-
పిచ్చి కుక్క స్వైర విహారం
● తొమ్మిది మందికి తీవ్ర గాయాలు బొండపల్లి: మండల కేంద్రమైన బొండపల్లి గ్రామంలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసి తొమ్మిది మందిని కరిచి తీవ్రంగా గాయపరిచింది. గ్రామంలోని యాత వీధిలో ఆరు బయట ఉన్న వారిపై కుక్క విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచింది. స్థానికులు వెంటబెట్టగా అక్కడ నుంచి జాతీయ రహదారికి ఆనుకోని ఉన్న టీ పాయింట్కు సమీపంలో మరి కొంత మందిపై దాడి చేసింది. అక్కడ నుంచి జాతీయ రహదారి పక్కన తాటి ముంజెలు విక్ర యిస్తున్న వారితో పాటు, రోడ్డు పక్కన లారీని ఆపి ఉంచిన డ్రైవర్పై కూడా దాడి చేసింది. ఈ ఘటనల్లో గ్రామానికి చెందిన పి.అచ్చియ్యమ్మ, బి,కృష్ణమ్మ, బి.సంతోష్ , కె.సురేష్, పి.రామలక్ష్మి, వై.సన్యాసిలకు తీవ్ర గాయాలు కాగా, బొండపల్లిలోని పీహెచ్సీలో ప్రథమ చికిత్స అనంతరం గజపతినగరంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. బొండపల్లి పీహెచ్సీలో నీలాతి రాము, పురం రామలక్ష్మి, ఎర్ర సన్యాసిలు చికిత్స పొందుతున్నారు. -
ఇంటి నుంచే ఓటు
గుమ్మలక్ష్మీపురం: ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఆశక్తి ఉన్నా వయోభారంతో ఇల్లు కదల్లేని వారికి, దివ్యాంగులకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. ఓట్ ఫ్రం హోం పద్ధతిలో వీరు తమ ఓటు హక్కును ఇంటి నుంచే వేసే వెసులుబాటు ఇచ్చింది. ఈ నేపథ్యంలో బూత్ లెవెల్ ఆఫీసర్లు, సెక్టోరియల్ ఆఫీసర్లు గ్రామాల్లోని హోం ఓటింగ్కు అర్హులైన ఓటర్ల వద్దకు వెళ్లి హోం ఓటింగ్ ఆప్షన్ తీసుకుంటారా.. లేదంటే పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేస్తారా.. అన్న విషయాలను సేకరిస్తున్నారు. అలాగే హోం ఓటింగ్ ఆప్షన్ తీసుకునే వారు సమ్మతి పత్రాలు (ఫారం–12)ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. సమ్మతి తెలుపుతూ సమ్మతి పత్రాలు అందజేసిన వారు ఎన్నికల కమిషన్ సూచించే తేదీల్లో ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. వీరి వద్దకు సెక్టోరల్ అధికారులు, బీఎల్ఓలు, పోలింగ్ ఏజెంట్లు, సూపర్వైజర్లు వెళ్తారు. శరీరం సహకరించలేని వారికి సహాయకులను నియమిస్తారు. ఈ సహాయకులకు కుడి వేలిపై సిరా గుర్తు వేస్తారు. మళ్లీ ఆ సహాయకుడు ఓటు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. శత శాతం పోలింగ్ నమోదు చేసేందుకు ఎన్నికల కమిషన్ తీసుకున్న ఇంటి నుంచే ఓటు కార్యక్రమంను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ పి.రామారావు తెలిపారు. అర్హులైన వారు సద్వినియోగించుకోవాలని కోరారు. -
No Headline
విజయనగరం ఫోర్ట్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వేతనదారులకు కోట్లాది పనిదినాలు కల్పించింది. ఫలితంగా జిల్లాలో వలసలు గణనీయంగా తగ్గాయి. ఐదేళ్ల కాలంలో ప్రతి గ్రామంలోను పెద్ద ఎత్తున పనులు కల్పించారు. గతంలో ఉపాధి లేక గ్రామాల్లో కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం సొంతూళ్లలో పని కల్పించింది. దీంతో అధిక సంఖ్యలో వేతనదారులు పనులకు వెళ్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేతనాల చెల్లింపు కూడా సత్వరమే చెల్లిస్తున్నారు. దేశంలోనే విజయనగరం జిల్లా పని కల్పనలో ప్రథమంగా నిలిచింది. ప్రతి కుటుంబానికి 100 రోజులు పాటు ఈ పథకం ద్వారా పని కల్పిస్తారు. ఉన్న ఊళ్లలోనే పని దొరుకుతుంది. సాఫీగా జీవనం సాగిస్తున్నారు. -
ప్రజాభిమానం నా అదృష్టం
సాలూరు: ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డితో పాటు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిమానాన్ని చూరగొనడం తన అదృష్టమ ని సాలూరు అసెంబ్లీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీడిక రాజన్నదొర అన్నారు. ఈ మేరకు శుక్రవా రం ఆయన సాలూరు ఆర్ఓ కార్యాలయంలో తన తొలిసెట్ నామినేషన్ దాఖలు చేసిన తరువాత విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గడపగడపకు వైఎస్సార్సీపీ, అధికారంలోకి వచ్చిన తరువాత గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమాల ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అండగా నిలిచామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ, పార్టీలకతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అందించారని తెలి పారు. తన పాలనలో మీకు మంచి జరిగితేనే ఓటు వేయండని ధైర్యంగా ప్రజలను కోరుతున్న దేశంలో నే ఏకై క నాయకుడు జగన్మోహన్రెడ్డి అని స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబునా యుడు అధికారంలోకి ఉండగా రైతులు, మహిళలు, యువత తదితర అన్ని వర్గాల ప్రజలను మోశాం చేశారని విమర్శించారు. నేడు సూపర్సిక్స్ అంటూ మళ్లీ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు మంచి చేసింది జగన్మోహన్రెడ్డి అని, ప్రజలను మోసం చేసింది చంద్రబాబు అని స్పష్టం చేశారు. మోసగాళ్ల మాటలు నమ్మవద్దు పొత్తులతో వస్తున్న ఈ మోసగాళ్ల మాటలను నమ్మవద్దని ప్రజలను కోరారు. నియోజకవర్గంలో ప్రజల కు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నానన్నారు. జగన్మోహన్రెడ్డి పాలనలో సాలూరు నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేశామని పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేసిన జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపైవేసి వైఎస్సార్సీపీ విజయదుందుభి కొనసాగించడానికి ప్రజలంతా సంసిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆయన వెంట అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎన్నికల పరిశీలకుడు శ్రీనివాసరావు పార్టీ నాయకులు ఉన్నారు. ప్రజలతో మమేకం కావడమే రాజకీయం సాలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీడిక రాజన్నదొర -
No Headline
పార్వతీపురంటౌన్: గతంలో గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ, పారిశుద్ధ్య కార్యక్రమాలు అంతంతమాత్రంగానే ఉండేవి. గిరిజనుల ప్రాణాలంటే గతంలో పాలకులకు లెక్క ఉండేది కాదు. 2012 నుంచి 2018 వరకు జిల్లాలో మలేరియా తీవ్రత అధికంగా ఉంది. మరణాలు కూడా ఎక్కువగా నమోదయ్యేవి. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో జీవించే ప్రతి ఒక్కరికి ఆరోగ్య భరోసా కలిగింది. సీజనల్ వ్యాధుల నివారణే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వైద్యారోగ్య కార్యక్రమాలను విస్తృతం చేశారు. గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి 50 కుటుంబాలకు గ్రామ వలంటీర్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. సీజనల్ వ్యాధుల నివారణకు ప్రభుత్వ యంత్రాగం పలు చర్యలు చేపట్టింది. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను విస్తృతం చేసింది. మరోవైపు దోమల నివారణకు మలేరియా, వైద్యారోరోగ్యశాఖ బృందాలు నిరంతరం పనిచేశాయి. జిల్లావ్యాప్తంగా 4,42,400 దోమతెరలు2022లో జిల్లావ్యాప్తంగా 4,42,400 దోమతెరలను ప్రభుత్వం పంపిణీ చేసింది. దోమతెరల వినియోగంపై వైద్యబృందాలు, సచివాలయ ఉద్యోగులు గిరిజనులకు అవగాహన కల్పించారు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు వ్యాధుల సీజన్గా ప్రభుత్వం గుర్తించి వైద్యారోగ్య కార్యక్రమాలను చేపడుతోంది. 2019 నుంచి నుంచి దోమల నివారణతో పాటు మలేరియా తీవ్రతను అరికట్టడంలో మలేరియా, వైద్యారోరోగ్యశాఖలు ఎంతో శ్రమించాయి. ప్రతి ఏడాది రెండు దఫాలుగా దోమల నివారణ మందు పిచికారీ చేస్తున్నాయి. ప్రతి గ్రామంలో ఇంటిలోపల, బయట దోమల మందు పిచికారీని తప్పనిసరిగా చేయించాలనే నిబంధనను సచివాలయ ఉద్యోగులు అమలు చేశారు. గ్రామ వలంటీర్లు తమకు నిర్దేశించిన గిరిజన కుటుంబాల నివాసాల వద్ద దగ్గరుండి దోమల నివారణ మందు పిచికారీ చేయించారు. ఇంటింటా ఫీవర్ సర్వే విజయవంతంగా నిర్వహించారు. చిన్నపాటి జ్వరం వచ్చినా వైద్యసిబ్బంది వెంటనే రక్త పరీక్షలు చేసేవారు. మలేరియా, ఇతర జ్వరాలను నిర్ధారించి సకాలంలో వైద్యసేవలు అందించడంతో జ్వరపీడితులు కోలుకున్నా రు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించడంతో మలేరియా వ్యాధి బారిన పడి ఎవరూ మృతి చెందలేదు. ’మే 15 నుంచి దోమల నివారణ మందు పిచికారీఈఏడాది కూడా దోమల నిర్మూలన కార్యక్రమాలకు మలేరియా, వైద్య ఆరోగ్యశాఖలు చర్యలు చేపట్టాయి. ఎన్నికల కోడ్ రాకముందే రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో మలేరియా నివారణకు చేపట్టాల్సిన చర్యలను నిర్దేశించింది. ఈ మేరకు జిల్లాలో 401 మలేరియా పీడిత గ్రామాలను గుర్తించి మే 15 నుంచి మొదట విడత దోమల నివారణ మందు పిచికారీని జిల్లా మలేరియాశాఖ ప్రారంభించనుం ది. -
మరణ రేటు జీరో
● ఫలించిన రాష్ట్రప్రభుత్వం చర్యలు ● విస్తృతంగా వైద్యారోగ్య కార్యక్రమాలు ● ఏటా రెండు విడతల్లో దోమల నివారణ మందు పిచికారీ ● పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి ● 410 మలేరియా పీడిత గ్రామాల గుర్తింపు క్రమం తప్పకుండా దోమతెరల పంపిణీ401 మలేరియా పీడిత గ్రామాలను గుర్తించాం జిల్లా వ్యాప్తంగా 401 మలేరియా పీడిత గ్రామాలను గుర్తించాం. గ్రామాల్లో మలేరియా కేసులు నమోదైనా అక్కడ కూడా వైద్యబృందాలను అప్రమత్తం చేస్తున్నాం. దోమల నివారణ చర్యలతో పాటు సంపూర్ణ పారిశుద్ధ్యానికి డ్రైడే నిర్వహిస్తున్నాం. మలేరియా కేసులు నమోదవుతునప్పటికీ సకాలంలో వైద్యసేవలు అందించడంతో ఈ ఐదేళ్లలో ఆ వ్యాధితో మరణాలు నమోదు కాలేదు. – డాక్టర్ టి. జగన్మోహన్ రావు, డీఎంఓ, పార్వతీపురం మన్యం -
జయం మనదే
● వైఎస్సార్సీపీ అభ్యర్థుల్లో స్పష్టంగా గెలుపు ధీమా ● పాలకొండ, కురుపాంలో సమరోత్సాహంతో నామినేషన్ల దాఖలు ● సాలూరులో నిరాడంబరంగా రాజన్నదొర.. ●●వెల్లువలా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులుఎర్రటి ఎండను లెక్కచేయని అభిమానం..తమ ప్రతినిధిపై ఉన్న అంతులేని ప్రేమ..విజయంపై సడలని ఆత్మవిశ్వాసం..ఎవరు పోటీలో ఉన్నా గెలుపు ఫిక్స్ అన్న నమ్మకం..పోలింగ్ లాంఛనమే అన్న ధీమా..వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, వారి అనుచరులు, పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, అరకు పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసిన సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కాయి. సమరోత్సాహంతో తమ అభ్యర్థుల వెంట అడుగేస్తూ వారిని ముందుకు నడిపిస్తూ..విజయం పట్ల వారికి నమ్మకం కలిగిస్తూ కదిలాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు..నాయకులు ఎన్నికల కదనరంగంలోకి కాలుపెట్టిన సందర్భంగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయా? అన్న రీతిలో నామినేషన్ల ఘట్టం కోలాహలంగా సాగింది. –సాక్షి, పార్వతీపురం మన్యం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తొలిరోజు ఒక నామినేషన్ పడగా.. రెండో రోజు శుక్రవారం ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి 6 నామినేషన్లు దాఖలయ్యాయి. ఏకాదశి శుభతిథి కావడంతో నామినేషన్ వేసేందుకు ప్రాధాన్యమిచ్చారు. ఈ మేరకు ఆలయాల్లో పూజలు నిర్వహించి, పెద్దల ఆశీర్వాదం తీసుకుని బయల్దేరారు. ఉపముఖ్యమంత్రి, సాలూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి పీడిక రాజన్నదొర నిరాడంబరంగా వెళ్లి రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీవో విష్ణుచరణ్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ నెల 24న మరోసారి కార్యకర్తలు, అభిమానులు, నాయకుల సమక్షంలో అట్టహాసంగా ఆయన నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తరఫున గుమ్మడి సంధ్యారాణి నామినేషన్ దాఖలు చేశారు. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి నియోజకవర్గవ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి కురుపాం తహసీల్దార్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి వీవీ రమణకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆమె భర్త, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు, అరకు పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిని డాక్టర్ గుమ్మ తనూజరాణి ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఉన్నారు. పాలకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిని విశ్వాసరాయి కళావతి తొలుత పలు ఆలయాల్లో పూజలు చేసిన అనంతరం సీతంపేట సంత నుంచి ఐటీడీఏ వరకు అభిమానులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లారు. నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన అభిమానులు ఆమె వెంట నడిచారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి ఆమె నామినేషన్ ప త్రాలు అందజేశారు. పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బోనెల విజయచంద్ర, స్వతంత్ర అభ్యర్థిగా గర్భాపు ఉదయభాను నామినేషన్ దాఖలు చేశారు. -
నదీతీరంలో ఏనుగుల అలజడి
● పరుగు తీసిన గ్రామస్తులు భామిని: మండలంలోని తాలాడ వంశదార నదీ తీరంలో శుక్రవారం ఏనుగుల గుంపు అలజడి రేపింది. వేసవి తీవ్రతతో పెరిగిన ఉష్ణోగ్రతలకు విలవిలలాడిన ఏనుగుల గుంపు దాహా ర్తిని తీర్చుకోడానికి నదీ తీరానికి చేరుకున్న సమయంలో గ్రామస్తులు భయాందోళనతో పరుగులు తీశారు. వేసవి ఉపశమనానికి వంశధార నదిఒడ్డుకు తాలాడ వాసులు చేరుకుంటు న్న సమయంలోనే ఏనుగుల గుంపు తారసపడడంతో గందరగోళం నెలకొంది. స్నానాలకు వెళ్లిన గ్రామస్తులు పరుగుపెట్టారు. అంతా సద్దుమణిగాక ఏనుగులు జలకాలాడి నీరు తాగి వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. ముమ్మరంగా వాహనాల తనిఖీసీతానగరం: సాధారణ ఎన్నికలకు నామినేషన్లు దాఖలవుతున్న కారణంగా రాష్ట్ర రహదారిపై వాహనాల తనిఖీ ముమ్మరం చేశామని ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్(ఎఫ్ఎస్టి) అధికారి కె.చిన్నారావు అన్నారు. ఈ మేరకు రాష్ట్ర రహదారిలో బొబ్బిలి–సీతానగరం సరిహద్దు లచ్చయ్యపేట జంక్షన్ నుంచి సూరంపేట వరకు వాహనాలను తనిఖీ చేశారు. కింతలివానిపేట జంక్షన్ వద్ద ద్విచక్రవాహనంపై తరలిస్తున్న బ్యాగ్లను తనిఖీ చేస్తున్న సమయంలో ఆయన మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో ఎన్నికల రిటర్నింగ్ అధి కారి ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది సహకారంతో వాహనాలు తనిఖీ చేస్తున్నామన్నారు. పోటీల్లో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు తాయిలాలు సమర్పించడానికి వాహనాల్లో నిబంధనలకు మించి నగదు, ఆకర్షణీయమైన వస్తువులు తరలించే అవకాశాలున్నాయని భావించి వాహనాల తనిఖీకి రిటర్నింగ్ అధికారి మార్గదర్శకా లు విడుదల చేశారని తెలియజేశారు. ఈ నేపథ్యంలో మే నెల 13 ఎన్నికల పోలింగ్ జరిగేంత వరకూ నిరంతరం వాహనాల తనిఖీ చేపట్ట నున్నామన్నారు. తనిఖీ అధికారులకు వాహనా లు ఎక్కడైనా అపి తనిఖీచేసే అధికారం ఉంద ని, పోలీసు వారి సహకారంతోనే చేపట్టే తనిఖీ సమయంలో వాహన యజమానులు సహకరించాలని కోరారు. రామతీర్థంలో వైభవంగా సహస్ర దీపాలంకరణ నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన పూజలు నిర్వహించిన తరువాత యాగశాలలో నిత్య హోమాలు, వెండి మండపం వద్ద స్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపించారు. సాయంత్రం 6 గంటలకు సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా దీపారాధన మండపంపైకి తీసుకువచ్చి ప్రత్యేక ఊయలలో ఆశీనులు చేశారు. అనంతరం దీపాలు వెలిగించి ఊంజల్ సేవ జరిపించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బొబ్బిలి చీరల పరిశీలన బలిజిపేట: నారాయణపురం గ్రామానికి చెందిన నీలకంఠేశ్వర చేనేత సహకార సంఘం తయారు చేస్తున్న బొబ్బిలి చీరలను రాష్ట్ర ఆప్కో మేనేజింగ్ డైరెక్టర్ పవనమూర్తి శుక్రవారం పరిశీలించారు. ఇటీవల కాలంలో సహకార సంఘం తయారు చేసిన బొబ్బిలి చీరలను రాష్ట్రంలోని అన్ని ఆప్కో షోరూంలకు సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటి నాణ్యతను పరిశీలించేందుకు ఆప్కో ఎండీ పవనమూర్తి అమరావతి నుంచి ఇక్కడకు వచ్చారు. చీరలను పరిశీలించి వాటి నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన సూచనలు, సలహాలు సంఘ సభ్యులకు అందించారు. ఆయన వెంట కె.వీర్రాజు, సీహెచ్.నారాయణరావు, సభ్యులు ఉన్నారు. -
ఉపాధి భేష్
జిల్లాలో జాబ్ కార్డులు 3.45 లక్షలు జిల్లాలో జాబ్ కార్డులు 3.45లక్షలు ఉన్నాయి. వీటిలో 3.21లక్షల జాబ్ కార్డులు యాక్టివ్లో ఉన్నాయి. వీటి పరిధిలో 6.06 లక్షల మంది వేతనదారులు ఉన్నారు. వీరిలో 5.04 లక్షల మంది వేతనదారులు పనులకు వెళ్తున్నారు. ఒక్కో వేతనదారుడికి రూ.25 వేల వరకు లబ్ధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనికి వెళ్లే వేతనదారుడికి వేలాది రుపాయిలు ఏటా అందుతున్నాయి. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.25 వేల నుంచి రూ. 30 వేల వరకు లబ్ధి చేకూరుతుంది. ప్రతి ఏటా ప్రభుత్వం కోట్లాది పనిదినాలు వేతనదారులకు కల్పిస్తోంది. ఏడాదికి 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు పనిదినాలు కల్పిస్తున్నారు. ఇందుకోసం రూ.500 నుంచి రూ.700 కోట్ల వరకు వేతనదారులకు ఏటా చెల్లిస్తున్నారు. -
పక్కాగా వ్యయ రిజిస్టర్ నిర్వహణ
● అరకు పార్లమెంట్ వ్యయ పరిశీలకుడు గురుకరణ్సింగ్ పార్వతీపురం: షాడో వ్యయ రిజిస్టర్ను పక్కాగా నిర్వహించాలని అరకు పార్లమెంట్ నియోజకవర్గం వ్యయ పరిశీలకుడు గురు కరణ్సింగ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో వ్యయ నమోదుపై సహాయ వ్యయ పరిశీలకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల పోటీల్లో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో భాగంగా నిర్వహించే ర్యాలీ లు, సమావేశాలు, ఇతర కార్యక్రమాలపై దృష్టి సారించాలని చెప్పారు. కాఫీ, టీ, తాగునీటి వంటి అంశాలతో సహా వాహనాల వినియోగం తదితరాలను పరిశీలించాలని స్పష్టం చేశారు. ఎక్కడా ఎలాంటి అశ్రద్ధ చేయరాదని ఆదేశించారు. అనుమతులు పొందిన వాహనాల వివరాలు నోడల్ అధికారి వద్ద ఉండాలని వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, అరకు పార్లమెంట్ నియోజకవర్గం సహా య రిటర్నింగ్ అధికారి ఎస్ఎస్ శోభిక, వ్యయవిభా గం నోడల్ అధికారి, జిల్లా సహకార అధికారి పి. శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. కంట్రోల్ రూమ్ సందర్శన జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కమాండ్ కంట్రోల్ రూమ్ను అరకు పార్లమెంట్ నియోజకవర్గం వ్యయ పరిశీలకులు గురుకరణ్సింగ్ శుక్రవారం సందర్శించారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి విభాగం, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిట రింగ్ సెల్, సోషల్ మీడియా విభాగం, వ్యయ విభా గం, ఫిర్యాదుల విభాగం, చెక్పోస్టుల పర్యవేక్షణ, నియంత్రణ తదితర విభాగాలను పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ పనితీరును ఆయనకు జాయింట్ కలెక్టర్ వివరించారు. అనంతరం కలెక్టర్ చాంబర్లో కలెక్టర్, అరకు పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి నిషాంత్కుమార్ను వ్యయ పరిశీలకుడు గురుకరణ్ సింగ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ జి.కేశవనాయుడు, ఎన్సీసీ నోడల్ అధికారి ఎం.డి గయాజుద్దీన్, సోషల్ మీడియా నోడల్ అధికారి సాయికుమార్, ఎంసీఎంసీ నోడల్ అధికారి ఎల్.రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రవేశ పరీక్ష రేపు
పార్వతీపురం: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతి ప్రవేశానికి, 6,7,8,9 తరగతులకు బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 21న ప్రవేశపరీక్షను నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ సి.విష్ణుచరణ్ ఒక ప్రకటనలో శుక్రవారం తెలి పారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఏపీటీడబ్ల్యూఆర్ఎస్(బాలురు) పి.కోనవలస, ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ (బాలికలు)కురుపాం, ఏపీ టీడబ్ల్యూఆర్ఎస్(బాలురు) భద్రగిరి, ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ (బాలురు)కొమరాడ కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఆటో ఢీకొని యువకుడికి గాయాలు
బొబ్బిలి: మండలంలోని రంగరాయపురానికి చెందిన రాజాన దిలీప్ ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. అదే పనిపై పట్టణంలోని శ్రీకళాభారతి వెనుక గల రాతిపనివారి వీధి వెళ్లి డెలివరీ అనంతరం తిరిగి వస్తుండగా మెయిన్రోడ్డు మీదుగా తెర్లాం మండలం కూనాయవలసకు చెందిన మోది సింహాచలం నడుపుతున్న ఆటో ఢీకొనడంతో దిలీప్ గాయపడ్డాడు. వెంటనే దిలీప్ను స్థానిక సీహెచ్సీకి తరలించగా మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించినట్టు ఏఎస్సీ జి.భాస్కరరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
మీడియా కేంద్రాన్ని పరిశీలించిన వ్యయ పరిశీలక బృందం
విజయనగరం అర్బన్: ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా కేంద్రాన్ని వ్యయ పరిశీలకులు ప్రభాకర్ ప్రకాష్ రాజన్, ఆనంద్ కుమార్, ఆకాష్ దీప్ శుక్రవారం కంట్రోల్ రూమ్ను సందర్శించారు. మీడియా మానిటరింగ్, మోడల్ కోడ్ కమిటీ, సోషల్ మీడియా, జిల్లా వ్యయ అంచనాల కమిటీ, ఫిర్యాదులు, రిపోర్టింగ్ విభాగాలను పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వారి విధుల గురించి అడిగి, రిజిస్టర్లను పరిశీలించారు. వాహనాల జీపీఎస్ సిస్టంను, మద్యం చెక్ పోస్ట్ల కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. అనంతరం మీడియా కేంద్రాన్ని సందర్శించారు. యువకుడి ఆత్మహత్య బాడంగి: మూడేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్న ఓ యువకుడు జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని ఆనవరం గ్రామానికి చెందిన తూముల విజయ్కుమార్(23) గురువారం పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మూడేళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతూ పార్వతీపురం ఆస్పత్రిలో చికిత్స పొందినా నయం కాకపోవడంతో నొప్పి తట్టుకోలేక విసిగిపోయి జీవితంపై విరక్తితో గ్రామానికి సమీపంలో గల అరటి తోట వద్ద పురుగు మందు సేవించాడు. విషయం తెలుసుకున్న మృతుడి సోదరుడు, స్నేహితుడు 108లో బొబ్బిలి ఆస్పత్రిలో చేర్పించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం విజయనగరం రిఫర్ చేయగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి తూముల కృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఆర్.జయంతి పర్యవేక్షణలో హెచ్సీ ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. బీరు బాటిళ్ల పట్టివేత వేపాడ: మండల కేంద్రమైన వేపాడ జంక్షన్ వద్ద వల్లంపూడి పోలీసులు నిర్వహించిన దాడుల్లో 12 బీరు సీసాలు పట్టుబడినట్లు వల్లంపూడి ఎస్.ఐ రాజేష్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన దాడుల్లో జంక్షన్లో తనిఖీ నిర్వహిస్తుండగా 12 బీరు సీసాలు పట్టుబడటంతో సీసాలతో పాటు వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం సీసాలు రవాణా చేసినా, విక్రయించినా చర్యలు తప్పవన్నారు. -
ఆమె రెండుసార్లు ఎమ్మెల్యే.. ఆస్తుల విలువ రూ.69 లక్షలే...
● పాలకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వాసరాయి కళావతి నిరాడంబర జీవితం పాలకొండ రూరల్: పాలకొండ అసెంబ్లీ స్థానానికి మూడో దఫా వైఎస్సార్సీపీ నుంచి బరిలో నిలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వాసరాయి కళావతి వ్యక్తిగత ఆస్తుల విలువ కేవలం రూ.69 లక్షలు మాత్రమే. (ఆమె వాడుతున్న రెండు కార్లు, మూడు ఎకరాల పొలం, బ్యాంక్ డిపాజిట్లు, వండవలో తన స్వగృహం విలువ ఇది). ఈ రోజుల్లో అతి సామూన్యుడు కూడా ఆస్తులు కూడబెట్టుకుంటున్న తరుణంలో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా.. ఆస్తులు పెంచుకోవడం కంటే ప్రజాసేవే పరమావధిగా సాగారు. తన నామినేషన్ పత్రంలో అధికారులకు నిష్పక్షపాతంగా తన వ్యక్తిగత ఆస్తుల వివరాలను సమర్పించి, సర్వసాధారణ మధ్యతరగతి గృహిణిగా, అసలు సిసలైన గిరిజన మహిళగా నిరూపించుకున్నారు. మరోవైపు తన భర్త, కుమార్తె పేరిట ఉన్న ఆస్తుల వివరాలను సైతం తెలియపర్చారు. భర్త మండగి హరిప్రసాద్ పేరిట విశాఖలో ఓ ఫ్లాట్ (రూ.35లక్షలు), 4.74 ఎకరాల పొలం (రూ.60లక్షలు) విలువ గలది ఉన్నాయని, కుమార్తె సాయివైష్ణవి పేరిట రూ.2లక్షల40వేల విలువగల బంగారు ఆభరణాలు ఉన్నట్లు స్పష్టం చేశారు. వీటితోపాటుగా ఆమె పేరిట రూ.5.91 లక్షలు, భర్త పేరిట రూ.1.30 లక్షలు బ్యాంకు రుణాలు ఉన్నట్టు ఎన్నికల ఆఫిడవిట్లో పేర్కొన్నారు. -
మునకలవలస సచివాలయంలో ఉద్యోగుల మధ్య వివాదం
రేగిడి : మండలంలోని మునకలవలస గ్రామ సచివాలయ ఉద్యోగుల మధ్య శుక్రవారం వివాదం నెలకొంది. సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ కె.సత్యనారాయణ తనకు జీతం బిల్లును పంచాయతీ కార్యదర్శి పి.సుధీర్కుమార్ పెట్టకపోవడంపై వీరిద్దరి మధ్య వివాదం తలెత్తినట్లు గ్రామస్తులు వెల్లడించారు. సచివాలయంలో వీరిద్దరు పరస్పరం వాదోపవాదనలు చేసుకుని, చివరికి సచివాలయంలో ఫర్నిచర్ను ధ్వంసం చేసినట్లు తెలిపారు. గతంలో వీరిద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు కూడా ఉన్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, పంచాయతీ కార్యదర్శితో పాటు డిజిటల్ అసిస్టెంట్ వద్ద స్టేట్మెంట్ రికార్డు చేశారు. గ్రామస్తులతో పాటు మండల పరిషత్ అధికారులు వద్ద ఈ వివాదానికి సంబంధించి వివరాలు ఆరా తీస్తున్నారు. -
గర్భిణుల నమోదు త్వరగా జరగాలి
పార్వతీపురంటౌన్: గర్భిణుల నమోదు త్వరితగతిన జరగాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.జగన్నాథరావు ఆదేశించారు. ఈ మేరకు పార్వతీపురం, గరుగుబిల్లి మండలాలకు చెందిన పీహెచ్సీల వైద్యాధికారులు, వైద్యసిబ్బందితో పలు ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షా సమావేశాన్ని స్థానిక ఎన్జీఓ భవనంలో గురువారం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణికి పూర్తిస్థాయిలో, కచ్చితమైన వైద్య సేవలందాలంటే క్షేత్రస్థాయిలో అర్హులైన జంటలను గుర్తించి, సకాలంలో గర్భనిర్ధారణ పరీక్షలు చేసి గర్భిణుల నమోదు (రిజిస్ట్రేషన్) త్వరగా మొదటి త్రైమాసంలోనే చేయాలని, అందుకు అవసరమైన పూర్తి వివరాలు మాతాశిశు సంరక్షణ కార్డులో పొందుపర్చాలని సూచించారు. తద్వారా ఆరోగ్య తనిఖీలు, వైద్య పరీక్షలు గర్భిణికి త్వరగా నిర్వహించి ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే సత్వరమే గుర్తించవచ్చని, సరైన చికిత్స, పర్యవేక్షణ చేయడం ద్వారా హైరిస్క్ ఆరోగ్య సమస్యలకు గురికాకుండా జాగ్రత్త పడవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా హిమోగ్లోబిన్ శాతం తక్కువగా గుర్తించిన గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతిరోజూ ఐరన్ ఫోలిక్ ఆసిడ్ మాత్రలు వేసుకునేలా పర్యవేక్షించాలని, అవసరమైన ఐరన్ సుక్రోజ్ ఇంజక్షన్స్ ఇవ్వాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రంలో గర్భిణికి అందజేస్తున్న పౌస్టికాహారం సద్వినియోగం చేసుకునేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రిజం10 అమలు తీరును పర్యవేక్షించాలిప్రిజం10 అమలు తీరును పర్యవేక్షించాలని వైద్యాధికారులకు డీఎంహెచ్ఓ సూచించారు. ఐదేళ్లలోపు పిల్లల్లో రక్తహీనత, పౌష్టికాహారలోపం, శ్వాస సంబంధ సమస్యలున్న వారిని త్వరగా గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాలని, సకాలంలో వ్యాధినిరోధక టీకాలు వేయాలన్నారు. గ్రామాల్లో వడదెబ్బ, వేసవి జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ నారాయణరావు, డీఎంఓ డాక్టర్ టి.జగన్ మోహనరావు, ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారి డాక్టర్.రఘుకుమార్, డాక్టర్ ఎం.వినోద్, డీపీహెచ్ఎన్ఓ ఉషారాణి, డీపీఓ లీలారాణి, ఎస్ఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ బి.జగన్నాథరావు -
సారాతో వ్యక్తి అరెస్టు
సీతానగరం: మండలంలోని బక్కుపేట గ్రామంలో ఎస్ఈబీ సీఐ జె.శ్రీనివాసరావు నేతృత్వంలో గురువారం తనిఖీలు చేపట్టిన సమయంలో 190 సారా ప్యాకెట్లతో ఓ వ్యక్తి పట్టుబడగా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ముందస్తు సమాచారం మేరకు గ్రామానికి చెందిన పి. లక్ష్మణదొర ఇంట్లో తనిఖీలు చేసి సారాను గుర్తించినట్లు సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సై బి.రాజశేఖర్ పట్నాయక్, జె.జగన్నాథరావు, ఎం. శ్రీవాణి, హెచ్సీ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిపై కత్తితో దాడి వేపాడ: మండలంలోని వావిలపాడు గ్రామానికి చెందిన ఎం.సన్యాసిరావును అదే గ్రామానికి చెందిన ఆరిపాక సంతోష్ కత్తితో గాయపర్చి హత్యాయత్నానికి పాల్పడటంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. దీనికి సంబంధించి ఎస్ఐ అందించిన వివరాలు.. వావిలపాడుకు చెందిన ఆరిపాక సంతోష్ మద్యం సేవిస్తూ వుంటాడు. సన్యాసిరావుకు సంతోష్ వరుసకు కుమారుడు అవుతాడు. మద్యం సేవించడం మంచిది కాదని సంతోష్ను మందలిస్తూ వుండే వాడు. దీన్ని తట్టుకోలేని సంతోష్ గురువారం ఉదయం సన్యాసిరావు ఇంటికి వెళ్లి కత్తితో పీకపై గాయపర్చి హత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్ఐ తెలిపారు. దీంతో కుటుంబీకులు సమీపంలో వున్న ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సంతోష్ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోలీస్ సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి చర్యలు విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏఆర్ పోలీసులైన్స్లో నడపబడుతున్న పోలీస్ వెల్ఫేర్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఖాళీగా ఉన్న మూడు ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ఎస్పీ ఎం.దీపిక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో ఆరో తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మ్యాఽథ్స్, ఫిజిక్స్ బయాలజీతో పాటూ ఇంగ్లిష్ సబ్జెక్ట్ కూడా బోధించాల్సి ఉంటుందన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతను తెలిపే ఒరిజినల్ ధ్రువపత్రాలు, రెజ్యూమ్ తీసుకుని ఏప్రిల్ 26 ఉదయం 10 గంటలకు పాఠశాలలో నిర్వహించబోయే టీచింగ్ డెమో, మౌఖిక పరీక్షకు హాజరు కావాలన్నారు. ఉపాధ్యాయ పోస్టులకు బీఈడీ విద్యార్హతతో పాటూ అర్హతలు కలిగిన అభ్యర్థులు స్కూల్లో నిర్వహించే మౌఖిక పరీక్షకు ఆ రోజు హాజరు కావాలన్నారు. వివరాలకు 94917 99315, 91211 09485 సంప్రదించాలని కోరారు. వెబ్సైట్లో డీఎడ్ హాల్టికెట్లువిజయనగరం అర్బన్: ఈ నెల 22 నుంచి 27 వరకు జరిగే డీఎడ్ మూడవ సెమిస్టర్ (2022–24 బ్యాచ్ మరియు ఒన్స్ ఫైల్డ్), మొదటి సెమిస్టర్ (2023–25 బ్యాచ్ మరియు ఒన్స ఫైల్డ్) పరీక్షలకు హాజరగు విద్యార్థులకు హాల్ టిక్కెట్లు వెబ్సైట్లో పొందుపరచామని డీఈఓ ఎన్.ప్రేమకుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల కోసం ‘బీఎస్ఈ.ఏపీ.జీఓవి.ఐఎన్’ వెబ్సైట్ నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. బాలికపై లైంగిక దాడి డెంకాడ: మండలంలోని ఒక గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. దిశ పోలీసులు అందించిన వివరాలు.. బుధవారం ఏడేళ్ల బాలికపై 50 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక విజయనగరంలోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విజయనగరం దిశ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనం ఢీకొని బాలుడి మృతిరాజాం సిటీ : రాజాం పట్టణం చీపురుపల్లి రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లచ్చయ్యపేటకు చెందిన గొండేటి భరద్వాజ్(10) అనే బాలుడు మృతి చెందాడు. రాజాం వైపు వస్తున్న ఓ వాహనం టిఫిన్ నిమిత్తం రోడ్డుపైకి వచ్చిన బాలుడిని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన వెంటనే బాలుడిని ప్రైవేట్ వాహనంలో రాజాంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్సను అందిస్తుండగానే మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు సంతు, వెంకటేష్లు బోరున విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న రాజాం సీఐ మోహనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. -
ఆడాళ్లా మజాకా..!
వీరఘట్టం: మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలతో పార్వతీపురం మన్యం జిల్లాలోని వీరఘట్టంలో ప్రారంభించిన వైఎస్సార్ చేయూత మహిళా మార్ట్ ప్రగతి పథంలో నడుస్తోంది. జిల్లాలోని వీరఘట్టం మండల కేంద్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ మార్ట్లో మార్కెట్ ధరల కంటే తక్కువకే నాణ్యమైన సరుకులను ప్రజలకు విక్రయిస్తుండడంతో ప్రారంభించిన మూడు నెలల్లోనే రూ.60 లక్షల వ్యాపారం జరిగింది. ఈ లెక్కన చూస్తే లాభాలు బాగా వచ్చే అవకాశం ఉందని మార్ట్ నిర్వాహకులు చెబుతున్నారు. వీరఘట్టం పట్టణంలో తొలి మహిళా మార్ట్ను డ్వాక్రా సంఘాల సౌజన్యంతో ఈ ఏడాది జనవరి 12న పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిషాంత్కుమార్ ప్రారంభించి ఆయనే మొదట కొనుగోలు చేశారు. ప్రారంభించిన రోజున కలెక్టర్ నిషాంత్కుమార్ ఆకాంక్షించిన విధంగానే ఈ మార్ట్ వ్యాపారాభివృద్ధి చెందింది. మార్ట్ ఏర్పాటు ఇలా.. వీరఘట్టం మండలంలోని 1600 మహిళా సంఘాల్లో ఉన్న 15 వేల మంది సభ్యులు ఒక్కొక్కరు రూ.200 చొప్పున పెట్టుబడితో రూ.30 లక్షలు పోగు చేశారు. ఈ డబ్బుతో అమెజాన్, ఫ్లిప్కార్ట్తో పాటు మరి కొన్ని కార్పొరేట్ కంపెనీల్లో సరుకులను మార్కెటింగ్ చేశారు. మరి కొన్ని సరుకులను హోల్సేల్ షాపుల్లో ఖరీదు చేశారు. ఇలా వివిధ రకాలుగా ఖరీదు చేసిన సరుకులను వీరఘట్టం ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన మార్ట్ ద్వారా ప్రజలకు అతి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. దీంతో అటు డ్వాకా సంఘాల సభ్యులతో పాటు ప్రజలు కూడా ఈ మార్ట్లో సరుకులు కొనుగోలు చేస్తుండడంతో మార్ట్లో వ్యాపారం జోరందుకుంది. 60 శాతం లాభాలు పెట్టుబడి పెట్టిన మహిళలకే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన మహిళలకు 60 శాతం లాభాలను ఇవ్వనున్నారు. అలాగే 40 శాతం లాభాలను వ్యాపారాభివృద్ధికి పెట్టుబడి పెడతారు. ఈ వ్యాపారంలో కేవలం రూ.200 పెట్టుబడి పెట్టిన 15 వేల మంది మహిళలు నేడు వ్యాపారవేత్తలుగా మారుతున్నారు. మరి కొద్దిరోజుల్లో వ్యాపారంలో వచ్చిన లాభాలను ఆయా సంఘాల బ్యాంకు ఖాతాలకు జమచేస్తారు. వీరఘట్టంలో పాటు గరుగుబిల్లి, సీతంపేట,జియ్యమ్మవలస,వంగర మండలాల ప్రజలు నిత్యం వస్తూ ఇక్కడ సరుకులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు అందరి చూపూ ఈ మహిళా మార్ట్పైనే పడింది. ప్రగతిపథంలో దూసుకుపోతున్న మహిళా మార్ట్ ప్రారంభించిన మూడు నెలల్లో రూ.60 లక్షల వ్యాపారంరోజుకు రూ.60 వేల వ్యాపారం మాకు తెలియని వ్యాపారం ఇది. అయినా సరే ప్రభుత్వం చొరవతో మార్ట్ ఏర్పాటు చేశాం. సరుకుల ధరలు ఎంతో తెలిసేవి కాదు.మహిళా సంఘాల సభ్యులందరి సహకారంతో సరుకులు విక్రయిస్తున్నాం.బయట నుంచి తెచ్చిన పప్పులు, ఇతర నిత్యావసర సరుకులను గ్రేడింగ్ చేసి ప్యాకింగ్ చేస్తున్నాం. షాపును అందంగా తీర్చిదిద్దడంతో సరుకులు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు బాగా వస్తున్నారు.ప్రస్తుతం రోజుకు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు వ్యాపారం జరుగుతోంది. దాసరి పుణ్యవతి, అధ్యక్షురాలు, వైఎస్సార్ చేయూత మహిళా మార్ట్, వీరఘట్టం మూడు నెలల్లో రూ.60 లక్షల వ్యాపారం.. 15 మంది మహిళా కమిటీ సభ్యులతో వీరఘట్టంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ చేయూత మహిళా మార్ట్ మూడు నెలల్లోనే రూ.60 లక్షల వ్యాపారం చేయడంపై అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎటువంటి వ్యాపార అనుభవం లేని వీరు ఇంత పెద్ద బాధ్యతను ఎలా చేపట్టగలరని తొలుత సందేహాలు వ్యక్తం చేసిన వారే ఇప్పుడు శభాష్ అంటున్నారు. జిల్లాలో మరికొన్ని మార్ట్ల ఏర్పాటుకు వీరఘట్టం మార్ట్ రోల్మోడల్గా మారిందని ప్రశంసిస్తున్నారు. -
No Headline
కొత్తవలస: తిమ్మిని బమ్మిని చేయడం.. బమ్మిని తిమ్మిని చేయడం వంటి కనికట్టు విద్యల్లో తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబునాయుడుకి మించిన వారు ప్రపంచంలోనే ఉండరు. అధికార దర్పణంతో ప్రజాధనాన్ని లూటీ చేయడం.. తమ సామాజిక వర్గానికి మేలు చేయడంలో ఆయన మించిన వారు మరొకరు లేరు. వాస్తవాలను మరుగున పెట్టి మోసం చేయడంలో ఆయన దిట్ట. ఇదే తరహాలో ఎస్.కోట నియోజకవర్గ ప్రజలను నిలువునా ముంచేశారు. కొత్తవలస ప్రాంతంలో గిరిజన వర్సిటీ పేరుతో చంద్రబాబునాయుడు, టీడీపీ నాయకులు కలిసి పెద్ద ఎత్తున భూ వ్యాపారాలు చేపట్టారు. తమదైన శైలిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిపారు. ఈ ప్రాంతీయుల నుంచి రూ.వందల కోట్లు కొల్లగొట్టారు. కారుచౌకగా ఉన్న స్థలాలను అధిక ధరలకు విక్రయించి మోసం చేశారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాకతో వాస్తవాలు వెలుగులోకి... 2019లో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గిరిజన వర్సిటీ నిర్మాణ విషయంలో కేంద్ర బృందం ఇచ్చిన నివేదిక బహిర్గతమైంది. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పును గుర్తించింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు గిరిజన వర్సిటీని గిరిజన ప్రాంతంలో నిర్మాణానికి చర్యలు చేపట్టింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా అచ్చ మైన రిజర్వ్డ్ పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్ల ప్రాంతమైన సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో సుమారు 561.88 ఎకరాలను సేకరించింది. గిరిజన వర్సిటీకి 2023 ఆగస్టు 25న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంప్రధాన్, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కలిసి శంకుస్థాపన చేశారు. గిరిజన విద్యార్థుల చదువుల ఆశయం నెరవేర్చేలా వర్సిటీ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. తొలుత రూ.60కోట్లతో మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టారు. ఇంకా ముంచేసేందుకు... చంద్రబాబు అండ్ కో చేసిన రియల్ ఎస్టేట్ మోసం అందరికీ తెలిసిపోవడంతో కొనుగోలుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆర్థికంగా నష్టపోయిన వందలాది మంది టీడీపీ నాయకులను ఎక్కడికక్కడే నిలదీస్తున్నారు. దీంతో ఇటీవల ఎస్.కోట పర్యటనలో భాగంగా ఎల్.కోట మండలం సోంపురం కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో గిరిజన వర్సిటీని మళ్లీ కొత్తవలస తీసుకొస్తామంటూ నారా లోకేశ్ సత్యదూరపు ప్రకటన చేశారు. దీనికి మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి వంతపాడారు. అంటే... రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ స్థాయిలో జరిపారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొనుగోలు చేసేవారు ఉంటే ముంచేసేందుకు లోకేశ్తో పాటు లలితకుమారి సిద్ధంగా ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014లోనే కేంద్రం మంజూరు చేసినా తూతూ మంత్రంగా పనులు సొంత సామాజిక వర్గ రియల్ ఎస్టేట్ కోసం వర్సిటీ ఆశయానికి గండి గిరిజన ప్రాంతానికి చేరువగా ఉండాల్సిన ప్రాంగణాన్ని విశాఖకు చేరువలో ఏర్పాటు రూ.5 కోట్ల ఖర్చుతో ప్రహరీ పనులు బినామీలకు అప్పగింత అమరావతి తరహాలో భూ పందేరం వర్సిటీ పేరుతో సొమ్ముచేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వర్సిటీ ఆశయానికి అనుగుణంగా చర్యలు సాలూరు నియోజకవర్గంలో 561.88 ఎకరాల భూమి సేకరణ రైతులకు పరిహారం చెల్లించిన తర్వాత ముఖ్యంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన రూ.60కోట్లతో మౌలిక వసతులు -
జిల్లాకు చేరుకున్న వ్యయ పరిశీలకుడు
పార్వతీపురం: జిల్లాలోని నాలుగు శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల వ్యయపరిశీలకుడిగా రమాకాంత్ ప్రధాన్ను, అరకు పార్లమెంట్ నియోజకవర్గం వ్యయపరిశీలకుడిగా గురుకరణ్ సింగ్ను ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు జిల్లా వ్యయ పరిశీలకుడు రమాకాంత్ ప్రధాన్ గురువారం జిల్లాకు చేరుకున్నారు. జిల్లాకేంద్రంలోని డా.వైఎస్ఆర్ ఉద్యాన కళాశాలలోని అతిథి గృహం–2లో ఆయన బసచేస్తారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కమాండ్ కంట్రోల్ రూమ్ను శాసనసభ నియోజక వర్గాల వ్యయ పరిశీలకుడు రమాకాంత్ ప్రధాన్ గురువారం సందర్శించారు. ఈ మేరకు కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రవర్తన నియమావళి విభాగం, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్, సోషల్ మీడియా విభాగం, వ్యయవిభాగం, ఫిర్యాదుల విభాగం, చెక్ పోస్టుల పర్యవేక్షణ నియంత్రణ విభాగం, జియోట్యాగింగ్ వాహనాల పర్యవేక్షణ తదితర విభాగాలను ఆయన నిశితంగా పరిశీలించారు. జాయింట్ కలెక్టర్, అరకు పార్టమెంటరీ నియోజకవర్గం సహాయ రిటర్నింగ్ అధికారి ఎస్ఎస్.శోభిక కమాండ్ కంట్రోల్ పనితీరును ఆయనకు వివరించారు. తొలుత కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిషాంత్ కుమార్ను చాంబర్లో కలిసిన వ్యయ పరిశీలకుడు జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం పార్వతీపురం, కురుపాం శాసనసభ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.కేశవానాయుడు, కమాండ్ కంట్రోల్ రూమ్ అధికారి, ఎస్డీసీ ఆర్వీ సూర్యనారాయణ, ఎంసీసీ నోడల్ అధికారి ఎం.డి.గయాజుద్దీన్, సోషల్ మీడియా నోడల్ అధికారి యు.సాయికుమార్, ఎంసీఎంసీ నోడల్ అధికారి ఎల్.రమేష్, సహయ వ్యయపరిశీలకులు ఆర్వీ.రమణమూర్తి, పర్యవేక్షకురాలు సుజాత పాల్గొన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ సందర్శన -
కళావతి ప్రచార జోరు
పాలకొండ: ఎన్నికల ప్రచారానికి వస్తున్న వైఎస్సార్సీపీ పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వాసరాయి కళావతికి జనం నీరాజనం పడుతున్నారు. ప్రచారం చేస్తున్న ఆమెకు మహిళలు హారతి వచ్చి ఆశీర్వచనాలు అందజేస్తున్నారు. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆమె గురువారం పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు 15,16,17,18 వార్డుల పరిధిలోని గారమ్మ కాలనీలో ఇంటింటి ప్రచారం చేశారు. కాలనీలో ఇంతవరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రానికి సీఎం జగన్మోహరెడ్డి అందించిన సుపరిపాలన కొనసాగాలంటే మళ్లీ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. పలు వర్గాల ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్ధించారు. వీధుల్లో ప్రచారం నిర్వహించిన ఆమెకు మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఆమెతో పాటు ప్రచారంలో పార్టీ నాయకులు వెలమల మన్మథరావు, దుప్పాడ పాపినాయుడు, వై లిల్లీపుష్పనాథం కడగల రమణ, తుమ్మగుంట శంకరరావు, కొంచాడ అరుణ్కుమార్, తూముల లక్ష్మణరావు, పల్లా భాను, కిల్లారి మోహన్, బాసూరు కాంతారావు, కొడెం విజయకుమార్, కొరికాన గంగునాయుడు, కోరాడ సూర్యనారాయణబాబు, కోరాడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రచారంలో పెద్దసంఖ్యలో పాల్గొన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు -
తొలిరోజు బోణీ ఒకటి!
● ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ● స్వతంత్ర అభ్యర్థిగా జయరాజు నామినేషన్ సాక్షి, పార్వతీపురం మన్యం: సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టానికి అడుగుపడింది. జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిషాంత్కుమార్ గురువారం విడుదల చేశారు. వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. ఈ మేరకు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. తొలిరోజు కురుపాం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఒక నామినేషన్ దాఖలైంది. బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన నిమ్మక జయరాజు స్వతంత్ర అభ్యర్థిగా కురుపాం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్వో వీవీ రమణకు ఒక సెట్ నామినేషన్ను అందజేశారు. ఆయన కురుపాం అసెంబ్లీ స్థానంతోపాటు, అరకు ఎంపీ స్థానానికి కూడా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఏకాదశి కావడంతో వైఎస్సార్సీపీ కురుపాం అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి, పాలకొండ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి, సాలూరు అభ్యర్థి పీడిక రాజన్నదొర నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కూటమి అభ్యర్థులు 20వ తేదీ నుంచి 24వ తేదీలోపు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామి నేషన్ ఉపసంహరణకు 29న మధ్యాహ్నం 3 గంట ల వరకు అవకాశం కల్పించారు. అనంతరం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. మే 13వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్లను స్వీకరించేందుకు పార్వతీపురం కలెక్టరేట్లో ఏర్పాట్లు చేశారు. పాలకొండ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. పార్వతీపురం శాసనసభ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయంగా రెవెన్యూ డివిజ నల్ కార్యాలయం, సాలూరు, కురుపాం శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా తహసీల్దా ర్ కార్యాలయాలను రిటర్నింగ్ అధికారి కార్యాలయాలుగా నిర్ణయించారు. ఆ మేరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అభ్యర్థుల ఖాతాలో ఖర్చు లెక్కింపు నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో గురువా రం నుంచే అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులను వారి ఖాతాలో నమోదు చేస్తా రు. పత్రికల్లో వచ్చే పెయిడ్ న్యూస్, ప్రకటనలు, వార్తలను సైతం వారి ఖాతాల్లోనే లెక్కిస్తారు. అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి రూ.40 లక్షలు, ఎంపీ అభ్యర్థి రూ.95 లక్షల వరకు ఖర్చుపెట్టొచ్చు. గిరిజన గ్రామాల్లో పోలీసుల కవాతుమక్కువ: మండలంలోని గిరిజన గ్రామం నందలో పోలీసులు గురువారం కవాతు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించేందుకు పోలీసులు ముందస్తుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేర కు ఎస్సై పి.నరసింహహమూర్తి ఆధ్వర్యంలో ఆర్పీఎఫ్ బలగాలు గ్రామంలో పర్యటించాయి. ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఎటువంటి ప్రలోభాలకు లొంగరాదని ఈ సందర్భంగా పోలీసులు పిలుపునిచ్చారు. గ్రామంలో మద్యం విక్రయించరాదని, ఎటువంటి సమాచారం తెలిసిన పోలీసులకు తెలియజేయాలని కోరారు. -
హ్యాట్రిక్ సాధిస్తా
● అభివృద్ధి, సంక్షేమమే విజయానికి శ్రీరామరక్ష ● వైఎస్సార్సీపీ కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి పుష్పశ్రీవాణిసాక్షి: మీ కృషితో మంజూరైన కురుపాంలోని గిరిజన ఇంజినీరింగ్ కళాశాల పనులు ఎంత వరకు వచ్చాయి? ఈ కళాశాల ఏర్పాటు వల్ల ఏ మేరకు ఉపయోగం ఉంటుంది? జవాబు: కురుపాం చరిత్రలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన ఇంజినీరింగ్ కళాశాలను 105 ఎకరాల విస్తీర్ణంలో రూ.190 కోట్ల అంచనా విలువతో చేపట్టిన పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ కళాశాల నిర్మాణం పూర్తయితే పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో ఉన్న కురుపాం, పాలకొండ, పార్వతీపురం, సాలూరు ప్రాంతాల నిరుపేద గిరిజన విద్యార్థులకు మెరుగైన ఉన్నత విద్య అభ్యసించే అవకాశం ఉంటుంది. సాక్షి: త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో మీ ప్రచారం ఎలా సాగుతోంది? ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? జవాబు: నియోజకవర్గంలో ప్రణాళిక ప్రకారం ప్రచారం చేస్తున్నాం. ప్రచారం ఎంతో బాగా జరుగుతోంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా స్వచ్ఛందంగా వస్తున్నారు. దీనికి ముఖ్య కారణం తమ ప్రభుత్వంపైన ఉన్న నమ్మకం, అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే. కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణిసాక్షి: నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమిటి? జవాబు: నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న మౌలిక సదుపాయాలైన రహదారులు, విద్య, వైద్యం, తాగునీరు సమస్యలకు పరిష్కారం చూపించాను. రూ.1,045 కోట్లతో గిరిజన సంక్షేమ, పంచాయతీరా జ్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, ఎన్ఆర్ఈజీఎస్ శాఖల ద్వారా రహదా రులు, తాగునీరు, నాడు–నేడు పథకంలో పాఠశాలల అభివృద్ధి, సుందరీకరణ, ఆస్పత్రులకు అదనపు గదుల నిర్మాణం, మెరుగైన వైద్యసేవలు అందేలా పూర్తిస్థాయిలో వైద్యసిబ్బంది నియామకం చేపట్టాం. సంక్షేమ పథకాల మంజూ రులో పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను గుర్తించి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే ఐదేళ్ల పాలనలో రూ.1700 కోట్లు జమచేశాం. సాక్షి: వైఎస్సార్సీపి ప్రభుత్వ హయాంలో గిరిజన రైతులకు ఏ మేరకు మేలు జరిగింది.జవాబు: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన రైతులు పోడు భూములపై సాగు మాత్రమే చేసుకునే వారు. వారికి ఎటువంటి హక్కు పత్రాలు ఉండేవి కావు. అయితే వైఎస్సార్సీపి ప్రభుత్వం వచ్చిన తరువాత కురుపాం నియోజకవర్గంలో 32,300 మందికి 68,811.78 ఎకరాలకు సంబంధించి ఆర్ఓఎఫ్ఆర్, డీకేటి పట్టాలను అందజేశాం. అంతేకాకుండా వారందరికీ ప్రతి ఏడాది పెట్టుబడి సాయం కింద వైఎస్సార్ రైతు భరోసా సొమ్ము అందుతుండడంతో సంతోషంగా ఉన్నారు. సాక్షి: నియోజకవర్గంలో పరిష్కరించాల్సిన ప్రధాన సమస్యలేమిటి?జవాబు: కొమరాడ మండలంలోని పూర్ణపాడు–లాభేసుపై వంతెన నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. గత టీడీపీ ప్రభుత్వం అరకొరగా నిధులు మంజూరు చేసిన కారణంగా వంతెన నిర్మాణం సగంలోనే నిలిచిపోయింది. దీంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత కొత్తరేట్లకనుగుణంగా మరో రూ.7 కోట్లు టీఎస్పీ గ్రాంట్ మంజూరు చేసింది. మొత్తం రూ.14 కోట్లతో వంతెన నిర్మాణం పూర్తయ్యేలా కృషి చేస్తున్నాం. అలాగే 1976వ సంవత్సరం నుంచి అభివృద్ధికి నోచుకోని జియ్యమ్మవలస మండలంలోని వట్టిగెడ్డ జలాశయం అభివృద్ధికి చర్యలు చేపట్టాం. ఈ జలాశయం వల్ల ఎంతోమంది రైతులకు మేలు జరుగుతుంది. ఈ నేపథ్యంలో జైకా నిధులు రూ.44.85 కోట్లతో పనులు జరిగేలా చర్యలు చేపడుతున్నాం. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కురుపాం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమమే నియోజకవర్గం ప్రజలు తనపట్ల చూపిస్తున్న అంతులేని ప్రేమాభిమానాలకు కారణమని వైఎస్సార్సీపీ కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి అంటున్నారు. 2014, 2019 ఎన్నికల్లో కురుపాం ఎమ్మెల్యేగా వరుసగా గెలుపొందిన పాముల పుష్పశ్రీవాణి ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయం నమోదు చేసేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో నియోజకవర్గానికి తాను అందజేసిన అభివృద్ధి, సంక్షేమఫలాలే వారధిగా నిలుస్తాయని ధీమాగా చెబుతున్నారు. దశాబ్దాలుగా టీడీపీ హయాంలో నియోజకవర్గంలో జరగని అభివృద్ధిని (రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం విషయంలో) వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో చేసి నియోజకవర్గ ప్రజల కళ్లముందు ఉంచి వారి ఆదరాభిమానాలు చూరగొన్నామని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు గురువారం ఆమె సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్న విశేషాలిలా ఉన్నాయి. –కురుపాం -
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆత్మహత్య
లక్కవరపుకోట : మండలంలోని ఒక చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకలపాటి శ్రీనివాసరావు (47)గురువారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఎస్ఐ ఆర్.గోపాలరావు తెలిపిన వివరాలు... నిందితుడు వారం రోజుల కిందట 8 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి యత్నించాడని బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆదివారం నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. కాగా అప్పటి నుంచి నిందితుడు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఆదివారం 10 గంటల ప్రాంతంలో ఎస్.కోట ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో పురుగులు మందు సేవించి అపస్మారక స్థితికి శ్రీనివాసరావు చేరుకోవడంతో స్థానికుల సహాయంతో ఎస్.కోట సీహెచ్సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆస్పత్రి సిబ్బంది కళ్లుగప్పి పరారయ్యాడు. దీంతో పోలీసులు నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం మండల కేంద్రం కిత్తన్నకట్టు గెడ్డ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెళ్లి పరిశీలించగా మృతదేహం నిందితుడు శ్రీనివాసరాజుగా గుర్తించారు. ఈ మేరకు మృతుడు తల్లి, తమ్ముడులకు సమాచారం అందించగా మృతదేహాన్ని వారు వచ్చి పరిశీలించి శ్రీనివాసరాజు అని నిర్ధారించారు. మృతుడు తల్లి పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపాలరావు తెలిపారు. -
పెళ్లింట విషాదం
● సారిసామగ్రి ఇచ్చేందుకు వెళ్తుండగా రోడ్డుప్రమాదం ● సంఘటన స్థలంలోనే మహిళ మృతి ● మరో పదకొండు మందికి తీవ్రగాయాలు పెళ్లింట విషాదంగుమ్మలక్ష్మీపురం/కురుపాం: వివాహానంతరం వధువుకు ఇవ్వాల్సిన సారి సామగ్రి ఇచ్చేందుకు వెళ్తుండగా మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదం పెళ్లివారింట విషాదం నింపింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా..మరో 11 మంది తీవ్రగాయాల పాలయ్యారు. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. కురుపాం మండలంలోని కాకితాడ గ్రామానికి చెందిన పెద్దింటి కాంతారావు, సరోజినిల కుమార్తె లిజితకు కొమరాడ మండలంలోని పూడేసు గ్రామానికి చెందిన యువకుడితో ఇటీవలే వివాహమైంది. వధువుకు సారిసామగ్రి ఇచ్చేందుకు కుటుంబసభ్యులు, బంధువులు గురువారం ట్రక్కర్లు్, ఆటోల్లో బయల్దేరారు. ఈ క్రమంలో అందరికంటే వెనుకగా వధువు సొంతకుటుంబీకులను తీసుకువెళ్తున్న ట్రక్కర్ రస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం సమీపంలో అదుపుతప్పి ప్రధానరహదారిలోని కల్వర్టుగోడను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆ వాహనంలో ఉన్న వధువు మేనత్త కమిడి కమల(55) అక్కడికక్కడే మృతిచెందగా..మృతురాలి తమ్ముడు పెద్దింటి భుజంగరావు, మరదలు సుజాత, మరో మేనకోడలు బి. సుగుణ, మేనకోడలి కుమారుడు చైతన్య, మేనకోడలు సుగుణ భర్త రవితో పాటు ఇతర కుటుంబసభ్యులు గంటా పవన్, లిమ్మ సుమన్, పాలక శశిరేఖ, పి.మారతమ్మ, ఎన్.పుష్పరాజ్లతో పాటు డ్రైవర్ తేజ తీవ్రగాయాలపాయ్యారు. ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించిన ఇతర కుటుంబసభ్యులు క్షతగాత్రులను హుటాహుటిన భద్రగిరి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కమలను పరీక్షించిన వైద్యాధికారి రవికుమార్ ఆమె అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అలాగే తల పుర్రెభాగంలో తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల బాలుడు చైతన్యతో పాటు మారతమ్మ, పుష్పరాజు, తదితరులను మెరుగైన వైద్యం నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈ సంఘటనపై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కురుపాం ఎస్సై ఎస్.షన్ముఖరావు తెలిపారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement