-
స్త్రీవాదమే సమాజాన్ని నాశనం చేసింది: నటి కామెంట్స్ వైరల్
బాలీవుడ్ భామ నోరా ఫతేహీ ఇటీవల మడ్గావ్ ఎక్స్ప్రెస్ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. బాలీవుడ్ పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్లో మెరిసిన ముద్దుగుమ్మ ఇటీవల బాలీవుడ్ జంటలపై సంచలన కామెంట్స్ చేసింది. వారంతా కేవలం డబ్బు, పేరు కోసమే పెళ్లిళ్లు చేసుకుంటున్నారని విమర్శించింది. తనకు అలాంటి ఉద్దేశం లేదని.. అందుకే ఎవరితోను డేటింగ్లో చేయడం లేదని చెప్పుకొచ్చింది. తాజాగా ఈ బాలీవుడ్ భామ మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. ఓ పాడ్కాస్ట్లో నోరా మాట్లాడుతూ ఫెమినిజంపై విమర్శలు గుప్పించింది. స్త్రీవాదం అనేది సమాజాన్ని పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించింది. అది కేవలం మహిళలనే కాకుండా పురుషులను కూడా బ్రెయిన్వాష్ చేసిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఫెమినిజంపై నోరా మాట్లాడుతూ..'ఇలాంటి ఆలోచన ఎవరికీ అవసరం లేదు. స్త్రీవాదమనే ఈ విషయాన్ని నేను అస్సలు నమ్మను. నిజంగా స్త్రీవాదమే మన సమాజాన్ని పూర్తిగా నాశనం చేసింది. మహిళలు పెళ్లి చేసుకోకూడదు. పిల్లలను కనకూడదనే ధోరణిని తాను విశ్వసించను. ఇది పూర్తిగా స్వతంత్రంగా ఉండాలి. ఇక్కడ పురుషులు డబ్బు, ఫుడ్ కోసం పనిచేస్తుంటే.. ఒక స్త్రీ పిల్లలు, ఇల్లు చూసుకోవడం, వంట చేయడం లాంటివి చేస్తున్నారు. మహిళలు బయటకు వెళ్లి పని చేయాలి.. వారు సొంతంగా జీవించాలని కోరుకుంటున్నారు.. కానీ అది కొంత వరకేనని' చెప్పుకొచ్చింది. ప్రస్తుత సమాజంలో చాలా మంది పురుషుల ధోరణి మారింది. ఇప్పుడు చాలా మంది ఫెమినిజం ద్వారా బ్రెయిన్వాష్కు గురయ్యారంటూ నోరా తెలిపింది. మనమందరం సెంటిమెంట్స్లో సమానమే కానీ.. సామాజికపరంగా సమానం కాదని నోరా పేర్కొంది. స్త్రీవాదం అంతర్లీనంగా, ప్రాథమిక స్థాయిలో గొప్పదే.. నేను కూడా మహిళల హక్కుల కోసం వాదిస్తానని.. బాలికలు పాఠశాలకు వెళ్లాలని కోరుకుంటానని తెలిపింది. అయితే, స్త్రీవాదం రాడికల్గా మారినప్పుడే సమాజానికి ప్రమాదకరంగా మారుతుందని వెల్లడించింది. అయితే ఫెమినిజం పునాదులు గట్టిగానే ఉన్నప్పటికీ .. గత 20 ఏళ్లలో పోలిస్తే చాలా ప్రమాదకరంగా మారిందని అన్నారు. అయితే నోరా ఫతేహీ చేసిన కామెంట్స్పై నెటిజన్స్ మండిపడుతున్నారు. మీ మాటలు చాలా కామెడీగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్త్రీవాదం లేకపోతే ఇండియాలో నీకు పని చేసే అవకాశం లభించేది కాదని అంటున్నారు. అలా అయితే మీరు వెంటనే పని మానేసి పెళ్లి చేసుకోండి.. అలాగే మీరు ఐటెం సాంగ్స్లో డ్యాన్స్ చేయకుండా భర్తపైనే ఆధారపడి జీవించండి అంటూ ఓ నెటిజన్ చురకలంటించారు. అసలు మహిళలు కేవలం సంరక్షకులుగా ఉండాలని.. పురుషులే పోషించాలని.. స్త్రీవాదం సమాజాన్ని నాశనం చేసిందని నోరా ఫతేహి ఎలా మాట్లాడాతారంటూ ఓ నెటిజన్ ప్రశ్నించింది. ప్రస్తుతం నోరా చేసిన కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
బాలీవుడ్ జంటలపై నోరా ఫతేహి సంచలన కామెంట్స్
-
కేవలం దాని కోసమే పెళ్లి.. జీవితాలు త్యాగం చేసి: నటి షాకింగ్ కామెంట్స్
ఇటీవల మడ్గావ్ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ నోరా ఫతేహీ. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ఆస్వాదిస్తోంది బాలీవుడ్ భామ. డ్యాన్సర్గా కెరీర్ ప్రారంభించిన నోరా రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్ మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బిగ్బాస్ షోలో కూడా మెరిసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నోరా బాలీవుడ్ పరిశ్రమపై షాకింగ్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్లో ప్రముఖ జంటలను ఉద్దేశించి చేసిన కామెంట్స్ బీ టౌన్లో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ అదేంటో ఓ లుక్కేద్దాం. నోరా మాట్లాడుతూ..' ఇండస్ట్రీలో డబ్బు, పేరు కోసం తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మీరు ప్రేమించని వ్యక్తిని వివాహం చేసుకోవడం కంటే దారుణం ఇంకోటి లేదు. ఇష్టం లేకపోయినా ఏళ్ల తరబడి వారితోనే జీవిస్తున్నారు. బాలీవుడ్ పరిశ్రమలో చాలా మంది అలాంటి పనికిమాలిన వాళ్లే ఉన్నారు. వారు కేవలం ఆ సర్కిల్లో మాత్రమే ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే వారి కెరీర్ ఎక్కడికి వెళుతుందో వారికి తెలియదు. అందుకే వారికి కొంత బ్యాకప్ ప్లాన్ కావాలి.' అని అన్నారు. తనకు బాయ్ఫ్రెండ్స్ లేరన్న విషయంపై నోరా స్పందించింది.' చాలామంది నన్ను కేవలం వాళ్ల ఫేమ్ కోసమే వాడుకుంటున్నారు. అందుకే అలాంటి వారు నాతో ఉండలేరు... అందుకే నేను అబ్బాయిలతో డేటింగ్ చేయడం మీకు కనిపించడం లేదు. బాలీవుడ్ పరిశ్రమలో కేవలం డబ్బు, పరపతి కోసమే పెళ్లి చేసుకుంటారు. వీరంతా బార్య, భర్తలుగా కాకుండా తమ సర్కిల్లో డబ్బు, పేరు కోసం ఆ బంధాన్ని వాడుకుంటున్నారు. ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటే మూడేళ్లపాటు రిలేషన్లో ఉంటున్నారు. ఆ తర్వాత అతనితో కొన్ని సినిమాలు చేసి.. అవీ బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వగానే పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నారని' చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఇష్టం లేని పెళ్లి చేసుకుని తమ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి డిప్రెషన్లో జీవిస్తున్నారని నోరా తెలిపింది. వ్యక్తిగత జీవితం, మానసిక ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎందుకలా త్యాగం చేస్తున్నారో నాకు అర్థం కాలేదని పేర్కొంది. అయితే నోరా ఫతేహీ ప్రత్యేకంగా ఏ జంట పేర్లను ప్రస్తావించలేదు. కాగా.. రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్తో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన నోరా.. ఆ తర్వాత గర్మి, సాకి సాకి, జెహ్దా నాషా, మనీకే, డాన్స్ మేరీ రాణి, కుసు కుసు, జాలిమా కోకా కోలా, దిల్బార్ లాంటి చిత్రాల్లో మెరిసింది. -
కలర్ఫుల్ డ్రెస్లో మెగా కోడలు.. హోలీ వేడుకల్లో బాలీవుడ్ భామ చిల్!
కలర్ఫుల్ డ్రెస్లో కనిపించిన మెగా కోడలు.. హోలీ సంబురాల్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా.. బ్లాక్ డ్రెస్లో ఫ్యామిలీ స్టార్ బ్యూటీ మృణాల్ ఠాకూర్... గ్రీన్ శారీలో తళుక్కుమన్న అమృత అయ్యర్.. వైట్ డ్రెస్లో నోరా ఫతేహీ అలాంటి లుక్స్.. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) -
ఛాన్సులు లేకపోతే డిప్రెషన్.. నా స్ట్రాటజీనే వేరు!
ఎన్నో దెబ్బలు పడితే కానీ రాయి శిల్పంలా మారదు.. మనిషి జీవితమూ అంతే! ఎన్నో కష్టాలను, ఒడిదుడుకులను అధిగమిస్తే కానీ విజయం సొంతం కాదు. ఇందుకు సెలబ్రిటీలు అతీతం కాదు. ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీకి వచ్చినా.. ఇక్కడ జయాపజయాలతో నిత్యం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఓటమితో ఫేడవుట్ అయిపోకుండా తమ స్థానాన్ని పదిలంగా కాపాడుకోవాల్సి ఉంటుంది. అవకాశాల కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది. ఎవరికీ అంత తీరిక ఉండదు దీని గురించి డ్యాన్సింగ్ క్వీన్, హీరోయిన్ నోరా ఫతేహి మాట్లాడుతూ.. 'మనకు ఛాన్సులు రాకపోతే అవతలివారిని నిందించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్లు ఒక మూస పద్ధతిలో వెళ్తుంటారు. పెద్ద పెద్ద స్టార్స్ను కలవాలని, వారితో పరిచయం పెంచుకోవాలని, వీలు కుదిరితే కలిసి సినిమా తీసి హిట్ కొట్టాలని ఆశపడుతుంటారు. వారికి మనల్ని గుర్తించే సమయం ఉండదు. నేను ఎవరినీ బ్లేమ్ చేయడం లేదు. నన్ను నేనే అనుకుంటున్నాను. వారు నాకు సమయమిచ్చేలా నన్ను నేను నిరూపించుకోవాలి. నేనేంటో నిరూపించుకుంటాను నేనదే చేశాను. నేను ఒక ఆర్టిస్టును.. డ్యాన్స్ చేస్తాను, పాటలు పాడతాను, మ్యూజిక్ ఆల్బమ్స్ నిర్మిస్తాను, యాక్ట్ చేస్తాను, డ్యాన్స్ షోలకు జడ్జిగానూ వ్యవహరించగలను. ఇది నా పర్సనాలిటీ! ఎవరో నా టాలెంట్ గుర్తిస్తారని ఎదురుచూస్తే ఉండేకన్నా నేనేంటో నేనే నిరూపించుకుంటే బెటర్ కదా! అన్నింట్లోనూ ఓ చేయేశాను కాబట్టే అవకాశాలు లేవనో, ఖాళీగా ఉన్నాననో ఎప్పుడూ డిప్రెషన్లోకు లోనవలేదు. వారిలా ఒత్తిడికి లోనవను పెద్దపెద్ద స్టార్ హీరోహీరోయిన్లు ఛాన్సులు రావడం లేదని, సక్సెస్ లేదని ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. వారి సినిమా ఆడలేదంటే దాదాపు ఏడెనిమిది నెలల దాకా ఒక్క ఛాన్స్ రాదు. దీంతో వారు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతారు. నేను వారిలా ఉండాలనుకోవడం లేదు. జీవితం చాలా చిన్నది. పాజిటివ్గా ఉండాలి. ఇండస్ట్రీకి మన మనసును, ధైర్యాన్ని ముక్కలు చేసే శక్తి ఇవ్వకూడదు. మన ప్రతిభకు తగ్గ అవకాశాలు ఆలస్యంగానైనా వస్తాయి. వాటి కోసం ఎదురుచూడాలి' అని నోరా చెప్పుకొచ్చింది. చదవండి: మెగాస్టార్ సాంగ్లో కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టిన బ్యూటీ.. తొలిసారి ఇలా -
సెట్లో అసభ్య ప్రవర్తన.. చెంప చెల్లుమనిపించిన బాహుబలి నటి!
2014లో రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నోరా.. ఆ తర్వాత ఏడాదిలోనే జూనియర్ ఎన్టీఆర్ సినిమా 'టెంపర్'లో స్పెషల్ సాంగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అతి స్వల్ప కాలంలోనే ఇండస్ట్రీలో టాప్ పొజిషన్కు చేరింది. అంతే కాకుండా కిక్- 2, షేర్, లోఫర్, ఊపిరి లాంటి చిత్రాల్లో ప్రత్యేక సాంగ్స్తో తన డ్యాన్సులతో ఆకట్టుకుంది. డ్యాన్సర్, మోడల్, సింగర్ కూడా తన సత్తా చాటింది. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ సాంగ్తో మంచి క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్లో యాక్టింగ్ ద్వారా ఫ్యాన్స్ను అలరిస్తోంది. సినిమాలని పక్కనబెడితే ఈమెకు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలోయాక్టివ్గా ఉంటే నోరాకు ఇన్స్టాలో 46.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. సినిమాలతో పాటు టీవీ రియాల్టీ డాన్స్ షోలు, మ్యూజిక్ వీడియోస్, వెబ్ సిరీస్, వెబ్ మూవీస్లో సందడి చేస్తోంది. కెరీర్ ఆరంభంలో చాలాసార్లు అవమానాలు ఎదుర్కొన్న నోరా.. అందరి నోళ్లు మూయించేలా ఉన్నతస్థాయికి ఎదిగింది. సహనటుడి అసభ్య ప్రవర్తన తాజాగా తనకు ఎదురైన ఓ చేదు సంఘటనను వివరించింది. ఇండస్ట్రీలో మొదటి నుంచి ఇబ్బందులు పడిన నోరాకు.. ఓ షూటింగ్ సెట్లో జరిగిన అవమానంపై తొలిసారి నోరు విప్పింది. గతంలో ది కపిల్ శర్మ షోకు హాజరైన భామ ఈ విషయాన్ని వెల్లడించింది. 'రోర్: టైగర్ ఆఫ్ ది సుందర్బన్స్' షూటింగ్ సమయంలో సహనటుడు అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. బంగ్లాదేశ్లో రోర్ మూవీ షూటింగ్లో ఈ సంఘటన జరిగిందని నోరా పేర్కొంది. మొదట అతను నాతో అసభ్యంగా ప్రవర్తించడంతో అక్కడే లాగి చెంప దెబ్బ కొట్టానని తెలిపింది. కానీ ఆ గొడవ అంతటితో ఆగిపోలేదని.. అతను తిరిగి నా జుట్టును పట్టుకుని లాగాడని వివరించింది. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య గొడవ తారస్థాయికి చేరిందని వెల్లడించింది. దీంతో డైరెక్టర్ జోక్యం చేసుకుని మా ఇద్దరికి సర్దిచెప్పి విడదీయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ భయానక సంఘటనను గుర్తుచేసుకుంది. ఆ గొడవ జరిగిన సమయంలో తాను చాలా బాధపడినట్లు నోరా ఫతేహీ తెలిపింది. కాగా.. ప్రస్తుతం నోరా క్రాక్ అనే చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమా ఫిబ్రవరి 23న వెండితెరపైకి రాబోతోంది. ఈ సినిమాలో విద్యుత్ జమ్వాల్, అర్జున్ రాంపాల్, అమీ జాక్సన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఇండియాలోనే మొట్టమొదటి 'ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్'గా ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్ నటిస్తోన్న హౌస్ఫుల్-5లో నటించనుంది. -
Nora Fatehi మొదట్లో మొఖం మీదే నవ్వారు, కట్ చేస్తే ..నోట్ల వర్షం!
అధునిక డ్యాన్స్లకు పర్యాయపదం ఆమె. ఎలాంటి డ్యాన్స్ మూమెంట్స్ అయినా తన స్టైల్లో ఇరగదీసి కుర్రకారు మతులను కొల్లగొడుతుంది. ఐటెం సాంగ్స్తో ఐటెం గర్ల్గా, స్టార్గా పాపులారీటీ సంపాదించుకుంది. అయితే ఈ జర్నీ నల్లేరు మీద నడకలా సాగిందనుకుంటే మాత్రం పొరపాటే. ఆరంభంలో ఈ స్టార్కి కూడా వేధింపులు తప్పలేదు. హిందీ భాష తెలియక అవమానాల పాలైంది. దర్శకులతోపాటు సెట్లో అందరూ ఆమెను చూసి నవ్వేవారట. కట్ చేస్తే..కేవలం ఒక సాంగ్కు దాదాపు రూ. 2 కోట్లకు పైగానే వసూలు చేస్తోంది. బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటతో దుమ్మురేపిన నోరా ఫతేహి పుట్టిన రోజు సందర్భంగా ఆమె జర్నీ గురించి మరికొన్ని విశేషాలు.. మొరాకో సంతతికి చెందిన నోరా ఫతేహి కెనడాలో పుట్టి పెరిగింది. టొరంటోలోని వెస్ట్వ్యూ సెంటెనియల్ సెకండరీ స్కూల్, ఆతరువాత యార్క్ విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రం అంతర్జాతీయ సంబంధాలను అభ్యసించింది. 2014లో రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్తో తన కెరీర్ను ప్రారంభించిన నోరా అతి స్వల్ప కాలంలోనే ఇండస్ట్రీలో టాప్ పొజిషన్కు చేరింది. డ్యాన్సర్, మోడల్, సింగర్ కూడా తన సత్తా చాటుకుంది. కానీ ఆరంభ రోజుల్లో చాలా ఉద్యోగాలు చేసింది. చివరికి హుక్కా బార్లో కూడా పనిచేసింది. అక్కడే డ్యాన్స్ బాగా నేర్చుకుంది. అలాగే ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలన్న కోరికతో ఆడిషన్కి వెళ్లినపుడు కాస్టింగ్ డైరెక్టర్లు అవహేళన చేసేవారని గతంలో ఒక సందర్బంలో గుర్తు చేసుకుంది నోరా. ‘‘నీలాంటోళ్లు ఇక్కడ చాలామంది ఉన్నారు..మీ దేశానికి తిరిగి వెళ్లిపో.. కత్రినా కైఫ్ లాగా మారి పోదామనుకుంటున్నావా’’ అని కూడా హేళన చేశారనీ, అయినా కష్టపడి భాష నేర్చుకుని, చివరికి సోదరుడి, పుట్టినరోజు, పెళ్లి అన్నీ పక్కన బెట్టేసి రూంలోనే ప్రాక్టీస్ చేస్తూ ఈ రోజు ఈ స్థాయికి చేరినట్టు ఫతేహి చెప్పుకొచ్చింది. డ్యాన్సర్ కావాలనేది, అందర్నీ ఎంటర్టైన్ చేయాలనేదే తన కల అని తెలిపిందామె. బాలీవుడ్ సినిమాలతో తెరంగేట్రం చేసిన ఈ భామ. ‘‘దిల్ బర్, సాకీ సాకీ " లాంటి హాట్ సాంగ్స్ తో బీ-టౌన్లో అలజడి రేపింది. ఇక టాలీవుడ్లో స్పెషల్ సాంగ్స్తో అదరగొట్టేసింది. టెంపర్, కిక్2, లోఫర్, ఊపిరి లాంటి మూవీలతో ఈ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకుల మనసులను కూడా దోచుకుంది. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ సాంగ్తో మంచి క్రేజ్ సంపాదించింది. బాలీవుడ్ మూవీస్లో యాక్టింగ్ ద్వారా ఫ్యాన్స్ను అలరిస్తోంది. అన్నట్టు సోషల్ మీడియాలోయాక్టివ్గా ఉంటే నోరాకు ఇన్స్టాలో 46.2 మిలియన్ల ఫాలోవర్లను సంపాందించు కోవడం విశేషమే మరి. అంతేనా టీవీ రియాల్టీ డాన్స్ షోలు, మ్యూజిక్ వీడియోస్, వెబ్ సిరీస్, వెబ్ మూవీస్లో సందడి చేస్తోంది. -
సెట్లో స్టార్ట్
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘మట్కా’. ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లు. కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ పాన్ ఇండియన్ చిత్రాన్ని విజయేందర్ రెడ్డి తీగల, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం హైదరాబాద్లో మొదలైంది. ‘‘యావత్ దేశాన్ని కదిలించిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ‘మట్కా’ను తెరకెక్కిస్తున్నాం. ఇందులో వరుణ్ తేజ్ నాలుగు విభిన్నమైన గెటప్స్లో కనిపిస్తారు. ఈ సినిమా కథాంశం ప్రధానంగా 1958–1982ల మధ్య జరుగుతుంది. అందుకుని 1950, 1980 నాటి పరిస్థితులను రీ క్రియేట్ చేస్తున్నాం. అలా రీ క్రియేట్ చేసిన ఓ భారీ సెట్లోనే ‘మట్కా’ షూటింగ్ జరుగుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్. -
అక్టోబరులో ఆరంభం
వరుణ్ తేజ్ హీరోగా ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ చిత్రం రూ΄పొందుతున్న సంగతి తెలిసిందే. మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబరు మొదటివారంలో హైదరాబాద్లో ప్రారంభం కానుందని, ఈ తొలి షెడ్యూల్ దాదాపు ఇరవై రోజుల పాటు హైదరాబాద్లోని విభిన్నమైన లొకేషన్స్లో జరుగుతుందని సమాచారం. వైజాగ్ నేపథ్యంలో 1958 – 1982 టైమ్ పీరియడ్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ‘మట్కా’ చిత్రం తెరకెక్కనుంది. కథానుగుణంగా అప్పటి వైజాగ్ను తలపించేలా సెట్ను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారట యూనిట్. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
ఛాన్సుల కోసం కాంప్రమైజ్ అవమన్నారు.. ఈ నటి మాత్రం!
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, ప్రలోభపరచడం లాంటివి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే అప్పట్లో పెద్దగా బయటపెట్టేవారు కాదు గానీ ఇప్పుడు ధైర్యంగా ఆయా విషయాల్ని పంచుకుంటున్నారు. చిన్న యాక్టర్స్ నుంచి స్టార్ హీరోయిన్ల అందరూ ఇలాంటి ఏదో ఓ సందర్భంలో దీని బారిన పడినవాళ్లే. ప్రముఖ నటి నోరా ఫతేహి కూడా ఇందులో మినహాయింపు ఏం కాదు. గతంలో తనకు జరిగిన ఓ షాకింగ్ విషయాన్ని ఇప్పుడు రివీల్ చేసింది. (ఇదీ చదవండి: ఆ నటి దగ్గర ప్రపంచంలోనే ఖరీదైన హ్యాండ్ బ్యాగ్) కాంప్రమైజ్ అవ్వమన్నారు 'కెరీర్ ప్రారంభంలో నన్ను కూడా పదేపదే కాంప్రమైజ్ అవ్వమని చెప్పారు. కొందరు వ్యక్తులతో డేటింగ్ చేయమని బలవంతం చేసేవారు. కానీ నేను ఆరోజు వాటిని తలొగ్గలేదు. నాకున్న దారిలోనే నేను వెళ్లాను. విజయవంతం అయ్యాను. ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే దానికి మరో వ్యక్తితో తిరగడం, ఆ హీరోతో రాసుకుపూసుకు తిరగడం అయితే కారణం కాదు' అని నటి నోరా ఫతేహి చెప్పుకొచ్చింది. నోరా.. తెలుగులోనూ 2014లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నోరా.. ఆ తర్వాత ఏడాది ఎన్టీఆర్ 'టెంపర్'లో స్పెషల్ సాంగ్ చేసి ఎంటర్టైన్ చేసింది. కిక్ 2, షేర్, లోఫర్, ఊపిరి తదితర చిత్రాల్లో తన డ్యాన్సులతో ఆకట్టుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు వరుణ్ తేజ్ 'మట్కా'లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ప్రత్యేక గీతంతో పాటు ఈమె పాత్రకు ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాలని పక్కనబెడితే ఈమెకు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ప్రత్యేకించి ఈమె ఫొటోలు, వీడియో పోస్ట్ చేస్తే చాలు కుర్రాళ్లు వెర్రెక్కిపోతుంటారు. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) (ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!) -
పాన్ ఇండియా రేంజ్లో 'జూదం' అడేందుకు రెడీ అవుతున్న వరుణ్ తేజ్
వరుణ్ తేజ్, మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహి హీరో హీరోయిన్లుగా కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘మట్కా’ అనే టైటిల్ను ఖరారు చేశారు. మోహన్ చెరుకూరి (సీవీఎం), డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం గురువారం జరిగింది. తొలి సీన్కి దర్శకుడు మారుతి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత ‘దిల్’ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు సురేష్బాబు, విజయేందర్ రెడ్డి, సీవీఎం కలిసి దర్శకుడు కరుణ కుమార్కు స్క్రిప్ట్ అందించగా, దర్శకుడు హరీష్ శంకర్ టైటిల్ పోస్టర్ లాంచ్ చేశారు. ‘‘వరుణ్కు ‘మట్కా’ తొలి పాన్ ఇండియన్ మూవీ. ‘మట్కా’ అంటే ఒక రకమైన జూదం. 1958–1982 మధ్య కాలంలో దేశాన్ని కదిలించిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా వైజాగ్ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. వరుణ్ తేజ్ నాలుగు గెటప్స్లో కనిపిస్తారు. నాటి వైజాగ్ను తలపించేలా ప్రొడక్షన్ డిజైనర్ ఆశిష్ తేజ, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ ఆధ్వర్యంలో వింటేజ్ సెట్ వర్క్ జరుగుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్కుమార్, కెమెరా: ప్రియా సేత్. -
అత్యంత చెత్త ఫ్యాషన్ వీళ్లదే.. ఆ లిస్ట్లో ఎవరెవరంటే?
బాలీవుడ్ అంటే ఓ ఫ్యాషన్ ప్రపంచం. ఈవెంట్ ఏదైనా సినీ తారలు తమ ఫ్యాషన్ను వేదికపైనే పరిచయం చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో బాలీవుడ్ తారలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. తమ ఫ్యాషన్ డ్రెస్సులతో ఆడియన్స్ను కట్టిపడేస్తుంటారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) తాజాగా జరిగిన కేన్స్, ఐఫా లాంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఊర్వశి రౌతేలా, ఐశ్వర్యరాయ్, పాలక్ తివారీ, కాజోల్, నోరా ఫతేహి, చాహత్ ఖన్నా వేదికలపై తళుక్కున మెరిశారు. కొందరు తమ డ్రెస్సులతో అభిమానులను మెప్పించగా.. మరికొందరు తారలు విచిత్రమైన ఫ్యాషన్తో దారుణ ట్రోల్స్కు గురయ్యారు. View this post on Instagram A post shared by Urvashi Rautela❤️ (@asliurvashians) అలా ఇటీవల జరిగిన ఐఫా, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో అత్యంత చెత్త ఫ్యాషన్తో దారుణంగా ట్రోల్స్కు గురయ్యారు. వారిలో ప్రధానంగా ఊర్వశి రౌతేలా, పాలక్ తివారీ, చాహత్ ఖన్నా, కాజోల్, దివ్యాంక త్రిపాఠి, నోరా ఫతేహీ ఉన్నారు. ఈ వారంలో అత్యంత చెత్త ఫ్యాషన్ దుస్తులతో ముందు వరుసలో నిలిచారు. నోరా ఫతేహీ మొదటి రోజే ఎరుపు రంగు దుస్తులు ధరించి ట్రోల్స్కు గురైంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) ఐఫా వేడుకల్లో ఊర్వశి రౌతేలా గౌనులో గోధుమ రంగు ఈకలు ఉన్న డ్రెస్సుతో మెరిసింది. ఇది చూసిన నెటిజన్స్ ఆమె ఘోరమైన సెలక్షన్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక చాహత్ ఖన్నా బ్లాక్ గౌనులో ఉర్ఫీ జావెద్ను తలపించింటూ కామెంట్స్ చేశారు. కాజోల్ కాషాయ రంగులో డ్రెస్సులో కనిపించగా.. ఆమెదీ పనికిమాలిన ఫ్యాషన్ అంటూ కామెంట్ చేశారు. ఇక మరో నటి పాలక్ తివారీ డ్రెస్ బెడ్షీట్, కర్టెన్ క్లాత్ను తలపించేలా ఉందంటూ ట్రోల్ చేశారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
బాలీవుడ్ నటి నోరా ఫతేహి స్టైలిష్ ఫోటోలు
-
భోజనంలో అవి ఉండాల్సిందే! రోజూ ఆయిల్ మసాజ్.. నా బ్యూటీ సీక్రెట్ ఇదే!
‘‘నీళ్లు బాగా తాగుతాను. రోజూ నా భోజనంలో తాజా ఆకు కూరలు, కూరగాయలు ఉండేలా చూసుకుంటాను. తాజా పండ్లు సరేసరి! వారానికి ఒకసారి ఫేస్కి గ్రీన్ టీ ప్యాక్ వేసుకుంటా. గ్రీన్ టీ ఆకులను తేనెలో కలిపి దాన్ని ఫేస్ ప్యాక్లా వేసుకుంటా. ఆరిపోయాక చన్నీళ్లతో కడిగేసుకుంటా. ఇవన్నీకాక.. మొహం నిత్యం మెరుస్తూండడానికి నా చర్మానికి సరిపడే ఫేషియల్ ఆయిల్తో మసాజ్ చేసుకుంటాను. గ్రీన్ టీ ప్యాక్, ఫేషియల్ ఆయిల్ మసాజ్లు మా అమ్మ చెప్పిన చిట్కాలే!’’ అంటోంది బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ. కాగా మొరాకో మూలాలున్న నోరా కెనడాలో జన్మించింది. మోడల్, డాన్సర్, సింగర్, నటిగా రాణిస్తోంది. 31 ఏళ్ల ఈ బ్యూటీక్వీన్ డాన్స్కు లక్షల్లో అభిమానులు ఉన్నారు. రోర్ మూవీతో తెరంగేట్రం చేసిన నోరా ఫతేహి.. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. పొలిటికల్ సైన్స్ అభ్యసించిన నోరా.. పేరుకు కెనడియన్ని అయినా ఆత్మీయత పంచడంలో భారతీయులకు ఏమాత్రం తీసిపోనంటూ పలు సందర్భాల్లో ఇండియాపై అభిమానం చాటుకుంది. ఇక దిల్ బర్ పాటలో నోరా స్టెప్పులకు ఫిదా కాని సినీ అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకులను అంతలా మాయ చేసింది ఈ సోగకళ్ల బ్యూటీ! -
ఊ అంటావా పాటకు బాలీవుడ్ స్టార్ డ్యాన్స్.. ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంది సామీ!
'ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా' పాట టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్లో అల్లు అర్జున్, సమంత స్టెప్పులు, ఎక్స్ప్రెషన్లు ఎవరూ మర్చిపోలేరు. తాజాగా ఈ పాటకు బాలీవుడ్ సెలబ్రిటీలు స్టెప్పులేశారు. స్టార్ హీరో అక్షయ్ కుమార్, డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి స్టేజీపై ఊ అంటావా అంటూ అగ్గి రాజేశారు. యూఎస్ డల్లాస్లో వీరు ఈ పాటకు డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే చాలామంది నెటిజన్లకు వీరి డ్యాన్స్ నచ్చలేదు. ఊ అంటావా పాటను నాశనం చేశారు కదరా అంటూ సదరు హీరోహీరోయిన్లను ఏకిపారేస్తున్నారు. 'మీరు అల్లు అర్జున్, సమంతను మ్యాచ్ చేయడం కాదు కదా వారికి దరిదాపుల్లోకి కూడా రాలేరు..', 'వాటే వల్గర్ డ్యాన్స్..', 'ఇంత నీచంగా డ్యాన్స్ చేస్తున్నారేంట్రా దేవుడా', 'డ్యాన్స్ దాకా ఎందుకు అక్షయ్ ఎక్స్ప్రెషన్స్ ఒక్కటి చాలు ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి' అని కామెంట్లు చేస్తున్నారు. అయితే నోరా ఫ్యాన్స్ మాత్రం 'మా బ్యూటీ ఎంత బాగా స్టెప్పులేస్తుందో.. నిన్ను ఎవరూ బీట్ చేయలేరు నోరా' అని వెనకేసుకొస్తున్నారు. కాగా పుష్ప: ద రైజ్ సినిమాలో సమంత 'ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా' అనే స్పెషల్ సాంగ్లో కనిపించి అదరగొట్టేసింది. మూడు నిమిషాల పాట కోసం ఆమె రూ.5 కోట్ల మేర పారితోషికం తీసుకున్నట్లు భోగట్టా! View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
స్కర్ట్ వేసుకుని స్టేజీపై డ్యాన్స్ చేసిన స్టార్ హీరో, వీడియో..
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ యూఎస్ పర్యటనలో ఉన్నారు. నోరా ఫతేహి, దిశా పటానీ, మౌనీ రాయ్ సహా పలువురు సెలబ్రిటీలు 'ద ఎంటర్టైనర్స్ టూర్'లో భాగమయ్యారు. ఈ క్రమంలో అట్లాంటాలోని ఓ షోలో అక్షయ్ కుమార్ స్టేజీపై స్టెప్పులేశాడు. ఇటీవలే రిలీజైన 'సెల్ఫీ' చిత్రంలోని 'మే ఖిలాడీ..' పాటకు గాగ్రాలో చిందేశాడు. ఇంతలో బ్యూటీ నోరా ఫతేహీ కూడా అతడితో జోడీ కట్టింది. ఇక సాంగ్ ఊపందుకుంటున్న సమయంలో అక్షయ్ తన స్కర్ట్ విప్పేసి మరింత ఎనర్జిటిక్గా డ్యాన్స్ వేశాడు. ఇద్దరూ కలిసి స్టెప్పులేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ లుక్లో అక్షయ్ రెడ్ ఖిలాడీలా ఉన్నాడని, కాకపోతే స్కర్ట్తో కొంత ఇబ్బంది పడినట్లు కనిపిస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా వీరి మాస్ పర్ఫామెన్స్కు అక్కడున్నవారు ఈలలు, చప్పట్లతో అభినందనలు తెలియజేశారు. అటు అక్షయ్ కుమార్ భగవంతుని నామస్మరణతో ఈ టూర్ను ప్రారంభించగా అందుకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. తన నెక్స్ట్ టూర్ డల్లాస్లోనేనని తెలియజేశాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) -
నటుడి జుట్టు పట్టుకుని లాగి చెంప చెళ్లుమనిపించిన హీరోయిన్
సినిమాల్లోనే కాదు కొన్నిసార్లు సినిమా సెట్స్లో కూడా ఘర్షణలు జరుగుతుంటాయి. అవి మితిమీరిపోతేనే ఎక్కడలేని తలనొప్పులు వస్తాయి. హీరోయిన్, డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి తన తొలి సినిమా షూటింగ్లోనే గొడవపడిందట. రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్ చిత్రంతో 2014లో వెండితెరపై అడుగుపెట్టింది నోరా. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తనకు ఎదురైన ఓ చేదు ఘటనను గతంలో ఓ షోలో వెల్లడించగా ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నోరా మాట్లాడుతూ.. 'బంగ్లాదేశ్లోని సుందర్బన్స్ అడవుల్లో రోర్ షూటింగ్ జరుగుతోంది. సంస్కారం లేని ఓ నటుడు నాతో అనుచితంగా ప్రవర్తించాడు. నాకు కోపమొచ్చి వెంటనే అతడి చెంప పగలగొట్టాను. దీంతో అతడు కూడా తిరిగి నన్ను కొట్టాడు. నేను మళ్లీ తిరిగి కొట్టాను. అతడు నా జుట్టు పట్టుకుని లాగాడు, నేను కూడా అతడి జుట్టు లాగాను. అందరూ చూస్తుండగానే మేమిద్దరం గట్టిగట్టిగా కొట్టేసుకున్నాం. వెంటనే డైరెక్టర్ జోక్యం చేసుకుని మమ్మల్ని ఆపాడు' అని చెప్పుకొచ్చింది. ఆమె చెప్పింది విని అక్కడున్న అర్చన పూరన్ సింగ్, కపిల్, ఆయుష్మాన్ అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. కానీ నోరా మాత్రం ఆ సంఘటన గురించి చెప్తున్నంత సేపు పడీపడీ నవ్వుతూనే ఉంది. ఇది నెటిజన్లకు అస్సలు మింగుడుపడలేదు. నువ్వేమైనా జోక్ చెప్తున్నావా? ఎందుకంత నవ్వుతున్నావు? ఇదేదో కామెడీ అనుకుంటుందా? ఏంటీ? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల కపిల్ శర్మ షోలో మరోసారి తళుక్కుమంది నోరా. అప్పుడు కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. డేట్స్కు వెళ్లినప్పుడు తాను బిల్లు కట్టనని చెప్పింది. ఇప్పుడు లోకం మారిందని, అమ్మాయిలు కూడా బిల్లు కడుతున్నారని అర్చన చెప్పగా.. అయితే నువ్వు కట్టుకో, కానీ నేను మాత్రం కట్టనంటూ దురుసుగా మాట్లాడింది. ఇకపోతే నోరా విషయానికి వస్తే.. టెంపర్, బాహుబలి: ది బిగినింగ్, కిక్ 2, ఊపిరి, లోఫర్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్తో ఓ ఊపు ఊపింది. దిల్బర్ పాట గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఆమె జాన్ అబ్రహం, షెహనాజ్ గిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 100% చిత్రంలో నటిస్తోంది. -
డేటింగ్ చేయమని రోజు పది సార్లు కాల్ చేసేది.. నటిపై సంచలన ఆరోపణలు
సుకేశ్ చంద్రశేఖర్కు సంబంధించిన రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరును కూడా ఈడీ చేర్చింది. అయి తే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ ఈడీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో పలు కీలక విషయాలను వివరించాడు. మరో నటి నోరా ఫతేహిపై సంచలన ఆరోపణలు చేశాడు. నోరా నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్పై ఎప్పుడూ అసూయపడేదని సుకేశ్ విచారణలో తెలిపాడు. తాను జాక్వెలిన్తో రిలేషన్లో ఉండగా.. తనను బ్రెయిన్వాష్ చేయడానికి ప్రయత్నించేదని సుకేష్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు. నేను జాక్వెలిన్ను విడిచిపెట్టి ఆమెతో డేటింగ్ చేయాలని కోరిందని సుకేశ్ వివరించారు. నోరా నాకు రోజుకు కనీసం 10 సార్లు కాల్ చేసేదని ఇటీవల విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. నోరా ఫతేహి ఈడీ ముందు తప్పుడు వాంగ్మూలాన్ని ఇచ్చిందని ఆరోపించారు. ఆమె దుర్మార్గపు ఆలోచనలతో తమను మోసం చేసిందని పేర్కొన్నాడు. అయితే జాక్వెలిన్ ఇచ్చిన వాంగ్మూలంపై తాను మాట్లాడదలచుకోలేదని అన్నారు. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించిన వివరాలతో దిల్లీ పోలీసులు అనుబంధ ఛార్జిషీట్లో దాఖలు చేసినట్లు తెలుస్తోంది. జాక్వెలిన్ గురించి సుకేశ్ ప్రస్తావిస్తూ.. 'ఆమె నేను గౌరవించే వ్యక్తి. ఆమె ఎల్లప్పుడూ నా జీవితంలో భాగం. ఆమెతో నాతో ఉంటే సంతోషం. ఈ కేసు ఆమెను ఎలా ప్రభావితం చేసిందో నాకు తెలుసు. జాక్వెలిన్ను చూసుకోవడం నా బాధ్యత. ఆమెకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు.' అని అన్నారు. కాగా.. బాలీవుడ్ నటి జాక్వెలిన్ మధ్యంతర బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. -
హీరోయిన్తో షారుక్ ఖాన్ కొడుకు డేటింగ్? ఫోటోలు లీక్
బాలీవుడ్లో సెలబ్రిటీల మధ్య లవ్ ఎఫైర్లు, రిలేషన్స్షిప్స్కు కొదువ లేదు, ఇప్పటికే చాలామంది స్టార్స్ డేటింగ్ వార్తలతో టాక్ ఆఫ్ ది టౌన్గా మారారు. తాజాగా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డేటింగ్ రూమర్స్ బీటౌన్ను షేక్ చేస్తున్నాయి. ప్రముఖ హీరోయిన్ నోరా ఫతేహితో ఆర్యన్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా వీరిద్దరూ దుబాయ్కి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు లీక్ కావడంతో ఈ రూమర్స్ తెరమీదకి వచ్చాయి. ప్రస్తుతం ఆర్యన్ వయసు 25ఏళ్లు కాగా, నోరాకి 30 ఏళ్లు. అంటే వీరిద్దరి మధ్య ఐదేళ్లు గ్యాప్ ఉంది. ఇక రీసెంట్గా నోరా ఆర్యన్ సోదరి సుహానా ఖాన్తో కూడా డిన్నర్ పార్టీలో కనిపించింది. దీంతో నోరా-ఆర్యన్ల రిలేషన్ నిజమేనన్న టాక్ బలంగా వినిపిస్తుంది. మరి ఈ వార్తలపై నోరా లేదా ఆర్యన్లు స్పందిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్.. డ్యాన్స్ చేయనున్న బాలీవుడ్ నటి
ఫిఫా ప్రపంచకప్ తుది సమరానికి మరి కొన్ని గంటల్లో తేరలేవనుంది. ఫైనల్ పోరులో అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. లియోనెల్ మెస్సీ తన ప్రపంచకప్ కలను నెరవెర్చకుంటాడా? లేదా ప్రాన్స్ యువ సంచలనం కిలియాన్ ఎంబాపె తమ జట్టుకు మరోసారి ప్రపంచకప్ను అందిస్తాడా అన్నది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ మ్యాచ్ దోహా వేదికగా స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ జరిగే లుసైల్ ఐకానిక్ స్టేడియం వద్ద ఇప్పటి నంచేఅభిమానుల కోలాహలం నెలకొంది. కాగా ఇప్పటికే అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు స్టేడియం చేరుకున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్కు ముందు ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఫిఫా సిద్దమైంది. ఈ వేడుకలలో బాలీవుడ్ నటి నోరా ఫతేహి ప్రత్యేక డ్యాన్స్ ప్రదర్శనతో అభిమానులను అలరించనుంది. నోరా ఫతేహితో పాటు యూఏఈ పాపులర్ సింగర్ బాల్కీస్, ఇరాక్ సింగర్ రహ్మా రియాద్, ఐషా, గిమ్స్ వంటి ప్రముఖ సింగర్లు ఈ కార్యక్రమంలో పాల్గోనబోతున్నారు. ఇక ఈ మ్యాచ్ క్లోజింగ్ సెర్మనీ 15 నిమిషాలు పాటు జరగనుంది. కాగా కెనడాకు చెందిన నోరా ఫతేహి 2014లో వచ్చిన రోర్: టైగెర్స్ అఫ్ ది సుందర్బన్స్ అనే సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టింది. చదవండి: IND vs NZ: టీమిండియాకు గుడ్ న్యూస్.. వాళ్లిద్దరూ వచ్చేస్తున్నారు! ఇక తిరుగు లేదు.. -
ఆమె వల్లే అన్ని కోల్పోయా.. బాలీవుడ్ నటి సంచలన ఆరోపణలు
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్పై మరో నటి నోరా ఫతేహి పరువునష్టం దావా వేసింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం నా కెరీర్ నాశనం చేసేందుకు యత్నించారని నోరా ఆరోపించింది. ఆమె వ్యాఖ్యలతో షోలు, ప్రముఖ బ్రాండ్ ఒప్పందాలు కోల్పోయానని వెల్లడించింది. ఆ వార్తలు మీడియాలో రావడంతో తన పరువు పోయిందని ఆమె అన్నారు. జాక్వెలిన్ తన పట్ల ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిందని నోరా ఆరోపించింది. ఈ మేరకు దిల్లీ కోర్టులో జాక్వెలిన్పై పరువునష్టం దావా వేసింది బాలీవుడ్ భామ. (ఇది చదవండి: హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్కు బెయిల్) గతంలో జాక్వెలిన్ కోర్టు ముందు రాతపూర్వక వివరణ ఇచ్చింది. ఈ కేసులో ఈడీ నన్ను తప్పుగా చూపిస్తోందని.. నోరా ఫతేహి లాంటి ప్రముఖులు సుకేష్ చంద్రశేఖర్ నుంచి బహుమతులు కూడా పొందారని తెలిపింది. అయితే సుఖేష్ నుంచి తనకు ఎలాంటి బహుమతులు అందలేదని.. నేరుగా అతనితో ఎలాంటి సంబంధం లేదని నోరా పేర్కొంది. ఈ పిటిషన్లో అనేక మీడియా సంస్థల పేర్లను కూడా ఆమె పేర్కొంది. మీడియా సంస్థలు తనపై దుష్ప్రచారం చేయడం సామూహిక దాడి చేయడంతో సమానమని నోరా ఫతేహీ ఆరోపించింది. తనపేరును అన్యాయంగా లాగారని.. ఇదంతా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆదేశాల ప్రకారమే జరిగిందని తెలిపింది. మరోవైపు జాక్వెలిన్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. నోరాపై చాలా గౌరవం ఉందని .. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇద్దరు నటీమణులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించిందని తెలిపారు. -
ఈడీ విచారణకు బాలీవుడ్ నటి నోరా
మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్పై నమోదైన మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి నోరా ఫతేహిని ఈడీ శుక్రవారం ప్రశ్నించింది. సుకేశ్ భార్య లీనా ఆహ్వానం మేరకు 2020లో చెన్నైలోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో జరిగిన కార్యక్రమానికి ఆమె వెళ్లింది. ఆ సందర్భంగా కొత్త ఐఫోన్, ఖరీదైన బ్యాగ్తో పాటు బీఎండబ్యూ కారు అందజేశారని ఈ సందర్భంగా నోరా వెల్లడించిందని ఈడీ వర్గాలు తెలిపాయి. మరిన్ని వివరాల కోసం ఆమెకు మళ్లీ సమన్లు జారీ చేసే అవకాశాలున్నాయని తెలిపాయి. -
ఫిఫా వరల్డ్ కప్లో బాలీవుడ్ బ్యూటీ.. ఆ విషయంలో తొలి నటిగా..!
బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన ఫిఫా వరల్డ్ కప్-2022లో ఆమె ప్రాతినిధ్యం వహించనుంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్స్టాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఈవెంట్లో ప్రముఖులైన షకీరా, జెన్నీఫర్ లోపెజ్లతో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్లో జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ వేదికపై ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించే ఏకైక నటిగా ఆమె నిలవనుంది. ఫిఫా వరల్డ్కప్ కోసం రూపొందించిన థీమ్ సాంగ్లో నోరా ఫతేహీ నటించింది. అక్టోబర్ 7న ఈ సాంగ్ను రిలీజ్ చేయనున్నారు. ఆమె ఫిఫా వరల్డ్ కప్ ముగింపు వేడుకల్లోనూ ప్రదర్శన ఇవ్వనుంది. నోరా తన ఇన్స్టాలో వీడియోను షేర్ చేస్తూ " ఈసారి ఫిఫా వరల్డ్ కప్ సాంగ్ "లైట్ ది స్కై" సేవ్ ది డేట్ 07/10/22..!" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఫిఫా వరల్డ్ కప్ ఖతార్లో జరగనుంది. డ్యాన్స్తో గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి దిల్బర్ దిల్బర్ సాంగ్తో ఫేమస్ అయింది. బాలీవుడ్లో భారత్, బాట్లా హౌస్, రోర్, సత్యమేవ జయతే చిత్రాల్లో కనిపించింది. ఆమె ప్రస్తుతం జడ్జిగా 'ఝలక్ దిఖ్ లా జా' ప్రోగ్రామ్కు వ్యవహరిస్తోంది. నోరాకు సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న థ్యాంక్ గాడ్ సినిమాలోని మాణికే సాంగ్లోనూ కనిపించింది. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
'థ్యాంక్ గాడ్' సాంగ్ రిలీజ్.. నోరా అందానికి నోరెళ్లబెట్టాల్సిందే..!
సిద్ధార్థ్ మల్హోత్రా, అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం'థ్యాంక్ గాడ్'. ఇంద్ర కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఫాంటసీ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్లో బాలీవుడ్ నటి నోరా ఫతేహీ, సిద్ధార్థ్ మల్హోత్రా మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీలంక సింగర్ యోహాని పాడిన 'మనికే మాగే హితే' సాంగ్ను హిందీలో రీమేక్ చేశారు. అయితే ఈ పాటలోనూ యోహానీ తనదైన వాయిస్తో అలరించింది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా చిత్రగుప్తగా అజయ్ దేవగణ్ కనిపించనుండగా.. రకుల్ ప్రీత్ సింగ్ పోలీస్ అధికారి పాత్రలో నటించనుంది. అయితే ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాగా ఓ మతం మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ యూపీలోని జాన్పూర్ కోర్టులో కేసు నమోదైంది. (చదవండి: చిక్కులు తెచ్చిన ట్రైలర్.. నటులపై కేసు నమోదు) -
బాలీవుడ్ నటి నోరా ఫతేహిని ప్రశ్నించిన పోలీసులు
న్యూఢిల్లీ: మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ అక్రమార్జన కేసు దర్యాప్తులో భాగంగా బాలీవుడ్ నటి నోరా ఫతేహిని ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు శుక్రవారం 6 గంటలపాటు ప్రశ్నించారు. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్నారు. ఈ కేసులో ఈడీ కూడా ఇప్పటికే ఫతేహిని ప్రశ్నించింది. ఆమెతో పాటు మరో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా సుకేశ్ నుంచి ఖరీదైన కార్లు, ఇతర వస్తువులను బహుమతిగా అందుకున్నట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో జాక్వెలిన్పై ఆగస్ట్లో ఈడీ కేసు కూడా నమోదు చేసింది. జాక్వెలిన్తోపాటు మరికొందరికి కూడా సమన్లు జారీ చేసినట్లు ఢిల్లీ పోలీసులు ఇప్పటికే తెలిపారు. చదవండి: రూ.100 పేటీఎం లావాదేవీ.. రూ.6 కోట్ల దోపిడీ దొంగలను పట్టించింది!
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
బుల్లితెరపై శ్రీమద్ రామాయణం.. మిస్ట్ కాల్తో బహుమతి గెలవండి!
స్మోక్ పాన్: 12 ఏళ్ల బాలిక దుస్థితి తెలిస్తే జన్మలో దాని జోలికెళ్లరు
మహీంద్రా ఫైనాన్స్ సీఆర్ఓగా 'మహేష్ రాజారామన్'
ఎల్లో మీడియాపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా
ప్రపంచకప్ జట్టులో దక్కని చోటు.. రింకూ ఆసక్తికర వ్యాఖ్యలు
రజనీకాంత్ మనవడి బర్త్డే సెలబ్రేషన్స్.. క్రికెట్ థీమ్తో.. (ఫోటోలు)
కవితపై ఈడీ ఛార్జ్షీట్.. 29న కోర్టు కీలక తీర్పు
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత
కేన్స్ రెడ్ కార్పెట్పై సంప్రదాయ చీరకట్టులో తళుక్కుమన్న నటి!
బెంగళూరు రేవ్ పార్టీ.. మరో వీడియో రిలీజ్!
తప్పక చదవండి
- కవితపై ఈడీ ఛార్జ్షీట్.. 29న కోర్టు కీలక తీర్పు
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- IPL 2024: ధోనిని అవమానించిన ఆర్సీబీ ప్లేయర్లు!.. తప్పు ‘తలా’దేనా?
- కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
- T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్కు మరోసారి!
- 'ఫ్యామిలీస్టార్'ను వాళ్లు కావాలనే టార్గెట్ చేశారు: ఆనంద్
- బరువు తగ్గాలనుకుంటే..ఆ ఆహారాలకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు!
- తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు
Advertisement