-
రజినీకాంత్ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెలుసా?
రజినీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రల్లో ఇతర రాష్టాలకు చెందిన స్టార్స్ను తీసుకురావడం ఇటీవల ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా జైలర్ చిత్రంతోనే ఇది మొదలైందని చెప్పొచ్చు. ఆ చిత్రంలో మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, కన్నడ సూపర్స్టార్ శివరాజ్కుమార్, బాలీవుడ్ స్టార్ జాకీష్రాఫ్ వంటి వారు అతిథి పాత్రల్లో మెరిసి జైలర్ చిత్ర విజయానికి కారణం అయ్యారనే చెప్పాలి. ఇకపోతే తాజాగా రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న వేట్టైయాన్ చిత్రంలోనూ బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ స్టార్ నటుడు రాణా వంటి వారు నటిస్తున్నారు.కాగా రజనీకాంత్ త్వరలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఆయన 171 చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ క్రేజీ చిత్రానికి కూలీ అనే టైటిల్ను నిర్ణయించారు. ఈ చిత్ర టైటిల్తోపాటు ఫస్ట్లుక్ పోస్టర్ను, టీజర్ను వరుసగా చిత్ర ప్రారంభానికి ముందే విడుదల చేసి హైప్ను తీసుకొచ్చారు. కాగా కూలీ చిత్రం షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుంది. ఇందులో రజనీకాంత్కు జంటగా శోభన నటించనున్నారు.అలాగే నటి శృతిహాసన్ కూడా ఇందులో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా టాలీవుడ్ స్టార్ నటుడు నాగార్జున కూడా కూలీ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించనున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కాగా నటుడు నాగార్జున ఇప్పటికే నటుడు ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న ద్విభాషా చిత్రం కుబేరాలో ముఖ్య పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. మరి కూలీ చిత్రంలో ఈయన పాత్ర ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. పలు ప్రత్యేకతలతో కూడిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. -
డంప్యార్డ్లో ధనుష్.. ఫ్యాన్స్ అభినందనలు
ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రష్మికా మందన్న కథానాయిక. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ముంబై మహానగరంలో అత్యంత భారీ డంప్యార్డ్లో ధనుష్తో ఒక సీన్ తీయాలని మేకర్స్ ప్లాన్ చేశారట. కానీ ఆ డంప్ యార్డ్ను సెట్టింగ్స్తో క్రియేట్ చేయాలని అనుకున్నారట. అయితే సినిమాకు అత్యంత కీలకంగా ఉన్న ఈ సీన్ను సహజంగా రావడం కోసం డంప్ యార్డ్లోనే షూటింగ్ చేద్దామని ధనుష్ చెప్పడమే కాకుండా.. అందుకు తగ్గట్లుగా సుమారు 10 గంటల పాటు మాస్క్ లేకుండానే డంప్యార్డ్లో ధనుష్ నటించారట. ఈ విషయం తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ ధనుష్ను అభినందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్లో కూడా ధనుష్ డీగ్లామరైజ్గా కనిపించి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో కీలకపాత్రలో నటించనున్న నాగార్జున ఫస్ట్ లుక్ను కూడా మీకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నాగ్ను చూసిన ఆయన ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న కుబేర ఇదే ఏడాదిలో విడుదల కానుంది. -
నోటు కథేంటి?
ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రష్మికా మందన్న కథానాయిక. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ని విడుదల చేశారు. వర్షం కురుస్తుండగా గొడుగు పట్టుకుని నిల్చున్నారు నాగార్జున. ఆయన వెనకవైపు డబ్బు నోట్ల కట్టలు ఉన్న కంటైనర్ కనిపిస్తోంది. కాగా.. ఓ ఐదువందల రూపాయల నోటు కింద పడి ఉండటాన్ని చూసిన నాగార్జున తన పర్సులోంచి ఓ నోటుని తీసి, ఆ కంటైనర్లో పెడతారు. మరి.. ఆ నోటు వెనక కథేంటి అనేది సినిమాలో చూడాల్సిందే. ‘‘వైవిధ్యమైన కథాంశంతో ‘కుబేర’ రూపొందుతోంది. ఈ చిత్రం కోసం బ్యాంకాక్లో నాగార్జున, ఇతర నటీనటులపై కొంత టాకీ, యాక్షన్ పార్ట్ చిత్రీకరించాం. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది’’ అని యూనిట్ పేర్కొంది. -
'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'కుబేర'. ఈ సినిమా నుంచి ఇప్పటికే ధనుష్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. తాజాగా కింగ్ నాగార్జున లుక్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున కీలకపాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.కుబేర సినిమాలో ధనుష్ కొంత సమయం పాటు రిచ్గా కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. కానీ, ధనుష్ ఫస్ట్ లుక్లో మాత్రం బిచ్చగాడి పాత్రలో కనిపించారు. నాగార్జున మాత్రం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా కోసం నాగార్జున అభిమానులతో పాటు ధనుష్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేస్తామని డైరెక్టర్ శేఖర్ కమ్ముల చెప్పారు. -
ముంబైలో కుబేర
ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవల బ్యాంకాక్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది.కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ముంబైలోప్రారంభం అయింది. దాదాపు రెండు వారాల పాటు సాగే ఈ షెడ్యూల్లో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట శేఖర్ కమ్ముల. సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ‘కుబేర’ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
బ్యాంకాక్లో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్ రోల్స్లో నటిస్తున్న మల్టీస్టారర్ ఫిల్మ్ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్నారు. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ని బ్యాంకాక్లో ్ర΄ారంభించారు. ‘‘సరికొత్త కథాంశంతో రూ΄÷ందుతున్న చిత్రం ‘కుబేర’. బ్యాంకాక్లో ్ర΄ారంభించిన షెడ్యూల్లో నాగార్జునతో ΄ాటు మరికొందరు నటీనటులపై కొన్ని టాకీ, యాక్షన్ ΄ార్ట్లు చిత్రీకరించనున్నాం. భారీ స్థాయిలో రూ΄÷ందుతున్న ఈ సినిమా ఇంతకుముందు ఎవరూ చూడని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకుంటోంది. శివరాత్రి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్కి అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: సోనాలీ నారంగ్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి. -
పాకిస్థాన్లో హీరో నాగార్జునని పోలిన వ్యక్తి.. లక్షల్లో నెల సంపాదన!
ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట. ఇది నిజమా కాదా అని పక్కనబెడితే కొందరు వ్యక్తుల్ని చూస్తుంటే మాత్రం అదే అనిపిస్తుంది. ఇప్పుడు అలానే పాకిస్థాన్లోని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాడు. దీనికి కారణం ఏంటంటే అతడు.. తెలుగు స్టార్ హీరో నాగార్జునలా ఉండటమే. కేవలం పోలికల ఉండటం ఇతడికి ప్లస్ అయింది. అలానే నెలకు లక్షలు సంపాదిస్తున్నాడట. (ఇదీ చదవండి: ఎట్టకేలకు బయటకొచ్చిన అనుష్క.. ఇంతలా మారిపోయిందేంటి!?) 2019 నుంచి టిక్ టాక్ వీడియోలు చేసుకుంటున్న పాకిస్థాన్లో జైన్ అక్మల్ ఖాన్ అలియాస్ షికారీ మాస్ అనే వ్యక్తికి ఒకానొక సందర్భంలో తాను ఇండియన్ యాక్టర్ నాగార్జునలా ఉన్నట్లు ఎవరో చెప్పారు. దీంతో సదరు వ్యక్తి.. మన నాగార్జున గురించి తెలుసుకున్నాడు. కాస్త అతడిలా మేకప్ చేసుకుని షార్ట్ వీడియోస్ చేశాడు. ఇప్పుడు మాత్రం ఫుడ్ వ్లాగింగ్ చేస్తున్నాడు. పాకిస్థాన్లో ఫుడ్ వ్లాగర్గా ఫేమ్ తెచ్చుకున్న ఇతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. తాను నాగార్జున పోలికలతో ఉండటం బాగా కలిసొస్తుందని, ఫుడ్ వీడియోలు చేసుకుంటూ నెలకు రూ.4-5 లక్షల వరకు సంపాదిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన జీవితం హ్యాపీగా ఉందని అన్నాడు. ఏదేమైనా నాగ్ పోలికలు ఉండటం మనోడికి బాగా ప్లస్ అయింది. లక్షలు సంపాదించుకుంటున్నాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు తెలుగు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) Pakistan Media about King Nag Craze 🔥🔥🔥 This guy has become the biggest food vlogger of Pakistan entirely relying on Nag's craze 🔥 🔥 🔥@iamnagarjuna#Nagarjuna 👑👑👑 https://t.co/ISHYZx113G pic.twitter.com/eB6ZNeg8TZ — Nag Mama Rocks (@SravanPk4) March 10, 2024 -
చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలయ్య కలిసి నటించిన ఏకైక మూవీ!
మల్టీస్టారర్ సినిమాలంటే జనాలకు మహా క్రేజు.. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఇప్పటివరకు మల్టీస్టారర్ సినిమాలకు ఢోకా లేదు. ఇద్దరు హీరోల కాంబినేషన్ ఎలా ఉందో చూడాలని అభిమానులు తెగ ముచ్చటపడుతుంటారు. అయితే అప్పట్లోనే నలుగురు స్టార్ హీరోలు.. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ కలిసి నటించారు. వీళ్లంతా కలిసి ఏ సినిమా చేశారా? అని ఆలోచిస్తున్నారా? ఆ మల్టీస్టారర్ మూవీ ఇదే ఒకరు హీరోగా నటిస్తే.. మిగిలిన ముగ్గురు అతిథులుగా మెరిశారు. ఆ సినిమా పేరే త్రిమూర్తులు. ఇందులో వెంకటేశ్, అర్జున్, రాజేంద్రప్రసాద్ హీరోలుగా నటించారు. ఖుష్బూ, శోభన, అశ్విని హీరోయిన్లుగా నటించారు. కె. మురళీ మోహనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1987లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మల్టీస్టారర్ సినిమాలో మెగాస్టార్, కింగ్ నాగ్, బాలయ్య గెస్టులుగా కనిపించారు. వీరు మాత్రమే కాదు. ఇండస్ట్రీ అంతా దిగింది. అతిరథులంతా ఇందులోనే కృష్ణ, విజయ నిర్మల, కృష్టంరాజు, చంద్రమోహన్, మురళీ మోహన్, విజయశాంతి, పద్మనాభం, రాధ, భానుప్రియ, శారద, రాధిక, శారద, జయమాలిని, అనురాధ, వై.విజయ.. ఇలా పలువురు సెలబ్రిటీలు కనిపించారు. ఇంతమంది నటించిన ఏకైక సినిమా త్రిమూర్తులు అనే చెప్పవచ్చు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా క్లిక్ అవలేదు. భారీ తారాగణం ఉన్నప్పటికీ సినిమాలో విషయం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఆడలేనట్లు అర్థమవుతోంది. టి.సుబ్బిరామిరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి బప్పి లహరి సంగీతం అందించాడు. ఐదు పాటలకు వేటూరి సుందరరామమూర్తి లిరిక్స్ అందించాడు. ఇది హిందీ మూవీ నసీబ్కు రీమేక్గా తెరకెక్కింది. చదవండి: అక్క భర్తతో ప్రేమలో పడ్డా.. నేను చెడిపోయినా పర్వాలేదని లొంగిపోయాను: జయలలిత -
పాన్ ఇండియా సినిమా.. ఆసక్తిగా 'కుబేర' ఫస్ట్ లుక్ పోస్టర్
ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేశారు. దీన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కుబేర అనే టైటిల్ను మేకర్స్ ఖరారు చేశారు. ఈమేరకు తాజాగా టైటిల్ గ్లింప్స్ను విడుదల చేశారు. ధనుష్ టైటిల్కు భిన్నమైన లుక్లో చిరిగిన బట్టలు, మాసిన జుట్టు, గుబురు గడ్డంతో ఆసక్తికరంగా కనిపించారు. అదే పోస్టర్లో ధనుష్ వెనక అన్నపూర్ణ దేవి నుంచి శివుడు భిక్ష తీసుకుంటున్నట్లుగా ఉన్న పెయింటింగ్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది. కాగా ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే తిరుపతి పరిసరప్రాంతాల్లో తొలి షెడ్యూల్ చిత్రీకరణను, గోవాలో మరో షెడ్యూల్ను పూర్తి చేశారు మేకర్స్. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ ఈ వారంలో హైదరాబాద్లోప్రారంభం కానుందని తెలిసింది. తాజాగా విడుదలైన పోస్టర్ను బట్టి ఈ సినిమాలో ధనుష్, నాగార్జునల పాత్రలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
20 ఏళ్ల తర్వాత కలిసిన 'మన్మథుడు' జోడీ.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్!
తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని సినిమాల్లో 'మన్మథుడు' ఒకటి. నాగార్జున, సోనాలి బింద్రే, బ్రహ్మానందం, త్రివిక్రమ్, దేవిశ్రీ ప్రసాద్.. ఇలా ఒకరిని మించి మరొకరు ఈ మూవీకి బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు. కల్ట్ క్లాసిక్ మూవీగా నిలబెట్టారు. ఇప్పుడు ఈ మూవీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే.. 'మన్మథుడు'లో ఓ హీరోయిన్గా చేసిన అన్షు.. ఇప్పుడు నాగార్జునని కలిసింది. ఇంట్రెస్టింగ్ పోస్ట్ కూడా పెట్టింది. (ఇదీ చదవండి: డైరెక్ట్గా ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే) 2002లో వచ్చిన 'మన్మథుడు' సినిమాలో హీరోగా నాగార్జున ఎంత అందంగా కనిపిస్తారో.. హీరోయిన్లుగా చేసిన సోనాలి బింద్రే, అన్షు కూడా అంతే అందంగా కనిపిస్తారు. అయితే ఈ మూవీ చేసిన తర్వాత అన్షు.. మరో రెండు తెలుగు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత పూర్తిగా నటనకు దూరమైపోయింది. పెళ్లి చేసుకుని ఇంగ్లాండ్లో సెటిలైపోయింది. దాదాపు 20-21 ఏళ్ల తర్వాత భారత్ తిరిగొచ్చిన అన్షు.. ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. నాగార్జునతో కలిసి పార్టీ కూడా చేసుకుంది. రీసెంట్గా 'మన్మథుడు' జోడీ నాగార్జున-అన్షు కలిసి పార్టీ చేసుకున్నారు. పలు ఫొటోలు బయకొచ్చాయి. తాజాగా ఇప్పుడు నాగార్జునని కలవడం గురించి స్వయంగా హీరోయిన్ అన్షునే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. 'ఔదర్యం, మంచిగా ఉండటం అనేవి నాగ్ సర్లో మరింతగా పెరిగాయి. ఈ జ్ఞాపకాలు మరింత పదిలంగా ఉంటాయి' అని అన్షు రాసుకొచ్చింది. ఇప్పుడు ఫొటోలు అభిమానులకు తెగ నచ్చేస్తున్నాయి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) -
హైదరాబాద్ : కైలాస్, మహిక వివాహ వేడుకలో సినీ ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
'నా సామిరంగ'లో అది నచ్చలేదు.. ఇలా చేసుంటే కలెక్షన్స్..
నాగార్జున అక్కినేని. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్ మూవీ నా సామిరంగ. ఆషిక రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్లుగా నటించారు. 'పొరింజు మరియమ్ జోస్' అనే మలయాళ సూపర్ హిట్ చిత్రానికి ఇది రీమేక్గా వచ్చింది. తాజాగా ఈ సినిమా చూసిన రచయిత పరుచూరి గోపాలకృష్ణ యూట్యూబ్లో రివ్యూ ఇచ్చాడు. ఆ టెక్నిక్ ఫాలో కావట్లే.. ఆయన మాట్లాడుతూ.. 'సినిమా బాగుంది. కానీ వసూళ్లు అంతగా రాలేవు. ఏ దర్శకుడికైనా, రచయితకైనా, నటుడికైనా సంతృప్తినిచ్చే సినిమాలు కొన్నుంటాయి. ఈ మూవీ ఆ జాబితాలోకే వస్తుంది. దిగ్గజ డైరెక్టర్ దాసరి నారాయణరావు టెక్నిక్ను చాలామంది యువదర్శకులు ఫాలో అవడం లేదు. ఆయన సినిమాలో ఆఖరి అరగంటే చిత్రానికి గుండెకాయ. అప్పటివరకు ఎలా ఉన్నా చివర్లో మాత్రం ప్రేక్షకులు కన్నార్పకుండా చూసేవారు. కళ్లతో నటించారు నా సామిరంగ మూవీ విషయానికి వస్తే.. ఫస్టాఫ్లో రొమాన్స్కు ప్రాధాన్యమిచ్చారు. నాగార్జున గడ్డం పెంచి, లుంగీ కట్టి కొత్తగా కనిపించారు. కిష్టయ్య పాత్రను ప్రేమించారు. తన పాత్రకు న్యాయం చేశారు. కళ్లతో నటించారు. ఎప్పుడూ కామెడీ పండించే అల్లరి నరేశ్ ఎక్కువ ఫైట్లు చేశాడు. ఇంటర్వెల్లో రావు రమేశ్ పాత్రను ముగించకుండా ఉంటే బాగుండనిపించింది. ఇంటర్వెల్లో ఆయన పాత్ర క్లోజ్ చేయడంతో సెకండాఫ్లో కొత్త విలన్ వస్తాడని సగటు ప్రేక్షకుడికి సులువుగా తెలిసిపోతుంది. కూతుర్ని భయపెట్టే క్రమంలో నిజంగానే ఆయన పాత్ర చనిపోతుంది. ఈ పాత్రను అంతం చేయకుండా అలాగే కొనసాగిస్తే సెకండాఫ్ ఇంకా బాగుండేదనిపించింది. ప్రేక్షకులు భరించలేరు అల్లరి నరేశ్ పాత్రను కూడా ముగించకుండా ఉండాల్సింది. ఎందుకంటే హీరో పక్కన ఉన్నవాళ్లను చంపుకుంటూ పోతే ప్రేక్షకులు భరించలేరు. హీరో విలన్లను చంపుకుంటూ పోతే సినిమా సూపర్ హిట్ అవుతుంది, అదే విలన్.. హీరో మనుషులను చంపుకుంటూ పోతే సినిమా దెబ్బతింటుంది. అయినా లక్కీగా ఈ సినిమా బయటపడింది. నాజర్ పాత్ర చివర్లో చేసిన పని కూడా నచ్చలేదు. సెకండాఫ్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండుంటే మరిన్ని కలెక్షన్స్ వచ్చుండేవి' అని చెప్పుకొచ్చాడు. చదవండి: విజయకాంత్ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్.. నేను వద్దని తెగేసి చెప్పారు -
గోవాను టార్గెట్ చేసిన ధనుష్, నాగార్జున
ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘డీఎన్ఎస్’(వర్కింగ్ టైటిల్) అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ముంబై మాఫియా నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే తిరుపతి పరిసరప్రాంతాల్లో తొలి షెడ్యూల్ చిత్రీకరణను, గోవాలో మరో షెడ్యూల్ను పూర్తి చేశారు మేకర్స్. ధనుష్, నాగార్జున పాల్గొనగా కీలక సన్నివేశాలను తీశారు. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ ఈ వారంలో హైదరాబాద్లోప్రారంభం కానుందని తెలిసింది. ధనుష్, నాగార్జున పాల్గొనే ఈ షెడ్యూల్లోనే హీరోయిన్ రష్మికా మందన్నా కూడా జాయిన్ అవుతారట. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాప్ హీరోయిన్.. ట్రోల్స్తో నెటిజన్లు
ఆయేషా టకియా అంటే గుర్తుపడతారో లేదో కానీ నాగార్జున సినిమా 'సూపర్' హీరోయిన్ అంటే మాత్రం ఇట్టే కనిపెడతారు. 'సూపర్'తో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అప్పటికే బాలీవుడ్లోనూ పలు సినిమాలు చేసింది. 'టార్జాన్: ద వండర్ కార్' సినిమాతో ఫిలింఫేర్ బెస్ట్ డెబ్యూ అవార్డు పట్టేసింది. ఆ తర్వాత 'సోచా న తా', 'సలామ్ ఇ ఇష్క్', 'వాంటెడ్', 'పాఠశాల' వంటి పలు హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. కానీ సరైన కథలు ఎంపిక చేసుకోవడంలో తడబడ్డ ఆయేషా వెండితెరపై కనిపించలేదు. అగ్రకథానాయికగా వెలుగులీనిన ఆమె పెళ్లితో ఇండస్ట్రీకి దూరమైంది. చాలా ఏళ్ల తర్వాత తాజాగా ఆమె ముంబై ఎయిర్పోర్ట్లో తన కుమారుడితో కనిపించింది. ఆ సమయంలో వెంటనే ఎవరూ ఆమెను కనీసం గుర్తు కూడా పట్టలేకపోయారు. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. దీంతో చాలామంది ట్రోలర్స్ ఆమెపై నెగటీవ్ కామెంట్లు చేయడం ప్రారంభించారు. ఆమె రూపం గూరించి చాలా క్రూరంగా ట్రోల్ చేశారు. దీంతో ఆమె ఇన్స్టాగ్రామ్లో ఇలా రియాక్ట్ అయ్యారు. ' నా రూపం గురించి మాట్లడటం మినహ దేశంలో ఇతర ఎలాంటి ముఖ్యమైన సమస్యలు లేవని తేలింది. ఒకరి గురించి ఎలా అలాంటి కామెంట్లు చేస్తారు.. నా మీద కామెంట్లతో దాడి చేస్తున్నారా..? అందరూ అనుకుంటున్నట్లు నేను ఇప్పుడు హీరోయిన్ను కాదు. మళ్లీ సినిమాల్లో నటించాలనే ఆలోచన లేదు. నేను నా జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాను. మళ్లీ లైమ్లైట్లోకి రావాలని కోరిక నాకు లేదు. ఏ సినిమాలోనూ నేను ఉండాలని కోరుకోవడం లేదు.' అని తెలిపింది. ఫ్యాట్ షేమింగ్ గురించి, అయేషా ప్రతి ఒక్కరిపై లాజిక్తో విరుచుకుపడింది, 'టీనేజ్లో ఉన్న అమ్మాయి బాగా అందంగానే కనిపిస్తుంది. అదే అమ్మాయి 15 ఏళ్ల తర్వాత కూడా ఒకేలా కనిపించాలని ఆశించడం హాస్యాస్పదమైన విషయం. మీతో పాటు సంతోషంగా జీవించే అమ్మాయిని కోరుకోండి.. దయచేసి అందంగా ఉన్న అమ్మాయిల్ని వేరు చేయకండి. జీవితంలో ఏదైనా మంచిపని చేయండి, అభిరుచిని పొందండి, సరదాగా భోజనం చేయండి, మీ స్నేహితుడితో మాట్లాడండి, ఎప్పుడూ చిరునవ్వుతో ఉండండి, మీరు కోరుకున్నట్లుగా ఎదుటివారు కనిపించడంలేదని ఆందోళన వద్దు.' అని హితభోదన చేసింది. ఈ నోట్ తర్వాత ట్రోలర్స్ నుంచి ఎలాంటి కామెంట్లు రాలేదు. ఏదేమైనా ఆమె మళ్లీ సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని చెప్పడంతో ఫ్యాన్స్ కొంతమేరకు నిరాశ చెందారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఓటీటీలోకి 'నా సామిరంగ'.. అఫీషియల్ ప్రకటన
'నా సామిరంగ' అంటూ సంక్రాంతి బరిలో దిగి అక్కినేని నాగార్జున హిట్ కొట్టారు. విజయ్ బిన్ని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా ఉన్నారు. ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే అల్లరి నరేశ్, రాజ్తరుణ్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్ వంటి చిత్రాలకు గట్టి పోటీగా నా సామిరంగ చిత్రం నిలిచింది. అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టి నాగ్ కెరియర్లో మరో హిట్ను అందుకున్నారు. నా సామిరంగ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని వెయిట్ చేస్తున్న అభిమానులకు తాజాగా డిస్నీ+హాట్స్టార్ శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి 17 నుంచి నా సామిరంగ స్ట్రీమింగ్ అవుతుందని హాట్స్టార్ అఫీషియల్గా ప్రకటించింది. 'పొరింజు మరియమ్ జోస్' అనే మలయాళ సూపర్ హిట్ చిత్రానికి రీమేక్గా ఇది తెరకెక్కింది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 55 కోట్లకు పైగానే గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఓపెనింగ్స్ తొలి మూడు రోజుల్లోనే రూ. 28 కోట్లు రాబట్టిన ఈ చిత్రం రికార్డ్ క్రియేట్ చేసింది. Just one more week until we get to see the King 👑 #NaaSaamiRangaonHotstar Streaming from 17th Feb only on #DisneyPlusHotstar@iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath @mirnaaofficial @RuksharDhillon @actorshabeer @srinivasaaoffl… pic.twitter.com/b32dwWbrIH — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 10, 2024 -
గోవాలో మాఫియా
ధనుష్ హీరోగా దర్శకుడు శేఖర్కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ముంబై నేపథ్యంతో మాఫియా యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ తిరుపతిలో ప్రారంభమైంది. కాగా ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ గోవాలో జరగనున్నట్లు తెలిసింది. దాదాపు రెండు వారాలపాటు సాగే ఈ షెడ్యూల్లో ధనుష్, నాగార్జున కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తారట దర్శకులు శేఖర్ కమ్ముల. ఈ షెడ్యూల్లోనే రష్మికా మందన్నా కూడా జాయిన్ అవుతారట. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
రాజమౌళి, మహేష్ సినిమాలో నాగార్జున
-
రాజమౌళి- మహేశ్ కాంబోలోకి ఎంట్రీ ఇస్తున్న నాగార్జున
సూపర్ స్టార్ మహేశ్బాబు– కింగ్ నాగార్జున స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని ఫిల్మ్నగర్ వర్గాలు అంటున్నాయి. ఇంతకీ ఈ కాంబినేషన్ ఏ సినిమాకీ? అంటే.. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా రూపొందనున్న చిత్రానికి అంటున్నారు. ‘గుంటూరు కారం’ సినిమా హిట్తో ఫుల్ జోష్లో ఉన్న మహేశ్బాబు తన తర్వాతి చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. మహేశ్బాబు కెరీర్లో 29వ మూవీగా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ వర్కింగ్ టైటిల్తో రూపొందనుంది. ఈ చిత్రానికి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఇటీవలే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ ప్రాజెక్టు కోసం నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట రాజమౌళి. ఈ సినిమాలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ కీలక పాత్రల్లో నటించనున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే నాగార్జున కూడా కీలక పాత్రలో నటించనున్నారని టాక్. సినిమాలో చాలాప్రాధాన్యం ఉన్న ఓ పాత్రకి నాగార్జునని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. నాగార్జునకి దక్షిణాదితో పాటు ప్రత్యేకించి బాలీవుడ్లోనూ మంచి గుర్తింపు ఉంది. అందుకే జాతీయ స్థాయిలో పేరున్న నాగార్జునను ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ కోసం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భోగట్టా. ఏప్రిల్లో ఈ సినిమాప్రారంభం కానుంది. మరి మహేశ్బాబు– నాగార్జున కాంబో తెరపై కనిపిస్తుందా? అంటే ఇప్పటికైతే సమాధానం లేని ప్రశ్న. -
'బిగ్బాస్' ఓటీటీ తెలుగు సీజన్ రద్దు? అదే అసలు కారణమా?
బిగ్బాస్ రియాలిటీ షో గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే మొన్నీమధ్యే డిసెంబరులో ఏడో సీజన్ పూర్తయింది. ఫినాలేలో రైతుబిడ్డ ప్రశాంత్ విజేతగా నిలవడం.. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట విధ్వంసం.. కార్లు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం.. ఇలా ఎంత జరగాలో అంతా జరిగింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో ఓటీటీ సీజన్ ఉందన్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడేమో ఏకంగా అది రద్దయినట్లు చెబుతున్నారు. ఇంతకీ ఏమైంది? రద్దుకు కారణమేంటి? తెలుగులో బిగ్బాస్ షో ఇప్పటివరకు ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తొలి సీజన్ హిట్ అయింది. ఆ తర్వాత నుంచి మాత్రం ఏదో ఒక గొడవ అవుతూనే ఉంది. షో ఆపేయాలని విమర్శలు.. కోర్టు కేసులు.. ఇలా ప్రతిసారి రచ్చ అవుతూనే ఉంటుంది. ఇన్ని జరుగుతున్నా సరే షోని ఆపట్లేదు సరికదా ఓటీటీ సీజన్ కూడా ఆ మధ్యలో ఒకటి పెట్టారు. పాతవాళ్లతో పాటు కొత్తవాళ్లు పాల్గొన్న ఆ సీజన్లో బింధుమాధవి విన్నర్గా నిలిచింది. కాకపోతే ఆ సీజన్ ఫెయిలైంది. (ఇదీ చదవండి: స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?) అయితే రీసెంట్గా జరిగిన ఏడో సీజన్.. విమర్శల కారణంగా వార్తల్లో నిలిచింది. దీన్ని క్యాష్ చేసుకుందామని నిర్వహకులు పెద్ద ప్లాన్ వేశారు. ఫిబ్రవరిలో తొలి వారంలో ఓటీటీ సీజన్ మొదలుపెట్టేయాలని అనుకున్నారు. ఏడో సీజన్లో పాల్గొన్న భోలె షావళి, నయన పావని తోపాటు యావర్ కూడా ఈ సీజన్లో పాల్గొంటారని రూమర్స్ వచ్చాయి. కానీ వీళ్లు తప్పితే మిగతా వాళ్లు ఎవరూ దీనిపై కనీస ఆసక్తి చూపించట్లేదట. టీవీ సీజన్ అయితే వస్తాం గానీ ఓటీటీ సీజన్కి మాత్రం వచ్చేది లేదని చెబుతున్నారట. రెమ్యునరేషన్ పెంచి ఇస్తామని చెప్పినా సరే పెద్దగా ఆసక్తి చూపించట్లేదట. మరోవైపు నాగార్జున కూడా అందుబాటులో ఉండట్లేదు. దీంతో హోస్ట్ కూడా మారే ఛాన్స్ ఉంటుంది. ఇలా సమస్యలు ఎక్కువయ్యేసరికి నిర్వహకులు.. సీజన్ని రద్దు చేయాలని ఫిక్సయ్యారట. మరి ఇందులో నిజమేంటి అనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) -
ధనుష్, నాగార్జున మల్టీస్టారర్ ప్రాజెక్ట్..!
-
ఓటీటీకి 'నా సామిరంగా'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
ఈ ఏడాది సంక్రాంతి పోటీలో నిలిచిన కింగ్ నాగార్జున నా సామిరంగా చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. పొంగల్ బరిలో గుంటూరు కారం, హనుమాన్,సైంధవ్ చిత్రాలతో పోటీపడి బ్రేక్ ఈవెన్ సాధించింది. తొలి రోజే రూ.5 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం అదే జోరును కొనసాగించింది. ఈ మూవీని మలయాళ చిత్రానికి రీమేక్గా విజయ్ బిన్నీ దర్శకత్వంతో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం సరిగ్గా నెల రోజుల తర్వతే స్ట్రీమింగ్ కానున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ లెక్కన ఫిబ్రవరి 15 నుంచి స్ట్రీమింగ్కు అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ అందించాడు. కాగా.. ఇటీవలే నాసామిరంగా సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది చిత్రబృందం. ఈ ఈవెంట్కు సినిమా టీమ్ అంతా హాజరయ్యారు. -
అల్లరి నరేష్ పంచులకు నవ్వులతో దద్దరిల్లిన ఆడిటోరియం
-
సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలంటే అమల పిచ్చి ఎక్కిందా ఇతనికి అని అన్నది
-
ఈమాట చెప్పగానే అమల, చైతన్య ఆశ్యర్యపోయారు: నాగార్జున
‘‘సెప్టెంబరు 20న నాన్నగారి(అక్కినేని నాగేశ్వరరావు) బర్త్ డే. ఆ రోజు విగ్రహావిష్కరణ పూర్తికాగానే ‘నా సామిరంగ’ షూటింగ్కు బయలుదేరాను. ‘ఎందుకంత తొందర.. ఇంకాస్త సేపు ఉండొచ్చుగా’ అని అమల నాతో అన్నారు. సంక్రాంతికి రిలీజ్ చేయాలని నేను చెప్పగానే పిల్లలతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. నేను సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తానన్న నమ్మకాలు బయట ఎవరికీ లేవు. నా టీమ్ ముఖాల్లో మాత్రం ఆ నమ్మకం ఉంది. సినిమాను రిలీజ్ చేశాం. కీరవాణిగారు బాగా సపోర్ట్ చేశారు. మా టీమ్ అందర్నీ చాలా మిస్ అవుతున్నాను’’ అని నాగార్జున అన్నారు. ఆయన హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నామీనన్ , రుక్సార్ థిల్లాన్ , షబ్బీర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్రయూనిట్ చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఆదివారం జరిగిన ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘మాపై అపరిమితమైన ప్రేమను చూపిస్తున్న అక్కినేని ఫ్యాన్స్కు ముందుగా థ్యాంక్స్. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా ఎప్పుడూ ఒకేలా ఉంటారు. నేను కనపడగానే నవ్వుతూనే ఉంటారు. ఆ నవ్వే నాకు చాలా ధైర్యం. అలాగే తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని, కాస్త ఆలస్యంగా మేం చెప్పినప్పటికీ సహకరించిన డిస్ట్రిబ్యూటర్స్కు థ్యాంక్స్. నెక్ట్స్ సంక్రాంతికి కలుద్దాం’’ అన్నారు. ‘‘నాగార్జునగారితో సినిమా చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. కీరవాణి, చంద్ర బోస్గార్లు ఇలానే కలిసి ఉంటూ ఇంకా మంచి మ్యూజిక్ ఇవ్వాలి’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. ‘‘ఓ సినిమా విడుదలై, సక్సెస్ సాధించి, సెలబ్రేషన్స్ షీల్డ్స్ అందుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇలా నా తొలి సినిమాకే జరగడం నా అదృష్టం’’ అన్నారు విజయ్ బిన్నీ. ‘‘నవరస భరితమైన సినిమాగా ‘నా సామిరంగ’ నిలిచింది’’ అన్నారు సంగీత దర్శకుడు కీరవాణి. ఈ సక్సెస్మీట్లో పాటల రచయిత చంద్రబోస్ మాట్లాడారు. ఈ కార్య క్రమంలో నాగార్జున, కీరవాణి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూటర్స్, చిత్రబృందం షీల్డ్స్ అందుకున్నారు. -
అలా సినిమాలు తీయడం సులభం కాదు
‘‘నేను దాదాపు 95మందికి పైగా దర్శకులతో పని చేశాను. చక్కని క్లారిటీతో సినిమాలు చేసే కొద్దిమంది దర్శకుల్లో విజయ్ ఒకరు అని నాకనిపించింది. ‘నా సామిరంగ’ మూవీని ఓ పాటలా అందంగా తీసి, కొరియోగ్రాఫర్ అనిపించుకున్నాడు. సినిమాకి ఎంత కావాలో సరిగ్గా అంతే తీశాడు. ఇలా తీయడం అంత సులభం కాదు’’ అని నాగార్జున అన్నారు. ఆయన హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలైంది. ‘నా సామిరంగ’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ – టీవీ డ్యాన్సర్స్ – డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్లు కలిసి విజయ్ బిన్నీని సన్మానించాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఈ వేడుకకు రావడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాను. మీ అందరి చిరునవ్వులు చూస్తుంటే మనసు ఆనందంతో పొంగిపోయింది. విజయ్తో వండర్ఫుల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్’’ అన్నారు. మరో అతిథి ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘దర్శకుడిని కావాలనుకున్న తన కలను సక్సెస్ఫుల్గా నెరవేర్చుకున్నారు విజయ్. ఇక్కడున్న డ్యాన్స్ మాస్టర్స్కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘నాగార్జునగారు నన్ను దర్శకుడిగా ఎంచుకోవడం నా అదృష్టం’’ అన్నారు విజయ్ బిన్నీ. ‘‘విజయ్గారు డైరెక్టర్గా గొప్ప విజయాన్ని అందుకోవడం మా అందరికీ గర్వకారణం’’ అన్నారు శేఖర్ మాస్టర్.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు
యాదాద్రికి పోటెత్తిన భక్త జనం (ఫోటోలు)
నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
'బేబి' హీరో ఇంతలా మారిపోయాడేంటి? ఏకంగా అలా..
యశ్ దయాల్పై కోహ్లి ఫైర్.. దెబ్బకు ధోని ఖేల్ ఖతం!
భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా?
మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
టీడీపీపై బొత్స సెటైర్లు
తప్పక చదవండి
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- RCB Vs CSK: అతడి వల్లే గెలిచాం.. డుప్లిసెస్ ఎమోషనల్
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement