Congress Party
-
మేం చూస్తూ ఊరుకోం!.. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు ఎంత సమయం కావాలి? తగినంత టైం అంటే ఎంత? అసెంబ్లీ గడువు ముగిసేంత సమయం కావాలా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల హక్కులకు సంబంధించిన అంశం ఇది. రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే మేం చూస్తూ ఊరుకోం.’’ – తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శి తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీతో సుప్రీంకోర్టు ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో చర్యలు తీసుకోవడానికి మీకెంత సమయం కావాలో చెప్పండి. ఇంకా తగినంత సమయం కావాలని అడుగుతున్నారు. తగినంత సమయం అంటే ఎంత? ఆ సమయానికి ఏదైనా గడువు అనేది ఉండాలి కదా? ఇలా సమయాన్ని పెంచుకుంటూ వెళితే ఎలా? రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే.. మేం చూస్తూ ఊరుకోబోం’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. కావాల్సిన సమయం ఎంత అనేది చెప్పకపోతే.. తామే గడువు పెడతామని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది. రెండు పిటిషన్లపై విచారణ.. బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రా వ్, దానం నాగేందర్లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కేపీ వివేకానంద స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ), మరో ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీని వాస్రెడ్డి, ఎం.సంజయ్కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ప్రకాశ్గౌడ్, గూడెం మహిపాల్రెడ్డి, అరెకపూడి గాంధీలపై బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్రావు తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేసిన విష యం తెలిసిందే. ఈ రెండు పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం విచా రణ చేపట్టింది. స్పీకర్ తరపున సీనియర్ న్యాయ వాది ముకుల్ రోహత్గీ వాదనలు విని పించగా.. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు ఆర్యామ సుందరం, దామ శేషాద్రినాయుడు, పి.మోహిత్రావు వాదనలు వినిపించారు. ఇంకా ఎంత సమయం కావాలి? తొలుత పిటిషనర్ల తరపు న్యాయవాది శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘‘బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఓ ఎమ్మెల్యే ఏకంగా కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. మరో ఎమ్మెల్యే ఆయన కుమార్తె కోసం ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారం చేశారు’’ అని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. తాము విచారణ జరుపుతున్నది ఎన్నికల ప్రచారంపై కాదని, అనర్హత పిటిషన్పై మాత్రమేనని, అందువల్ల పిటిషన్లో ఉన్న అంశాలను ప్రస్తావించాలని సూచించింది. పిటిషన్పై స్పందించేందుకు మీకెంత సమయం కావాలని స్పీకర్ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని జస్టిస్ బీఆర్ గవాయి ప్రశ్నించారు. తమకు ఇంకా తగినంత సమయం కావాలని రోహత్గీ బదులిచ్చారు. ఈ సమయంలో పిటిషనర్ల తరపు మరో న్యాయవాది ఆర్యామ సుందరం జోక్యం చేసుకుంటూ.. ‘‘ఇప్పటికే పది నెలలు గడిచింది, మొదట్లోనే దీనిపై స్పీకర్ స్పందించి ఉంటే.. మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేవారు కాదు’’ అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. హక్కులకు సంబంధించిన అంశం ఇది అయితే తమకు ఇంకా సమయం కావాలని రోహత్గీ ఈ సందర్భంగా అభ్యర్ధించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘తగినంత టైం అంటే ఎంత? అసెంబ్లీ గడువు ముగిసేంత సమయం కావాలా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల హక్కులకు సంబంధించిన అంశం ఇది. రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే మేం చూస్తూ ఊరుకోం’’ అని స్పష్టం చేసింది. సంపత్కుమార్, సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ కోరిన ‘తగినంత సమయం’ అంశంలో సుప్రీంకోర్టు గతంలో ఇచి్చన తీర్పును రోహత్గీ ప్రస్తావించారు. దీనితో ‘తగినంత సమయం’ అంటే ఎంత అని రోహత్గీని జస్టిస్ బీఆర్ గవాయి ప్రశ్నించారు. ‘‘తగినంత సమయం అంటే రెండు నెలలు, మూడు నెలలు అని ఏదీ కూడా ఆ తీర్పులో ధర్మాసనం చెప్పలేదని రోహత్గీ బదులిచ్చారు. డిక్షనరీ ప్రకారం ‘తగినంత సమయం’ అంటే ఎంత? రోహత్గీ సమాధానంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘‘డిక్షనరీ ప్రకారం ‘తగినంత సమయం (రీజనబుల్ టైం) అంటే ఎంత? పది నెలలు రీజనబుల్ టైం కాదా? అయితే మీ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఎంతో చెప్పండి? మీరు చెప్పే రీజనబుల్ టైమ్కు గడువు అనేది ఉందా, లేదా? పోనీ మీరు రీజనబుల్ టైం చెప్పకపోతే.. మేమే ఓ గడువు విధిస్తాం. ఆ గడువులోపు దానిని పూర్తి చేయండి’’ అని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్చంద్రన్ల ధర్మాసనం పేర్కొంది. అయితే ‘రీజనబుల్ వ్యక్తికి రీజనబుల్ టైం ఇవ్వాల’ని రోహత్గీ తిరిగి అభ్యర్ధించారు. ‘‘రీజనబుల్ వ్యక్తి దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఏంటీ, అసలు ఎంత సమయం కావాలి?’’ అని ధర్మాసనం ఆగ్రహంగా స్పందించింది. దీనికి బదులు ఇచ్చేందుకు రెండు, మూడు రోజులు సమయం కావాలని రోహత్గీ విజ్ఞప్తి చేయగా.. ధర్మాసనం అంగీకరించి తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. ధర్మాసనానికి అన్ని ఆధారాలు సమర్పించాం: మోహిత్రావు తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ తరపు న్యాయవాది పి.మోహిత్రావు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అన్ని ఆధారాలను ధర్మాసనానికి సమర్పించామని చెప్పారు. గతంలోని సుప్రీంకోర్టు తీర్పులు, హైకోర్టు సూచనలను స్పీకర్ పట్టించుకోకపోవడాన్ని వివరించామన్నారు. -
KTR: దుర్యోధనుడు పాలించినట్లు కాంగ్రెస్ పాలన!
-
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ వాయిదా
-
ప్రజావాణిలో అల్లు అర్జున్ మామ ఫిర్యాదు.. విషమేమిటంటే?
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు. ఈ క్రమంలో తన ఇంటి స్థలం గురించి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-92లో తమ ప్రాపర్టీస్ విషయంపై పునరాలోచించాలని ప్రజావాణిలో ఫిర్యాదులో పేర్కొన్నారు.అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదు అందించారు. ఈ సందర్భంగా కేబీఆర్ పార్కు వద్ద రోడ్డు విస్తరణలో తన ఇంటి స్థలం సేకరణపై పునరాలోచన చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రోడ్డు విస్తరణలో తన ప్లాటు ఒకవైపు 20 అడుగులు మరోవైపు 36 అడుగుల భూమి సేకరించే అంశంపై వివరణ ఇవ్వాలంటూ అధికారులను కోరారు. కాగా, కొన్ని నెలల క్రితం కేబీఆర్ పార్కు చుట్టూ జంక్షన్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రూ.1100 కోట్లు ఖర్చు చేయాలని అధికారులు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే రోడ్డు విస్తరణతో పాటుగా పలు కార్యక్రమాలను చేపట్టారు.ఇదిలా ఉండగా.. ఇటీవల టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి(Kancherla Chandrasekhar Reddy) మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వీరి భేటీ సందర్భంగా వారిద్ధరూ ఏ అంశాలపై చర్చించారన్న దానిపై వివరాలు వెల్లడి కాలేదు. అల్లు అర్జున్ అరెస్టు ఎపిసోడ్ తర్వాతా చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్కు రెండోసారి వెళ్లడం చర్చనీయాంశమైంది. -
రేవంత్.. చైనా ఫోన్ లాంటి పాలన నీది: కవిత
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో కేసీఆర్ పాలన ఐఫోన్లా ఉంటే.. రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్లా ఉందని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ కవిత. చైనా ఫోన్ చూడటానికే బాగుంటుంది కానీ.. సరిగా పనిచేయదు. రాజకీయ కక్షను పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. అలాగే, ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదు? అని ప్రశ్నించారు.జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ పాలనకు, రేవంత్ రెడ్డి సర్కార్కు ఎంత తేడా ఉందో ప్రజలే గమనిస్తున్నారు. మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకుని సీఎం రేవంత్ రెడ్డి బురిడీ కొట్టిస్తున్నాడు. ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదు?. తూతూ మంత్రంగా పొన్నం ప్రభాకర్ బీసీ సంఘాలతో సమావేశం పెట్టారు. బీసీ ఉద్యమం చేస్తున్న నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడక పోవడం బీసీలను అవమానించడమే అవుతుంది.బీసీ కుల సంఘాలతో ముఖ్యమంత్రి చర్చలు జరపాలి. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదు. మరో తెలంగాణ పోరాటం తరహా పోరాటానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలి. 52 శాతం బీసీలు ఉన్నారని 2014లోనే కేసీఆర్ లెక్క తేల్చారు. బీసీల సంఖ్యను తక్కువ చూపించడం శోచనీయం. ఈ తప్పుడు లెక్కలు చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంట్ను తప్పదోవపట్టించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ఎందుకు పెట్టడం లేదు?.ఎండిన పంటపొలాలను చూస్తుంటే కన్నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. కేసీఆర్పై అక్కసుతో మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదు. రైతులకు నీళ్లు ఇచ్చే తెలివి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. రాజకీయ కక్షను పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలి. మహిళలను చిన్నచూపు చూస్తున్న రేవంత్ రెడ్డికి కాలం గుణపాఠం చెబుతుంది. రేవంత్ రెడ్డి తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారు.. తగిన సమయంలో బుద్దిచెబుతారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉప ఎన్నిక వస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై ‘సుప్రీం’ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ ఫిబ్రవరి 18కి వాయిదా పడింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఇవాళ (సోమవారం) సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ సమయంలో తెలంగాణ స్పీకర్ తరుఫున ముకుల్ రోహ్గతి వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం. తమకు వాదనలు వినిపించేందుకు రెండు మూడు రోజులు సమయం కావాలని కోరారు. రోహ్గతి విజ్ఞప్తిపై స్పందించిన అత్యున్నత న్యాయ స్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంటరీ ప్రక్రియను ఫ్రస్ట్రేషన్కు గురి చేయొద్దు. ప్రజాస్వామ్యంలో పార్టీలకు హక్కులు ఉంటాయి. తగిన సమయం అంటే ఏంటి? అని ప్రశ్నించింది. పార్టీ మారి పది నెలలు అవుతుంది. ఇది రీజనబుల్ టైం కాదా? అని వ్యాఖ్యానించింది. అందుకు సుప్రీం కోర్టు ఇచ్చిన టైం ప్రకారం.. రీజనబుల్ టైం అంటే మూడు నెలలే అంటే బీఆర్ఎస్ తరుఫు న్యాయవాది తన వాదనల్ని వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణను వాయిదా వేసింది. బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్,అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి , సంజయ్ కుమార్లు కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు.ఇంతకు ముందు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లో చర్యలు తీసుకోవాలని గతంలోనే తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. -
79.39% అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సహా పలు పార్టిల అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఈ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ చేయగా, వీరిలో 555 మందికి(79.39 శాతం) కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థుల్లో కేవలం ముగ్గురికే డిపాజిట్లు దక్కాయి. మిగతా వారంతా తెల్లమొహం వేయాల్సి వచ్చింది. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన చాలామందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీతోపాటు బీజేపీ మిత్రపక్షాలైన జనతాదళ్(యునైటెడ్), లోక్జనశక్తి పార్టి(రామ్విలాస్) అభ్యర్థులంతా డిపాజిట్లు నిలబెట్టుకోవడం విశేషం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మొత్తం 70 మంది బరిలోకి దిగారు. 67 మంది డిపాజిట్లు కోల్పోయారు. ఏఐఎంఐఎం అభ్యర్థులు రెండు స్థానాల్లో పోటీ చేయగా, కేవలం ఒక్కచోటే డిపాజిట్ దక్కింది. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం... ఎన్నికల్లో పోటీ చేసే జనరల్ కేటగిరీ అభ్యర్థి ఎన్నికల సంఘం వద్ద రూ.10,000 డిపాజిట్ చేయాలి. దీన్ని సెక్యూరిటీ డిపాజిట్ అంటారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.5,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల చట్టం ప్రకారం.. ఎన్నికల్లో పోలై చెల్లుబాటు అయిన మొత్తం ఓట్లలో అభ్యరి్థకి ఆరింట ఒక వంతు ఓట్లు లభిస్తే డిపాజిట్ సొమ్మును వెనక్కి ఇచ్చేస్తారు. లేకపోతే డిపాజిట్ కోల్పోయినట్లే. అంటే ప్రతి ఆరు ఓట్లలో కనీసం ఒక్క చోటు వచ్చి ఉండాలి. 10 శాతం తగ్గిన ఆప్ ఓట్ల శాతం దేశ రాజధానిలో బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. పదేళ్లలో 13 శాతం పెరగడం విశేషం. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ బలం 10 శాతం పడిపోయింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నెగ్గగా, ఆప్ పరాజయం పాలైంది. కానీ, రెండు పార్టిలు సాధించిన ఓట్ల మధ్య తేడా కేవలం 2 శాతమే. ఈసారి పోలైన మొత్తం ఓట్లలో ఆమ్ ఆద్మీ పార్టీకి 43.57 శాతం ఓట్లు లభించాయి. బీజేపీకి 45.56 శాతం ఓట్లు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ బలం కూడా స్వల్పంగా పెరిగింది. 2020 ఎన్నికల్లో 4.3 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ ఈసారి 6.34 శాతం ఓట్లు తన ఖాతాలో వేసుకుంది. అంటే కాంగ్రెస్ ఓట్లు 2 శాతానికి పైగానే పెరిగాయి. నేర చరితులు 31 మంది దేశ రాజధాని ఢిల్లీ 8వ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 70 మంది ఎమ్మెల్యేల్లో 31 మంది, 44% మంది నేర చరితులున్నారు. ఈ ఎమ్మెల్యేల్లో 17 మందిపై తీవ్రమైన అభియోగాలున్నా యి. 2020 ఎన్నికల్లో ఎన్నికైన వారిలో నేర చరితులు 43 మంది, అంటే 61% మంది కాగా వీరిలో తీవ్రమైన నేరారోపణలున్న వా రు 37 మంది. ఈ సంఖ్య తాజా అసెంబ్లీ ఎ న్నికల్లో తగ్గింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలి తాలు వెలువడిన నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్(ఏడీఆర్), ఢిల్లీ ఎ లక్షన్ వాచ్ సంస్థలు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి అఫిడవిట్లను విశ్లేషించి ఆదివారం ఒక నివేదికను విడుదల చేశాయి. దీని ప్రకారం.. బీజేపీ టిక్కెట్పై గెలిచిన 48 మందిలో 16 మంది అంటే 33% మందిపై క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో ఆప్ నుంచి గెలిచిన 22 మందిలో 15 మంది, 68% నేరచరితులున్నారు. మరోవైపు మొత్తం 70 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు బిలియనీర్లు కాగా షాకుర్బస్తీ స్థానం నుంచి బీజేపీ తరఫున గెలిచిన కర్నయిల్ సింగ్ రూ.259 కోట్లతో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా నిలిచారు. ఆ తర్వాతి రెండు స్థానాల్లో రూ.248 కోట్లతో రాజౌరి గార్డెన్స్ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా, రూ.115 కోట్లతో న్యూఢిల్లీ ఎమ్మెల్యే పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఉన్నారు. అప్పులున్న ఎమ్మెల్యేల జాబితాలోనూ రూ.74 కోట్లతో పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ అగ్రస్థానంలో నిలవడం విశేషం. మొత్తం 70 మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.1,542 కోట్లుగా ఉంది. వీరిలో 45 మంది, 64% గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోగా, 23 మంది, 33% మంది 5వ నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నారు. అంతేగాక 41– 60 ఏళ్ల మధ్య వయసు్కలైన ఎమ్మెల్యేలు 47 మంది (67% కాగా 14 మంది అంటే 20% మంది వయస్సు 61– 80 ఏళ్ల మధ్య ఉంది. రాజిందర్ నగర్ నుంచి గెలిచిన 31 ఏళ్ల ఉమంగ్ బజాజ్ పిన్న వయసు్కడైన ఎమ్మెల్యేగా నిలిచారు. అదేవిధంగా, సిట్టింగుల్లో 22 మంది మరోసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నారు. వీరిలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 14 మంది, బీజేపీ నుంచి 8 మంది ఉన్నారు. 38 శాతం మంది పట్టభద్రులు ఢిల్లీ అసెంబ్లీకి ఈసారి ఎక్కువ మంది పట్టభద్రులు ఎన్నికయ్యారని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ పేర్కొంది. ఈ సంస్ధ ఇందుకు సంబంధించి నివేదిక విడుదల చేసింది. మొత్తం 70 మంది శాసనసభ్యులకుగాను ఈ దఫా కేవలం ఐదుగురు మాత్రమే, అంటే 7 శాతం మంది మహిళలు ఎన్నికయ్యారని తెలిపింది. వీరిలో నలుగురు బీజేపీ నుంచి, ఒకే ఒక్కరు ఆతిశీ ఆప్ నుంచి గెలిచారంది. 2020 ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లీలో 8 మంది మహిళలు ప్రాతినిథ్యం వహించారని గుర్తు చేసింది. అదేవిధంగా, గత అసెంబ్లీలో 34 శాతం మంది పట్టభద్రులుండగా ఈసారి వీరి సంఖ్య 38 శాతానికి పెరిగింది. పీజీ, అంతకంటే ఉన్నత చదువులు చదివిన వారి సంఖ్య 26 శాతంగానే ఉందని వివరించింది. కొత్త శాసనసభ్యుల్లో 61 శాతం మంది రాజకీయాలు, సామాజిక సేవను తమ వృత్తిగా పేర్కొన్నారంది. గత అసెంబ్లీలో 29% మంది వ్యాపారాన్ని వృత్తిగా పేర్కొనగా ఈ దఫా వీరి సంఖ్య ఏకంగా 49 శాతానికి పెరిగిందనిఆ నివేదిక తెలిపింది. సభ్యుల సరాసరి వయస్సు 52 ఏళ్లుగా పేర్కొంది. కొత్త ఎమ్మెల్యేల్లో 25–40 ఏళ్ల మధ్య ఉన్న వారు 13% కాగా, గత అసెంబ్లీలో వీరు 23 శాతంగా ఉన్నారని విశ్లేషించింది. 70 ఏళ్లు పైబడిన వారి వాటా 4శాతమని తెలిపింది. -
బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ‘చలో కామారెడ్డి’: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కులగణన పేరుతో బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని బీఆర్ఎస్ ఆరోపించింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘కామారెడ్డి డిక్లరేషన్’లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అక్కడే ‘చలో కామారెడ్డి’ పేరిట భారీ సభ నిర్వహించాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అధ్యక్షతన ఆదివారం తెలంగాణ భవన్లో పార్టీ బీసీ నేతల సమావేశం జరిగింది. సుమారు 500 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని ప్రభుత్వం నెరవేర్చేలా ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో చలో కామారెడ్డి సభను నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించారు. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు వారం రోజులపాటు మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో సమావేశాలు, ప్రెస్మీట్లు నిర్వహించాలని తీర్మానించారు. ఈ నెలాఖరులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఆ సభకు అంతరాయం కలగకుండా చలో కామారెడ్డి సభ నిర్వహించాలని నిర్ణయించారు. కాగా, కేటీఆర్ సోమవారం సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని కోస్గిలో రైతుల సభలో పాల్గొననున్నారు. కులగణన నివేదిక ఒక చిత్తు కాగితం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పుల తడక అని కేటీఆర్ విమర్శించారు. పార్టీ బీసీ నేతల సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రీసర్వే చేసి కులాలవారీగా కచ్చితమైన లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీల జనాభాను 5.5 శాతం తక్కువగా చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మోసం చేసిందని విమర్శించారు. కులగణన నివేదిక చిత్తుకాగితంతో సమానమని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు, ఇండ్ల కేటాయింపులు, ఆరు గ్యారంటీల్లో తమ వాటా తగ్గుతుందేమోనని ఎంబీసీలు, బీసీలు భయపడుతున్నారని కేటీఆర్ అన్నారు. ‘కాంగ్రెస్ ఎమ్మెల్సీయే కులగణన సర్వేను చిత్తు కాగితంతో సమానమని తగులబెట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు తీసుకొస్తారని భావించాం. బిల్లు తేలేదు కానీ.. సొల్లు మాత్రం చెప్పారు’ అని కేటీఆర్ మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేసింది బీఆర్ఎస్ మాత్రమే రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేసింది బీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 50 శాతానికి పైగా టికెట్లు ఇచ్చామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో 34 సీట్లు బీసీలకు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, 19 సీట్లు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై సోమవారం నుంచి నియోజకవర్గాలు, మండలాలు, జిల్లా కేంద్రాల వారీగా ప్రజలను చైతన్యం చేస్తామని ప్రకటించారు. బీసీలకు న్యాయం చేయడానికి రాజ్యాంగ సవరణ ఎందుకు చేయటం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు. -
గ్యారెంటీలలోనే కాంగ్రెస్ సమాధి: హరీశ్రావు
సాక్షి,సిద్దిపేట:సన్నవడ్లు అమ్ముకున్న రైతులకు రెండు నెలలైనా బోనస్ డబ్బులు ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.ఈ విషయమై హరీశ్రావు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ఆదివారం(ఫిబ్రవరి 9) బహిరంగ లేఖ రాశారు. ‘అన్ని పంటలకు బోనస్ అన్న మాటలను కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ చేసింది. రూ2 లక్షల రుణమాఫీ,రైతు భరోసాను మోసం చేశారు.వరంగల్ రైతు డిక్లరేషన్ను తుంగులో తొక్కారు.రుణమాఫీ,రైతు భరోసా,వడ్ల బోనస్ పైసలు కూడా ఇవ్వలేదు. ఇక రైతులు రెండో పంట ఎలా వేస్తారు.బోనస్ ఇంకా రూ. 432 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. మాకు సంస్కారం ఉంది మీకు సంస్కారం లేదు.ఉత్తమ్కుమార్రెడ్డి మాటలు,ఉత్తర మాటలు అయ్యాయి.చేతకాని మాటలు ఎందుకు మాట్లాడతావు. పొద్దున లేస్తే బీఆర్ఎస్ పైన ఎందుకు మాట్లాడతావ్. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పాలాభిషేకం చేయాలి.రైతు కందులు పండిస్తే మూడు క్వింటాల్లే కొంటున్నారు. కంది రైతుల మీద ఎందుకు పగ మీకు.క్రాప్ బుకింగ్లో మిస్సయిన రైతులకు అనుమతి ఇవ్వండి.రేవంత్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావుని డిమాండ్ చేస్తున్న రైతు పండించిన మొత్తం కందులను కొనుగోలు చేయడానికి ఆదేశాలు ఇవ్వాలి.విదేశాల నుంచి నూనెలను దిగుమతి చేసుకోవడం వలన విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోతుంది. పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు.కాంగ్రెస్ కోతల ప్రభుత్వం. ఓ రైతుకు 31 గంటలకు భూమి ఉంటే రూ. 1650 మాత్రమే రైతు బంధు పడతదా.సీఎం ఇచ్చిన రూ 250 కోట్ల రూపాయల చెక్కు ఎందుకు పడడం లేదు.ఉత్తుత్తి చెక్కు ఇచ్చినవా.కొత్త పాస్ బుక్ వచ్చిన వాళ్లకు రైతుబంధు పడడం లేదు.ప్రభుత్వం మోసం చేసిందని అన్ని గ్రామాలలో మాట్లాడుకుంటున్నారు.ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలు చూస్తున్నారు.తాను తవ్వుకున్న గ్యారంటీల సమాధిలోనే కాంగ్రెస్ సమాధి అవుతుంది.ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ను గాలిలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీది జగమంతా పాలన,కాంగ్రెస్ పార్టీది సగమంత పాలన.మాది అసలు పాలన మీది కొసరు పాలన.సంతృప్తి, సంక్షేమం బిఆర్ఎస్ పాలన,సంక్షోభం,అసంతృప్తి అసహనం కాంగ్రెస్ విధానం’అని హరీశ్రావు మండిపడ్డారు. -
‘కులగణన నివేదిక చిత్తు పేపర్’
సాక్షి,తెలంగాణ భవన్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే నివేదిక ఓ చిత్తు పేపర్తో సమానమాని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బీసీ నేతలతో కేటీఆర్ బేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.‘కులగణన నివేదికపై బీసీ బిడ్డలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కులగణన తప్పుల తడక,కులగణన నివేదిక చిత్తు పేపర్.కాంగ్రెస్ దుర్మార్గపు వైఖరిని బీసీ బిడ్డలు ఒప్పుకోవడం లేదు. బలహీన వర్గాలను చాలా స్వల్పంగా చూపించారు. కులగణన సర్వే శాస్త్రీయంగా చేయాలి. కులగణన నివేదికపై బీసీ బిడ్డలు ఆందోళన చెందుతున్నారు. దున్నపోతుమీద వాన పడినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదు. బీసీలకు లక్షకోట్ల బడ్జెట్ అన్నారు.. ఏమైందీ?15 నెలల్లో 15పైసలు కూడా బీసీలకు కేటాయించలేదు. కులగణనపై రీసర్వేకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించాలి. కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం సాకులు చెప్పొద్దు. బీసీ డిక్లరేషన్లో 42శాతం రిజర్వేషన్ అన్నారు ఏమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం సొల్లు మాటలు చెప్పడం మానాలి. పార్టీ పరంగా 42 శాతం బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ అంటోంది.కేసీఆర్ ఎప్పుడో బీసీలకు స్థానిక ఎన్నికల్లో 50 శాతానికి పైగా టిక్కెట్లు ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటుకు రెండు టిక్కెట్లు ఇస్తామని చెప్పి కేవలం 19 మాత్రమే ఇచ్చింది. అందులో పాతబస్తీలో 5 సీట్లు ఇచ్చారు.రాహుల్ గాంధీ,మోదీ కూర్చుని చాయ్ తాగితే రాజ్యాంగ సవరణ అవుతుంది.రేపటి నుండి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో బీసీల భావజాల వ్యాప్తిలో భాగంగా కార్యక్రమాలు ఉంటాయి. కేసీఆర్,కేటీఆర్ సర్వేలో పాల్గొనలేదని రేవంత్ రెడ్డి అంటున్నారు.కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి.మాపై నెపం నెట్టి బీసీలకు అన్యాయం చేయొద్దు’ అని కేటీఆర్ హెచ్చరించారు. -
60 లక్షల మందిని ఏం చేశారు?: బండి సంజయ్
సాక్షి,నల్గొండజిల్లా:తెలంగాణలో జరిగే మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పారు. ఆదివారం(ఫిబ్రవరి9) నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలకు ఎమ్మెల్సీ అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు.‘దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులే కరువైంది తెలంగాణలో మాత్రమే.కాంగ్రెస్,బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరింది. కాళేశ్వరం కేసులో కేసీఆర్,హరీష్ రావు జైలుకి పోతారని అన్నారు ఏమైంది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు,ఫాంహౌస్ కేసులో జైలు అన్నారు ఏమైంది.ఈ ఫార్ములా కేసులో సుప్రీం కోర్టు చెప్పినా ఎందుకు విచారణ ఆగింది.నిరుద్యోగ భృతి నాలుగువేలు ఏమైంది. ఒక్కో నిరుద్యోగికి కాంగ్రెస్ ప్రభుత్వం 56 వేల అప్పు ఉంది. ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏమైంది. తెలంగాణలో విద్యాశాఖ మంత్రే లేడు.స్కూళ్లలో చాక్పీసులు కొనుగోలుకు నిధులు లేవు. విద్యా వ్యవస్థ అంతా అర్బన్ నక్సల్స్ చేతిలోకి వెళ్లింది. మోదీ ప్రభుత్వం అంబేద్కర్,భగత్ సింగ్,ఆజాద్ వీర్ సావర్కార్ను తయారు చేయాలని అనుకుంటోంది.రేవంత్ సర్కార్ చండ్ర పుల్లారెడ్డి లాంటి నక్సలైట్లను తయారు చేయాలనుకుంటోంది. 317 జీవోపై కొట్లాడి జైలుకు పోయింది మేమే. కులగణన పేరుతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. కేసీఆర్ సకల జనులసర్వే చేయించి రిపోర్ట్ను సంకలో పెట్టుకున్నాడు.కేసీఆర్ సర్వేలో బీసీల శాతం 51 ఉంటే రేవంత్ సర్వేలో 46 శాతం వచ్చింది.కుల గణనే ఒక బోగస్.తెలంగాణలో ఓటర్లు 3.34 కోట్లు ఉంటే జనాభా 3.7 కోట్లు ఉండటం ఏంటి. తెలంగాణలో 4.3 కోట్లు జనాభా ఉండాల్సి ఉంది.మిగతా 60 లక్షల మందిని కాంగ్రెస్ హత్య చేసిందా? ముస్లింలను బీసీల్లో ఎలా కలుపుతారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో ముప్పై మంది బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ముస్లీంలు గెలిచారు.బీసీ సంఘాలు ఎటుపోయాయి. తెలంగాణలో హిందువులు అడుక్కోవాలా. రేవంత్ రెడ్డి గ్యాంగ్,ఓవైసీ కుటుంబం హిందువులను రాచిరంపాన పెడుతున్నారు’ అని బండి సంజయ్ ఫైరయ్యారు. -
ఢిల్లీలో కాంగ్రెస్ కు మిగిలింది గాడిదగుడ్డు: బండి సంజయ్
-
Hyderabad: మిత్రులెవరో.. ప్రత్యర్థులెవరో?
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక రసవత్తరంగా మారనుంది. ఏ పార్టీ ఎవరికి మద్దతివ్వనుంది? ఏ పార్టీ ఎవరితో విభేదించనుంది? వంటి అంశాలు ఆసక్తికరంగా మారాయి. అందుకు కారణం ఇటీవలి కాలంలో రాజకీయ పారీ్టల్లో చేటుచేసుకున్న పరిణామాలు. ప్రస్తుత పాలకమండలి ఏర్పాటైనప్పటి నుంచి జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు బీఆర్ఎస్, ఎంఐఎం పరస్పర అవగాహనతో కలిసి పోటీ చేయడంతో ఎన్నికలు పోలింగ్ దాకా వెళ్లకుండా ఏకగ్రీవంగానే ముగిశాయి. రెండు పార్టీలకు పాలకమండలిలో ఉన్న కార్పొరేటర్ల సీట్లను పరిగణనలోకి తీసుకొని స్టాండింగ్ కమిటీలోని మొత్తం 15 స్థానాలకుగాను బీఆర్ఎస్ 8, ఎంఐఎం 7 స్థానాలకు పోటీ చేస్తూ ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చాయి. పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు స్టాండింగ్ కమిటీ సభ్యులవుతారు. పాలకమండలి ఏర్పడినప్పటి నుంచి జరిగిన అన్ని స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు బీఆర్ఎస్– ఎంఐఎం పరస్పర సహకారంతో పని చేసినందున ఆ రెండు పార్టీల వారే స్టాండింగ్ కమిటీ సభ్యులవుతూ వచ్చారు. ఈ నెల 25న జరగాల్సిన స్టాండింగ్ కమిటీకి సైతం ఏ రెండు పార్టీలైతే పరస్పర అవగాహనతో పని చేస్తాయో ఆ పారీ్టల వారే స్టాండింగ్ కమిటీ సభ్యులవుతారు. ఎంఐఎం మద్దతు ఎవరికి? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దతిస్తూ వస్తున్న ఎంఐఎం ప్రస్తుతం కాంగ్రెస్తో జత కట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎంఐఎం–కాంగ్రెస్ల మధ్య నెలకొన్న అనుబంధం తెలిసిందే. ఆ రెండు పారీ్టలే పరస్పర సహకారంతో పోటీ చేస్తాయనే అభిప్రాయాలే రాజకీయ వర్గాల్లోనూ ఉన్నాయి. అదే జరిగితే గతంలో బీఆర్ఎస్ పొందిన స్టాండింగ్ కమిటీ స్థానాలు ఈసారి కాంగ్రెస్కు దక్కుతాయి. లేదా బలాల దృష్ట్యా కాంగ్రెస్ కంటే ఎంఐఎంకు ఎక్కువ మంది సభ్యులున్నందున బలాల దామాషాకు అనుగుణంగా రెండు పారీ్టల వారే స్టాండింగ్ కమిటీ సభ్యులవుతారు. పొత్తు లేకుండా పోటీ జరిగితే? అలా కాకుండా పొత్తు లేకుండా వేటికవే విడివిడిగా పోటీచేస్తే ఎక్కువ సభ్యులున్న పారీ్టకి ఎక్కువ సీట్లొచ్చే అవకాశం ఉన్నా, సీక్రెట్ బ్యాలెట్ కావడంతో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉండటంతో ఏ పారీ్టకి ఎన్ని సీట్లొస్తాయో చెప్పే పరిస్థితి లేదు. పార్టీలతో పాటు, పార్టీల కతీతంగా కార్పొరేటర్ల మధ్య ఉన్న అవినాభావ సంబంధాలు, మద్దతు తదితరమైనవి ప్రముఖ పాత్ర పోషించనున్నాయి. బల్దియాలో ఇప్పటి వరకు ఎంఐఎం లేకుండా.. ఏ రెండు పార్టీలు కూడా పొత్తులు పెట్టుకున్న చరిత్ర లేదు. ఎంఐఎంయేతర పారీ్టల మధ్య పొత్తు ఉండదనే అభిప్రాయాలే ఉన్నా, రాజకీయ అవసరాల దృష్ట్యా ఏ పార్టీ దేనితోనైనా లోపాయికారీ మద్దతు పొందవచ్చనే అభిప్రాయాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన జనరల్బాడీ సమావేశం ఇందుకు ఉదాహరణ. సభ జరగడానికి కొన్ని రోజుల ముందు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్.. ‘మా పార్టీ బలమే ఎక్కువ. మా వాళ్లకు మాట్లాడేందుకు అవకాశమివ్వకుండా సభ జరపగలరా’ అన్నారు. కానీ.. కారణమేదైనా సభలో బీఆర్ఎస్ మాత్రమే లేకుండా బడ్జెట్, సాధారణ సమావేశాలు జరగడం తెలిసిందే. బీఆర్ఎస్కు ఎక్కువ సీట్లున్నా.. బీఆర్ఎస్కు అందరి కంటే ఎక్కువ సీట్లున్నా పారీ్టల మధ్య పరస్పర సహకారం లేకుంటేనే దానికి ఉపకరిస్తుంది. లేని పక్షంలో ఏ రెండు పారీ్టలైతే జత కడతాయో ఆ రెండు పారీ్టల సభ్యులే స్టాండింగ్ కమిటీ సభ్యులవుతారు. ఏం జరగనుందన్నది నామినేషన్లు ముగిసే లోగా స్పష్టత రానుంది. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవనుంది. పోటీ జరుగుతుందా, ఏకగ్రీవమవుతుందా? అన్నది ఉపసంహరణలు ముగిసే 21వ తేదీన వెల్లడి కానుంది. బీజేపీ కార్పొరేటర్లతో నేడు కిషన్ రెడ్డి భేటీ జీహెచ్ఎంసీ పరిధిలో నెలకొన్న సమస్యలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేటర్ల ప్రచారం, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆదివారం ఉదయం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లతో సమావేశం కానున్నారు. అనంతరం ఢిల్లీ విజయోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొంటారు.అవే కీలకం మొత్తం 150 మంది కార్పొరేటర్లకుగాను ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇద్దరి మరణంతో ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లున్నారు. వీరే స్టాండింగ్ కమిటీ సభ్యత్వానికి పోటీ చేసేందుకు, ఓట్లు వేసేందుకూ అర్హులు. ఈ బలం దృష్ట్యా బీఆర్ఎస్కు గెలుపు అవకాశాలెక్కువ. తర్వాత ఎంఐఎంకు అయినప్పటికీ.. అంతర్గతంగానైనా, బహిరంగంగానైనా ఎత్తులు, పొత్తులు, జిత్తులు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. -
పార్టీలు మారి.. పరాజితులయ్యారు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు కండువాలు మార్చుకుని బరిలోకి దిగిన వారిని ప్రజలు తిరస్కరించారు. పార్టీ మారి పోటీ చేసిన మొత్తం 25 మంది నాయకుల్లో కేవలం 8 మందిని మాత్రమే ఓటర్లు గెలిపించారు. మిగతా 15 మందికి పరాజయం తప్పలేదు. ఈ ఎన్నికల్లో దాదాపు ప్రతి పార్టీ బయటి పార్టీల నుంచి వచ్చిన వారిని రంగంలోకి దించాయి.ఇతర పార్టీల తిరుగుబాటుదార్లకు ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధికంగా 11 మందికి, బీజేపీ ఏడుగురికి, కాంగ్రెస్ ఐదుగురికి టిక్కెట్లిచ్చాయి. అయితే, ఆప్ తరఫున పోటీ చేసిన 11 మందిలో నలుగురు మాత్రమే గెలవగా.. ఏడుగురు ఓడిపోయారు. బీజేపీ నుంచి పోటీ చేసిన ఏడుగురిలో నలుగురు విజయం సాధించగా, ముగ్గురు ఓటమి చెందారు. అదే సమయంలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరి పోటీకి దిగిన ఐదుగురిలో ఒక్కరు కూడా గెలవలేకపోయారు.మిల్కిపూర్లో బీజేపీ ఘన విజయంయూపీలోని అయోధ్య జిల్లాలో మిల్కి పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్ని కలో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో, ఈ జిల్లాలోని అన్ని స్థానాలూ బీజేపీ వశమైన ట్లయింది. సమాజ్వాదీ పార్టీకి చెందిన మిల్కిపూర్ (ఎస్సీ) ఎమ్మెల్యే అవధేశ్ ప్రసాద్ 2024 లోక్సభ ఎన్నికల్లో ఫైజాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సీటును తిరిగి నిలబెట్టుకోవాలని అవధేశ్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్ను బరిలోకి దించింది.అయితే, బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాశ్వాన్ 61,710 ఓట్ల మెజారిటీతో అజిత్పై ఘన విజయం సాధించారు. అదేవిధంగా, తమిళనాడులోని ఈరోడ్(ఈస్ట్)స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార డీఎంకే విజయం సాధించింది. డీఎంకే అభ్యర్థి చందిర కుమార్, సమీప ప్రత్యర్థి నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే)కు చెందిన ఎంకే సీతాలక్ష్మిపై 91 వేల పైచిలుకు ఓట్లతో తిరుగులేని గెలుపు సాధించారు. ఈరోడ్(ఈస్ట్) నుంచి ఎన్నికైన కాంగ్రెస్కు చెందిన ఈవీకేఎస్ ఇళంగోవన్ మృతితో ఈ ఉప ఎన్నిక జరిగింది. -
అన్ని సీట్లూ గెలవాలి: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం మూడు (రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్) సీట్లనూ గెలుచుకుని సత్తా చాటాలని బీజేపీ తీర్మానించింది. ఈ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహం, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకోసం వెంటనే రంగంలో దిగాలని నిర్ణయించింది. కేంద్రమంత్రులు, ఎంపీస్థాయి నేతలు మొదలుకుని కిందిస్థాయి కార్యకర్త వరకు పూర్తిగా ఈ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించి, అనుకున్న ఫలితాలను సాధించాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ, రేవంత్రెడ్డి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న మోసాలను ప్రజలకు వివరించేలా ప్రచారాన్ని ఉధృతం చేయాలని సూచించింది. శనివారం ఓ స్టార్ హోటల్లో తొలుత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు, ఆ తర్వాత రాష్ట్రపదాధికారులతో జరిగిన కీలక సమావేశాల్లో.. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా కరీంనగర్– నిజామాబాద్– మెదక్– ఆదిలాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య, ఇదే నియోజకవర్గం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సి.అంజిరెడ్డి, నల్లగొండ– ఖమ్మం– వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తంరెడ్డిలను రాష్ట్ర నాయకత్వం పరిచయం చేసింది. ఈ సమావేశాలకు అధ్యక్షత వహించిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ‘రానున్న రోజుల్లో కర్ణాటక, తెలంగాణలో స్వతంత్రంగా అధికారంలోకి వస్తాం. కేరళ, తమిళనాడులో కూడా బీజేపీ బలం పెరిగింది. తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు, యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల పట్ల వివక్షతో వ్యవహరిస్తోంది’అని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగులు, మేధావులు, నిరుద్యోగులు, విద్యార్థులు.. ప్రతిఒక్కరూ చైతన్యంతో ఆలోచించి ప్రజల పక్షాన నిలిచిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు డా.కె.లక్ష్మణ్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఈటల రాజేందర్, ఎం.రఘునందన్రావు, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటపల్లి వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్, ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు ఎన్.రామచంద్రరావు, పొంగులేటి సుధాకరరెడ్డి, పారీ్టనేతలు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, డా.కాసం వెంకటేశ్వర్లు, డా.ప్రకాశ్రెడ్డి, ఎస్.కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మూడోసారీ ‘సున్నా’!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పూర్వ వైభవాన్ని సాధించాలని ఆశపడ్డ కాంగ్రెస్ పార్టీకి వరుసగా మూడోసారి కూడా భంగపాటే ఎదురైంది. అధికార పీఠాన్ని అధిరోహించే శక్తి లేకున్నా కనీసం తమ అస్థిత్వాన్ని నిలుపుకోవాలన్న ఆశలపై ఢిల్లీ ఓటర్లు పూర్తిగా నీళ్లు చల్లారు. హ్యాట్రిక్ విజయాలతో 1998 నుంచి వరుసగా 15 ఏళ్ల పాటు ఢిల్లీని పరిపాలించిన కాంగ్రెస్ ఆ తర్వాత హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. వరుసగా మూడు సార్లు ఓడిపోవడం కాంగ్రెస్ శ్రేణులకు తీవ్ర నిరాశకు గురిచేసింది. గత ఎన్నికల కంటే కొంత మెరుగైన స్థాయిలో ఓట్లు సాధించినప్పటికీ సీట్ల ఖాతా తెరవలేదు. దెబ్బకొట్టిన ఒంటరి పోరు ఢిల్లీలో 2015, 2020 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా నెగ్గని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో కనీసంగా 10 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగింది. ఇందుకు అనుగుణంగా ఎన్నో హామీలు ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. అయితే అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు లేకపోవడం దెబ్బకొట్టింది. అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు ఆప్ నిరాకరించడంతో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది. ప్రధాన పోటీ బీజేపీ, ఆప్ల మధ్యే కొనసాగుతుండటంతో కాంగ్రెస్ను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. 2008లో 48 శాతం ఓట్లతో 43 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ 2013లో 24.70 శాతం సీట్లతో 7 సీట్లకు పరిమితమైంది. 2015లో కాంగ్రెస్కు 9.7 శాతం, 2020లో 4.3 శాతం ఓట్లు వచ్చినా ఒక్క సీటు కూడా గెలువలేదు. ఇక ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ దాదాపు 6.38 శాతం ఓట్లను రాబట్టుకుంది. 70 శాతానికి పైగా అభ్యర్థులు డిపాజిట్లు సైతం కోల్పోయారు. ఆప్తో పొత్తుపెట్టుకొని పోటీ చేస్తే కనీసం ఖాతా తెరిచే పరిస్థితి అయినా ఉండేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పనిచేయని హామీలు ఢిల్లీ అసెంబ్లీలో ఎలాగైనా పాగా వేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఓటర్లపై అనేక హామీలు గుప్పించింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందే ఐదు గ్యారంటీలను ప్రకటించింది. ‘ప్యారీ దీదీ యోజన’ కింద మహిళలకు నెలకు రూ.2,500, రూ.500లకే ఎల్పీజీ సిలిండర్, కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, పింఛను రూ.2,500 నుంచి రూ.5,000కు పెంపు, నిరుద్యోగ యువతకు ఏడాదిపాటు నెలకు రూ.8,500 ఆర్థిక సహాయం వంటి హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. తన మేనిఫెస్టోలో సైతం కులగణనæ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, వితంతువుల కుమార్తెల పెళ్లికి రూ.1.10 లక్షల ఆర్థిక సాయం, ఢిల్లీవ్యాప్తంగా 100 ఇందిరా క్యాంటీన్ల ఏర్పాటు వంటి హామీలతో ముందుకెళ్లినా ఆ పార్టీని జనం పట్టించుకోలేదు. వీటికితోడు యమునా నదీ కాలుష్యాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకున్నా ఉపయోగపడలేదు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాం«దీ, ప్రియాంక గాం«దీ, మల్లికార్జున ఖర్గే తదితరులు ప్రచారం చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కాంగ్రెస్ కీలక నేతలైన సందీప్ దీక్షిత్ న్యూఢిల్లీ నియోజకవర్గంలో 25,520 ఓట్ల తేడాతో ఓటమి చెందగా, కల్కాజీ నియోజకవర్గంలో అల్కా లాంబ 47,691 ఓట్ల తేడాతో, నాంగ్లోయి నుంచి రోహిత్ చౌదరి 36,401 ఓట్ల తేడాతో ఓడిపోయారు. -
ఢిల్లీ కోట చిక్కింది!
న్యూఢిల్లీ: 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హస్తిన అసెంబ్లీపై కాషాయ జెండా ఎగిరింది. దేశ రాజధానిలో పదేళ్లుగా కంట్లో నలుసుగా, కొరకరాని కొయ్యగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ ఎట్టకేలకు చిత్తు చేసింది. ఆ పార్టీ చేతిలో రెండు వరుస పరాభవాల అనంతరం ముచ్చటగా మూడో ప్రయత్నంలో ఘనవిజయం సాధించింది. సరిగ్గా పోలింగ్కు ముందు మోదీ సర్కారు గురిచూసి సంధించిన ఆదాయపన్ను మినహాయింపు పరిమితి పెంపు అస్త్రం బీజేపీ పాలిట రామబాణంలా పని చేసింది. కేజ్రీవాల్పై అవినీతి మరకలు, పదేళ్ల పాలన నేపథ్యంలో ఆప్పై ప్రభుత్వ వ్యతిరేకత అందుకు తోడయ్యాయి. దాంతో శనివారం వెల్లడైన ఫలితాల్లో బీజేపీ ఏకంగా మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను 48 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా ఆప్ 22 సీట్లకు పరిమితమైంది. మెజారిటీ మార్కుకు 14 స్థానాల దూరంలో నిలిచి తన పురిటిగడ్డ అయిన ఢిల్లీలో తొలిసారి ఓటమిని రుచిచూసింది. కాంగ్రెస్తో పొత్తు వద్దనుకోవడం ఆప్ భాగ్యరేఖలనే పూర్తిగా తలకిందులు చేసింది. ఎందుకంటే 14 అసెంబ్లీ స్థానాల్లో ఆప్పై బీజేపీ అభ్యర్థులు సాధించిన మెజారిటీ కంటే కాంగ్రెస్ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు రావడం విశేషం. స్వయానా ఆప్ సారథి కేజ్రీవాల్ కూడా న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో పరాజయం పాలయ్యారు. ఆయన పరాభవానికీ కాంగ్రెసే కారణంగా నిలిచింది. అక్కడ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ మెజారిటీ కంటే కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్కు ఎక్కువ ఓట్లొచ్చాయి. అలా కాంగ్రెస్తో కటీఫ్ నిర్ణయం కేజ్రీవాల్తో పాటు మొత్తంగా ఆప్ పుట్టినే ముంచేసింది. బీజేపీ హవాలో ఆప్ నేత, సీఎం ఆతిషి కనాకష్టంగా గట్టెక్కగా ముగ్గురు మినహా ఆప్ మంత్రులంతా ఓటమి బాట పట్టారు. ఆప్ దిగ్గజ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా ఓటమి చవిచూశారు. అయితే ఆప్కు కోలుకోలేని షాకివ్వడం మినహా కాంగ్రెస్ కూడా బావుకున్నదేమీ లేదు. ఢిల్లీలో వరుసగా మూడోసారి కూడా ఖాతాయే తెరవలేక చెత్త హ్యాట్రిక్ను మూటగట్టుకుంది. ఆ పార్టీ అభ్యర్థులు చాలాచోట్ల ఏకంగా డిపాజిట్లే కోల్పోయారు! బీజేపీకి 45.56 శాతం ఓట్లు రాగా ఆప్కు 43.57 శాతం వచ్చాయి. కాంగ్రెస్ 6.34 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. 2020 ఎన్నికల్లో ఆప్ 53.57 శాతం ఓట్లతో 62 సీట్లు కైవసం చేసుకోగా బీజేపీ 38.51 శాతం ఓట్లతో కేవలం 8 సీట్లతో సరిపెట్టుకుంది. 2015లో ఆప్ ఏకంగా 67, బీజేపీకి కేవలం 3 సీట్లొచ్చాయి. 2013లో ఆప్ తన తొలి ఎన్నికల్లోనే ఢిల్లీ అసెంబ్లీలో 28 సీట్లు నెగ్గి సత్తా చాటింది. బీజేపీ ఢిల్లీలో చివరగా 1993 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. కానీ ఐదేళ్లలోనే ముగ్గురు సీఎంలను మార్చి అప్రతిష్ట మూటగట్టుకుంది. దాంతో 1998లో కాంగ్రెస్ చేతిలో పరాజయం పాలైంది. అప్పట్నుంచి 2013 దాకా 15 ఏళ్లపాటు షీలా దీక్షిత్ సారథ్యంలో హస్తినలో సాగిన కాంగ్రెస్ హవాకు ఆప్ ఆవిర్భావంతో తెర పడింది. ఆద్యంతం బీజేపీదే పైచేయి అటు బీజేపీ, ఇటు ఆప్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు ఈసారి ఆద్యంతం హోరాహోరీగా సాగింది. ఫిబ్రవరి 5న పోలింగ్ జరిగింది. శనివారం ఫలితాలు వెల్లడయ్యాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. కాసేపటికే ట్రెండ్స్ వెలువడ్డాయి. వాటిలో మొదటినుంచీ బీజేపీ హవాయే కొనసాగుతూ వచ్చింది. అడపాదడపా ఒకట్రెండు రౌండ్లలో మినహాయించి కేజ్రీవాల్ మొదటినుంచీ వెనుకంజలోనే కొనసాగుతూ వచ్చారు. మధ్యలో రెండు పార్టీల మధ్య అంతరం తగ్గినట్టు కన్పించినా చూస్తుండగానే బీజేపీ దూసుకెళ్లింది. దాంతో ఆ పార్టీ కార్యాలయంలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. నేతలు, కార్యకర్తలు, అభిమానులు బాణసంచా పేలుళ్లు, వాయిద్యాల హోరుతో హోరెత్తించారు. ఆప్, కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాలు బోసిపోయి కన్పించాయి. ఇటీవలే హరియాణాతో పాటు కీలకమైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయంతో దూకుడు మీదున్న బీజేపీ అదే ఊపులో ఇప్పుడు ఢిల్లీనీ చేజిక్కించుకుంది. దాంతో దేశవ్యాప్తంగా కాషాయశ్రేణులు సంబరాల్లో మునిగిపోగా ఆప్, కాంగ్రెస్తో పాటు విపక్షాలన్నీ డీలాపడ్డాయి. తాజా ఫలితాలతో విపక్ష ఇండియా కూటమి ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీ విజయాన్ని చరిత్రాత్మకంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివరి్ణంచగా ప్రజాతీర్పును అంగీకరిస్తున్నామని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. గెలుపోటములతో నిమిత్తం లేకుండా ప్రజల తరఫున తమ పోరాటం కొనసాగుతుందని ఆతిషి పేర్కొన్నారు. ఈ ఎన్నికలు ఆప్కే అగి్నపరీక్షగా నిలిచాయని తప్ప తమకు కాదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్గాం«దీ, ప్రియాంకగాంధీ వద్రా చెప్పుకొచ్చారు. పర్వేశే సీఎం! బీజేపీ ఘనవిజయం నేపథ్యంలో ఢిల్లీకి కాబోయే సీఎం ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కేజ్రీవాల్ను మట్టికరిపించిన జెయింట్ కిల్లర్గా మారిన పర్వేశ్సింగ్ పేరే ఈ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన తండ్రి సాహెబ్సింగ్ వర్మ కూడా 1993–98 మధ్య ఢిల్లీ సీఎంగా చేయడం విశేషం. సీఎం ఎవరన్నది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని పర్వేశ్తో పాటు ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ కూడా చెప్పుకొచ్చారు. -
కాంగ్రెస్ దీన స్థితి చూస్తే జాలేస్తోంది: కిషన్రెడ్డి
సాక్షి,హైదరాబాద్:పన్నెండేళ్లుగా ఢిల్లీకి పట్టిన గ్రహణం వీడిందని,రాజకీయాల్లో అవినీతికి కేరాఫ్ అడ్రస్గా కేజ్రివాల్ మారారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కిషన్రెడ్డి శనివారం(ఫిబ్రవరి8) మీడియాతో మాట్లాడారు.‘ప్రజల తీర్పుతో కేజ్రీవాల్ నెత్తికి ఎక్కిన అహంకారం దిగింది. ప్రజలు ఒక్కసారి డిసైడ్ అయితే రాహుల్,కేసిఆర్,కేజ్రివాల్ ఎవరైనా ఓటమి చెందక తప్పదు. ఢిల్లీలో కాంగ్రెస్ దీన స్థితి చూసి జాలేస్తోంది. రాహుల్ నాయకత్వం చేపట్టాక వారికి వచ్చిన ఓటములను కంప్యూటర్ ద్వారా లెక్కించడమే సాధ్యమవుతుంది. రాహుల్ డైమండ్ డకౌట్ అయ్యారు. ఢిల్లీలో కాంగ్రెస్ డబుల్ హ్యాట్రిక్,డబుల్ డక్ కొట్టింది. ఢిల్లీ తీర్పుతో కేజ్రీవాల్ లిక్కర్ స్కాం నిందితుడని అక్కడి ప్రజలు తీర్పు ఇచ్చారు. ఢిల్లీలో కాంగ్రెస్కు గుండు సున్నా వచ్చింది.కాంగ్రెస్ అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే అధికారం.ఆప్ ఓటమిలో ప్రధాన పాత్ర లిక్కర్ స్కామ్దే.తెలంగాణలో రేవంత్రెడ్డి ఎలా అధికారంలోకి వచ్చారో కేటీఆర్ చెప్పాలి.అన్న హజారే ఉద్యమంలో అరవింద్ కేజ్రివాల్ కలుపు మొక్క’అని కిషన్రెడ్డి విమర్శించారు. -
సీఎం రేవంత్ రెడ్డి కి మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ
-
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అగ్రనేతల ఘోర పరాజయం
-
ఢిల్లీలో కాంగ్రెస్ జీరో
-
ఢిల్లీ రిజల్ట్ పై కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు
-
రాహుల్ కంగ్రాట్స్.. బీజేపీని గెలిపించారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఎన్నికల ఫలితాల్లో భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కంగ్రాట్స్.. మరోసారి బీజేపీని గెలిపించారు అంటూ వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా స్పందించారు. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘కంగ్రాట్స్ రాహుల్ గాంధీ అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ మరోసారి బీజేపీని గెలిపించారని పేర్కొన్నారు. వెల్డన్ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో, కేటీఆర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.Congrats to Rahul Gandhi for winning the election for BJP, yet again!Well done 👏 https://t.co/79Xbdm7ktw— KTR (@KTRBRS) February 8, 2025ఇదిలా ఉండగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. మూడోసారి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఒక్క స్థానంలోనైనా ప్రభావం చూపించకలేకపోయింది. ఈ ఎన్నికల్లో గుండు సున్నా చుట్టేసింది. గత రెండు ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. -
బీజేపీ దెబ్బ.. కాంగ్రెస్ ‘ఖేల్’ ఖతం
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఢిల్లీలో బీజేపీ జెండా ఎగురబోతోంది. బీజేపీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్(36) దాటి దాదాపు 44 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. మరోవైపు.. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్కు ఢిల్లీలో మరోసారి భంగపాటే ఎదురైంది. ఈసారి కూడా ఎన్నికల ఫలితాలు పూర్తి నిరాశను నింపాయి. దేశ రాజధానిలో తిరిగి సత్తా చాటాలనుకున్న కాంగ్రెస్కు మరోసారి మొండి చేయి ఎదురైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి నుంచి ఆప్, బీజేపీ మధ్యే గట్టి పోటీ నడిచింది. దశాబ్దం పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్కు దేశ రాజధానిలో మరోసారి నిరాశే ఎదురవుతోంది. మొత్తం 70 స్థానాల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్.. ఒక్క చోట కూడా ప్రభావం చూపించలేకపోయింది. ఇక, 2015, 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో కూడా విజయం సాధించలేదు. సున్నా స్థానాలకే పరిమితమైంది. ఈసారి కూడా అలాంటి ఫలితమే పునరావృతమైంది. ఎన్నికల ఫలితాల్లో సందీప్ దీక్షిత్, అల్కా లాంబా, ఆరియా ఖాన్ వంటి నేతలు వెనకబడిపోయారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ పై న్యూఢిల్లీ నుంచి బరిలోకి దిగిన ఢిల్లీ మాజీ సీఎం శీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ సత్తా చాటలేకపోయాడు. న్యూఢిల్లీలో సందీప్ దీక్షిత్ మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. మరో కాంగ్రెస్ కీలక నేత అల్కా లంబా కూడా వెనబడిపోయారు. ఢిల్లీ సీఎం అతిశీకి పోటీగా కల్కాజీ నుంచి బరిలోకి అల్కా లాంబా ఎదురీదుతున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అభ్యర్థులు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. దీంతో దేశ రాజధానిలో తిరిగి సత్తా చాటాలనుకున్న కాంగ్రెస్కు మరోసారి మొండి చేయి ఎదురైంది. ఢిల్లీలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి కీలక నేతలు ప్రచారం హోరెత్తించిన కాంగ్రెస్కు కలిసి రాలేదు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ అసెంబ్లీకి 1952 నుంచి 2020 మధ్య ఎనిమిది సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ నాలుగు సార్లు విజయం సాధించింది. అలాంటి పార్టీ ఇప్పుడు కేవలం ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోతోంది. -
Ration Cards: మీసేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: రేషన్ కార్డులు లేని నిరుపేద కుటుంబాలకు శుభవార్త. మీ సేవ ఆన్లైన్ ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు ఆన్లైన్ ఎఫ్ఎస్సీ లాగిన్ పునరుద్ధరణకు పౌరసరఫరాల శాఖ అదేశాలు జారీ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2021 ఫిబ్రవరిలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వెబ్సైట్ లాగిన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు తాజాగా మీ సేవ ద్వారా దరఖాస్తుకు కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆఫ్లైన్లో 5.73 లక్షల దరఖాస్తులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం గ్రేటర్లో ప్రజాపాలన ద్వారా సుమారు 5.73 లక్షల కుటుంబాల నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేశారు. వీటిని పక్కన పెట్టగా..విమర్శలు రావడంతో తిరిగి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరణకు రంగం సిద్ధమైంది. కాగా గ్రేటర్లో రేషన్కా ర్డులు లేని పేద కుంటుంబాలు పది లక్షలకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది.