-
ఎన్నికల శిక్షణకు డుమ్మా.. 70 మంది అధికారులపై చర్యలు!
ఎన్నికల శిక్షణకు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం గతంలోనే వెల్లడించించింది. అయితే దీనిని పెడచెవిన పెట్టిన కొందరు అధికారులు చిక్కుల్లో పడ్డారు. ఈ ఉదంతం యూపీలోని లక్నోలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ప్రిసైడింగ్, పోలింగ్ శిక్షణకు హాజరుకాని 70 మంది అధికారులపై శాఖాపరమైన చర్యలు మొదలయ్యాయి. జిల్లా మేజిస్ట్రేట్ సూర్యపాల్ గంగ్వార్ ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సంబంధిత సెక్షన్ల ప్రకారం అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఎన్నికల సంఘం నిర్వహించే ఈ శిక్షణ.. ఓటింగ్ ప్రక్రియపై సమగ్ర అవగాహనను కలిగిస్తుంది. అలాగే నిష్పాక్షికంగా ఎన్నికలను నిర్వహించడానికి అనుసరించాల్సిన మార్గదర్శకాలను తెలియజేస్తుంది. ఈ శిక్షణకు హాజరు తప్పనిసరి అని ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులకు తెలియజేశారు. ఈ శిక్షణ సమయంలో ఓటింగ్ రోజున తలెత్తే సమస్యల పరిష్కారానికి అనేక వ్యూహాలను తెలియజేస్తారు. ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరుపై అధికారులకు అవగాహన కల్పిస్తారు. -
ఏసీబీకి చిక్కిన మునిసిపల్ ఏఈ
విజయవాడస్పోర్ట్స్: ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ వర్క్ ఆర్డర్ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఇన్చార్జ్ ఏఈ తోట ఈశ్వర్కుమార్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈశ్వర్కుమార్ డివిజన్–4 వెహికల్ డిపో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఇన్చార్జ్ ఏఈగా పని చేస్తున్నాడు. కార్పొరేషన్ పరిధిలోని న్యూ అజిత్సింగ్నగర్కు చెందిన ఏఎస్ ఎకో మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ సొల్యూషన్ యజమాని షేక్ సద్దాంహుస్సేన్ నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించే వర్క్ ఆర్డర్ కోసం అగ్రిమెంట్ ప్రాసెస్ చేయాలని డివిజన్–4 వెహికల్ డిపో ఈఈ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. అగ్రిమెంట్ ప్రాసెస్ కోసం రూ.50 వేలను ఇవ్వాలని ఈశ్వర్కుమార్ పట్టుబట్టాడు. దీంతో సద్దాంహుస్సేన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు వల పన్ని కార్యాలయంలోనే రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏఈ ఈశ్వర్కుమార్ను సోమవారం అదుపులోకి తీసుకుని ఏసీపీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చారు. -
జీహెచ్ఎంసీ ప్రక్షాళన.. 14 మంది అధికారులపై వేటు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో అధికారుల ప్రక్షాళన మొదలైంది. రిటైర్డ్ ఉద్యోగులపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీలో రిటైర్డ్ అయిన ఉద్యోగులను కమిషనర్ టర్మినెట్ చేశారు. 45 మంది రిటైర్డ్ ఉద్యోగుల్లో 37 మంది తమ విధుల నుంచి వైదొలిగారు. అక్రమాలకు పాల్పడిన 14 మంది అధికారులను విధుల నుంచి కమిషనర్ తొలగించారు. తప్పులు చేస్తున్న పలువురు అధికారులకు రోనాల్డ్ రోస్ మెమోలు జారీ చేశారు. జీహెచ్ఎంసీలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. కాగా, అక్రమాల కట్టడి కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇతరుల హాజరుకు వినియోగిస్తున్న ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్ స్థానే ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత ఫేషియల్ రికగినషన్ బయోమెట్రిక్ను ఉపయోగించేందుకు సిద్ధమైంది. తద్వారా బోగస్ కార్మికులకు అడ్డుకట్ట వేయవచ్చని, ఫలితంగా ఏటా కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం కాకుండా నివారించవచ్చునని భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం ఈ విధానాన్ని అమలు చేస్తుండటంతో జీహెచ్ఎంసీ కూడా రెడీ అయ్యింది. -
TS: గొర్రెల పంపిణీ స్కాం.. పరారీలో కీలక నిందితులు
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ స్కాంలో ఇద్దరు కీలక నిందితులు విదేశాలకు పరారైనట్లు అధికారులు గుర్తించారు. విదేశాలకు పారిపోయిన నిందితులు ఫిర్యాదు దారులను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులను ఏసీబీ అరెస్టు చేసింది. ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్, ఒక డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్లను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. రవి, ఆదిత్య కేశవ సాయి, రఘుపతి రెడ్డి, సంగు గణేష్లను ఏసీబీ అరెస్ట్ చేసింది. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు తెరిచిన పశుసంవర్ధన శాఖ అధికారులు.. 2.10 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను మళ్లించారు. రికార్డుల పరిశీలన, బాధితుల నుంచి వివరాలు సేకరించి ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. బినామీల పేర్లతో నిధులను దారి మళ్లించారనే ఆధారాలను సేకరించారు. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్ల పాత్రలపైనా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయన ఇటీవల కాగ్ కూడా తన నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
TS: గొర్రెల స్కాం కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: గొర్రెల స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గొర్రెల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులను ఏసీబీ అరెస్టు చేసింది. ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్, ఒక డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్లను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. రవి, ఆదిత్య కేశవ సాయి, రఘుపతి రెడ్డి, సంగు గణేష్లను ఏసీబీ అరెస్ట్ చేసింది. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు తెరిచిన పశుసంవర్ధన శాఖ అధికారులు.. 2.10 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను మళ్లించారు. రికార్డుల పరిశీలన, బాధితుల నుంచి వివరాలు సేకరించి ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. బినామీల పేర్లతో నిధులను దారి మళ్లించారనే ఆధారాలను సేకరించారు. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్ల పాత్రలపైనా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయన ఇటీవల కాగ్ కూడా తన నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
TS: రవాణాశాఖలో భారీగా బదిలీలు.. ఉత్తర్వులు జారీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ కోసం రవాణాశాఖ ప్రత్యేక జీవో విడుదల చేసింది. శాఖలోని అన్నిస్థాయిల్లోని అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని బదిలీ చేశారు. బదిలీల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 150 మంది మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐలు) 23 మంది రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్(ఆర్టీవో)లను ఏడుగురు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్(డీటీసీ)లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇదీ చదవండి.. కాంగ్రెస్లో చేరిన వెంటనే సునీతామహేందర్రెడ్డిపై అవిశ్వాసం -
శ్రీరామ నవమికి ముస్తాబవుతున్న అయోధ్య!
అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్ఠితుడైనప్పటి నుంచి రామనగరికి భక్తులు పోటెత్తున్నారు. ప్రతిరోజూ ఒకటిన్నర నుంచి రెండు లక్షల మంది భక్తులు బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు. గడచిన 18 రోజుల్లో దాదాపు 40 లక్షల మంది భక్తులు రామ్లల్లాను దర్శించుకుని పూజలు చేశారు. భక్తుల రద్దీ నిరంతరం కొనసాగుతోంది. ఈనెలలో రాబోయే శ్రీరామ నవమి సందర్భంగా కోటి మంది భక్తులు అయోధ్యకు రావచ్చనే అంచనాలున్నాయి. ఈ నేపధ్యంలో ఆలయ అధికారులు ఇప్పటికే ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు. తొమ్మిది రోజుల పాటు శ్రీరామ నవమి ఉత్సవాలు జరగనున్నాయి. చైత్ర మాసంలోని శుక్ల పక్షం తొమ్మిదవ రోజున శ్రీరాముని జన్మదినోత్సవం జరగనుంది. ఈసారి ఏప్రిల్ 17న శ్రీరామ నవమి జరగనుంది. చైత్ర నవరాత్రుల ప్రారంభంతో ఉత్సవాలు మొదలు కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రామజన్మభూమి గేట్ నంబర్ మూడు నుంచి కూడా భక్తులను అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మార్గంలోని 40 అడుగుల వెడల్పు రోడ్డు నిర్మాణం పూర్తయింది. గతంలో ఈ మార్గాన్ని వీఐపీల రాకపోకలకు ఉపయోగించేవారు. దీనితోపాటు ఆలయ సముదాయానికి ఉత్తర దిశలో కొత్త రహదారిని కూడా నిర్మిస్తున్నారు. రామజన్మభూమి మార్గాన్ని రైల్వే స్టేషన్కు అనుసంధానించడానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
పోలింగ్లో గందరగోళం.. పలుచోట్ల బ్యాలెట్ పేపర్లు మాయం!
పాకిస్తాన్లో సాధారణ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కొన్ని చోట్ల ఓటింగ్ ప్రారంభించే ముందు బ్యాలెట్ పేపర్లు కలిగిన బ్యాగులను అధికారులు తెరవగా.. వాటిలో భారీ సంఖ్యలో బ్యాలెట్ పేపర్లు మాయమయ్యాయి. దీంతో పెద్దఎత్తున రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. పలు ఎన్నికల కేంద్రాల వద్ద ప్రిసైడింగ్ అధికారులు బ్యాలెట్ పత్రాలు ఉన్న బ్యాగులను తెరిచి చూడగా వాటిలో కొన్ని చిరిగిపోయి ఉండగా, మరికొన్ని బ్యాలెట్ పత్రాలు కనిపించకుండా పోయాయి. కరాచీ ఎన్నికల అధికారి దీనిపై ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో రిగ్గింగ్ చేసేందుకే ఈ బ్యాలెట్ పత్రాలను ఎవరో మాయం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటింగ్ ప్రారంభించేముందు పాక్ ఎన్నికల సంఘం ఈ బ్యాలెట్ పత్రాలను వివిధ ఎన్నికల కేంద్రాలకు పంపింది. వాటిని పంపే సమయంలో బ్యాలెట్ పేపర్లు చినిగిపోయిన విషయాన్ని పాక్ఎన్నికల సంఘం గమనించలేదా? లేక దారిలో ఎవరైనా ఇలా చేశారా? అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. కాగా ఎన్నికలకు ఒకరోజు ముందు పాకిస్తాన్లో రెండు భారీ పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో పలువురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొబైల్ సేవలను నిలిపివేశారు. ఉగ్రవాదుల దాడులను అరికట్టేందుకే ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. -
నియోజకవర్గానికి రూ.కోటి
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో తాగునీటి నిర్వహణ బాధ్యతను పూర్తిగా సర్పంచ్లకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి ఆదేశించారు. అయితే సర్పంచ్ల పదవీకాలం నెలాఖరుతో ముగుస్తున్నందున అధికారులు ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్కతో కలసి సచివాలయంలో మంగళవారం ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) కింద కేటాయించిన రూ.10 కోట్లలోంచి రూ. కోటి చొప్పున తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలని ఆదేశించారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్ లాంటి కొత్త రిజర్వాయర్లన్నింటినీ తాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవాలని.. తద్వారా చుట్టుపక్కల గ్రామాలకు తాగునీటి సరఫరా సులభమవుతుందని సీఎం తెలిపారు. గ్రామాల వరకు రక్షిత మంచినీటిని సరఫరా చేసే బాధ్యతను మిషన్ భగీరథ విభాగమే తీసుకోవాలని, ఇంటింటికీ నీళ్లను అందించే బాధ్యతను సర్పంచ్లకు అప్పగించాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అందుకు అవసరమైన విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ, నల్లాలు, పైపులైన్ల మెయింటెనెన్స్ను సర్పంచులకే అప్పగించాలన్నారు. నీరురాని గ్రామాల సర్వే.. రాష్ట్రంలో ఏయే ప్రాంతాలకు తాగునీరు అందట్లేదో సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. సంబంధిత ఇంజనీర్లు అన్ని గ్రామాలకు వెళ్లి నిజ నిర్ధారణ బృందం చేసినట్లుగానే పక్కాగా తాగునీరు అందని ఆవాసాల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. జలజీవన్ మిషన్ నిధులు రాబట్టుకొనేలా కొత్త ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపించాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు... స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని, వాళ్లకు ఆర్థికంగా చేయాతను అందించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థిని విద్యార్థులు, పోలీసులకు అందించే యూనిఫామ్లను కుట్టించే పనిని ఈ సంఘాల మహిళలకు అప్పగించాలని సూచించారు. రహదారులు లేని గ్రామాలకు తారురోడ్లు... రోడ్డు సౌకర్యంలేని గ్రామాల్లో రోడ్లను నిర్మించాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. 422 గ్రామ పంచాయతీలు, 3,177 ఆవాసాలకు ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేదని అధికారులు సీఎంకు నివేదించగా వాటన్నింటికీ తారురోడ్లు వేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ఉపాధి హామీ నిధులను అనుసంధానించి వాటిని పూర్తి చేయా లని చెప్పారు. ఈ బడ్జెట్లోనే అందుకు అవసరమైన నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. గత ప్రభుత్వ నిర్వాకంతో కేంద్ర నిధులు రాలేదు.. తెలంగాణలో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచి్చనట్లు గత ప్రభుత్వం చెప్పుకోవడంతో రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ ప్రకటనలతో కేంద్రం నుంచి జలజీవన్ మిషన్ నిధులు రాకుండా పోయాయన్నారు. ఇకపై వాస్తవాలను దాచిపెట్టి గొప్పలకు పోవాల్సిన అవసరం లేదని అధికారులకు సూచించారు. -
76 రోజుల తర్వాత ఉత్తరకాశీ సొరంగం పనులు షురూ!
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో సిల్క్యారా సొరంగంలో ప్రమాదం చేసుకున్న 76 రోజుల తరువాత తిరిగి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు బార్కోట్ వైపు నుంచి ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా రోడ్డు సొరంగంలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. తాజాగా సొరంగం మధ్య షట్టరింగ్ పనులు ప్రారంభించారు. అలాగే సిల్క్యారా వైపు నుంచి సొరంగం ముఖద్వారం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ సమాచారాన్ని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఐడిసిఎల్) ప్రాజెక్ట్ మేనేజర్ కల్నల్ దీపక్ పాటిల్ మీడియాకు తెలిపారు. రానున్న 15 రోజుల్లో ఈ పనులు మరింత వేగవంతం కానున్నాయి. సొరంగంలోని సున్నిత ప్రదేశాల్లో ఎస్కేప్ టన్నెల్స్ రూపంలో పైపులు వేస్తున్నట్లు తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతం, సిల్క్యారా వైపు ముఖద్వారం మధ్య దాదాపు 100 మీటర్ల సున్నిత ప్రాంతంలో రక్షణ పనులు ప్రారంభమయ్యాయి. ఎగ్జిట్ టన్నెల్ ద్వారా కార్మికులను పనులు చేసేందుకు లోపలికి పంపుతున్నారు. 2023, నవంబర్ 12న కొండచరియలు విరిగిపడటంతో సిల్క్యారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. 17 రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ తర్వాత వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటన దరిమిలా నవంబర్ 12 నుంచి సొరంగ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ సొరంగంలో ఇంకా 480 మీటర్లు మేర తవ్వాల్సి ఉంది. కేంద్ర మంత్రిత్వ శాఖ పలువురు నిపుణుల సూచనలు, సలహాలు తీసుకున్న తరువాత సొరంగం పనులకు అనుమతినిచ్చింది. ఈ నేపధ్యంలో సొరంగం ముఖద్వారం నుంచి సిల్క్యారా వైపు 100 మీటర్ల సెంటర్ వాల్ (సెపరేషన్ వాల్) షట్టరింగ్ పనులు జరుగుతున్నాయని నిర్మాణ పనులు చేపడుతున్న గజ కంపెనీ అధికారులు తెలిపారు. -
జైలులో ఖైదీ బర్త్డే పార్టీ.. విచారణకు ఆదేశాలు!
పంజాబ్లోని లూథియానా సెంట్రల్ జైలులో కలకలం చెలరేగింది. ఖైదీలంతా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వీడియో ఆన్లైన్లో కనిపించడంతో, దీనిని సీరియస్గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రెండు రోజుల క్రితం లూథియానాలోని సెంట్రల్ జైలులోని ఖైదీలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. ఆ క్లిప్లో కొందరు ఖైదీలు ఒక చేతితో గ్లాసులు పట్టుకుని, మరో చేతితో పకోడీలు తింటూ కనిపిస్తున్నారు. ఆ ఖైదీలు ‘నేడు మణి భాయ్ పుట్టినరోజు’ అని పాడటం కూడా ఆ వీడియోలో వినిపిస్తోంది. జైలులోని ఖైదీలు అరుణ్ కుమార్ అలియాస్ మణి రాణా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారని తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్లో 2019లో జరిగిన దోపిడీ కేసులో మణి అండర్ ట్రయల్గా ఉన్నాడు. వీడియో రికార్డు చేసి, అప్లోడ్ చేయడానికి ఉపయోగించిన మొబైల్ను స్వాధీనం చేసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. అయితే ఆ ఫోన్ పగిలిపోయిందని, పూర్తి డేటా వెలువడలేదని వారు పేర్కొన్నారు. ఈ ఉదంతంలో 10 మంది ఖైదీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. ఈ ఖైదీలపై జైలు చట్టంలోని సెక్షన్ 52ఏ (జైలు నిబంధనల ఉల్లంఘన) కింద కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లూథియానా ఈస్ట్) గుర్దేవ్ సింగ్ తెలిపారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఇన్స్పెక్టర్ జనరల్ (జైలు) ఆర్కే అరోరా, పాటియాలా రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) సురీందర్ సింగ్ సైనీ ఈ ఘటనపై సమగ్ర విచారణ ప్రారంభించారు. ఇటువంటి ఉదంతాలతో పంజాబ్ జైళ్లు వార్తల్లోకి రావడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో జైళ్ల భద్రతను మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నదని పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఇటీవల వ్యాఖ్యానించారు. -
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 760 కరోనా కేసులు!
కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కేసులు భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో పెరుగుతున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం చైనాతో సహా అనేక దేశాలలో కరోనా బాధితులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. కరోనా మరణాలు కూడా నమోదవుతున్నాయి. భారతదేశంలో గత 20 రోజులుగా ప్రతిరోజూ కొత్తగా సగటున 500 కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో కొత్తగా 760 మందికి ఇన్ఫెక్షన్ నిర్ధారితమయ్యింది. జేఎన్-1 వేరియంట్ ఇప్పటివరకు దేశంలోని 11 రాష్ట్రాలకు వ్యాపించింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4423కు చేరింది. కరోనా ముప్పు పెరుగుతోందని, దీని నివారణకు అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా కేంద్రం.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో దేశంలో కోవిడ్ కారణంగా ఐదు మరణాలు నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సిడిసి) తెలిపింది. -
ఆంధ్రప్రదేశ్లో 17 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. వారి వివరాలు ఇలా ఉన్నాయి. స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్గా ధ్యాన్చంద్ర విలేజ్, వార్డ్ సెక్రటరీ డైరెక్టర్గా టీఎస్ చేతన్ బీసీ వెల్ఫేర్ డైరెక్టర్గా జె. శివ శ్రీనివాస్ తిరుపతి జాయింట్ కలెక్టర్గా శుభం బన్సాల్ విలేజ్, వార్డు సెక్రటేరియట్ ఏడీగా గీతాంజలి శర్మ ఎంఎస్ఎంఈ కార్పోరేషన్ సీఈవోగా మాధవన్ మిడ్ డే మీల్స్ స్పెషల్ ఆఫీసర్గా ఎస్ఎస్ శోభిక సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్గా అభిషేక్ కుమార్ అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్గా కె.కార్తీక్ పాడేరు సబ్ కలెక్టర్గా పెద్దిటి ధాత్రిరెడ్డి పెనుకొండ సబ్ కలెక్టర్గా అపూర్వ భరత్ కొవ్వూరు సబ్ కలెక్టర్గా అశుతోష్ శ్రీవాత్సవ కందురకూరు సబ్ కలెక్టర్గా గొబ్బిల విద్యాధరి తెనాలి సబ్కలెక్టర్గా ప్రకార్ జైన్ మార్కాపురం సబ్ కలెక్టర్గా రాహుల్ మీనా ఆదోని సబ్ కలెక్టర్గా శివ్ నారాయణ్ వర్మ రంపచోడవరం సబ్ కలెక్టర్గా ఎస్.ప్రశాంత్కుమార్లు నియమితులయ్యారు. -
చెట్లపై మంచు ముత్యాలు.. వీధుల్లో చలిమంటలు!
ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్ జిల్లాలో చలిగాలులు స్థానికులను గజగజా వణికిస్తున్నాయి. తీవ్రమైన చలికి తోడు విపరీతంగా మంచు కురుస్తుండటంతో మొక్కలు, చెట్లు మంచుతో నిండిపోతున్నాయి. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. చలి తీవ్రత దృష్ట్యా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సామాన్యుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ కూడళ్లు, జనావాసాల వద్ద చలి మంటలు వెలిగించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కుందన్కుమార్ జిల్లా మున్సిపల్ ముఖ్య అధికారులు, జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారులను ఆదేశించారు. గత కొన్ని రోజులుగా అంబికాపూర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు నిరంతరం పడిపోవడానికితోడు, చలిగాలులు చుట్టుముడుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో జిల్లా కలెక్టర్ అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. చలి మంటలు వేసేందుకు కలప వినియోగాన్ని తగ్గించాలని, పేడ పిడకలను ఉపయోగించాలని సూచించారు. చలిగాలుల విజృంభిస్తున్న దృష్ట్యా ప్రజలు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని కోరారు. అవసరమైన సందర్భంలో వైద్యులను సంప్రదించాలని సలహా ఇచ్చారు. ఇది కూడా చదవండి: 2023.. భారత్లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదాలివే.. -
మెట్రో రెయిలింగ్పై మహిళ హైడ్రామా..
ఏదో ఒక కారణంతో ఢిల్లీ మెట్రో తరచూ ముఖ్యాంశాలలో నిలుస్తుంటుంది. కొందరు మెట్రోలో తమకు నచ్చినట్లు వ్యవహరిస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తుంటారు. తాజాగా మెట్రోలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఈ ఉదంతం మెట్రో అధికారులకు చిక్కులను తెచ్చిపెట్టింది. ఢిల్లీలోని షాదీపూర్ మెట్రో స్టేషన్లో ఒక మహిళ ఎలివేటెడ్ ట్రాక్ దాటి, రెయిలింగ్ ఎక్కి అక్కడి నుంచి దూకేందుకు ప్రయత్నించింది. దీనిని గమించిన కొందరు ప్రయాణికులు మెట్రో అధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో వారు అతి కష్టం మీద ఆ మహిళను కాపాడారు. #Delhi- Girl was jumping from the track of metro station.. police saved her. #delhimetro #delhigirls #DelhiGovernment #Delhi #METRO4D #Metro pic.twitter.com/eFwJ6yNhAH — Arun Gangwar (@AG_Journalist) December 12, 2023 ఈ ఘటనకు సంబంధించిన 40 సెకన్ల వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. ఓ మహిళ ఫోన్ పట్టుకుని ఎలివేటెడ్ మెట్రో ట్రాక్ పక్కన నిలబడి కనిపించింది. ఆమె ట్రాక్ పరిమితిని దాటి, రెయిలింగ్ పైకి ఎక్కినట్లు వీడియోలో కనిపిస్తోంది. షాదీపూర్ మెట్రో స్టేషన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఎలివేటెడ్ ట్రాక్పై నుంచి దూకుతానంటూ ఆ మహిళ బెదిరించింది. ఆమెను కాపాడేందుకు అధికారుల బృందం ఫుట్పాత్ మీదుగా ట్రాక్ వైపు వెళ్లి ఆమెను రక్షించింది. కాగా ఆ మహిళ ఎందుకు ఈ ప్రయత్నం చేసిందో స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతం ఈ ఉదంతపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇది కూడా చదవండి: శరద్ పవార్కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్ ఛానల్ వీక్షించండి: -
నవరత్న ఖచిత సుమేరు పర్వతంపై శ్రీరాములవారు..
అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో కాశీ విద్వత్ పరిషత్ తాజాగా రామమందిర్ ట్రస్ట్కు శ్రీరాముని సింహాసనం నవరత్న ఖచిత శోభాయమానంగా ఉండాలని ప్రతిపాదించింది. దీంతో రామాలయంలోని గర్భగుడిలో నవరత్నాలతో చేసిన సుమేరు పర్వతంపై శ్రీరాముని విగ్రహం ప్రతిష్ఠితం కానుంది. ఈ సుమేరు పర్వతం వజ్రం, పచ్చ, కెంపు వంటి విలువైన రత్నాలతో రూపొందనుంది. శ్రీరాముని పట్టాభిషేక వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిల్లో సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మృగశిర నక్షత్రంలో వైదిక పద్ధతిలో ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆలయంలో కొలువయ్యే శ్రీరామునికి తొలి హారతిని ప్రధాని నరేంద్ర మోదీ ఇవ్వనున్నారు. కాశీలో కొలువైన విశ్వనాథునితో సహా అక్కడి దేవతామూర్తులందరూ ఈ వేడుకలలో పాల్గొననున్నారు. కాశీలోని సమస్త దేవతలకు ఆహ్వాన పత్రికలు ఇచ్చేందుకు కాశీ విద్వత్ పరిషత్ సన్నాహాలు చేస్తోంది. కాగా సంవద్ శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ రెండు రోజుల సమావేశం శనివారం ప్రారంభమైంది. తొలిరోజు రామజన్మభూమి కాంప్లెక్స్లోని ఆలయంతోపాటు నిర్మాణంలో ఉన్న పది ప్రాజెక్టుల గురించి సమీక్షించారు. ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. జనవరి 20 నుంచి 22 వరకు భక్తులు శ్రీరాముని దర్శనం చేసుకోలేరని ట్రస్టు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రాణ ప్రతిష్ఠ, వీఐపీల రాక దృష్ట్యా మూడు రోజుల పాటు సాధారణ దర్శనాలను నిలిపివేయనున్నట్లు సమాచారం. ఇది కూడా చదవండి: యూపీలో ఘోర ప్రమాదం.. ఎనిమిదిమంది సజీవ దహనం! -
ఒడిశా, బీహార్ గుణపాఠాల తర్వాత రైల్వేశాఖ ఏం చేస్తున్నదంటే..
ఒడిశా, బీహార్ రైలు ప్రమాదాల తరువాత భారతీయ రైల్వే.. వ్యవస్థాగతంగా భద్రతను మరింత పటిష్టం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (ఏటీపీ) ‘కవచ్’ను ఇప్పటి వరకు 139 లోకోమోటివ్లపై (ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రేక్) 1465 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థను దక్షిణ మధ్య రైల్వే విభాగాల్లో అమర్చింది. లింగంపల్లి- వికారాబాద్- వాడికి చెందిన 265 కిలోమీటర్లు, వికాబాద్- బీదర్ సెక్షన్, మన్మాడ్- ముద్ఖేడ్ ధోనే- గుంతకల్ సెక్షన్కు చెందిన 959 కిలోమీటర్లు, బీదర్-బర్బణీ సెక్షన్కు చెందిన 241 కిలోమీటర్ల పొడవునా కవచ్ ఏర్పాటుకు సంబంధించిన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అలాగే ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా కారిడార్కు చెందిన సుమారు మూడు వేల కిలోమీటర్ల మార్గం కోసం టెండర్లు జారీ చేయగా, ఈ మార్గాల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. భారతీయ రైల్వే ఆరు వేల కిలోమీటర్ల రైలు మార్గంలో సర్వే, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్), పకడ్బందీ అంచనాలతో సహా అనేక సన్నాహక పనులను కూడా ప్రారంభించింది. ‘కవచ్’ అనేది నడుస్తున్న రైళ్ల భద్రతను పెంచడానికి ఉపయోగించే ఆటోమేటెడ్ రైలు రక్షణ వ్యవస్థ. దీనిని మూడు భారతీయ కంపెనీల సహకారంతో రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ)దేశీయంగా అభివృద్ధి చేసింది. ‘కవచ్’ అనేది రైలు డ్రైవర్కు సిగ్నల్స్ పాస్ చేయడంలో, ప్రమాదాలను నివారించడంలో సహాయపడటమే కాకుండా ప్రతికూల వాతావరణంలోనూ రైలును నడపడంలో సహాయపడుతుంది. ‘కవచ్’ కారణంగా రైలు కార్యకలాపాల భద్రత, సామర్థ్యం మరింతగా పెరుగుతుంది. రీసెర్చ్ డిజైన్, స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ సహాయంతో భారతీయ రైల్వే ఈ ‘కవచ్’ వ్యవస్థను సిద్ధం చేసింది. 2012లో ఈ పకడ్బందీ వ్యవస్థను ఉపయోగంలోకి తీసుకువచ్చింది. మొదట్లో ఈ ప్రాజెక్ట్ పేరు ‘ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్’. రైళ్లలో జీరో యాక్సిడెంట్ లక్ష్యాన్ని సాధించేందుకు రైల్వేశాఖ ఈ పకడ్బందీ వ్యవస్థను సిద్ధం చేసింది. పాసింజర్ రైళ్లలో మొదటి ఫీల్డ్ ట్రయల్స్ 2016 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి. ఇది కూడా చదవండి: రాబోయే రోజుల్లో... దేశంలోని వాతావరణం ఇలా.. -
CM Jagan Review On Cyclone: తుపానుపై సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు అధికారులతో సమీక్ష జరిపారు. తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, పకడ్బందీగా సహాయక చర్యలు చేపట్టేందుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని, శిబిరాల్లో సౌకర్యాలు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆహారం, తాగునీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, తుపాను వల్ల విద్యుత్, రవాణా, సమాచార, కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతింటే యుద్ధప్రాతిపదికిన వాటిని పునరుద్ధరించేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు. తుపాను పరిస్థితులు, చేపడుతున్న సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎం ఆదేశించారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో రేపు ఉదయం వీడియో కాన్ఫరెన్స్ద్వారా మరోమారు సమీక్ష చేస్తానని ఆయన తెలిపారు. పొలాల్లో, కలాల్లో ఉన్న ధాన్యం తడిపోకుండా పౌరసరఫరాల శాఖకు చెందిన అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం తడిపిపోకుండా వెంటనే మిల్లులు లేదా భద్రతమైన ప్రాంతాలకు వాటిని తరలించే బాధ్యతను తీసుకోవాలని, తేమ లాంటి సాంకేతిక అంశాలను పక్కనపెట్టి రైతుల వద్దనున్న ధాన్యాన్ని వెంటనే ప్రొక్యూర్ చేయాలన్నారు. తుపాను కారణంగా భారీవర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున జలవనరులశాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన సీఎం.. తుపాను అనంతరం యుద్ధప్రాతిపదికన ఆయా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. చదవండి: ముంచుకొస్తున్న మిచాంగ్ -
ఆ 17 రోజులు ఎలా గడిచాయంటే..
ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు క్షేమంగా బయటకు వచ్చారు. వీరిని బయటకు తీసుకురావడంలో ర్యాట్ మైనర్ల బృందం విజయం సాధించింది. ఉత్తరకాశీ సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులలో ఒకరైన సుబోధ్ కుమార్ వర్మ మీడియాతో మాట్లాడుతూ ‘తాము టన్నెల్లో ఆహారం కోసం అలమటించిపోయామని, గాలి ఆడక ఇబ్బంది పడ్డామన్నారు. తరువాత అధికారులు పైపుల ద్వారా ఆహార పదార్థాలను పంపించారన్నారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఎలాంటి అనారోగ్య సమస్య లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కఠోర శ్రమ కారణంగానే తాను బయటపడగలిగానని’ తెలిపారు. మరో కార్మికుడు విశ్వజీత్ కుమార్ వర్మ మాట్లాడుతూ ‘తాము సొరంగంలో చిక్కుకున్నామని తెలుసుకున్నామని, బయట అధికారులు తమను బయటకు తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నించారు. మాకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఆక్సిజన్తో పాటు ఆహారం అందించారు. మేము టన్నెల్లో చిక్కుకున్న మొదటి 10 నుంచి 15 గంటలు సమస్యలను ఎదుర్కొన్నాం. తరువాత ఆహారాన్ని పైపుల ద్వారా అందించారు. అనంతరం మైకు అమర్చి, కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. ఇప్పుడు తామంతా సంతోషంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. నవంబర్ 12వ తేదీ తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో సొరంగంలో ప్రమాదం జరిగి 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. తరువాత వారికి అధికారులు ఒక పైపు ద్వారా మందులు, డ్రై ఫ్రూట్స్ పంపించారు. నవంబర్ 20న ఆరు అంగుళాల పైపును సొరంగంలోనికి పంపి కిచ్డీతో పాటు అరటిపండ్లు, నారింజ, డ్రైఫ్రూట్స్, బ్రెడ్, బ్రష్లు, టూత్పేస్టులు, మందులు, అవసరమైన దుస్తులను వారికి పంపించారు. ఎట్టకేలకు 17 రోజుల అనంతరం కార్మికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఇది కూడా చదవండి: సొరంగం నుంచి వచ్చిన కుమారుడుని చూడకుండానే తండ్రి మృతి -
ఉత్తరాఖండ్: రెస్క్యూ ఆపరేషన్కు ఎడతెగని ఆటంకాలు!
ఉత్తరాఖండ్లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులకు 17 రోజులు దాటుతున్నా విముక్తి లభించలేదు. వారిని చేరుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. మొదట డ్రిల్లింగ్ కోసం అమెరికా నుంచి తెచ్చిన యంత్రం చెడిపోయింది. ఇప్పుడు ప్రతికూల వాతావరణం కొత్త ఇబ్బందులను సృష్టిస్తోంది. ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను చేరుకోవడానికి అమెరికన్ ఆగర్ మెషిన్ చెడిపోవడంతో ప్రస్తుతం మాన్యువల్ డ్రిల్లింగ్ జరుగుతోంది. 86 మీటర్ల వర్టికల్ డ్రిల్లింగ్ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 36 మీటర్ల మేరకు తవ్వగలిగారు. అమెరికా నుంచి తీసుకువచ్చిన డ్రిల్లింగ్ మిషన్ బ్లేడ్లు.. బాధిత కార్మికులున్న ప్రదేశానికి 12 మీటర్ల ముందుగానే విరిగిపోయాయి. ఫలితంగా రెస్క్యూ ఆపరేషన్ను మధ్యలోనే ఆపివేసి, బ్లేడ్లను తొలగించాల్సివచ్చింది. ఉత్తరాఖండ్లో ప్రస్తుతం అధ్వాన్నంగా తయారైన వాతావరణం రెస్క్యూ ఆపరేషన్కు కొత్త సమస్యలను సృష్టిస్తోంది. రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని వల్ల రెస్క్యూకు సమస్యలు తలెత్తవచ్చని అధికారులు భావిస్తున్నారు. సొరంగంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ను పరిశీలించేందుకు ప్రధాని మోదీ ప్రత్యేక కార్యదర్శి పీకే మిశ్రా, హోంశాఖ కార్యదర్శి అజయ్ కే భల్లా, ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ సంధు సంఘటనా స్థలానికి వచ్చారు. సొరంగంలో వర్టికల్ డ్రిల్లింగ్ శరవేగంగా జరుగుతోందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మహమూద్ అహ్మద్ తెలిపారు. ఇప్పటి వరకు 36 మీటర్ల వర్టికల్ డ్రిల్లింగ్ చేశారు. కార్మికులలో నిరాశానిస్పృహలు నెలకొన్న దృష్ట్యా, ఐదుగురు వైద్యుల బృందం సంఘటనా స్థలంలో ఉంటోంది. వారు సొరంగంలో చిక్కుకున్న కార్మికులతో మాట్లాడుతూ వారికి భరోసా కల్పిస్తున్నారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికుల మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నామని, వారు కుటుంబ సభ్యులతో మాట్లాడేలా చూస్తున్నామని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ తెలిపారు. మరోవైపు సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు త్వరగా బయటకు రావాలని కాంక్షిస్తూ స్థానికులు సొరంగం దగ్గర హోమాలు నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో భారీ వర్షం.. విమానాల రాకపోకలకు అంతరాయం! -
‘సొరంగ బాధితులు బయటకు రావాలంటే మరి కొన్ని వారాలు నిరీక్షించాల్సిందే(
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారాలో కుప్పకూలిన సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు బయటకు రావాలంటే క్రిస్మస్ వరకు సమయం పడుతుందని తెలుస్తోంది. 800 ఎంఎం ఇనుప పైపును డ్రిల్లింగ్ చేసి, ఇన్సర్ట్ చేస్తున్న ఆగర్ మిషన్ బ్లేడ్లు శనివారం శిథిలాలలో చిక్కుకున్నాయి. దీంతో యంత్రం ధ్వంసమైంది. ఫలితంగా సొరంగానికి పైనుంచి తవ్వకాలు జరిపి, బాధితులను చేరుకునే మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ కారణంగా కార్మికులను రక్షించడానికి కొన్ని వారాలు పట్టవచ్చని నిపుణులు భావిస్తున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డిఎంఎ) సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ మాట్లాడుతూ ఈ ఆపరేషన్కు చాలా సమయం పట్టవచ్చని అన్నారు. సంఘటనా స్థలం వద్ద ఉన్న అంతర్జాతీయ సొరంగ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ మాట్లాడుతూ క్రిస్మస్ నాటికి బాధిత కార్మికులను బయటకు తీసుకురాగలుగుతామని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మాన్యువల్ డ్రిల్లింగ్లో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే తవ్వడానికి వెళ్లేందుకు అవకాశం ఉంది. దీనికితోడు ఆ వ్యక్తి తనతో పాటు ఆక్సిజన్ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ ఆక్సిజన్ కూడా ఒక గంట మాత్రమే ఉంటుంది. అంటే గంటకోసారి తవ్వే వ్యక్తిని మార్చాల్సి ఉంటుంది. దీంతో తవ్వే వేగం తగ్గుతుంది. అంతర్జాతీయ నిపుణుడు డిక్స్.. ఆగర్ యంత్రం పగిలిపోయిందని చెప్పడంతో సొరంగంలో ఇరుక్కుపోయిన ఆగర్ యంత్రం భాగాన్ని తొలగించేందుకు హైదరాబాద్ నుంచి ప్లాస్మా కట్టర్ను విమానంలో తీసుకువచ్చారు. ఆగర్ యంత్రం భాగాలను తొలగించిన అనంతరం మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రారంభం కానున్నదని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: రాజస్థాన్ రాజకీయాలను శాసిస్తున్న ఓటింగ్ శాతం -
బయటివారితో మాట్లాడుతున్న సొరంగంలోని బాధితులు
ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంగళవారం సొరంగం లోపల చిక్కుకున్న కార్మికులకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దానిలో వారంతా సురక్షితంగా ఉన్నట్లు కనిపించారు. సొరంగంలోని కార్మికులతో బయట ఉన్న వారి బంధువులు మాట్లాడుతున్నారు. బుధవారం ఆ కార్మికులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారిలో ఒక కార్మికుడు మొబైల్ ఛార్జర్ను లోపలికి పంపించాలని కోరాడు. సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులలో పుష్కర్ సింగ్ యేరీ ఒకరు. అతని సోదరుడు విక్రమ్ సింగ్ యేరీ తాను పుష్కర్తో మాట్లాడినట్లు మీడియాకు తెలిపారు. తన సోదరుడు.. తాను బాగున్నానని, మమ్మల్ని ఇంటికి వెళ్లాలని చెప్పాడని తెలిపారు. కాగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు ఆహారపదార్థాలను, ఇతర వస్తువులను అందించడానికి ఆరు అంగుళాల వెడల్పు గల పైపును లోపలికి పంపారు. ఈ ఆరు అంగుళాల ‘లైఫ్లైన్’ అందించకముందు కార్మికులకు ఆహారం, నీరు, మందులు, ఆక్సిజన్ను నాలుగు అంగుళాల పైపు ద్వారా సరఫరా చేశారు. కాగా తాజాగా లోనికి పంపిన విశాలమైన పైప్లైన్తో మెరుగైన కమ్యూనికేషన్ అందడంతో పాటు ఆహార పదార్థాలను కూడా పెద్ద మొత్తంలో పంపేందుకు అవకాశం కలిగింది. సొరంగంలో చిక్కుకున్న కార్మికుడు ప్రదీప్ కిస్కు క్షేమ సమాచారాన్ని అతని బంధువు సునీతా హెంబ్రామ్ తెలుసుకున్నారు. అతను బాగున్నాడని ఆమె మీడియాకు తెలిపారు. కాగా కొత్త పైపు సొరంగంలోకి పంపడం వలన కార్మికులతో కమ్యూనికేట్ చేయడం సులభతరం అయ్యింది. ఇప్పుడు వారి గొంతు స్పష్టంగా వినిపిస్తున్నదని సొరంగం బయట ఉన్నవారు చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి ఫోన్ చేసి నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు చేపడుతున్న రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ల గురించిన సమాచారం తెలుసుకున్నారు. ఉత్తరకాశీ జిల్లాలోని చార్ధామ్ యాత్ర మార్గంలో నిర్మాణంలో ఉన్న నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన సిల్క్యారా సొరంగంలోని ఒక భాగం నవంబర్ 12న కూలిపోయింది. ఈ సమయంలో 41 మంది కూలీలు సొరంగంలో చిక్కుకుపోయారు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితుల కోసం సైకత శిల్పి ప్రార్థనలు VIDEO | "He said -'I am good. You people go home. I will come.' Fruits and other food items were sent through the pipe. He has asked for a mobile charger," says Vikram Singh Yeri, brother of Pushkar Singh Yeri, one of the workers who is stuck inside the collapsed Silkyara… pic.twitter.com/LKS66h5FCy — Press Trust of India (@PTI_News) November 22, 2023 -
సొరంగంలో చిక్కుకున్నవారంతా క్షేమం.. ఫొటో విడుదల!
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో గల సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా జరుగుతోంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది. ఈ చిత్రంలో కార్మికులందరూ సురక్షితంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అమెరికన్ ఆగర్ యంత్రంతో సిల్క్యారా టన్నెల్ నుండి ఎస్కేప్ టన్నెల్ తయారు చేసే పనులు ప్రారంభం అయ్యాయి. ఢిల్లీకి చెందిన మెకానికల్ బృందం అమెరికన్ అగర్ యంత్రంలోని భాగాలను మార్చింది. యంత్రాన్ని ఆపరేట్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. శిథిలాలలో ఆరు పైపులు అమర్చిన తర్వాత మొదటిసారిగా కార్మికులకు ఘన ఆహారాన్ని పంపిణీ చేశారు. పైపు ద్వారా కెమెరాను కూడా లోనికి పంపించారు. దీంతో లోపల చిక్కుకున్న కార్మికులకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది. లోపల చిక్కుకుపోయిన కార్మికులతో అధికారులు మాట్లాడి, వారి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితులకు తొలిసారిగా వేడి కిచిడీ పంపిణీ! #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | First visuals of the trapped workers emerge as the rescue team tries to establish contact with them. The endoscopic flexi camera reached the trapped workers. pic.twitter.com/5VBzSicR6A — ANI (@ANI) November 21, 2023 -
ఢిల్లీలో తెరుచుకున్న విద్యాసంస్థలు
దేశరాజధాని ఢిల్లీలో ‘ప్రమాదకర స్థాయి’ వాయుకాలుష్యం కారణంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలు నేడు (సోమవారం) తెరుచుకున్నాయి. అయితే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పేలవమైన వాయునాణ్యత కారణంగా ప్రభుత్వం నవంబర్ 9 నుండి 18 వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చింది. ఇప్పుడు గాలి నాణ్యత కాస్త మెరుగుపడిన నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం విద్యాసంస్థలను తెరవాలని నిర్ణయించింది. దీంతో నేటి నుంచి ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అన్ని తరగతులను ఇకపై ఫిజికల్ మోడ్లో నిర్వహిస్తారు. అయితే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నర్సరీ నుండి ఐదో తరగతి వరకు తరగతులను నిర్వహించడం లేదని తెలిపాయి. కాలుష్యం ఇంకా బ్యాడ్ కేటగిరీలోనే ఉందని అందుకే చిన్న పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయా ప్రైవేట్ పాఠశాలలు చెబుతున్నాయి. కాగా పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలు, బహిరంగ కార్యక్రమాలపై వారం రోజుల పాటు నిషేధం ఉంటుందని విద్యాశాఖ డైరెక్టరేట్ సర్క్యులర్ జారీ చేసింది. క్రీడలు, ప్రార్థన సమావేశాలు వంటి బహిరంగ కార్యకలాపాలను నిలిపివేయాలని, విద్యార్థుల చేత మాస్క్లు ధరింపజేయాలని ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలకు వెళ్లే సమయంలో పిల్లలు కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సూచించారు. ఇది కూడా చదవండి: రికార్డు ధరకు నెపోలియన్ టోపీ -
అత్యంత గౌరవంగా
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబు పట్ల సీఐడీ సిట్ విభాగం అధికారులు ఆద్యంతం అత్యంత గౌరవంగా వ్యవహరించారు. నంద్యాలలో శనివారం ఉదయం 6 గంటలకు అరెస్టు చేసినప్పటి నుంచి ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత జ్యుడీషియల్ రిమాండ్ కోసం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించేంతవరకు చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా చూసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేతగా ఉన్న 73 ఏళ్ల చంద్రబాబు పట్ల సిట్ అధికారులు అత్యంత మర్యాద పూర్వకంగా వ్యవహరించారు. నిద్ర లేచేవరకు నిరీక్షించి.. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో ప్రధాన దోషి అయిన చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు సిట్ ఇన్చార్జ్ కె.రఘురామిరెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం శనివారం తెల్లవారు జామున 3 గంటలకు నంద్యాల చేరుకుంది. ఆయన బస చేస్తున్న ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న టీడీపీ నేతలకు సమాచారమిచి్చంది. ఆందోళన వ్యక్తం చేసిన వారికి సిట్ అధికారులు దర్యాప్తు అంశాలను వివరించి సర్ది చెప్పారు. అప్పటికి ప్రత్యేక వాహనంలో నిద్రిస్తున్న చంద్రబాబుకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఆయన నిద్ర లేచే వరకు వేచి చూశారు. ఉదయం 5.30 గంటలకు చంద్రబాబు నిద్ర లేచి వాహనం నుంచి బయటకు వచ్చారు. సిట్ అధికారులు ఆయన్ని కలిసి కేసు గురించి వివరించారు. ఈ కేసులో అరెస్ట్ చేసేందుకు వచ్చామని తెలిపారు. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో తన ప్రమేయం లేదని, తనను ఎందుకు అరెస్ట్ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. తమ దర్యాప్తులో వెల్లడైన అంశాలను వివరించి అరెస్ట్కు సహకరించాలని ఆయన్ను అధికారులు కోరారు. సంబంధిత పత్రాలపై సంతకం తీసుకున్నారు. అనంతరం 6 గంటలకు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకున్న తరువాతే విజయవాడకు తరలించాలని నిర్ణయించారు. కుటుంబ సభ్యులతో గదిలో భేటీ శనివారం రాత్రి 7.50 గంటలకు చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, బావమరిది బాలకృష్ణ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రబాబును కలిసేందుకు అనుమతించాలన్న వారి విజ్ఞప్తిని అధికారులు ఆమోదించారు. ఆయన తన కుటుంబ సభ్యులతో ఓ గదిలో ప్రత్యేకంగా మాట్లాడుకునేందుకు అవకాశం కలి్పంచారు. రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబును సంప్రదించి ఆయన అడిగిన ఆహారాన్ని అందించారు. అనంతరం తన న్యాయవాదులతో కూడా విడిగా కేసు విషయాలపై బాబు చర్చించారు. నిద్రించేందుకు ప్రత్యేక గది అనంతరం రాత్రి 9 నుంచి 11 గంటల వరకు చంద్రబాబును మరోసారి విచారించారు. చంద్రబాబు కోరిన మందులను తెప్పించి ఇచ్చారు. సిట్ కార్యాలయంలో ఆయన నిద్రించేందుకు ప్రత్యేక గదిలో తగిన ఏర్పాట్లు చేశారు. అరెస్ట్ చేసినప్పటి నుంచి రిమాండ్కు తరలించేవరకు చంద్రబాబు సహాయకుడు మాణిక్యం ఆయన తోనే ఉండేందుకు అధికారులు అనుమతించారు. తమ అదుపులో ఉన్న చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా సిట్ అధికారులు ఆద్యంతం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు. తమకు సరైన సౌకర్యాలు లేవనిగానీ, అధికారులు సరిగా వ్యవహరించలేదనిగానీ చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఒక్క విమర్శ కూడా చేయకపోవడమే అందుకు నిదర్శనం. పటిష్ట భద్రతతో సెంట్రల్ జైలుకు.. ఆదివారం తెల్లవారుజామున దాదాపు 4 గంటల సమయంలో చంద్రబాబును విజయవాడలోని జీజీహెచ్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉదయం 5.30 గంటల సమయంలో న్యాయస్థానానికి తరలించారు. సాయంత్రం న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించిన తరువాత చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతించారు. అనంతరం పటిష్ట భద్రతతో ఆయన్ని రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. బాబు పక్కనే దమ్మాలపాటి.. తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్న తరువాత చంద్రబాబు కాసేపు విశ్రమించేందుకు అధికారులు అవకాశం కలి్పంచారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు విచారణ ప్రారంభించారు. తన న్యాయవాదుల పేర్లను ఓ కాగితంపై రాసి వారిని లోపలకు అనుమతించాలని చంద్రబాబు కోరడంతో అందుకు దర్యాప్తు అధికారులు సమ్మతించారు. ఆయన చెప్పిన నలుగురు న్యాయవాదులను కార్యాలయంలోకి అనుమతించారు. వారితో చంద్రబాబు కాసేపు చర్చించారు. అనంతరం విచారణ ప్రక్రియ ప్రారంభించారు. ఆ సమయంలో కూడా చంద్రబాబు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాసరావు ఆయన పక్కనే కూర్చొనేందుకు కూడా సిట్ అధికారులు అనుమతించడం గమనార్హం. న్యాయవాది సమక్షంలోనే విచారించారు. విచారణ సందర్భంగా కూడా అధికారులు చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించారు. కేసు దర్యాప్తునకు సంబంధించి ఆయన కోరిన అన్ని పత్రాలను అందించారు. వాటిని ఆయన చదివిన తరువాతే ప్రశ్నలు సంధించారు. ఆయన కోరినట్లుగానే.. నంద్యాల నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో ప్రయాణించడం 73 ఏళ్ల చంద్రబాబుకు ప్రయాస కలిగిస్తుందని సిట్ అధికారులు భావించారు. ఆయనకు సౌకర్యవంతంగా ఉండేందుకు హెలికాఫ్టర్ను ఏర్పాటు చేసి అదే విషయాన్ని తెలిపారు. అయితే తాను తన వాహనంలోనే రోడ్డు మార్గంలో విజయవాడకు వస్తానని చంద్రబాబు చెప్పడంతో అందుకు సిట్ అధికారులు సమ్మతించారు. నంద్యాలలో ఉదయం 8 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబును తీసుకొచ్చారు. మార్గమధ్యంలో కొన్ని చోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయన్ని కలిసేందుకు వేచి ఉన్నారు. చంద్రబాబు కోరిక మేరకు వాహనాన్ని సిట్ అధికారులు కొద్దిసేపు నిలిపారు. టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు అభివాదం చేసి కాసేపు మాట్లాడారు. అందుకు సిట్ అధికారులు అభ్యంతరం చెప్పకుండా సహకరించారు. చిలకలూరిపేట వద్ద టీడీపీ నేతలు వాహన కాన్వాయ్ను అడ్డుకోవడంతో చంద్రబాబు చెప్పేవరకు నిలిపి ఉంచారు. ఆయన సూచించిన తరువాతే కాన్వాయ్ను ముందుకు పోనిచ్చారు.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రుబెల్లాపై గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి
స్పైస్జెట్కు రూ.60 వేల జరిమానా
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే పింఛన్ల పెంపు
నేడు ప్రధానమంత్రి రోడ్ షో
ఓటింగ్ శాతం పెంచాలి
ఉమ్మరకోట్ సొంతం!
సీ్త్ర, పురుష నిష్పత్తిలో తేడా తగ్గించాలి
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
సమన్వయంతో పనిచేద్దాం: ఎస్పీ
‘12, 13 తేదీల్లో పత్రికా ప్రకటనలపై ముందస్తు అనుమతి తప్పనిసరి’
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement