-
బేబీ బంప్తోనే సినిమా షూటింగ్లో పాల్గొన్న టాప్ హీరోయిన్
బాలీవుడ్లో బెస్ట్ కపుల్గా పేరున్న దీపికా పదుకొణె- రణ్వీర్ తమ అభిమానులకు కొద్దిరోజు క్రితమే గుడ్న్యూస్ చెప్పారు. తాము తల్లిదండ్రులు కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్లో డెలివరీ డేట్ కూడా ఇచ్చినట్లు దీపిక ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ఆమె చేతిలో ఇప్పటికే పలు సినిమాలు ఉన్నాయి. నెలలు గడుస్తున్న కొద్ది షూటింగ్స్కు బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది. దీంతో నిర్మాతలకు ఎలాంటి నష్టం వాటిల్ల కూడదని దీపికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉంది. తాజాగా సోషల్ మీడియాలో దీపికా పదుకొణె షూటింగ్ స్సాట్లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న 'సింగం ఎగైన్' సినిమా సెట్స్లో దీపికా కనిపించింది. ఆ ఫోటోలలో బేబీ బంప్తో దీపికా కనిపిస్తుంది. ఈ చిత్రంలో శక్తి శెట్టిగా దీపికా కనిపించనుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్, రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. పోలీస్ యూనిఫాం ధరించి 'కూల్' గ్లాస్తో అదిరిపోయే లుక్లో దీపికా కనిపిస్తుంది. ఫిబ్రవరిలో ఆమె గర్భం దాల్చినట్లు ప్రకటించిన తర్వాతా తిరిగి షూటింగ్లో పాల్గొనడం ఇదే తొలిసారి. గర్భంతో ఉన్నా కూడా దీపికా షూటింగ్లో పాల్గొనడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కానీ కొందరు మాత్రం ఫోటోలో బేబీ బంప్ పూర్తిగా కనిపించకపోవడం లేదే అంటూ కామెంట్లు పెడుతున్నారు. వాస్తవానికి చాలా బిగుతుగా ఉన్న డ్రెస్ను ఆమె ధరించడంతో బేబీ బంప్ పెద్దగా కనిపించలేదు. సినిమా కోసం దీపికా జాగ్రత్త పడుతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. -
బ్యాక్ టు షూట్
దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి నటిగా మేకప్ వేసుకున్నారు ప్రియాంకా చోప్రా. ఇద్రిస్ ఎల్బా, జాన్ సెనా, ప్రియాంకా చోప్రా, జాక్ క్వాయిడ్, స్టీఫెన్ రూట్ ప్రధాన పాత్రధారులుగా హాలీవుడ్లో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ అనే కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఇలియా నైషుల్లర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ అమెరికాలో మొదలైంది. ‘‘..అండ్ వుయ్ ఆర్ బ్యాక్..’’ అంటూ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ సినిమా స్క్రిప్ట్ను తన ఇన్స్టా స్టేటస్లో షేర్ చేశారు ప్రియాంకా చోప్రా. దీంతో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ షూట్లో ఆమె పాల్గొంటున్నారని స్పష్టమైంది. ఇక రెండు నెలల క్రితం తన వ్యక్తిగత పనుల కోసం ప్రియాంకా చోప్రా ఇండియా వచ్చారు. సోదరుడు సిద్ధార్థ్ చోప్రా నిశ్చితార్థం వేడుకలో చురుగ్గా పాల్గొన్నారు ప్రియాంక. ఈ వేడుకతో పాటు మరికొన్ని పనులను చక్కబెట్టుకుని ప్రియాంకా చోప్రా మళ్లీ నటిగా బిజీ అవుతున్నారు. -
తనకు అంత పిచ్చి ఉంటుందనుకోలేదు
‘‘డైరెక్టర్ సుకుమార్గారి టీమ్లో బుచ్చిబాబు బెస్ట్. తనకు సినిమా అంటే పిచ్చి. ‘రంగస్థలం’ కథని సుకుమార్గారు నాకు నలభై నిమిషాలు చె΄్పారు. ఆ తర్వాత ప్రతి రోజూ నాకు రెండేసి గంటలు నెరేష¯Œ ఇచ్చింది మాత్రం బుచ్చిబాబునే. తనకు సినిమా అంటే అంత పిచ్చి ఉంటుందనుకోలేదు’’ అని హీరో రామ్చరణ్ అన్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్). మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా బుధవారం ్రపారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బోనీ కపూర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో చిరంజీవి క్లాప్ కొట్టారు. డైరెక్టర్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్ను యూనిట్కి అందించారు. ఈ సందర్భంగా రామ్చరణ్ మాట్లాడుతూ ‘‘నేను, జాన్వీ కలిసి ‘జగదేకవీరుడు–అతిలోక సుందరి’ లాంటి మూవీ చేయాలని చాలామంది అనుకున్నారు. మా కాంబినేషన్ ‘ఆర్సీ 16’తో నిజం కావడం హ్యాపీ’’ అన్నారు. ‘‘నాపై నమ్మకంతో రామ్చరణ్గారు ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటాను’’ అన్నారు బుచ్చిబాబు సానా. ‘‘బుచ్చిబాబు ఏదైనా పెద్దగా ఆలోచిస్తాడు. తన కథపై తనకు ఉన్న నమ్మకం అలా ఉంటుంది’’ అన్నారు డైరెక్టర్ సుకుమార్. ‘‘ఈ సినిమాకి ఇప్పటికే మూడు ట్యూ¯Œ ్స పూర్తి చేశాం’’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ‘‘నేను ఎంతగానో అభిమానించే ప్రముఖులందరితో కలిసి ఈ వేడుకలో పాల్గొనడం నా అదృష్టం’’ అన్నారు జాన్వీ కపూర్. ‘‘బుచ్చిబాబు ఈ సినిమాతో తప్పకుండా మరో హిట్ కొడతాడు’’ అన్నారు నిర్మాత నవీన్ ఎర్నేని. ఈ ్రపారంభోత్సవంలో నిర్మాతలు వై. రవిశంకర్, ‘దిల్’ రాజు, శిరీష్, సాహూ గారపాటి, రామ్ ఆచంట, నాగవంశీ, ఎమ్మెల్యే రవి గొట్టిపాటి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పకుడు: సుకుమార్, కెమెరా: రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: వి.వై. ప్రవీణ్ కుమార్. -
AP Cinema : మినీ స్టూడియోతో హార్సిలీహిల్స్కు మహర్దశ
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ వేసవి విడిది కేంద్రం.. హార్సిలీహిల్స్పై మినీ స్టూడియోను నిర్మిస్తే ఈ ప్రాంతానికి మహర్దశ పట్టనుంది. దీని ఏర్పాటు దిశగా జరుగుతున్న ప్రయత్నాలతో హార్సిలీహిల్స్ భవిష్యత్లో సినిమా చిత్రీకరణలకు ప్రముఖ కేంద్రంగా మారనుంది. తద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధితోపాటు ఆర్థికంగానూ ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు. ఎత్తయిన కొండల సొగసులు, ప్రకృతి అందాలు, దట్టమైన అటవీప్రాంతం, చుట్టూ కొండలతో హార్సిలీíహిల్స్ ఇప్పటికే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వందకుపైగా చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. 1966లో సూపర్స్టార్ కృష్ణ నటించిన కన్నెమనసులు సినిమాతో మొదలై ఎన్నో కన్నడ, తెలుగు, తమిళ సినిమాల షూటింగ్ ఇక్కడ జరిగింది. అయితే ఏ ప్రభుత్వం ఇక్కడ షూటింగ్ కోసం చర్యలు చేపట్టలేదు. దీంతో 1996లో కృష్ణ నటించిన ఎన్కౌంటర్ సినిమా తర్వాత పెద్ద నటులెవరూ హార్సిలీహిల్స్ వైపు కన్నెత్తి చూడలేదు. ఈ పరిస్థితుల్లో ప్రముఖ దర్శకనిర్మాత మహీ వీ రాఘవ కొండపై మినీ స్టూడియో, అమ్యూజ్మెంట్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో హార్సిలీహిల్స్కు మంచి రోజులు రానున్నాయని అంటున్నారు. మళ్లీ ఈ మధ్యే సందడి.. ఈ మధ్యకాలంలో హార్సిలీహిల్స్ పరిసర ప్రాంతాల్లో సినిమాలు, వెబ్ సిరీస్ చిత్రీకరణల సందడి నెలకొంది. మహీ వీ రాఘవ ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్ చేస్తే నిర్మాణ వ్యయం భారీగా తగ్గించుకునే అవకాశం ఉందని గుర్తించి ఇటువైపు అడుగులు వేశారు. ఆయన దర్శకత్వం వహించిన పాఠశాల, యాత్ర–2 చిత్రీకరణలు ఈ ప్రాంతంలోనే జరిగాయి. సైతాన్ వెబ్ సిరీస్ను సైతం ఇక్కడే చేశారు. ఇంకా విడుదలకాని ‘సిద్ధా లోకం ఎలా ఉంది’ కూడా ఇక్కడే నిర్మాణం జరుపుకుంది. మహీ వీ రాఘవే కాకుండా ఇంకా పలువురు సినిమాలు, వెబ్ సిరీస్లను చిత్రీకరిస్తున్నారు. మినీ స్టూడియోతో ఎన్నో సౌకర్యాలు కొండపై మినీ స్టుడియో నిర్మాణం కోసం రెండెకరాల భూమిని కేటాయించాలని మహీ వీ రాఘన ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మినీ స్టూడియోతో ఎన్నో రకాలుగా స్థానికులు లబ్ధి పొందడమే కాకుండా, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. వ్యాపారపరంగా ఆర్థికంగానూ ప్రయోజనాలు ఉంటాయి. స్టూడియో ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్కోసం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. లైట్స్, చిన్న కెమెరాలు, జనరేటర్లు, వాహనాలు, వెబ్ సిరీస్ కోసం అవసరమైనవి షూటింగ్ కోసం వెంట తీసుకురావాల్సిన పరిస్థితి ఉండదు. షూటింగ్కు వచ్చేవారికి విడిది సౌకర్యాలు, భోజనం, షూటింగ్లో పనులు.. ఇలా ప్రతి విషయంలోనూ స్థానికులకు ఆర్థికంగా ప్రయోజనం లభిస్తుంది. పెద్ద సినిమాలు లేకున్నా ఏడాదికి రెండు వెబ్ సిరీస్ల చిత్రీకరణ జరిగినా రూ.5 నుంచి రూ.10 కోట్లు ఖర్చవుతుంది. కాబట్టి స్థానికులకు వివిధ రకాలుగా ఆదాయం లభిస్తుంది. స్థానికులకు ఆదాయం, తక్కువ ఖర్చుతో చిత్రీకరణే లక్ష్యం.. హార్సిలీహిల్స్పై మినీ స్టూడియో ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని షూటింగ్లకు కేంద్రంగా చేయాలన్నదే లక్ష్యం. ఇక్కడి ప్రదేశాలను వెబ్సైట్లో పెట్టి సినిమా చిత్రీకరణలకు అనువనే విషయాన్ని తెలియజేస్తాం. మదనపల్లె, ఆరోగ్యవరం, పరిసర ప్రాంతాల చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ ప్రచారం చేస్తాం. పురాతన కట్టడాలు, భవనాలు, పల్లెలు హార్సిలీహిల్స్ పరిసరాల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ సినిమాలు, వెబ్ సిరీస్లు తక్కువ ఖర్చుతో చిత్రీకరణ చేసుకునేలా ప్రణాళిక రూపొందిస్తాం. అనుభవజ్ఞులైన వారిని నియమించి సహకారం అందిస్తాం. స్థానికులకు ఆదాయ మార్గాలు పెంచేలా చూస్తాం. –మహీ వీ రాఘవ, ప్రముఖ దర్శకనిర్మాత -
నాపరాయి గనుల్లో రజనీకాంత్ షూటింగ్
యర్రగుంట్ల : మండలంలోని నిడుజివ్వి గ్రామ పరిధిలోని నాపరాయి గనులలో సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తున్న వెట్టయన్ (వేటగాడు) సినిమా షూటింగ్ మంగళవారం జరిగింది. లైకా ప్రొడక్షన్ సారథ్యంలో రజనీకాంత్ 170వ సినిమాను దర్శకుడు టీజే జ్ఙానవేల్ రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ విలన్తో మాట్లాడి ఫైట్ చేయడం చిత్రీకరించారు. అభిమానుల తాకిడి అధికంగా ఉండటంతో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, రజనీకాంత్కు సమీప సిమెంట్ పరిశ్రమ గెస్ట్హౌస్లో బస ఏర్పాటు చేశారు. -
‘పురుషోత్తముడు’ మారిన రాజ్ తరుణ్..డబ్బింగ్ పనుల్లో బిజీ
రాజ్ తరుణ్ హీరో గా రామ్ భీమన దర్శకత్వం లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'పురుషోత్తముడు'. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. రాజమండ్రి లో వేసిన భారి సెట్ లో టాకీ పూర్తి చేసుకున్న సంధర్భంగా 22న టైటిల్ రివీల్ పోస్టర్ ని విడుదల చేశారు. అయోధ్య రామజన్మభూమి ప్రాణప్రతిష్ట రోజు ఆదే సమయానికి టైటిల్ రివీల్ చేయడం ఆనందంగా ఉందని దర్శకుడు రామ్ భీమన తెలిపారు. నిర్మాతలు డా.రమేశ్ తేజావత్, ప్రకాష్ తేజావత్ మాట్లాడుతూ భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో భారీ తారాగణం తో పాటు సంగీత దర్శకుడు గోపి సుందర్ స్వరపరచిన పాటలు తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయని, చిత్రం గొప్ప విజయం సాధించబోతుందని తెలిపారు. తన కెరీర్ లో పురుషోత్తముడు గొప్ప చిత్రం అవుతుందని కెమెరామెన్ పి.జి.విందా పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. -
కల్లర్ మ్యాజిక్తో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న మన హీరోలు
కథ బొగ్గు గనుల్లో జరుగుతోంది.. అక్కడ పనిచేసేవాళ్లు ఎలా కనిపిస్తారు? ఫుల్ డార్క్గా.. కథ బంగారు గనుల్లో జరుగుతోంది.. కానీ తవ్వేవాళ్లు బంగారంలా మెరిసిపోరు.. కమలిపోయిన చర్మంతో ఉంటారు. ఇక మత్స్యకారులో... వాళ్లూ అంతే.. స్కిన్ ట్యాన్ అయిపోతుంది. ఇప్పుడు కొందరు హీరోలు ఇలా ఫుల్ బ్లాక్గా, ట్యాన్ అయిన స్కిన్తో కనిపిస్తున్నారు. పాత్రలకు తగ్గట్టు బ్లాక్ మేకప్ వేసుకుని, సిల్వర్ స్క్రీన్పై మేజిక్ చేయడానికి రెడీ అయ్యారు. ఆ హీరోలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. 31లో కొత్తగా... హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ల క్రేజీ కాంబినేషన్లో ‘ఎన్టీఆర్ 31’ (వర్కింగ్ టైటిల్) సినిమా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్లో సినిమా అనగానే ఎలా ఉంటుందో? అనే ఆసక్తి ఇటు చిత్ర వర్గాల్లో అటు సినిమా లవర్స్లో నెలకొంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్లో ఎన్టీఆర్ పూర్తి నలుపు రంగు మేకప్లో కనిపించారు. ప్రశాంత్ నీల్ గత చిత్రాలు ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్’ల తరహాలో ఎన్టీఆర్ 31 బ్లాక్ బ్యాక్డ్రాప్లో ఉంటుందని టాక్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘ఎన్టీఆర్ 31’ షూటింగ్ ఈ ఏడాది లోనే ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకాలపై ఈ సినిమా రూపొందనుంది. ‘‘ఎన్టీఆర్ ఇప్పటి వరకు చేయని పాత్ర, కథతో ‘ఎన్టీఆర్ 31’ సినిమా చేయబోతున్నాను. ఇందులో మునుపెన్నడూ చూడని విధంగా ఎన్టీఆర్ కనిపిస్తారు’’ అంటూ ప్రశాంత్ నీల్ ఆ మధ్య చెప్పిన సంగతి తెలిసిందే. గోల్డ్ ఫీల్డ్స్లో తంగలాన్ పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేస్తుంటారు విక్రమ్. దర్శకుడి విజన్ 100 శాతం అయితే విక్రమ్ 200 శాతం న్యాయం చేస్తారనడం అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించిన విక్రమ్ ‘తంగలాన్’ కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 19వ శతాబ్దం బ్యాక్డ్రాప్లో పీరియాడికల్ డ్రామాగా రూపొందింది. బ్రిటిష్ పరిపాలన కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వద్ద ఆక్రమణదారులకు ఎదురెళ్లి పోరాడిన ఓ ఆదివాసి తెగ నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుందట. ఇందులో విక్రమ్ ఆ తెగ నాయకుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన విక్రమ్ ఫస్ట్ లుక్ పూర్తి స్థాయి నలుపులో ఎంతో వైవిధ్యంగా ఉంది. మాళవికా మోహనన్, పార్వతి తిరువోతు, పశుపతి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమాని తొలుత సంక్రాంతికి, ఆ తర్వాత రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఏప్రిల్లో రిలీజ్ చేయ నున్నట్లు ఇటీవల పేర్కొన్నారు. భ్రమయుగంలో... దాదాపు 50 ఏళ్ల కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు మమ్ముట్టి. అయితే ఇప్పటివరకూ పోషించనటువంటి సరికొత్త పాత్రని ‘భ్రమయుగం’ సినిమాలో పోషిస్తున్నారాయన. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో మమ్ముట్టి లీడ్ రోల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘భ్రమయుగం’. హారర్ థ్రిల్లర్ జోనర్లో కేరళలోని కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి వాస్తవ ఘటనలతో ఈ చిత్రం రూపొందుతోంది. అక్కడి చీకటి యుగాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మమ్ముట్టి పాత్ర పూర్తి నలుపు రంగులో ఉంటుంది. ఇటీవల విడుదలైన ‘భ్రమయుగం’ మలయాళ టీజర్ పూర్తిగా బ్లాక్ అండ్ వైట్లో ఉంది. ఆద్యంతం ఉత్కంఠతో సాగిన టీజర్లో సరికొత్త లుక్లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు మమ్ముట్టి. రామచంద్ర చక్రవర్తి నిర్మిస్తున్న ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. గొర్రెల కాపరి పృథ్వీరాజ్ సుకుమారన్ హ్యాండ్సమ్గా ఉంటారు. తన నటనతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన తొలిసారి ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) సినిమా కోసం పూర్తి స్థాయిలో నల్లటి మనిషిగా మారిపోయారు. బెన్యామిన్ రాసిన ‘గోట్ డేస్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ బ్లెస్సీ. హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలా పాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి సౌదీ అరేబియాకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథ ఆధారంగా వాస్తవ ఘటనలతో ఈ సినిమా రూపొందుతోంది. గొర్రెల కాపరి నజీబ్ పాత్రలో నటిస్తున్నారు పృథ్వీరాజ్. గుబురు గడ్డం,పొడవైన జుట్టుతో నలుపు రంగులో ఉన్న పృథ్వీరాజ్ లుక్ ఇటీవల విడుదలైంది. ఈ పాత్ర కోసం ఆయన బరువు తగ్గారు. పూర్తి స్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా మాదేనంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమా మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏప్రిల్ 10న విడుదల కానుంది. ∙హ్యాండ్సమ్గా, పక్కింటి కుర్రాడిలా కనిపించే నాగచైతన్య ‘తండేల్’ సినిమా కోసం పక్కా మాస్ అవతారంలోకి మారిపోయారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం మత్య్సకారుల జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మత్స్యకారుని పాత్రలో నటిస్తున్నారు నాగచైతన్య. 2018లో జరిగిన వాస్తవ ఘటనలతో తెరకెక్కుతోంది. ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్’ అంటూ ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ ఓ డైలాగ్ చెబుతారు. నిజమే.. ఆయన కటౌట్ చూస్తే అలానే అనిపిస్తుంది. ‘బాహుబలి’ సినిమా నుంచి వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారాయన. ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సలార్: పార్ట్ 1– సీజ్ఫైర్’ డిసెంబరు 22న విడుదలై హిట్గా నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా బ్యాక్డ్రాప్ అంతా బ్లాక్గా ఉంటుంది. బొగ్గు గనుల్లో మెకానిక్ దేవ పాత్రలో ప్రభాస్ లుక్ కూడా బ్లాక్ షేడ్లో ఉంటుంది. రెండో భాగంలోనూ ప్రభాస్ ట్యాన్ లుక్లో కనిపిస్తారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.. ప్రయోగాలు చేసే హీరోల్లో సూర్య ఒకరు. కమల్హాసన్ గత బ్లాక్ బస్టర్ మూవీ ‘విక్రమ్’ (2022)లో రోలెక్స్ పాత్రలో ట్యాన్ లుక్లో కనిపించారు సూర్య. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్లైమాక్స్లో ఈ పాత్ర వస్తుంది. రెండో భాగంలోనూ ఉంటుంది. సెకండ్ పార్ట్ చిత్రీకరణ ఇంకా ఆరంభం కాలేదు. అలాగే విడుదలకు సిద్ధమవుతున్న ‘కంగువా’ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో హీరో సూర్య ట్యాన్ లుక్లో కనిపిస్తారు. -
బీచ్రోడ్డులో రాజ్ తరుణ్ సందడి
కొమ్మాది: భీమిలి బీచ్ రోడ్డు మంగమారిపేట, తొట్లకొండ బీచ్ వద్ద శనివారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. నటుడు రాజ్ తరుణ్, నటి మనీషా కందూర్ నటిస్తున్న భలే ఉన్నాడే సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించారు. రవికిరణ్ ఆర్ట్స్ పతాకంపై ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కుతోందని, హీరో రాజ్ తరుణ్ న్యూలుక్లో కనిపించబోతున్నారని దర్శకుడు జె. శివసాయి వర్ధన్ తెలిపారు. ఈ సినిమాలో సింగీతం శ్రీనివాస్ ప్రముఖ పాత్రలో నటించగా, అమ్ము అభి (నారప్ప ఫేమ్), కృష్ణ భగవాన్, హైపర్ ఆది ఇతర పాత్రలో నటిస్తున్నారన్నారు. సంగీతం శేఖర్ చంద్ర అందిస్తున్నారు. మరో 8 రోజుల పాటు బీచ్రోడ్డు ప్రాంతాల్లో చిత్రీకరణ ఉంటుందన్నారు. -
షూటింగ్లో గొడవ.. తెలుగు యంగ్ హీరో కారుని అడ్డుకున్న కూలీలు
తెలుగు యంగ్ హీరో శ్రీవిష్ణుకు కొందరు కూలీలు షాకిచ్చారు. కొత్త సినిమా షూటింగ్లో భాగంగా అనుకోని సంఘటన ఎదురైంది. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలోని బనగానెపల్లె మండలం యాగంటి క్షేత్రంలో సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనేందుకు కోసం కొందరు కూలీలని చిత్రబృందం తీసుకొచ్చింది. అయితే పూర్తయిన తర్వాత వాళ్లకు వేతనం ఇచ్చే విషయం కాస్త ఆలస్యమైంది. (ఇదీ చదవండి: టాలీవుడ్ లక్కీ హీరోయిన్ పెళ్లి చేసుకోనుందా? అందుకే ఇలా!) ఈ క్రమంలోనే తమకు రావాల్సిన డబ్బు ఇంకా రాలేదని దాదాపు 400 మంది కూలీలు.. షూటింగ్ లొకేషన్లో ఆందోళన చేశారు. అటుగా వెళ్తున్న హీరో కారుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీన్లోకి ఎంటరైన పోలీసులు.. కూలీలకు సర్దిచెప్పారు. హీరోకు ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అతడు కారుని పోనిచ్చారు. ఆ తర్వాత వివాదం కూడా సద్దుమణిగింది. గతేడాది 'సామజవరగమన' సినిమాతో హిట్ కొట్టిన శ్రీవిష్ణు.. ప్రస్తుతం పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు తెలుగమ్మాయి రీతూవర్మ కూడా గతేడాది 'మార్క్ ఆంటోని', 'ధృవ నక్షత్రం' లాంటి మూవీస్తో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న మూవీకే తాజాగా సమస్య ఎదురైంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్?) -
2024 లో దూసుకొస్తున్న పాన్ ఇండియా హీరోలు
-
తెలుగు సినిమాలు చేయడం అలవాటుగా మారింది: సుహాసిని
నా తొలి సినిమా విడుదలై నేటికి సరిగ్గా 43 ఏళ్ళు. ఇప్పటి వరకు కెరీర్లో ఎన్నో చిత్రాలు చేశాను. ఎన్నో జయపజయాలు చూశాను. అవన్నీ గతంలోనే వదిలేసి ఇప్పుడే తొలి చేస్తున్నా అనే అనుభూతితో ‘మహతి’ చేశాను. మహతి కథ, నా పాత్ర చాలా నచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఉంటాయి. టైటిల్ కి తగట్టు మహిళా ప్రాధాన్యత గల చక్కని అంశాలు ఉన్నాయి’ అని సీనియర్ నటి సుహాసిని మణిరత్నం అన్నారు. సందీప్ మాధవ్ కథానాయకుడిగా శివ ప్రసాద్ స్వీయ దర్శక నిర్మాణంలో శ్రీ పద్మిని సినిమాస్ ప్రొడక్షన్ నెంబర్ 3గా రూపొందుతున్న చిత్రం 'మాహతి'. సుహాసిని మణిరత్నం, దీప్సిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోజు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ..తెలుగులో వరుసగా సినిమాలు చేయడం ఒక అలవాటుగా మారింది. ‘మహతి’లాంటి మంచి చిత్రంతో కెరీర్ పరంగా 44వ ఏడాదిని ప్రారంభిస్తున్నాను. ఒక క్రైమ్ చేయడం కంటే ఆ క్రైమ్ ని చూస్తూ ఏం చేయకుండా ఊరుకోవడం ఇంకా పెద్ద క్రైమ్. అదే ఈ సినిమా ప్రధానాంశం. ఇందులో ఉండే పాత్రలని అద్భుతంగా తీర్చిదిద్దారు దర్శకుడు. చాలా మంచి టీం కలసి పని చేస్తున్నాం’ అని అన్నారు. డైరెక్టర్ శివ ఆద్యంతం ఆకట్టుకునేలా ఈ కథని తీర్చిదిద్దారు.సుహాసిని గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా అనందంగా ఉంది’అని హీరో సందీప్ మాధవ్ అన్నారు. ‘మహతి కథ అద్భుతంగా ఉంటుంది. ఇందులో నా పాత్ర అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’అని నటి దీప్సిక అన్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. స్టార్ కంపోజర్ శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. -
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
ప్రమాదం వల్ల అప్పుడు ఆపేశారు.. ఇప్పుడు మళ్లీ షురూ!
తమిళ స్టార్ హీరో అజిత్ కొత్త సినిమా 'విడాముయర్చి'. మగిళ్ తిరమేని దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చాలాకాలం తరువాత త్రిష, అజిత్ మూవీలో నటిస్తుండటం విశేషం. ప్రియా భవానీ శంకర్, సంజయ్ దత్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 మూవీస్) తొలి షెడ్యూల్ అజర్ బైజాన్ దేశంలో చేశారు. అప్పుడు అసిస్టెంట్ కెమెరామెన్ ప్రమాదవశాత్తూ మృతి చెందడంతో మధ్యలో నిలిపేశారు. చిన్న గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్లీ ఆ దేశానికి చెక్కేశారు. తాజాగా హీరో అజిత్.. చైన్నె విమానాశ్రయంలో అభిమానితో దిగిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అజర్ బైజాన్లో మిగతా షెడ్యూల్కి సంబంధించిన సన్నివేశాలన్నీ పూర్తి చేసుకుని.. కొన్ని రోజుల తర్వాత మూవీ యూనిట్ చెన్నైకి తిరిగొస్తారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?) -
ఎక్స్ట్రార్డినరీ సాంగ్
ఎక్స్ట్రార్డినరీ లెవల్లో డ్యాన్స్ చేశారు నితిన్. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎక్స్ట్రా: ఆర్డినరీ మ్యాన్’. రాజశేఖర్ ఓ కీలక పాత్రధారి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది. ఓ భారీ సెట్లో 300 మందికి పైగా ఫారిన్ డ్యాన్సర్స్తో జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో నితిన్, శ్రీలీలపై ఓ మాస్ సాంగ్ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవు తుందని, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని యూనిట్ పేర్కొంది. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్యా మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 8న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: హ్యారిస్ జైరాజ్. -
హీరోతో కలిసి ఎంగిలి ఐస్క్రీమ్ తినమన్నారు.. ఇబ్బంది పడ్డా: సుహాసిని
ఒకప్పుడు తెలుగు స్టార్ హీరోయిన్గా కొనసాగారు సుహాసిని. చిరంజీవి, బాలకృష్ణ, వెంటకేశ్ లాంటి బడా హీరోలందరితోనూ నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పలు సినిమాల్లో తల్లి పాత్రతో పాటు సహాయక నటిగా చేస్తోంది. అయితే హీరోయిన్గా చేసినప్పుడు తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితుల గురించి తాజాగా ఓ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుహాసిని మాట్లాడారు. ‘గతంలో హీరోయిన్గా చేసినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కొన్ని అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించాల్సి వస్తే..సున్నితంగా తిరస్కరించేదాన్ని. ఓ సినిమాలో హీరో ఒడిలో కూర్చునే సన్నివేశం ఉంది. అది చేయాలని డైరెక్టర్ చెబితే.. నేను నో చెప్పాను. పరాయి వ్యక్తి ఒడిలో కూర్చోవడం తప్పు..కాబట్టి నేను ఆ సీన్ చేయనని గట్టిగా వాధించాను. (చదవండి: స్టార్ హీరోతో ప్రేమలో పడ్డ మృణాల్ ఠాకూర్!) అదే సినిమాలో హీరో కలిసి ఐస్క్రీమ్ తినే సీన్ ఉంది. హీరో తిన్న ఐస్క్రీమ్నే తినాలని నాకు చెప్పారు. అది నాకు నచ్చలేదు. ‘వేరే వాళ్లు ఎంగిలి చేసింది నేను తినడం ఏంటి? ఐస్క్రీమ్ మార్చండి’అని ఫైర్ అయ్యాను. దీంతో కొరియోగ్రాఫర్ షాకయ్యారు. నేను చెప్పిన విధంగా చేయలని నాపైకి సీరియస్ అయ్యాడు. అయినా కూడా నేను అంగీకరించలేదు. ఐస్క్రీమ్ తినడం కాదు కదా కనీసం ముట్టుకోబోనని తెగేసి చెప్పారు. ఆ తర్వాత ఐస్క్రీమ్ మార్చారు’అని సుహాసిన చెప్పికొచిఉ్చంది. -
వాస్తవ సంఘటనలతో ‘భ్రమర’
30 ఇయర్స్ పృద్వి , పృద్వి రాజ్(పెళ్లి) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం భ్రమర. టి.వి రవి నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగమహేష్, జయవాణి,మీసాల లక్ష్మణ్, జబర్దస్త్ అప్పారావు, ఆకెళ్ళ, దువ్వాసి మోహన్, పసునూరి శ్రీనివాస్, మాణిక్యం, టార్జాన్ ఇతర కీలక పాత్రలో పోషిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నిర్మాత బెక్కం వేణుగోపాల్ చిత్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా..తెలంగాణ ఎఫ్.డి.సి.చైర్మన్ అనిల్ కుర్మచలం కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో గెస్ట్ గా వచ్చిన హైకోర్ట్ అడ్వకేట్ సుంకర నరేష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో క్రైమ్ ఎక్కువ జరుగుతుంది. అయితే ప్రజలను అవగాహన పరస్తూ ప్రజలలో చైతన్యం తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో దర్శక, నిర్మాతలు డార్క్ క్రైమ్స్ బ్యాక్ డ్రాప్స్ లో "భ్రమర" అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ టైటిల్ లో ఎటువంటి సౌండ్ ఉందో సినిమాలో కూడా అటువంటి సౌండ్ ఉంటుంది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకు మీడియా తో పాటు ప్రేక్షకులు కూడా సపోర్ట్ చేస్తూ మూవీ యూనిట్ ను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. ‘డార్క్ క్రైమ్స్ బ్యాక్ డ్రాప్ మీద ఈ సినిమా నడుస్తుంది. .ఢిల్లీ, కొల్ కత్తా, చిక్మంగళూరు బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తీస్తున్నాము. ఈ సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా రాహుల్ శ్రీ వాత్సవ్, మ్యూజిక్ డైరెక్టర్ గా కార్తీక్ బి. కొడగండ్ల చేస్తున్నారు. ఇంపార్టెంట్ రోల్ లో సీనియర్ నటులు 30 ఇయర్స్ పృద్వి ,పెళ్లి సినిమా పృద్వి రాజ్ తో పాటు నికితశ్రీ లీడ్ రోల్ లో నటిస్తుంది’అని దర్శకుడు టీవీ రవి నారాయణన్ అన్నారు. ‘మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఇలాంటి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు’ అని నటి నిత్య శ్రీ అన్నారు -
నల్గొండ 'నాగిరెడ్డిపల్లి' లో ‘గేమ్ ఛేంజర్’ గా కనిపించిన హీరో రాంచరణ్..
నల్గొండ: భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలో గల శ్రీ భీమరావ్ రైస్ గోదాములో హీరో రాంచరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా గోదాములోని కల్తీ బియ్యం పట్టుకునే సన్నివేశాలు చిత్రీకరించారు. శంకర్ దర్శకత్వంలో దిల్రాజ్ నిర్మాతగా ఎస్వీసీ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ చిత్రంలోని గోదాముకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ శనివారం కూడా ఇక్కడే కొనసాగనుంది. -
చిరంజీవి కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది.. వివరాలు ఇవే
భారీ అంచనాల మధ్య విడుదలైన భోళా శంకర్ చిరంజీవి కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచిపోయింది. దీంతో చిరంజీవి కొంత గ్యాప్ తీసుకుని తన తన తదుపరి సినిమాల విషయంలో నిర్ణయం తీసుకుంటాడని సోషల్మీడియాలో ప్రచారం జరిగింది. వరుస పరాజయల తర్వాత కొంత బ్రేక్ తీసుకొన్న తరవాతే.. కొత్త సినిమా ప్రకటన ఉంటుందని వార్తలొచ్చాయి. అయితే, మెగాస్టార్ ప్రణాళికల్లో ఎలాంటి మార్పూ లేదని, ఇలాంటి ఒడిదుడుకులు సహజమేనని ఈ ప్రకటనతో చిరంజీవి తెలిపారని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: ఆ సినిమా కోసం అనిరుధ్ మ్యూజిక్తో పాటు ఆరుగురు వరల్డ్ ఫేమస్ ఫైట్ మాస్టర్స్) ముందుగా అనుకొన్నట్టుగానే తన పుట్టిన రోజున నేడు (ఆగష్టు 22) కొత్త సినిమా ప్రకటన వచ్చేస్తోంది. దానిలో భాగంగానే కొన్నిగంటల క్రితం యూవీ క్రియేషన్స్ ట్విటర్ ద్వారా ఒక పోస్టర్ను విడుదల చేసింది. భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత చిరంజీవి చెయబోయే సినిమా ఎవరితో ఉంటుందా అని ఫ్యాన్స్ చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సమయంలో తాజాగా యూవీ క్రియేషన్స్ అధికారికంగా సోషల్మీడియాలో ఒక పోస్టర్తో గుడ్న్యూస్ తెలిపింది. నేడు 10:53 నిమిషాలకు మెగాస్టార్ మూవీకి చెందిన పలు వివరాలను ప్రకటిస్తామని వారు వెల్లడించారు. యూవీ క్రియేషన్స్-చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్తో బింబిసార మూవీ ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ మెగాఫోన్ పట్టనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. (ఇదీ చదవండి: ఫైనల్గా వశిష్ఠకే దక్కిన మెగా 157 ప్రాజెక్ట్) The universe conspires for beautiful things to happen ✨ One man inspires us to achieve the universe itself 💫 Stay tuned to @UV_Creations ❤️ Today at 10.53 AM 🔮#HBDMegastarChiranjeevi pic.twitter.com/v7W9LCB8Ij — UV Creations (@UV_Creations) August 21, 2023 -
కాజోల్ కొత్త 'మిస్టరీ' మొదలైంది
బాలీవుడ్ హీరోయిన్స్ కాజోల్, కృతీసనన్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘దో పత్తీ’. మిస్టరీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాకి శశాంకా చతుర్వేది దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది. కృతీసనన్ , కాజోల్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు శశాంక. ఈ సినిమాను రచయిత కనికా థిల్లాన్ , కృతీసనన్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సినిమా డైరెక్ట్గా స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు 2015లో షారుక్ ఖాన్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘దిల్వాలే’ చిత్రంలో కాజోల్, కృతీసనన్ కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు ‘దో పత్తీ’ కోసం ఈ ఇద్దరూ సెట్స్లో జాయిన్ అవుతున్నారు. -
The Gentlemen 2 launch : జెంటిల్మేన్-2 ప్రారంభం.. కీరవాణికి సన్మానం (ఫొటోలు)
-
డిఫరెంట్ కాన్సెప్ట్తో ‘కలియుగం పట్టణంలో’
విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా తాజా చిత్రం‘కలియుగ పట్టణంలో’. నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ లు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం టైటిల్ లోగోని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజద్ బాషా చేతుల మీదగా రిలీజ్ చేయగా.. మంచి స్పందల లభించింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కడప జిల్లాలోని అందమైన లొకేషన్లలో జరుగుతోంది. ఒకే షెడ్యూల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేస్తామని నిర్మాతలు చెప్పారు. డిఫరెంట్ కాన్సెప్ట్తో ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమాను మేకర్లు రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు అజయ్ అరసాద సంగీతాన్ని అందిస్తుండగా.. చరణ్ మాధవనేని కెమెరామెన్గా పని చేస్తున్నారు. గ్యారీ బీ.హెచ్. ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని మేకర్లు తెలిపారు. -
పట్టణంలో వినోదం
సుహాస్, షాలిని కొండేపూడి జంటగా నటిస్తున్న వినోదాత్మక చిత్రం ‘కేబుల్ రెడ్డి’. శ్రీధర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు శ్రీధర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు శైలేష్ కొలను క్లాప్ కొట్టి, స్క్రిప్ట్ని మేకర్స్కు అందించారు. అనంతరం సుహాస్ మాట్లాడుతూ– ‘‘రెండు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ను స్టార్ట్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఒక టౌన్లో జరిగే క్లీన్ ఎంటర్టైనర్ ఇది’’ అన్నారు శ్రీధర్ రెడ్డి. ‘‘బౌండెడ్ స్క్రిప్ట్తో షూట్కి వెళ్తున్నాం. మొదటి షెడ్యూల్ను 20 రోజుల్లో పూర్తి చేస్తాం’’ అన్నారు బాలు వల్లు. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: మహి రెడ్డి పండుగల. -
ప్రేమ.. వినోదం
‘చైతన్య రావ్, హృతికా శ్రీనివాస్ జంటగా కొత్త సినిమా షురూ అయింది. సాయి తేజ దర్శకత్వంలో గౌతమ్స్ ఈగల్ ఎంటర్టైన్మెంట్పై ఎం.గౌతమ్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభమైంది.ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ అనిల్ కూర్మాచలం కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాతలు సి.కల్యాణ్ క్లాప్ కొట్టగా, బెక్కం వేణుగోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘కామెడీ, లవ్, ఎమోషన్స్ .. వంటి ఆకట్టుకునే అంశాలు ఈ మూవీలో ఉంటాయి’’ అన్నారు ఎం.గౌతమ్. నిర్మాత రాచాల యుగంధర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మోహన్ పున్న,లైన్ ప్రొడ్యూసర్: వంశీ కృష్ణ, కెమెరా: పీసీ మౌళి, సంగీతం: గ్యాని. -
సంజోష్ హీరోగా కొత్త చిత్రం
బేవర్స్ చిత్రంతో హీరోగా తెరకు పరిచయం అయ్యాడు సంజోష్. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో నటించిన ఆ చిత్రంలో సంజోష్ తన నటనతో అందరినీ మెప్పించాడు. ప్రస్తుతం ఆయన కౌముది సినిమాస్, కేన్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.2గా చంద్ర నిర్మిస్తోన్న సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో సంజోష్ బర్త్ డే సందర్భంగా చిత్రయూనిట్ ప్రత్యేకంగా విషెస్ చెబుతూ, పోస్టర్ను రిలీజ్ చేసింది. (చదవండి: జులై 13 నాకు చాలా స్పెషల్ : సమంత) ఈ పోస్టర్లో సంజోష్ కూల్గా కనిపిస్తున్నాడు. పక్కింటి అబ్బాయిలా సహజంగా కనిపిస్తున్నాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు మేకర్లు త్వరలోనే ప్రకటించనున్నారు. -
శివ కార్తికేయన్ ‘మహావీరుడు’మూవీ స్టిల్స్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement