-
టీమిండియా వరల్డ్కప్ ప్రోమో రిలీజ్.. రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం
2024 టీ20 వరల్డ్కప్లో పాల్గొనే టీమిండియా కోసం స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ఓ ప్రత్యేక ప్రోమో వీడియో రిలీజ్ చేసింది. రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో రోహిత్, కోహ్లి, సూర్యకుమార్, పాండ్యా, జడేజాలను చూపించిన వైనం అత్యద్భుతంగా ఉంది. INDIAN TEAM PROMO FOR THE T20I WORLD CUP. 🇮🇳 - Rohit Army is ready to create history.pic.twitter.com/2jjM9wYQQW — Johns. (@CricCrazyJohns) April 23, 2024 ఇది చూస్తే భారత క్రికెట్ అభిమానులకు గూస్ బంప్స్ రావడం ఖాయం. బ్యాక్ గ్రౌండ్లో వందేమాతర గీతం వీడియోని రక్తి కట్టించింది. ఆఖర్లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి సెల్యూట్ చేస్తున్న క్లిప్ అభిమానుల్లో జోష్ నింపుతుంది. "వరల్డ్కప్ కోసం టీమిండియా సిద్ధం" అని అర్దం వచ్చేలా ఈ వీడియాకి క్యాప్షన్ ఉంది. కాగా, యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా ఈ ఏడాది జూన్ 1 నుంచి టీ20 వరల్డ్కప్ ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ దాదాపు నెల రోజులపాటు సాగుతుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి పోటీపడతాయి. గ్రూప్-ఏలో భారత్తో పాటు కెనడా, పాకిస్థాన్, యూఎస్ఏ, ఐర్లాండ్ ఉన్నాయి. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల సమరం (భారత్-పాక్ మ్యాచ్) జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరుగనుంది. -
హీరో చెంప పగలగొట్టిన స్టార్ యాంకర్.. వీడియో వైరల్!
కేరింత ఫేమ్ పార్వతీశం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మార్కెట్ మహాలక్ష్మి. వీఎస్ ముఖేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రణీకాన్వికా హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. బీ2పీ స్టూడియోస్పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ టీమ్ ప్రస్తుతం ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే మహాలక్ష్మి అన్న పేరు ఉంటే వారికి 200 టికెట్స్ ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. తాజాగా ప్రమోషన్లలో భాగంగా యాంకర్ శ్రీముఖితో చిత్రబందం ఇంటర్వ్యూ నిర్వహించింది. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో హీరో పార్వతీశం వెళ్లి శ్రీముఖిని చూసి' మీరంటే నాకు ఇష్టమండి.. ఐ లవ్ యూ' అని చెప్తాడు. ఆ తర్వాత శ్రీముఖి హీరో చెంపపై ఒక్కటి ఇస్తుంది. 'మార్కెట్ మహాలక్ష్మీ ఇక్కడ.. మజాక్ లాడితే మంచిగుండదు' అంటూ సినిమాలోని డైలాగ్ చెబుతుంది. తాజాగా రిలీజైన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. Why did Anchor #Sreemukhi slap Hero #Paravateesam? Promo out now! Don’t miss the full interview tomorrow! మార్కెట్ మహాలక్ష్మి మజాక్ లాడితే మంచిగుండదు!! 🔥#MM #MarketMahalakshmi @VSMukkhesh31 @Akhileshkalaru @parvateesam_u #Praneekaanvikaa #B2PStudios @vickyvenki1 pic.twitter.com/jOIp954dAo — Mukesh G (@MukeshG39549544) March 21, 2024 -
విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న చిత్రం ఫ్యామిలీ స్టార్. గీత గోవిందంతో సూపర్ హిట్ కొట్టిన పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 7వ తేదీన ఫస్ట్ సింగిల్ 'నందనందనా..' రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ఫుల్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్గా తెరకెక్కిస్తున్నారు. తాజాగా రిలీజైన ప్రోమో అభిమానులను ఆకట్టుకుంటోంది. గీత గోవిందంలోని 'ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే' పాటకు పనిచేసిన లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్, సింగర్ సిధ్ శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కాంబోలో ఈ సాంగ్ వస్తోంది. కాగా..ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అతనితో డేటింగ్.. నోరు జారిన దేవర భామ!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ బీటౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. శ్రీదేవి ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదటి చిత్రం ధడక్తో అలరించింది. గతేడాది బవాల్ చిత్రంలో మెరిసింది. తాజాగా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర మూవీతో టాలీవుడ్లో అడుగుపెడుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన జాన్వీ కపూర్ ఫస్ట్లుక్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా దేవర గ్లింప్స్ ఈనెల 8న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారుయ అయితే ఇదిలా ఉండగా.. జాన్వీ కపూర్ తాజాగా కాఫీ విత్ కరణ్ షోకు హాజరైంది. తన సోదరి ఖుషి కపూర్తో కలిసి కరణ్ జోహార్ ఇంటర్వ్యూలో పాల్గొంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. కాఫీ విత్ కరణ్ సీజన్ -8 పాల్గొన్న జాన్వీ కపూర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. కరణ్ అడిగిన ప్రశ్నలకు జాన్వీ, ఖుషి ఆసక్తికర సమాధానాలిచ్చారు. (ఇది చదవండి: ఫ్యాన్స్కు పోస్టర్తో ట్రీట్ ఇచ్చిన ఎన్టీఆర్.. దేవర గ్లింప్స్ రెడీ) జాన్వీ కపూర్ను ప్రశ్నిస్తూ నీ స్పీడ్ డయల్ నంబర్స్లో ముగ్గురి పేర్లు చెప్పమని కరణ్ జోహార్ అడిగాడు. దీనికి ఆమె సమాధానమిస్తూ పాపా(నాన్న), ఖుషు, శిక్కు అని ఠక్కున చెప్పేసింది. దీనికి ఖుషీ, కరణ్ ఆశ్చర్యంగా జాన్వీ వైపు చూశారు. ఆమె సమాధానంతో నటుడు శిఖర్ పహారియాతో డేటింగ్లో ఉందన్న విషయంపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే గతంలో చాలాసార్లు జాన్వీ కపూర్, శిఖర్ పహారియా జంటగా చాలాసార్లు కనిపించారు. కానీ తమ రిలేషన్పై ఎక్కడా స్పందించలేదు. కాగా.. శిఖర్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. 'కాఫీ విత్ కరణ్ సీజన్ 8' ఫుల్ ఎపిసోడ్ జనవరి 4న ఓటీటీ ప్లాట్ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రసారం కానుంది. -
'ఆ కుర్చీని ఇస్తానని దేవా మాటిచ్చాడు'.. సలార్ పవర్ఫుల్ డైలాగ్ ప్రోమో!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. ఈనెల 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే రూ.500 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. రెండో వీక్లోనూ భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ సలార్ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. (ఇది చదవండి: ఓటీటీలపై అగ్రతారల కన్ను.. ఈ ఏడాది అత్యధిక పారితోషికం ఎవరికంటే?) తాజాగా ఈ చిత్రంలోన ఓ డైలాగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. సలార్- సీజ్ఫైర్ చిత్రంలో క్లైమాక్స్లో శ్రుతిహాసన్ చెప్పే ఈ డైలాగ్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఈ సినిమా చూడని వారు డైలాగ్ ప్రోమోను చూసేయండి. కాగా.. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. -
ఆ కుర్చీని మడతపెట్టి...
మహేశ్బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, ప్రకాశ్రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘ఆ కుర్చీని మడతపెట్టి..’ అనే పాట ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. కాగా ఈ పాట పూర్తి లిరికల్ వీడియో నేటి సాయంత్రం విడుదలవుతోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ చిత్రానికి తమన్ స్వరకర్త. -
'దయచేసి ఆ పదాన్ని తీసేయండి'.. మహేశ్బాబుకు విజ్ఞప్తి!
ఇప్పుడంతా ఎక్కడ చూసిన సోషల్ మీడియానే శాసిస్తోంది. ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లోనే వైరలవుతోంది. అలా కొన్నాళ్ల ముందు ఓ తాత తన మాటలతో ఫుల్ ఫేమస్ అయ్యారు. ఆయన చెప్పిన 'కుర్చీ మడతపెట్టి' అనే డైలాగ్ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. డైలాగ్లో ఓ బూతు పదం కూడా ఉన్నప్పటికీ.. చాలామందికి ఇదో ఊతపదంలా మారిపోయింది. ఇప్పుడు దాన్నే పట్టుకుని ఏకంగా మాస్ పాట చేసేశారు. తాజాగా మహేశ్ బాబు నటించిన గుంటూరుకారం చిత్రంలోని పాటకు ఈ పదాన్ని వాడేశారు. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్గామారింది. అయితే ఈ చిత్రంలో కుర్చీని మడతబెట్టి పదం వినియోగించడంపై ఓ జర్నలిస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది మిమ్మల్ని ఫాలో అయ్యే మీలాంటి స్టార్ సినిమాలో ఈ బూతు పదాన్ని తొలగించాలని చిత్రబృందానికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి బూతు పదాలు చూసి పిల్లలు చెడిపోతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. -
'నీ రక్తాన్ని చిందించడానికి సైతం వెనుకాడలేదు'.. రైతుబిడ్డపై బిగ్బాస్ ప్రశంసలు!
బుల్లితెర ఓ రేంజ్లో అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్బాస్ సీజన్-7. ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా ప్రారంభమైన ఈ షో అదే పంథాలో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఉల్టా పుల్టా అంటూ మొదలైన ఈ సీజన్.. అందుకు తగ్గట్టుగానే అలరించింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, రతిక రీ ఎంట్రీతో ఈ సీజన్ సరికొత్తగా సాగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో నాలుగు రోజుల్లో మీ అభిమాన రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. ఇక గ్రాండ్ ఫినాలేకు ఆరుగురు కంటెస్టెంట్స్ అర్హత సాధించారు. మరి వీరిలో ట్రోఫీ ఎవరిని వరిస్తుందో త్వరలోనే తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ఈ వారం హౌస్లో ఉన్న ఆరుగురి జర్నీపై వీడియోలను బిగ్బాస్ ఆడియన్స్కు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చివరివారం మొదటి రెండు రోజుల్లో అమర్, అర్జున్, ప్రియాంక, శివాజీ బిగ్ బాస్ ప్రయాణాన్ని ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా చూపించారు. ఆ వీడియోను చూసిన కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరూ తమలోని భావోద్వేగాలను ఆపుకోలేకపోతున్నారు. తమ బిగ్ బాస్ ప్రయాణాన్ని స్క్రీన్పై చూసి ఒక్కసారిగా కంటతడి పెట్టుకుంటున్నారు. తాజాగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్కు సంబంధించిన ప్రోమో మేకర్స్ రిలీజ్ చేశారు. వీడియోలో బిగ్బాస్ పల్లవి ప్రశాంత్పై ప్రశంసల వర్షం కురిపించారు. బిగ్ బాస్ మాట్లాడుతూ.. 'మట్టితో మనకున్న బంధం విడదీయలేనిది. ఒక కామనర్ల సెలబ్రిటీగా ఈ ఇంట్లో అడుగుపెట్టారు. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. టాస్కుల్లో గెలవడానికి నీ రక్తాన్ని చిందించడానికి సైతం వెనుకాడలేదు. మీకు ఇక్కడ రకరకాల వ్యక్తుల రూపంలో స్నేహం దొరికింది. మీరు కృంగిపోయిన ప్రతిసారి లోకం తీరును వివరిస్తూ.. నీ లక్ష్యాన్ని గుర్తు చేసి.. ఏడుపు సమాధానం కాదని.. నీకు ఆ స్నేహమే తెలియజేసింది. నామినేషన్స్లో నీలో మరో ప్రశాంత్ను అందరికీ చూపించి.. ఓ బలమైన పోటీదారునిగా మిమ్మల్ని నిలిపి ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఆకాశం నుంచి జారే ప్రతి నీటిబొట్టు భూమిమీద జీవానికి ఓ అవకాశమే. దాన్ని ఒడిసిపట్టే నైపుణ్యం నీది' అంటూ బిగ్ బాస్ కొనియాడారు. ప్రశాంత్ ఫుల్ జర్నీ వివరాలు తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. -
'హౌస్లో ఉంటే ఎంత.. పోతే ఎంత.. నీ నిజ స్వరూపం అందరికీ తెలియాలి'
తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-7 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఇప్పటి వరకు హౌస్లో కేవలం ఏడుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఇక గ్రాండ్ ఫినాలే మరో వారంలో షురూ కానుంది. ఈ నేపథ్యంలో ఈవారంలో హౌస్ నామినేషన్స్ రోజే యుద్ధరంగాన్ని తలపించింది. అయితే ఇప్పటి దాకా హౌస్మేట్స్తో కేకులు తినే గేమ్స్ పెట్టిన బిగ్బాస్ ఈసారి త్రో బాల్ టాస్క్ను ఇచ్చాడు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఈ టాస్క్లో ప్రతి రౌండ్లో ఎవరీ జాకెట్కు అయితే ఎక్కువ బాల్స్ అంటుకుని ఉంటాయో వారు ఆ రౌండ్ నుంచి ఎలిమినేట్ అవుతారని బిగ్బాస్ ప్రకటించాడు. అయితే గేమ్ నుంచి శోభా శెట్టి, యావర్ మొదట్లోనే ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగిలిన ఐదుగురు పోటీలో నిలిచారు. అయితే దూరం నుంచి బాల్స్ విసరాల్సిన అమర్.. పల్లవి ప్రశాంత్ను పట్టుకుని బాల్స్ అంటించేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే ఇంటి సభ్యులైన అమర్, పల్లవి ప్రశాంత్ మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది. దీంతో అమర్ తనను కొరికాడంటూ పల్లవి ప్రశాంత్ ఆరోపించాడు. దీనికి అమర్ కూడా ధీటుగానే స్పందించి అవునురా.. నేను తప్పని ఒప్పుకుంటా.. నేను చేసేవి కనిపిస్తాయి.. కానీ నువ్వు చేసేవి కనపడవు తెలుసా అన్నాడు. నువ్వు తప్పు చేసి నన్ను అంటున్నావ్ అన్నాడు ప్రశాంత్. దీంతో ఇద్దరి మధ్య తీవ్రమైన మాటల యుద్ధానికి దారితీసింది. రేయ్ హౌస్లో ఉంటే ఎంత.. పోతే ఎంత? వీడి గురించి అందరికీ తెలియాలి.. నీకున్న డబుల్ గేములు ఎవరికీ లేవు తెలుసా? అని అమర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. నా గురించి ఇంట్లో అందరికీ తెలుసు అని ప్రశాంత్ బదులిచ్చాడు. 'నేను అబద్ధం.. వాడే నిజం..కట్టుకథ అల్లొద్దు.. వాడు ఏం చెప్పాడో ఎవరికీ చెప్పనని మాట ఇచ్చా. అందుకే మాట్లాడటం లేదు' అంటూ బాంబ్ పేల్చాడు. వాడు ఏం చెప్పాడో తెలుసా.. నన్ను పిచ్చోన్ని చేసి ఆడుకుంటావా? మాట్లాడకు.. అంటూ తల బాదుకున్నాడు అమర్. దీనికి ఆగమాగం చేయకు.. నీళ్లు తాగు అంటూ రైతు బిడ్డ ప్రశాంత్ కౌంటరిచ్చాడు. అమర్ను శోభా వారిస్తుండగా.. అర్జున్ కలగజేసుకుని రేయ్ ఆపండ్రా అంటూ నోర్లు మూయించాడు. దీంతో ప్రోమో ముగిసింది. ఇవాల్టి ఎపిసోడ్లో ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే చూసేయాల్సిందే. -
నేను మోసపోయానంటూ రైతుబిడ్డ ఫైర్.. కప్పు ఇచ్చేయండన్న అమర్!
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న రియాలిటీ షో చివరిదశకు చేరుకుంది. మరో వారంలో గ్రాండ్ ఫినాలేకు తెరలేవనుంది. గతవారం గౌతమ్ ఎలిమినేట్ కావడంతో హౌస్లో ఇంకా ఏడుగురు ఉన్నారు. వారిలో ఇప్పటికే అర్జున్ గ్రాండ్ ఫినాలేకు అర్హత సాధించాడు. ఇక మరోవారం మొదలైందంటే నామినేషన్స్ ప్రక్రియ షురూ అయింది. హౌస్లో ఒకరిపై ఒకరు కారణాలు చెబుతూ నామినేట్ చేసే సమయంలో జరిగే తంతు మామూలుగా ఉండదు. అసలే ఈ వారం నుంచి టగ్ ఆఫ్ వార్ అన్న రీతిలో నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది. తాజా ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. బిగ్బాస్ సీజన్-7 ఇవాల్టి ఎపిసోడ్ల నామినేషన్స్ ప్రక్రియలో విమర్శలు వేరే లెవల్కు చేరుకున్నాయి. తాజాగా రిలీజైన ప్రోమోలో ప్రశాంత్ను అమర్దీప్ నామినేట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడించింది. నువ్వు నన్ను రా అనొద్దంటూ వాదించగా.. నా తమ్ముడిని రా అనే అంటానురా.. పలికితే పలుకు.. లేదంటే పో అంటూ రెచ్చిపోయాడు. ఆ తర్వాత అర్జున్.. అమర్, యావర్ను నామినేట్ చేశాడు. ఆ తర్వాత హౌస్లో సేఫ్ ప్లేయర్ ఎవరంటే.. ఒక్క పల్లవి ప్రశాంతే అంటూ శోభా శెట్టి నామినేట్ చేసింది. ఆ తర్వాత శివాజీ, ప్రియాంకల చిన్నపాటి వార్ నడిచింది. ఫ్రెండ్షిప్ విషయాకొనిస్తే త్యాగం చేసే వాళ్లు కావాలని శివాజీ అనగా.. ప్రియాంక ఏదో అనడంతో.. నువ్వు ఓవర్ స్మార్ట్ ఇక్కడ చేయొద్దమ్మ అంటూ చురకలంటించాడు. దీనికి ఐయామ్ నాట్ ఓవర్ స్మార్ట్ అంటూ ప్రియాంక సమాధానమిచ్చింది. ఆ తర్వాత ప్రశాంత్, అమర్ మధ్యే పెద్ద వార్ నడిచింది. అమర్ అన్న ఫస్ట్ నుంచి నా మీద నెగెటివ్గానే ఉన్నాడు అనడంతో మధ్యలో శోభా ఎంటరైంది. మాట అంటే మాటే.. తగ్గేదేలే.. ప్రాణమైనా ఇస్తాడు అని లోపలికి వెళ్లి దాచి కూర్చోలే అని శోభా అనడంతో.. ఇది నిజ స్వరూపం.. అందరినీ మోసం చేసే గుణం నీది అంటూ ప్రశాంత్ రెచ్చిపోయాడు. దీంతో టాపిక్ డైవర్ట్ చేసి తవ్వుకోద్దంటూ అని అమర్ అన్నాడు. దీనికి ప్రశాంత్ బరాబర్ తవ్వుతా.. తగ్గదేలే అన్నాడు. దీంతో ఆగరా.. నువ్వు..నీ అబద్ధాలు అంటూ అమర్ ఫైరయ్యాడు. ఎదుటివాళ్లను మోసం చేసుడు నీగుణం.. మోసపోయింది నువ్వు కాదు.. నేను అంటూ ప్రశాంత్ మరింత రెచ్చిపోయాడు. ఆ తర్వాత నన్ను బయటకు పంపించేయండి.. వాడికి కప్పు ఇచ్చేయండి.. మీరందరూ హ్యాపీగా ఉండండి.. వాడు హ్యాపీగా ఉంటాడు అని అమర్ అనడంతో ప్రోమో ముగిసింది. మొత్తానికి ప్రోమో చూస్తే నామినేషన్స్ ప్రక్రియ ఫుల్ హీటెక్కినట్లు తెలుస్తోంది. ఎవరు ఎవరినీ నామినేట్ చేశారో పూర్తి వివరాలు తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూడాల్సిందే. -
శివాజీని చేతులెత్తి వేడుకున్న అమర్దీప్.. ఎందుకంటే?
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్ బాస్. ప్రస్తుతం సీజన్-7 12వ వారానికి చేరుకుంది. గతవారం ఎవరినీ ఎలిమినేట్ చేయని బిగ్బాస్.. ఈ వారంలో ఏకంగా డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని హింట్ ఇచ్చాడు. మరీ ఈ వారంలో ఎవరు బయటకు రానున్నారో తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే. అయితే ఈలోగా సేఫ్ అయ్యేందుకు ఉన్న అవకాశాల కోసం కంటెస్టెంట్స్ పోటీ పడుతున్నారు. తాజా ఎపిసోడ్లో కెప్టెన్ కంటెండర్ పోటీని బిగ్ బాస్ నిర్వహించారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. (ఇది చదవండి: స్టార్ హీరో వారసుడు తెరంగేట్రం.. డైరెక్టర్గా ఎవరంటే?) ప్రోమో చూస్తే అయితే ఈ పోటీలో చివరికీ అమర్, అర్జున్ మాత్రమే ఫైనల్గా కెప్టెన్ పోటీలో నిలిచినట్లు తెలుస్తోంది. గతవారంలో తృటిలో కెప్టెన్సీ కోల్పోయిన అమర్దీప్ బోరున ఏడ్చేసిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే తరహాలో హౌస్లో హంగామా చేశాడు. అమర్, అర్జున్ విషయంలో శివాజీ, శోభాశెట్టి తన అభిప్రాయాలు బిగ్బాస్కు వెల్లడించారు. కెప్టెన్సీ పోటీలో అర్జున్కు వ్యతిరేకంగా శోభాశెట్టి తన నిర్ణయాన్ని వెల్లడించింది. కెప్టెన్ అయ్యేందుకు నీకెంత అర్హత ఉందో.. అమర్కు అంతే ఉందని చెప్పింది. ఆ తర్వాత శివాజీ కెప్టెన్సీ పోటీలో అర్జున్కు మద్దతుగా నిలిచారు. దీంతో అమర్దీప్, శివాజీని బతిమాలాడారు. ప్లీజ్ అన్న.. అర్థం చేసుకో.. ఇప్పుడు అవకాశం వచ్చింది.. పోగోట్టకన్నా.. నీకు దండం పెడతా అంటూ రెండు చేతులతో మొక్కాడు. నువ్వు కెప్టెన్ అవ్వడం కోసం ఏడుస్తున్నావేంట్రా? అని శివాజీ అన్నాడు. నేను కెప్టెన్ అవ్వాలన్నా అంటూ శివాజీని వేడుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు అమర్. కానీ చివరికీ నేను దేనికి పనికిరాను అంటూ అమర్ ఎమోషనలయ్యాడు. ఆ తర్వాత అమర్ ఫోటో మంటల్లో కాలిపోతూ ఉండగా ప్రోమో ముగిసింది. మరీ ఈ వారం కెప్టెన్సీ ఎవరినీ వరించిందో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. (ఇది చదవండి: ముసలి వెంట్రుక ఎంతపని చేసింది? వంకరబుద్ధి పోనిచ్చుకోని శివాజీ!) -
బిగ్ బాస్ హౌస్లో లవ్ బర్డ్స్.. ఇక్కడే పెళ్లి చేసుకుందామన్న ప్రియాంక!
బిగ్ బాస్ హౌస్లో రోజు రోజుకు మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటి వరకు నామినేషన్స్, గేమ్ టాస్కులతో బిజీగా ఉండే కంటెస్టెంట్స్ ఈ వారంలో కంటతడి పెట్టిస్తున్నారు. ఎప్పుడు హాట్ హాట్గా సాగే బిగ్ బాస్ హౌస్.. ఇప్పుడు ఫుల్ ఎమోషనల్గా మారింది. మంగళవారం ఒక్క రోజే ముగ్గురు కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులను హౌస్కు రప్పించి సర్ప్రైజ్ ఇచ్చారు. శివాజీ, అంబటి అర్జున్, అశ్వినికి ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరు ఇంట్లోకి ప్రవేశించారు. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోలు రిలీజ్ కాగా.. సేమ్ సీన్ రిపీట్ అయింది. (ఇది చదవండి: మరోసారి తెరపైకి స్టార్ కపుల్ విడాకుల రూమర్స్.. అసలేం జరుగుతోంది!) రెండో రోజు కూడా హౌస్ను ఫుల్ ఎమోషనల్గా మార్చేశారు. తాజాగా రిలీజైన ప్రోమోలో ప్రియాంక జైన్ ప్రియుడిని హౌస్లో తీసుకొచ్చారు బిగ్ బాస్. హౌస్లో అడుగుపెట్టిన మౌనరాగం సీరియల్ ఫేమ్ శివకుమార్ తన ప్రియురాలికి గులాబీ పువ్వుతో మరోసారి ప్రపోజ్ చేశారు. దీంతో చాలా రోజుల తర్వాత ప్రియుడిని చూసిన ప్రియాంక తన ప్రేమతో అతన్ని కౌగిలించుకుంది. ఆ తర్వాత ఎలా ఉన్నావ్ అంటూ.. తన ప్రియుడిని అడిగింది. నేను ఇలా ఉన్నా అనడంతో.. ఒకరినొకరు చాలా మిస్సవుతున్నామంటూ ఎమోషనలయ్యారు. శివతో మాట్లాడుతూ..'మరీ పెళ్లెప్పుడు అని ప్రియాంక ప్రేమగా అడగడంతో.. నువ్వు బయటకొచ్చిన వెంటనే చేసుకుందాం అన్నాడు. కాదు.. ఇప్పుడే చేసుకుందాం ప్రియాంక అంటూ శివను గట్టిగా మరోసారి కౌగిలించుకుంది. ఆ తర్వాత ఈ జంట దగ్గరకు వచ్చిన శోభా శెట్టి బిగ్ బాస్ ఇచ్చిన సమయం అయిపోయిందని చెబుతుంది. ఇక్కడే ఉండిపోవచ్చా అని బిగ్ బాస్ను శోభ అడుగుతుంది. ఆ తర్వాత అందరూ కలిసి శివకుమార్కు గుడ్ బై చెప్పడంతో ప్రోమో ముగిసింది. కాగా.. జానకి కలగనలేదు సీరియల్ నటి ప్రియాంక జైన్.. బుల్లితెర నటుడు శివ కుమార్లు చాలా ఏళ్లుగా రిలేషన్లో ఉన్నారు. జానకి కలగనలేదు సీరియల్లో నటించిన ప్రియాంక జైన్.. నటుడు శివ కుమార్లు చాలా ఏళ్లుగా రిలేషన్లో ఉన్నారు. మౌనరాగం సీరియల్లో వీళ్లిద్దరూ కలిసి నటించారు. అమ్ములుగా ప్రియాంక జైన్.. అంకిత్గా శివ కుమార్లు పాత్రలు పోషించారు. కెమెరా ముందే నటనతో జీవించిన వీళ్లు.. కెమెరా వెనుక కూడా రొమాంటిక్ జోడీగా మారారు. (ఇది చదవండి: 'ఆయన లేకుండా తొలిసారి ఇలా'.. మంజుల ఎమోషనల్ పోస్ట్!) -
నీకిష్టమొచ్చినట్లు చేయాలంటే కుదరదు.. కెప్టెన్కు శివాజీ కౌంటర్!
బిగ్ బాస్ సీజన్- 7 తొమ్మిదో వారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే నామినేషన్స్లో ఉన్నవాళ్లకి ఎలిమినేషన్ టెన్షన్ మొదలైంది. ఈ వారం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. అయితే ప్రస్తుతం హౌస్లో రెండు టీమ్స్ మధ్య ఛాలెంజ్ల పర్వం కొనసాగుతోంది. కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్ నడుస్తుండగా ఇరు జట్ల మధ్య వాదనలు హాట్ హాట్గా సాగుతున్నాయి. (ఇది చదవండి: రాహుల్ గురించి రతికనే చెప్పింది.. బిగ్ బాస్ విన్నర్ అతనే గ్యారెంటీ: దామిని) కెప్టెన్సీ కంటెండర్షిప్ కోసం బిగ్బాస్ బాల్స్ టాస్క్ ఇచ్చాడు. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. టాస్క్లో భాగంగా గౌతమ్ టీం బిగ్బాస్ ఓ స్పెషల్ పవర్ ఇచ్చాడు. గౌతమ్ టీం దగ్గర బాల్స్తో.. అవతలి టీం వద్ద ఉన్న బాల్స్ను మార్చుకోవచ్చని ఆఫర్ ఇచ్చాడు. దీంతో గౌతమ్ టీం సభ్యులు ఎగిరి గంతేశారు. అయితే బిగ్బాస్ నిర్ణయంపై శివాజీ కాస్తా అసహనం ప్రదర్శించారు. గోల్డెన్ బాల్ వాళ్లకే, అన్ని వాళ్లకేనా బిగ్ బాస్ అంటూ తనలో తాను మాట్లాడుకున్నారు. అయితే బాల్స్ మార్చుకునే సమయంలో శివాజీ, కెప్టెన్ గౌతమ్ మధ్య మాటల యుద్ధం తలెత్తింది. మీకు తగినట్లు రూల్స్ మార్చుకుంటే మీరే ఆడుకోండన్న అంటూ గౌతమ్ అనడంతో.. మధ్యలో నేను మాట్లాడతా అన్న కదా అంటూ ప్రియాంక చెప్పింది. ఆ తర్వాత నీకిష్టమొచ్చినట్లు చేయాలంటే ప్రతిసారి చేయం మేము.. ఏం చేయాలో బిగ్ బాస్ చెప్తాడు కదా.. అంతవరకు ఆగలేవా నువ్వు? నీకు అనుకూలంగా ఉన్నప్పుడేమో చాలా సైలెంట్గా ఉంటావ్.. అని శివాజీ ఫైరయ్యాడు. దీంతో నేను ఏం తప్పు చేశానో చెప్పండి అంటూ గౌతమ్ ప్రశ్నిస్తాడు. నీతో నేను మాట్లాడలేనమ్మా.. కావాలనే వాదన పెట్టుకుంటావా? అని శివాజీ అనడంతో.. ఇక్కడ ఎవరికీ అలాంటి అవసరం లేదన్న అని గౌతమ్ అనడంతో అక్కడితో ప్రోమో ముగుస్తుంది. బాల్స్ టాస్క్లో మాత్ర బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్టులతో మరింత రసవత్తరంగా మారింది. హౌస్లో ఏం జరగనుందో ఇవాల్టి ఎపిసోడ్ చూస్తేనే క్లారిటీ వస్తుంది. (ఇది చదవండి: సినిమా రిలీజ్.. ఏడుస్తూ వీడియో షేర్ చేసిన హీరోయిన్!) -
భయపెడితే భయపడతారనుకున్నావా?.. పక్కకెళ్లి ఆడుకో.. హౌస్లో మాటల యుద్ధం!
తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ తొమ్మిదో వారం హాట్హాట్గా కొనసాగుతోంది. ఈ వారంలో ఇప్పటికే నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో హౌస్లో టాస్కుల పర్వం మొదలైంది. కెప్టెన్సీ కంటెండర్ రేసు మొదలెట్టేశాడు బిగ్బాస్. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు ఓ గేమ్ ఇచ్చాడు. దీని కోసం ఇంటిసభ్యులను రెండు టీమ్లుగా విభజించాడు. వీరసింహాలు టీమ్లో యావర్, గౌతమ్, భోలె, తేజ, శోభా, రతిక ఉండగా.. మిగిలినవారంతా గర్జించే పులులు టీమ్లో ఉన్నారు. (ఇది చదవండి: వాడో వేస్ట్గాడు, ఐటం రాజా.. అమర్పై మళ్లీ విషం కక్కిన శివాజీ) మొదట బాల్స్ టాస్కు పెట్టిన బిగ్ బాస్.. దాని ఫలితాలను మాత్రం ప్రకటించలేదు. తర్వాత పవర్ బాక్స్ చాలెంజ్ ఇచ్చాడు. ఇది గెలిచిన టీమ్కు ఒక స్పెషల్ పవర్ లభిస్తుందని చెప్పాడు. మొదట జంపింగ్ జపాంగ్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో వీరసింహాలు టీమ్ గెలవడంతో.. అవతలి టీమ్లోని ఒకరిని గేమ్ నుంచి తొలగించే ఛాన్స్ ఇచ్చాడు బిగ్బాస్. దీంతో అందరూ చర్చించుకుని పల్లవి ప్రశాంత్ను గేమ్ నుంచి తొలగించారు. తాజా ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ మరో ఛాలెంజ్తో ఎపిసోడ్ మొదలైంది. అమర్దీప్, కెప్టెన్ గౌతమ్ పరుగుత్తుకెంటూ వెళ్లి ఛాలెంజ్లో పాల్గొన్నారు. అయితే ఈ టాస్క్ విషయంలో రతికా, అమర్ దీప్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎందుకు కింద పడేశావ్ అంటూ అమర్ను రతికా ప్రశ్నించగా.. నా ఇష్టం ఇది నా స్ట్రాటజీ అంటూ మాట్లాడాడు. ఆ తర్వాత ప్రతిసారి వెధవ పని చేయడం నీకు అలవాటు అనడంతో.. నువ్వు చేసే పనులతో నన్ను పోల్చొద్దు అని అమర్ కౌంటరిచ్చాడు. దీంతో రతికా కోపంతో మాటలు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది. దీనికి అమర్ సైతం నువ్వు కూడా అంటూ రెచ్చిపోయాడు. భయపెడితే భయపడతారనుకున్నావా? పక్కకెళ్లి ఆడుకో.. వచ్చి నా బ్యాగ్ లాగడం కాదు.. నీ బ్యాగ్ లాగినవాళ్ల దగ్గరికి వెళ్లి లాగు అంటూ ఇచ్చిపడేశాడు. ఆ తర్వాత బిగ్బాస్ ఇచ్చిన బ్రేక్ ఫాస్ట్ ఛాలెంజ్లో అమర్, శోభా తలపడగా.. ఇందులో అమర్ విన్ అయ్యాడు. దీంతో ప్రోమో ముగిసింది. మరీ ఫైనల్గా ఏ టీమ్ కెప్టెన్సీ కంటెండర్ నిలిచిందో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూస్తే క్లారిటీ వస్తుంది. (ఇది చదవండి: కింగ్ ఖాన్ బర్త్ డే.. సర్ప్రైజ్ ఇచ్చిన మేకర్స్!) -
'పిచ్చోడు' గొడవపై నాగ్ సీరియస్.. బయటపడ్డ యవర్ అసలు రంగు!
బిగ్బాస్ వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే నాగ్ వచ్చేస్తాడు. వారమంతా కంటెస్టెంట్స్ చేసిన తప్పులు బయటపెడతాడు. ఒక్కొక్కరికి నిలబెట్టి మరీ కడిగేస్తాడు. ప్రతివారం ఇదే జరుగుతూ ఉంటుంది. అలా ఈ వీకెండ్ అందరికీ గట్టిగానే పడ్డాయి. కానీ యవర్కి మాత్రం కోలుకోలేని రేంజులో కౌంటర్స్ పడినట్లు కనిపిస్తున్నాయి. 'పిచ్చోడు' గురించి మొత్తానికే సీరియస్ అయ్యాడు. తాజాగా రిలీజ్ చేసిన ఈ ప్రోమో, ఎపిసోడ్పై ఆసక్తి పెంచుతోంది. అసలేంటి గొడవ? ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్గా శోభాశెట్టితో పాటు మరికొందరు నిలిచారు. వీళ్లలో ఎవరికి అనర్హులు చెప్పాలని.. మిగతా వాళ్లకు బిగ్బాస్ చెప్పాడు. దీంతో యవర్.. శోభాశెట్టికి ఎండుమిర్చి దండ వేశాడు. కానీ శోభాకి ఇది నచ్చలేదు. కాస్త సౌండ్ పెంచేసరికి యవర్ రెచ్చిపోయాడు. అమ్మాయి అని కూడా చూడకుండా శోభాశెట్టి మీదమీదకి వెళ్లి మరీ అరిచాడు. దీంతో ఆమె ఓ సందర్భంలో యవర్ని పిచ్చోడు అని సంభోదించింది. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) నాగ్ ఏం చెప్పాడు? శనివారం ఎపిసోడ్లో భాగంగా నాగ్ ఈ విషయమై సీరియస్ అయ్యాడు. శోభా, యవర్ని నిలబెట్టి మరీ కడిగేశాడు. ఫస్ట్ శోభాతో మాట్లాడిన నాగ్.. 'గతవారం భోలె.. నిన్ను ఎర్రగడ్డ అన్నందుకు గింజుకున్నావ్, మరి నువ్వు పిచ్చోడు అనడం కరెక్టా?' అని అడిగాడు. 'నీకు క్షమించే గుణం లేనప్పుడు నువ్వు మాటలు జారకూడదు కదమ్మా' అని చల్లబరిచాడు. ఇక యవర్తో మాట్లాడుతూ.. 'బిగ్బాస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయకూడదని కంప్లీట్ రూల్స్ ఉన్నాయ్. మళ్లీ యువర్ బ్యాక్ టూ ద ఒరిజినల్ బిహేవియర్, నువ్వు ప్రవర్తించిన పద్ధతి చూస్తే.. నేనైనా ఆడియెన్స్ అయినా, ఎవరైనా సరే పిచ్చోడు అంటారు' అని నాగ్ సీరియస్ అయినట్లు ప్రోమోలో చూపించారు. యవర్ అసలు రంగు హౌసులో శివాజీకి శిష్యరికం చేస్తున్న యవర్.. వచ్చిన తొలి రెండు వారాల్లో గట్టిగా గొడవలు పడ్డాడు. ఆ తర్వాత గురువు శివాజీ చెప్పడంతో పాటు హౌస్మేట్స్ అదే చెప్పేసరికి కోపాన్ని తగ్గించుకున్నట్లు కవరింగ్ ఇచ్చాడు. ఇప్పుడు శోభా చిన్నగా ఓ మాట అనేసరికి నిజంగానే రెచ్చిపోయి, మిర్చిదండ విసిరేయడం, అమ్మాయి అని చూడకుండా మీదమీదకి వెళ్లిపోవడం లాంటివి చేసి.. నిజంగానే పిచ్చోడు అని నాగ్తోనే అనిపించుకున్నాడు. తన అసలు స్వరూపాన్ని బయటపెట్టి మళ్లీ బ్యాడ్ అయిపోయాడు. (ఇదీ చదవండి: తల్లి చివరి కోరిక తీర్చబోతున్న మహేశ్బాబు.. త్వరలో శుభకార్యం!) -
పంట పండించేవాడికి.. పంచుకోవడం కూడా తెలియాలి: రైతుబిడ్డకు అమర్దీప్ కౌంటర్
ఈ ఏడాది తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-7 కాస్తా ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది. గతేడాది నిరాశపర్చిన బిగ్బాస్ ఈసారి ఉల్టా-పుల్టా అంటూ సరికొత్తగా పరిచయం చేశారు. ఆ తర్వాత షో జరిగిన ఐదు వారాలకు బిగ్బాస్ 2.0 అంటూ మరోసారి ఆసక్తిని పెంచేశారు. ఐదుగురిని ఎలిమినేట్ అవ్వగా.. కొత్తగా అంతేమందిని హౌస్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ షో ఎనిమిదో వారానికి చేరుకుంది. ఈ వారంలో జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ చివరిదశకు చేరింది. బిగ్బాస్ మారథాన్లో గెలిచి కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచిన వారిలో అర్హతలేని వ్యక్తి మెడలో మిరపకాయల దండ వేయమని బిగ్బాస్ కంటెస్టెంట్లకు సూచించాడు. (ఇది చదవండి: రైతుబిడ్డను మళ్లీ ఏడిపించిన రతిక.. నోరేసుకుని సాధిస్తున్న శోభ!) కాగా.. ఈ వారం బిగ్బాస్ మారథాన్లో ప్రియాంక, ప్రశాంత్, సందీప్, గౌతమ్, శోభ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. ఈ క్రమంలో కెప్టెన్ అయ్యేందుకు అర్హతలేని వ్యక్తుల మెడలో మిరపకాయల దండ వేసి వాళ్లను ఎలిమినేట్ చేయాలని బిగ్బాస్ హౌస్మేట్స్కు సూచించాడు. ఇప్పటికే ఒకసారి కెప్టెన్ అయినందుకు ప్రశాంత్కు వ్యతిరేకంగా అమర్దీప్ ఓటు వేస్తున్నట్లు ప్రకటిస్తాడు. కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి పల్లవి ప్రశాంత్ ఎలిమిషన్ కోసం మొదట అమర్దీప్ ఓటేస్తాడు. 'పంట పండించేవాడికి.. పంచుకోవడం కూడా తెలియాలిరా నీకు అంటూ అమర్దీప్ అంటాడు. ఏదైన చెప్పినప్పుడు తొడ కొట్టేది, మీసాలు తిప్పేది, మేలేసేది, పక్కవాళ్లు నవ్వితే సంక గుద్దేది కాదు.. అంటూ ప్రశాంత్ను ఉద్దేశించి మాట్లాడతాడు. ఆ తర్వాత టేస్టీ తేజ మాట్లాడుతూ.. ప్రశాంత్ నీవు ఇప్పటికే కెప్టెన్ అయ్యావ్ కాబట్టి.. మరోసారి నీకు అవసరం లేదంటూ ప్రశాంత్ మెడలో మిరపకాయల దండ వేస్తాడు. దీనికి ప్రశాంత్ బదులిస్తూ.. మీరంతా నాపై ఇలా దండలు వేస్తుంటే రైతులు పండించిన పంట పూలమాలలా ఉంది.'అని నవ్వుతూ చెబుతాడు. అలాగే ప్రియాంక మెడలో భోలే షావలి మిరపకాయల దండ వేసి ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేశాడు. ఇక శోభకు వ్యతిరేకంగా రతిక, యావర్లు ఓటేస్తారు. ఈ క్రమంలో శోభ, యావర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. యావర్ను పిచ్చోడు అంటూ శోభ మాట్లాడటంతో ఆమెపై ఫైర్ అవుతాడు. (ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) ఆ తర్వాత అశ్విని మాట్లాడుతూ.. ప్రశాంత్కు ఓటేయడానికి ఇక్కడున్న వారికి ఎవరికీ అర్హత లేదని అంటుంది. ఇది విన్న టేస్టీ తేజ ఆమెపై ఫైర్ అవుతాడు. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరు? అని ప్రశ్నిస్తాడు. నేను అపోజిట్లో ఉన్నంత వరకు కెప్టెన్ అయినోన్ని ఇంకోసారి అవ్వనివ్వనని అమర్దీప్ చెప్పడంతో ప్రోమో ముగిసింది. ఇవాల్టి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోలు చూస్తే కెప్టెన్ ఎవరు అవుతారనే విషయంపై మరింత ఆసక్తి కలుగుతోంది. మరి ఇంటి సభ్యుల మనసు గెలుచుకుని ఈ వారం కెప్టెన్గా ఎవరు నిలిచారో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే! -
'రాననుకున్నారా.. రాలేననుకున్నారా?.. కోపంతో ఊగిపోయిన గౌతమ్ కృష్ణ!
బిగ్ బాస్ తెలుగు సీజన్-7 2.0. ఇప్పటిదాకా జరిగిన షో ఒక ఎత్తు. ఇప్పుడు జరుగుతున్న షో ఒక ఎత్తు. ఎందుకంటే ఇప్పటివరకు ఉల్టా పుల్టా అంటూ సాగిన షో.. ఇప్పుడు ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్తో మరింత రసవత్తరంగా మారింది. బిగ్బాస్ రోజుకు ఒక షాక్ ఇస్తూ ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేస్తున్నారు. ఈ షో మొదలైన ఐదు వారాల్లో ఐదుగురు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఐదో వారంలో బిగ్ ట్విస్ట్ ఉంటుందని.. ఇద్దరూ ఎలిమినేట్ కావొచ్చని భావించారు. కానీ అలాంటిదేం జరగలేదు. శుభశ్రీ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా.. గౌతమ్ను సీక్రెట్ రూమ్లోకి పంపి బిగ్ షాకిచ్చారు బిగ్ బాస్. తాజా ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను రిలీజైంది. ఈ ప్రోమోలో గౌతమ్ కృష్ణ సీక్రెట్ రూమ్ నుంచి బయటికొచ్చేశాడు. (ఇది చదవండి: కొంతమంది నన్ను ఫ్లర్ట్ చేయడానికి యత్నించారు: శుభ శ్రీ) బయటకు వస్తూనే గౌతమ్ మాట్లాడుతూ..'రాననుకున్నారా.. రాలేననుకున్నారా? అంటూ సీక్రెట్ రూమ్లో ఉన్న గౌతమ్ ఎంతో ఆవేశంతో బయటకొచ్చాడు. అశ్వత్థామ ఇజ్ బ్యాక్ అంటూ ఎంట్రీ ఇచ్చాడు. 'తేనే పూసిన కత్తిని గొంతులో దింపారు కదా.. అయినా ఈ అశ్వత్థామ చావడు. ఎలా వెళ్లానో అలానే వచ్చా. దిస్ ఇజ్ 2.0 బేబీ' అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. అయితే గౌతమ్ కృష్ణ మాటలు చూసి కంటెస్టెంట్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత శివాజీనీ ఉద్దేశించి మాట్లాడారు. అన్న మీరు నన్ను ఎంటర్టైన్ చేయలేడేమో అన్నారు కదా? అని గౌతమ్ చెప్పడంతో.. తమ్ముడు ముందు నీ రీజన్ చెప్పు అంటూ శివాజీ అన్నారు. 'ఎంటర్టైన్ చేయడమంటే ప్యాంట్ తీసేసి తిరగడం కాదు కదన్నా.. కవర్ను చూసి బుక్ను జడ్జ్ చేయొద్దన్నారు అన్నా' గౌతమ్ చెప్పారు. ఆ తర్వాత శివాజీ మాట్లాడుతూ.. 'బట్టలిప్పడం ఎంటర్టైన్మెంటా? అని ఇంతమంది ముందు అన్నావ్. 100 సినిమాల్లో చేశా బట్టలు లేకుండా.. నేను ఒక నటుడిని.. ఏమైనా చేస్తా' అన్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ వెంటనే గౌతమ్.. నీకు ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నాను.. దీన్ని ఊపయోగించి నువ్వు ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు' అని ఆప్షన్ ఇచ్చాడు. దీంతో గౌతమ్ ఎవరినీ నామినేట్ చేయాలనుకున్నాడో చెప్పేలోగా ప్రోమో ముగిసింది. గౌతమ్ ఎవరినీ నామినేట్ చేయనున్నాడో ఇవాళ ప్రసారమయ్యే ఎపిసోడ్లో క్లారిటీ రానుంది. సీక్రెట్లో రూమ్లో ఉన్న గౌతమ్కు బయటకు రావడం, స్పెషల్ పవర్ ఇవ్వడం ఈ ఎపిసోడ్లో హాట్టాపిక్గా మారింది. కాగా.. ఈ వారం అశ్విని, నయని పావని, పూజా మూర్తి, తేజ, శోభా శెట్టి, అమర్దీప్, సందీప్, ప్రిన్స్ యావర్ నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: నామినేషన్స్లో ట్విస్ట్.. కొత్తవాళ్లకే ఛాన్స్! ఒక్కొక్కరికీ ఉంటదీ..) -
'నా భార్య అర్థం చేసుకుంటది.. నువ్వు నా మాట విను'.. ప్రశాంత్పై శివాజీ ఎమోషనల్!
ఈ ఏడాది బిగ్బాస్ చూస్తున్న వారు ఎప్పుడు కంటెస్టెంట్స్ మధ్య ఏదో గొడవ జరగడం తప్ప ఏముంది అని ఫీలవుతుంటారు. ఎందుకంటే మొదటి వారం నుంచే నామినేషన్స్, ఎలిమినేషన్స్తో హీటెక్కించారు. నాలుగు వారాలుగా హాట్హాట్గా సాగిన బిగ్బాస్.. ఐదో వారంలో మాత్రం ఎమోషనల్ టచ్ ఇచ్చారు. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే హౌస్లోని కంటెస్టెంట్స్కి.. తమ కుటుంబ సభ్యుల పట్ల భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. (ఇది చదవండి: త్యాగం చేసిన ఆ ఇద్దరు.. ఆటలోనే లేకుండా పోయిన మరో ఇద్దరు!) తాజాగా ప్రోమో విడుదల కాగా.. అందులోని సీన్స్ ఆడియన్స్ను సైతం కంటతడి పెట్టించేలా ఉన్నాయి. అయితే బిగ్బాస్ కంటెస్టెంట్లకు వారి ఇంటి సభ్యులు పంపించిన ఉత్తరాలు చేతికందించారు. కానీ కెప్టెన్సీ టాస్కులో భాగంగా ఇంట్లో ఉన్నవారంతా జోడీ కట్టిన సంగతి తెలిసిందే కదా! అలా ఈ జోడీలో ఒకరు త్యాగం చేస్తే.. మరొకరికి మాత్రమే ఉత్తరం చదువుకునే అవకాశం ఉంది. అంటే ఎవరో ఒకరు తమ ఉత్తరాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. దీంతో కంటెస్టెంట్ల మధ్య ఫుల్ ఎమోషనల్ సీన్స్ కనిపించాయి. అయితే ఈ ప్రోమోలో అమర్దీప్ తన భార్యను తలుచుకుని కంటతడిపెట్టాడు. అమర్దీప్ మాట్లాడుతూ.. ఇంతవరకు తేజును బాగా చూసుకున్నానో లేదో కూడా నాకు తెలియదు. ఇక్కడ ఉన్నప్పుడు నాకు కొన్ని విలువలు తెలిసొచ్చాయి. కన్నాను చూడగానే అదే పిలిచినట్లు అనిపించింది. తేజు ఐ యామ్ సో సారీ. నీ విలువ తెలిసింది నాకు అంటూ బోరున ఏడ్చేశారు. ఆట సందీప్ కోసం తన భార్య పంపిన లెటర్ను అమర్ త్యాగం చేశాడని తెలుస్తోంది. (ఇది చదవండి: చిన్నపిల్లాడిలా ఏడ్చిన తేజ, అమ్మ అనారోగ్యంతో ఉందంటూ సందీప్..) ఇక శివాజీ, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మధ్య ఎమోషన్స్తో హౌస్ నిండిపోయింది. శివాజీ మాట్లాడుతూ..'ఎక్కడో ఊరి నుంచి వచ్చావు.. అన్న అంటూ హగ్ చేసుకున్నావ్.. నేను నా లెటర్ను గివ్ అప్ చేస్తున్నా. నా భార్య నన్ను బాగా అర్థం చేసుకుంటది. తనను నేను ఎంత బాగా చూసుకున్నానో నాకు తెలవదు కానీ.. నన్ను మాత్రం చాలా బాగా చూసుకుంటుంది. నువ్వు నా మాట విను అంటూ' పల్లవి ప్రశాంత్ కోసం తన భార్య పంపిన లెటర్ను శివాజీ త్యాగం చేసినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఈ ప్రోమో చూస్తేనే కంటెస్టెంట్స్ మధ్య భావోద్వేగాలు ఆడియన్స్ను సైతం ఫుల్ ఎమోషనల్గా టచ్ చేశాయి. ఇంకా ఈ రోజు ఎపిసోడ్లో ఎవరెవరు లెటర్స్ను త్యాగం చేశారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. -
ఆ కంటెస్టెంట్స్కు బిగ్ బాస్ బిగ్ షాక్.. అదేంటో తెలుసా?
ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి కాగా.. నలుగురు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకొచ్చేశారు. ఇక ఐదోవారం మొదలవ్వగానే బిగ్ బాస్ కంటెస్టెంట్స్కు బిగ్ షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు పవర్ అస్త్రను సొంతం చేసుకున్న కంటెస్టెంట్స్ నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యారు. అయితే ఐదోవారం మొదటి రోజే పవరాస్త్రాలను బిగ్ బాస్ వెనక్కి తీసుకున్నారు. దీంతో హౌస్లో ఈ వారంలో నామినేషన్స్ మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. ఇప్పటికే ఈ రోజుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రోమోలో పవరాస్త్రాలను వెనక్కి తీసుకున్న తర్వాత కంటెస్టెంట్స్ రియాక్షన్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: 'బిగ్బాస్'కే నీతులు చెబుతున్న శివాజీ.. హౌస్లో ఇకపై కష్టమే!) ప్రోమో ప్రారంభంలోనే శుభశ్రీ, గౌతమ్ మధ్య రొమాంటిక్ సీన్స్తో మొదలైంది. నేను మాట్లాడికే ఇష్టం లేదా అంటూ గౌతమ్ను ప్రశ్నిస్తుంది శుభశ్రీ. దీనికి గౌతమ్ లాయల్టీ ఉంది కాబట్టి భరిస్తున్నా అంటాడు. ఆ తర్వాత శివాజీ మాట్లాడుతూ.. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. కాఫీ కూడా ఇవ్వలేని బతుకా నాది అనిపిస్తుంది. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్గా మారిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ పవరాస్త్రాలను తిరిగివ్వాలని ఆదేశిస్తాడు. దీంతో ఆట సందీప్, పల్లవి ప్రశాంత్, శోభాశెట్టి తమ పవరాస్త్రాలను బిగ్ బాస్ చెప్పిన విధంగానే ఓ పెట్టెలో భద్రపరుస్తారు. దీంతో ఆ ముగ్గురి పవరాస్త్రాలు పోవడంతో శివాజీ అవహేళనగా మాట్లాడతాడు. శివాజీ హేళన చేయడం శోభాశెట్టికి ఆగ్రహం తెప్పిస్తుంది. కొందరు ఉంటారు.. మనం బాగుపడకపోయినా ఫరవాలేదు.. పక్కవాడు మాత్రం అస్సలు బాగుపడకూడదు అనేవాళ్లు అంటూ శివాజీని ఉద్దేశించి మాట్లాడింది. అయితే ఇప్పటికే శివాజీ తన పవర్ అస్త్రను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రోమో చూస్తే ఇక ఈ వారంలో ఇప్పటికే నామినేషన్స్ మొదలవగా.. దీంతో మిగిలిన కంటెస్టెంట్స్ను కూడా నామినేట్ చేసే అవకాశం వచ్చింది. మరీ ఈ వారంలో ఎవరూ సేఫ్ అవుతారో.. ఎవరెవరు నామినేషన్స్లో నిలుస్తారో వేచి చూడాల్సిందే. -
టచ్ చేస్తూ ప్రశాంత్ గొడవ.. రతిక మాస్ వార్నింగ్!
'బిగ్బాస్ 7' మూడో వారంలోకి అడుగుపెట్టేసింది. తొలి రెండు వారాల్లో కిరణ్, షకీలా ఎలిమినేట్ అయిపోయారు. ఇక తాజా నామినేషన్స్లో ఏకంగా ఏడుగురు నిలిచారు. అయితే ఈసారి సోమవారం ఎపిసోడ్ కాస్త ప్లెయిన్ గానే జరిగినప్పటికీ ఆ తర్వాత గొడవలు, స్కెచ్లు, టాస్కులతో హౌస్ అంతా హీటెక్కిపోయింది. ఇంతకీ బిగ్బాస్ లేటెస్ట్ ప్రోమోలో ఏముంది? మళ్లీ పులిహోర మొదలు తొలివారం రతికతో ప్రశాంత్ గట్టిగా పులిహోర కలిపేశాడు. రెండో వారం వచ్చేసరికి అది బ్యాక్ ఫైర్ అయిపోయింది. దీంతో ఇద్దరూ మాట్లాడుకోవడమే మానేశారు. మూడోవారం వచ్చేసరికి మళ్లీ మొదటికొచ్చారు. తన మైండ్ బ్లాంక్ అయిపోయిందని రతిక ఏడుస్తుంటే.. ఆమెని కూల్ చేసేందుకు ప్రశాంత్ ఫర్టింగ్ చేశాడు. కంట్లో నుంచి నీళ్లు రాకుండా పాలలెక్క వస్తున్నాయి ఏందని అన్నాడు. దీంతో ఆమె సిగ్గు పడిపోతూ నవ్వేసింది. (ఇదీ చదవండి: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం..!) చేతులేయడంతో గొడవ రెండో ప్రోమోలో భాగంగా మూడు వారాల ఇమ్యూనిటీ టాస్క్ కోసం అమరదీప్, శోభాశెట్టి, యవర్ని బిగ్బాస్ సెలెక్ట్ చేశాడు. అయితే వీళ్లలో ఎవరు పోటీకి అనర్హులో చెప్పమని మిగిలిన వాళ్లని అడిగాడు. దీని తర్వాత ఏ విషయం గురించో తెలీదు గానీ ప్రశాంత్-రతిక గొడవపడ్డారు. 'హే పో' అని ప్రశాంత్.. రతికని టచ్ చేస్తూ అరిచాడు. దీంతో సీరియస్ అయిన రతిక.. మర్యాదగా ఉండదు చెబుతున్నా అని వార్నింగ్ ఇచ్చింది. అయితే అసలు ఎందుకు గొడవపడ్డారు? ఏం జరిగిందనేది తెలియాలంటే మంగళవారం ఎపిసోడ్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. నామినేషన్స్ సంగతేంటి? ఈ వారం నామినేషన్స్లో శుభశ్రీ, గౌతమ్, అమరదీప్, ప్రియాంక, దామిని, రతిక, యవర్ ఉన్నారు. వీళ్లలో ప్రస్తుతానికి అయితే ఓటింగ్ విషయంలో అమర్ టాప్లో ఉన్నట్లు తెలుస్తోంది. దామిని చివరి స్థానంలో ఉన్నట్లు సమాచారం. మూడో ఎలిమినేషన్కి ఇంకా నాలుగైదు రోజుల టైముంది కాబట్టి అంతలో ఏదైనా జరగొచ్చు. ఓటింగ్ తారుమారు కావొచ్చనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. ప్రభాస్, మహేశ్ తర్వాత బన్నీనే!) -
నటుడు నరేశ్ ఎమోషనల్.. అది తలుచుకుని బాధపడి!
కొన్ని నెలల ముందు టాలీవుడ్లో ఓ జంట గురించి తెగ మాట్లాడుకున్నారు. వీళ్లిద్దరూ కలిసి తమ జీవితంపైనే ఓ సినిమా చేయడం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. అవును పైన చెప్పిందంతా కూడా నరేశ్-పవిత్రా లోకేశ్ గురించే. వినాయక చవితి సందర్భంగా ఓ టీవీ ఛానెల్లో ప్రసారమైన షోలో పాల్గొన్నారు. అయితే ఈ ప్రోగ్రాంలో నరేశ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సీనియర్ నరేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. తొలుత హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మోస్ట్ బిజీయెస్ట్గా మారిపోయాడు. కెరీర్ పరంగా పీక్స్లో ఉన్న ఇతడు.. వైవాహిక జీవితంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. (ఇదీ చదవండి: 'ఖుషి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా?) నరేశ్, అతడి భార్య రమ్య రఘుపతి మధ్య చాన్నాళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. అయితే కొన్నాళ్లుగా ఇతడు, నటి పవిత్రా లోకేశ్ తో కలిసి ఉంటున్నారని వార్తలొచ్చాయి. ఇది నిజమనేలా బయటకూడా జంటగా కనిపించడం, 'మళ్లీ పెళ్లి' అని తమ జీవితాన్నే సినిమాగా తీయడం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. అయితే వినాయక చవితి సందర్భంగా నరేశ్-పవిత్రా లోకేశ్ని ఓ ఈవెంట్కి గెస్టులుగా పిలిచారు. నరేశ్.. ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. స్టేజీపై సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ నరేశ్ ఎమోషనల్ అయ్యాడు. '50 ఏళ్లు అయిపోయింది. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్లో రకరకాల ఒడిదొడుకులు. గతంలో చేసిన వాటి గురించి నేను బాధపడుతున్నాను' అని అన్నాడు. అయితే అది తన పెళ్లిళ్ల గురించి, లేదా మరేదైనా విషయమా అనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' లుక్ లీక్.. కోట్ల నష్టపరిహారం డిమాండ్!) -
నాగ్ ఇచ్చిపడేశాడు.. రైతుబిడ్డ ముఖం మాడిపోయింది!
'బిగ్బాస్ 7' సీజన్ మంచి రసవత్తరంగా సాగుతోంది. ఈ వారమంతా గొడవలే టార్గెట్ అన్నట్లు కంటెస్టెంట్స్ తిట్టుకున్నారు. తెగ హడావుడి చేశారు. అయితే వీకెండ్ వస్తే నాగార్జున వచ్చేస్తాడు. అప్పటివరకు జరిగిన వాటికి కౌంటర్స్ ఇచ్చేస్తాడు. అలా ఈ సారి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, అమర్దీప్, శివాజీకి గట్టిగానే పడ్డాయి. ఇంతకీ తాజా ప్రోమోలో ఏముంది? 'బిగ్బాస్' షోలో మిగతా రోజుల్లో ఎలా ఉన్నా గానీ సోమవారం, శని-ఆదివారం మాత్రం మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సోమవారం నామినేషన్ల హడావుడి ఉంటుంది. వీకెండ్ మాత్రం నాగార్జున వచ్చేస్తాడు. అందరికీ పేరుపేరున కౌంటర్స్ ఏసేస్తాడు. మంచి చేస్తే మెచ్చుకుంటాడు. ఎక్కువచేస్తే మాటలతో గాలి తీసేస్తాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7 : చిల్లర మాటలు.. అతి చేష్టలు.. ‘ఛీ’వాజీ) అలా ఈ వారం పెద్దగా ఫెర్ఫార్మెన్స్ చేయలేదని శివాజీకి కౌంటర్స్ పడ్డాయి. ప్రతిసారి వయసు అంశాన్ని మాట్లాడుతున్నందుకు షకీలాకు కూడా స్మూత్గా పడ్డాయి. ఇక నామినేషన్స్ సందర్భంగా ప్రశాంత్పై అమరదీప్ అరిచాడు. ఈ విషయమై స్పందించిన నాగార్జున.. 'అతడు డబ్బులు అతడి ఇష్టం. అతడు ఎవరికైనా ఇచ్చుకుంటాడు నీకెందుకు?' అని అన్నాడు. హౌసులోకి వెళ్లేటప్పుడు పల్లవి ప్రశాంత్కి హోస్ట్ నాగార్జున ఓ మొక్క ఇచ్చాడు. అయితే దాన్ని సరిగా పట్టించుకోకపోవడంతో అది ఆకులు రాలిపోయి, పూర్తిగా వాడిపోయింది. ఇప్పుడు అదే విషయాన్ని చెప్పిన నాగార్జున.. 'మొక్కనే సరిగా చూసుకోలేకపోయావ్ నువ్వు రైతుబిడ్డవా?' అని అన్నాడు. దీంతో ప్రశాంత్ ముఖం మాడిపోయింది. ఇంకా ఎవరెవర్ని ఏమేం కౌంటర్స్ పడ్డాయో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7: ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్!) -
'ఏంటి సార్ కొత్త ఫోనా'.. ఆసక్తి పెంచుతోన్న బిగ్ బాస్ ప్రోమో!
తెలుగువారిని అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ సీజన్కు నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. మొదటివారం కాస్తా నెమ్మదిగా సాగిన బిగ్బాస్ షో.. రెండోవారం నుంచే హాట్హాట్గా మారిపోయింది. అయితే తెలుగులో ఏడో సీజన్ కాగా.. కన్నడలో బిగ్ బాస్ సీజన్ 10కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. త్వరలో ప్రారంభం కానున్నట్లు ప్రోమోను విడుదల చేశారు. ఈ సారి కిచ్చా సుదీప్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 2వ తేదీన సుదీప్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మొదటి ప్రోమోలో కిచ్చా కనిపించలేదు. దీంతో మరోసారి స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేశారు. దీంతో త్వరలోనే బిగ్బాస్ శాండల్వుడ్ అభిమానులకు సందడి చేయనుంది. (ఇది చదవండి: డ్రగ్స్ కేసు.. నవదీప్ విషయంలో హైకోర్ట్ కీలక నిర్ణయం! ) సరికొత్తగా ప్రోమో బిగ్ బాస్ ప్రతి సీజన్కు విడుదల చేసే ప్రోమోలు కాస్తా కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించారు. అందుకు తగ్గట్టుగానే ప్రోమోను రిలీజ్ చేశారు. సరికొత్త "ఏంటి సార్ కొత్త ఫోన్" అని ఓ ఆఫీస్ సెక్యూరిటీ గార్డ్ను అడిగాడు యువకుడు. అవును సార్ నా కొడుకు పండగకి కొనిచ్చాడు. అని చెప్పగానే ప్రోమోలో సుదీప్ కనిపించాడు. ఆ తర్వాత అదే యువకుడు ఆటో ఎక్కి ఇంటికి వెళ్తే.. పండగ మొదలవుతోంది సార్ అంటూ ఆటోడ్రైవర్ నుంచి సమాధానం వస్తుంది. ఇంటి దగ్గరికి వచ్చేసరికి వీధి అంతా పండుగలా కనిపిస్తుంది. ఏంటిరా ఇందతా సందడి అని అక్కడి యువకులను అడుగుతాడు. వారంతా ఇది వందరోజుల పండగ అని సమాధానమిస్తారు.' ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 10 లుక్ చూపించారు. సుదీప్ కనుసైగ చేస్తూ "హ్యాపీ బిగ్ బాస్" త్వరలోనే మిమ్మల్ని అలరించేందుకు వస్తోంది అంటూ సుదీప్ ఫోటోను ఆవిష్కరిస్తూ సందడి చేస్తూ కనిపించారు ఫ్యాన్స్. కంటెస్టెంట్స్ ఎవరు? అయితే ఈ సీజన్లో బిగ్ బాస్ లిస్ట్ లో పది మందికి పైగా పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో కొందరి పేర్లు హల్ చల్ చేస్తున్నప్పటికీ.. కంటెస్టెంట్స్ గురించి అధికారికంగా తెలియరాలేదు. త్వరలోనే ఈ షో ప్రారంభమైన తర్వాతే ఆ క్యూరియాసిటీకి బ్రేక్ పడనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ నెలాఖరున షో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: రూమ్లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు.. కానీ: సీనియర్ నటి) ಊರ ಹಬ್ಬಕ್ಕೆ ಇಲ್ಲಿದೆ ರೀಸನ್; ಶುರುವಾಗ್ತಿದೆ HAPPY 'BIGG BOSS KANNADA' ಹತ್ತನೇ ಸೀಸನ್! #BiggBossKannada #BBK10 #KichchaSudeep #ColorsKannada #ಬಣ್ಣಹೊಸದಾಗಿದೆ #ಬಂಧಬಿಗಿಯಾಗಿದೆ @KicchaSudeep pic.twitter.com/qCQkXGkQgI — Colors Kannada (@ColorsKannada) September 14, 2023 -
అతడితో పులిహోర కలిపేస్తున్న రతిక.. పాపం ప్రశాంత్!
'బిగ్బాస్' హౌస్ రోజురోజుకీ క్రేజీగా మారుతుంది. లేకపోతే ఏంటబ్బా.. ఈరోజు ఫ్రెండ్ గా ఉన్నోళ్లు రేపటికి శత్రువులు అయిపోతున్నారు. ఇప్పుడు ఒకే టీమ్ లో ఉన్నోళ్లు.. రోజు మారేసరికి ఒకరిని ఒకరు ఎలా పడగొట్టాలా అని స్కెచ్ లు వేసుకుంటున్నారు. ఇంతకీ హౌసులో ఏం జరుగుతోంది? 12వ రోజు ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం. తొలివారం ఎంతో సరదాగా సాగిన బిగ్ బాస్.. రెండో వారంలోకి ఎంటరయ్యేసరికి చాలావరకు మారిపోయింది. ఎప్పుడు చూడు గొడవలే అవుతున్నాయి. మాట్లాడితే చాలు కంటెస్టెంట్స్.. ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నారు. తాజాగా 12వ రోజు కూడా గౌతమ్-ప్రిన్స్ గొడవపడ్డారు. దీంతో ప్రిన్స్ ఏడ్చేశాడు. ఇక కన్ఫెషన్ రూంలోకి వెళ్లొచ్చిన తర్వాత రతికతో మాట్లాడుతూ కనిపించాడు. ఆమె కూడా ఇతడితో పులిహోర కలుపుతూ కనిపించింది. (ఇదీ చదవండి: రతిక.. నా కొడుకుని వాడుకుంది:పల్లవి ప్రశాంత్ పేరెంట్స్) అయితే రతిక-ప్రిన్స్ మధ్య ప్రేమలాంటిది పుట్టడం కాదు.. అదంతా ప్రశాంత్ ముందే జరగడం.. అయ్యో పాపం అనిపించేలా ఉంది. మరోవైపు పవర్ అస్త్ర కోసం గేమ్స్ గెలుచుకున్న మహాబలి గ్రూపులో షకీలా, శివాజీ అర్హులని అందరూ నిర్ణయించారు. అయితే సడన్ ఎంట్రీ ఇచ్చిన బిగ్బాస్.. సందీప్ ని మరో వ్యక్తిని కంటెండర్ గా సెలెక్ట్ చేసే అవకాశం కల్పించాడు. దీంతో సంచాలకుడు సందీప్.. అమర్దీప్ని పవర్ అస్త్ర పోటీ కోసం ఎంచుకున్నాడు. దీంతో ఇప్పటికే పోటీలో ఉన్న షకీలా, శివాజీ అసహనం వ్యక్తం చేశారు. తాము ఇంట్లో నుంచి వెళ్లిపోతామని అరిచి కేకలు పెట్టడం మీరు తాజా ప్రోమోలో చూడొచ్చు. మరి పూర్తిగా ఏం జరిగిందనేది తెలియాలంటే శుక్రవారం ఎపిసోడ్ చూడాల్సిందే. (ఇదీ చదవండి: బిగ్బాస్: నాకు న్యాయం కావాలి.. చంటిపిల్లాడిలా ఏడ్చేసిన ప్రిన్స్) -
బెండు తీసిన 'బిగ్బాస్'.. హౌసులో దొంగతనానికి స్కెచ్!
తొలివారం చప్పగా సాగిన 'బిగ్బాస్ 7'.. రెండోవారం వచ్చేసరికి ట్రాక్లోకి పడినట్లు కనిపిస్తుంది. గొడవలు, టాస్కులతో మంచి ఇంట్రెస్టింగ్గా సాగుతోంది. ఇప్పటివరకు 9 రోజులు పూర్తి కాగా, బుధవారం 10వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే రిలీజ్ చేసిన ప్రోమోలు.. ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ ఏంటి విషయం? దొంగతనం స్కెచ్ 'పవర్ అస్త్ర' దక్కించుకోవడంలో భాగంగా రణధీర, మహాబలి పేర్లతో కంటెస్టెంట్స్ ని గ్రూపులుగా విభజించి.. ఓ గేమ్ పెట్టాడు. ఇందులో రణధీర సమూహం (అమర్దీప్, ప్రియాంక, శివాజీ, ప్రిన్స్, షకీలా, శోభాశెట్టి) ఓ తాళం గెలుచుకున్నారు. అయితే దాన్ని దొంగిలించాలని మహాబలి టీమ్ స్కెచ్ వేసింది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్'కి డబ్బింగ్ చెప్పే ఈయన ఎవరో తెలుసా?) రాత్రి నిద్రపోయే టైంలో దాన్ని కొట్టేయాలని ప్లాన్ వేసింది. కానీ శివాజీ.. ఆ తాళాన్ని ఓ బెల్టులో పెట్టి, నడుముకి కట్టేసుకోవడం, రతిక దాన్ని కొట్టేయాలని ప్లాన్ చేయడం లాంటివి ప్రోమోలో చూపించారు. ఓవరాల్గా ఏం జరిగిందనేది బుధవారం ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్లో చూడొచ్చు. బెండు తీశాడు ఇకపోతే 'మాయ అస్త్ర' కోసం 'మలుపులో ఉంది గెలుపు' పేరుతో రెండు సముహాల మధ్య బిగ్బాస్ రెండో గేమ్ పెట్టాడు. ఇందులో భాగంగా స్పిన్ వీల్ లో సూచించిన విధంగా.. ఆయా కలర్స్ ఉన్న చోట కాళ్లు, చేతులు పెట్టాల్సి ఉంటుంది. గెలిచిన టీమ్కి 'మాయ అస్త్ర'కి సంబంధించిన మరో తాళం లభిస్తుంది. అయితే ఈ ఆటలో భాగంగా బాడీని ఎలా పడితే అలా వంచేశారు. ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు.. బిగ్బాస్ వాళ్ల బెండు తీశాడని కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: బిగ్ బాస్ రెండో వారం నామినేషన్స్లో ఆ తొమ్మిది మంది)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
ఫ్యాన్స్లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
లవ్ మీ సినిమా స్టోరీ లీక్ చేసిన బ్యూటీ, క్లైమాక్స్ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)
ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఆ రెండు చిత్రాలే స్పెషల్!
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement