-
మొబైల్ గేమ్ పాస్వర్డ్ ఇవ్వలేదని యువకుని హత్య
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఆన్లైన్ మొబైల్ గేమ్ (ఫ్రీ ఫైర్) పాస్వర్డ్ షేర్ చేయలేదని ఓ యువకున్ని అతని స్నేహితులు హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కాల్చి అడవిలో పడేశారు. యువకుడి తల్లి ఫిర్యాదుతో ఈ భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాపాయి దాస్ (18) గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయాడు. దీంతో తల్లి పూర్ణిమా దాస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే పాపాయి దాస్ మృతదేహం జనవరి 15న అడవి సమీపంలో లభ్యమైంది. హత్యకు గల కారణాలను అన్వేషిస్తూ యువకుని స్నేహితులను విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొబైల్ గేమ్ (ఫ్రీ ఫైర్) పాస్వర్డ్ ఇవ్వనందుకు నలుగురు స్నేహితులు కలిసి యువకున్ని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు పాల్పడిన నలుగురు మైనర్ స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా జువైనల్ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదీ చదవండి: Manipur Violence: మణిపూర్లో మళ్లీ కాల్పులు.. ఐదుగురు పౌరులు మృతి -
డిస్నీ+ హాట్స్టార్ యూజర్లకు షాక్! నవంబర్ 1 నుంచే..
నెట్ఫ్లిక్స్ బాటలోనే డిస్నీ ప్లస్ హాట్స్టార్ (Disney+ Hotstar) కూడా తమ యూజర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. పాస్వర్డ్ షేరింగ్ను పరిమితం చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు పాస్వర్డ్ షేరింగ్పై ఆంక్షలు నవంబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు తెలియజేస్తూ సబ్స్క్రైబర్ ఒప్పందానికి సంబంధించిన అప్డేట్లను కెనడాలోని సబ్స్క్రైబర్లకు ఈ-మెయిల్ చేసింది. ది వెర్జ్ కథనం ప్రకారం.. అకౌంట్ పాస్వర్డ్ షేరింగ్పై డిస్నీ ప్లస్ హాట్స్టార్ కఠిన ఆంక్షలను తీసుకొస్తోంది. దీనికి సంబంధించి దాని వెబ్సైట్లోని హెల్ప్ సెంటర్ను కూడా అప్డేట్ చేసింది. యూజర్లు నిబంధనలను ఉల్లంఘించి పాస్వర్డ్ షేర్ చేయకుండా వారి అకౌంట్లను పర్యవేక్షించనుంది. కెనడియన్ సబ్స్క్రైబర్ ఒప్పందంలో "అకౌంట్ షేరింగ్"పై కొత్త నిబంధనను చేసింది. అందులో సబ్స్క్రయిబ్ అయిన యూజర్ల ఖాతాలను పర్యవేక్షిస్తామని కంపెనీ పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని, సబ్స్క్రిప్షన్ను శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించింది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ పాస్వర్డ్ షేరింగ్ ఆంక్షలు కెనడాలో 2023 నవంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి. భారత్తో సహా ఇతర దేశాల్లో కూడా ఈ ఆంక్షలను అమలు చేయాలని డిస్నీ ప్లస్ హాట్స్టార్ భావిస్తోంది. -
నెట్ఫ్లిక్స్ బాటలో డిస్నీ+ హాట్స్టార్ - అదే జరిగితే..
Disney Hotstar Limit Account Sharing: ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ భారతదేశంలో పాస్వర్డ్ షేరింగ్ను ముగించినట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో 'డిస్నీ+ హాట్స్టార్' (Disney+ Hotstar) కూడా ఇదే బాటలో పయనించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, డిస్నీ+ హాట్స్టార్ దాని ప్రీమియం వినియోగదారులలో పాస్వర్డ్ షేరింగ్ను పరిమితం చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే వినియోగదారులు కేవలం నాలుగు పరికరాల నుంచి మాత్రమే లాగిన్ చేయడానికి అనుమతించే కొత్త విధానాన్ని అమలు చేయాలని సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే అమలులోకి వస్తే స్ట్రీమింగ్ దిగ్గజం పాస్వర్డ్ షేరింగ్ వినియోగదారులకు కష్టతరమవుతుంది. పాస్వర్డ్ షేరింగ్ విధానానికి నెట్ఫ్లిక్స్ మంగళం పాడింది. ఇప్పటికే 100 కంటే ఎక్కువ దేశాల్లో ఇది అమలులో ఉంది. ప్రస్తుతం మనదేశంలో ప్రీమియం డిస్నీ+ హాట్స్టార్ ద్వారా గరిష్టంగా 10 పరికరాలలో లాగిన్లను అనుమతిస్తుంది. కానీ దీనికి త్వరలోనే స్వస్తి చెప్పనుంది. కొత్త రూల్స్ ఈ ఏడాది చివరి నాటికి అమలయ్యే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: ఆలోచన చెప్పగానే అమ్మతో చీవాట్లు.. నేడు నెలకు రూ.4.5 కోట్లు టర్నోవర్!) కొత్త రూల్స్ అమలులోకి వచ్చిన తరువాత వినియోగదారులు సొంత సభ్యత్వాన్ని పొందాల్సి ఉండవచ్చు. అయితే రానున్న కొత్త మార్పులు చౌకైన ప్లాన్లకు కూడా వర్తిస్తాయా? లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా ఇప్పటికే అధిక ప్రజాదరణ పొందిన డిస్నీ+ హాట్స్టార్ 2022 మార్చి నుంచి 2023 మార్చి వరకు 38 శాతం వీక్షకులను కలిగి ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కొత్త రూల్స్ అమలులోకి వచ్చిన తరువాత వినియోగదారుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుస్కోవడానికి ఇంకా కొంతకాలం వేచి ఉండాల్సిందే. -
షాకింగ్ న్యూస్.. నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ షేరింగ్ ఇక నో ఛాన్స్!
Netflix Password Sharing End: ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ భారతదేశంలో పాస్వర్డ్ షేరింగ్ను ముగించినట్లు ప్రకటించింది. ఒక వ్యక్తి మాత్రమే ఒక ఖాతాను యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఉచితంగా షేర్ చేసే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు అమలులోకి వచ్చిన కొత్త నిబంధనలు ఈ విధానానికి చరమగీతం పాడింది. సంస్థ ఈ నిర్ణయం గురించి గతంలోనే వెల్లడించింది. కాగా ఇప్పటికి అమలు చేసింది. ఒక కుటుంబంలో నెట్ఫ్లిక్స్ అకౌంట్ కలిగి ఉన్న వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు, ప్రయాణ సమయంలో కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉండేలా ఒక కొత్త ఫీచర్ అందించనున్నట్లు స్ట్రీమింగ్ దిగ్గజం ఒక ప్రకటనలో తెలిపింది. దీని కోసం ఇమెయిల్ ప్రారంభించినున్నట్లు కంపెనీ తెలిపింది. (ఇదీ చదవండి: ఏఐతో కొత్త రకం మోసం - తెలిసిన ముఖమే అనుకున్నారో..) గత మేలో నెట్ఫ్లిక్స్ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్, మెక్సికో, బ్రెజిల్ వంటి ప్రముఖ మార్కెట్లతో సహా 100 కంటే ఎక్కువ దేశాల్లో పాస్వర్డ్ షేరింగ్పై పరిమితులను విధించింది. కాగా ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ రూల్స్ అమలులోకి వచ్చేసాయి. సంస్థ ఇటీవల విడుదల చేసిన ఒక డేటా ప్రకారం ముగిసిన త్రైమాసికంలో మొత్తం 238 మిలియన్ల సబ్స్క్రైబర్లతో 1.5 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించినట్లు తెలిసింది. -
సైబర్ సేఫ్టీకి 5 S సూత్రం.. పాస్వర్డ్ల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి!
రోజువారీ జీవితంలో స్మార్ట్ఫోన్లలోనే సగం సమయం గడిచిపోతోంది. సోషల్ మీడియా యాప్స్ వాడకం మొదలు ఆన్లైన్ ఆర్డర్లు, ఆన్లైన్ బ్యాంకు లావాదేవీల వరకు పని ఏదైనా ఫోన్, ఇంటర్నెట్ వినియోగం తప్పనిసరైంది. టెక్నాలజీ వాడకంతో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో అంతేస్థాయిలో సైబర్ ముప్పు పొంచి ఉంటుంది. అందుకే సైబర్ జమానాలో సేఫ్గా ఉండేందుకు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొన్ని సూచనలు చేసింది. 5ఎస్ సూత్రాన్ని పాటిస్తే సురక్షితంగా ఉండొచ్చని పేర్కొంది. ఏమిటి ఆ 5ఎస్? స్ట్రాంగ్ అండ్ యూనిక్ పాస్వర్డ్, సెక్యూర్ నెట్వర్క్, సెక్యూర్ వెబ్సైట్స్ లేదా యాప్స్, సాఫ్ట్వేర్ అప్డేట్స్, సస్పీషియస్ లింక్ అలర్ట్...కలిపి 5 ఎస్లుగా పోలీసులు సూత్రీకరించారు. స్ట్రాంగ్ పాస్వర్డ్ మనం సోషల్ మీడియా ఖాతాలకు, ఆన్లైన్ బ్యాంకు ఖాతాలకు, ఈ–మెయిల్స్కు వేర్వేరు పాస్వర్డ్లు పెట్టుకోవడం ఉత్తమం. ఒకటే పాస్వర్డ్ను అన్నింటికీ పెట్టడం రిస్క్ అని గుర్తించాలి. పాస్వర్డ్లో వీలైనంత వరకు మన పేరు, బర్త్డే తేదీలు, పిల్లల పేర్లు లేకుండా చూసుకోవడం ఉత్తమం. పాస్వర్డ్ను అంకెలు, క్యారెక్టర్లు, పెద్ద, చిన్న అక్షరాల మిళితంగా పెట్టుకోవాలి. పాస్వర్డ్లను ఇతరులకు షేర్ చేయవద్దు. సెక్యూర్ వెబ్సైట్స్, యాప్స్, సెక్యూర్ నెట్వర్క్.. మనం వాడే వెబ్సైట్లు, డౌన్లోడ్ చేసుకొనే యాప్స్ సరైనవేనా అన్నది ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలి. యాప్లను డౌన్లోడ్ చేసే ముందు ఆ యాప్ రేటింగ్ పరిశీలించాలి. సాఫ్ట్వేర్ అప్డేట్స్.. మొబైల్ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లను ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్తో అప్డేట్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల సైబర్ దాడుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. సరైన యాంటీవైరస్ సాఫ్ట్వేర్లను వినియోగించుకోవాలి. సస్పీషియస్ లింక్ అలర్ట్... మనకు మెసేజ్లు, వాట్సాప్ సందేశాలు, ఈ–మెయిల్స్ రూపంలో వచ్చే మెసేజ్లలోని అనుమానాస్పద లింక్లపై ఎట్టిపరిస్థతుల్లోనూ క్లిక్ చేయవద్దు. చాలా తక్కువ అక్షరాలతో ఉండే లింక్లు చాలా వరకు అనుమానాస్పదమైనవని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అక్షర దోషాలు ఉన్న లింక్లు సైతం అనుమానాస్పదమైనవని తెలుసుకోవాలి. -
నెట్ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాక్!
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాకిచ్చింది. పాస్వర్డ్ షేరింగ్పై అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమైంది. దీంతో అమెరికాతో పాటు ప్రపంచంలోని 100 దేశాల్లో నెట్ఫ్లిక్స్ యూజర్లు వారి అకౌంట్లను కుటుంబసభ్యులకు, స్నేహితులకు ఉచితంగా షేర్ చేసే అవకాశాన్ని కోల్పోనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి కారణంగా నెట్ఫ్లిక్స్ కొత్త ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తుంది. ఇందులో భాగంగా పాస్ వర్డ్ షేరింగ్పై అదనపు ఛార్జీలు, యాడ్ సపోర్ట్ ఆప్షన్ వంటి ఫీచర్లను ఎనేబుల్ చేసింది. 103 దేశాల యూజర్లకు ఇ-మెయిల్స్ నెట్ఫ్లిక్స్ మంగళవారం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్, మెక్సికో, బ్రెజిల్ పాటు పాస్ వర్డ్ షేరింగ్పై అదనపు ఛార్జీల్ని వసూలు చేస్తున్నట్లు 103 దేశాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యూజర్లకు మెయిల్ పెట్టింది. ఆ ఇ-మెయిల్స్లో నెట్ఫ్లిక్స్ యూజర్లు ఒక అకౌంట్ను ఒకరే వినియోగించుకోవాలని, ఇతరులకు షేర్ చేస్తే అమెరికా యూజర్లు అదనపు ఛార్జీల కింద 8 డాలర్లను (భారత కరెన్సీలో రూ.700డాలర్లు) విధిస్తున్నట్లు పేర్కొంది. 100 మిలియన్లకు పైగా 100 మిలియన్లకు పైగా కుటుంబాలు తమ లాగ్-ఇన్ వివరాలు ఇతర కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేసినట్లు కంపెనీ అంచనా వేసింది. కాగా, మార్చి చివరి నాటికి, నెట్ఫ్లిక్స్ చెల్లింపు కస్టమర్లు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 232.5 మిలియన్లు సబ్స్క్రిప్షన్ యూజర్లు ఉన్నారు. కొత్త పాలసీల ప్రకారం, ఒకే కుటుంబ సభ్యులు నెట్ఫ్లిక్స్ ఖాతాను వీక్షించవచ్చు. ప్రయాణంలో ఇతర డివైజ్లలో లాగిన్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ తెలిపింది. చదవండి👉 భారత్లో టెస్లా.. త్వరలో కార్ల తయారీ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటాం! -
పాస్ వర్డ్ పిన్ అవసరం లేకుండానే ఫోన్ పే పేమెంట్స్...
-
గూగుల్ సంచలన నిర్ణయం..!
-
గూగుల్ సరికొత్త సంచలనం.. లాగిన్ అవ్వాలంటే పాస్వర్డ్ అవసరం లేదు!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాస్వర్డ్ లేకుండా యాప్స్, వెబ్సైట్స్ లాగిన్ అయ్యేలా సరికొత్త ఫీచర్ను విడుదల చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు యూజర్ ఎక్స్పీరియన్స్ను సులభతరం చేసేలా బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ఆధారిత ఫింగర్ ప్రింట్స్, ఫేసియల్ రికగ్నైజేషన్, స్క్రీన్ లాక్ పిన్స్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఈ తరుణంలో గూగుల్ అకౌంట్ యూజర్లు పాస్వర్డ్ లేకుండా లాగిన్ అయ్యేలా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. పాస్వర్డ్ 123లకు గుడ్బై ప్రస్తుతం, ఏదైనా వెబ్సైట్, యాప్లలో లాగిన్ అవ్వాలంటే యూజర్ ఐడీతో పాటు పాస్వర్డ్ 123, పాస్వర్డ్ 123@$ ఈ తరహాలో పాస్వర్డ్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా బయోమెట్రిక్ అథంటికేషన్ ఆధారిత ‘పాస్కీస్’ ఆప్షన్తో సంప్రదాయ పాస్వర్డ్లైన పాస్వర్డ్ 123లకు స్వస్తిపలకనుంది. వచ్చే ఏడాది వరల్డ్ పాస్వర్డ్డే నాటికి యూజర్లు వినియోగించేలా ఈ పాస్కీస్ ఆప్షన్ను అందుబాటులోకి తేనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. పాస్కీస్ అంటే? పాస్కీస్ అంటే ఫేస్ఐడీ, టచ్ ఐడీ ఆధారిత బయోమెట్రిక్ అథంటికేషన్ విధానం. దీని సాయంతో 123 తరహా పాస్వర్డ్ల అవసరం ఉండదు. వెబ్ అథింటిక్ ఆధారిత ఫేస్ఐడీ లేదా టచ్ ఐడీలను ఉపయోగించి యాప్స్లో లేదంటే వెబ్సైట్లలో లాగిన్ అయ్యేలా సౌకర్యం కలగనుంది. పాస్కీస్ టెక్నాలజీ ఎప్పుడు వెలుగులోకి వచ్చిందంటే టెక్నాలజీ వినియోగంతో పెరిగిపోతున్న సైబర్ నేరాల్ని అరికట్టేందుకు 2009లో పాస్కీస్ విధానం వినియోగిస్తే బాగుండేదన్న ఆలోచన వచ్చింది. కానీ ఆచరణకు నోచుకోలేదు. అయితే 2012లో అంతర్జాతీయ చెల్లింపుల సంస్థ పేపాల్ దిగ్గజ టెక్ కంపెనీలతో కలిసి పాస్వర్డ్ల స్థానంలో బయోమెట్రిక్ టెక్నాలజీ వినియోగం కోసం పనిచేసేలా ఓ ఒప్పందానికి వచ్చాయి. ఫిడోలో గూగుల్ భాగస్వామ్యం అలా జులై 2012లో ఫాస్ట్ ఐడెంటిఫై ఆన్లైన్(Fast Identity Online (FIDO) పేరుతో ఓ సంస్థను స్థాపించాయి. 2013లో ఫిడోలో గూగుల్ సైతం చేరింది. ఆ మరుసటి ఏడాది అంటే 2014లో పేపాల్ - శాంసంగ్ కలిసి ఫిడో అభివృద్ది చేసిన అథంటికేషన్ను శాంసంగ్ గెలాక్సీ ఎస్ 5 స్మార్ట్ ఫోన్లలో ఈ ఆప్షన్ను ఎనేబుల్ చేసింది. దీని సాయంతో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 5 స్మార్ట్ ఫోన్లలో పేపాల్ యూజర్లు ఆన్లైన్ షాపింగ్ చేయాలంటే పాస్వర్డ్ లేకుండా స్వైప్ చేసి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. గూగుల్ పాస్కీస్ ప్రయోగం తాజాగా పాస్కీస్ ఫీచర్ తెచ్చేందుకు గూగుల్ ప్రయోగాలు ముమ్మరం చేసింది. ఫిడో అలయన్స్లో ఉన్న ఇతర టెక్ సంస్థలైన యాపిల్, మైక్రోసాఫ్ట్ పాస్కీస్ ప్రాజెక్ట్పై కలిసి పనిచేస్తుంది. ఆ ప్రాజెక్ట్ చివరి దశలో ఉందని , వచ్చే ఏడాది మే 2 వరల్డ్ పాస్వర్డ్ డే రోజున పాస్వర్డ్ల స్థానంలో పాస్కీస్ ఆప్షన్ను గూగుల్ తేనున్నట్ల నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 ఫోన్పే యూజర్లకు అలర్ట్: చిన్న చిన్న లావాదేవీల కోసం పిన్ అక్కర్లేదు! -
పేపర్ లీకేజీలో బిగ్ ట్విస్ట్.. ప్రధాన సూత్రధారి రాజశేఖర్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో సిట్ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ప్రధాన నిందితుడు ప్రవీణ్ అయినప్పటికీ.. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన సూత్రధారి రాజశేఖర్ అని తేల్చింది సిట్. ఈ మేరకు టీఎస్పీఎస్సీకి శుక్రవారం తన నివేదికను అందించింది. టీఎస్పీఎస్సీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా పని చేసేవాడు రాజశేఖర్. అయితే.. గతంలో టెక్నికల్ సర్వీస్లో పని చేసే రాజశేఖర్.. ఉద్దేశపూర్వకంగానే డిప్యూటేషన్పై వచ్చాడు. అక్కడ కంప్యూటర్ను హ్యాక్ చేసి పాస్వర్డ్ను దొంగిలించినట్లు సిట్ అనుమానిస్తోంది. ఇక విధుల్లో చేరాక.. ప్రవీణ్తో సంబంధాలు నడిపాడు రాజశేఖర్. దాదాపు ఐదు పరీక్షా పత్రాలను పెన్డ్రైవ్లో కాపీ చేసి ప్రవీణ్కు ఇచ్చాడు. ఫిబ్రవరి 27నే పేపర్ను కాపీ చేశాడు రాజశేఖర్. అదే తేదీన రాజశేఖర్కు అందించాడు. ఇందులో గ్రూప్-1 పరీక్షాపత్రంతో పాటు జూలైలో జరగాల్సిన జూనియర్ లెక్చర్ పరీక్ష ప్రశ్నాపత్రం సైతం ఉందని సిట్ దర్యాప్తులో తేలింది(అందుకే పరీక్షలు వాయిదా వేసింది కమిషన్). ఆపై ప్రవీణ్.. రేణుకను పేపర్లను అమ్మేశాడు. అదే సమయంలో ప్రవీణ్కు 103 మార్కులు రావడంపై సిట్ విచారణ జరుపుతోంది. సెక్రటరీ దగ్గర పీఏగా చేస్తూ గ్రూప్-1 పరీక్షా పత్రాన్ని కొట్టేసినట్లు నిర్ధారించుకుంది సిట్. మరోవైపు పాస్వర్డ్ ఎలా బయటకు వచ్చిందనే విషయంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ప్రవీణ్ పాస్వర్డ్ను శంకర్ లక్ష్మి అనే ఉద్యోగి డైరీ నుంచి కొట్టేశానని చెబుతున్నాడు. అయితే ఆమె మాత్రం పాస్వర్డ్ను తాను డైరీలో రాయలేదని చెబుతోంది. ఈ తరుణంలో.. శంకర్ లక్ష్మీ పాత్రపైనా దర్యాప్తు కొనసాగిస్తోంది సిట్. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులకు ఆరు రోజుల కస్టడీ విధించింది కోర్టు. దీంతో.. రేపటి నుంచి సిట్ వీళ్లను ప్రశ్నించనుంది. -
భారీగా తగ్గిన నెట్ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఛార్జీలు!
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. చేజారిపోతున్న సబ్స్కైబర్ల సంఖ్యను పెంచేలా 30 కి పైగా దేశాల్లో సబ్ స్క్రిప్షన్ ఛార్జీలను తగ్గించింది. ఈజిప్ట్, యెమెన్,జోర్డాన్, లిబియా, ఇరాన్, కెన్యా, క్రొయేషియా,స్లోవేనియా, బల్గేరియా, నికరాగ్వ, ఈక్వెడార్, వెనుజెలా, మలేసియా, ఇండోనేసియా, వియత్నాం, థాయ్లాండ్తో పాటు మరికొన్ని దేశాల్లో సబ్స్క్రిప్షన్ ఫీజును భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది. అయితే తగ్గించిన దేశాల్లో భారత్ లేకపోవడం గమనార్హం. ఓటీటీ దిగ్గజం గత కొంత కాలంగా పాస్వర్డ్ షేరింగ్పై సర్ ఛార్జీలు వసూలు చేస్తుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సబ్స్క్రిప్షన్ చేసుకునే వారి సంఖ్య భారీగా తగ్గింది. దీంతో యూజర్లను తిరిగి రాబట్టుకునేలా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా, సబ్ సహారన్ ఆఫ్రికా , మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా, సెంట్రల్ అండ్ ఈస్ట్రన్ యూరప్ , ఏసియా పసిఫిక్ లాంటి రీజియన్స్లో 20 నుంచి 60 శాతం వరకు ఛార్జీలను తగ్గించింది. ఈ సందర్భంగా నెట్ఫ్లిక్స్ యాజమాన్యం మాట్లాడుతూ.. ప్రతి నెలా బేసిక్ ప్లాన్ను కొత్తగా వచ్చే యూజర్లకు, ఇప్పటికే వినియోగిస్తున్న యూజర్లు 28 మలేసియన్ రింగిట్స్కే అదిస్తున్నట్లు ట్వీట్ చేయగా.. ఇండియన్ కరెన్సీలో రూ.653 చెల్లించాల్సి ఉంది. కాగా, గతంలో నెట్ఫ్లిక్స్ ప్లాన్ బేసిక్ ధర 35 మలేసియన్ రింగిట్స్ ఉండేది. -
యూజర్లకు స్విగ్గీ షాక్.. పాస్వర్డ్ షేరింగ్ కుదరదు!
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ యాజర్లకు షాక్ ఇచ్చింది. స్విగ్గీ వన్ పేరుతో తీసుకొచ్చిన మెంబర్షిప్ ప్రోగ్రామ్కు గరిష్టంగా రెండు ఫోన్లలో మాత్రమే లాగిన్ అయ్యేలా పరిమితి విధించింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ కూడా ఇదివరకే ఇలాంటి పాస్వర్డ్ షేరింగ్ పరిమితిని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పాస్వర్డ్ షేరింగ్ ద్వారా యూజర్లు తగ్గిపోవడమే కాకుండా తమ ఆదాయానికి కూడా గండి పడుతుండటంతో స్విగ్గీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్విగ్గీ వన్ సబ్స్క్రిప్షన్ చేసిన మార్పులపై స్విగ్గి తమ యూజర్లందరికీ ఈ-మెయిల్స్ పంపించింది. దీని ప్రకారం స్విగ్గీ వన్ కస్టమర్లు ఒకే అకౌంట్ను రెండు కంటే ఎక్కువ ఫోన్లలో వినియోగించలేరు. స్విగ్గీ వన్ వ్యక్తిగత వినియోగానికి మాత్రమే ఉద్దేశించిందని, తాజాగా తీసుకొచ్చిన పరిమితితో దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. కాగా ఈ మెంబర్షిప్ ప్లాన్ కోసం కస్టమర్ల నుంచి నెలకు రూ.75లను స్విగ్గీ తీసుకుంటోంది. అదే మూడు నెలలకు అయితే రూ.299, సంవత్సరానికైతే రూ.899 చెల్లించాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: Lava Blaze 5G: రూ.11 వేలకే 5జీ స్మార్ట్ఫోన్.. ఫీచర్స్ మాత్రం అదుర్స్!) -
కొత్త ఏడాదిలో యూజర్లకు షాక్.. ఆ ఓటీటీ పాస్వర్డ్ షేర్ చేస్తే పైసలు కట్టాలి!
కరోనా లాక్డౌన్ కారణంగా ఓటీటీ చూసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇది వందల కోట్ల నుంచి వేల కోట్ల మార్కెట్గా అవతరించింది. ఇందులో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ అత్యంత జనాదరణ పొందడంతో పాటు కాస్త ఖరీదైన ఓటీటీగా పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరంలో నెట్ఫ్లిక్స్ తన కస్టమర్లకు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. యూజర్లకు షాక్.. నో షేరింగ్ సంవత్సరాలుగా, నెట్ఫ్లిక్స్ తన చందాదారులను కోల్పోవడానికి పాస్వర్డ్ షేరింగ్ ప్రధాన కారణాలలో ఒకటిగా పేర్కొంది. ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, నెట్ఫ్లిక్స్ ఒక ఇంటిని దాటి పాస్వర్డ్ షేరింగ్ను నిలిపివేయడం ద్వారా ఈ సమస్యకు ముగింపు పలకాలని యోచిస్తోందట. ఓటీటీ సంస్థలు ఇప్పటి వరకు పాస్ వర్డ్ షేరింగ్ అవకాశాన్ని కల్పించాయి. ఒకరికి అకౌంట్ ఉంటే సుమారు నలుగురు పాస్ వర్డ్ షేర్ చేసుకునే అవకాశం ఉండేది. ఒక్కరు రీఛార్జ్ చేసుకుంటే మిగతా వారంతా ఉచితంగా కంటెంట్ ను చూసే అవకాశం ఉంటుంది. అయితే, ఇకపై పాస్ వర్డ్ షేరింగ్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ పాస్వర్డ్ షేరింగ్పై నిషేధానికి సంబంధించిన కొత్త విధానాన్ని 2023 లోపు యునైటెడ్ స్టేట్స్లో అమలు చేయనుంది. ఆ తర్వాత ఈ రూల్ని మిగిలిన దేశాలకు అమల్లోకి తీసుకురావాలిని నెట్ఫ్లిక్స్ భావిస్తోంది. ఇదిలా ఉండగా.. పాస్వర్డ్ షేరింగ్ బ్యాన్ కాకుండా, నెట్ఫ్లిక్స్ కొత్త నియమాన్ని కూడా అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూజర్లు వారి సబ్స్క్రిప్షన్ను ఉపయోగించి పే-పర్-వ్యూ కంటెంట్ను అద్దెకు తీసుకునేలా వీలు కల్పిస్తుంది. వీటితో పాటు నెట్ఫ్లిక్స్ అతి త్వరలోనే ప్రకటన-ఆధారిత సబ్స్క్రిప్షన్ ప్యాకేజీని ప్రారంభించే ప్లాన్లో ఉంది. దీని ట్రయల్స్ 2023లో మొదలుపెట్టేందుకు యోచిస్తోంది. నెట్ఫ్లిక్స్( Netflix ), అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), హెచ్బీఓ (HBO) వంటి ఓటీటీ ప్లాట్ఫాంలు ఇప్పటికే యునైటెడ్ కింగ్డమ్లో పాస్వర్డ్ షేరింగ్ చట్టవిరుద్ధం అని, ఇది తమ కాపీరైట్ చట్టానికి విరుద్ధమని పేర్కొన్నాయి. మరో వైపు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ రేటు కూడా గణనీయంగా పడిపోయింది. దీంతో నెట్ఫ్లిక్స్ యూజర్లుకు తమ పాస్వర్డ్లను ఇతరులతో షేరింగ్ చేసుకునే వెసలుబాటును నిలిపేవేయనుంది. చదవండి: అవును.. కొత్త ఏడాది కలిసొచ్చే కాలమే, ఎందుకో తెలుసా? -
బిగ్ షాక్: ఈ ఓటీటీ అకౌంట్ పాస్వర్డ్ షేర్ చేయాలంటే, పైసలు కట్టాల్సిందే!
గత సంవత్సర కాలంగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ గడ్డు కాలాన్ని చవి చూస్తోంది. కరోనా కారణంగా ఓటీటీ మార్కెట్ పుంజుకున్న, నెట్ఫ్లిక్స్ మాత్రం సబ్స్క్రైబర్లను పోగొట్టుకుంటూ డీలా పడింది. కొనసాగుతున్న ప్రతికూల ఆర్థిక పరిస్థితులు, OTTలో పెరుగుతున్న పోటీ, నెట్ఫ్లిక్స్లో ప్లాన్ల చార్జీలు అధికంగా ఉండడం కారణంగా ఇప్పటికే లక్షల్లో సబ్స్క్రైబర్లును కోల్పోయింది. అయితే దీని వెనుక ప్రధాన కారణాన్ని కనుగోంది. అదే యూజర్ అకౌంట్ పాస్వర్డ్ షేరింగ్. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు సరికొత్త ప్లాన్ని తీసుకురాబోతోంది. అదనపు చార్జ్ కట్టాల్సిందే! గతంలో నెట్ఫ్లిక్స్ యూజర్లు ఒక అకౌంట్కి నగదు చెల్లించి ఆ పాస్వర్డ్ ఇతరులకు షేర్ చేసేవాళ్లు. ఇకపై అలా కుదరదు. కస్టమర్లు తమ అకౌంట్లను ఇతర యూజర్లతో పంచుకోవాలంటే అదనపు ఛార్జీని చెల్లించాల్సి ఉంటుందని నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ నిర్ణయం 2023 నాటికి అమలులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే సబ్స్క్రైబర్లు తమ అకౌంట్ పాస్వర్డ్లను ఇతర వినియోగదారులతో షేరింగ్ కోసం ఎంత ఛార్జీ చెల్లించాలనే విషయాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. సమాచారం ప్రకారం నెట్ఫ్లిక్స్ వసూలు చేసే అదనపు రుసుము $3 నుంచి $4 మధ్య ఉండబోతుంది. కాస్త ఊపిరి పీల్చుకున్న నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్ మార్చి త్రైమాసికంలో దాదాపు 200,000 మంది, జూన్ త్రైమాసికంలో దాదాపు 970,000 మంది సబ్స్క్రైబర్ కోల్పోయినట్లు తెలిపింది. అయితే, మూడవ త్రైమాసిక ఆదాయ నివేదికలో, 2.41 మిలియన్ల సబ్స్క్రైబర్లను పొందినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో కస్టమర్ల సంఖ్యను పెంపుతో పాటు ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి, ఇటీవలే చౌకైన యాడ్-సపోర్టెడ్ ప్లాన్లను కూడా ప్రకటించింది. తాజాగా 2022 మూడో త్రైమాసికంలో 2.4 మిలియన్ల కొత్త సబ్స్క్రైబర్లు రావడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. చదవండి: బ్యాంక్ కస్టమర్లకు ఊహించని షాక్.. ఈ లావాదేవీలపై.. -
వార్నింగ్: ఆ వైరస్ కొత్త వెర్షన్తో వచ్చింది, ఇలా చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ!
ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్లకు అలర్ట్. డ్రినిక్ ఆండ్రాయిడ్ ట్రోజన్ కొత్త వెర్షన్ వెలుగులోకి వచ్చింది. డ్రినిక్ అనేది పాత మాల్వేర్. ఈ వైరస్ మీ ఫోన్ స్క్రీన్ రికార్డింగ్లతో వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకులకు సంబంధించి పిన్, సీవీవీ నంబర్లను తస్కరిస్తుంది. ఇప్పటికే 18 భారతీయ బ్యాంకులు ఈ వైరస్ భారిన పడినట్లు సమాచారం. ఈ మాల్వేర్ పట్ల అప్రమత్తం ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. వార్నింగ్: పాత వైరస్, కొత్త వెర్షన్.. ఏపీకే(APK) ఫైల్తో ఎస్ఎంఎస్(SMS) పంపడం ద్వారా యూజర్లను డ్రినిక్ లక్ష్యంగా చేసుకున్నట్లు నిపుణులు గుర్తించారు. ఇది iAssist అనే యాప్తో వచ్చింది. భారత్ ఆదాయపు పన్ను శాఖ అధికారిక పన్ను నిర్వహణ టూల్ మాదిరిగానే పనిచేస్తుంది. ఆదాయపు పన్ను రీఫండ్ల పేరుతో వినియోగదారలు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తుంది. 2016 లో వార్తల్లో నిలిచిన ఈ వైరస్ కొంత కాలం గ్యాప్ తీసుకుని ఆధునిక టెక్నాలజీ సామర్థ్యంతో అదే మాల్వేర్ లేటస్ట్ వెర్షన్ మళ్లీ దాడికి సిద్ధమైంది. భారత్లో యూజర్లను, 18 నిర్దిష్ట భారతీయ బ్యాంక్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంటోంది. ప్రస్తుతం ఉన్న ఈ బ్యాంకులలో, ఎస్బీఐ (SBI) వినియోగదారులను డ్రినిక్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత, కొన్ని ఆఫ్షన్స్తో అనుమతులు మంజూరు చేయమంటుంది. అలా అనుమతించిన యూజర్ల ఫోన్లలో ఎస్ఎంఎస్లను పొందడం, చదవడం, పంపడం, కాల్ లాగ్ను చదవడం, ఔట్ స్టోరేజీ చదవడం వంటివి చేస్తుంది. అంతేకాకుండా ఇది వినియోగదారుకు తెలియకుండానే నిర్దిష్ట విధులను నిర్వహించే అవకాశాన్ని పొందుతుంది. యాప్ నావిగేషన్, రికార్డ్ స్క్రీన్, కీ ప్రెస్లను క్యాప్చర్ చేయగలదు. యాప్ అన్ని అనుమతులతో పాటు దానికి కావలసిన ఫంక్షన్లకు యాక్సెస్ను పొందగానే వ్యక్తిగత వివరాలను సేకరిస్తుంది. జాగ్రత్త అవసరం థర్డ్ పార్టీ వెబ్సైట్ల నుంచి లేదా SMS ద్వారా ఏదైనా యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర (Google Play Store) లేదా యాపిల్ (Apple) యాప్ స్టోర్లో యాప్లను చెక్ చేయాలి. వాస్తవానికి ప్రాథమిక విధులను నిర్వహించేందుకు అన్ని యాప్లకు అనుమతి అవసరం లేదు. కానీ తెలియని యాప్కు ఎస్ఎంస్, కాల్స్కు సంబంధించిన అనుమతులను ఇవ్వకపోవడం ఉత్తమం. చదవండి: NammaYatri దూకుడు: ఓలా, ఉబెర్కు ఊహించని దెబ్బ -
నెట్ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాక్
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. త్వరలో పాస్వర్డ్ షేరింగ్పై అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమైంది. ఇటీవల నెట్ఫ్లిక్స్ క్యూ3 ఫలితాల్ని విడుదల చేసింది. ఫలితాల్లో స్ట్రీమింగ్ దిగ్గజం ఆదాయ పరంగా భారీ నష్టాలను చవిచూసింది. కానీ సబ్స్క్రిప్షన్ సంఖ్య భారీగా పెరిగింది. అందుకు పాస్వర్డ్ షేరింగ్ కారణమని పేర్కొంది. ఇప్పుడు కంపెనీ తన త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా పాస్వర్డ్ షేరింగ్పై అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ అదనపు ఛార్జీల నిబంధన వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రాన్నట్లు స్పష్టం చేసింది. అకౌంట్ షేరింగ్పై నెట్ఫ్లిక్స్ యాజమాన్యం మాట్లాడుతూ.. “అకౌంట్ షేరింగ్ను మానిటైజ్ చేసేందుకు ఆలోచనాత్మకమైన విధానాన్ని ప్రారంభించాము. 2023 ప్రారంభంలో దీన్ని మరింత విస్తృతంగా ప్రారంభిస్తాం. వినియోగదారుల అభిప్రాయాన్ని విన్న తర్వాత నెట్ఫ్లిక్స్ అందుబాటులో లేని చైనా,రష్యా మినాహాయించి మిగిలిన దేశాల్లో పాస్వర్డ్ షేరింగ్పై అదనపు రుసుమును విధిస్తాం’’ అని తెలిపింది. వినియోగదారులు పాస్వర్డ్ షేరింగ్పై ఎంత ఛార్జీలు వసూలు చేస్తుందనే అంశంపై నెట్ఫ్లిక్స్ స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ పలు నివేదికల ప్రకారం.. 3 డాలర్ల నుంచి 4 డాలర్ల మధ్యలో ఉండే అవకాశం ఉండనుంది. చదవండి👉 ఓలా సీఈవో భవిష్ అగర్వాల్పై సంచలన ఆరోపణలు! -
400 డేంజరస్ యాప్స్, మీ ఫోన్లలో ఇవి ఉంటే..వెంటనే ఇలా చేయండి!
సైబర్ నేరస్తులు తెలివి మీరారు. యూజర్ల మెటా యూజర్ల ఐడీ, పాస్వర్డ్లను దొంగిలించేందుకు 400 రకాలైన ప్రమాదకర యాప్స్ను తయారు చేశారు. ఆ యాప్స్ను సోషల్ మీడియా యూజర్లను వినియోగించేలా చేశారు. ఈ తరుణంలో మెటా ఆ యాప్స్ను గుర్తించింది. ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా ఫోన్లలో ప్రమాదకరమైన యాప్స్ చెప్పింది. మెటా యూజర్ల పాస్వర్డ్స్, వ్యక్తిగత సమాచారం దొంగించడానికే సైబర్ కేటుగాళ్లు ఇలాంటి యాప్స్ చేసినట్లు వెల్లడించింది. ఫొటో ఎడిటర్స్ గేమ్స్, వీపీఎన్ సర్వీసెస్, బిజినెస్తో పాటు ఇతర సర్వీసులు అందిస్తామంటూ సైబర్ నేరస్తులు యూజర్లకు యాప్స్ నోటిఫికేషన్లు పంపిస్తున్నారు. ఒకే వేళ నచ్చి యూజర్ వాటిని డౌన్లోడ్ చేసుకుంటే అంతే సంగతులు. ఎవరైతే యూజర్లు ఉన్నారో వారి వివరాల్ని సేకరించి.. వాటిని డార్క్ వెబ్లో అమ్ముకోవడంతో పాటు ఇతర అసాంఘీక కార్యకలాపాలకు వినియోగించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఆ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని మెటా తెలిపింది. సేఫ్గా ఉండాలంటే ఈజీ మనీకోసం సైబర్ నేరస్తులు తయారు చేసిన యాప్స్ను డౌన్లోడ్ చేసుకునే ముందు యాప్స్ రివ్వ్యూ, వాటి వివరాల్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఫేక్ రివ్వ్యూలతో యూజర్లను అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. అయితే.. ఏదైనా యాప్ మీరు దానిని ఇన్స్టాల్ చేసుకోకముందే లాగిన్ డీటెయిల్స్ అడిగితే వాటి జోలి వెళ్లకపోవడమే మంచిది. డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంటే ఓటీపీ ఆప్షన్ సెట్టింగ్ మార్చుకుంటే ఈ ప్రమాదం నుంచి బయటపడొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉మార్క్ జుకర్ బర్గ్ : ‘వర్క్ కంప్లీట్ చేయకపోతే..నిన్ను ఈ కత్తితో నరికేస్తా!’ -
పాస్వర్డ్ మేనేజర్ సంస్థకే హ్యాకర్ల షాక్:మూడు కోట్ల యూజర్ల భద్రత గోవిందేనా?
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఉపయోగించే పాస్వర్డ్ మేనేజర్, లాస్ట్పాస్కు హ్యాకర్లు భారీ షాకిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 33మిలియన్లకు పైగా ప్రజలు ఉపయోగించే పాస్వర్డ్ మేనేజర్ లాస్ట్పాస్కు సేబర్ కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఇటీవల సంస్థ సిస్టమ్స్లోకి ఎంట్రీ ఇచ్చి సోర్స్ కోడ్, యాజమాన్య సమాచారాన్ని దొంగిలించారని తెలుస్తోంది. అయితే దీని ప్రభావాన్ని అంచనా వేయడానికి కొంత సమయం పడుతుందని, కానీ తమ కస్టమర్ల భద్రతకు ఢోకా లేదని తెలిపింది. ఈ మేరకు సంస్థ ట్విటర్ ద్వారా సమాచారాన్ని వెల్లడించింది. అయితే తమ ఖాదారులు పాస్ట్వరర్డ్స్కు వచ్చిన ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసింది.ప్రస్తుతానికి వారుఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. లాస్ట్పాస్ నిర్వహణకు ఉద్యోగులు ఉపయోగించే సాఫ్ట్వేర్ డెవలపర్ లోకి "అనధికారిక పార్టీ" ప్రవేశించిందని తన పరిశోధనలో తేలిందని తెలిపింది. నేరస్థులు ఒక్క డెవలపర్ అకౌంట్కి మాత్రమే యాక్సెస్ పొందారని పేర్కొంది. అయితే సైబర్ సెక్యూరిటీ వెబ్సైట్ బ్లీపింగ్ కంప్యూటర్ రెండు వారాల క్రితమే ఉల్లంఘన గురించి లాస్ట్పాస్ అడిగిందని నివేదించింది. మరోవైపు లాస్ట్పాస్ తక్షణమే స్పందించి సమాచారం అందించడంపై కంప్యూటర్ సైబర్ సెక్యూరిటీ విశ్లేషకుడు అలెన్ లిస్కా సంతోషం వ్యక్తంచేశారు. అయితే చాలామందికి రెండు వారాలు చాలా ఎక్కువ సమయం అనిపించినప్పటికీ, పరిస్థితిని పూర్తిగా అంచనా వేయడానికి టీమ్స్కి కొంత సమయం పట్టొచ్చన్నారు. కానీ కస్టమర్ పాస్వర్డ్లను యాక్సెస్ చేసే అవకాశం లేదని లిస్కా చెప్పారు. ఇది ఇలా ఉంటే సోర్స్కోడ్, ప్రొప్రయిటరీ సమాచారాన్ని దొంగిలించిన హ్యాకర్లకు,కస్టమర్ల డేటా చోరీ చేయడంపెద్ద కష్టం కాదని, పాస్వర్డ్ వాల్ట్ల కీలను యాక్సెస్ చేసేసి ఉంటారని సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరుగా వ్యాపించాయి. అయితే ఈ అంచనాలపై లాస్ట్సాప్ స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా మాన్యువల్గా ఆధారాలను నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే తన యూజర్లకు నెట్ఫ్లిక్స్ లేదా జీమెయిల్ లాంటి బహుళ ఖాతాల కోసం హార్డ్-టు-క్రాక్, ఆటోమేటెడ్ జనరేటెడ్ పాస్వర్డ్లను అందిస్తుంది లాస్ట్పాస్. We recently detected unusual activity within portions of the LastPass development environment and have initiated an investigation and deployed containment measures. We have no evidence that this involved any access to customer data. More info: https://t.co/cV8atRsv6d pic.twitter.com/HtPLvK0uEC — LastPass (@LastPass) August 25, 2022 -
నెట్ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాక్..ఈ సారి మరో కొత్త దందా!
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ తీరు మార్చుకోవడం లేదు. ఫ్రీ పాస్వర్డ్ షేరింగ్ పేరుతో కొత్త దందా తెరతీయడంతో స్క్రైబర్లను కోల్పోయింది. భారీ నష్టాల్ని కొని తెచ్చిపెట్టుకుంది. అయినా ఆ సంస్థ తీరు మార్చుకోవడం లేదు. ఈ సారి సబ్ స్క్రైబర్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు వేసేందుకు మరో కొత్త ఎత్తుగడ వేసింది. నెట్ఫ్లిక్స్ ఇటీవల 'యాడ్ ఎక్స్ట్రా మెంబర్' అనే కాన్సెప్ట్ పేరుతో కొత్త ఆప్షన్ను అందుబాబులోకి తెచ్చింది. నెట్ఫ్లిక్స్ యూజర్లు వారి అకౌంట్ను ఇంటి కుటుంబ సభ్యులు కాకుండా బయటి వ్యక్తులు ఓపెన్ చేసి చూడాలంటే అందుకు అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ చీలి, కోస్టారికా, పేరు దేశాల్లో ట్రయల్స్ నిర్వహిస్తుంది. ఆ ట్రయల్స్ కొనసాగుతుండగా.. మరో ఆప్షన్ను ఎనేబుల్ చేసినట్లు నెట్ఫ్లిక్స్ తెలిపింది. అదనపు వసూళ్లు షురూ! నెట్ఫ్లిక్స్ అర్జెంటీనా, డొమినికన్ రిపబ్లిక్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాల,హోండురాస్తో సహా పలు దేశాల్లో 'యాడ్ ఏ హోం' పేరుతో మరో ఫీచర్ను డెవలప్ చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రారంభ దశలో ఉన్నా.. భవిష్యత్లో యాడ్ ఏ హోం పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేయనున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గతంలో ఈఏడాది చివరి నాటికి నెట్ఫ్లిక్స్ సబ్ స్క్రైబర్లు పాస్వర్డ్ షేరింగ్ చేస్తే అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని సూచించింది.కాబట్టి, కంపెనీ మరికొన్నినెలల్లో భారత్లో సైతం యాడ్ ఏ హోం ఫీచర్ సాయంతో అదనంగా డబ్బులు వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యాడ్ ఏ హోంపై అదనపు ఛార్జీలు ఎంతంటే? వచ్చే నెల నుంచి 'యాడ్ ఏ హోం' ఆప్షన్ను పైన పేర్కొన్న ప్రాంతాల్లో వినియోగంలోకి రానుంది. ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఈ ప్రాంతాల్లో నెట్ఫ్లిక్స్ అకౌంట్ను ఇంట్లో ఒకరు మాత్రమే వీక్షించే సౌలభ్యం ఉంది. అదే అకౌంట్ను మరో వ్యక్తి లాగిన్ అవ్వాలంటే అదనపు రుసుము చెల్లించాలి. ఉదాహరణకు అర్జెంటీనాలో అదనంగా 219 పెసోలు, ఇతర ట్రయల్ రన్ నిర్వహిస్తున్న ప్రాంతాలలో 2.99 డాలర్లు (అంచనా) చెల్లిస్తే ఆ అకౌంట్ను యాక్సెస్ చేయోచ్చు. ప్రస్తుతానికి, నెట్ఫ్లిక్స్ మనదేశంలో వినియోగదారులు తమ పాస్వర్డ్లను వారి కుటుంబేతర వ్యక్తులు వీక్షిస్తే ఎంత వసూలు చేస్తుందనే విషయంపై నెట్ఫ్లిక్స్ ప్రతినిధులు స్పష్టత ఇవ్వలేదు. నెట్ఫ్లిక్స్ ప్లాన్లలో నెట్ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్లో ఉన్న వినియోగదారులు అదనంగా ఒక ఇంట్లో వీక్షించే అవకాశం ఉంది. స్టాండర్డ్, ప్రీమియం వినియోగదారులు వరుసగా రెండు, మూడు ఇళ్లకు చెందిన సభ్యులు వీక్షించొచ్చు. ఇలా ప్లాన్ల వారీగా నెట్ఫ్లిక్స్ను వినియోగించుకోవాలంటే అదనపు చెల్లింపులు తప్పని సరి. నెట్ఫ్లిక్స్ను ఆదరిస్తున్నారు.. తప్పులేదు నెట్ఫ్లిక్స్లో ప్రసారమయ్యే సినిమాలు, వెబ్సిరీస్ను వీక్షకులు ఆదరిస్తున్నారు.ఇతర కుటుంబ సభ్యులకు,స్నేహితులతో పంచుకోవాలని అనుకుంటున్నారు. యూజర్లు చూడడం వేరు. వారి అకౌంట్లను ఇతరులకు షేర్ చేయడం వేరు. అకౌంట్లను షేర్ చేయడం వల్ల తలెత్తే ఇబ్బందులతో దీర్ఘకాలిక లక్ష్యాల్ని చేరుకోలేమని నెట్ఫ్లిక్స్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ డైరెక్టర్ చెంగీ లాంగ్ చెప్పారు. చదవండి: తగ్గేదేలే: నెట్ ఫ్లిక్స్ షాకింగ్ నిర్ణయం, లక్షల అకౌంట్లు బ్యాన్! -
వినియోగదారులకు నెట్ఫ్లిక్స్ బంపరాఫర్!
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కాస్ట్ ఎక్కువగా ఉండడం, పాస్వర్డ్ షేరింగ్ అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని ప్రకటించడంతో జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో 2లక్షమంది వినియోగదారుల్ని కోల్పోయింది. 30శాతం షేర్లు నష్టపోయాయి. క్యూ2లో మరో 20లక్షల వినియోగారుల్ని కోల్పోవచ్చని నెట్ఫ్లిక్స్ అంచానా వేసింది. ఈ తరుణంలో వినియోగారుల్ని తిరిగి రప్పించుకునేందుకు సరికొత్త బిజినెస్ స్ట్రాటజీతో నెట్ఫ్లిక్స్ ముందుకు రానుంది. వినియోగదారులకు నెట్ఫ్లిక్స్ బంపరాఫర్ ప్రకటించింది. త్వరలో తక్కువ ధరకే సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందించేందుకు సిద్ధమైనట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. అన్న చందాన..సబ్ స్క్రిప్షన్ ధరల్ని తగ్గించి..యాడ్ టైర్ ప్లాన్ను యాడ్ చేస్తున్నట్లు నెట్ఫ్లిక్ కో- సీఈవో టెడ్ సారండోస్ తెలిపారు. తద్వారా నెట్ఫ్లిక్స్ వీడియోలు చూసే సమయంలో యాడ్స్ ప్రసారం అవుతాయి. యాడ్స్ ప్రసారంతో సంస్థకు లాభాలు..సబ్స్క్రిప్షన్ ధరల తగ్గింపుతో చేజారిపోయిన సబ్స్క్రైబర్లను పెంచుకోవచ్చని నెట్ఫ్లిక్స్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో టెడ్ సారండోస్ మాట్లాడుతూ.." నాకెందుకో నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ధరలు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తోంది. ఓటీటీ వీడియోల్లో యాడ్స్ ప్లే అయితే పెద్దగా పట్టించుకోను. కానీ సబ్స్క్రిప్షన్ ధర తక్కువగా ఉండాలి" అని అనుకునే యూజర్ల కోసం కొత్త యాడ్ టైర్ ప్లాన్ను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. -
యూజర్లకు నెట్ఫ్లిక్స్ భారీ షాక్!
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది.తమ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే యూజర్ల అకౌంట్లను బ్యాన్ చేసేందుకు సిద్ధమైంది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. నెట్ఫ్లిక్స్ జీరో టోలరెన్స్ పేరుతో రూల్స్ బ్రేక్ చేసిన యూజర్ల అకౌంట్లను సస్పెండ్ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే వినియోగదారులు వారి అకౌంట్లను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేస్తే అదనపు ఛార్జీలను వసూలు చేస్తామని ప్రకటించింది. ఆ ప్రకటనతో సుమారు 2లక్షల మంది సబ్ స్క్రైబర్లను కోల్పోయింది. దీంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయినా సరే మరోమారు యూజర్లకు కొత్త నిబంధనల్ని విధించింది. ఆ నిబంధనల్ని లైట్ తీసుకుంటే మాత్రం యూజర్లపై చర్యలు తీసుకునేందుకు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదంటూ పలు నివేదికలు చెబుతున్నాయి. వీపీఎన్ వాడుతున్నారా! వీపీఎన్..వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. బ్రౌజర్లకు పరిచయం అక్కర్లేని పేరు. అసాంఘీక కార్యకలాపాలకు, లేదంటే మన దేశంలో అందుబాటులో లేని కంటెంట్ కోసం ఉపయోగించే ప్రత్యామ్నాయ మార్గంగా వీపీఎన్ సేవల్ని అందిస్తుంది. అయితే ఈ వీపీఎన్ సాయంతో నెట్ ఫ్లిక్స్ను వీక్షిస్తే సదరు యూజర్ల అకౌంట్లను బ్లాక్ చేయనుంది. ఒరిజినల్ కంటెంట్ను కాపీ చేస్తున్నారా! సాధారణంగా నెట్ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వీడియో కంటెంట్ కాపీ చేయడం సాధ్యం కాదు. ఒకవేళ టెక్నాలజీ ఉపయోగించి అదే కంటెంట్ను మార్చి వీడియోలు చేసినా, లేదేంటే వేరే వారికి అమ్మిన చర్యలు తీసుకోనుంది. ఇందుకోసం యూజర్లకు మీరు మా నిబంధనల్ని అతిక్రమించారా అంటూ యాప్ ఓపెన్ చేస్తే డిస్ప్లే అయ్యే పాప్ అప్లో మిమ్మల్ని అడుగుతుంది. అందులో మీరు పొరపాటునా అతిక్రమించాం అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే అంతే సంగతులు. అకౌంట్ సస్పెండ్ అవుతుంది. మళ్లీ అదే అకౌంట్ను ఓపెన్ చేయాలంటే సాధ్యపడదు. చదవండి👉 తగ్గేదేలే: నెట్ ఫ్లిక్స్ షాకింగ్ నిర్ణయం, లక్షల అకౌంట్లు బ్యాన్! -
కొంచెం ఇష్టం..కొంచెం కష్టం,యూజర్లకు నెట్ఫ్లిక్స్ షాక్!
ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ వినియోగదారులకు భారీ షాకివ్వనుంది. ప్రస్తుతం మూడు దేశాల్లో మాత్రమే పాస్వర్డ్ షేరింగ్పై నెట్ ఫ్లిక్స్ అదనపు ఛార్జీలను వసూలు చేస్తుంది. అయితే ఈ ఏడాది చివరి నాటికి అన్నీ దేశాల్లో పాస్ వర్డ్ షేరింగ్పై డబ్బులు వసూలు చేయాలని భావిస్తోంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం..చీలీ, కోస్టరికా,పెరులో నెట్ఫ్లిక్స్ వినియోగించే యూజర్లు వారి అకౌంట్ క్రెడియన్షియల్స్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఫార్వర్డ్ చేయాలంటే.. అందుకు అదనంగా 2.99డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే సర్ ఛార్జీలను మిగిలిన దేశాల్లో సైతం వసూలు చేయనుంది. ఈ ఏడాది విడుదలైన మొదటి త్రైమాసికంలో(జనవరి,ఫిబ్రవరి, మార్చి) 200,000 మంది సబ్స్క్రైబర్లను కోల్పోయినట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. రానున్న నెలల్లో మరో 2మిలియన్ల మంది సబ్స్క్రిప్షన్లను కోల్పోవచ్చని అంచనా వేసింది. కాబట్టే మార్కెట్ విలువ నుండి సుమారు $55 బిలియన్ల ఆదాయం తగ్గిపోయింది. కొంచెం ఇష్టం..కొంచెం కష్టం గతనెల క్యూ1 ఫలితాల విడుదల నేపథ్యంలో వాటాదారులకు రాసిన లేఖలో సుమారు 100 మిలియన్ల మంది యూజర్లు పాస్వర్డ్ను షేరింగ్ చేసుకున్నట్లు నెట్ఫ్లిక్స్ తెలిపింది. అందుకే సంస్థ ఆదాయాన్ని పెంచుకునేందుకు నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ షేరింగ్పై సర్ ఛార్జీలను వసూలు చేయనుంది.అదే జరిగితే సబ్స్క్రిప్షన్ సంఖ్య తగ్గిపోతుందని అనుమానం వ్యక్తం చేస్తుంది. దీనికి విరుగుడుగా సబ్స్క్రిప్షన్ ఛార్జీలు తగ్గించి..ఈ ఏడాది (2022) చివరి నాటికి పాస్వర్డ్ షేర్పై సర్ చార్జీలను విధించాలని చూస్తోంది. ఒకవేళ అదే జరిగితే సబ్స్క్రిప్షన్ను కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు షేర్ చేస్తే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. చదవండి👉 ఆ కక్కుర్తితో వందల కోట్ల హాంఫట్,నెట్ఫ్లిక్స్ వినియోగదారులారా బుద్ధొచ్చింది! -
ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా! టెక్ లవర్స్కు గుడ్ న్యూస్!
టెక్ లవర్స్కు గుడ్ న్యూస్. ఆన్ లైన్లో షాపింగ్ కోసం ఒక్కోసారి గుర్తు తెలియని వెబ్ సైట్లు,యాప్స్లలో లాగిన్ అవ్వాల్సి వస్తుంది. అదే సమయంలో సైబర్ నేరస్తులు పాస్వర్డ్ల సాయంతో వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం లాంటి సంఘటనల్ని మనం చూసే ఉంటాం. అయితే ఇకపై వాటికి చెక్ పెట్టేలా దిగ్గజ సంస్థలు కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి. వరల్డ్ పాస్వర్డ్ డే సందర్భంగా యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్లు కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.ఎఫ్ఐడీఓ (ఫాస్ట్ ఐడెంటిఫై ఆన్లైన్) అలయన్స్ సంస్థ, వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం(డ్ల్యూ3సీ) భాగస్వామ్యంతో పైన పేర్కొన్న మూడు దిగ్గజ సంస్థలు పాస్వర్డ్ లేకుండా లాగిన్ అయ్యేలా అప్లికేషన్లను డెవలప్ చేయనున్నాయి. ఎలా అంటే సాధారణంగా స్మార్ట్ ఫోన్తో మనం గూగుల్పే యూపీఐ పేమెంట్స్ స్కానింగ్తో, యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్లో ఫేస్ ఐడీ వెరిఫికేషన్ను వినియోగిస్తుంటాం. సేమ్ ఇలాగే యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ డెవలప్ చేస్తున్న కొత్త టెక్నాలజీతో పాస్వర్డ్ లేకుండా వెబ్సైట్లలో లాగిన్ అవ్వొచ్చని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాస్వర్డ్ లేకుండా లాగిన్ అవ్వడం సాధ్యమేనా? పాస్వర్డ్ లేకుండా లాగిన్ అవ్వడం సాధ్యమేనా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. పుట్టుకొస్తున్న కొత్త కొత్త టెక్నాలజీలతో సాధ్యమవుతుందని చెబుతున్నారు. భవిష్యత్లో బయోమెట్రిక్ సాయంతో పాస్వర్డ్ లేకుండా వెబ్సైట్లు, యాప్స్లో లాగిన్ అవ్వొచ్చని అంటున్నారు. ప్రస్తుతం యూజర్లు టూ ఫ్యాక్టర్ అథంటికేషన్ విషయంలో యూజర్లు పడుతున్న ఇబ్బందులు తొలగిపోన్నాయి. సైబర్ నేరస్తులకు చుక్కలు కనిపించనున్నాయి. చదవండి👉'వన్ రింగ్ స్కామ్'..మిస్డ్ కాల్ వచ్చింది..రూ.46లక్షలు పోయాయి -
భారతీయులు ఎక్కువగా వాడుతున్న పాస్వర్డ్ ఇదే..!
నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్స్, సోషల్ మీడియా, యూపీఐ పేమెంట్స్ యాప్స్ వాడే వారు భారీ సంఖ్యలోనే ఉన్నారు. భద్రత కారణాల దృష్ట్యా లేదా మన ప్రైవసీ పరంగా పాస్వర్డ్లను ఏర్పాటుచేస్తాం. శక్తివంతమైన పాస్వర్డ్స్ను ఏర్పాటు చేయడంతో ఆయా అకౌంట్లను, స్మార్ట్ఫోన్లను, ల్యాప్ట్యాప్లను సైబర్ దాడులకు గురికాకుండా చూడవచ్చును. అయితే పాస్వర్డ్స్ విషయంలో భారతీయుల గురించి తాజాగా ప్రముఖ సెక్యూరిటీ దిగ్గజం నార్డ్ పాస్ భయంకర నిజాలను వెల్లడించింది. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులు పాస్వర్డ్ ఏర్పాటు చేసుకోవడంలో వెనుకబడి ఉన్నారని నార్డ్ పాస్ పేర్కొంది. చాలా మంది భారతీయులు ఎక్కువగా తమ సోషల్ మీడియా ఖాతాలకు ఒకే రకమైన పాస్ వర్డ్ ఏర్పాటుచేస్తున్నారని వెల్లడించింది. సైబర్ నేరస్తులకు సులువుగా ఉండే పాస్వర్డ్లను ఉంచుతున్నట్లు నార్డ్ పాస్ పేర్కొంది. భారతీయుల వాడే 200 పాస్వర్డ్లో 62 పాస్వర్డ్లను సెకను కంటే తక్కువ వ్యవధిలో క్రాక్ చేయవచచ్చును. అయితే ప్రపంచవ్యాప్తంగా పాస్వర్డ్ రూపొందించడంలో అగ్రరాజ్యాలతో పోలిస్తే తక్కువ రిస్క్ భారతీయులు కల్గి ఉన్నట్లు నార్డ్పాస్ పేర్కొంది. భారతీయులు ఎక్కువ వాడే పాస్వర్డ్స్.. భారతీయులు ఎక్కువగా ‘password’ ను ఎక్కువగా తమ పాస్వర్డ్గా వాడుతున్నట్లు నార్డ్ పాస్ పేర్కొంది. అంతేకాకుండా 12345, 123456, 123456789, 12345678, india123, 1234567890, 1234567, qwerty, abc123, iloveyou వంటి పాస్వర్డ్లను వాడుతున్నుట్ల తెలుస్తోంది. వాటితో పాటుగా qwerty కూడా ఎక్కువగా వాడుతున్నారు. ఈ పాస్వర్డ్లను సైబర్ నేరస్తులు కేవలం ఒక్క సెకనులో క్రాక్ చేయవచ్చునని నార్డ్ పాస్ స్పష్టం చేసింది. కొంతమంది తమ అభిమాన నటినటుల పేర్లను కూడా పాస్వర్డ్స్గా ఏర్పాటు చేస్తున్నారని నార్డ్ పాస్ తెలిపింది. అంతేకాకుండా sairam, krishna, omsairam పేర్లను కూడా పాస్వర్డ్గా పెడుతున్నట్లు తేలింది. శక్తివంతమైన పాస్వర్డ్ను ఇలా రూపొందించండి. సైబర్ నేరస్తుల నుంచి మీ అకౌంట్లను కాపాడుకోవాలంటే, బలమైన, శక్తివంతమైన పాస్వర్డ్ను ఏర్పాటుచేసుకోవడం చాలా మంచింది. మీరు ఏర్పాటు చేసే పాస్వర్డ్ లో కచ్చితంగా 12 అక్షరాలు ఉండేలా చూసుకోవాలి. అప్పర్కేస్ లెటర్స్, లోయర్ కేస్ లెటర్స్, నెంబర్స్, స్పెషల్ సింబల్స్ (!,@,#,.....మొదలైనవి) వాటిని పాస్వర్డ్గా ఉంచాలి. అంతేకాకుండా 2 అథనిటికేషన్ పాస్వర్డ్ ఉంచుకోవడం మరింత మంచింది. -
వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్!
వాట్సాప్ తన యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొస్తూ ఇతర మెసేజింగ్ యాప్ లకు చుక్కలు చూపిస్తుంది. ఈ ఏడాది మొదట్లో వచ్చిన వ్యతిరేకితను మరిచిపోయేలా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందిస్తుంది. తాజాగా వాట్సప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొనిరాబోతుంది. ఈ ఫీచర్ సహాయంతో వాట్సప్లోని మీ ఛాట్స్ని బ్యాకప్ చేసినప్పుడు పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. మళ్లీ చాట్స్ ని రీస్టోర్ చేసే సమయంలో పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ను వాట్సప్ బీటా యూజర్లు పరీక్షిస్తున్నట్లు 'వాబీటా ఇన్ఫో' సమాచారం ఇచ్చింది. ఈ ఫీచర్కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ని ట్విటర్ లో షేర్ చేసింది. ఈ ఫీచర్ వాట్సప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు సపోర్ట్ చేయనుంది. ప్రస్తుతం వాట్సప్లోని ఛాట్స్ బ్యాకప్ చేస్తే గూగుల్ డ్రైవ్లోకి బ్యాకప్ అవుతుంది. దీనికి ఎలాంటి పాస్వర్డ్ ప్రొటెక్షన్ లేదు. ముఖ్యమైన ఛాట్స్ బ్యాకప్ చేయాలనుకునేవారి కోసం పాస్వర్డ్ ప్రొటెక్షన్ తీసుకొస్తోంది వాట్సప్. పాస్వర్డ్ సెట్ చేస్తే ఆ ఛాట్స్ని రీస్టోర్ చేయాలంటే పాస్వర్డ్ తప్పనిసరి. ఇప్పటికే వాట్సాప్ డెస్క్ టాప్ యూజర్ల కోసం వీడియో కాలింగ్, ఆడియో కాలింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. అలాగే, డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ టైమర్ని కూడా మార్చబోతోంది. ప్రస్తుతం వారం రోజులు ఉన్న టైమ్ 24 గంటలకు తీసుకొనిరానుంది. త్వరలో 24 గంటల్లోనే పాత మెసేజెస్ డిలిట్ చేయొచ్చు. As previously announced, @WhatsApp is working on cloud backups encryption. The chat database and media will be safe from unauthorized access when using a password. The password is private and it's not sent to WhatsApp. It will be available in a future build for iOS and Android. pic.twitter.com/Lp06PaECBX — WABetaInfo (@WABetaInfo) March 8, 2021 చదవండి: నాలుగు రోజులు బ్యాంకులకు వరుస సెలవులు! 'వరల్డ్ వైడ్ వెబ్’ కోటకు బీటలు
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement