్తో తెలంగాణ అభివృద్ధి రెండు దశాబ్దాలు వెనక్కి పోయిందన్నారు. ప్రజల్లో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకతకు అనుగుణంగా ఎక్కడికక్కడ పార్టీ కార్యక్రమాలను రూపొందించుకోవాలని చెప్పారు. రైతుల ఆత్మహత్యలు, వారి సమస్యల పరిష్కారంపై రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ విస్తృత పోరాటాలు చేస్తుందన్నారు. రైతు భరోసా చెల్లింపులు సక్రమంగా జరగకపోవడం, ధాన్యం కొనుగోళ్లలో చూపిస్తున్న నిర్లక్ష్యం, అకాల వర్షాల తో నష్టపోయిన రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా పార్టీ కార్యాచరణ ఉండబోతుందని తెలిపారు. ఇటీవల వెలుగుచూసిన ఉద్యోగ నియామకాల్లో అవకతవకలపై సమగ్ర వ్యూహంతో ప్రజా ఉద్యమాలను ప్రారంభిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. మోసానికి మారుపేరైన కాంగ్రెస్ నైజాన్ని ప్రజాక్షేత్రంలో ఎండ గట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద బహిరంగసభ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీసభగా ఎల్కతుర్తి రజతోత్సవ సభ నిలిచిపోతుందని కేటీఆర్ అన్నారు. ఈ విజయానికి కారణమైన ప్రతీ కార్యకర్త, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. పకడ్బందీ ప్రణాళిక, క్రమశిక్షణ, ప్రజల్లో బీఆర్ఎస్పై ఉన్న అంతులేని అభిమానానికి ఎల్కతుర్తి సభనే నిదర్శనమన్నారు. ఈ బహిరంగ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల దిశ మారిందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు మాట్లాడారు. పార్టీ 25 సంవత్సరాల సంబురాన్ని వరంగల్ గడ్డపై నిర్వహించే అవకాశం తమకు ఇచ్చినందుకు కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. అన్ని విషయాల్లో తమకు దిశానిర్దేశం చేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. సభ నిర్వహణలో భాగమైన నేతలతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. -
హరీష్ రావుకు మంత్రి ఉత్తమ్ కౌంటర్
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లను వదిలేసి అందాల పోటీల చుట్టూ తిరుగుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటరిచ్చారు. ఈ మేరకు ధాన్యం కొనుగోళ్ల లెక్కలను విడుదల చేశారు ఉత్తమ్. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. 43. 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ప్రతి విషయంలో తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హరీష్ కు ఉత్తమ్ హితవు పలికారు. ఒకసారి హరీష్ లెక్కలు చూసి మాట్లాడితే మంచిదని సూచించారు.ధాన్యం రాశులు వదిలేసి.. అందాల రాశుల చుట్టూ..సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మరోసారి మండిపడ్డారు. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు యుద్ధం చేస్తుంటే.. రేవంత్ మాత్రం అందాల పోటీల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ అందాల పోటీల్లో బిజీగా ఉన్నారంటూ సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ ధాన్యం రాశులు వదిలేసి అందాల రాశుల చుట్లూ తిరుగుతున్నారని చమత్కరించారు. రైతు సమస్యలపై సమీక్ష చేయడానికి సీఎం రేవంత్కు టైమ్ లేదని, రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని హరీష్ రావు వ్యాఖ్యానించారు.ఇందిరమ్మ ఇళ్లపై బీఆర్ఎస్ వ్యాఖ్యలకు కౌంటర్ఇందిరమ్మ ఇళ్లపై బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటరిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ లాగ కాదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇందిరమ్మ ఇండ్ల కోటా ఇస్తామన్నారు పొంగులేటి. ఇక ఏపీలో కలిసిన ప్రజల స్థానికతపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. -
హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్
కర్నూలు జిల్లా: కాంగ్రెస్ నేత లక్ష్మీ నారాయణ హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత లక్ష్మీ నారాయణ హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. గుమ్మనూరు నారాయణను ఆలూరు పీఎస్కు తరలించారు. ఈరోజు గుమ్మనూరు నారాయణను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేత లక్ష్మీ నారాయణ హత్య కేసులో గుమ్మనూరు నారాయణ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే గుమ్మనూరు నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా, గత నెలలో గుంతకల్లులో కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ దారుణహత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న లక్ష్మీ నారాయణను కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు. కాంగ్రెస్ లక్ష్మీనారాయణ కారును టిప్పర్ తో ఢీకొట్టారు దుండగులు. ఆపై లక్ష్మీ నారాయణపై వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో లక్ష్మీ నారాయణ కుమారుడు వినోద్కు సైతం గాయాలయ్యాయి. -
తెలంగాణలో టెన్షన్.. బీజేపీ ఎంపీ ఈటల ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, మేడ్చల్: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మేడ్చల్లోని ఈటల ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీంతో, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈటల ఇంటి వద్ద పోలీసులు మోహరించి.. భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.వివరాల ప్రకారం.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ను శాడిస్ట్ అంటూ ఈటల వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈటల వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నేతలు ఈరోజు.. ఈటల ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. భారీగా సంఖ్యలో ఈటల ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే భారీ సంఖ్యలో బీజేపీ, బీజేవైఎం శ్రేణులు ఈటల ఇంటికి చేరుకున్నాయి.అనంతరం, బీజేపీ ఎంపీ ఈటల మాట్లాడుతూ..‘కలెక్టరేట్ల ముట్టడి, కార్యాలయాల ముట్టడి చూశాం.. ఇళ్లను ముట్టడిస్తారా?. కుటుంబాలు ఉంటాయి.. ఇళ్లను ముట్టడించడం పద్ధతి కాదు. అనుభవం ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలకు సోయి ఉంటే హైదరాబాద్లో ఎందుకు రియల్ ఎస్టేట్ పడిపోయిందో చూడాలి. పాలకుడు అనే వాడు ఏదైనా నిర్మించే ప్రయత్నం చేస్తారు.. డిస్స్ట్రక్షన్ చేస్తారా?. 50 ఏళ్లుగా మొదటిసారి చూస్తున్నాను. డిస్స్ట్రక్షన్ చేస్తున్న మొట్టమొదటి దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసులకు భయపడేది లేదు.. అధికారం లేనినాడే కొట్లాడిన పార్టీ బీజేపీ. ఎవరు మోసం చేసే వాళ్లు, ఎవరు సంస్కార హీనులో ప్రజలే చెబుతారు. కుక్కలా అరిస్తే ఏం వస్తుంది?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
మోదీ జీ.. ఇలా చేస్తే మంచిది: రాహుల్ గాంధీ లేఖ
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు. ఆపై చోటు చేసుకున్న కాల్పుల విరమణ అంగీకారంతో పరిస్థితులు సద్దుమణిగాయి.పాకిస్తాన్ కాళ్ల బేరానికి డైరెక్ట్గా భారత్ను ఆశ్రయించకపోయినా అమెరికా అడ్డం పెట్టుకుని కాల్పుల విరమణకు వచ్చారన్నది జగమెరిగిన సత్యం. భారత్, పాక్లు కాల్పుల విరమణకు అంగీకారం అంటూ ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడమే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ యుద్ధానికి కాలుదువ్వింది పాకిస్తాన్.. అసలు కాల్పులకు పాల్పడుతోంది ఎవరు?. అది పాకిస్తాన్ కాదా?. అందుకు పహల్గామ్ ఘటన సాక్ష్యం కాదా?. మరి కాల్పుల విరమణ అనేది ఇక్కడ కేవలం పాకిస్థాన్ కే వర్తిస్తుందనేది ప్రపంచానికి అంతటికీ అర్థమైంది.అయితే కాల్పులు విరమణ అంగీకారం అన్న మూడు గంటల వ్యవధిలోనే పాక్ మళ్లీ దానిని ఉల్లంఘించి భారత్ పై కాల్పులకు దిగింది. దీన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టిన భారత్.. పాకిస్తాన్ దుస్సాహసాన్ని మళ్లీ ప్రపంచం ముందు ఉంచకల్గింది. ఈ పరిస్థితుల నడుమ దాయాది పాకిస్తాన్ను అంత త్వరగా నమ్మలేమన్నది కూడా తేలిపోయింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ను భారత్ కొనసాగించనుంది. ఈ విషయాన్ని భారత ఆర్మీ స్పష్టం చేసింది కూడా. పాక్ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే ఆపరేషన్ సిందూర్ సిద్ధంగానే ఉందనే సంకేతాలిచ్చింది భారత్.ఇదంతా ఒకటైతే, అసలు ఆపరేషన్ సిందూర్తో పాటు పలు అంశాల్ని పార్లమెంట్ లో చర్చించాల్సిన అవసరం ఉందని అంటున్నారు ఏఐసీసీ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఈ విన్నపాన్ని మోదీ జీ త్వరగా పరిశీలిస్తారని అనుకుంటున్నానని, ఇలా చేయడం మంచిదని రాహుల్ గాంధీ లేఖ ద్వారా తెలిపారు.ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేయండిపాకిస్తాన్ తో యుద్ధంలో భాగంగా ఆపరేషన్ సిందూర్ తదితర అంశాలను పార్లమెంట్ వేదికగా చర్చించాలని కోరుతున్నారు రాహుల్ గాంధీ. ఈ మేరకు ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు.‘ మోదీ జీ.. మీరు ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ను నిర్వహించండి. ఈ ప్రత్యేక పార్లమెంట్ సెషన్ లో ఆపరేషన్ సిందూర్ అంశంతో పాటు కాల్పుల విరమణ అంశాన్ని కూడా చర్చిద్దాం. ఈ విషయాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఆ విషయాల గురించి చెప్పడం అత్యంత కీలకంగా భావిస్తున్నాను. కాల్పుల విరణమ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడాన్ని కూడా ప్రజల ముందు ఉంచాలి. ఈ విషయాలను చర్చించడానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించండి. మన ముందున్న సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవడానికి ఇదొక సువర్ణావకాశం అవుతుంది. ఈ మా డిమాండ్ ను త్వరగా పరిశీలిస్తారని విశ్వసిస్తున్నాను’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.రాజ్యసభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే కూడా ఇదే విషయాన్ని మోదీకి లేఖ ద్వారా తెలిపినట్లు మరొక కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు.LoP Lok Sabha and LoP Rajya Sabha have just written to the PM requesting for a special session of Parliament to be convened immediately. Here are the letters pic.twitter.com/exL6H5aAQy— Jairam Ramesh (@Jairam_Ramesh) May 11, 2025 -
అన్నీ ఒకేసారి!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పదవుల జాబితాలన్నీ ఒకేసారి విడుదల అవుతాయని తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర పార్టీ పెద్దల కసరత్తు పూర్తయిందని, వివిధ కమిటీలకు సంబంధించిన ప్రతిపాదనలు ఢిల్లీ చేరాయని గాందీభవన్ వర్గాలు అంటున్నాయి. గత గురువారం ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ ఈ కమిటీలకు సంబంధించిన ప్రతిపాదనలన్నింటినీ అధిష్టానం పెద్దలకు ఇచ్చి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇక కమిటీల బంతి అధిష్టానం కోర్టుకు చేరిందని, త్వరలోనే అధిష్టానం ఈ కమిటీలకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని తెలుస్తోంది. రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ప్రభుత్వం ఏర్పాటయినప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి స్థానంలో బి.మహేశ్కుమార్గౌడ్ బాధ్యతలు చేపట్టి కూడా సంవత్సరం దాటిపోయింది. కానీ, ఇంతవరకు అటు టీపీసీసీ కమిటీలను కానీ, ఇటు క్షేత్రస్థాయి పదవులను కానీ భర్తీ చేయలేదు. టీపీసీసీ కార్యవర్గంలో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులతో పాటు కార్యవర్గ సభ్యుల నియామకం చేపట్టలేదు. ఎన్నికల సమయంలోనే నియమించిన ప్రచార కమిటీ కొనసాగుతోంది. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ పోస్టు ఖాళీ అయి దాదాపు మూడేళ్లు కావస్తోంది. జిల్లా పార్టీ అధ్యక్షులుగా గతంలో ఎప్పుడో నియమించిన వారే కొనసాగుతున్నారు. బ్లాక్, మండల, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలు కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కమిటీలన్నింటినీ నియమించేందుకు పలు దఫాలుగా ఇటు హైదరాబాద్లో, అటు ఢిల్లీ పెద్దల సమక్షంలో అనేక సార్లు చర్చలు జరిగాయి. కానీ, కమిటీల ప్రకటన వెలువడలేదు. కమిటీల కసరత్తు పూర్తయిందని, నేడో రేపో ప్రకటిస్తారని అనుకుంటున్న సమయంలోనే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మారారు. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ రావడంతో కథ మళ్లీ మొదటికొచి్చంది. ఆమె ప్రాతిపదికలు మారిపోవడంతో పార్టీ కమిటీల నియామకానికి మళ్లీ కసరత్తు జరిగింది. ఈ కసరత్తు పూర్తి కావడంతో మూడు రోజుల క్రితమే ప్రతిపాదనలు ఢిల్లీకి చేరాయని సమాచారం. గాందీభవన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈసారి పార్టీ సంస్థాగత కమిటీలతో పాటు రాష్ట్ర పారీ్టలో కీలకమైన రాజకీయ వ్యవహారాల సలహా (పీఏసీ) కమిటీని కూడా పునరి్నయమించనున్నారు. జై బాపూ–జై సంవిధాన్ కమిటీ (ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ)ని కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు మీడియా సమన్వయం కోసం డెడికేటెడ్ కమిటీని ఏర్పాటు చేస్తారని, ఈ కమిటీకి ఎంపీని ఇన్చార్జిగా నియమిస్తారని తెలుస్తోంది. విష్ణునాథ్ స్థానంలో మరొకరు! మరో పక్క ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శిగా రాష్ట్రానికి కొత్త నేత రానున్నారు. ఇద్దరు కార్యదర్శుల్లో ఒకరైన విష్ణునాథ్ ఇటీవలే కేరళ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. దీంతో ఆయన స్థానంలో మరొక నేతను టీపీసీసీ కమిటీలతో పాటే నియమిస్తారని తెలుస్తోంది. -
‘కగార్’పై జనాంతిక ఆలోచనలు
కొన్ని విషయాలు సున్నితంగా ఉంటాయి. విషయాలు పూర్తి బహిరంగమైనవే. అందు గురించిన చర్చలు హోరాహోరీగా సాగినవే. కానీ పరిస్థితులు ఒక దశ నుంచి ఒకానొక దశకు మారినపుడు అంతా సున్నితం అవు తుంది. ‘ఆపరేషన్ కగార్’ సందర్భంగా ఆపరేషన్ విషయాలు కాదుగానీ నక్సలైట్ల గురించి, నక్సలిజం గురించిన చర్చ సున్నితంగా మారింది. పక్షం రోజులకు పైగా సాగుతున్న కర్రె గుట్టల ఉదంతం, ఎప్పటినుంచో జరుగుతున్న ఆ చర్చకు ఒక తక్షణ లక్షణాన్ని తీసుకు వచ్చింది. ఇది సున్నితం కావటానికి కారణం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తన ‘ఆపరేషన్’ను ఒక భీషణ సమరంగా మార్చటం కాదు. అందుకు నేపథ్య పరిస్థితులు ఇదమిత్థంగా ఫలానా అప్పటి నుంచి మొదలయ్యాయని చెప్పలేముగానీ, సుమారు మూడు దశాబ్దాలుగా కావచ్చు. అవి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినాక మాత్రం తీవ్రం కావటం మొదలైంది.ప్రస్తుత ప్రభుత్వం తన నక్సలైట్ వ్యతిరేక చర్యలకు ‘ఆపరేషన్ కగార్’ అనే పేరు పెట్టింది. ‘కగార్’ అనే హిందీ మాటకు నిఘంటు అర్థం ‘అంచు’ లేదా ‘చివరి స్థితి’, ‘చివరి దశ’ అని. రాజకీయ అర్థం ‘అంతిమ దాడి’ అని! ఇది ఇతరుల నిర్వచనం కాదు. నక్సలైట్లను, నక్సలిజాన్ని 2026 మార్చ్ చివరి నాటికి అంతం చేసి తీరగలమని హోంమంత్రి అమిత్ షా పదేపదే ప్రకటిస్తున్నారు. అది సాధ్యమా కాదా అన్నది కాదు ఇక్కడ చేస్తున్న ఆలోచన. ఈ సందర్భాన్ని పురస్క రించుకుని, సుమారు 57 సంవత్సరాలుగా సాగుతున్న నక్సలైట్ ఉద్యమాన్ని పలువురు సమీక్షిస్తుండవచ్చు. అందులో భాగంగా, పైన ప్రస్తావించిన ఇటీవలి మూడు దశాబ్దాల కాలాన్ని కూడా. అంటే నక్సలిజం బలహీనపడుతూ వస్తున్న మూడు దశాబ్దాలను!ఎముకలు మెడలో వేసుకోని కాంగ్రెస్సూటిగా చెప్పుకోవాలంటే, మొదటి సగకాలం బలంగా సాగిన ఉద్యమం, తర్వాత సగకాలం నుంచి బలహీనపడుతూ వస్తున్నది. ఆ బలహీనతలు నాలుగు విధాలు. ఒకటి – సైద్ధాంతికంగా. రెండు – నాయకత్వ పరంగా. మూడు – ఉద్యమ నిర్వహణలో. నాలుగు – జనాదరణ విషయమై! ప్రభుత్వ అణచివేతలు ఎప్పుడూ ఉన్నవే. అణచివేతకు ఆరంభం తెలంగాణ రైతాంగ పోరాట కాలంలోనే జరిగినపుడు నక్స లిజం తర్వాతి కాలంలో అంతకు భిన్నంగా ఉండగల ఆస్కారమే లేదు. పైగా 1948కి 1968కి మధ్యకాలం 20 సంవత్సరాలు మాత్రమే. అప్పటినుంచి మరో 20 ఏండ్లు గడిచేసరికి నక్సలైట్ ఉద్యమ క్షీణతకు అంకురార్పణ జరిగింది. గమనించదగినదేమంటే, ఆ కాలమంతా పాలించింది బీజేపీ కాదు... కాంగ్రెస్. కొన్ని రాష్ట్రాలలో ఇతర పార్టీలు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి, రాజ్యాంగం రాసుకుని, చట్టాలు చేసుకుని, ప్రణాళికలు రూపొందించుకుని, ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించుకున్నప్పటి నుంచి అన్నీ కపటమైన రీతిలో అరకొరగానే అమలయ్యాయి. అందుకే 1947 నుంచి 20 ఏండ్లయే సరికి నక్సలైట్లు అవతారమెత్తారు. అన్ని మలుపులూ 20–20–20 గానే కనిపిస్తు న్నాయి. అదొక విచిత్రం. ‘ఆపరేషన్ కగార్’ తరహా మాటలను కాంగ్రెస్ ఉపయోగించ లేదు, బీజేపీ ఉపయోగిస్తున్నది. చేతలు అవే, మాటలు వేరు. మాటలు వేరవటానికి మంచి కారణాలే ఉన్నాయి. కాంగ్రెస్కు 1885 నుంచి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అందులో సామాజిక సమ్మిళితత్వం, ఉదారవాద మధ్యే మార్గం, కొంత అభ్యుదయ ధోరణి, దేశ వ్యాప్తమైన జాతీయత వంటివి ఉన్నాయి. అవి కాలం గడిచినకొద్దీ బలహీనపడుతూ అనేక అవలక్షణాలు ప్రవేశించినా, కనీసం ఎము కలను మెడలో వేసుకునే ధోరణి ఇంకా రాలేదు. ఆ కారణంగా, నక్సలిజం వెనుక పేదరికం ఉన్నమాట నిజమనీ, అది కేవలం శాంతి భద్రతల సమస్య కాదనీ, పేదల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేయ గలమనీ మాటలు, ప్రకటనల రూపంలో చెప్పటం ఎన్నడూ మాన లేదు. అణచివేతలకు సాయుధబలాల ఉపయోగమైతే యథావిధిగా సాగించారు గాని, ‘కగార్’ తరహా ‘అంతిమ దాడి’ అనకుండా జాగ్రత్తపడ్డారు. పౌరహక్కుల సంస్థలను అనేక ఇబ్బందులకు గురిచేసినా, వారికి ‘అర్బన్ నక్సల్స్’ అనే ముద్ర వేయలేదు.నాగరిక, ప్రజాస్వామిక, ఆధునిక సమాజాలలో ఉదారవాద, ప్రగతిశీల భావనల సంప్రదాయం గురించి తెలిసిందే. ముఖ్యంగా రినైజాన్స్, ఫ్రెంచ్ విప్లవం, పారిశ్రామిక విప్లవం, బ్రిటన్లో రాజ్యాంగ ఆవిర్భావ కాలాల నుంచి ఉన్నత తరగతులపై, మధ్యతరగతిపై ఈ ప్రభావాలు మొదలయ్యాయి. ఈ వర్గాలు ప్రగతిశీలమైనవేగానీ, వ్యవస్థలో సంస్కరణలను కోరటం మినహా వ్యవస్థలను కూలదోయా లనేవి కావు. ఆ పరిమితులను తెలిసినందువల్లనే ఇక్కడ పౌర హక్కుల సంస్థల పాత్రను కాంగ్రెస్ ప్రభుత్వాలు కనీసం ఒక మేర గౌరవించటం, ఒకోసారి వారిని సంప్రదించటం చేస్తుండేవి. ఆ ధోరణి గత పదేళ్లుగా ఎట్లా మారిందో కనిపిస్తున్నదే. ఇది అంతి మంగా వ్యవస్థకు మేలు చేసేది కాదని ప్రభుత్వం గ్రహించవలసిందే తప్ప ఎవరూ చెప్పగల స్థితి కనిపించటం లేదు.మారిన సమాజ ధోరణులుఉద్యమాలకు ఎగుడు దిగుడులు సహజమేగానీ, నక్సలైట్ ఉద్యమం పైన చెప్పిన నాలుగు బలహీనతలలో దేని నుంచి కూడా నిజమైన అర్థంలో బయటకు రాలేక పోయింది. లేనట్లయితే, వారు కర్రె గుట్టల సందర్భంలో ఈ విధంగా చిక్కుకు పోవటం, చర్చల కోసం పది రోజుల్లో నాలుగుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేయటం, తెలంగాణ ప్రభుత్వాన్ని కోరటం, పౌర హక్కుల సంస్థలను కదలించేందుకు ఇంతగా ప్రయత్నించటం వంటి పరిస్థితులు ఏర్పడేవి కావు. ఇంత జరుగుతున్నా సమాజం నుంచి ఒకప్పటివలె స్పందనలు లేవు. ప్రస్తుత తరాలు వివిధ కారణాల వల్ల మారిపోయాయి. వారి దృష్టి ఇప్పుడు తమ కెరీర్పై, ఇతర అంశాలపై ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఒకప్పుడు ఉద్యమానికి పెద్ద బలం. ఇపుడు కొద్ది ప్రాంతాలలోని కొంతమంది ఆదివాసీలు మాత్రం స్థానిక పరి స్థితులనుబట్టి నక్సలైట్లతో కదులుతున్నారు. స్వయంగా ఆదివాసీలైన ప్రజాప్రతినిధులు గతంలో కన్నా ఎక్కువగా స్వప్రయోజనాల కోసం రాజకీయ పార్టీల వెంట ఉంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, వెనుకటి తరాలకు ఉద్యమం పట్ల గురి తప్పి నిరాశ ఏర్పడగా, కొత్త తరాలకు ఒక అగాథం వచ్చి కొత్త ప్రపంచంలో తమ జీవితాలను వెతుక్కుంటున్నారు. ఒకపుడు మధ్యతరగతిలో గణనీయమైన భాగానికి ఆదర్శవాదాలు ఉండేవి. అది సోవియెట్ యూనియన్కు, ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలకు, విప్లవకారులకు, సాహిత్య–కళాకార్యకలాపా లకు పచ్చని కాలం. ఆ తరహా మధ్యతరగతి ఇపుడు పిడికెడుగా మిగిలింది. వామ పక్షాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.నక్సలైట్లకు కొత్త రిక్రూట్మెంట్లు తగ్గటం ఎప్పటినుంచో ఉన్నది. ఎన్కౌంటర్లలో ఒకపుడు ఒకరు చనిపోయినా వార్తలు, ప్రజలలో చర్చలు ఉండేవి. ఇపుడు చాలామంది చనిపోవటం వరుసగా జరిగితే తప్ప వార్తలు, చర్చలు కనిపించటం లేదు. మరొకవైపు సిద్ధాంతాలు, పోరాట పద్ధతులు, సంస్థ నిర్మాణాలు, నాయకత్వాలు ప్రస్తుత ఆధునికమైన, బలమైన ప్రభుత్వ వ్యవస్థలను ఎదుర్కొనగల విధంగా ఉన్నాయనే అభిప్రాయం వారి సానుభూతిపరులలోనైనా ఉందా అన్నది అనుమానమే. పౌరహక్కుల సంఘాల స్పందనలు సైతం స్వీయ సంశయాల మధ్య మందకొడిగానే కనిపిస్తున్నాయి. నక్సలైట్లు, నక్స లిజం భవిష్యత్తు అగమ్యగోచరం కావటానికి వెనుక ఈ పరిస్థితులు, దీర్ఘకాలిక పరిణామాలు అన్నీ ఉన్నాయి.విషయాన్ని జనాంతికంగా చర్చించుకోవటం ఎందుకంటే, ఒక వైపు పేదరికం, పీడన కొనసాగుదల, ధనిక–పేద తారతమ్యాల పెరుగుదల అనే వాస్తవ స్థితి ఎంత కనిపిస్తున్నదో, ఆ పరిస్థితులను మార్చే సంస్కరణల కోసం లేదా కొత్త వ్యవస్థ ఆవిష్కరణ కోసమని చెప్పేవారు విఫలం కావటం కూడా అంత కనిపిస్తున్నది. ఈ విష యాలు ముఖ్యంగా ‘కగార్’ వంటి సందర్భంలో దాపరికం లేకుండా మాట్లాడటం సున్నితమైనదే!టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఇది ప్రజల ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దొరలు, నాయకుల కోసం కాకుండా ప్రజల అవసరాలను తీర్చేలా పనిచేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నూతన భవనాల నిర్మాణానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆపై కలెక్టరేట్లో వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్షించారు. ఏడాదిలోనే రూ.11,482 కోట్లు బీఆర్ఎస్ పాలనలో వైద్య రంగానికి ఏటా సగటున రూ.5,950 కోట్లు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.11,482 కోట్లు వెచ్చించిందని భట్టి వెల్లడించారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ బిల్లులు సైతం తాము చెల్లిస్తూ, పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో ఇప్పటివరకు 90 లక్షల కుటుంబాలకు లబ్ధి జరిగిందన్నారు. సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్, బీజేపీ నేతలు చిలువలు పలువలుగా ప్రచారం చేస్తున్నారని, గత పాలకులు రూ.ఏడు లక్షల కోట్ల అప్పు చేసినా ఏనాడూ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేదని భట్టి ఎద్దేవా చేశారు.ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం: మంత్రి దామోదరరాష్ట్రంలో ప్రతీ 35 కి.మీ.కు ఒకటి చొప్పున మొత్తం 84 ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయనున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు.ప్రపంచ బ్యాంక్ మంజూరు చేసిన రూ.4,100 కోట్ల నిధులలో రూ.37 కోట్లతో వరంగల్లో రీజినల్ కేన్సర్ సెంటర్, ఖమ్మంలో ఆర్గాన్ రిట్రీవల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల ప్రజలు హైదరాబాద్ వెళ్లే పని లేకుండా స్థానికంగానే సూపర్స్పెషాలిటీ వైద్య సేవలు బలోపేతం చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్య, వైద్యానికి సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మెడికల్ కళాశాలలు, అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు అవుతున్నాయన్నారు. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా స్థల సేకరణ చేసి ఖమ్మంలో వైద్య కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. గత ప్రభుత్వం మెడికల్ కళాశాలలను మధ్యలో వదిలేస్తే వాటిని పునఃప్రారంభించే దిశగా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, సీపీ సునీల్దత్, రాయల నాగేశ్వరరావు, డాక్టర్ నరేంద్రకుమార్, ఫణీందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఉగ్రవాద శిబిరాలపై దాడులు సరైనవే: ఖర్గే
ఢిల్లీ: సైనికులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. భారత్ చేపట్టిన దాడుల నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ కమిటీ బుధవారం అత్యవసరంగా సమావేశం నిర్వహించింది.‘‘పీవోకే నుంచి ఉగ్రవాదులు పనిచేస్తున్నారనేది స్పష్టమైంది. ఉగ్రవాద శిబిరాలపై దాడులు సరైనవే. దేశ రక్షణ విషయంలో మనమంతా కలిసి ఉండాలి. సైనికులు తీసుకునే ప్రతి నిర్ణయానికీ మద్దతిస్తాం’’ అని ఖర్గే పేర్కొన్నారు.పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్' పేరుతో సాహసోపేత నిర్ణయం తీసుకున్న భారత సైనిక దళాలను చూసి తాము గర్విస్తున్నామని ఖర్గే అన్నారు.కాగా, జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మూడు రోజుల ముందే తెలుసునంటూ నిన్న(మంగళవారం) మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పర్యాటకులపై దాడి జరగబోతున్నట్లు మోదీకి ఇంటెలిజెన్స్ రిపోర్టు అందిందని.. అందుకే ఆయన జమ్మూకశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారన్నారు. నిఘా వైఫల్యం వల్లే పహల్గాంలో ఉగ్రదాడి జరిగినట్లు అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, మోదీ సైతం స్వయంగా ఒప్పుకున్నారంటూ ఖర్గే వ్యాఖ్యానించారు. -
పహల్గామ్ ఘటన: ‘మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తుందా?’
రాంచీ: పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందిందని, . నిఘా వర్గాల సమాచారంతో ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇది భద్రతా దళాల నైతిక సామర్థ్యాన్ని తగ్గించే ప్రయత్నమంటూ జార్ఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి తుహిన్ సిన్హా మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన ఆ వాదనకు ఎటువంటి ఆధారం లేదని ఆయన ధ్వజమెత్తారు. దీనిపై బీజేపీ జార్ఖండ్ చీఫ్ బాబులాల్ మరాండ్ సైతం స్పందించారు. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితిలు చోటు చేసుకున్న తరుణంలో ఈ తరహా వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. అసలు కాంగ్రెస్ పెద్దలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అంటూ నిలదీశారు. ఉగ్రవాదం, పాకిస్తాన్పై పోరాటం కీలక దశలో ఉన్నప్పుడు ఖర్గే ఈ వ్యాఖ్యలు చేయడం కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న దాడిగా ఆయన పేర్కొన్నారు.ఉగ్రవాదంపై, పాకిస్తాన్ పై పోరులో దేశం మొత్తం కలిసే ఉందని ఒకవైపు చెబుతూనే, మరొకవైపు ఈ వ్యాఖ్యలు ఏమిటంటూ మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న ఖర్గే ఇలా వ్యాఖ్యానించడం నిజంగా సిగ్గుచేటన్నారు.కాగా, జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ బచావో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందింది. నిఘూవర్గాల హెచ్చరికలతో ప్రధాని మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారు. పర్యాటకులకు మాత్రం భద్రత కల్పించలేకపోయారు’అని ఆరోపించారు. -
‘పహల్గాం ఉగ్రదాడి గురించి కేంద్రానికి ముందే తెలుసు’.. ఖర్గే సంచలన ఆరోపణలు
రాంచీ: పహల్గాం ఉగ్రదాడిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖర్జున్ ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు.జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ బచావో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు.పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందింది. నిఘూవర్గాల హెచ్చరికలతో ప్రధాని మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారు. పర్యాటకులకు మాత్రం భద్రత కల్పించలేకపోయారు’అని ఆరోపించారు. Watch: Congress President Shri @kharge addresses the Samvidhan Bachao Rally in Ranchi, Jharkhand. https://t.co/wRfrg2XD99— Congress (@INCIndia) May 6, 2025 -
సీఎం రేవంత్ చేతులెత్తేశారా?.. బండి సంజయ్ కౌంటర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: కుటుంబ పెద్ద చేతులెత్తేస్తే కుటుంబం పరిస్థితేంటి? అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజలకు ధైర్యం చెప్పాల్సిందిపోయి అధైర్యం నింపుతారా? అంటూ నిలదీశారు. రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందని ఎన్నికలకు ముందే తెలుసా కదా?. అప్పుల గురించి తెలిసే హామీలిచ్చి ప్రజలను మోసం చేశారు.ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ రాసిచ్చారు. రేవంత్ వ్యాఖ్యలతో రాష్ట్రం పరువు పోయింది’’ అని బండి సంజయ్ మండిపడ్డారు.మంగళవారం.. ఎల్లారెడ్డిపేటలో పర్యటించిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఉద్యోగస్థులు, ఉపాధ్యాయుల పీఆర్సీ, డీఏలకు డబ్బుల్లేవంటున్నాడు సీఎం. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అన్నీ హుళక్కే ఇక. ఓట్లు వేసి గెలిపించారు ఇక మీ కర్మ. మేమైతే ఏం చేయలేమని ముఖ్యమంత్రి క్లియర్ గా చెప్పిండు...కేసీఆర్ అప్పులు చేశాడని చెప్పిన మీరు... తాము వస్తే అంతా బాగుంటుందని మాయమాటలు చెప్పి అధికారంలోకొచ్చారు. రేపట్నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం. కేంద్ర మంత్రులు, ప్రధాని వచ్చినప్పుడు సాయం చేస్తున్నారని మాట్లాడే కాంగ్రెస్ నాయకులే.. మళ్లీ ఆ తర్వాత కేంద్రం ఏం చేయడం లేదని రాజకీయాలు చేస్తారు’’ అంటూ బండి సంజయ్ దుయ్యబట్టారు. -
తెలంగాణ సర్కార్ తో సమరానికి సై అంటున్న ఉద్యోగ, కార్మిక సంఘాలు
-
కులగణన వద్దు? బీజేపీ యూ టర్న్ పై కాంగ్రెస్ రియాక్షన్..
-
జైరాం రమేష్ (కాంగ్రెస్) రాయని డైరీ
అక్బర్ రోడ్డులోని పార్టీ ఆఫీసులో ఖర్గేజీ, నేను, ‘ఇంకా కొందరం’ సమావేశమై ఉన్నాం. నిజానికి, ఆ ‘ఇంకా కొందరం’ అనేవాళ్లలో కొందరింకా రానే లేదు. ఆ రానివాళ్ల కోసం చూడటం మానేసి, ఖర్గేజీ మాట్లాడటం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను నేను. ఖర్గేజీ ఎంతకూ మాట్లాడటం లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు కాకముందు ఆయన ఎలాగైతే ఉన్నారో, కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. ఖర్గేజీ వింతగా మెరిసే వజ్రంలా అనిపిస్తారు నాకెందుకో! బహుశా మా ఇద్దరిదీ ఒకే రాష్ట్రం కావటం వల్లనేమో!వజ్రం మాట్లాడదు. ఊరికే మెరుస్తూ ఉంటుంది. మాట్లాడని ‘ఖర్గే’ అనే ఈ కాంగ్రెస్ వజ్రాన్ని చూసి ఏ పార్టీ వాళ్లయినా ఎంతో కొంత నేర్చుకోవలసింది తప్పక ఉంటుందని నాకొక నమ్మకం. ముఖ్యంగా మోదీ... ఖర్గేజీని చూసి మౌనంగా ఎలా ఉండాలో, లేదంటే మితంగా ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి.ప్రధాని ఎంత మితంగా మాట్లాడితే దేశం అంత ప్రశాంతంగా ఉంటుంది. పెద్దాయన చూసుకుంటాడులే అని ప్రజలు ధీమాగా ఉంటారు. పెద్దాయన కూడా మన పొరుగింటి ఆయనలా మాట్లాడేస్తుంటే పాకిస్తాన్కు ఏం భయం ఉంటుంది? పాకిస్తాన్కు చైనా ఎందుకు సపోర్ట్ చేయకుండా ఉంటుంది?దేశానికి మోదీజీ పెద్దాయన అయితే,కాంగ్రెస్కు ఖర్గేజీ పెద్దాయన. రాహుల్ బాబు, ఆయన బావగారు రాబర్ట్ వాద్రా ఎప్పుడైనా మితం తప్పి మాట్లాడినా, ఖర్గేజీ తన మౌనంతో బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. మౌనంతో ఏదైనా బ్యాలెన్స్ అవుతుంది. అతీ బ్యాలెన్స్ అవుతుంది, మితమూ బ్యాలెన్స్ అవుతుంది.‘‘విన్నారా ఖర్గేజీ?’’ అన్నాను, ఆయన్ని నా వైపు తిప్పుకునే ప్రయత్నంగా. ‘‘ఏమిటి వినటం?’’ అన్నట్లు చూశారు. ‘‘డెడ్ లైన్ లు చెప్పకుండా మోదీజీ హెడ్ లైన్లు చెప్పేస్తున్నారు! దెబ్బకు దెబ్బ అంటున్నారు. ఆ దెబ్బ ఎప్పుడో చెప్పటం లేదు. జనాభా లెక్కలతో పాటే కులాల లెక్కలు అంటున్నారు. ఆ జనాభా లెక్కలు ఎప్పుడో చెప్పటం లేదు’’ అన్నాను.‘‘చెప్పవలసినవి ఇంకా చాలా లెక్కలు ఉన్నాయి’’ అన్నారు రాహుల్ బాబు లోనికి ప్రవేశిస్తూ. ఆ వెనుకే ప్రియాంక. ఖర్గేజీ వారిద్దరి వైపూ చూశారు కానీ మాటలతో ఏమీ స్పందించలేదు. అలాగని మౌనంతోనూ స్పందించలేదు. ప్రియాంక పార్టీ జనరల్ సెక్రెటరీగా ఉండి, మీటింగ్కి లేట్గా రావటం ఆయనకు నచ్చినట్లు లేదు. ‘‘సారీ ఖర్గేజీ... రేఖాగుప్తా సీఎం అయ్యాక ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ ఎక్కువైంది. అక్బర్ రోడ్డులో అయితే మరీ ఘోరం. అందుకే మీటింగ్కి లేటైంది’’ అన్నారు ప్రియాంక. రాహుల్ సెల్ ఫోన్ చూసుకుంటూ వచ్చి, దొరికిన కుర్చీలో కూర్చొని, ‘‘చెప్పవలసినవి ఇంకా చాలా లెక్కలు ఉన్నాయి’’ అని మళ్లీ అన్నారు మోదీ గురించి. ‘‘అవును రాహుల్జీ, దేశంలో కులగణన చేయించాలని మనం డిమాండ్ చేస్తున్నందుకు మోదీ మనల్ని అర్బన్ నక్సలైట్లు అన్నారు. ఇన్నాళ్లకు వాళ్లూ మన దారిలోకి వచ్చి కులగణన అంటున్నారు. మరి వాళ్లెప్పటి నుండి అర్బన్ నక్సలైట్ అయ్యారో’’ అన్నాను. అంతా నవ్వారు. ఖర్గేజీ నవ్వలేదు!‘‘ఇప్పుడైనా... అదే పనిగా కాకుండా, పనిలో పనిగా మాత్రమే కులగణనను చేయిస్తామంటున్నారు’’ అన్నారు రాహుల్. ‘‘అది నిజమే కానీ...’’ అని ఆగారు... ఖర్గేజీ హఠాత్తుగా మౌనం వీడి! అందరం ఖర్గేజీ వైపు చూశాం.‘‘... వాళ్లు చేయాలనుకుంటున్నది జనగణనలో భాగంగా కులగణన కాదు. కులగణనలో భాగంగా జనగణన. నేరుగా కులగణన అంటే రాహుల్కి క్రెడిట్దక్కుతుందని జనగణనలో భాగంగా కులగణన అంటున్నారంతే’’ అన్నారు ఖర్గేజీ!!వజ్రం లాంటి మాట!ఆ మాటతో మా మీటింగ్ మొదలైంది. -
కాంగ్రెస్ కుల సర్వేతో బీసీలకు అన్యాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేయలేదని, కులాల సర్వే మాత్రమే చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి విమర్శించారు. ఈ కులాల సర్వేతో ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి.. బీసీలకు రేవంత్రెడ్డి ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. శనివారం కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కులగణన చట్టం ఆధారంగా జనాభా లెక్కలతోపాటు పక్కాగా కులగణనను చేపట్టనుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ‘బీఆర్ఎస్ నేతల్లో ఒకరు రిటైర్మెంట్లో ఉన్నారు. ఒకరు లీవ్లో ఉన్నారు. ఒకరు నడుము విరగ్గొట్టుకొని రెస్ట్లో ఉన్నారు (కేసీఆర్, హరీశ్రావు, కేటీఆర్లను ఉద్దేశించి)’అని ఎద్దేవా చేశారు. 5న రూ.5 వేల కోట్ల పనులకు ప్రారంబోత్సవాలు ఈ నెల 5న ఆదిలాబాద్, హైదరాబాద్లో రూ.5,416 కోట్లతో చేపట్టిన 26 ప్రాజెక్టుల పనులకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారం¿ోత్సవాలు, శంఖుస్థాపనలు చేస్తారని కిషన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని అంబర్పేట ఫ్లైఓవర్ను ప్రారంభిస్తారని వెల్లడించారు. తెలంగాణతో ముడిపడి ఉన్న 5 కారిడార్ల నిర్మాణానికి కేంద్రం లక్ష కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. 2014 వరకు తెలంగాణలో 2,500 కి.మీ జాతీయ రహదారులుంటే, ప్రస్తుతం 5,200 కి.మీలకు పెంచామని వెల్లడించారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్లుగా విస్తరించనున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా భూములను అప్పగిస్తే.. అంత వేగంగా రోడ్ల నిర్మాణం పూర్తిచేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల గుండా జాతీయ రహదారులు వెళ్తున్నాయని చెప్పారు. -
రేవంత్ సర్కార్కు కిషన్రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: కుల గణనపై చర్చకు సిద్ధమంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ సర్కార్ చేసింది కుల గణన కాదని.. కుల సర్వే మాత్రమే చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ సర్వే కూడా తూతూ మంత్రంగా చేశారు. మేము ఎప్పుడు కుల గణనను వ్యతిరేకించలేదు. బీసీలకి న్యాయం జరిగేలా సరైన గణన చేయాలని కోరాం’ అని కిషన్రెడ్డి చెప్పుకొచ్చారు.‘‘ముస్లింలను బీసీలలో కలిపి అసలైన బీసీలకు అన్యాయం చేయొద్దని చెప్పాం. దేశంలో స్వాతంత్య్రం వచ్చాక కుల గణన చేస్తున్న ఏకైక ప్రభుత్వం ప్రధాని మోదీది. 90 శాతం జిల్లాల్లో మౌలిక వసతుల కల్పనలో మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. దేశంలో ఎన్డీయే హయాంలో రోడ్ల కనెక్టివిటీ బాగా పెరిగింది. తెలంగాణ 33 జిల్లాల్లో 32 జిల్లాల్లో రోడ్ల నిర్మాణం జరిగింది. హైవే రోడ్లకు కనెక్టివిటీ చేయడం జరిగింది. 2014 తెలంగాణలో 2500 కిలో మీటర్ల జాతీయ రహదారులుంటే ఇవాళ 5200 కిలోమీటర్ల జాతీయ రహదారులు పెరిగాయి’’ అని కిషన్రెడ్డి వివరించారు.‘‘కేంద్ర ప్రభుత్వం 1 లక్ష 20 కోట్ల నిధులను కేవలం రోడ్ల నిర్మాణంపై ఖర్చు చేస్తోంది. హైదరాబాద్కు అన్ని వైపుల అత్యాధునికంగా, అన్ని సౌకర్యాలతో జాతీయ రహదారులు రూపుదిద్దుకుంటున్నాయి. హైదరాబాద్, శ్రీశైలం మధ్య ఫోన్ లైన్ ఎలివేటెడ్ హైవే ప్రతిపాదనలో ఉంది. భూసేకరణ కాకపోవడం వల్ల రహదారుల నిర్మాణం నత్తనడకన జరుగుతున్నాయి. జాతీయ రహదారులకు కావలసిన ల్యాండ్ అక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా పనులు పూర్తవుతాయి. 6వేల కోట్ల నిధులతో తెలంగాణలో గ్రీన్ ఫీల్డ్ క్యారిడార్ రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయి.5 కారిడార్లకు లక్ష కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో రూ. 5416 కోట్ల రోడ్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్, హైదరాబాద్ రెండు చోట్ల వివిధ జాతీయ రహదారులకు భూమి పూజ చేయనున్నారు. ఆదిలాబాద్లో కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద 5 ప్రాజెక్ట్ లు, హైదరాబాద్లో బీహెచ్ఈఎల్ వద్ద ఫ్లై ఓవర్, అంబర్ పేట్ ఫ్లై ఓవర్ ప్రారంభిస్తారు. అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్లో జరిగే సభలో ప్రసంగిస్తారు’’ అని కిషన్రెడ్డి వెల్లడించారు. -
సీఎంవా లేక ఈవెంట్ మేనేజర్ వా .. కాంగ్రెస్ నేత సంచలన కామెంట్స్
-
తెలంగాణలో మొక్కుబడిగా ద్విత్వీయ శ్రేణి నగరాల్లో ఐటీ టవర్లు
-
పాక్పై భారత్ దాడికి సాక్ష్యం ఏది?.. కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇలాంటి తరుణంలో 2016లో పాకిస్తాన్పై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ విషయమై కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సర్జికల్ స్ట్రైక్కు సంబంధించి రుజువు చూపించాలని అడగటం తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతకు మరోసారి బీజేపీ కౌంటరిచ్చింది.వివరాల ప్రకారం.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం తర్వాత పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్నీ మీడియాతో మాట్లాడుతూ..‘పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మేము కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం. దాడి వెనుక ఉన్న వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ పాకిస్తాన్ హస్తం ఉంటే వారికి తగిన బుద్ది చెప్పాలని కోరుతున్నాం. కానీ, 2016లో పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ వైమానిక దాడులకు సంబంధించి మాత్రం మాకు అనుమానాలు ఉన్నాయి. ఈ దాడుల విషయంలో గందరగోళం కనిపిస్తోంది. మన దేశంపై బాంబు వేస్తే మనకు తెలియదా?. పాకిస్తాన్లో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించామని వారు అంటున్నారు. కానీ, అక్కడ ఇలాంటిదేమీ జరగలేదు. ఎవరూ దీని గురించి మాట్లాడలేదు. సర్జికల్ స్ట్రైక్కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. దీనిపై నేను మొదటి నుండి డిమాండ్ చేస్తున్నాను. మన దేశ ప్రజలకు అన్ని విషయాలు తెలియాలి’ అని కామెంట్స్ చేశారు.SICK!Rahul Gandhi's Congress continues to defend Pakistani terror!Now Charanjeet Singh Channi questions our forces.Why is Congress demoralising our forces at this critical time.Congress is taking orders directly from Pakistan!#PehalgamTerroristAttack pic.twitter.com/b2MIexdAQA— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) May 2, 2025ఇక, కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ కౌంటరిచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేతలు మన దేశ సాయుధ దళాల పనితీరును ప్రశ్నిస్తున్నారని ఆరోపించింది. ఆయన వ్యాఖ్యలపై ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా స్పందిస్తూ..‘కాంగ్రెస్ మళ్లీ మన దేశ సైన్యాన్ని మరియు వైమానిక దళాన్ని ప్రశ్నించింది. సర్జికల్ స్ట్రైక్ జరిగిందని తాను నమ్మడం లేదని.. తనకు రుజువు కావాలని చన్నీ అన్నారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబం ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉందో ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. వారు భారత సైన్యం, వైమానిక దళం అబద్ధాలు చెబుతున్నారని, పాకిస్తాన్ నిజం చెబుతోందని పదే పదే ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ స్వయంగా సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిందని చెప్పినప్పటికీ వీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు. సర్జికల్ స్ట్రైక్పై మీకు నిజంగా రుజువు కావాలంటే.. రాహుల్ గాంధీతో కలిసి చన్నీ.. పాకిస్తాన్ సందర్శించి దాడి ఎక్కడ జరిగిందో తనిఖీ చేయండి అంటూ కౌంటరిచ్చారు.మరోవైపు.. సదరు కాంగ్రెస్ ఎంపీ చన్నీకి బీజేపీ నుంచి కౌంటర్ రావడంతో ఆయన మాట మార్చారు. తాను సర్జికల్ దాడుల గురించి ఆధారాలు అడగలేదని మాట మార్చారు. అనంతరం, పాకిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తానని ప్రకటించారు. అయితే, ఆయన వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. -
తెలంగాణే మార్గదర్శి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో త్వరలో చేపట్టనున్న జనగణనలో కులగణనను చేర్చాలన్న కేంద్ర నిర్ణయం వెనుక కాంగ్రెస్ పార్టీ అద్వితీయ పోరాటం ఉందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) పేర్కొంది. ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ తన భారత్ జోడో పాదయాత్ర సందర్భంగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి చూపించిందని, దేశానికే మార్గదర్శిగా నిలిచిందని కొనియాడింది. తెలంగాణలో అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించి పారదర్శకంగా నిర్వహించిన కులగణన నమూనానే కేంద్రం అనుసరించాలని తీర్మానించింది. దేశంలోని అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ అంశాల్లో న్యాయం చేసేలా జనగణనను ఎప్పట్లోగా పూర్తి చేస్తుందో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేసింది. శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీ అక్బర్ రోడ్డులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీడబ్ల్యూసీ భేటీ జరిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంక గాం«దీ, కేసీ వేణుగోపాల్తో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి కమిటీ సభ్యులు దామోదర రాజనరసింహ, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు హాజరయ్యారు. ప్రధానంగా కులగణన, పహల్గాం ఉగ్రదాడిపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు అప్రమత్తంగా ఉండాలి: ఖర్గే రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర మొదలు, మొన్నటి లోక్సభ ఎన్నికల వరకు ఇదే అంశాన్ని ముందుపెట్టి కాంగ్రెస్ పార్టీ పోరాడిందని ఖర్గే చెప్పారు. పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కులగణన పూర్తి చేసి ప్రభుత్వ పథకాల్లో అమలు చేసే ప్రక్రియను సైతం మొదలు పెట్టిందని ప్రశంసించారు. ప్రజల సమస్యలను నిజాయితీగా లేవనెత్తితే, ఎన్డీఏ వంటి మొండి ప్రభుత్వాలు తలవంచాల్సిందేనని రాహుల్గాంధీ నిరూపించారని అన్నారు. అయితే కులగణన సమస్యను ఒక మంచి ముగింపు వచ్చేంత వరకు కాంగ్రెస్ నేతలంతా అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు. అనంతరం ఇదే అంశంపై చేసిన తీర్మానంలోనూ తెలంగాణ అంశాన్ని సీడబ్ల్యూసీ ప్రస్తావించింది. తెలంగాణ నమూనాను కేంద్రం అనుసరించాలి ‘తెలంగాణలో కులగణనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పాటించిన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన అవసరం ఉందని సీడబ్ల్యూసీ భావిస్తోంది. తెలంగాణలో కుల సర్వే రూపకల్పన పూర్తిగా పౌర సమాజం, సామాజికవేత్తలు, నాయకుల క్రియాశీల ప్రమేయంతో.. సంప్రదింపులు, పారదర్శక ప్రక్రియ ద్వారా జరిగింది. ఈ సర్వే పూర్తిగా బ్యూరోక్రాటిక్ విధానంలో కాకుండా ప్రజల పరిశీలన నుంచి వచ్చింది.అందువల్ల జాతీయ స్థాయి కులగణన కోసం తెలంగాణ పాటించిన విధానాన్ని అనుసరించాలని సీడబ్ల్యూసీ కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతోంది. కేంద్రం విశ్వసనీయమైన, శాస్త్రీయమైన, భాగస్వామ్య నమూనాను రూపొందించేందుకు వీలుగా మా పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాం. సంప్రదింపులు, జవాబుదారీతనం సమ్మిళితత్వంతో విలువలను ప్రతిబింబించే చట్రాన్ని రూపొందించడంలో సహకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం..’అని సీడబ్ల్యూసీ తన తీర్మానంలో పేర్కొంది. జాప్యం వద్దు..పారదర్శకంగా జరగాలి ‘కులగణన ప్రక్రియలో జాప్యం చేయకూడదు. అన్ని రాజకీయ పార్టీలను పూర్తి విశ్వాసంలోకి తీసుకోవాలి. ఈ అంశంపై పార్లమెంట్లో వెంటనే చర్చ జరపాలి. ప్రభుత్వం వెంటనే అవసరమైన నిధులను కేటాయించి, జనాభా లెక్కల ప్రతి దశకు నిర్దిష్టమైన సమయాన్ని ప్రకటించాలి. కులగణన వివరాల నమోదు ప్రక్రియ పూర్తి సమగ్రంగా, పారదర్శకంగా ఉండేలా చూడాలి. రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలకు, విద్యా, ఉపాధి అవకాశాలకు ఈ కులగణనే ప్రాతిపదికగా ఉండాలి. కుల గణన సరిగ్గా జరిగి అమలైతే సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుంది..’అని తీర్మానంలో స్పష్టం చేసింది. పూర్తి పారదర్శకతతో నిర్వహించాం: సీఎం రేవంత్ తెలంగాణలో కులగణన జరిగిన తీరును సీడబ్ల్యూసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వివరించారు. కచ్చితత్వంతో, పూర్తి పారదర్శకంగా కులగణన నిర్వహించామని తెలిపారు. ‘బీసీల జనాభా గతం కన్నా 6 శాతం మేర పెరిగింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి, దానిని పార్లమెంట్ ఆమోదానికి పంపించాం. విద్య, ఉద్యోగం, ఉపాధి, నిధుల కేటాయింపుల్లో ఓబీసీ, ఆదివాసీ, దళితులు, మైనార్టిలకు ప్రయోజనం చేకూరేలా ఇకపై ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి.కులగణనతో ఆయా వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం. మమ్మల్ని చూసే కేంద్రం కూడా కులగణన చేసేందుకు ముందుకొచ్చింది. దీనిపై రాష్ట్రంలోని నిమ్న వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి..’అని సీఎం తెలిపారు. రేవంత్, దామోదరకు అభినందనలు కులగణన ప్రక్రియలో చేసిన శ్రమ, అమలులో చూపిన చొరవపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి దామోదరలను సీడబ్ల్యూసీ కీలక నేతలు అభినందించారు. -
మోదీ సభలో కాంగ్రెస్ నేత శశిథరూర్
-
‘శశి థరూర్ నా పక్కన ఉన్నారు.. వారికి నిద్రలేని రాత్రులే’
తిరువనంతపురం: కేరళ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఓడరేవును ఆయన జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్పై ప్రధాని మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.‘‘ఇవాళ శశి థరూర్ ఇక్కడ కూర్చున్నారు. ఈ వేదికపై ఆయన ఉండటం కొందరికి నచ్చదు. కొందరికి ఇది నిద్రలేని రాత్రులను మిగులుస్తుంది. ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి చేరుకుంటుంది’’ అంటూ మోదీ చురకలు అంటించారు. కేరళ సీఎం విజయన్ సమక్షంలోనే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా.. గురువారం రాత్రి కేరళ చేరుకున్న ప్రధానిని.. శశి థరూర్ స్వయంగా వెళ్లి స్వాగతించిన సంగతి తెలిసిందే. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారాయి. ‘‘ఢిల్లీ ఎయిర్పోర్టులో విమానాల ఆలస్యం ఉన్నప్పటికీ.. సమయానికి తిరువనంతపురం చేరుకోగలిగా.. నా నియోజకవర్గానికి వచ్చిన మోదీని సాదరంగా స్వాగతించా’’ అంటూ శశి థరూర్ ట్వీట్ కూడా చేశారు.శశిథరూర్ గత కొన్ని నెలలుగా తన సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్న తెలిసిందే. ఇటీవల ఓ కేంద్ర మంత్రితో ఆయన సెల్ఫీ దిగడంతో థరూర్ పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తూ కూడా ఆయన ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో ఇవాళ ఆయన ప్రధాని మోదీతో వేదిక పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.కాగా, భారత సముద్ర వాణిజ్య చరిత్రలో కొత్త చరిత్రను లిఖించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవు.. సముద్ర రవాణాకు కీలకమైన కేంద్రంగా మారనుంది. దేశంలో మొట్టమొదటి సెమీ ఆటోమేటెడ్ ఓడరేవు అయిన విజింజం ఓడరేవు ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాంకేతికంగా అధునాతనమైన ట్రాన్స్షిప్మెంట్ ఓడరేవులలో ఒకటిగా నిలిచింది. -
హారతి ఇస్తుండగా మంటలు అంటుకుని.. కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ మృతి
జైపూర్: కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ కన్నుమూశారు. ఈ ఏడాది మార్చి నెలలో తన ఇంటి పూజగదిలో హారతి ఇస్తుండగా అగ్ని ప్రమాదానికి గురైన గిరిజా వ్యాస్ చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. The news of the demise of former Union Minister, former Rajasthan Congress President, and senior Congress leader Dr. Girija Vyas ji is deeply saddening.A distinguished intellectual, powerful orator, and capable administrator, she served the nation and the Congress Party with… pic.twitter.com/2fJN88nva7— B M Sandeep (@BMSandeepAICC) May 2, 2025సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్రమంత్రి గిరిజా వ్యాస్ (Girija Vyas) మార్చి 31న అగ్ని ప్రమాదంలో పడ్డారు. రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్లోని తన నివాసంలో పూజ చేసే సమయంలో హారతి (harathi) ఇచ్చే సమయంలో ఆమెకు మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఉదయపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. మెరుగైన వైద్యం కోసం ఆమెను 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్కు తరలించాలని సూచించారు. ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై గిరిజా వ్యాస్ సోదరుడు గోపాల్ శర్మ స్పందించారు. గిరిజా వ్యాస్ ఇంట్లో హారతి ఇచ్చే సమయంలో ప్రమాదవ శాత్తూ కింద నుంచి మంటలు ఆమె దుప్పటాకు అంటుకున్నాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. తాజాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గిరిజా వ్యాస్ కన్నుమూశారు. ఆమె మరణంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 👉 ప్రముఖ కాంగ్రెస్ నేత గిరిజా వ్యాస్ గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కీలక పదవులు నిర్వహించారు.1985 నుండి 1990 వరకు ఎమ్మెల్యేగా, రాజస్థాన్ పర్యాటక మంత్రిగా పనిచేశారు1991లో తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. 1996, 1999లో ఉదయపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి, 2009లో చిత్తోర్గఢ్ నుండి లోక్సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (NCW) చైర్ పర్సన్గా సేవలందించారు. -
హెడ్లైన్ సరే.. డెడ్లైన్ ఏదీ: జైరాం రమేశ్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జాతీయ జనగణన, కులగణనకు స్పష్టమైన రోడ్మ్యాప్ ప్రకటించాలని గురువారం కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఎలాంటి కాల పరిమితి లేకుండా కేవలం కులగణన చేస్తామన్న కేంద్ర ప్రకటనను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ జైరాం రమేశ్ తప్పుపట్టారు.ఈ సందర్భంగా ‘నిర్దిష్ట గడువు లేకుండా ముఖ్యమైన ప్రకటనలు ఇవ్వడంలో ప్రధాని మోదీ సిద్ధహస్తుడు. కులగణనపై ఆయన హెడ్లైన్ ఇచ్చారు. డెడ్లైన్ మాత్రం చెప్పలేదు. కులగణనపై రోడ్మ్యాప్ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఆరేళ్లుగా అడుగుతోంది’అని అన్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాక్పై తీవ్ర చర్యలు తీసుకోవాలనే డిమాండ్ల నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుల గణన నిర్ణయాన్ని ప్రకటించిందని ఆరోపించారు. కులగణనను మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్న బీజేపీ, ఆకస్మికంగా నిర్ణయాన్ని మార్చుకోవడం నైతిక, రాజకీయ ఓటమిని చెప్పకనే చెబుతోందన్నారు. ‘జీఎస్టీ, ఆధార్, ఉపాధి హామీ, ఆహార భద్రతా చట్టాలపై యూటర్న్ తీసుకున్న మోదీ ఇప్పుడు కుల గణనపై అతిపెద్ద యూటర్న్ తీసుకున్నారు. ఈ విషయంలో ప్రధానిని మించిన వారు లేరు’అని రమేశ్ వ్యాఖ్యానించారు. గురువారం ఇక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జన గణనకు తగినంత బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంపైనా ఆయన అనుమానం సంధించారు. కులగణనకు కాంగ్రెస్ మద్దతిస్తుందంటూ ఆయన.. తగు బడ్జెట్ లేకుండా, నిరి్ధష్ట గడువు లేకుండా, సమగ్ర ప్రణాళిక రూపొందించకుండా కేవలం హెడ్లైన్తో సరిపెట్టడం వెనుక కేంద్ర ప్రభుత్వం ఉద్దేశమేంటన్నారు. రాజ్యాంగ సవరణ చేయాలని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించాలని డిమాండ్ చేస్తోందన్నారు. -
చివరకు కులగణన వైపే మొగ్గు
కులగణన ప్రతిపాదనపై గత కొన్నేళ్లుగా కారాలూ మిరియాలూ నూరుతూ వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎట్టకేలకు తన వైఖరి మార్చుకుంది. వచ్చే జనగణనతోపాటే కులగణన కూడా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ బుధవారం నిర్ణయించటం దేశ చరిత్రలో ఒక కీలకమైన మలుపు. అయితే ఇప్పటికే అయిదేళ్లుగా వాయిదా పడుతూవస్తున్న జనగణన ఎప్పుడు ప్రారంభిస్తారన్న అంశంలో స్పష్టత లేదు. స్వాతంత్య్రానంతరం అణగారిన కులాలు సైతం విద్యావకాశాలను అందుకోవటం, ఉన్నతోద్యోగాలు సాధించటం వంటి పరిణామాల కారణంగా ఆ వర్గాల్లో చైతన్యం పెరిగింది. జనాభా దామాషా ప్రాతిపదికన అవకాశాలు దక్కటం లేదన్న అసంతృప్తి ఎక్కువైంది. అందుకే కులగణన జరపాలన్న డిమాండ్ ముందుకొచ్చింది. దేశంలో దీన్ని మొట్టమొదట స్వాగతించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 2021లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం కులగణన జరపాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానంచేసి పంపింది. 2024 జనవరిలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వేగవంతంగా, శాస్త్రీయంగా కులగణన నిర్వహించారు. బిహార్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు సైతం కులగణన చేశాయి. అయితే బీజేపీ మొదటినుంచీ ఈ డిమాండును వ్యతిరేకించింది. 2021 జులై 20 నాడు పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చిన ఆనాటి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ‘జనగణనలో ఎప్పటిలా ఎస్సీ, ఎస్టీ వర్గాల జనాభా లెక్కల సేకరణ మినహా ఇతర కులాల లెక్కింపు జరపరాదన్నది కేంద్రప్రభుత్వ విధానపరమైన నిర్ణయం’ అని ప్రకటించారు. బయట ఎక్కడా నేరుగా కులగణనను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు ప్రకటనలు చేయకపోయినా, సమాజాన్ని విచ్ఛిన్నం చేయటానికి కాంగ్రెస్ కులాన్ని ఉపయోగించుకుంటున్నదని విమర్శించేవారు. మొన్నటికి మొన్న పహల్గామ్లో ఉగ్రవాదులు నావికాదళ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ను మతం ఏమిటో కనుక్కుని కాల్చిచంపటాన్ని ప్రస్తావించి ‘వారడిగింది మతం... కులంకాదు’ అని ఛత్తీస్గఢ్ బీజేపీ ట్వీట్ చేసింది. అయితే కులగణన చేయటమే సరైందని ఆరెస్సెస్ భావిస్తున్నదని రెండు నెలల క్రితం ఒక ఆంగ్లపత్రిక వెల్లడించినప్పటినుంచీ దీనిపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి.జనాభా లెక్కలతోపాటు కులగణన కూడా జరిగితే దేశంలో దాదాపు వందేళ్ల తర్వాత ఆ ప్రక్రియ మళ్లీ అమల్లోకొచ్చినట్టవుతుంది. ఆఖరుసారి వలస పాలకుల హయాంలో 1931లో కులాలవారీ జనాభా లెక్కేశారు. అప్పట్లో 4,147 కులాలున్నట్టు తేల్చారు. 1901లో ఈ సంఖ్య 1,646. తర్వాత 1941లో కూడా కొంతవరకూ జనాభా లెక్కల్లో కులాన్ని గణించారుగానీ రెండో ప్రపంచయుద్ధ కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. స్వాతంత్య్రానంతరం ఎస్సీ, ఎస్టీల వివరాలు మాత్రమే సేకరిస్తున్నారు. పీపుల్ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు 1992లో జరిపిన ఒక సర్వే ప్రకారం దేశంలో 4,635 కులాలున్నాయి. 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కులగణన నిర్వహిస్తామని వాగ్దానం చేశారు. అనంతరం సాంఘికార్థిక సర్వేకింద 2011–12 మధ్య ఆ లెక్కలు తీశారు. కానీ ఆ డేటాను బయటపెట్టలేదు. ఇటీవల జనగణనపై కాంగ్రెస్ పట్టుబట్టడం మొదలైంది. మతంపై ప్రధానంగా కేంద్రీకరించే బీజేపీ ఇందుకు ససేమిరా సమ్మతించబోదని, అందువల్ల ఎన్నికల్లో కులగణన తనకు ప్రధాన ఆయుధంగా మారుతుందని ఆ పార్టీ భావించింది. కానీ బీజేపీ హఠాత్తుగా మనసు మార్చుకోవటంతో కాంగ్రెస్కు చెప్పుకోదగ్గ నినాదం లేకుండా పోయింది. అణగారిన కులాలు అడిగాయని కాదు... కులం ఒక వాస్తవం అయినప్పుడూ, సమాజంపై దాని ప్రభావం అమితంగా వున్నప్పుడూ ఎవరి సంఖ్య ఎంతో తేల్చటం ప్రభుత్వాల బాధ్యత. ఇన్నాళ్లూ దాన్ని విస్మరించారు. ఇందువల్ల రెండు రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సంక్షేమ ఫలాలు లక్షిత వర్గాలకు సరిగా చేరటం లేదు. ఇప్పటికీ విద్యాగంధం అంటని, ప్రభుత్వ పథకాల సంగతే తెలియని కులాలవారు గణనీయంగావున్నారు. ఫలితంగా బడ్జెట్లలో గర్వంగా ప్రకటించుకునే పథకాలు ఆచరణలో నిరుపయోగం అవుతున్నాయి. ఇక ఇంద్ర సాహ్ని కేసులో రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీంకోర్టు నిర్ణయం కోటా పెంపు ప్రయత్నాలకు అవరోధమవుతోంది. సమస్య వుందని ప్రభుత్వాలకు తెలిసినా, కొత్తగా తెరపైకొస్తున్న కులాలకు న్యాయం చేద్దామనుకున్నా అసాధ్యమవుతున్నది. అన్ని రంగాల్లోనూ ఆధిపత్య కులాల హవా కొనసాగుతోంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకోవటంలో, గాలివాలుకు అనుగుణంగా దూసుకెళ్లటంలో బీజేపీ దరిదాపుల్లోకొచ్చే రాజకీయపక్షం మరొకటి లేదు. వాస్తవానికి గత లోక్సభ ఎన్నికల ముందూ... మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల సందర్భాల్లో కులగణనపై కేంద్రం నిర్ణయం ప్రకటిస్తుందని అందరూ భావించారు. అలాచేస్తే కాంగ్రెస్ డిమాండుకు తలొగ్గినట్టయ్యేది. పహల్గామ్ మారణకాండపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నవేళ కులగణన నిర్ణయం తీసుకోవటంతో అది తన ఘనతేనని కాంగ్రెస్ చెప్పుకునే పరిస్థితి లేకుండాపోయింది. పైగా కేంద్రంలో ఎక్కువకాలం అధికారంలోవున్నా కులగణన జోలికి పోకపోవటం... 2011–12లో ఆ పని చేసినా దాన్ని సామాజికార్థిక సర్వేగా చెప్పటం ఆ పార్టీకి పెద్ద మైనస్. బిహార్ ఎన్నికలు సమీపిస్తున్నవేళ తీసుకున్నా తాజా నిర్ణయం నిస్సందేహంగా బీజేపీకి ఉపకరిస్తుంది. అయితే దీని వెంబడి రాగల ఇతరేతర డిమాండ్లతో ఆ పార్టీ ఎలా వ్యవహరిస్తుందన్నది చూడాలి. -
‘రాహుల్, కాంగ్రెస్ పార్టీలకు భయపడి మేం నిర్ణయాలు తీసుకోం’
ఢిల్లీ : వచ్చే జనగణనలో కులగణన చేర్చుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం తర్వాత ప్రతిపక్ష పార్టీలు రాజకీయ నాటకాలకు తెరలేపుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కుట్రలు, కుతంత్రాలు చేశారని, ముస్లింలందరినీ బీసీల్లో చేర్చారన్నారు కిషన్ రెడ్డి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం తమ ఘనతేనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ కు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు కిషన్ రెడ్డి. తాము రాహుల్ గాంధీకో, కాంగ్రెస్కో భయపడి కులగణన నిర్ణయం తీసుకోలేదన్నారు. జనగణనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏమన్నారంటే..జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.ఈ కులగణన చరిత్రపుటల్లో నిలిచిపోనుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తర్వాత ప్రతిపక్ష పార్టీలు.. రాజకీయ నాటకాలకు తెరలేపుతున్నారు.గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి.. కుట్రలు, కుతంత్రాలు చేశారు.ముస్లింలందరినీ.. బీసీల్లో చేర్చారు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి.. ప్రజలను మతం పేరుతో విడగొడుతూ.. మతఘర్షణలు సృష్టించిన కాంగ్రెస్ పార్టీ.. కులాల పేరుతోనూ.. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేసింది.కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలపై, బీసీలపై కపటప్రేమను చూపించడం ఒక్కటే కాదు.. వీలు చిక్కినపుడల్లా విషం కక్కిన సందర్భాలు కూడా చరిత్రలో ఎన్నో ఉన్నాయి.ఎస్సీ అయిన రామ్నాథ్ కోవింద్ గారిని, ఎస్టీ అయిన ద్రౌపది ముర్ముగారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినపుడు.. వ్యతిరేకించి తమ పార్టీ అభ్యర్థులను బరిలో దింపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మాదిగ రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించేందుకు.. మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పూర్తి వివరాలు అందజేసిన తర్వాత.. ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమమైంది.వెనుకబడిన వర్గాలనుంచి వచ్చిన.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కులం పేరుతో దూషించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ కూడా.. బీసీలపట్ల మొసలికన్నీరు కార్చుతోంది. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ఏనాడూ పనిచేయలేదు.2018లో జాతీయ బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానికే దక్కుతుంది.2019లో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకోసం 10% రిజర్వేషన్ ను (EWS) అమల్లోకి తీసుకొచ్చింది.సమాజంలోని అన్ని వర్గాలకు సరైన న్యాయం జరగాలని.. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ నినాదంతో చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నాం. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించి వారి సాధికారిత కోసం, వారికి ఆత్మగౌరవం కల్పించిన ఘనత మోదీ గారిది.ముస్లిం మహిళలపై ‘ట్రిపుల్ తలాక్’ వంటి అనాగరికమైన విధానాలను రద్దు చేసి..ముస్లిం మహిళలకు హక్కులు, అధికారాన్ని కల్పించిన ఘనత మోదీ ప్రభుత్వానిది.సమాజంలోని ఏ ఒక్క వర్గానికీ.. తమను పట్టించుకోవడం లేదు.. అనే భావన రానీయకుండా మేం పనిచేస్తున్నాం.1881 నుంచి 1931 కులగణన జరిగింది. కానీ స్వాతంత్ర్యానంతరం కులగణన జరగకూడదని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం 1951 నుంచి నేటివరకు ఏనాడూ కులగణన జరగలేదు.మొదటినుంచీ కాంగ్రెస్ పార్టీ కులగణనకు వ్యతిరేకంగానే ఉంది. నెహ్రూ, మౌలానా ఆజాద్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కులగణన పట్ల బహిరంగంగానే విముఖత వ్యక్తం చేశారు.మండల్ కమిషన్ ఇచ్చిన నివేదికను రాజీవ్ గాంధీ వ్యతిరేకించారు.6 సెప్టెంబర్, 1990 నాడు.. పార్లమెంటులో రాజీవ్ గాంధీ మాట్లాడుతూ.. దేశంలో బీసీలకంటే ముస్లింలు విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనకబడి ఉన్నారని, వారికి చేయూత అందించాలని చెప్పారు. బీసీలను పక్కనపెట్టి ముస్లింల హక్కుల గురించి మాట్లాడారు.అంతే తప్ప బీసీలకు న్యాయం చేసే విషయంలో ఒక్క మాట కూడా సానుకూలంగా మాట్లాడలేదు.2010లో నాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు.. కులగణనపై మంత్రులతో సబ్ కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అదే సమయంలో, 2010లో బీజేపీ పక్షనేత సుష్మాస్వరాజ్ గారు.. నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గారికి లేఖ రాస్తూ.. తమ పార్టీ కులగణనకు అనుకూలంగా ఉన్నామని లేఖ రాశారు.దీనిపై కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని పక్కనపెట్టి.. 2011లో జనగణన చేసింది.బీజేపీ మొదట్నుంచీ కులగణనకు సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తోంది. కానీ ఇది రాజకీయ అస్త్రంగా కాకుండా.. సామాజికంగా అన్ని వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడేలా ఉండాలనేది బీజేపీ ఆలోచన.దేశంలో కులగణన జరిగితే.. సామాజిక, ఆర్థిక పరమైన లబ్ధి పేదలకు అందించడంలో ఈ డేటా ఉపయోగపడుతుంది.సంక్షేమపథకాలు, రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేసేందుకు జనగణన డేటా ఉపయుక్తం అవుతుంది.ఇది మా ప్రభుత్వ స్పష్టమైన వైఖరిని ప్రస్ఫుటం చేసింది.కానీ, 2011లో జనగణనతో పాటుగా కులగణన చేయడాన్ని నాటి హోంమంత్రి చిదంబరం.. వ్యతిరేకించారు.బీజేపీ తరపున.. చాలా సందర్భాల్లో అమిత్ షా గారు మాట్లాడుతూ.. జనగణన చేపట్టినపుడు కులగణన చేస్తామని చెప్పారు.గతంలో సుష్మాస్వరాజ్ గారు ఇచ్చిన లేఖ ఆధారంగా.. మా పాలసీ మేరకు.. ఇవాళ మేం జనగణనలో భాగంగా కులగణన చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ, కాంగ్రెస్ అండ్ pvt Ltd కంపెనీలు.. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నాయి. మోదీ సర్కారు తీసుకున్న ఈ సానుకూల నిర్ణయం.. తమ ఘనత అన్నట్లు రాహుల్ గాంధీ చెప్పుకోవడం సిగ్గుచేటు.రాహుల్ గాంధీకో, కాంగ్రెస్ పార్టీకో భయపడి బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదు.ఎద్దులబండి కింద కుక్క.. మొత్తం బండిని తానే మోస్తున్నానని అనుకుంటుంది.అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా.. తాము చెప్పినట్లే ప్రభుత్వాన్ని నడిపిస్తామని చెప్పుకుంటోంది.ఇది హాస్యాస్పదం.2010లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ కమిట్మెంట్ తో అయితే.. నిర్ణయం తీసుకున్నామో.. దానికి కట్టుబడి ముందుకెళ్తున్నాం.దేశానికి, సమాజానికి ఏ నిర్ణయం వల్ల మేలు జరుగుతుందో ఆలోచించి.. నిర్ణయం తీసుకుంటాం.ఆ నిర్ణయాలు తీసుకునే సత్తా బీజేపీకి, ఎన్డీయేకు, మోదీ గారి నాయకత్వానికి ఉంది.ఆర్టికల్ 370 రద్దు, రామజన్మభూమి, ట్రిపుల్ తలాక్, GST వంటి ఏ నిర్ణయాన్నయినా.. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటాం.మేం చేపట్టబోయే కులగణనలో.. ఎట్టిపరిస్థితుల్లోనూ ముస్లింలను బీసీల్లో చేర్చబోం.మత ప్రాతిపదికన ఎవరినీ బీసీల్లో చేర్చే ప్రసక్తే లేదు. రాజ్యాంగ విరుద్ధమన్న న్యాయస్థానాల తీర్పుకు విరుద్ధంగా బీసీ ముస్లింలు అనే ఆలోచనతో కాంగ్రెస్ ముందుకెళ్లింది. దీన్ని మేం ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం.కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా.. షార్ట్ టర్మ్ లక్ష్యాలతో, ఓటుబ్యాంకు రాజకీయాలు, అధికార దాహంతో తీసుకున్న నిర్ణయాలే తప్ప.. దేశం హితం కోసం, దేశ ప్రజల అభ్యున్నతి గురించి ఆలోచించలేదు.తెలంగాణ, కర్ణాటకల్లో రాష్ట్రాల్లో చేపట్టిన కులగణన కూడా హడావుడిగా.. ఏదో సాధించామని చెప్పుకునే ప్రయత్నం చేశారు తప్ప.. ఇందులో చిత్తశుద్ధి లేదు. ఇది కులగణన కాదు. ఇది కులాలకు సంబంధించిన సర్వే.కులగణన చేయాలంటే.. విధానపరమైన నిర్ణయాలు చాలా తీసుకోవాల్సి ఉంటుంది.50% జనాభాను కూడా చేరుకోకుండా మొత్తం సర్వే పూర్తి చేశామని చెప్పడం హాస్యాస్పదం.శాస్త్రీయమైన పద్ధతిలో ఈ సర్వే జరగలేదు.బీసీల్లోని అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే.. నిష్పాక్షికమైన, సైంటిఫిక్ పద్ధతిలో కులగణన జరగాలనేదే మోదీ సర్కారు ఆలోచన. దీనికోసమే.. జనగణన వరకు వేచి చూశాం.జనగణన చేస్తున్నప్పుడే.. కులగణన సాధ్యమవుతుంది.ఈసారి నిర్మాణాత్మకంగా జనగణన చేపట్టడం అందులో భాగంగా కులగణన జరపాలనేదే మా ప్రభుత్వ స్పష్టమైన విధానం.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మోదీ గారు పదేళ్లలో కులగణన ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు.2010లో రేవంత్ ఏ పార్టీలో ఉన్నారో తెలియదు.అప్పుడే మేం కులగణనకు ఆమోదం తెలిపాము.ప్రతి పదేళ్లకోసారి, దశాబ్దపు మొదటి సంవత్సరంలో కులగణన జరుగుతుంది.బీజేపీ అధికారంలోకి వచ్చాక తొలిసారి జనగణన జరుగుతున్నప్పుడు.. కులగణన కూడా జరుగుతుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టలేదో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి.నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీలు కులగణను వ్యతిరేకించారు.తూతూ మంత్రంగా.. తంతు లాగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుకోవడం లేదు.వాస్తవాలకు అనుకూలంగా, శాస్త్రీయమైన పద్ధతిలో కులగణన ఉంటుంది.ఒకసారి పబ్లిష్ చేసి.. లోపాలుంటే.. మరో రెండ్రోజులు సమయం ఇచ్చి.. మీ ఇష్టం వచ్చినట్లు సర్వే చేశారు తప్ప.. ఇందులో శాస్త్రీయత లేదు.ఈ విషయం రాహుల్ గాంధీకి అర్థం కాలేదు.తెలంగాణలో ఉన్న రాంగ్ రోల్ మోడల్ మాకు అవసరం లేదు.మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి.. సమగ్రంగా జనగణ చేస్తాం.కులగణన చేపట్టేందుకు ‘సెన్సెస్ యాక్ట్ 1948’లో సవరణ తీసుకొచ్చి.. ఇందులో ‘కులం’ అనే పదాన్ని ఓ ప్యారామీటర్ గా చేర్చాలి.వచ్చే పార్లమెంటు సమావేశాల్లో.. దీనికి సంబంధించిన సవరణ తీసుకొచ్చాకే.. జనగణనపై ముందుకెళ్తాం.కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అబద్ధాలు మాట్లాడుతున్నారు.తెలుగు ప్రజలు, దేశ ప్రజలు ఈ రెండు పార్టీలను నమ్మడం లేదు.కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏనాడూ బీసీలకు సంబంధించిన అంశాల్లో.. రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధితో పనిచేయలేదు.42% బీసీ జనాభా ఉన్నప్పటికీ.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను ఎందుకు ఇవ్వలేదు.కులగణను ఏనాడూ బీజేపీ వ్యతిరేకించలేదు.మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఓడిపోవడం ఖాయం.2026లో జనగణన మొదలయ్యే అవకాశం ఉంటుంది.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడే కులగణన ఉంటుంది.రేవంత్ సర్కారు చేసిన సర్వే.. బీసీ వ్యతిరేక సర్వే.బీసీ ముస్లింలని జోడించి చేసిన సర్వేను మేం వ్యతిరేకిస్తున్నాం.హైదరాబాద్ లో 150 కార్పొరేషన్ సీట్లలో.. బీసీలకు రిజర్వ్ చేసిన 50 సీట్లలో.. 30 సీట్లు ముస్లింలే గెలిచారు