-
‘బ్రహ్మోస్’తో యుద్ధ నౌకలకు మరింత బలం
సాక్షి, విశాఖపట్నం: ఇండో పసిఫిక్ రీజియన్లో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న భారత రక్షణ దళం మరో కీలక అడుగు ముందుకువేసింది. సముద్ర జలాల్లోకి అడుగు పెట్టాలంటే దాయాది దేశాలకు భయం పుట్టేలా చేసేందుకు ఆయుధ సంపత్తిని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటున్న భారత నౌకాదళం... మిసైల్స్ మహారాజుగా ఎదిగే దిశగా దూసుకుపోతోంది. అత్యంత శక్తిమంతమైన, భారత నౌకాదళ ప్రధాన ఆయుధమైన బ్రహ్మోస్ క్షిపణులను ప్రతి యుద్ధ నౌకలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు భారత్, రష్యా జాయింట్ వెంచర్గా ఉన్న బ్రహ్మోస్ ఏరోస్పేస్ మన దేశంలోనే రూపొందిస్తున్న బ్రహ్మోస్ క్షిపణులను భారీగా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.19 వేల కోట్లతో 200 మిసైల్స్ కొనుగోలు చేసేలా బ్రహ్మోస్ ఏరోస్పేస్తో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల ఢిల్లీలో ఎంవోయూ చేసుకుంది. భారత యుద్ధ నౌకలన్నింటిలోనూ బ్రహ్మోస్లని ఏర్పాటు చేయడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బ్రహ్మోస్ కొనుగోలుకు ఫిలిప్పీన్స్ ఒప్పందం భారతదేశంలో తయారవుతున్న బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ జాబితాలో తొలి కొనుగోలుదారుగా ఫిలిప్పీ¯న్స్ నిలిచింది. దాదాపు 375 మిలియన్ డాలర్లతో మిసైల్స్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదర్చుకుంది. ఇటీవల చైనా నుంచి కవ్వింపు చర్యలు ఎదుర్కొంటున్న ఫిలిప్పీన్స్ ఇబ్బందులు పడుతోంది. వీటికి చెక్ పెట్టేందుకు బ్రహ్మోస్ను కీలక ఆయుధంగా మలచుకోవాలని ఫిలిప్పీన్స్ భావించి ఈ ఒప్పందం చేసుకుంది. బ్రహ్మోస్ మాత్రమే కాకుండా తేజస్ యుద్ధ విమానాలను సైతం కొనుగోలు చేసేందుకు ఫిలిప్పీన్స్ ఆసక్తి చూపిస్తోందని భారత నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి. భారత్తో భాగస్వామ్యం కోసం అన్ని దేశాల ఆసక్తి సాగర జలాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని కష్టాల్లో ఏ దేశం ఉన్నా సాయం చేసేందుకు ముందు వరుసలో ఉంటోంది భారత నౌకాదళం. ఇటీవల సముద్రపు దొంగల దాడుల్లో పలు దేశాల వర్తక నౌకలు చిక్కుకోవడంతో వాటిని కాపాడే బాధ్యతను ఇండియన్ నేవీ తీసుకుని సఫలీకృతమైంది. అందువల్ల భారత్తో భాగస్వామ్యం పెంచుకునేందుకు అన్ని దేశాలూ ఆసక్తి చూపిస్తున్నాయి. విశాఖ కేంద్రంగా జరుగుతున్న మిలాన్–2024లో రికార్డు స్థాయిలో ఏకంగా 51 దేశాలు పాల్గొనడమే ఇందుకు నిదర్శనం. మరోవైపు నౌకాదళంలో ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలిచేందుకు భారత్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. స్వావలంబన దిశగా భారత్ బ్రహ్మోస్ క్షిపణి ఎగు మతి వల్ల దేశ రక్షణ రంగంలో స్వావలంబన పెరుగుతుంది. భారతదేశంలోని ప్రతి నౌక, జలాంతర్గామి, విమానాలు, ఆయుధ వ్యవస్థ తయారీలో భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో దూసుకుపోతోంది. భారత నావికాదళం 2047 నాటికి పూర్తిగా స్వావలంబన సాధించేదిశగా అడుగులు వేస్తోంది. -
Russia Ukrain War: మళ్లీ తీవ్రమవుతున్న యుద్ధం !
కీవ్: ఉక్రెయిన్పై రష్యా తాజాగా మరోసారి బాంబుల వర్షం కురిపించింది. సోమవారం ఉదయం జరిగిన ఈ దాడులు నివాసాలతో పాటు పరిశ్రమల భవనాలు లక్ష్యంగా సాగాయి. ఈ దాడుల్లో పలువురు పౌరులు గాయపడ్డారు. ‘శత్రువు ప్రశాంత ప్రదేశాలను కూడా వదిలిపెట్టడం లేదు’అని దేశంలోని ప్రధాన పట్టణం కీవ్ మేయర్ తెలిపారు. ‘రష్యన్లు దేనిని టార్గెట్ చేస్తున్నారో తెలియడం లేదు. ఈ దాడుల్లో పారిశ్రామిక వాడలు లక్ష్యంగా మిసైళ్లు పేల్చారు’అని కార్కివ్ మేయర్ తెలిపారు. మరోవైపు సోమవారం ఉక్రెయిన్ జరిపిన దాడుల కారణంగా తమ తమ దేశంలోని బెల్గార్డ్ పట్టణంలోని 300 మంది స్థానికులను అక్కడి నుంచి వేరే ప్రదేశాలకు తరలించినట్లు రష్యాలోని బెల్గార్డ్ గవర్నర్ తెలిపారు. బెల్గార్డ్ పట్టణం ఉక్రెయిన్ సరిహద్దులోనే ఉండటం గమనార్హం. 2022 ఫిబ్రవరి 14న ప్రారంభమైన రెండవ దశ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అప్పటి నుంచి కొనసాగుతోంది. నిజానికి ఉక్రెయిన్ భూ భాగంపై వెళుతున్న మలేషియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని కూల్చివేసిన తర్వాత 2014లోనే రష్యా, ఉక్రెయిన్ల మధ్య తొలిదశ యుద్ధం ప్రారంభమైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక యూరప్ దేశంపై సుదీర్ఘ దాడి జరగడం ఇదే తొలిసారని పరిశీలకులు చెబుతున్నారు. ఇదీచదవండి..అమెరికాలో రోడ్డు ప్రమాదం ఖమ్మం యువకుడు మృతి -
Israel-Hamas War: నెల రోజులుగా నెత్తురోడుతోంది
ఖాన్ యూనిస్/టెల్ అవీవ్: ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలై నెల రోజులు దాటింది. గాజాపై భూతల దాడులను తాత్కాలికంగా నిలిపివేసిన ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులను కొనసాగిస్తోంది. బుధవారం గాజా అంతటా క్షిపణులు, రాకెట్లు ప్రయోగించింది. గాజా గత 24 గంటల వ్యవధిలో 214 మంది మరణించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నెల రోజులకుపైగా సాగుతున్న యుద్ధంలో హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం పైచేయి సాధిస్తోంది. గాజాలో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య 10,569కి చేరుకుంది. గాజాలో పెరిగిపోతున్న మరణాలపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజాస్ట్రిప్ మొత్తం చిన్నపిల్లల శ్మశాన వాటికగా మారుతోందని చెప్పారు. మృతుల సంఖ్య పెరుగుతోంది అంటే ఇజ్రాయెల్ సైన్యం తప్పుడు దారిలో పయనిస్తున్నట్లు అర్థమని స్పష్టం చేశారు. దాడులకు 4 గంటలు విరామం ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర గాజా నుంచి నిత్యం వేలాది మంది దక్షిణ గాజాకు వలస వెళ్తున్నారు. ఇప్పటిదాకా దాదాపు 70 శాతం మంది వెళ్లిపోయినట్లు అంచనా. గాజా ఆసుపత్రుల్లో గుండెను పిండేసే దృశ్యాలు కనిపిస్తున్నాయి. విద్యుత్ లేక ఆసుపత్రుల్లో ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఔషధాలు, వైద్య పరికరాలు లేక క్షతగాత్రులకు చికిత్స అందించడం లేదు. ఇంక్యుబేటర్లలో శిశువులు విగత జీవులుగా మారుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. చాలా హాస్పిటళ్లలో పెట్రోల్, డీజిల్ లేక జనరేటర్లు పనిచేయడంలేదు. ఇజ్రాయెల్ సైన్యం తొలిసారిగా బుధవారం గాజాపై దాడులను 4 గంటలపాటు నిలిపివేసింది. గాజాకు మానవతా సాయం చేరవేయడానికి వీలుగా దాడులు ఆపినట్లు వెల్లడించింది. హమాస్పై యుద్ధం ముగిశాక గాజా రక్షణ బాధ్యతను తాము స్వీరిస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని చేసిన ప్రకటనపై అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ స్పందించారు. గాజాను ఆక్రమించుకొనే ఆలోచన చేయొద్దని ఇజ్రాయెల్కు హితవు పలికారు. ఇజ్రాయెల్కు జీ7 దేశాల మద్దతు ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంపై జీ7 దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధులు జపాన్ రాజధాని టోక్యోలో చర్చలు జరిపారు. రెండు రోజులుగా జరుగుతున్న ఈ చర్చలు బుధవారం ముగిశాయి. ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్ల దాడిని వారు ఖండించారు. ఇజ్రాయెల్కు మద్దతు ప్రకటించారు. ఆత్మరక్షణ చేసుకొనే హక్కు ఇజ్రాయెల్కు ఉందని తేల్చిచెప్పారు. గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించానికి మార్గం సులభతరం చేయాలని, ఇందుకోసం హమాస్పై యుద్ధానికి కొంత విరామం ఇవ్వాలని జీ7 ప్రతినిధులు ఇజ్రాయెల్కు సూచించారు. కాల్పుల విరమణ పాటించాలని సూచించకపోవడం గమనార్హం. 50 వేల మందికి 4 టాయిలెట్లు గాజాలో నెలకొన్న భయానక పరిస్థితులను అమెరికా నర్సు ఎమిలీ చలాహన్ మీడియాతో పంచుకున్నారు. గాజాలో క్షతగాత్రులకు సేవలందించిన ఎమిలీ ఇటీవలే అమెరికా చేరుకున్నారు. 26 రోజుల తర్వాత ఈరోజే స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నానని తెలిపారు. గాజాలో 26 రోజుల్లో ఐదు చోట్లకు మారాల్సి వచి్చందన్నారు. ఒకచోట 35 వేల మంది నిరాశ్రయులు ఉన్నారని తెలిపారు. ముఖాలు, మెడ, కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలున్న చిన్నారులు కనిపించారని వెల్లడించారు. 50 వేల మంది తలదాచుకుంటున్న ఓ శిబిరంలో కేవలం 4 మరుగుదొడ్లు ఉన్నాయని పేర్కొన్నారు. అక్కడ రోజుకు కొద్దిసేపు మాత్రమే నీటి సరఫరా జరిగేదని వివరించారు. -
ఇప్పుడు పుతిన్కు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ అండ!
సియోల్: ఉక్రెయిన్పై యుద్ధానికి సంబంధించి రష్యాకు ఉత్తర కొరియా పూర్తి మద్దతు ప్రకటించింది. తమ జాతీయ భద్రత కోసం రష్యా చేస్తున్న పోరాటంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు బేషరతుగా పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నట్టు ఉత్తరకొరియా నియంతృత్వ పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ వెల్లడించారు. అంతేకాదు ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ‘పవిత్ర పోరాటం’గా అభివర్ణించారు. సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులను ఎదుర్కొనేందుకు తమ దేశం ఎల్లప్పుడూ రష్యాకు మద్దతుగా నిలబడుతుందని తెలిపారు. ఉక్రెయిన్పై దాదాపు ఏడాదిన్నర కింద రష్యా యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. యూరప్ దేశాలు, అమెరికా ఆయుధాలు సాయం చేయడంతో ఈ యుద్ధంలో ఉక్రెయిన్ సమర్థవంతంగా రష్యాకు ఎదురొడ్డి నిలిచింది. ఇన్నాళ్లుగా నిరంతర దాడులతో రష్యాకు ఆయుధాల కొరత తలెత్తింది. ఈ క్రమంలో ఉత్తర కొరియా నియంత కిమ్తో పుతిన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా తూర్పు కొసన సైబీరియా ప్రాంతంలో ఉన్న వోస్తోక్నీ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో బుధవారం పుతిన్తో కిమ్ భేటీ అయ్యారు. ఆయుధాలు, ఆర్థిక అంశాలపై.. రష్యా, ఉత్తరకొరియా మీడియా సంస్థల కథనాల ప్రకారం.. సోవియట్ కాలం నుంచీ ఉత్తరకొరియాకు అండగా ఉన్న విషయాన్ని పుతిన్ తమ భేటీలో గుర్తుచేశారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అంశాన్ని కిమ్ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. రష్యాకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘సామ్రాజ్యవాద శక్తుల నుంచి తన సార్వ¿ౌమ హక్కులను, భద్రతను పరిరక్షించుకునేందుకు రష్యా ‘పవిత్ర పోరాటం’ చేస్తోంది. రష్యా ప్రభుత్వానికి డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (ఉత్తర కొరియా) ఎల్లప్పుడూ బేషరతుగా పూర్తి మద్దతు ఇస్తోంది. ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసేందుకు వచి్చన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాం..’’ అని కిమ్ ప్రకటించారు. శాటిలైట్ల కోసమేగా వచ్చింది! పుతిన్ రష్యా స్వయం సమృద్ధ దేశమని, అయితే కొన్ని అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉందని.. వాటిపై కిమ్తో చర్చించానని పుతిన్ వెల్లడించారు. కిమ్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తర కొరియా ఉపగ్రహాలు అభివృద్ధి చేసేందుకు రష్యా సహకరిస్తుందా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘అందుకేగా మేం ఇక్కడికి (భేటీ కోసం) వచ్చింది. రాకెట్ టెక్నాలజీపై ఉత్తర కొరియా నేత చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఉత్తర కొరియా నుంచి ఆయుధాల కొనుగోలు, మిలటరీ సాయం, ఆంక్షల విషయంలో మాట్లాడేందుకు ఇంకా చాలా సమయం ఉంది..’’ అని పేర్కొన్నారు. రష్యా, ఉత్తరకొరియా మధ్య రవాణా, వ్యవసాయం వంటి పరస్పర ప్రయోజనాలున్న ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయని చెప్పారు. పొరుగు దేశమైన ఉత్తర కొరియాకు మానవతా సాయం అందిస్తున్నామన్నారు. రష్యాలోని మరో రెండు నగరాల్లో కిమ్ పర్యటిస్తారని, యుద్ధ విమానాల ప్లాంట్ను, రష్యా పసిఫిక్ నౌకాదళ కేంద్రాన్ని సందర్శిస్తారని వెల్లడించారు. ఆంక్షలతో కలిసిన ఇద్దరు ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. చమురు కొనుగోళ్లు, ఇతర లావాదేవీల విషయంలో సమస్యలతో రష్యా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. మరోవైపు అణ్వస్త్ర క్షిపణుల అభివృద్ధి, ఇటీవల వరుసగా ప్రయోగాలు జరపడం నేపథ్యంలో ఉత్తర కొరియాపై భారీగా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇలా పాశ్చాత్య ప్రపంచం దూరం పెట్టిన ఇరుదేశాల నేతలు పరస్పర సహకారం కోసం కలవడం గమనార్హం. అయితే ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు కొనడంగానీ, ఆ దేశానికి రాకెట్, శాటిలైట్ టెక్నాలజీని ఇవ్వడంగానీ దారుణమైన పరిస్థితులకు దారితీస్తాయన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఆ ఆయుధాలు ఇవ్వండి సోవియట్ యూనియన్ కాలం నుంచి ఉత్తర కొరియా, రష్యా మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి. 1950–53 మధ్య జరిగిన కొరియన్ యుద్ధంలో సోవియట్ యూనియన్ ఉత్తర కొరియాకు అండగా నిలిచింది. పెద్ద ఎత్తున ఆయుధాలను అందించడం ద్వారా దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా ఆక్రమణకు సహకరించింది. ఆ సమయంలో దక్షిణ కొరియాకు అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు అండగా నిలవడంతో.. చాలా కాలం యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర కొరియాకు సోవియట్ యూనియన్ ఆయుధాల సరఫరా, సహకారం కొనసాగింది. ఈ క్రమంలో నాటి ట్యాంక్ షెల్స్, లాంఛర్లు, మినీ రాకెట్లు లక్షల సంఖ్యలో ఉత్తర కొరియా వద్ద పోగుపడ్డాయి. సోవియట్ డిజైన్ ఆయుధాలే కాబట్టి రష్యా వాటిని నేరుగా వినియోగించుకోగలదు. ఇప్పుడు ఉక్రెయిన్పై యుద్ధంలో వాడేందుకు ఆ ఆయుధాలు ఇవ్వాలని ఉత్తర కొరియాను పుతిన్ కోరారు. మాకు గూఢచర్య ఉపగ్రహ టెక్నాలజీ కిమ్ షరతు రష్యా, చైనా తదితర దేశాల సాయంతో ఉత్తర కొరియా క్షిపణులు, అణ్వస్త్ర సాంకేతికతల విషయంలో ఓ మోస్తరుగా అభివృద్ధి సాధించినా.. ఉపగ్రహాల టెక్నాలజీలో చాలా వెనుకబడి ఉంది. అణు సామర్థ్యమున్న క్షిపణుల ప్రయోగం, ఇతర సైనిక అవసరాల కోసం మిలటరీ/గూఢచర్య ఉపగ్రహాలు తప్పనిసరి. ఈ దిశగా ఉత్తర కొరియా పలుమార్లు ప్రయోగాలు జరిపినా విఫలమైంది. తాజాగా రష్యా ఆయుధాలు అడుగుతున్న నేపథ్యంలో.. మిలటరీ గూఢచర్య ఉపగ్రహాల అభివృద్ధి, సాంకేతికత విషయంలో సాయం చేయాలని కిమ్ షరతు పెట్టినట్టు సమాచారం. ప్రత్యేక రైల్లో.. లిమోజిన్తో సహా.. ఉత్తర కొరియా నుంచి కిమ్ ఏకంగా ఓ ప్రత్యేక రైలులో రష్యాకు వెళ్లారు. క్షిపణి దాడులు జరిగినా కూడా తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన బోగీలు, వెంటనే ఎదురుదాడి చేయడానికి వీలుగా భారీ స్థాయిలో సిద్ధంగా అమర్చిపెట్టిన ఆయుధాలు ఈ రైలు సొంతం. దీనితోపాటు ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనే ప్రత్యేకమైన వాహనాన్ని (లిమోజిన్) కూడా వెంట తీసుకెళ్లారు. వోస్తోక్నీ అంతరిక్ష కేంద్రం సమీపంలోకి రైలు చేరుకున్నాక.. కిమ్ తన లిమోజిన్లో భేటీ అయ్యే స్థలానికి చేరుకోవడం గమనార్హం. కిమ్కు పుతిన్ ఎదురెళ్లి స్వాగతం పలికారని, ఇద్దరూ సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు చర్చించుకున్నారని.. భేటీ అనంతరం కిమ్కు పుతిన్ ప్రత్యేక విందు ఇచ్చారని రష్యా మీడియా వెల్లడించింది. ఈ పర్యటన సందర్భంగా రష్యా అంతరిక్ష కేంద్రంలో కిమ్ కలియదిరిగారని, అక్కడి ప్రత్యేకతలను తెలుసుకున్నారని వివరించింది. -
క్షిపణుల డిజైన్లో స్టార్టప్లను భాగస్వాములను చేయాలి
సాక్షి, విశాఖపట్నం: క్షిపణుల మరమ్మతులు, డిజైన్లలో స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలను భాగస్వాములను చేస్తే ఆత్మ నిర్భర్ భారత్ దిశగా మరింత పురోగతి సాధించవచ్చని డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ వై.శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం(ఈఎన్సీ) ప్రధాన కేంద్రానికి అనుబంధంగా ఉన్న ఐఎన్ఎస్ కళింగ బేస్లో గురువారం ‘అమృత్–2023’ పేరుతో మిసైల్ టెక్నాలజీ కాంక్లేవ్, సింపోజియం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ శ్రీనివాసరావు, ఈఎన్సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా ప్రారంభించారు. డాక్టర్ వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్కు అనుగుణంగా ఇండియన్ పబ్లిక్, ప్రైవేట్ ఇండస్ట్రీస్, డీఆర్డీవో ల్యాబ్స్, అకాడమీ, ఇండియన్ నేవీ ముందుకువెళ్తుండటం శుభపరిణామమని చెప్పారు. విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా రక్షణ పరిశ్రమ ప్రధాన సామర్థ్యాలను బలోపేతం చేయాలని సూచించారు. -
క్షిపణుల నుంచి సంగీతం దాకా..
న్యూఢిల్లీ: ఎన్నో అవాంతరాలను అధిగమిస్తూ మహిళలు క్షిపణుల నుంచి సంగీతం వరకు వివిధ రంగాల్లో ఎంతో సాధించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మహిళా శక్తిపై ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలోని మానెక్ షా సెంటర్లో సోమవారం జరిగిన ఆర్మీ అధికారుల భార్యల సంక్షేమ సంఘం(ఏడబ్ల్యూడబ్ల్యూఏ) సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ‘మహిళల సాధికారిత దిశగా ఏడబ్ల్యూడబ్ల్యూఏ సాగిస్తున్న ప్రయత్నాలను మెచ్చుకుంటున్నాను’అని అన్నారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనేది పాత సామెత. కానీ, ఈ రోజు దానిని విజయం సాధించిన ప్రతి పురుషుడి పక్కన ఒక మహిళ ఉంది అని చెప్పుకోవచ్చని ముర్ము అన్నారు. ‘నారీశక్తి అందించే సేవలు సమాజానికే కాదు, యావత్తు దేశం పురోగతికి కీలకంగా మారాయి. క్షిపణుల నుంచి సంగీతం వరకు, మహిళలు అనేక అవరోధాలను ఎదుర్కొంటూ ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగారు’అని ఆమె అన్నారు. -
ఉక్రెయిన్పై మళ్లీ నిప్పుల వాన
కీవ్: ఉక్రెయిన్పై రష్యా సైన్యం మళ్లీ విరుచుకుపడింది. బుధవారం ఉదయం తెల్లవారుజామున క్షిపణులు, డ్రోన్లతో సాధారణ నివాస ప్రాంతాలపై దాడికి దిగింది. ఉక్రెయిన్ నుంచి జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా, రష్యా నుంచి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వెళ్లిపోయిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. జపొరిజాజియా నగరంలో తొమ్మిది అంతస్తుల అపార్టుమెంట్పై రష్యా మిస్సైల్ దాడి వీడియో దృశ్యాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాజధాని కీవ్ సమీపంలో విద్యార్థుల వసతి గృహంపై రష్యా సైన్యం దాడి చేయడంతో నలుగురు మృతిచెందారు. 20 మందికిపైగా గాయపడ్డారు. కీవ్కు దక్షిణాన ఉన్న రిజీసిచివ్ సిటీలో ఓ ఉన్నత పాఠశాల, రెండు డార్మిటరీలు సైతం పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఓ డార్మిటరీ ఐదో అంతస్తు నుంచి 40 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని వెలికితీశారు. మొత్తం ఎంతమంది చనిపోయారన్నది ఇంకా తెలియరాలేదు. రష్యా 21 డ్రోన్లను ప్రయోగించగా, అందులో తాము 16 డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ సైనిక వర్గాలు వెల్లడించాయి. రష్యా ఒకవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు భీకర దాడులకు ఆదేశాలకు జారీ చేస్తోందని జెలెన్స్కీ మండిపడ్డారు. పౌరుల నివసాలపై రష్యా క్షిపణి దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ రష్యాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని బుధవారం స్వదేశానికి తిరిగివచ్చారు. జపాన్ ప్రధాని కిషిదా ఉక్రెయిన్ నుంచి పోలాండ్కు చేరుకున్నారు. -
తగ్గేదేలే! అంటూ ..ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు..మరో క్షిపణి ప్రయోగం
ఉత్తర కొరియా దూకుడుగా వరుస క్షిపణి ప్రయోగాలకు తెగబడుతోంది. ఒక బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన రెండు రోజుల్లోనే మరో రెండు బాలిస్టిక్ కిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా ధృవీకరిచింది కూడా. ఎలాంటి హెచ్చరికలు ఖాతరు చేయకుండా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వరుస క్షిపణి ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. వాస్తవానికి ఉత్తర కొరియా గత శనివారమే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని జపాన్ పశ్చిమ తీరంలో ప్రయోగించింది. దీంతో ఆదివారం అమెరికా ఆదివారం దక్షిణ కొరియా, జపాన్తోనూ విడిగా ఉమ్మడి వైమానికి విన్యాసాలను నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా సోమవారం తూర్పు తీరంలో రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ క్షిపణులను బహుళ రాకెట్ లాంచర్తో సుమారు 395 కి.మీ, 337 కి.మీ దూరంలోని లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించినట్లు ఉత్తర కొరియా పేర్కొంది. ఈ వ్యూహాత్మక అణ్వాయుధం శత్రు ఎయిర్ ఫీల్డ్ను నిర్వీర్వం చేయగలదని ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది. అలాగే కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ పసిఫిక్ను ఫైరింగ్ రేంజింగ్ మారుస్తామని హెచ్చరించింది. అంతేగాదు అధిక ఫ్రీక్వెన్సీతో మరిన్ని సైనిక చర్యలకు తెగబడటం అనేది యూఎస్ దళాల చర్యలపై ఆదారపడి ఉంటుందని ఆమె గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. మరోవైపు జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఉత్తర కొరియా రెండు క్షిపణులను ప్రయోగించిందని, అవి గరిష్టంగా 50 కి.మీ నుంచి 100 కి.మీ ఎత్తుకు చేరుకున్నట్లు తెలిపింది. ఈ పరీక్షల విషయమై అత్యవసర యూఎన్ భద్రతా మండలి సమావేశానికి పిలుపునిచ్చినట్లు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా చెప్పారు. ఐతే ఉక్రెయిన్ సంక్షోభం, అమెరికా గగనతలంలో చైనా నిఘా బెలూన్ వ్యవహారం నేపథ్యంలో అమెరికా చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తదితర కారణాల రీత్యా యూఎన్ ఆంక్షాలు విధించే అవకాశం తక్కువగా ఉంది. ఇదిలా ఉండగా, దక్షిణ కొరియా మాత్రం ఈ ప్రయోగాలను తీవ్రమైన రెచ్చగొట్టే చర్యగా పేర్కొంది. వెంటనే ఇలాంటి వాటిని నిలిపివేయాలని ఉత్తర కొరియాను హెచ్చరించింది. అలాగే ప్రతిఘటనలపై చర్చించడానికి జాతీయ భద్రత మండలి సమామేశాన్ని నిర్వహించనున్నట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు సుక్ యోల్ కార్యాలయం తెలిపింది. అంతేగాదు ఉత్తర కొరియా ఆయుధ కార్యక్రమాలకు సంబంధించి నలుగురు వ్యక్తులను, ఐదు సంస్థలపై ఆంక్షలను ప్రకటించింది. పైగా దీన్ని ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు ప్రతిస్పందనగా పేర్కొంది దక్షణ కొరియా. కచ్చితంగా దీనికి తగిన పర్యవసానాన్ని ఎదుర్కొనక తప్పదంటూ హెచ్చరించింది. దీని గురించి అమెరికా, జపాన్తోనూ చర్చిస్తానని దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, యూఎన్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ భద్రతా మండలి తీర్మానాలు ప్రకారం నిషేధించిన కవ్వింపు చర్యలను నిలిపేయాలని, అణ్వాయుధీకరణపై చర్చలు పునఃప ప్రారంభించాలని ఉత్తర కొరియాను కోరారు. -
కిమ్ అంటే అట్లుంటది! కొత్త ఏడాది తొలిరోజునే కీలక ప్రకటన
ప్యొంగ్యాంగ్: మిరుమిట్లు గొలిపే బాణసంచా, విద్యుత్తు దీపాల కాంతులతో ప్రపంచం మొత్తం కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. అయితే, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం తన రూటే సపరేట్ అని మరోమారు చాటుకున్నారు. తూర్పు జలాల్లోకి బాలిస్టిక్ మిసైల్ను ప్రయోగించి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆదివారం జరిగిన అధికార పార్టీ సమావేశంలో కీలక ప్రకటన చేశారు కిమ్. దేశంలో అణ్వస్త్రాల తయారీని గణనీయంగా పెంచుతామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే శక్తిమంతమైన ఖండాంతర క్షిపణులు ఐసీఎంబీలను తయారు చేస్తామని తెలిపారు. అమెరికా సహా ప్రత్యర్థి దేశాలను ఎదుర్కొనేందుకు సైనిక శక్తిని మరింత పటిష్ఠపరుస్తామని స్పష్టం చేశారు. పరోక్షంగా అమెరికా, దక్షిణ కొరియాలపై విమర్శలు గుప్పించారు. మరోవైపు.. వేగవంతమైన, ప్రతీకార దాడి సామర్థ్యంతో కూడిన కొత్త తరం ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ను తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు స్థానిక మీడియా తెలిపింది. అలాగే.. తొలి స్పై శాటిలైట్ను త్వరలోనే ప్రయోగించే యోచనలో కిమ్ ఇన్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: కాబూల్ ఆర్మీ ఎయిర్పోర్ట్ వద్ద భారీ పేలుడు.. 10 మంది మృతి -
సత్యసాయి జిల్లాలో క్షిపణుల తయారీ
సాక్షి, అమరావతి: దేశ రక్షణ రంగంలో అత్యంత కీలకమైన అధునాతన క్షిపణులు (మిస్సైల్స్) రాష్ట్రంలో ఉత్పత్తి కానున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) సత్యసాయి జిల్లా పాలసముద్రం వద్ద 914 ఎకరాల్లో వీటి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. క్షిపణులతోపాటు రాడార్ టెస్ట్ బెడ్, ఇతర రక్షణ రంగ ఉత్పత్తులను కూడా ఇక్కడ తయారు చేయనుంది. ఈ యూనిట్కు రూ.384 కోట్లు కేటాయిస్తూ శనివారం మచిలీపట్నంలోని బీఈఎల్లో జరిగిన సంస్థ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం నిర్వాకంతో ఆగిపోయిన ఈ ప్రాజెక్టును వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని రకాల అనుమతులు మంజూరు చేయించింది. 2016లో ఉమ్మడి అనంతపురం జిల్లా పాలసముద్రం వద్ద కేటాయించిన భూమి కన్వర్షన్, పర్యావరణ అనుమతులు తేవడంతో అప్పటి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించింది. దీంతో ఈ యూనిట్ నిలిచిపోయింది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక దీనిపై దృష్టి సారించారు. త్వరితగతిన అనుమతులు వచ్చేలా చర్యలు చేపట్టారు. మరోపక్క యూనిట్ పనులు ప్రారంభించకపోతే భూ కేటాయింపులు రద్దు చేయడంతో పాటు, పెనాల్టీ విధిస్తామంటూ బీఈఎల్కు ఏపీఐఐసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో బీఈఎల్ కొంత సమయం ఇవ్వాలని, పెనాల్టీలు రద్దు చేయాలని కోరింది. గతంలో కంటే పెద్ద యూనిట్ ఏర్పాటు చేసేలా కొత్తగా సమగ్ర ప్రాజెక్టు ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని పరిశీలించిన ఏపీఐఐసీ బోర్డు అన్ని అనుమతులు మంజూరు చేసింది. అనుమతులు రావడంతో బీఈఎల్ కూడా యూనిట్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టింది. నిధులు కూడా కేటాయించింది. రక్షణ రంగంలో అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై బీఈఎల్ అధికారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం బోర్డు సమావేశం అనంతరం బెంగళూరు బీఈఎల్ డైరెక్టర్లు భాను పి.శ్రీవాత్సవ, వినయ్ కుమార్ కత్యాల్, మనోజ్ జైన్, డాక్టర్ పార్థసారధి మంగళగిరిలో ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డిని కలిసి ప్రభుత్వం చొరవను అభినందించారు. ఏమాత్రం ఆలస్యం కాకుండా వెంటనే టెండర్లు పిలిచి త్వరలోనే పనులు మొదలుపెడతామని తెలిపారు. 6 నెలలకు ఒకసారి సమావేశమై పనుల పురోగతిని సమీక్షిస్తామన్నారు. -
2,00,000 బలగాలతో ఉక్రెయిన్పై విరుచుకుపడేందుకు రష్యా ప్లాన్!
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై 10 నెలలు కావస్తున్నా ఇంకా ఉద్రిక్తతలు తగ్గడం లేదు. డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ ఉన్నప్పటికీ కాల్పులను తాత్కాలికంగా కూడా విరమించే ప్రసక్తే లేదని రష్యా తేల్చి చెప్పింది. కీవ్పై మరోసారి భీకర దాడులకు సిద్ధమవుతోంది. రానున్న రోజుల్లో 2,00,000 బలగాలతో తమపై విరుచుకుపడేందుకు రష్యా వ్యూహం పన్నుతోందని ఉక్రెయిన్ ఆర్మీ చీఫ్ జనరల్ వలేరియ్ జులుజ్నీ తెలిపారు. ది ఎకానమిస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు మాట్లాడారు. తమకు మరిన్ని ఆయుధాలు, క్షిపణి వ్యవస్థలు కావాలన్నారు. రిజర్వ్ బలగాలను, అవసరమైతే పౌరులను కదన రంగంలోకి దించి రష్యా దాడులను తిప్పికొడతామని చెప్పారు. రష్యాపై ఆంక్షలు.. మరోవైపు రష్యా వెనక్కి తగ్గకపోవడంతో ఐరోపా సమాఖ్య మరోమారు ఆ దేశంపై ఆంక్షలు విధించింది. ఇలా చేయడం ఇది 9వ సారి కావడం గమనార్హం. అలాగే రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్కు 18 బిలియన్ యూరోల ప్యాకేజీని సాయంగా అందించనున్నట్లు ప్రకటించింది. అమెరికా అండ.. ఉక్రెయిన్కు యుద్ధంలో సాయం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని అమెరికాను రష్యా హెచ్చిరింది. అయితే అగ్రరాజ్యం మాత్రం మాస్కో వార్నింగ్ను లైట్ తీసుకుంది. ఉక్రెయిన్కు సాయం చేసి తీరతామని స్పష్టం చేసింది. యుద్ధంలో ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్న రష్యాకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ వెనుకడుగు వేయడం లేదు. గురువారం కూడా కీవ్పై క్షిపణులతో భీకర దాడులు చేసింది. చదవండి: బ్రిటన్ కోర్టులో నీరవ్ మోదీకి షాక్.. త్వరలోనే భారత్కు అప్పగింత! -
ఉక్రెయిన్పై 100 మిసైల్స్తో విరుచుకుపడిన రష్యా
కీవ్: ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా పట్టుకోల్పోతోందనే వాదనల వేళ మాస్కో సేనలు రెచ్చిపోయాయి. ఉక్రెయిన్పై మంగళవారం మిసైల్స్ వర్షం కురిపించాయి. విద్యుత్తు రంగాలే లక్ష్యంగా రష్యా బలగాలు 100కుపైగా క్షిపణులతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. దీంతో తమ దేశంలో మరోమారు విద్యుత్తుకు అంతరాయం ఏర్పడి అంధకారంలోకి వెళ్లినట్లు ఆందోళన వ్యక్తం చేసింది. ‘100కుపైగా మిసైల్స్ను రష్యా బలగాలు ప్రయోగించాయి. అక్టోబర్ 10వ తేదీన అత్యధికంగా 84 మిసైల్స్ను ప్రయోగించగా.. ఆ సంఖ్యను మంగళవారం దాటేశాయి మాస్కో సేనలు. వారి ప్రాథమిక టార్గెట్ కీలకమైన మౌలిక సదుపాయాలు. కొన్ని క్షిపణులను కూల్చివేశం. అయితే వాటి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.’ అని పేర్కొన్నారు ఉక్రెయిన్ ఎయిర్ఫోర్స్ ప్రతినిధి యూరీ ఇగ్నాత్. ఇదీ చదవండి: చైనా అధ్యక్షుడికి చిరునవ్వుతో షేక్ హ్యండ్ ఇచ్చిన ప్రధాని మోదీ.. ఇదే తొలిసారి! -
‘రాహుల్ ఓ ఫెయిల్డ్ మిసైల్.. మళ్లీ ప్రయోగిస్తారేంటి?’
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్రపై విమర్శలు గుప్పించారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. రాహుల్ గాంధీ ఓ విఫలమైన క్షిపణిగా అభివర్ణించారు. భారత్ జోడో యాత్ర పేరుతో మరోమారు ఫెయిల్డ్ మిసైల్ను కాంగ్రెస్ ప్రయోగిస్తోందని ఎద్దేవా చేశారు. దేశం మొత్తం ఏకమైందని, ఫెడరలిజాన్ని నమ్ముతున్న తరుణంలో ఇలాంటి యాత్రలు అర్థరహితమని దుయ్యబట్టారు. ‘దేశం బలమైన స్థానంలో ఉన్నప్పుడు ఇలాంటి యాత్రలు చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. గతంలోనే రాహుల్ గాంధీ అనే మిసైల్ విఫలమైందని నేను చెప్పాను. ఇప్పుడు, మళ్లీ ఆయన్నే కాంగ్రెస్ ప్రయోగిస్తోంది. దానిని పక్కనబెడితే.. అసలు ఈ యాత్రకు అర్థమే లేదు.’ అని పేర్కొన్నారు బొమ్మై. దేశ ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతున్న తరుణంలో క్రమంలో దేశాన్ని ఏకం చేస్తామనేందుకు అసలు అవకాశమేలేదన్నారు బొమ్మై. జీ7తో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటే.. భారత్ 7 శాతం వృద్ధి నమోదు చేసిందని గుర్తు చేశారు. బీజేపీ చేపట్టిన జన సంకల్ప యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపారు. ఇదీ చదవండి: బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశాన్ని విభజిస్తున్నాయి.. అందుకే పాదయాత్రకు ఆ పేరు.. -
పెచ్చరిల్లిన యుద్ధకాండ
రాజధాని కీవ్ సహా ఉక్రెయిన్ మళ్ళీ క్షిపణిదాడులతో దద్దరిల్లుతోంది. విద్యుత్ సరఫరా ఆగింది. జనం ప్రాణాలు అరచేత పట్టుకొని బంకర్లలో తలదాచుకుంటున్నారు. వరుసగా రెండురోజులుగా రష్యా క్షిపణిదాడులు. పిల్లల ఆటస్థలాలపైనా దాడులతో పదుల మంది ప్రాణాలు కోల్పోతే, వంద మందికి పైగా గాయాల పాలయ్యారు. ఒక్కసారిగా ఉద్రిక్తత పెంచిన ఈ దాడులతో యుద్ధం ఐక్యరాజ్య సమితి (ఐరాస) సర్వప్రతినిధిసభలో చర్చనీయాంశమైంది. ఉక్రెయిన్లోని నాలుగు కీలక ఆక్రమిత ప్రాంతాలను రెఫరెండమ్ల మాటున తమ దేశంలో కలిపేసుకున్నట్టు ఇటీవలే రష్యా అక్రమంగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం ముందుకొచ్చింది. ఒకట్రెండు రోజుల్లో దీనిపై ఓటింగ్ జరగనుంది. వెరసి పెచ్చరిల్లిన యుద్ధకాండతో అంతర్జాతీయంగా ఉద్విగ్నత నెలకొంది. తమ దేశ గగనతల రక్షణకు మరిన్ని ఆయుధాలు కావాలని ఉక్రెయిన్ అభ్యర్థిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అత్యవసరంగా ‘జీ7’ దేశాల నేతలతో సమావేశమయ్యారు. రష్యన్ చమురుపై కఠినతరమైన ఆంక్షలు పెట్టాలన్నారు. మరోపక్క ‘నాటో’ సైతం యుద్ధంలో కడ దాకా ఉక్రెయిన్కు అండగా నిలుస్తామని స్పష్టం చేసింది. యుద్ధాన్ని ప్రారంభించిన రష్యాయే దీనికి ముగింపు పలకా లంది. ఈ వారంలోనే ‘నాటో’ రక్షణ మంత్రులూ సమావేశం కానుండడం మరో కీలక పరిణామం. రష్యా మాత్రం పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్కు మద్దతుగా నిలిచి, యుద్ధాన్ని పెంచిపోషిస్తున్నాయని ఆరోపిస్తోంది. ఉక్రెయిన్లో ఎదురుదెబ్బల నేపథ్యంలో ఓ నిరంకుశ కొత్త సైనిక కమాండర్ను బరిలోకి దింపింది. వరస చూస్తుంటే, యుద్ధం మరింత సంక్లిష్ట దశకు చేరుకొన్నట్టు కనిపిస్తోంది. తాజా దాడి ఘటనల్ని గమనిస్తే – రష్యా అధ్యక్షుడు పుతిన్కు అభిమాన ప్రాజెక్టు క్రిమియా – రష్యా మధ్య రోడ్డు, రైలు వంతెన. ఇటు సైనికపరంగా, అటు ప్రతీకాత్మకంగా అది ముఖ్యమైనది. ఆక్రమిత క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యాకు కలిపే ఆ ‘కెర్చ్ వంతెన’ను 370 కోట్ల డాలర్ల ఖర్చుతో నిర్మించారు. నాలుగేళ్ళ క్రితం 2018 మే నెలలో పుతిన్ స్వయంగా దానిపై వాహనం నడుపుతూ ఆర్భాటంగా ప్రారంభించారు. రష్యా ఆక్రమణకు ఓ కీలక ప్రతీక లాంటి ఆ వంతెన పుతిన్ 70వ జన్మదినం మర్నాడే అక్టోబర్ 8 భారీ పేలుడుతో ధ్వంసమైంది. అందుకు ఉక్రెయినే కారణమంటూ పుతిన్ 48 గంటలు గడిచేలోగా భీకర ప్రతీకార దాడులకు దిగారు. తత్ఫలితమే – ఇటీవల ఎన్నడూ లేనంత స్థాయిలో సోమ, మంగళవారాల్లో ఉక్రెయిన్ నగరాలపై రష్యా చేసిన దాడులు. ఏడునెలల క్రితం ప్రత్యేక సైనిక చర్య అంటూ మొదలుపెట్టిన పుతిన్ ఉక్రెయిన్ను రష్యాలో భాగం చేసుకోవాలనే ధోరణిని ప్రదర్శిస్తున్నారు. అంతర్జాతీయచట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. తక్షణం, బేషరతుగా వెనక్కి రావాలని మార్చిలో సాక్షాత్తూ ఐరాస 141 దేశాల మద్దతుతో తీర్మానించినా, మాస్కో జంకూగొంకూ లేకుండా దాడులు చేస్తూనే ఉంది. రెండున్నరేళ్ళుగా భయపెడుతున్న కోవిడ్ లానే ఈ యుద్ధకాండ ఫలితాలు సైతం ఒక్క ఉక్రెయిన్కే కాక మొత్తం ప్రపంచానికి విస్తరిస్తున్నాయి. ఐరాస పట్టు కోల్పోతోంది. ఆహార ధరలు పెరిగిపోయాయి. శరణార్థుల సమస్య, సాంస్కృతిక – క్రీడా రంగాల్లో బహిష్కరణలు సరేసరి. అంతర్జాతీయ సహకారానికి పెద్ద దెబ్బ తగిలింది. అణ్వస్త్ర ప్రయోగంపై పుతిన్ చీటికీమాటికీ చేస్తున్న హెచ్చరికలు ఆయన నిర్లక్ష్య నేరధోరణికీ, అంతకంతకూ పెరుగుతున్న అసహనానికీ ప్రతీకలు. పెరుగుతున్న ఉద్రిక్తతలతో ప్రపంచం అణ్వస్త్ర మహా సంగ్రామానికి అతి దగ్గరగా ఉందంటూ అమెరికా అధ్యక్షుడు గతవారం హెచ్చరించడం గమనార్హం. ఇవి చాలదన్నట్టు పుతిన్ యుద్ధకాంక్ష ఇప్పటికే ప్రపంచ ఇంధన సరఫరాలపై, విపణిపై మును పెన్నడూ లేని ప్రభావం చూపింది. తాజాగా రష్యా సహా ఒపెక్ ప్లస్ దేశాలు ప్రపంచ చమురు ఉత్పత్తిలో కోత విధించాలని నిర్ణయించడమూ దెబ్బే. చమురు కొరతతో ఈ శీతకాలంలో యూరోపి యన్ ప్రపంచానికి కష్టాలు పెరగనున్నాయి. అసలైతే ఒపెక్ సభ్యదేశాల్లో అనేకం పాశ్చాత్యానికి మిత్రపక్షాలే. ఇప్పుడవి తమ వైఖరిని మార్చుకున్నాయా అనిపిస్తోంది. అదే గనక నిజమైతే, రెండు వర్గాలుగా దేశాలు చీలుతాయి. నిరంకుశాధికార ఇరాన్ సహా రష్యాను సమర్థించే దేశాలు ఒకపక్క, అమెరికా – బ్రిటన్ – ఇతర జి7 దేశాలు – ఐరోపా సమాజం మరోపక్క మోహరిస్తాయి. ఇక, రష్యాతో పోరుతో పాటు ఉక్రెయిన్ను ఆర్థిక కష్టాలూ వెన్నాడుతున్నాయి. అమెరికా నెలకు 150 కోట్ల డాలర్ల సైనికేతర సాయం ఇస్తానని హామీ ఇచ్చింది కానీ, ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా ఉండాలంటేనే నెలకు 500 కోట్ల డాలర్లు అవసరం. మరోపక్క యూరోపియన్ యూనియన్ (ఈయూ) తన వంతు సాయం చేయడంలో విఫలమైంది. 900 కోట్ల యూరోలు ఇస్తా మంటూ మేలో చెప్పిన బ్రస్సెల్స్ ఇప్పటికి 100 కోట్ల యూరోలే చెల్లించింది. ఉక్రెయిన్కు సైనిక సరఫరాలు, రష్యాపై ఆంక్షలపైనా ఈయూలో అభిప్రాయ భేదాలున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ లాంటివి కీలక ఆయుధాలు ఇవ్వనేలేదు. రష్యా అనుకూల హంగరీ ఈయూ ఐక్యతకు తూట్లు పొడుస్తోంది. పుతిన్ పరిస్థితీ గొప్పగా లేదు. సైనికవైఫల్యాలు, యుద్ధనేరాల ఆరోపణలు, ప్రజల్లో అసంతృప్తి రేపిన సైనిక సమీకరణ ఆలోచనలు ఆయన ప్రతిష్ఠను దెబ్బతీశాయి. వంతెన విధ్వంసంతో తల కొట్టేసినట్టయి తెగబడేసరికి మళ్ళీ కలకలం రేగింది. ఈ ఉద్రిక్తత, దాడులు ఎవరికీ మంచిది కాద నేది భారత్ వాదన. అంతా అది అంగీకరించినా, ఆపే దిశగా ఆచరణ శూన్యం. భయపెడుతున్న అణుయుద్ధంలో ఎవరూ గెలవలేరు. ఆ ఉన్మాదంలో పరాజయం యావత్ మానవ ప్రపంచానిదే! -
ఉక్రెయిన్పై క్షిపణుల మోత.. యూరప్కు కరెంటు కట్
కీవ్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మరింత భీకర రూపం దాల్చింది. రష్యా, క్రిమియాలను కలిపే కెర్చ్ వంతెనపై బాంబు పేలుళ్లకు ప్రతీకారంగా దాడులను రష్యా మంగళవారం మరింత తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్ నగరాలే లక్ష్యంగా సోమవారం ఏకంగా 84 క్షిపణులతో విరుచుకుపడటం తెలిసిందే. మంగళవారం ఉక్రెయిన్లోని మిలటరీ కమాండ్ సెంటర్లు, ఇంధన కేంద్రాలే లక్ష్యంగా భారీ దాడులకు దిగింది. దాంతో జెలెన్స్కీ ప్రభుత్వం యూరప్ దేశాలకు విద్యుత్ సరఫరాను నిలిపేయాల్సి వచ్చింది. సుదూర ప్రాంతాలను ఛేదించే దీర్ఘ శ్రేణి క్షిపణులతో రష్యా విధ్వంసం సృష్టిస్తోంది. క్షిపణి దాడుల తో లివీవ్ నగరం అల్లాడుతోంది. వేలాది మంది బంకర్లలో తలదాచుకుంటున్నారు. మంగళవారం దాడుల్లో 20 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. మరోవైపు ఉక్రెయిన్కు అండగా గగనతల రక్షణ వ్యవస్థలను తరలించడానికి అమెరికా, జర్మనీ అంగీకరించాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడారు. అత్యాధునికమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను పంపుతామని హామీ ఇచ్చారు. ఫేస్బుక్పై ఉగ్ర ముద్ర ఫేస్బుక్, ఇన్స్ట్రాగాంల మాతృసంస్థ మెటా ప్లాట్ఫామ్స్ కంపెనీని ఉగ్రవాద సంస్థగా రష్యా ప్రకటించింది. ఫేస్బుక్, ఇన్స్టా ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు అది ఊతమిస్తోందని ఆరోపిస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటు ఐరాస: ఐక్యరాజ్యసమితిలో భారత్ మరోసారి రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. ఉక్రెయిన్లో నాలుగు ప్రాంతాలను రష్యా దురాక్రమించడాన్ని వ్యతిరేకిస్తూ ఐరాస సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానంపై రహస్య ఓటింగ్ నిర్వహించాలన్న రష్యా డిమాండ్ను భారత్ తిరస్కరించింది. దీనిపై జరిగిన ఓటింగ్లో మరో 100కు పైగా దేశాలతో కలిసి రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. ఉక్రెయిన్లోని లుహాన్స్క్, డొనెట్స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలను రష్యా విలీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ అల్బేనియా తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై రష్యా రహస్య ఓటింగ్ డిమాండ్ను భారత్ సహా 107 సభ్య దేశాలు తిరస్కరించాయి. 13 దేశాలు రష్యా డిమాండ్కు అనుకూలంగా ఓటేయగా చైనా సహా 39 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. -
కీవ్పై రష్యా భీకర దాడులు
కీవ్: వ్యూహాత్మకంగా కీలకమైన క్రిమియా వంతెనపై జరిగిన బాంబు పేలుడును ఉగ్ర చర్యగా అభివర్ణించిన రష్యా.. ఉక్రెయిన్ వ్యాప్తంగా సోమవారం వరుసగా రెండో రోజు భీకర దాడులు కొనసాగించింది. కొద్ది నెలలుగా ప్రశాంతంగా ఉన్న రాజధాని కీవ్ సహా నగరాలు పేలుళ్లతో దద్దరిల్లాయి. దాడులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉదయం ఏకధాటిగా నాలుగు గంటలపాటు సైరన్లు మోగాయి. దాడుల్లో కనీసం 10 మంది మృతి చెందగా 60 మంది వరకు గాయపడినట్లు సమాచారం. కీలక ఇంధన, సైనిక వ్యవస్థలను టార్గెట్గా గగనతలం, సముద్రం, భూమిపై నుంచి తమ సైన్యం దాడులు సాగించినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ ఉగ్రదాడులు కొనసాగిస్తే అందుకు తామిచ్చే జవాబు అత్యంత కఠినంగా ఉంటుందని హెచ్చరించారు. అంతకుముందు ఆయన సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. మరో పరిణామం..రష్యా, బెలారస్ ఉమ్మడి బలగాలను మోహరించనున్నట్లు బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో ప్రకటించారు. బెలారస్పై దాడి చేసేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అయితే, బలగాలను ఎక్కడ మోహరించేదీ లుకషెంకో వివరించలేదు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో పోరాటం కొనసాగుతున్నా రాజధాని కీవ్లో జనజీవనం యథాప్రకారం కొనసాగుతోంది. కీవ్ ప్రజలు కొద్ది నెలలుగా ప్రశాంతతకు అలవాటుపడ్డారు. సోమవారం ఉదయం ఆ పరిస్థితి మారిపోయింది. ఒక్కసారిగా మొదలైన సైరన్ల మోతతో జనం ఉలిక్కిపడ్డారు. బాంబు షెల్టర్లలోకి పరుగులు తీశారు. అధికారులు రైలు సర్వీసులను రద్దు చేశారు. జనం రైల్వే స్టేషన్లనే షెల్టర్లుగా చేసుకున్నారు. -
Russia Ukraine War: ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు
కీవ్: ఉక్రెయిన్లో నాలుగు ప్రాంతాల విలీనం ఒప్పందంపై సంతకాలు చేయడానికి కొన్ని గంటల ముందే రష్యా క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లతో ఉక్రెయిన్లోని పలు నగరాలపై విరుచుకుపడింది. జపోరిజియా నగరంలోని మానవతా కాన్వాయ్పై జరిపిన దాడిలో 30 మంది మరణించారు. రష్యా ఆక్రమిత భూభాగంలో ఉన్న తమ బంధువులకి వస్తు సామాగ్రిని అందించడం కోసం వెళుతుండగా ఆ మానవతా కాన్వాయ్పై దాడులు జరిగాయి. రష్యాలో తయారైన ఎస్–300 క్షిపణులతో ఈ దాడులు జరిగాయని పోలీసులు వెల్లడించారు. విలీన ఒప్పందంపై పుతిన్ సంతకం ఉక్రెయిన్లోని నాలుగు ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకునే ఒప్పందంపై అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం సంతకాలు చేశారు. డాంటెస్క్, లుహాన్సŠక్, ఖెర్సాన్, జపోరిజియా ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపామని ఆ ప్రాంత ప్రజలు రష్యాలో విలీనమవడానికి అంగీకరించాయని ఇప్పటికే రష్యా ప్రకటించింది. ఆయా ప్రాంతాలకు చెందిన రష్యా అనుకూల పాలకులు హాజరవగా క్రెమ్లిన్లో జరిగిన ఒక కార్యక్రమంలో పుతిన్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ తమ దేశంలో విలీనమైన ప్రాంతాలను అన్ని విధాల కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ఏడు నెలలుగా సాగుతున్న యుద్ధంపై ఉక్రెయిన్ వెంటనే శాంతి చర్చలకు రావాలని కోరారు. తమ దేశంలో విలీనమైన ప్రాంతాలను మళ్లీ వెనక్కి ఇచ్చే ప్రసక్తే లేదని పుతిన్ తేల్చి చెప్పారు.తమ దేశాన్ని ఒక కాలనీగా మార్చి, తమ ప్రజల్ని పిరికివాళ్లయిన బానిసలుగా మార్చడానికి పశ్చిమ దేశాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని ఆరోపించారు. ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్, పశ్చిమ దేశాలు ఆ విలీనాన్ని అంగీకరింబోమని స్పష్టం చేశాయి. ప్రజాభిప్రాయం పేరుతో వారిపై తుపాకులు పెట్టి బలవంతంగా విలీనం చేసుకున్నారని, ఇది చట్టవిరుద్ధమని పేర్కొన్నాయి. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నాటో కూటమిలో తమ దేశాన్ని చేర్చుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రష్యాకి చెందిన వెయ్యి మంది ప్రజలు, సంస్థలు తమ దేశానికి రాకుండా అమెరికా వారి వీసాలపై నియంత్రణ విధించింది. -
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం... స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన యూఎస్ సౌత్ కొరియా
Washington and Seoul officials Warned: ఉత్తర కొరియా రెండు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ మేరకు సియోల్ రక్షిణ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది నెలరోజుల విరామం తర్వాత ఉత్తర కొరియా రికార్డు బ్రేక్ చేస్తూ రెండు క్షిపణులను ప్రయోగించిందని తెలిపింది. బుధవారం తెల్లవారుజామున దక్షిణ కొరియా ప్యోంగాన్ ప్రావిన్స్లోని ఓంచోన్ నుంచి పశ్చిమ సముద్రంలోకి ఉత్తర కొరియా రెండు క్రూయిజ్ క్షిపణులను పేల్చినట్లు గుర్తించామని రక్షణ మంత్రిత్వశాఖ అధికారి పేర్కొన్నారు. దీంతో యూఎస్, దక్షిణ కొరియా సైనిక అధికారులు ఎంద దూరం నుంచి ఈ క్షిపణుల ప్రయోగం జరిగిందని పూర్తి స్థాయిలో వివరణాత్మకంగా విశ్లేషిస్తున్నరు. ఈ మేరకు ఉత్తర కొరియా చివరిసారిగా జులై 10న ఆయుధ పరీక్షను నిర్వహించింది. ఇది బహుళ రాకెట్ లాంచర్లను ఫైర్ చేయగల క్షిపణి. ఐతే ఉత్తరకొరియా న్యూస్ ఛానెల్ ఒక్క క్రూయిజ్ క్షిపణినని ప్రయోగించలేదని, తమ దేశంపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించలేదని పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి ఉత్తరకొరియా 2017 నుంచి పూర్తి తొలిసారిగా పూర్తి స్థాయిలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. అప్పటి నుంచి పలుమార్లు ఐక్యరాజ్యసమితి నిబంధనలను ఉల్లంఘిస్తూ పరీక్షలు నిర్వహిస్తూనే ఉంది. ఉత్తర కొరియా దూకుడు వ్యవహరంతో యూఎస్, దక్షిణ కొరియా అధికారులు కూడా అణు పరీక్షలకు సిద్ధమవుతున్నమని గట్టిగా హెచ్చరించారు. తదుపరి ఉత్తర కొరియా ఏడోవ అణు పరీక్ష ఏం నిర్వహించనుందో తెలియదు కానీ తాము మాత్రం అణుపరీక్ష నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసినట్లు కరాఖండీగా చెప్పాయి. (చదవండి: కిమ్ జోంగ్ ఉన్కి పుతిన్ లేఖ) -
తీవ్రతరమవుతున్న యుద్ధం... తదుపరి దశ దాడులకు దిగుతున్న రష్యా!
Russian rockets and missiles have pounded cities in strikes: రష్యా బలగాలు క్షిపణి దాడులతో ఉక్రెయిన్లోని నగరాలను నేలమట్టం చేశాయి. దీంతో ఆయా నగరాల్లో వేలాదిమంది మృతి చెందారు. తూర్పు ఉక్రెయిన్ దిశగా దాడులు జరిపిన రష్యా బలగాలు ఆయా ప్రాంతాల్లోని ఉక్రెయిన్ దాడులను నిరోధించేలా తమ కార్యకలాపాలను తీవ్రతరం చేసింది రష్యా. అదీగాక ఉక్రెయిన్ సైన్యాన్ని నిరోధించేలా దాడులు తీవ్రతరం చేయమని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఆదేశించారు కూడా. ఈ మేరకు రష్యా భూ, వాయు, జల మార్గాల్లో దాడులను వేగవంతం చేసింది. ప్రస్తుతం డోనెట్స్క్కి తూర్పు ప్రాంతమైన ఉక్రెయన్లోని కీలక నగరం స్లోవియన్స్క్పై దాడి చేసేందుకు రష్యా బలగాలు రెడీ అవుతున్నట్లు ఉక్రెయిన్ పేర్కొంది. ఈ మేరకు తూర్పు ఉక్రెయిన్ నుంచి దాడులకు తెగబడ్డ రష్యా ఒక్కో నగరాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంటూ...తదుపరి దశ దాడులకు సన్నహాలు చేస్తోంది. అంతేకాదు రష్యా దక్షిణ ఉక్రెయిన్లో ఆక్రమించిన ప్రాంతాలలో రష్యా తన రక్షణ స్థానాలను పటిష్టం చేసుకుంటూ దాడులుకు సమయాత్తమవుతోంది. మరోవైపు ఉక్రెయిన్ కూడా పశ్చిమ దేశాలు అందించిన ఆయుధాలు సాయంతో సుమారు 30 రష్యన్ లాజిస్టిక్స్, మందుగుండు సామగ్రి కేంద్రాలపై విజయవంతమైన స్ట్రైక్స్ స్ట్రింగ్ జరిపింది. దీనికి ప్రతస్పందనగా రష్యా దాడులను తీవ్రతరం చేయడమే కాకుండా క్షిపిణి దాడులతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడింది. ఏదీఏమైన రష్యా ప్రత్యేక సైనిక చర్యగా చెప్పుకుంటూ... ఉక్రెయిన్ని మట్టికరిపించే దిశగా విధ్వంసకర దాడులకు తెగబడుతోంది -
చైనాకు చెక్ పెట్టేలా... భారత్కి అమెరికా అండ
US House of Representatives has passed by voice vote: చైనా వంటి దురాక్రమణ దారులకు అడ్డుకట్టవేసేలా రష్యా నుంచి ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసుకునేలా భారత్కి అమెరికా మద్దతు ఇచ్చింది. ఈ మేరకు యూఎస్కి సంబంధించిన కాట్సా వంటి శిక్షార్హమైన ఆంక్షల చట్టానికి వ్యతిరేకంగా భారత్కి మినహయింపును ఇచ్చే శాసన సవరణను యూఎస్ ప్రతినిధులు సభ వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్(ఎన్డీఏఏ) పరిశీలనకు సంబంధించి అమెరికా ప్రతినిధుల సభ ఎన్బ్లాక్ సవరణలో భాగంగా ఈ శాసన సవరణను ఆమోదించింది. ఈ మేరకు అమెరికా ప్రతినిధి భారత అమెరికన్ రో ఖన్నాప్రవేశ పెట్టిన ఈ సవరణ.. చైనా నుంచి తమను తాము రక్షించుకునేలా భారత్కి అండగా ఉండేలా ఈ అమెరికా చట్టం నుంచి మినహాయింపు ఇవ్వాలని బైడెన్ పరిపాలన యంత్రాంగాన్ని కోరింది. ఈ నేపథ్యంలోనే భారత్కి యూఎస్ కఠిన చట్టం నుంచి మినహియింపు ఇచ్చేలా ప్రవేశ పెట్టిన సవరణకు ఆమెదం లభించింది. భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాల కోసం చేసిన యూఎస్ ఆమోదించిన ఈ సవరణ చట్టం అతి ప్రాముఖ్యతను సంతరిచంకుంటుందని కూడా అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా అన్నారు. వాస్తవానికి కాట్సా అనేది కఠినమైన యూఎస్ చట్టం. ఇది 2014లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడం, 2016 యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం తదితర కారణాల రీత్యా రష్యా నుంచి ఆయుధాలను కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధించేలా ఈ కఠినమైన చట్టాన్ని 2017లో అమెరికా తీసుకువచ్చింది. దీంతో రష్యా రక్షణ ఇంటెలిజెన్స్ రంగాలతో లావాదేవీలు జరుపుతున్న ఏ దేశంపైనైనా యూఎస్ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా శిక్షాత్మక చర్యలను తీసుకుంటుంది. అక్టోబర్ 2018లో ఎస్400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థల ఐదు యూనిట్లను కొనుగోలు చేయడానికి రష్యాతో భారత్ 5 బిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం చేసింది. ఐతే ఈ ఒప్పందంతో ముందుకు సాగడం భారత్కి అసాథ్యం అని యూఎస్ శిక్షర్హమైన చట్టానికి సంబంధించిన ఆంక్షలు వర్తిస్తాయంటూ అప్పటి ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది కూడా. అదీగాక ఇప్పటికే ఎస్ 400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన టర్కీపై అమెరికా ఆంక్షలు విధించడంతో భారత్కి భయాలు అధికమయ్యాయి. ఐతే ఈ శాసన సవరణను యూఎస్ ఆమోదించడంతో ప్రస్తుతం భారత్కి కాస్త ఊరట లభించింది. There is no relationship of greater significance to US strategic interests than the US-India partnership. My bipartisan NDAA amendment marks the most significant piece of legislation for US-India relations out of Congress since the US-India nuclear deal. pic.twitter.com/uXCt7n66Z7 — Rep. Ro Khanna (@RepRoKhanna) July 14, 2022 (చదవండి: తీవ్ర దుఃఖంలో ట్రంప్.. భార్య మృతితో భావోద్వేగ సందేశం) -
ఎయిర్ఫోర్స్కు 100వ లాంచర్..అందించిన టీఏఎస్ఎల్, ఎల్అండ్టీ!
బెంగళూరు: టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టీఏఎస్ఎల్), ఎల్అండ్టీ ఉమ్మడిగా 100వ ఆకాశ్ ఎయిర్ఫోర్స్ లాంచర్ను భారత వాయుసేనకు విజయవంతంగా అందించినట్టు ప్రకటించాయి. ఈ లాంచర్ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసింది. 100వ ఎయిర్ఫోర్స్ లాంచర్ను విజయవంతంగా అందించడం తమకు, భారత రక్షణ తయారీ రంగానికి ఓ మైలురాయిగా టీఏఎస్ఎల్ సీఈవో, ఎండీ సుకరన్ సింగ్ తెలిపారు. ఎల్అండ్టీ హోల్టైమ్ డైరెక్టర్ జయంత్ పాటి ల్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం.. అమెరికా స్పందన ఇదే!
సియోల్: జలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని ఉత్తర కొరియా శనివారం నిర్వహించినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ప్రత్యర్థి దేశాలకు హెచ్చరికలు పంపేందుకే ఉత్తర కొరియా ఈ ప్రయోగం చేపట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పు రేవు నగరం సిన్పో సమీపంలో సముద్ర జలాల్లో ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. అయితే, ఏ జలాంతర్గామి నుంచి ఈ ప్రయోగం చేపట్టారన్న సమాచారాన్ని బహిర్గతం చేయలేదు. షార్ట్–రేంజ్ మిస్సైల్ను ప్రయోగించిందన్నారు. ఇది 600 కిలోమీటర్లు(373 మైళ్లు) ప్రయాణించిందని చెప్పారు. ఉత్తర కొరియా మిస్సైల్ పరీక్షతో తమకు గానీ, మిత్ర దేశాలకు గానీ తక్షణమే ముప్పు ఉన్నట్లు భావించడం లేదని అమెరికా స్పష్టం చేసింది. ఉత్తర కొరియా క్షిపణి తమ ప్రత్యేక ఆర్థిక జోన్ సమీపంలో సమద్రంలో కూలిపోయిందని, దానివల్ల తమ నౌకలకు, విమానాలకు నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని జపాన్ తెలిపింది. చదవండి: Bali: పవిత్రమైన చోట నగ్నంగా ఫొటోలు దిగింది.. సారీ చెప్పించుకుని మరీ వెళ్లగొట్టారు -
ఉక్రెయిన్ దాడి.. ఆకాశంలో రష్యా హెలికాప్టర్ రెండు ముక్కలు.. వీడియో వైరల్
ఉక్రెయిన్పై రష్యా మొదలెట్టిన యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో చెప్పలేని పరిస్థితి కనపడుతోంది. అయితే మొదట్లో రష్యా దాడిని అడ్డుకుంటూ వచ్చిన ఉక్రెయిన్ ఆర్మీ గత రెండు వారాలుగా ఎదురు దాడులు చేస్తోంది. పేరుకి చిన్న దేశం, ఆయుధ సంపత్తి, సైన్యం పరంగా రష్యాతో సమఉజ్జీ కాకపోయినా ధీటుగా నిలబడి ఉక్రెయిన్ పోరాడుతోంది. తాజాగా రష్యాకు చెందిన ఎంఐ-28 హెలికాప్టర్ను ఉక్రెయిన్ సైన్యం రెండు ముక్కలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దర్శనమిస్తోంది. ఉక్రెయిన్ సైనికులు స్టార్ స్ట్రీక్ అనే మిస్సైల్తో దాడి చేయగా రష్యా ఎంఐ28 హెలికాప్టర్కు చెందిన టెయిల్ పార్ట్ ధ్వంసం కావడంతో రెండుగా విడిపోయి కుప్పకూలింది. లుహన్స్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. స్టార్స్ట్రీక్ మిస్సైల్ యూకే అత్యంత అధునాతన మానవసహిత పోర్టబుల్ క్షిపణి వ్యవస్థ. ఇది తక్కువ ఎత్తు ఎగిరే శత్రు జెట్లను పడగొట్టడానికి, హెలికాప్టర్లపై దాడి చేయడానికి ఉపయోగిస్తారు. స్టార్ స్ట్రీక్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ఇది ధ్వని కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. దీని వేగం సహాయంతో గాల్లో ఎగిరే టార్గెట్లను సునాయాసంగా పేల్చేయవచ్చు. ఉక్రెయిన్కు 6,000 క్షిపణుల కొత్త ప్యాకేజీతో సహా మరింత రక్షణాత్మక మద్దతును అందిస్తుందని బ్రిటన ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తెలిపారు. ప్రస్తుతం రష్యా దళాలు తాజాగా తూర్పు ఉక్రెయిన్ వైపు దృష్టి సారించాయి. The Times is reporting that this shootdown of a Russian Mi-28 was by a British Starstreak SAM pic.twitter.com/zsQb1DkQ74 — OSINTtechnical (@Osinttechnical) April 2, 2022 చదవండి: Russia Ukraine War: రష్యా అకృత్యాలు.. మాటలు రావడం లేదు! ఈ ఒక్క ఫొటో చాలు -
ఉక్రెయిన్పై రష్యా ‘కింజల్’ దాడి..హైపర్ సోనిక్ మిసైల్ అంటే?
ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని ప్రపంచదేశాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఇరు దేశాలకు చెందిన వేలాదిమంది సైనికులు, సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అందిరినీ కలచివేస్తోంది. ఇక ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో ఎలాగైనా పట్టు సాధించేందుకు రష్యా అణు దాడి చేస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అణ్వాయుధాలనూ మోసుకుపోగల కింజల్ను రష్యా యుద్ధంలో తొలిసారి ప్రయోగించడంతో భయాలు రెట్టింపయ్యాయి. ఈక్రమంలో హైపర్ సోనిక్ క్షిపణి కింజల్ గురించి, ప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాల వద్ద ఈ తరహా క్షిపణులు ఉన్నాయో తెలుసుకుందాం... హైపర్ సోనిక్ మిసైళ్లను ఎదుర్కొనే రక్షణ వ్యవస్థలను ఇప్పటివరకు ఎవరూ తయారు చేయలేదని నిపుణులు అంటున్నారు. అమెరికా, రష్యా, చైనా దగ్గర అత్యాధునిక హైపర్ సోనిక్ మిసైళ్లున్నాయి. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు ఈ టెక్నాలజీపై పనిచేస్తున్నాయి. రష్యా సాయంతో కలిసి ఇండియా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్ను తయారు చేస్తోంది. సూపర్ సోనిక్ అంటే ధ్వని వేగం కన్నా ఎక్కువ వేగం (మాక్ 2 నుంచి 3)తో దూసుకెళ్లేవి. బ్రహ్మోస్ 2 హైపర్ సోనిక్ మిసైల్ను కూడా ఇండియా తయారు చేస్తోంది. హైపర్ సోనిక్ అని ఎందుకంటారు? ధ్వని వేగం కన్నా 5 రెట్లు ఎక్కువ వేగంతో వెళ్తే హైపర్ సోనిక్ అంటారు. ధ్వని వేగం గంటకు 1,234 కిలోమీటర్లు. మాక్ 5తో వెళ్లే మిసైళ్ల వేగం గంటకు దాదాపు 6 వేల కిలోమీటర్లకు పైనే ఉంటుందన్నమాట. మామూలుగా మిసైళ్లను బాలిస్టిక్, క్రూయిజ్ అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఈ హైపర్ సోనిక్ మిసైల్ క్రూయిజ్ మిసైళ్ల వర్గానికి చెందింది. హైపర్ సోనిక్ మిసైళ్లు లక్ష్యాన్ని ఛేదించే వరకు శక్తితోనే (ఇంధనం) నడుస్తుంటాయి. భూ వాతావరణంలోనే ఉంటూ తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంటాయి. పరావలయ మార్గంలో వెళ్లినా అవసరమైతే దిశను మార్చుకోవడం వీటి ప్రత్యేకత. ఇవి తక్కువ బరువునే మోసుకెళ్లగలవు. కింజల్ ప్రత్యేకతలు పేరు: కేహెచ్ 47ఎం2 కింజల్ వేగం: గంటకు 12 వేల కిలోమీటర్లకు పైనే పరిధి: 1,500 కిలోమీటర్ల నుంచి 2 వేల కిలోమీటర్లు ఎంత బరువును మోసుకెళ్లగలదు: 500 కిలోలు సంప్రదాయ, అణు బాంబులను ప్రయోగించవచ్చు – సాక్షి సెంట్రల్ డెస్క్ -
మరియుపోల్లో మారణహోమం? రెండు సూపర్ బాంబులతో అటాక్!
యుద్ధం మొదలై నాలుగు వారాలైనప్పటికీ ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడుతూనే ఉంది. బాంబులతో ఉక్రెయిన్ని అల్లాడిస్తోంది. ఈ క్రమంలో రాజధాని కీవ్ నగరంతో పాటు పలు నగరాలపై విధ్వంసం సృష్టిస్తోంది. ఇందులో ముఖ్యంగా వినిపిస్తున్న నగరం పేరు మరియుపోల్. ఇక్కడి ప్రాంతాలు, ఫ్యాక్టరీలపై రష్యా బలగాలు నిర్విరామంగా దాడులు చేస్తూనే ఉన్నాయి. ఎలాగైనా ఈ నగరాన్ని స్వాధీనం చేసుకోవాలని రష్యాసేనలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. ఆ నగరాన్ని నలుదిక్కులా చ్టుటుముట్టి అదుపులోకి లక్ష్యంగా రష్యన్ బలగాలు పని చేస్తున్నాయి. తాజాగా రెండు శక్తివంతమైన ‘సూపర్’ బాంబులను మరియుపోల్ నగరంపై రష్యా ప్రయెగించింది. ఉక్రేనియన్ అధికారులు అదుపులో ఉన్న దక్షిణ ఓడరేవు నగరం మరియుపోల్ నుంచి పౌరులను రక్షించే ప్రయత్నం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. దాదాపు 1,00,000 మంది ప్రజలు ఆ నగరంలో చిక్కుకుపోయారని, దాడి అనంతరం మృతదేహాలతో, ధ్వంసమైన భవనాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయిందని స్థానిక హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది. అత్యాధునిక మిస్సైళ్ల దాడితో రష్యా దళాలు రాజధాని కీవ్పై తమ పట్టును కొనసాగిస్తున్నందున బుధవారం ఉదయం వరకు ఆ నగరం కర్ఫ్యూ నీడలో ఉంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
బీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ కష్టపడ్డాడు: కేటీఆర్
'రెండు గంటల జర్నీ 20 నిమిషాల్లో'.. పుష్ప భామ ప్రశంసలు
ఎంపీ స్వాతి మలివాల్పై దాడి నిజమే.. స్పందించిన ‘ఆప్’
రొమాంటిక్ కామెడీ చిత్రంగా సంగీత్.. గ్రాండ్గా షూటింగ్ ప్రారంభం (ఫొటోలు)
ఢిల్లీతో లక్నో డూర్ ఆర్ డై మ్యాచ్.. తుది జట్లు ఇవే
ఎందుకలా వదిలేశారు?.. మీ బాధ్యత కాదా?.. రష్మి ట్వీట్ వైరల్
త్వరలో మస్క్కు ముప్పు.. భారత్ సంతతి సీఈవో సంచలన వ్యాఖ్యలు
తప్పక చదవండి
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- ఏపీలో తుది పోలింగ్ శాతంపై సాయంత్రానికి క్లారిటీ: ఎంకే మీనా
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- మొబైల్ యూజర్స్కు షాక్, త్వరలో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు!
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement