-
హ్యాట్రిక్ కోసం అభిషేక్ బెనర్జీ.. మళ్ళీ అక్కడ నుంచే పోటీ
కోల్కతా: దేశంలో ఇప్పటికే మూడు దశల్లో లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా నాలుగు దశల్లో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, 'అభిషేక్ బెనర్జీ' పశ్చిమ బెంగాల్లోని సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇది వరుసగా మూడోసారి. నామినేషన్ దాఖలు చేయడానికి ఈయన కాళీఘాట్ నుంచి నడిచి.. అలీపూర్లోని జిల్లా కలెక్టర్ ఆఫీసులో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.నామినేషన్ దాఖలు చేసిన తరువాత తృణమూల్ కాంగ్రెస్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి 'అభిషేక్ బెనర్జీ' మాట్లాడుతూ.. డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ సాధించడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ నియోజకవర్గాన్ని నెంబర్ స్థానానికి తీసుకురావడమే లక్ష్యమని అన్నారు.#WATCH | TMC candidate from Diamond Harbour seat, Abhishek Banerjee files nomination for Lok Sabha elections#LokSabhaElections2024 pic.twitter.com/SLymSD1IHq— ANI (@ANI) May 10, 2024 -
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
తిరువనంతపురం: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ రాయ్బరేలీ నుంచి నామినేషన్ వేయడంపై వయనాడ్ ప్రజలు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ‘తప్పేముంది రాహుల్ ఇండియా కూటమిలో అగ్రనేత’ అని ఒకరు అనగా రాయ్బరేలీలో గెలిస్తే వయనాడ్ సీటును రాహుల్ వదిలేస్తారని మరొకరన్నారు. అయితే రాహుల్ వయనాడ్ను వదిలేయడం తమకు అంత మంచిది కాదని చెప్పాురు. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని రాహుల్గాంధీ తీసుకున్న నిర్ణయం ఇండియా కూటమికి మేలు చేస్తుందని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్)నేత కున్హలికుట్టి అన్నారు. ప్రధాని మోదీ కూడా గతంలో రెండు సీట్లలో పోటీ చేశారని కుట్టి గుర్తు చేశారు. -
ఢిల్లీలో తొలి ట్రాన్స్జెండర్ నామినేషన్
న్యూఢిల్లీ, సాక్షి: దేశ రాజధానిలో లోక్సభ ఎన్నికల నామినేషన్లలో ఆసక్తికర పరిణామం జరిగింది. ఢిల్లీలో తొలి థర్డ్ జెండర్ అభ్యర్థి నామినేషన్ వేశారు. దక్షిణ ఢిల్లీ నియోజకవర్గానికి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.ధోతీ, తలపై టోపీ, బంగారు ఆభరణాలు ధరించి సాకేత్లోని దక్షిణ ఢిల్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న 26 ఏళ్ల రాజన్ సింగ్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. థర్డ్ జెండర్ వ్యక్తుల హక్కులతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలతోపాటు అధికారుల దృష్టిని ఆకర్షించేందుకు తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజన్ సింగ్ తెలిపారు.బిహార్కు చెందిన రాజన్ సింగ్ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో నివసిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు తన నామినేషన్ థర్డ్ జెండర్ ఉనికిని, హక్కులను తెలియజేసే ప్రయత్నం అని రాజన్ సింగ్ అన్నారు. దేశంలో జంతువులకు కూడా సంక్షేమ బోర్డులు ఉన్నాయి కానీ థర్డ్ జెండర్ వ్యక్తుల పరిస్థితి వాటి కన్నా హీనంగా ఉందని వాపోయారు. తాను గెలిస్తే, థర్డ్ జెండర్ ప్రాథమిక అవసరాలను పరిష్కరిస్తానని రాజన్ సింగ్ చెప్పారు. -
రాజ్నాథ్ సింగ్తో పోరుకు దిగిన నీలమ్ ఎవరు?
యూపీలోని లక్నో లోక్సభ స్థానానికి ఐదవ దశలో మే 20న ఓటింగ్ జరగనుంది. ఈ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. అయితే ఒకరి నామినేషన్పై చర్చ జరుగుతోంది. రాష్ట్రీయ ఉదయ్ పార్టీ నుంచి నీలమ్ శర్మ అనే మహిళ తన నామినేషన్ దాఖలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. తాను బీజేపీ తరపున బరిలో దిగిన రాజ్నాథ్ సింగ్ను ఓడించడానికే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు.తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీ, పల్లవి పటేల్ల మద్దతు తమ పార్టీకి ఉందని ఆమె పేర్కొన్నారు. నీలమ్ శర్మ సామాజిక కార్యకర్తగా సేవలందించేందుకు ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. నీలమ్ శర్మ గతంలో మేయర్ పదవికి కూడా పోటీ చేశారు.నీలమ్ శర్మ నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినప్పుడు ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు. స్టయిలిష్ లుక్లో ఆమె కారు దిగగానే అక్కడున్నవారు ఆమెను చూస్తూ ఉండిపోయారు. ఆమె పోలీసులతో తాను లక్నో లోక్సభ స్థానం నుండి ఎంపీ పదవికి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినట్లు తెలిపారు. తాను గెలిచిన తర్వాత మీరే నన్ను సన్మానిస్తారని ఆమె పోలీసులతో అన్నారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం నీలమ్ శర్మ తన నామినేషన్ దాఖలు చేసినప్పటికీ అది తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఆమె తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, దాని అమలు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఈ కారణంగా ఆమె నామినేషన్ చెల్లకపోవచ్చని సమాచారం. -
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
నల్లగొండ: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలవుతుందని.. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రజల సొమ్మును దోచుకోవడంతో కూతురు జైలుకెళ్లిందని, వారు కూడా జైలుకు వెళ్లకతప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న నామినేషన్ వేసిన సందర్భంగా శుక్రవారం నల్లగొండలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడారు. తీన్మార్ మల్లన్న కేసీఆర్ దోపిడీపై పోరాటం చేశాడని, ఆయన్ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. జీఓ 46తో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత దానిపై అసెంబ్లీ సమావేశాల్లో కమిటీ వేసి రద్దు చేస్తామని చెప్పారు. ప్రభుత్వానికి ఆస్తులు అప్పగించిన తీన్మార్ మల్లన్ననల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) తన కుటుంబం పేరు మీద ఉన్న ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. తన కుటుంబం పేర ఇప్పటివరకు రూ.కోటీ 50 లక్షల ఆస్తులు ఉన్నాయని చెప్పారు.తన భార్య ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నదని, ఆమె ఒప్పుకున్నాకే ఆమె పేరు మీద ఉన్న కోటిన్నర ఆస్తిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేరున రాసి ఇస్తున్నట్టు ప్రకటించారు. రాజకీయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలన్న ఉద్దేశంతో ఆస్తులను అప్పగించినట్టు చెప్పారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే.. రాజకీయాల్లో సంచలన మార్పులు తీసుకొస్తానని ఆయన చెప్పారు. అంతకుముందు ఆయన నల్లగొండ పట్టణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. తీన్మార్ మల్లన్నపై 56 కేసులు రాష్ట్రంలోని వివిధ పోలీస్స్టేషన్లలో తనపై 56 కేసులు ఉన్నాయని తన ఎన్నికల అఫిడవిట్లో తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. తన పేరుతో రూ.16.34 లక్షల విలువైన బంగారం, ఆస్తులు, నగదు ఉండగా, తన భార్య పేరుతో రూ.17.66 లక్షల విలువైన బంగారం, ఆస్తులు, నగదు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. మార్కెట్ విలువ ప్రకారం రూ.3 లక్షల విలువైన వ్యవసాయ భూమి, రూ.50 లక్షల విలువలైన వ్యవసాయేతర భూమి, రూ.50 లక్షల విలువైన నివాస గృహం ఉన్నట్లు తెలిపారు. రూ.31.29 లక్షల అప్పులు ఉన్నట్టు వివరించారు. -
Lok Sabha Election 2024: రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ కంచుకోటలైన రాయ్బరేలీ, అమేథీ లోక్సభ స్థానాల్లో ఈసారి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై కొన్నిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఈ రెండు స్థానాల్లో తమ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం శుక్రవారం ఉదయం ప్రకటించింది. రాయ్బరేలీ నుంచి అనూహ్యంగా రాహుల్ గాంధీ పోటీకి దిగుతున్నారు. సోనియా గాంధీ కుటుంబానికి వీరవిధేయుడైన కిశోరీలాల్ శర్మ అమేథీ నుంచి పోటీ చేస్తున్నారు. రాహుల్, కిశోరీలాల్ శుక్రవారమే నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20న పోలింగ్ జరుగనుంది. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ అభ్యరి్థత్వం ఖరారు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ స్థానంలో ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను బరిలోకి దింపాలని పలువురు కాంగ్రెస్ సీనియర్లు పట్టుబట్టారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలు చేస్తోందని, ఆ పారీ్టలో సోనియా గాంధీ కుటుంబానిదే అసలు పెత్తనం అంటూ బీజేపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ప్రియాంక గాంధీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎవరూ ఊహించని విధంగా రాయ్బరేలీ నుంచి రాహుల్ పేరు తెరపైకి వచ్చింది. గత ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి ఎంపీగా గెలిచిన సోనియా గాంధీ ఈసారి పోటీ చేయడం లేదు. ఆమె ఇప్పటికే రాజస్తాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాయ్బరేలీ స్థానం ప్రస్తుతం ఖాళీగానే ఉంది. రాహుల్ గాం«దీని పోటీ చేయించడం ద్వారా ఇక్కడ మరోసారి విజయకేతనం ఎగురవేయాలని, తమ పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. తన తల్లి సోనియా గాంధీ 20 ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించిన లోక్సభ స్థానం నుంచి రాహుల్ పోటీకి దిగుతుండడం ఆసక్తికరంగా మారింది. రాయ్బరేలీలో రాహుల్ నామినేషన్ ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి పోటీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాం«దీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలతో కలిసి రాహుల్ తన నామినేషన్ పత్రాలను రాయ్బరేలీ జిల్లా మెజిస్ట్రేట్ హర్షితా మాథుర్కు అందజేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్కు మద్దతుగా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలు ‘గో బ్యాక్ రాహుల్’ అంటూ నినాదాలు చేస్తూ కనిపించారు. ఈ ఎన్నికల్లో రాయ్బరేలీలో బీజేపీ అభ్యరి్థగా ఉత్తరప్రదేశ్ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్తో బరిలో నిలిచారు. రూ.20 కోట్లకు పైగా ఆస్తులు తనకు రూ.20 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు రాహుల్ తన నామినేషన్ పత్రాల్లో వెల్లడించారు. రూ.3.81 కోట్ల విలువైన షేర్లతో కలిపి రూ.9.24 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు తెలియజేశారు. రూ.26.25 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, రూ.15.21 కోట్ల విలువైన గోల్డ్ బాండ్ల ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే రూ.11.15 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం చేతిలో రూ.55 వేల నగదు ఉందని, రూ.49.79 లక్షల అప్పులు ఉన్నాయని ప్రస్తావించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాహుల్ వార్షికాదాయం రూ.1.02 కోట్లు. మా కర్మభూమి రాయ్బరేలీ రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తుండడం తనకు భావోద్వేగ సమయమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘మా కుటుంబానికి కర్మభూమి అయిన రాయ్బరేలీని మా తల్లి సోనియా గాంధీ ఎంతో నమ్మకంతో నాకు అప్పగించారు. ఇక్కడి ప్రజలకు సేవ చేసుకొనే భాగ్యం కల్పించారు. అమేథీ, రాయ్బరేలీ లోక్సభ స్థానాలు నాకు వేర్వేరు కాదు. ఇవి రెండూ నా సొంత కుటుంబం లాంటివే. 40 ఏళ్లుగా ఆమేథీ నియోజకవర్గానికి సేవలందిస్తున్న కిశోరీలాల్ శర్మ ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేస్తుండడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనేందుకు సాగుతున్న ఈ పోరాటంలో అందరూ నాకు అండగా నిలుస్తున్నారన్న విశ్వాసం ఉంది’’ అని రాహుల్ వెల్లడించారు. -
లెక్క లేదంటే.. వేటే..!
సాక్షి, మంచిర్యాల: ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఆదిలాబాద్లో 12 మంది, పెద్దపల్లిలో 42మంది బరిలో ఉన్నారు. ఎ న్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రచారమూ ప్రభావితం చేస్తుంది. ఆ ప్రచార వ్యయం కూడా పె రుగుతూ వస్తోంది. ర్యాలీలు, సభలు, సమావేశాలు, సభలకు జనాలను తరలించే వాహనాలు, భో జనాలు, టెంట్లు ఇలా ప్రతీదానికి అభ్యర్థులు ఖ ర్చు చేయాల్సి వస్తుంది. వీటన్నింటికి కూడా ఎన్నిక ల సంఘం స్థానికంగా ధరలను అనుసరించి చెల్లింపులను నిర్దేశించింది.ఆ మేరకు వ్యయ వివరాలను అభ్యర్థులు నమోదు చేయాల్సి ఉంటుంది. బ్యాంకులో ఖాతా తెరిచి దాని ద్వారానే చెల్లింపులు చేయా లి. అభ్యర్థులు ప్రచార వ్యయానికి సంబంధించి ప్ర తీ ఖర్చు వివరాలను ఎన్నికలు పూర్తయిన తర్వాత నెల రోజుల్లోగా ఎన్నికల సంఘానికి సమర్పించాలి. లేనిపక్షంలో ఆ తర్వాత జరిగే ఎన్ని కల్లో పోటీకి అనర్హులుగా ప్రకటిస్తుంది. అలా వేటు పడిన వారిలో రాష్ట్ర వ్యాప్తంగా 107మంది ఉన్నారు.వ్యయ పరిశీలకులు వీరే..ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులుగా మహారాష్ట్రకు చెందిన ఐఆర్ఎస్ అ« దికారి జాదావార్ వివేకానంద, పెద్దపల్లి నియోజకవర్గానికి సమీర్ నైరంతర్య వ్యవహరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో వీరు పర్యటించి రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచార వ్యయాలను పరిశీలిస్తారు.పెంపు ఇలా..లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార వ్యయ పరి మితి 1952లో రూ.25వేలుగా ఉండేది. 1971లో రూ.35వేలు ఉండగా.. 1980లో రూ.లక్షకు పెరిగింది. 1984నుంచి 1991వరకు రూ.1.50లక్షలు, 199 6లో రూ.4.50లక్షలకు చేరింది. 1998లో రూ.15లక్షలు, 2004లో రూ.25లక్షలకు పెరుగుతూ వచ్చింది. 2014లో ఎన్నికల ప్రచార వ్యయ పరిమితిపై ప్ర ధాన సవరణ జరిగి రూ.70లక్షలకు పెరిగింది. దీని పై 2020లో 10శాతం పెరిగింది. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీ సూచన మేరకు 2022లో ప్రచార వ్యయ పరిమితిని రూ.95లక్షలకు పెంచా రు. లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గరి ష్టంగా రూ.95లక్షల వరకు ప్రచారానికి ఖర్చు చేసే అవకాశం ఉంది.107మంది పోటీకి అనర్హులు..రాష్ట్రంలోని 107మందిని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ప్రచార వ్య యానికి సంబంధించిన వివరాలు సమర్పించకపోవడంతో ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 10ఏ ప్రకారం అనర్హత వేటు వేసింది. వీరిలో అత్యధి కంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన 68 మంది ఉ న్నారు. అప్పట్లో పసుపు రైతులు భారీ సంఖ్యలో నామినేషన్ వేసిన వారే కావడం గమనార్హం.వచ్చే జూన్ 23 వరకు వీరు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. నల్గొండ లోక్సభ నియోజకవర్గంలోని 2, మహబూబాబాద్, మెదక్లో ఒక్కొక్కరు ఉండగా.. వీరిపై జూన్ 10వరకు వేటు కొనసాగుతుంది. జుక్కల్, రామగుండం, కరీంనగర్, గజ్వేల్, మల్కాజ్గిరి, నాగార్జునసాగర్, ఆలేరు, జనగాం, మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఒక్కొక్కరు, దేవరకొండ 5, మిర్యాలగూడ, పాలకుర్తి ముగ్గురు చొప్పున, నల్గొండ, ములుగు 4 చొప్పున, నకిరేకల్ 2, మల్కాజ్గిరి ఒకరిపై జూలై 14వరకు వేటు వేసింది. పాలకుర్తిలో ముగ్గురిపై ఆగస్టు 25వరకు, డోర్నకల్ ఒకరిపై సెప్టెంబర్ 21వరకు అనర్హత వేటు పడింది.ఇవి చదవండి: దేవుడి పేరుతో బీజేపీ రాజకీయం.. : మంత్రి సీతక్క -
నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
లక్నో: కేంద్ర రక్షణ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ లక్నో స్థానం నుంచి రానున్న లోక్సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీలతో కలిసి వెళ్లి ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు.నామినేషన్ దాఖలుకు ముందు, రాజ్నాథ్ సింగ్ నగరంలో రెండు కిలోమీటర్ల మేర రోడ్షో నిర్వహించి, స్థానిక దక్షిణ్ ముఖి హనుమాన్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు ఐదవ దశ పోలింగ్ మే 20న జరగనుంది. లక్నోతో పాటు మరో పదమూడు నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది.లక్నో లోక్సభ స్థానంలో 2019 ఎన్నికలలో రాజ్నాథ్ సింగ్ 6.3 లక్షల ఓట్లు సాధించి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి పూనమ్ శత్రుఘ్న సిన్హాను ఓడించారు. అలాగే 2014లో కాంగ్రెస్ అభ్యర్థి రీటా బహుగుణ జోషిపై 2.72 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. -
అమేథీలో కాంగ్రెస్ 1981 ఫార్ములా?
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ నుంచి పోటీ చేయనున్నారని ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు అంటున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయమై నోరు మెదపలేదు. అయితే పార్టీ 1981 నాటి ఉప ఎన్నికల ఫార్ములాను ఇప్పుడు అనుసరించనున్నదనే మాట వినిపిస్తోంది.1981లో కాంగ్రెస్ నామినేషన్ల పర్వం ప్రారంభమైన తర్వాతనే అభ్యర్థులను రంగంలోకి దించింది. రాజీవ్ గాంధీని యూపీలోని అమేథీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన రోజునే రాజీవ్ గాంధీ తన నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఇదే విధానాన్ని కాంగ్రెస్ అనుసరించనున్నదని కొందరు పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.మరోవైపు అమేథీలో బీజేపీ మినహా ఏ పార్టీ కూడా అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఎస్పీ-కాంగ్రెస్ పొత్తులో అభ్యర్థి ఎవరనేదానిపై బీఎస్పీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అదేసమయంలో బీఎస్పీ అభ్యర్థి ఖరారైనట్లు కూడా ప్రచారం జరుగుతోంది.ఇప్పటి వరకు రాహుల్ గాంధీ తాను అమేథీ నుంచి పోటీ చేస్తానని చెప్పలేదు. అమేథీ నుంచి బీజేపీ తరుపున స్మృతి ఇరానీ ఎన్నికల రంగంలోకి దిగారు. కాగా రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ ప్రకటించారు. -
మనోహర్ ఆస్తి పెరిగింది!
తెనాలిరూరల్: జనసేన పార్టీ తరఫున తెనాలి అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాదెండ్ల మనోహర్ తన ఆస్తి రూ 22.89 కోట్లుగా ప్రకటించారు. 2019 కన్నా రూ. 12 కోట్లు పెరిగినట్టు అఫిడడవిట్లో పేర్కొ న్నారు. తనపేరిట రూ. 1,48, 03,300 విలువ చేసే చరాస్తులు ఉండగా తన భార్య పేర రూ. 2,49,33,338, కుమారుడి పేర రూ. 3,63,966 చరాస్తులు ఉన్న ట్టు చూపారు.తన పేర రూ, 1.95 కోట్ల విలువ చేసే 6.32 ఎకరాల వ్యవసాయ భూమి, తన భార్య పేరిట ద్వారకా తిరుమల, కర్ణాటకలలో రూ. 8.75 కోట్ల విలువ చేసే 8.54 ఎకరాల వ్యవసాయ భూమి, శేరిలింగంపల్లిలో రూ. 2,99,15,000 విలువ చేసే ఫ్లాట్, జూబ్లి హిల్స్లో రూ. 4,59,40. 000 విలువ చేసే ప్లాట్ ఉన్నట్టు చూపారు. తన పేరిట రూ. 43,96,641 వాహన రుణం ఉండగా తన భార్యకు రూ. నాలుగు కోట్లు రుణం ఉందని చూపారు. ఇక తనపై ఎటువంటి కేసులు లేవని స్పష్టం చేశారు. కాగా 2019లో తన ఆస్తి రూ. 10,68,78,117గా మనోహర్ చూపారు. తెనాలిలో మనోహర్ నామినేషన్ తెనాలిరూరల్: నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రపసాద్, బీజేపీ నేతలు, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలతో ఐతాన గర్ లింగారావు సెంటరు నుండి భారీ ర్యాలీగా గాం«దీచౌక్, శివాజీచౌక్ల మీదుగా సబ్కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. తన భార్య మనోహరం, ఆలపాటి రాజా తదితరులతో కలసి రిటరి్నంగ్ అధికారి ప్రఖర్ జైన్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. -
మతతత్వ శక్తులను ఓడించండి
ఖమ్మం వన్టౌన్: మతతత్వ, ఫాసిస్ట్ శక్తులను ఓడించి దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రేణుకా చౌదరి పిలుపునిచ్చారు. ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ దాఖలు అనంతరం మీడియా పాయింట్ వద్ద మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని, సోనియా, రాహుల్ ప్రధాని పదవిని సైతం వదులుకున్నారన్నారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రఘురాంరెడ్డి కుటుంబం ప్రజలందరికీ తెలుసునని, జిల్లా నాయకుల అభిప్రాయాలు తీసుకున్నాకే అధినాయకత్వం ఆయనను అభ్యర్థిగా ఎంపిక చేసిందని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం నేత పోతినేని మాట్లాడుతూ మతాన్ని అడ్డుపెట్టుకుని మోదీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ను ఓడించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నామని కూనంనేని వెల్లడించగా, భువనగిరి తప్ప మిగతా అన్ని స్థానాల్లో కాంగ్రెస్కు మద్దతు ఉంటుందని సీపీఎం నేత సుదర్శన్ తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ తనది ఖమ్మం జిల్లానేనని.. ప్రజలు, ప్రభుత్వ అవసరాల కోసం ఏళ్ల క్రితమే తమ భూములు ఇచ్చామని చెప్పారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
ఒవైసీ లాపతా.. జబ్సే ఆయీ మాధవీ లతా..
చార్మినార్ (హైదరాబాద్): ఒవైసీ లాపతా.. జబ్ సే ఆయీ మాధవీ లతా.. (మాధవీ లత వచ్చి నప్పటి నుంచి ఒవైసీ కనిపించడం లేదు) అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించా రు. మాధవీ లత హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి అనగానే సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. బుధవారం మాధవీ లత చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయాన్ని సందర్శించి తన నామినేషన్ పత్రాలను అమ్మవారి పాదాల చెంత పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం బీజేపీ నేతలతో కలిసి చార్మినార్ నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆమెతోపాటు పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనురాగ్ ఠాకూర్ ప్రచార రథంపై నుంచి మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా హైదరాబాద్లో అధికారం చెలాయిస్తున్న మజ్లిస్ పార్టీ పాతబస్తీ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు.అసదుద్దీన్ ఒవైసీ, రాహుల్గాంధీలు ఔరంగజేబు యూనివర్సిటీలో చదివారని.. వారిద్దరి ఆలోచనలు ఒకేతీరుగా ఉంటాయన్నారు. మజ్లిస్తో కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నందునే ఇప్పటివరకు హైదరాబాద్ అభ్యర్థిని ఇంకా ప్రకటించ లేదని దుయ్యబట్టారు. పాతబస్తీలో మత రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్న మజ్లిస్కు ఈసారి ఓటమి తప్పదన్నారు. చార్మినార్ నుంచి బయలుదేరిన ప్రచార ర్యాలీ మదీనా, అఫ్జల్గంజ్, బేగంబజార్, మోజంజాహీ మార్కెట్, నాంపల్లి ద్వారా లక్డీకాపూల్ వరకు సాగింది. -
నేడు పులివెందులలో సీఎం జగన్ నామినేషన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం పులివెందుల అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం గురువారం ఉదయం 7.45 గంటలకు సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి వైఎస్సార్ జిల్లా పులివెందులకు చేరుకుంటారు.స్థానిక సీఎస్ఐ చర్చి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత భాకరాపురంలోని తన నివాసానికి వెళ్తారు. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు. -
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ మనోహర్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
బీదర్లో అంధుడి నామినేషన్
బీదర్: లోక్సభ ఎన్నికలకు కర్ణాటకలో నామినేషన్ల పర్వం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శక్తివంతమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఒక భావోద్వేగ ఉదాహరణ బీదర్లో ఆవిష్కృతమైంది. బీదర్ లోక్సభ స్థానానికి ఒక అంధుడు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బీదర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలనే ఆశయంతో అసమానతలు, అడ్డంకులను ధిక్కరిస్తూ ముందుకు వచ్చారు. బీదర్ తాలూకాలోని కడ్వాడ్ గ్రామానికి చెందిన దిలీప్ నాగప్ప భూసా తన మద్దతుదారులతో డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. బ్రెయిలీ లిపిలో ఉన్న ప్రమాణాన్ని దిలీప్ చదివి వినిపించి జిల్లా ఎన్నికల అధికారికి నామినేషన్ సమర్పించారు. మూడవ దశలో అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా లోక్సభ సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
సీఎం జగన్ నామినేషన్ కు.. డేట్ ఫిక్స్
-
వయనాడ్లో బీజేపీకి మద్దతుగా స్మృతి ఇరానీ ప్రచారం!
కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సురేంద్రన్ నామినేషన్ కార్యకమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా పాల్గొననున్నారు. నామినేషన్కు ముందు జరిగే రోడ్ షోలో స్మృతి ఇరానీ కూడా పాల్గొననున్నారు. అలాగే బీజేపీ అభ్యర్థికి మద్దతుగా స్మృతి ఇరానీ ప్రచారం చేయనున్నారు. వయనాడ్ నుంచి సీపీఐ డి రాజా భార్య అన్నీ రాజాను ఎన్నికల బరిలో నిలిపింది. దీంతో వయినాడ్లో త్రిముఖ పోటీ నెలకొంది. వయనాడ్ నుండి కె సురేంద్రన్ అభ్యర్థిత్వాన్ని గత వారం బీజేపీ ప్రకటించింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రస్తుతం వయనాడ్ ఎంపీగా ఉన్నారు. బుధవారం ఆయన ఇక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. 2019లో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి గెలిచారు. అదేసమయంలో యూపీలోని అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయాడు. కోజికోడ్ జిల్లాలోని ఉలయేరి నివాసి అయిన కున్నుమేల్ సురేంద్రన్ 2020 నుంచి కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. భారతీయ జనతా యువమోర్చా వయనాడ్ జిల్లా అధ్యక్షునిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 2019 లోక్సభ ఎన్నికల్లో పతనంతిట్ట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కె సురేంద్రన్ కేంద్ర మంత్రి వి మురళీధరన్కు అత్యంత సన్నిహితుడు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మంజేశ్వరం నియోజకవర్గం నుంచి కేవలం 89 ఓట్ల తేడాతో సురేంద్రన్ ఓడిపోయారు. -
వయనాడ్ నుంచి నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ
తిరువనంతపురం: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానానికి బుధవారం నామినేషన్ వేశారు. వయనాడ్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మరోసారి ఇక్కడి నుంచి బరిలో నిలిచారు. ఈ క్రమంలోనే నేడు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రాహుల్ వెంట తన సోదరి ప్రియాంక గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర పార్టీ సీనియర్ నేతలు కూడా ఉన్నారు. కాగా బుధవారం ఉదయం వయనాడ్ చేరుకున్న రాహుల్.. కాల్పేట నుంచి సివిల్ స్టేషన్ వరకు రోడ్షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత మాట్లాడుతూ.. తాను ఎల్లప్పుడూ వయనాడ్ ప్రజలతో ఉంటానని చెప్పారు. ఇక్కడి ప్రతివ్యక్తి తనపై ప్రేమ, అభిమానాన్ని అందించారని, సొంత వ్యక్తిలా చూసుకున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంతం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తుండటం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఇక 2019 ఎన్నికల్లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ ఏడు లక్షల ఓట్లతో గెలుపొందారు. సమీప అభ్యర్థి సీపీఐ అభ్యర్ధి సునీర్పై 4.31 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇదే వయనాడ్ నుంచి బీజేపీ తరపు రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్, సీపీఐ నేత అనీ రాజా పోటీలో నిలిచారు. రెండో ఫేజ్లో భాగంగా ఏప్రిల్ 26న కేరళలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. చదవండి: అవమానించేందుకే అరెస్ట్ చేశారు: కేజ్రీవాల్ -
కర్ణాటకలో ఏకైక కాంగ్రెస్ ఎంపీ నామినేషన్
కర్ణాటకలో ఏకైక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ నామినేషన్ వేశారు. కర్ణాటకలో 2019 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఏకైక కాంగ్రెస్ అభ్యర్థి ఈయనే. ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి డీకే సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా డీకే సురేష్ వెంట రామనగర జిల్లా ఇన్చార్జి మంత్రి రామలింగారెడ్డి తదితరులు ఉన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ తమ్ముడే ఈ డీకే సురేష్. మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి భార్య అనిత కుమారస్వామిని 2013 ఉప ఎన్నికలో ఆయన ఓడించారు. మరోవైపు మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అల్లుడు, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి బావమరిది అయిన ప్రముఖ కార్డియాక్ సర్జన్ సీఎన్ మంజునాథ్ను బీజేపీ-జేడీఎస్ కూటమి పోటీకి దింపింది. బీజేపీ గుర్తుపై పోటీ చేస్తున్న మంజునాథ్ 17 ఏళ్ల పాటు ప్రభుత్వ యాజమాన్యంలోని జయదేవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్కు సారథ్యం వహించి ఈ ఏడాది జనవరిలో పదవీ విరమణ చేశారు. -
అరుణాచల్లో బీజేపీకి తొలి విజయం?.. ఐదుగురు ఏకగ్రీవం?
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీకి సానుకూల వాతావరణం ఏర్పడింది. ముఖ్యమంత్రి పెమా ఖండూ సహా ఐదుగురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావచ్చని సమాచారం. మార్చి 26, బుధవారం నామినేషన్కు చివరి తేదీ అని, అయితే రాష్ట్రంలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఇతర పార్టీల అభ్యర్థులెవరూ నామినేషన్ దాఖలు చేయలేదని ఓ అధికారి తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లోని రెండు లోక్సభ, 60 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగిసినట్లు అధికారి తెలిపారు. గురువారం నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుందని, మార్చి 30 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చన్నారు. గురువారం నామినేషన్ పత్రాల పరిశీలన తర్వాత ఆ ఐదుగురు బీజేపీ అభ్యర్థులు ఏకపక్షంగా గెలుస్తారా లేదా అనేది నిర్ణయిస్తామని జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ లైకెన్ కోయు మీడియాకు తెలిపారు. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 197 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లో ముఖ్యమంత్రి పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్తో సహా ఐదుగురు అభ్యర్థులు ఎన్నికలలో ఏకగ్రీవంగా గెలిచారని బీజేపీ పేర్కొంది. వీరు పోటీ చేస్తున్న చోట నుంచి చివరి రోజు వరకు ఇతర పార్టీల అభ్యర్థులెవరూ నామినేషన్ దాఖలు చేయలేదని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి తేజీ నేచా పేర్కొన్నారు. -
ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన బిహార్ సీఎం నితీష్
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వరుసగా నాలుగోసారి రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్కు(ఎమ్మెల్సీ) పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను రాష్ట్ర అసెంబ్లీలో ఎన్నికల అధికారికి అందించారు. నితీష్ కుమార్తో పాటు జేడీయూకు చెందిన ఖలీద్ అన్వర్, జితిన్ రామ్ మాంఝీ (హెచ్ఏఎం) కుమారుడు సంతోష్ సుమన్ సైతం శాసనమండలికి నామినేషన్లు దాఖలు చేశారు. నితీష్ వెంట ఉప ముఖ్యమంత్రులు సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, లలన్ సహా పలువురు అధికార ఎన్డీయేకు చెందిన సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా ఈ ఏడాది మే తొలి వారంలో నితీష్ కుమార్ ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. ఆయనతోపాటు రబ్రీదేవి(ఆర్జేడీ), షానవాజ్ హుస్సేన్(బీజేపీ), సంజయ్ కుమార్ ఝా(జేడీయూ), ప్రేమ్ చంద్ర మిశ్రా(కాంగ్రెస్), సంతోష్ కుమార్ సుమన్(హెచ్ఏఎం-ఎస్), మంగళ్ పాండే(బీజేపీ), రామ్ చంద్ర పుర్వే(ఆర్జేడీ), ఖలీద్ అన్వర్(జేడీ-యూ), రామేశ్వర్ మహతో(జేడీ-యూ), సంజయ్ పాశ్వాన్(బీజేపీ) పదవీ కాలం కూడా మే నెలలో ముగియనుంది. చదవండి: 'సందేశ్ఖాలీ' కేసులో సుప్రీంకోర్టుకు దీదీ సర్కార్ ఈ నేపథ్యంలో 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 14 చివరితేదీ. మార్చి 21వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో ఉన్న బలబలాల ప్రకారం.. ఆరు స్థానాలను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉంది. మిగతా ఐదు స్థానాలు మహాఘటబంధన్ గెలిచే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. కానీ తాము నాలుగు స్థాన్లాలో పోటీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తెలిపారు. మరో స్థానాన్ని మిత్రపక్షం హిందూస్థాన్ ఆవాస్ మోర్చాకు కేటాయించనున్నట్లు తెలిపారు. -
ఆ ముగ్గురి ఎన్నిక లాంఛనమే!
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలో భాగంగా రాష్ట్రం నుంచి మూడు స్థానాలకు గాను మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం నామినేషన్ల గడువు పూర్తయ్యే సమయానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు, బీఆర్ఎస్ నుంచి ఒక నామినేషన్ దాఖలు కావడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్నేత రేణుకా చౌదరి, యువనేత అనిల్కుమార్ యాదవ్ చెరి మూడేసి సెట్ల చొప్పున, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర రెండుసెట్ల నామినేషన్పత్రాలను సమర్పించారు. కాంగ్రెస్ అభ్యర్థులు మూడే సి సెట్ల నామినేషన్లలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు (ఒక్కో దాంట్లో పదేసి మంది చొప్పున మొత్తం 60 మంది సభ్యులు)సంతకాలు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. గురువారం రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్రెడ్డికి రేణుకా చౌదరి తమ నామినేషన్ పత్రాలను సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో సమర్పించారు. అనిల్కుమార్ యాదవ్ తమ పత్రాలను సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు డి. శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో అందజేశారు. వద్దిరాజు రవిచంద్ర తమ పత్రాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్రావు గంగుల కమలాకర్, నాగేందర్, జగదీశ్రెడ్డి సమక్షంలో రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. రేణుక, అనిల్కు బీఫామ్స్ అందజేసిన సీఎం అంతకుముందు సీఎం చాంబర్లో అభ్యర్థులు రేణుకాచౌదరి, అనిల్కుమార్కు రేవంత్రెడ్డి బీఫామ్స్ అందజేసినపుడు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆదిశ్రీనివాస్, మల్రెడ్డి రంగారెడ్డి, ఈర్లపల్లి శంకర్, తదితరులున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందించారు. గురువారం ఉదయం తెలంగాణ భవన్లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న వద్దిరాజు తెలంగాణ తల్లి విగ్రహానికి దండలు వేసి అసెంబ్లీకి చేరుకున్నారు. తొలుత అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని తెలంగాణ అమరుల స్తూపానికి నివాళులర్పించారు. ఎన్నిక ఏకగ్రీవమే! వచ్చే ఏప్రిల్ 2న బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ పదవీ కాలం ముగియనుండడంతో రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ మూడు సీట్లకు గాను నామినేషన్ల గడువు ముగిసే సమయానికి మూడు నామినేషన్లే దాఖలు కావడంతో... కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలాబలాల ఆధారంగా ఈ నెల 27న ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం లేకుండానే వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 16న పత్రాల నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈనెల 20న నామినేషన్ల ఉపసంహరణకు అఖరి రోజు. ఈ గడువు ముగియగానే ఈ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. -
నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థులు
-
పాక్ ఎన్నికల బరిలో.. ఎవరీ సవీరా ప్రకాష్?
సవీరా ప్రకాష్.. పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైన వేళ మారుమోగుతున్న పేరు. ఖైబర్ పఖ్తుంఖ్వా బనర్ జిల్లా నుంచి పోటీకి నామినేషన్ దాఖలు చేశారీమె. తద్వారా ఈ ఎన్నికల్లో ఆ ప్రావిన్స్ నుంచి నామినేషన్ ఫైల్ చేసిన తొలి మహిళగా.. అలాగే పోటీ చేయబోతున్న తొలి హిందూ మహిళగా వార్తల్లోకి ఎక్కారు. పాకిస్థాన్ ఎన్నికల సంఘం ఈ మధ్యే కీలక సవరణ చేసింది. సాధారణ స్థానాల్లో మహిళలకు ఐదు శాతం సీట్లు తప్పనిసరి చేయడం అందులో ఒకటి. సవీరా తండ్రి ఓం ప్రకాశ్ భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. హిందూ సంఘాల పోరాట సమితి సభ్యుడు కూడా. ఆయన అక్కడ పేరుపొందిన వైద్యుడు. మానవతా దృక్ఫథంతో పేదలకు ఉచిత వైద్యం అందించే వ్యక్తిగా ఆయనకంటూ పేరుంది అక్కడ. ఈ మధ్యే వైద్య వృత్తికి దూరంగా జరిగారు. అంతేకాదు.. 35 ఏళ్లుగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీలో సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. అయితే తండ్రి ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ.. సవీర బరిలో నిలవాలని నిర్ణయించుకుంది. సోమవారం బర్నర్లోని పీకే-25 స్థానానికి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించింది కూడా. సవీర, అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీలో చదువుకుంది. ఆ సమయంలో బనర్ పీపీపీ మహిళా విభాగానికి ఆమె కార్యదర్శిగా పని చేశారు. తాను వైద్య విద్య అభ్యసించే సమయంలో.. కళాశాలలో వసతుల లేమి తనను ఆలోచింపజేసేదని.. అదే తన రాజకీయ అడుగులకు కారణమని ఇప్పుడు చెబుతున్నారామె. గెలిస్తే.. హిందూ కమ్యూనిటీ బాగుకోసం కృషి చేయడంతో పాటు మహిళా సాధికారత.. సంక్షేమ సాధన తన లక్ష్యమని ఆమె చెబుతున్నారు. మరోవైపు బనర్ ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు చెబుతున్న ఇమ్రాన్ నోషాద్ ఖాన్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. సవీరకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని అంటున్నాడు. బిలావల్ భుట్టో సారథ్యంలోని పీపీపీ ప్రస్తుతం అధికార కూటమిలో మిత్రపక్షంగా కొనసాగుతోంది. అయితే ఇదే బిలావల్ భుట్టో.. భారత్, కశ్మీర్పై గతంలో పలుమార్లు విషం చిమ్మడం తెలిసిందే. పాక్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన జరగనుంది. -
శుభకార్యాలు.. ప్రచారాలు
జగిత్యాల: నామినేషన్ల ఘట్టం ముగిసిపోవడంతో బుధవారం ఎవరెవరు అభ్యర్థులు బరిలో ఉంటారో తెలుస్తుంది. ఈసారి స్వతంత్రులు అధికంగానే ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవరి దారిలో వారు ప్రచారం చేపడుతున్నారు. ప్రతి ఒక్క ఓటు ఎంతో విలువైంది కావడంతో ప్రధాన అభ్యర్థుల నుంచి స్వతంత్రుల వరకు నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా అక్కడకు వెళ్తున్నారు. ఎవరైనా మరణించినా, ఏమైనా సంఘటనలో గాయపడ్డా ఉదయమే అక్కడకు వెళ్లి పరామర్శిస్తున్నారు. గతంలో రాని నాయకులు ఈసారి ప్రతిదానికి వెళ్లడంతో ప్రజలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఓటు విలువ ఎంత ఉందో తెలుస్తుంది. ఈనెల 16 నుంచి మంచి ముహూర్తాలు ► రానున్న రెండురోజుల్లో వివాహ వేడుకలు సైతం ఊపందుకోనున్నాయి. ► కార్తీకమాసం ప్రారంభం కానుండటంతో 8 నుంచి 10 రోజుల పాటు వివాహాలు జరగనున్నట్లు పండితులు పేర్కొంటున్నారు. ► ఈనెల 30న పోలింగ్ ఉండగా, ఇంతకంటే ముందే వివాహ వేడుకలు అత్యధికంగా ఉండటంతో ప్రతీ వేడుకకు హాజరయ్యేందుకు అభ్యర్థులు సైతం ప్రణాళికలు ఇప్పటి నుంచే రూపొందించుకుంటున్నారు. ► గతంలో వివాహ వేడుకలకు రావాలని స్వయాన కుటుంబ సభ్యులు శుభలేఖలు అందజేసినా సమయం ఉంటేనే వెళ్లేవారు. ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవడం కోసం పిలవకపోయినా వివాహ వేడుకలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ► దాదాపు పెళ్లిల్లో చాలా జనాలు ఉంటారు కాబట్టి వివాహ వేడుకలకు హాజరైతే ఓట్లు వచ్చే అవకాశాలుంటాయని అభ్యర్థులు ఆలోచిస్తున్నారు. ► ఒకవైపు పరామర్శించడంతో పాటు, మరోవైపు శుభకార్యాల్లో పాల్గొంటూ నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ► ఈనెలలో 16 నుంచి 29 వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో ఆ సమయంలోనే ప్రచారం హోరెత్తనుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రతి ఒక్క అభ్యర్థి ఇంటింటికీ వెళ్తూ అవ్వలను, మహిళలను, వృద్ధులను, యువతను కలుస్తూ ఓటు తమకే వేయాలంటూ వేడుకుంటున్నారు. ► ఎన్నికలకు మరో మరో 15 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉదయం 4 నుంచి 5 గంటలలోపే గ్రామాలు, మండలాల్లో ప్రచారం ప్రారంభిస్తున్నారు. ► మున్సిపాలిటీల్లో రాత్రిపూట విస్తృత ప్రచారం చేపడుతున్నారు. ఏదేమైనా అభ్యర్థులకు ప్రచారంలో ముచ్చెమటలు పడుతున్నాయి.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రుబెల్లాపై గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి
స్పైస్జెట్కు రూ.60 వేల జరిమానా
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే పింఛన్ల పెంపు
నేడు ప్రధానమంత్రి రోడ్ షో
ఓటింగ్ శాతం పెంచాలి
ఉమ్మరకోట్ సొంతం!
సీ్త్ర, పురుష నిష్పత్తిలో తేడా తగ్గించాలి
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
సమన్వయంతో పనిచేద్దాం: ఎస్పీ
‘12, 13 తేదీల్లో పత్రికా ప్రకటనలపై ముందస్తు అనుమతి తప్పనిసరి’
తప్పక చదవండి
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement