-
లైసెన్స్ లేని ‘మ్యూజిక్’
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు విభాగం 2022 నుంచి పునఃప్రారంభించిన విధానం ప్రకారం ప్రతి పబ్ కచి్చతంగా అమ్యూజ్మెంట్ లైసెన్స్ తీసుకోవాల్సిందే. ఇది లేకపోతే కేవలం ఓ బార్ మాదిరిగా వ్యవహరించాలే తప్ప మ్యూజిక్కు అనుమతి ఉండదు. ఇప్పటికీ సిటీలో అనేక పబ్లు ఈ అనుమతి లేకుండానే యథేచ్ఛగా కార్యకలాపాలు సాగించేస్తున్నాయి. అప్పుడప్పుడు దాడులు చేస్తున్న పోలీసులు సైతం ఓ బెయిలబుల్ కేసు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. పోలీసు నిబంధనల్ని పట్టించుకోని వారి విషయం ఇలా ఉంటే.. కొందరు పబ్స్ యజమానులు తాము ఈ అమ్యూజ్మెంట్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసినా అనుమతి లభించట్లేదని ఆరోపిస్తున్నారు. పదేళ్ల క్రితం నిలిచిపోయిన విధానం.. నగరంలో ఒకప్పుడు పబ్స్కు లైసెన్సులు జారీ చేయడంలో పోలీసు విభాగానికీ కీలక పాత్ర ఉండేది. వీళ్లు సైతం క్లియరెన్స్ ఇస్తేనే పబ్ నడిచేందుకు అనుమతి ఉండేది. 2015 నుంచి అమలులోకి వచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానంతో ఈ పద్ధతికి ఫుల్స్టాప్ పడింది. వ్యాపార సంస్థల ఏర్పాటును ప్రోత్సహించడం కోసమంటూ పబ్స్కు పోలీసు లైసెన్స్ విధానాన్ని ప్రభుత్వం అటకెక్కించేసింది. ఫలితంగా కొన్నాళ్లు పరిస్థితులు సజావుగానే ఉన్నా.. ఆపై అసలు సమస్యలు మొదలయ్యాయి. అనేక పబ్స్ ఉల్లంఘనలు, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్లుగా మారిపోయాయి. ఈ విషయంపై హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసులు 2022 నుంచి పాత విధానాన్ని పునరుద్ధరించారు. అధికారిక వెబ్సైట్ ద్వారానే దరఖాస్తు.. వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎంటర్టైన్మెంట్, ఎమ్యూజ్మెంట్ లైసెన్సుల జారీకి నగర పోలీసులు 2022 డిసెంబర్ 20 నుంచి శ్రీకారం చుట్టారు. పోలీసుస్టేషన్లు, ఉన్నతాధికారుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే జారీ చేసే విధానం ప్రారంభించారు. ఈ అవకాశంతో కూడిన నగర పోలీసు వెబ్సైట్ ( ఠీఠీఠీ. జిyఛ్ఛీట్చb్చఛీఞౌ జీఛ్ఛి. జౌఠి. జీn) కొత్త వెర్షన్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ద్వారా దరఖాస్తును 15 నిమిషాల్లో సబి్మట్ చేసేందుకు ఆస్కారం ఏర్పడింది. దీన్ని పరిశీలించే పోలీసు విభాగం కొత్త లైసెన్సును 30 రోజుల్లో, రెన్యువల్ను 15 రోజుల్లో పూర్తి చేసేలా సమయాన్ని నిర్దేశించారు. దీనికి ముందు స్థానిక శాంతిభద్రతల విభాగం (ఎల్ అండ్ ఓ), ట్రాఫిక్ డీసీపీలు దరఖాస్తుదారుడు పబ్ ఏర్పాటు చేయనున్న భవనాన్ని పరిశీలించేలా నిబంధనలు రూపొందించారు. పక్కా పరిశీలన తర్వాతే అనుమతి... ఈ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా అధికారులు ఆ పబ్ ఉన్న ప్రాంతం, చుట్టుపక్కల వారికి ఏవైనా ఇబ్బందులు కలుగుతాయా? సౌండ్ పొల్యూషన్కు ఆస్కారం ఉందా? అవసరమైన స్థాయిలో పార్కింగ్ వసతులు ఉన్నాయా? తదితర అంశాలను పరిశీలిస్తారు. అవసరమైన అన్ని నిబంధనల ప్రకారం ఉంటేనే అమ్యూజ్మెంట్ లైసెన్సు జారీ చేయాల్సిందిగా కోరుతూ నగర కొత్వాల్కు సిఫార్సు చేస్తారు. ఈ విధానం కొత్తగా ఏర్పాటు చేయబోయే పబ్స్కు మాత్రమే కాదు.. అప్పటికే ఉన్న వాటికీ వర్తింస్తుంది. సరైన పార్కింగ్ వసతి లేని వారిని నిర్ణీత సమయం ఇచ్చి పార్కింగ్ వసతి ఏర్పాటు చేసుకునే అవకాశం ఇస్తారు. రాత్రి 10 గంటల తర్వాత సౌండ్ బయటకు రాకుండా చర్యలు తీసుకునేలా చేస్తారు. కేవలం రాత్రి వేళల్లోనే కాకుండా ఏ సమయంలో ఈ పబ్స్లో వచ్చే శబ్దాలతో స్థానికులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటారు. వాళ్లు తీసుకోరు.. వీళ్లు అడిగినా ఇవ్వరు.. ► ఎమ్యూజ్మెంట్ లైసెన్స్ విధానం పునరుద్ధరించి 14 నెలల దాటుతున్నా.. ఇప్పటికీ నగరంలోని అనేక పబ్స్ ఇది లేకుండా, కేవలం ఎక్సైజ్, జీహెచ్ఎంసీ అధికారులు ఇచి్చన పర్మిషన్లతో నడిపించేస్తున్నారు. పోలీసుస్టేషన్ల వారీగా పబ్ల జాబితా రూపొందించి, వాటిలో ఎన్నింటికీ ఈ ఎమ్యూజ్మెంట్ లైసెన్స్ ఉంది? ఎన్ని దరఖాస్తు చేశాయి? ఎన్ని ఈ నిబంధనల్ని పట్టించుకోవట్లేదు? అనే అంశాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ► పోలీసులు మాత్రం అప్పుడప్పుడు దాడులు చేస్తున్నారు. లైసెన్స్ లేదంటూ ఓ కేసు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. లైసెన్స్ తీసుకోని వారి విషయం ఇలా ఉంటే.. కొందరు దీన్ని పొందాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేసినా.. పోలీసులు పట్టించుకోవట్లేదు. కొత్త లైసెన్సు జారీ 30 రోజుల్లో, రెన్యువల్ ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేసేలా గడువు నిర్దేశించుకున్నా ఇది అమలు కావట్లేదు. ఈ విషయం తెలిసిన మిగిలిన పబ్స్ యజమానులూ దరఖాస్తు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. -
‘అక్కడ ఫ్యాక్టరీ పెట్టనే పెట్టం.. వాళ్లు పనిచేయకుండా పబ్కు పోతారు’
యూకేలో ఫ్యాక్టరీల ఏర్పాటుపై అపోలో టైర్స్ అధిపతి నీరజ్ కన్వర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఫ్యాక్టరీలు పెట్టనే పెట్టబోమని, అక్కడి వర్కర్లు పనిచేయకుండా పబ్లకు వెళ్తారని ఆరోపించారు. అందులోనూ అక్కడి ఫ్యాక్టరీలు పెట్టడానికి ఎటువంటి ప్రోత్సాహకాలు లేవని నీరజ్ కన్వర్ వ్యాఖ్యానించినట్లు ‘డైలీ మెయిల్’ కథనం పేర్కొంది. ఇదే సమయంలో ఇతర దేశాలు ఇచ్చిన ప్రోత్సాహకాలను హైలైట్ చేస్తూ "హంగేరీ మాకు ప్రోత్సాహకాలను ఇచ్చింది. ఇక్కడ కార్మికుల ఖర్చు చాలా అందుబాటులోనే ఉంది. దీంతో ఉత్పత్తి ఖర్చు తక్కువే అవుతుంది. ఇక యూకేలో శ్రామిక శక్తి ఎలా ఉందో మీకు తెలుసు. వీళ్లు పెద్దగా పనిచేయకుండా పబ్లకు వెళ్తుంటారు" అని అపోలో టైర్స్ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ కన్వర్ వ్యాఖ్యానించారు. ఇది అక్కడ విధానపరమైన సమస్యగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వ విధానాల వల్ల అక్కడి ప్రజలు పనులు చేయకుండా ఇంట్లో కూర్చొని పెన్షన్లు తీసుకుంటున్నారని నిందించారు. లండన్లో ఇటాలియన్ రెస్టారెంట్ కూడా ఉన్న కన్వర్కు ప్రపంచవ్యాప్తంగా ఏడు ఫ్యాక్టరీలు ఉన్నాయి. కానీ యూకేలో ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. అపోలో టైర్స్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 18,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అలాగే యూకేలో కార్పొరేట్ వ్యవహారాలను నిర్వహించడానికి 30 మంది సభ్యుల టీమ్ ఉంది. ఇక్కడే ఈ కంపెనీకి ఇన్నోవేషన్ హబ్ ఉండటం గమనార్హం. కాగా మరో ఇన్నోవేషన్ హబ్ భారత్లోని హైదరాబాద్లో ఉంది. మాంచెస్టర్ యునైటెడ్కు ఈ కంపెనీ దీర్ఘకాలిక స్పాన్సర్గా కొనసాగుతోంది. -
HYD: పబ్బుల్లో డ్రగ్స్.. యువతులు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: పబ్బుల్లో డ్రగ్స్ అమ్ముతున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్లోని పబ్ల్లో డ్రగ్ విక్రయాలు చేస్తున్నారు. మాదాపూర్లోని నోవాటెల్ ఆర్టిస్ట్రీ, ఎయిర్ లైవ్, క్లబ్ రౌగ్, క్లబ్ రాక్ పబ్బుల్లో డ్రగ్స్ దందా సాగిస్తున్నారు. బెంగళూరు, ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి పబ్బుల్లో విక్రయిస్తున్న మహిళల నుంచి 10 గ్రాముల ఎండీఎంఏతో పాటు కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అమ్ముతున్న మిథున, కొంగాల ప్రియలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో నలుగురు కలిసి గత కొంతకాలం నుంచి డ్రగ్స్ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా బెంగళూరు, ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ సప్లయర్స్ ఉస్మాన్, అజీం, అబ్దుల్లా పరారీలో ఉన్నారు. -
హైదరాబాద్ లో మితిమీరిన పబ్ ల ఆగడాలు
-
న్యూఇయర్ వేడుకల రోజు నిబంధనలు ఉల్లంఘించిన పబ్లు
-
Hyd: నిబంధనలు పాటించని పబ్లపై కొరడా.. ఆరు పబ్లపై కేసులు
సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల రోజు నిబంధనలు ఉల్లంఘించిన పబ్లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. జూబ్లీహిల్స్లో ఆరు పబ్బులపై కేసులు నమోదు చేశారు. నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు నడిచిన హలో, టార్,గ్రీన్ మంకిస్, మకవ్,లాస్ట్, జీనా పబ్బులపై కేసులు నమోదయ్యాయి. నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలను పబ్ నిర్వాహకులు లెక్కచేయలేదు. అధిక డీజే సౌండ్తో స్థానికులను ఇబ్బందిపెట్టినందుకు కూడా కేసు నమోదు చేశారు. భారీ శబ్ధాలు వస్తున్నాయని స్థానికులు ఫిర్యాదు. ఐపీసీ సెక్షన్ 188, 290, సీపీ చట్టం కింద కేసు నమోదైంది. కాగా, కొత్త ఏడాదికి లిక్కర్ కిక్కు బాగానే ఎక్కింది. కొత్త సంవత్సర వేడుకల ప్రారంభమయ్యే రోజుతో పాటు రెండు రోజుల ముందు నుంచీ ఏకంగా రూ.620 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్షాపులకు చేరింది. డిసెంబర్ 31న ఆదివారం సెలవుదినం అయినా, మద్యం డిపోలు తెరచి ఉంచగా, రూ.127 కోట్ల విలువైన మద్యం షాపులకు చేరింది డిసెంబర్ 30న రూ.313 కోట్లు, డిసెంబర్ 29న రూ.180 కోట్ల మద్యం డిపోల నుంచి వెళ్లిందని ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కొత్తగా ప్రారంభమైన షాపుల్లో అమ్మకాల కోసం ఈ నెల మొదట్లోనే పెద్ద ఎత్తున లిక్కర్ చేరిందని, ఈ నేపథ్యంలో కొంత తగ్గుదల కనిపిస్తుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: నుమాయిష్ 2024 ప్రారంభం.. మాస్క్ కంపల్సరీ! -
హైదరాబాద్ పబ్బుల్లో అసభ్య నృత్యాలు
-
రాహుల్కు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి
ఎర్రుపాలెం: ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం, మధిరల్లో సోమవారం జరిగిన మోటారు సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొ న్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్రధాని పదవినే త్యాగం చేసిన రాహుల్పై సభ్యత, సంస్కారం మరిచి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఎప్పుడూ పబ్లు, క్లబ్ల వెంట తిరిగే కేటీఆర్కు పొలాలు పబ్లలా, మెకానిక్ షాపులు క్లబ్లలా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. అవినీతిలో కూరుకున్న కేటీఆర్ వెంట ఈడీ, సీబీఐ పడుతుండటంతో బీజేపీ నాయకులతో అంటకాగుతూ వారి డైలాగ్లను వల్లె వేస్తున్నా రని విమర్శించారు. రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరించారు. ఉచిత విద్యుత్ విషయంలో రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూరుస్తాయా అన్న ప్రశ్నకు భట్టి సమాధానం ఇస్తూ ఆయన వ్యాఖ్య లను కట్ చేసి చూపించారని ఆరోపించారు. ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పేటెంట్ అని, తాము అధికారంలోకి రాగానే నూటికి నూరు శాతం రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని భట్టి స్పష్టం చేశారు. -
HYD: పబ్లు, ఫామ్హౌజ్లపై పోలీస్ రైడ్స్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు పబ్లు, శివారుల్లోని ఫామ్హౌజ్లపై పోలీసులు శనివారం రైడ్స్ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసి.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పోలీసులు ఒకవైపు.. మాదాపూర్లోని పబ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొన్ని పబ్బులు నిబంధనలు ఉల్లంఘించి మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. బర్డ్ బక్స్, హాట్కప్ పబ్లపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఏడుగురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు.. మొయినాబాద్ పరిధిలోని ఫామ్హౌజ్లలోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం సరఫరా, నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. సెలబ్రిటీ ఫామ్హౌజ్, ముషీరుద్దిన్, ఎటర్నిటీ ఫామ్హౌజ్లపై కేసు నమోదు అయినట్లు సమాచారం. ఈ మూడు ఫామ్ హౌజ్లపై కేసులకు గానూ పదిహేను మంది అరెస్ట్ చేశారు పోలీసులు. -
రాత్రి 10 గంటల నిబంధన ఎత్తివేయలేం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్లోని పబ్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పబ్ల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మ్యూజిక్ సౌండ్ ఆపాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ద్విసభ్య ధర్మాసనం సమర్థించింది. జూబ్లీహిల్స్ పబ్లు జనావాసాల మధ్య ఉన్నందున దీనిపై ఎటువంటి వెసులుబాటు ఇవ్వ లేమని ఆ పబ్లకు తేల్చిచెప్పింది. ఫర్జీ కేఫ్, అమ్నీసియా లాంజ్ బార్, బ్రాడ్వే ది బ్రూవరీ పబ్లకు గతంలోనే ఈ మేరకు ఆదేశాలు ఇవ్వగా.. శుక్రవారం సన్బర్న్ సూపర్క్లబ్కు ఇదే ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ జడ్జి ఉత్తర్వు లను సవాల్ చేస్తూ సన్బర్న్ సూపర్క్లబ్ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై శుక్రవారం ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. జూబ్లీహిల్స్లోని పబ్లు జనావాసాల మధ్య ఉన్నందున వెసు లుబాటు ఇవ్వలేమంటూ మధ్యంతర పిటిషన్ ను కొట్టివేసింది. రాత్రి పది తర్వాత సౌండ్ పెట్టొద్దని ఆదేశించింది. సౌండ్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ నిబంధనలను పాటించడంలేదని జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ అండ్ గ్రీన్ అసోసియేషన్ సహా మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సింగిల్ జడ్జి పలు నిబంధనలు విధిస్తూ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. -
New Year: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పబ్లకు హైకోర్టు షాక్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిధిలోని 10 పబ్లకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. రాత్రి 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ సౌండ్ అనుమతి ఇచ్చేది లేదంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. పబ్లపై గతంలో హైకోర్టు ఈ ఆదేశాలివ్వగా.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్స్ నిర్వాహకులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా గతంలో పబ్ల విషయంలో ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్ధించింది. న్యూఇయర్ సందర్భంగా నిబంధనలు పాటించాల్సిందేనని తెలిపింది. రాత్రి 10 గంటల తరువాత మ్యూజిక్ సౌండ్ పెట్టరాదని పేర్కొంది. గత ఆదేశాల ప్రకారమే న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశించింది. చదవండి: New Year Celebrations: కరో కరో జల్సా.. కరోనా ముప్పుంది జాగ్రత్త..! -
హై వ్యాల్యూమ్తో డీజే.. బంజారాహిల్స్లో రెండు పబ్లపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్కు అడ్డంకులు కలిగించడమే కాకుండా హై వ్యాల్యూమ్తో డీజే ఏర్పాటు చేసి శబ్ధ కాలుష్యానికి పాల్పడిన రెండు పబ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వివరాలివీ... బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో కేబీఆర్ పార్కు ముందు రియోట్ పబ్, చీర్స్ పబ్ ఒకే భవనంలో కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి 1.10 గంటల సమయంలో స్థానిక పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఈ రెండు పబ్ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా డీజే సౌండ్ వినిపిస్తుండటంతో తనిఖీలు చేపట్టారు. గడువు ముగిసిన తర్వాత కూడా డీజే ఏర్పాటు చేయడమే కాకుండా ప్రధాన రోడ్డుపై పెద్ద ఎత్తున వాహనాలు పార్కింగ్ చేసి రోడ్డుపై కస్టమర్లు న్యూసెన్స్ చేస్తుండటంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగానే రియోట్ పబ్ యజమాని కన్హయ్య కుమార్సింగ్, చీర్స్ పబ్ యజమాని తానిశెట్టి రాములపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
24 గంటల్లో 78 పబ్బుల్లో తాగాడు...
‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’ అంటున్నాడు ఆస్ట్రేలియాకు చెందిన హెన్రిచ్ డి విలియర్స్. 24గంటల్లో 78 పబ్బుల్లో తాగి అత్యధిక ‘పబ్ క్రాల్’ (లైసెన్సులున్న పబ్బులను సందర్శించి అన్నింట్లోనూ ఆల్కహాల్ తాగడం) చేసిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒక్కరోజులో 78 పబ్బులా? ఎంత తాగి ఉంటాడో అనే కదా సంశయం. ఒక్కో పబ్బులో 125 ఎమ్ఎల్ మాత్రమే తాగాలని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రూల్. ఆ ప్రకారమే తాగాడు. అంత తాగిన తరువాత స్టడీగా ఉన్నాడా? అంటే.. అందుకే తనకు సహాయంగా తమ్ముడు రువాల్డ్ డి విలియర్స్ను, ఫ్రెండ్.. వెస్సెల్ బర్గర్ను వెంట బెట్టుకు వెళ్లాడు. అయినా సరే... 24 గంటల్లో 78 పబ్బులకు వెళ్లడమంటే.. సాధారణ విషయం కాదు. రికార్డు కోసం మెల్బోర్న్లోని బార్స్ గురించి బాగా రీసర్చ్ చేసి.. ముగ్గురూ పక్కాగా రూట్మ్యాప్ ప్లాన్ చేసుకున్నారు. జీపీఎస్ ట్రాకింగ్తో గమ్యస్థానాన్ని చేరుకుని రికార్డ్ బ్రేక్ చేశారు. -
జూబ్లీహిల్స్ పబ్లలోనే రాత్రి 10 దాటితే నో మ్యూజిక్: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్లోని పబ్ల వ్యవహారంలో మరోసారి విచారణ చేపట్టింది హైకోర్టు. 10 పబ్లలో రాత్రి పది గంటల తర్వాత మ్యూజిక్ వినిపించకూడదని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని అప్పీలు చేసింది రెస్టారెంట్ అసోసియేషన్. ఈ అప్పీలుపై విచారణ సందర్భంగా డివిజనల్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. సింగిల్ బెంచ్ తీర్పు జూబ్లీహిల్స్లోని 10 పబ్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 26న పబ్లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్ను అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేశారు. అలాగే మైనర్లను కూడా పబ్లలోకి అనుమతివ్వొద్దని ఆదేశించారు. ఇదీ చదవండి: కేసుల్లో ఈ కేసులు వేరయా.. పతి, పత్నీ ఔర్ ఓ.. ప్చ్! యాప్ ఎంతపని చేసింది? -
‘వర్క్ ఫ్రమ్ పబ్’.. మందేస్తూ, చిందేస్తూ పని చేయ్..!
లండన్: కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్(ఇంటి నుంచే పని)కి చాలా సంస్థలు మొగ్గు చూపాయి. అయితే, ఇంట్లో ఒంటరిగా కూర్చిని పని చేయాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. చాలా కాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్తో విసుగు చెందటం సహజమే. అయితే, అలాంటి వారి కోసమే ఈ బంపర్ ఆఫర్. బ్రిటన్లో ఇప్పుడు ‘వర్క్ ఫ్రమ్ పబ్’ అనే సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. వర్క్ అండ్ ప్లే అనే కాన్సెప్ట్తో బార్లు, పబ్లులు ఇంటి నుంచే పని చేసే ఉద్యోగులను ఆకట్టుకుంటున్నాయి. కరోనా కారణంగా బిజినెస్ లేక పబ్బులు దివాలా తీసే పరిస్థితులు వచ్చాయి. ఈ క్రమంలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారిని ఆకట్టుకునే పనిలో పడ్డాయి యూకేలోని పబ్బులు. ‘వర్క్ అండ్ ప్లే’ ప్యాకేజీలను అందిస్తున్నాయి. యూకేలోని ‘యంగ్’ పబ్ దేశవ్యాప్తంగా ఉన్న తమ ప్రాంచైజీల్లో ఈ ‘వర్క్ అండ్ ప్లే’ ప్యాకేజీని అందిస్తోంది. పని చేసుకునేందుకు ప్రత్యేక స్థలం, లంచ్లో సాండ్విచ్, అన్లిమిటెడ్ టీ, కాఫీలు కేవలం రోజుకు 15పౌండ్లు(రూ.1,300)లకే అందిస్తోంది. వర్క్ ఫ్రమ్ పబ్ కల్చర్ విస్తరిస్తుండటంతో నలుగురితో కలిసి పనిచేయాలని కోరుకునే ఉద్యోగాలు.. పబ్బుల దారిపడుతున్నారు. ఈ ప్యాకేజీల్లో పవర్ సాకెట్స్, నిశబ్దంగా ఉండే క్యాబిన్లతో పాటు షిఫ్ట్ అయిపోగానే జిన్, పింట్, టోనిక్ వంటి వాటిని సైతం సేవించవచ్చు. అయితే, ఈ స్కీమ్ను 2020లోనే యంగ్ పబ్ లాంచ్ చేసింది. మంచి ఆదరణ లభిస్తుండటంతో ఇప్పుడు మొత్తం 185 ప్రాంచైజీల్లో అమలు చేస్తోంది. తాము పబ్లో ఉండే వాతావరణానికే మొగ్గు చూపుతామని కొందరు వర్క్ ఫ్రమ్ పబ్ వినియోగదారులు చెబుతున్నారు. లండన్, గ్రీన్విచ్లోని కట్టి సార్క్ పబ్లో ‘వర్క్ ఫ్రమ్ పబ్’ చేస్తున్న ఎడ్యుకేషన్ కాపీరైటర్ జెన్ పలు విషయాలు పంచుకున్నారు. తాను 200 ఏళ్లనాటి వాతవరణాన్ని ఆఫీస్కు తీసుకెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్యాకేజీ వాటర్ కూలర్ను దెబ్బ తీస్తుందని చమత్కరించారు. యూకేలోని ఇతర పబ్బులు సైతం ఇలాంటి ఆఫర్లే ఇస్తున్నాయి. ఫుల్లర్ పబ్ తన 380 ప్రాంచైజీల్లో రోజుకు 10పౌండ్లు(రూ.900)లకే లంచ్, డ్రింక్ అందిస్తోంది. అలాగే బ్రేవ్హౌస్ అండ్ కిచెన్ 10పౌండ్లకే వర్క్ స్పేస్తో పాటు వైఫై, పవర్ సాకెట్స్, అన్లిమిటెడ్ హాట్ అండ్ సాఫ్ట్ డ్రింక్, ప్రింటింగ్ సైతం అందిస్తోంది. ఇదీ చదవండి: 1161 కిలోల ‘జంబో’ గుమ్మడి.. జాతీయ రికార్డు బద్దలు! -
హైదరాబాద్ : పబ్ లపై పోలీసుల కొరడా...
-
తక్కువ వయసు వారిని పబ్ లకు అనుమతించొద్దు : హైదరాబాద్ సీపీ
-
మందేయడంలో గిన్నిస్ రికార్డ్.. 17 గంటల్లో 56 పబ్లకు.. 30 లీటర్లు తాగడంతో
ఇంగ్లండ్లోని బ్రైటన్కు చెందిన నాదన్ క్రింప్ అనే 22 ఏళ్ల యువకుడు మందేయడంలో సరికొత్త గిన్నిస్ సృష్టించాడు! మందుకొట్టడం కూడా రికార్డేనా అని చులకనగా భావించకండి. ఎందుకంటే.. అతను సాధించింది అలాంటి, ఇలాంటి రికార్డు కాదు మరి... కేవలం 17 గంటల వ్యవధిలోనే ఏకంగా 67 పబ్లకు వెళ్లి అతను ‘పానీయం’ పుచ్చుకున్నాడు. తద్వారా 24 గంటల వ్యవధిలో అత్యధిక పబ్లను సందర్శించిన వ్యక్తిగా గిన్నిస్ బుక్లో చోటు సంపాదించాడు. ఈ ఏడాది మొదట్లో ఇంగ్లాండ్కే చెందిన గ్యారెత్ మర్ఫీ అనే యువకుడు 17 గంటల్లో 56 పబ్లను సందర్శించి నెలకొల్పిన రికార్డును క్రింప్ బద్దలుకొట్టాడు. గిన్నిస్ నిర్వాహకుల నిబంధనల ప్రకారం సందర్శించే ప్రతి పబ్లోనూ మద్యమే సేవించాల్సిన అవసరం లేనప్పటికీ క్రింప్ మాత్రం ఒక పబ్లో మద్యం, మరో పబ్లో పానీయం సేవిస్తూ ముందుకెళ్లాడు. అయితే ఈ తతంగమేదీ ఆషామాషీగా జరగలేదని అతను చెప్పుకొచ్చాడు. చదవండి: హడలెత్తించిన కుక్క.. ఆవుపై దాడి.. అమాంతం నోటితో కరిచి పట్టుకొని.. ముందుగా తమ ప్రాంతంలో ఉన్న పబ్లను జీపీఎస్ పరికరం ద్వారా మార్కింగ్ చేసుకొని తన ప్రయాణం మొదలుపెట్టాడట. తాను పబ్లను సందర్శించి మద్యం లేదా పానీయం తాగినట్లు ప్రతి పబ్ నుంచి రశీదులు, సాక్షి సంతకాలు కూడా సేకరించాడట. ఈ విషయంలో అతనికి ముగ్గురు స్నేహితులు సహకరించారు. తన పానీయాల జాబితాలో బీర్, ‘బేబీ గిన్నిస్’ షాట్స్, టకీలా, లేగర్ మొదలైనవి ఉన్నట్లు క్రింప్ తెలిపాడు. ఇలా రోజంతా సుమారు 30 లీటర్ల మేర ‘పానీయాలు’ సేవించడం వల్ల తాను ఎక్కువసార్లు బాత్రూంకు వెళ్లాల్సి వచ్చిందని... 17 గంటల సమయంలో దీనికే ఎక్కువ సమయం పోయిందని చెప్పుకొచ్చాడు. అయితే ఎందుకోసం ఇదంతా చేశావంటే.. కేన్సర్తో మృతిచెందిన తన కుక్క జ్ఞాపకార్థంతోపాటు శునకాల ట్రస్టుకు నిధుల సమీకరణకు ఈ మార్గం ఎంచుకున్నట్లు క్రింప్ వివరించాడు. -
పబ్బుల తీరు మారేనా?
హైదరాబాద్ (బంజారాహిల్స్): తాంబూలాలు ఇచ్చేశాం.. తన్నుకు చావండి అన్న రీతిలో లైసెన్స్లు జారీ చేసి ఎక్సైజ్ శాఖ చేతులు దులుపుకుంది. అక్రమ నిర్మాణలైనా.. నివాసిత ప్రాంతంలోనైనా మా వాటాలు అందితే చాలు ట్రేడ్ లైసెన్స్లు జారీ చేసి జీహెచ్ఎంసీ పక్కకు తొలగింది. జనం ఫిర్యాదులు చేస్తున్నా సరే పెట్టీ కేసులు వేసి ఎఫ్ఐఆర్లు నమోదు చేసి మమ అనిపిస్తున్నారు. పోలీసులు. నివాసిత ప్రాంతాల్లో పబ్లలో అర్ధరాత్రి శబ్దకాలుష్యంతో నరకాన్ని చూస్తున్న సీనియర్ సిటిజన్లు పోలీసులు, ఇతర శాఖల ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తూ నెట్టుకొచ్చారు. అయినా సరే గత 12 సంవత్సరాలుగా పబ్ల వల్ల న్యూసెన్స్ పెరగడమే కానీ తగ్గుముఖం పట్టలేదు. అటు ఎక్సైజ్ పోలీసులు, ఇటు జీహెచ్ఎంసీ అధికారులు, మరో వైపు లా ఆండ్ ఆర్డర్ పోలీసులు కూడా చేతులు ఎత్తేయడంతో ఇక లాభం లేదనుకున్న బాధిత నివాసితులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీళ్లందరినీ నమ్ముకుంటే ఏ మాత్రం ఉపయోగం లేదని భావించిన సూర్యదేవర వెంకట రమణ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ గతేడాది నవంబర్లో శాస్త్రీయ ఆధారాలతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్పందించిన హైకోర్టు పబ్లపై కొరడా ఝులిపించింది. ఇష్టానుసారంగా సౌండ్ పెట్టుకుంటామంటే కుదరదని అందుకు తగిన గడువును నిర్దేశించి హైకోర్టు మార్గదర్శకాలు రాగానే చర్యలకు పోలీసులు శ్రీకారం చుట్టేందుకు యతి్నస్తున్నారు. ఫిర్యాదు చేసినా స్పందన కరువు.. ► జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 28, బంజారాహిల్స్ పరిధిలో నాలుగు, పంజగుట్ట పోలీస్ పరిధిలో నాలుగు పబ్లు ఉన్నాయి. ► ప్రతిరోజూ ఆయా ప్రాంతాల్లో శబ్ద కాలుష్యంతో పాటు ఇతరత్రా న్యూసెన్స్తో నివాసితులు నరకాన్ని చవి చూస్తున్నారు. ► జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10లోని స్రవంతి నగర్లో ఉన్న టాట్పబ్కు జీరో పార్కింగ్ ఉంది, అర్ధరాత్రి మందుబాబులు తూలుతు మద్యం మత్తులో స్థానిక నివాసాల్లోకి చొచ్చుకెళ్తున్నారు. అక్కడే వాంతులు, మలమూత్ర విసర్జనలు చేస్తుండటంతో అటుగా రాకపోకలు సాగిస్తున్న మహిళలకు ఇబ్బందిగా మారింది. ► ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తూతూ మంత్రంగా చర్యలు తీసుకునేవారు. దీంతో స్రవంతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున బి.సుభారెడ్డి జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ తరఫున సూర్యదేవర వెంకటరమణ తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయమూర్తి స్పందించి తగిన ఆదేశాలు జారీ చేశారు. నివాసిత ప్రాంతాల్లోనే.. ► పబ్లు నివాసిత ప్రాంతాల్లో ఏర్పాటు చేయకూడదు. ఎక్సైజ్ అధికారుల పుణ్యమా అని ఇళ్లల్లోనే పబ్లు కొనసాగుతున్నాయి. ► జూబ్లీహిల్స్ రోడ్ నెం. 56లోని ఫర్జీ, అబ్జార్బ్ పబ్లు పూర్తిగా నివాసాల మధ్యనే ఉన్నాయి. టాట్ పబ్ స్రవంతినగర్లో ఉంది. ► అమ్నేయా లాంజ్బార్, బ్రాడ్వే, మాకోబ్రూ, హాట్కప్ డరి్టమారి్టని ఇలా పబ్లన్నీ నివాసిత ప్రాంతాల్లో ఏర్పాటు చేశారంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ► ప్రతిరోజూ స్థానికుల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా జరిమానాలు చెల్లిస్తూ జారుకుంటున్నారు. ► జూబ్లీహిల్స్రోడ్ నెం. 36, 45లలో మాత్రమే కమర్షియల్ వ్యాపారాలు జరగాల్సి ఉండగా మిగతా అన్ని చోట్లా నివాసిత ప్రాంతాల్లోనే పబ్లు కొనసాగుతున్నాయి. నార్మల్ బార్కు ఇచ్చినట్లుగానే.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట ప్రాంతాల్లో ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా పబ్ పేరుతో లైసెన్స్ ఇవ్వడం లేదు. నార్మల్ బార్ లైసెన్స్ 2(బి) ప్రకారమే ఈ లైసెన్స్లు జారీ చేస్తున్నారు. దీంతో ఇష్టానుసారంగా పబ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
Hyderabad Pubs: రాత్రి 10 గం. తర్వాత సౌండ్ ఆపాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని పబ్ల్లో రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి మ్యూజిక్ సౌండ్ పెట్టరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధన ఉదయం 6 గంటల వరకు వర్తిస్తుందని ఆదేశించింది. నేటి నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. సౌండ్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ నిబంధనలను పాటించకుండా పబ్లు నిర్వహిస్తున్నారని, నగరవాసులను రాత్రి ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ అండ్ గ్రీన్ అసోసియేషన్ సహా మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాము అధికారులకు విజ్ఞప్తి చేసినా ఆ పబ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. విద్యా సంస్థలున్న చోట అనుమతి ఎలా ఇచ్చారు?.. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత ధర్మాసనం.. సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున హైకోర్టు న్యాయవాది కైలాష్నాథ్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ఎలాంటి సౌండ్ పెట్టరాదని తేల్చిచెప్పింది. నగర పోలీస్ చట్టం, సౌండ్ పొల్యూషన్ రెగ్యులేషన్ ప్రకారం.. లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత సమయం వరకే అనుమతి ఉందని పేర్కొంది. ఇళ్లు, విద్యాసంస్థలు ఉన్న ప్రదేశాల్లో పబ్లకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించిన న్యాయమూర్తి.. ఏ అంశాల ప్రాతిపదికన అనుమతులు ఇచ్చారో కౌంటర్ దాఖలు చేయాలని ఎక్సైజ్శాఖను ఆదేశించింది. పబ్లో రాత్రిపూట లిక్కర్ మాత్రమే సరఫరా చేయాలని సూచించింది. హైదరాబాద్ పరిధిలోని పబ్లపై ఇప్పటివరకు దాఖలైన కేసుల వివరాలను అందజేయాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. మ్యూజిక్ సిస్టమ్ ప్లే చేసేందుకు ఎన్నిటికి అనుమతి ఉంది.. తదితర వివరాలను రెండు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. -
పబ్స్పై తెలంగాణ హైకోర్టు కొరడా.. కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పబ్స్పై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి డీజేలు ఉండకూడదని హైకోర్టు ఆదేశించింది. రాత్రి 10 నుంచి ఉదయం ఆరు గంటల వరకు డీజేలపై నిషేధం విధించింది. డీజేలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: నేను రాజీనామా చేస్తా..! సీఎం కేసీఆర్కు బండి సంజయ్ సవాల్.. సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పోల్యుషన్ రెగ్యులేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే అనుమతి ఉందని, రాత్రి వేళల్లో ఎటువంటి సౌండ్ సిస్టంకు అనుమతి లేదని హై కోర్టు పేర్కొంది. ఎక్సైజ్ రూల్స్ ప్రకారం ఇళ్లు, విద్యాసంస్థల ఉన్న ప్రదేశాల్లో పబ్లకు ఎలా అనుమతి ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. పబ్లకు ఏ అంశాలను పరిగణించి అనుమతులు ఇచ్చారో ఎక్సైజ్ శాఖ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల టాట్ పబ్ విషయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ల తరపున హైకోర్టు న్యాయవాది కైలాష్ నాథ్ వాదించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అసాంఘిక చర్యలకు పాల్పడే పబ్లపై దాడులు
సాక్షి, న్యూఢిల్లీ: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, నేరాలను ప్రోత్సహించే పబ్లపై దాడులు తప్పవని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ పరిధిలో అలాంటి పబ్లపై రాబోయే రోజు ల్లో భౌతిక దాడులు చేయాలని ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. అలాగే రాత్రి 11:30 తర్వాత తెరిచి ఉంచే వాటిపై కూడా దాడులు తప్పవని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, విశ్వనగరంగా మారాల్సిన హైదరాబాద్ను విషనగరంగా మార్చారని ఆందోళన వ్యక్తం చేశా రు. కేసీఆర్ సీఎం అయ్యాక హైదరాబాద్లో సుమారు 150 పబ్లకు అనుమతినిచ్చారని, పబ్ల వ్యాపారం వెనుక రాష్ట్రంలోని రాజులు, యువరాజులకు సంబంధించిన వ్యక్తులు కీలకంగా ఉన్నారని ఆరోపించారు. పబ్లు, డ్రగ్ల సంస్కృతిని ప్రోత్సహించడం వల్లే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధారాలను తుడిచిపెట్టే ప్రయత్నం చేశారు మిత్రపక్షాలుగా ఉన్న టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు హత్యలు, అత్యాచారాల్లోనూ భాగస్వాములయ్యారని రేవంత్ విమర్శించారు. మైనర్ అత్యాచారం ఘటన గురించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పిన విధానం చూస్తుంటే, కొందరిని తప్పించే ప్రయత్నం చేసినట్టుగా ఉందని ఆరోపించారు. ఈ ఘటనలో నిందితులు ప్రయాణించిన బెంజ్ కారు, ఇన్నోవా వాహనానికి సంబంధించిన కీలకమైన ఆధారాలను, వాటి యజమానుల వివరాలను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. యజమానులపై పోక్సో చట్టం ప్రకారం కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్లలోని కీలకమైన ఆధారాలను తుడిచిపెట్టే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోందన్నారు. పబ్లపై పోలీసుల పర్యవేక్షణ కరువైందని, తనిఖీలు చేయకుండా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించాలి మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఎందుకు సమీక్ష నిర్వహించలేదని, ఇప్పటికైనా తక్షణమే ఉన్నతాధికారులతో తాజా పరిస్థితులపై సమీక్ష జరపాలని రేవంత్రెడ్డి కోరారు. మైనర్లను అనుమతిస్తున్న పబ్ యజమానులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మైనర్ అత్యాచార వ్యవహారంలో వక్ఫ్ బోర్డ్ చైర్మన్పై సీఎం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మైనర్ బాలిక రేప్ విషయంలో ఎందుకు స్పందించట్లేదని మండిపడ్డారు. -
జూబ్లీహిల్స్ లోని పలు పబ్ లలో పోలీసుల తనిఖీలు
-
హైదరాబాద్ లో పెరిగిన పబ్ కల్చర్
-
పబ్బులో అశ్లీల నృత్యాలు...
రాంగోపాల్పేట్: సికింద్రాబాద్లోని మరో పబ్బుపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ పబ్బులోనూ అశ్లీల నృత్యాలు చేస్తున్న మహిళలను, పురుషులను అదుపులోకి తీసు కున్నారు. ఈ ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ ఎస్డీరోడ్లోని బసేరా హోటల్లో పబ్ను నిర్వహిస్తున్నారు. డీజే సౌండ్ల హోరులో యువతీ, యువకులు అశ్లీలంగా నృత్యాలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా పబ్ యాజమాన్యం ఈ దందా కొనసాగిస్తూ యువతీ, యువకులను ఆకర్షిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందడంతో ఉత్తర మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి కస్టమర్ల తరహాలో పబ్కు వెళ్లారు. అప్పటికే అక్కడ యువతీ, యువకులు తాగిన మైకంలో నృత్యాలు చేస్తున్నారు. మహిళలు పురుషుల వద్దకు వచ్చి వారిని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకుని గోపాలపురం పోలీసులకు అప్పగించారు. వారిలో 9 మంది మహిళలు, 24 మంది పురుషులు, 8 మంది హోటల్ సిబ్బంది ఉన్నారు. హోటల్ యజమాని అమర్ ఓరీ పరారీలో ఉన్నాడు. (చదవండి: ఉస్మానియా ఆసుపత్రిలో దారుణం...రూ.వెయ్యి ఇస్తేనే మార్చురీలోకి మృతదేహం..)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
జీఎస్టీ నమోదుకు ఆధార్ బయోమెట్రిక్!
నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్
ఓటేసుకునే స్వేచ్ఛ కూడా లేదా?
సీఎం జగన్కు వేద పండితుల ఆశీర్వచనం
మాస్ ఎంట్రీ.. చైనాలో పుతిన్కు గ్రాండ్ వెల్కమ్!
జంగా కృష్ణమూర్తికి బిగ్ షాక్
సన్నీ లియోన్ బర్త్డేను ఎందుకు జరుపుకున్నారో చెప్పిన యువకులు
ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించింది
మోదీపై పోటీ.. కమెడియన్ నామినేషన్ తిరస్కరణ
Yadadri: ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు.. సాయం చేయండి
తప్పక చదవండి
- సీఎం జగన్కు వేద పండితుల ఆశీర్వచనం
- Yadadri: ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు.. సాయం చేయండి
- తెలంగాణలో దంచికొట్టనున్న వానలు.. హైదరాబాద్కు కుంభవృష్టి హెచ్చరిక!
- టీవీ సీరియల్ మేకప్మెన్ దారుణ హత్య
- కాకిస్నూరు.. ఓటింగ్లో సూపర్..
- వెల్లివిరిసిన మహిళా చైతన్యం
- విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
- వైఎస్సార్సీపీ ఏజెంట్పై టీడీపీ మూకల హత్యాయత్నం
- USA Presidential Elections 2024: బైడెన్, ట్రంప్ రె‘ఢీ’
- సెన్స్క్స్ డౌట్!
Advertisement