-
ద్రవిడ్ మళ్లీ దరఖాస్తు చేయాల్సిందే!
ముంబై: టి20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరిస్తారని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. దాని కోసం మరికొద్ది రోజుల్లోనే దరఖాస్తులు కోరతామని కూడా ఆయన స్పష్టం చేశారు. భారత జట్టు వరల్డ్ కప్కు బయల్దేరే ముందే ఈ ప్రక్రియ మొదలవుతుందని కూడా జై షా చెప్పారు. గత ఏడాది రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తయిన తర్వాతే కొత్త కోచ్పై చర్చ జరగడంతో కొంత గందరగోళం నెలకొంది. దాంతో ద్రవిడ్నే మరో ఏడాది కొనసాగించారు. ఈసారి అలాంటి స్థితి రాకుండా బోర్డు ముందే జాగ్రత్త పడుతోంది. ఒప్పందం ప్రకారం వచ్చే జూన్లో ద్రవిడ్ పదవీకాలం పూర్తవుతుంది. ద్రవిడ్ మళ్లీ కోచ్గా కొనసాగాలనుకుంటే మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుందని... కొన్ని ఇతర జట్ల తరహాలో వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్లను ఎంపిక చేసే ఆలోచన లేదని కూడా షా పేర్కొన్నారు. కొత్త హెడ్ కోచ్కు మూడేళ్ల పదవీ కాలం ఇస్తామని, 2027 వన్డే వరల్డ్ కప్ వరకు అతను కొనసాగుతాడని బోర్డు కార్యదర్శి ప్రకటించారు. కోచ్ ఎంపిక విషయంలో క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)దే తుది నిర్ణయమన్న షా... విదేశీ కోచ్ అయినా అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్కు చేరని జట్లలో ఉన్న ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది కలిసి మే 24న తొలి బృందంగా టి20 వరల్డ్ కప్ కోసం అమెరికా బయలుదేరతారని జై షా వెల్లడించారు. ఐపీఎల్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను ప్రయోగాత్మకంగానే పెట్టామని, అవసరమైతే దీనిపై మళ్లీ చర్చించి కొనసాగించాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లను బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో చేర్చకపోవడంలో తన పాత్ర ఏమీ లేదని... ఇది పూర్తిగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నిర్ణయమని ఆయన సందేహ నివృత్తి చేశారు. -
దినేష్ కార్తీక్ అరుదైన ఘనత.. ద్రవిడ్ రికార్డు బద్దలు
భారత వెటరన్ వికెట్ కీపర్-బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ దినేష్ కార్తీక్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఇండియన్ బ్యాటర్గా కార్తీక్ నిలిచాడు. ఐపీఎల్-2024లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 18 పరుగులు చేసిన డీకే.. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు కార్తీక్ ఐపీఎల్లో బెంగళూరు తరపున 57 మ్యాచ్ల్లో 912 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరిట ఉండేది. ద్రవిడ్ 43 మ్యాచ్ల్లో ఆర్సీబీ తరపున 898 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో ద్రవిడ్ రికార్డును కార్తీక్ బద్దలు కొట్టాడు. ఇక అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అగ్రస్ధానంలో ఉన్నాడు. కోహ్లి ఇప్పటివరకు ఆర్సీబీ తరపున 249 మ్యాచ్ల్లో 7897 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. హై స్కోరింగ్ మ్యాచ్లో పంజాబ్ను 60 పరుగుల తేడాతో ఆర్సీబీ చిత్తు చేసింది. దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను ఆర్సీబీ సజీవంగా నిలుపున్కుంది.. -
ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్
టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా హెడ్కోచ్ మారబోతున్నాడా? అంటే అవుననే అంటున్నాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా. కొత్త కోచ్గా భారతీయ క్రికెటర్ లేదంటే విదేశీ ఆటగాడైనా రావొచ్చని సంకేతాలు ఇచ్చాడు.కాగా పొట్టి వరల్డ్కప్-2021 తర్వాత రవిశాస్త్రి స్థానంలో మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అతడి మార్గదర్శనంలో అన్ని ఫార్మాట్లలో ప్రపంచ నంబర్ వన్గా నిలిచిన భారత జట్టు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయింది.టైటిల్ పోరులో రాణించలేకటీ20 ప్రపంచకప్-2022లో సెమీస్లోనే ఇంటిబాట పట్టిన రోహిత్ సేన.. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ 2021-23, వన్డే వరల్డ్కప్-2023 టోర్నీల్లో ఫైనల్ చేరినా టైటిల్ గెలవకలేకపోయింది. ఆఖరి మెట్టుపై ఆస్ట్రేలియా చేతిలో బోల్తాపడి ట్రోఫీని చేజార్చుకుంది.ఇదిలా ఉంటే.. వాస్తవానికి భారత్ వేదికగా ప్రపంచకప్-2023 పూర్తయ్యేనాటికి రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం పూర్తైంది. ఈ క్రమంలో టీ20 వరల్డ్కప్ వరకు ద్రవిడ్ను కోచ్గా కొనసాగాల్సిందిగా బోర్డు కోరడంతో అతడు సమ్మతించినట్లు వార్తలు వచ్చాయి.ద్రవిడ్ గుడ్బై/ ద్రవిడ్కు గుడ్బై?అయితే, తాజా సమాచారం ప్రకారం ద్రవిడ్ తన పదవీకాలాన్ని పొడిగించుకునేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త కోచ్ వేటలో పడింది. ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రకటన విడుదల చేయనుంది.ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా స్వయంగా వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘రాహుల్ పదవీ కాలం జూన్ వరకు పూర్తవుతుంది. ఒకవేళ అతడు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని భావిస్తే.. అప్లై చేసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ అతడికి ఉంది.కొత్త కోచ్గా ఫారినర్?ఇక కొత్త కోచ్ ఇండియన్ లేదంటే ఫారినర్ అన్న విషయం గురించి ఇప్పుడే చెప్పలేం. క్రికెట్ అడ్వైజరీ కమిటీ నిర్ణయానుసారమే కోచ్ నియామకం జరుగుతుంది’’ అని జై షా క్రిక్బజ్తో వ్యాఖ్యానించాడు.అలాంటిదేమీ లేదు!అదే విధంగా.. భిన్న ఫార్మాట్లకు భిన్న కోచ్ల గురించి ప్రస్తావన రాగా.. ‘‘ఈ విషయంలో కూడా క్రికెట్ అడ్వైజరీ కమిటీదే తుది నిర్ణయం. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషభ్ పంత్.. ఇలా చాలా మంది మూడు ఫార్మాట్లలో ఆడుతున్న క్రికెటర్లు ఉన్నారు. కానీ కోచ్ల విషయంలో అలా జరిగే ఆస్కారం లేదు’’ అంటూ కొట్టిపారేశాడు. చదవండి: రోహిత్ ముంబైని వీడటం ఖాయం.. ఆ తర్వాత అయ్యర్ కెప్టెన్సీలో! -
T20 WC: జట్టు ఎంపిక ఫైనల్.. అతడిపై వేటు తప్పదా?
టీ20 ప్రపంచకప్-2024 జట్టు ప్రకటనకు సమయం ఆసన్నమైంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనబోయే ఆటగాళ్లు ఎవరన్న చర్చకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ ఆతిథ్యంలో ఈ ఐసీసీ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రపంచకప్లో భాగమయ్యే ఇరవై జట్ల ఎంపికను మే 1 వరకు ఖరారు చేయాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆయా దేశాలను ఆదేశించింది.ఈ క్రమంలో ఇప్పటికే న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించగా.. టీమిండియా కూడా అనౌన్స్మెంట్కు సిద్ధమైంది. జట్టు ఎంపిక గురించి ఇప్పటికే బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం.ఢిల్లీలో వీరు ముగ్గురు ఆదివారం సమావేశమై తీసుకున్న నిర్ణయం గురించి బీసీసీఐ కార్యదర్శి జై షాతో మంగళవారం చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఫిట్నెస్, వికెట్ కీపర్ ఎంపిక గురించి మేనేజ్మెంట్ తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.పాండ్యా గనుక బౌలింగ్ చేస్తే అదనపు పేసర్ అవసరం ఉండదు. కానీ అతడి ఫిట్నెస్ దృష్ట్యా బౌలర్గా పూర్తిస్థాయిలో బరిలోకి దిగే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు.. వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్తో పాటు సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ పోటీపడుతున్నారు.వీరిలో సంజూ ఐపీఎల్-2024లో దుమ్ములేపుతుండగా.. పంత్ కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. రాహుల్ కూడా బాగానే ఆడుతున్న నిలకడలేమి ఫామ్ కలవరపెడుతోంది.అతడిపై వేటు తప్పదా?మరోవైపు.. ఓపెనింగ్ స్లాట్లో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి పేరు దాదాపుగా ఖరారు కాగా.. బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్ మధ్య పోటీ నెలకొంది. అయితే, మేనేజ్మెంట్ మాత్రం ఈ విషయంలో జైస్వాల్వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జట్టు ప్రకటన తర్వాతే వరల్డ్కప్లో పాల్గొనబోయే 15 మంది భారత ఆటగాళ్ల గురించి స్పష్టతరానుంది. -
క్యూలో నిలబడి ఓటు వేసిన ద్రవిడ్.. పవర్ఫుల్ మెసేజ్
టీమిండియా హెడ్ కోచ్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఓటు హక్కును ఉపయోగించుకున్నాడు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా.. కర్ణాటకలో 14 లోక్సభ స్థానాలకు శుక్రవారం రెండో విడత పోలింగ్ జరుగుతున్న వేళ.. బెంగళూరులో ఓటు వేశాడు.ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా అత్యంత సాదాగా పోలింగ్బూత్కు తరలివచ్చిన ద్రవిడ్.. ప్రజాస్వామ్యం తనకు ఇచ్చిన హక్కును వినియోగించుకున్నాడు. ఈ సందర్భంగా భారత యువతను ఉద్దేశించి స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చాడు.‘‘ఇది నా ఓటు. ప్రజాస్వామ్యం నాకు కల్పించిన అవకాశం. కాబట్టి కచ్చితంగా నేను దీనిని ఇలా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. పోలీసులు బాగా పనిచేస్తున్నారు.ఈసారి పోలింగ్ విషయంలో బెంగళూరు రికార్డు సృష్టిస్తుందని భావిస్తున్నా. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు తరలిరావాలి. తమ హక్కును ఉపయోగించుకోవాలి. పౌరులను అప్రమత్తం చేయడంలో మీడియా కూడా ఇంకాస్త చొరవ తీసుకోవాలి’’ అని ఓటు వేసిన అనంతరం రాహుల్ ద్రవిడ్ ఇండియా టుడేతో వ్యాఖ్యానించాడు.కాగా వరుస షెడ్యూళ్లతో బిజీగా ఉండే రాహుల్ ద్రవిడ్కు ప్రస్తుతం విరామం దొరికింది. ఐపీఎల్-2024 నేపథ్యంలో ఆటగాళ్లంతా క్యాష్ రిచ్ లీగ్లో భాగమైన వేళ.. ద్రవిడ్ కుటుంబానికి సమయం కేటాయించాడు.అయితే, జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్-2024 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. అయితే, మే 1 లోగా జట్ల వివరాలను సమర్పించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి గడువు విధించిన వేళ టీమిండియా ఎంపిక గురించి రాహుల్ ద్రవిడ్ ఇప్పటికే పలుమార్లు చీఫ్ సెలక్టర్తో భేటీ అయినట్లు సమాచారం. -
ఓటు హక్కు వినియోగించుకున్న ద్రవిడ్, కుంబ్లే
దేశంలో ఇవాళ (ఏప్రిల్ 26) సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ జరుగుతుంది. ఈ విడతలో మొత్తం 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కేరళలోని 20 స్థానాలకు, కర్ణాటకలో 14, రాజస్థాన్లో 13, ఉత్తర్ప్రదేశ్ 8, మహారాష్ట్ర 8, మధ్యప్రదేశ్ 7, అస్సాం 5, బీహార్ 5, పశ్చిమ బెంగాల్ 3, చత్తీస్ఘడ్ 3, జమ్మూ కశ్మీర్ 1, మణిపూర్ 1, త్రిపురలో ఒక లోక్సభ స్థానానికి ఇవాళ పోలింగ్ జరుగతుంది. #WATCH | Rahul Dravid casts his vote in Karnataka's Bengaluru.#LokSabhaElections2024 pic.twitter.com/gZ6Ybairc1— ANI (@ANI) April 26, 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇవాల్టి ఉదయం నుంది వివిధ రంగాలకు చెందిన చాలామంది ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్రీడారంగానికి సంబంధించి భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇవాళ ఉదయం బెంగళూరులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య, కొడుకుతో సహా పోలింగ్ కేంద్రం వద్దకు చేరిన ద్రవిడ్ అతి సాధారణ వ్యక్తిలా క్యూలో నిలబడి ఓటు వేశారు. #Vote #Indiaelections2024 #Karnataka #bengaluru pic.twitter.com/JDi9VYpIA6— Anil Kumble (@anilkumble1074) April 26, 2024 ఓటు వేసిన అనంతరం ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చాడు. ఓటు అనేది ప్రజాస్వామ్యం మనకు కల్పించిన హక్కు అని ద్రవిడ్ తెలిపాడు. ద్రవిడ్ సహచరుడు, టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే కూడా ఇవాళ బెంగళూరులో ఓటు వేశారు. ఓటు వినియోగించుకున్న విషయాన్ని కుంబ్లే సోషల్మీడియాలో షేర్ చేశాడు. కుంబ్లే తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. -
అవన్నీ అబద్ధాలు.. అసలు అగార్కర్..: రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియా ఎంపిక గురించి వస్తున్న వార్తలపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ విషయం గురించి తాను ఇప్పటి వరకు మేనేజ్మెంట్తో ఎలాంటి చర్చలు జరుపలేదన్నాడు. అదే విధంగా.. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో గత వారం తాను సమావేశమైనట్లుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశాడు. జట్టు ఎంపిక గురించి తాము అధికారిక ప్రకటన చేసినపుడు మాత్రమే అవి నిజాలని నమ్మాలని విజ్ఞప్తి చేశాడు. కాగా ఐపీఎల్-2024కు మే 26న తెరపడనుండగా.. జూన్ 1 నుంచి ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈవెంట్ మొదలైన ఐదో రోజున టీమిండియా ఐర్లాండ్తో మ్యాచ్తో తమ ప్రయాణం ఆరంభించనుంది. కెప్టెన్గా రోహిత్ శర్మనే ఇక ఈ మెగా టోర్నమెంట్లో టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మనే ఉంటాడని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024 ప్రదర్శన ఆధారంగానే వరల్డ్కప్ జట్టు ఎంపిక ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత వారం ముంబైలో రోహిత్, ద్రవిడ్, అగార్కర్ సమావేశమై జట్టు కూర్పు గురించి జరిపిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఓపెనర్గా విరాట్ కోహ్లి ఫిక్స్ అని.. బౌలింగ్ చేసే విషయంపైనే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపిక ఆధారపడి ఉంటుందని ఊహాగానాలు వినిపించాయి. అసలు అగార్కర్ ఇక్కడ లేనేలేడు ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా ఈ విషయాలపై స్పందించాడు. ‘‘నేను ఎవరినీ కలవలేదు. అజిత్ అగార్కర్ అక్కడెక్కడో దుబాయ్లో ఉన్నాడు. ఇక రాహుల్ ద్రవిడ్ తన పిల్లల ఆట చూసేందుకు బెంగళూరులోనే ఉండిపోయాడు. అయితే.. తన కుమారుడి కోసం బహుశా ముంబై వచ్చి ఉంటాడు. ఎర్రమట్టి పిచ్పై ఆడించేందుకు ఇక్కడికి తీసుకువచ్చాడేమో! అంతే. అంతకు మించి ఏమీ లేదు. మేము అసలు ఒకరినొకరం కలుసుకోలేదు. అవన్నీ అబద్దాలే ఈరోజుల్లో నేనో, ద్రవిడో, అగార్కరో లేదంటే బీసీసీఐ స్వయంగా స్పందిస్తేనే అవి నిజాలు. మిగతావన్నీ ఫేక్’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. క్లబ్ ప్రైరీ ఫైర్ అనే పాడ్కాస్ట్లో మైకేల్ వాన్, ఆడం గిల్క్రిస్ట్లతో మాట్లాడుతూ రోహిత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా రోహిత్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఆటగాడిగా ఐపీఎల్ పదిహేడో ఎడిషన్తో బిజీగా ఉన్నాడు. చదవండి: #Rishabh Pant: పిచ్చి పట్టిందా? కుల్దీప్ ఆగ్రహం.. పంత్ రియాక్షన్ ఇదే Rohit Sharma said - "I think today's day and age unless you hear it from either myself or Rahul Dravid himself or Ajit Agarkar himself or someone coming from BCCI talking infront of camera everything is fake". (On Kohli-Rohit opening in T20 WC 2024). pic.twitter.com/NUs6Xbs4ek — CricketMAN2 (@ImTanujSingh) April 18, 2024 Rohit Himself confirmed he hasn't Met Any bcci official's last week and stated this as a fake news 😂 https://t.co/uIXDn9v8Ew pic.twitter.com/fiNe8keK0Y — Manojkumar (@Manojkumar_099) April 18, 2024 That means reports are fake, Kohli is not in the preference list of BCCI FOR T20 world cup. (Source- Mufa and Johns Paid pr of Kohli) pic.twitter.com/AwP96Uza5w — CAPTAIN (@RoForLife45) April 18, 2024 -
T20 WC 2024: రోహిత్ శర్మకు జోడీగా కోహ్లి ఫిక్స్!
టీ20 ప్రపంచకప్-2024లో విరాట్ కోహ్లిని భారత ఓపెనర్గా చూడబోతున్నామా? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ రన్మెషీన్ కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా మెగా టోర్నీలో టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఇప్పటికే రోహిత్ శర్మతో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత రోహిత్తో పాటు కోహ్లి కూడా సుదీర్ఘకాలం పాటు పొట్టి ఫార్మాట్లో టీమిండియా తరఫున బరిలోకి దిగలేదు. ఈ క్రమంలో ఇటీవల అఫ్గనిస్తాన్తో స్వదేశంలో సిరీస్ సందర్భంగా విరాహిత్ ద్వయం పునరాగమనం చేశారు. అయితే, ఆ సిరీస్లో కోహ్లి తను రెగ్యులర్గా వచ్చే మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. మరోవైపు.. రోహిత్కు జోడీగా యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేశాడు. ఇదిలా ఉంటే.. యువ ఆటగాళ్లకు పెద్ద పీట వేసే క్రమంలో ప్రపంచకప్-2024లో అసలు కోహ్లికి చోటే దక్కదంటూ గతంలో వార్తలు వచ్చాయి. అగార్కర్ ఈ మేరకు ప్రతిపాదనలు చేయగా.. రోహిత్ శర్మ వాటిని ఖండించాడని.. కోహ్లి జట్టులో ఉండాల్సిందేనని పట్టుబట్టినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మరో కొత్త అంశం తెరమీదకు వచ్చింది. ఐసీసీ ఈవెంట్లో తన పాత్ర ఏమిటన్న విషయం మీద క్లారిటీ కావాలని కోహ్లి సెలక్షన్ కమిటీని అడిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గతవారం ముంబైలో జరిగిన సమావేశంలో రోహిత్, ద్రవిడ్, అగార్కర్ ఇందుకు సంబంధించి కోహ్లిని ఓపెనర్గా పంపాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు దైనిక్ జాగరణ్.. కథనం వెలువరించింది. కాగా రాయల్ చాలెంజర్స్ తరఫున ఓపెనర్గా బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లి.. ఇప్పటి వరకు ఐపీఎల్-2024లో ఏడు మ్యాచ్లు ఆడి 361 పరుగులు చేశాడు. ప్రస్తుతానికి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు. మరోవైపు.. ఇటీవల కాలంలో రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న యశస్వి జైస్వాల్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు రాజస్తాన్ తరఫున ఏడు మ్యాచ్లు ఆడి 121 రన్స్ మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ తాజా సీజన్ ముగిసిన తర్వాత జూన్ 1 నుంచి వరల్డ్కప్ టోర్నీ ఆరంభం కానుంది. చదవండి: #T20WorldCup2024: రోహిత్తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 WC: రోహిత్తో ద్రవిడ్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్!
#T20WorldCup2024: హార్దిక్ పాండ్యా.. క్రీడా వర్గాల్లో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ టీమిండియా స్టార్ ఆల్రౌండర్ గురించే చర్చ నడుస్తోంది. ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టిన పాండ్యా సొంత జట్టు అభిమానులను కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు. నిజానికి.. 2022లో గుజరాత్ టైటాన్స్ సారథిగా పగ్గాలు చేపట్టి అరంగేట్రంలోనే ఆ జట్టును చాంపియన్గా నిలిపిన ఘనత పాండ్యా సొంతం. గతేడాది కూడా అద్బుత కెప్టెన్సీతో టైటాన్స్ను ఫైనల్కు తీసుకువచ్చాడు. కలిసిరాని కాలం కానీ ఎప్పుడైతే సొంత గూటికి చేరుకుని ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయ్యాడో అప్పటి నుంచి పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. రోహిత్ శర్మ స్థానంలో పాండ్యా సారథిగా నియమితుడు కావడాన్ని ఇప్పటికీ ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే విధంగా.. పాండ్యా సైతం మైదానంలో తన ప్రణాళికలను అమలు చేయడంలో సఫలం కాలేకపోతున్నాడు. ఫలితంగా ముంబై ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో కేవలం రెండు మాత్రమే గెలిచింది. దీంతో పాండ్యా కెప్టెన్సీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆటగాడిగానూ విఫలం ఇక ఆటగాడిగానూ హార్దిక్ పాండ్యా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్లో కలిపి 131 పరుగులు చేసిన ఈ పేస్ ఆల్రౌండర్.. కేవలం 3 వికెట్లు తీశాడు. ఫలితంగా టీ20 ప్రపంచకప్-2024 జట్టులో పాండ్యాకు అసలు స్థానం ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ తాజా కథనం వీటికి బలాన్ని చేకూరుస్తోంది. వరల్డ్కప్ జట్టు ఎంపిక గురించి చర్చించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గత వారం సమావేశమైనట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ జట్టులో పాండ్యాకు నో ప్లేస్! ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాకు స్థానం ఇవ్వాలా? వద్దా? విషయంపై దాదాపు రెండు గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అసలు పాండ్యా పూర్తి ఫిట్గా ఉన్నాడా? లేడా? ఆల్రౌండర్గా పూర్తి స్థాయిలో సేవలు అందించగలడా లేడా అన్న అంశం మీద కూడా టీమిండియా మేనేజ్మెంట్ సందేహాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి పాండ్యా హిట్టింగ్కు తోడు అదనపు సీమర్గా జట్టుకు ఉపయోగపడటం వల్లే అతడికి జట్టులో ప్రత్యేక స్థానం దక్కింది. కానీ ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్ దృష్ట్యా పాండ్యా ఎంపికపై ఇప్పుడే మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరికొన్నాళ్లు వేచి చూసిన తర్వాతే అతడిని మెగా టోర్నీకి సెలక్ట్ చేసే విషయమై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ప్రత్యామ్నాయం అతడే! ఐపీఎల్-2024లో పాండ్యా రెగ్యులర్గా బౌలింగ్ చేస్తేనే అతడికి చోటిచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అందులో గనుక పాండ్యా విఫలమైతే అతడికి ప్రత్యామ్నాయంగా సీఎస్కే స్టార్ శివం దూబే వైపు సెలక్టర్లు మొగ్గుచూపే అవకాశం ఉంది. Most sixes since IPL 2022 - 🔹 66 Shivam Dube 🔹 66 Nicholas Pooran Dube : 34 sixes vs Spinners, 32 sixes vs Pacers - He is not just a spin smasher 💥#TATAIPL #IPL2024 #MIvCSK #MIvsCSK #CSKvsMI #CSKvMIpic.twitter.com/5cQlVDyTMr — TCTV Cricket (@tctv1offl) April 15, 2024 మిడిల్ ఓవర్లలో ఈ లెఫ్టాండ్ బ్యాటర్ ఎంత ప్రమాదకర బ్యాటరో ఇప్పటికే నిరూపితమైంది. అయితే, ఈసీజన్లో అతడు ఇంత వరకు బౌలింగ్ చేయలేదు. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గా హిట్టింగ్కే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా పేస్ ఆల్రౌండర్గా బరిలోకి దిగే ఆటగాడు ఎవరన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా వన్డే వరల్డ్కప్-2023 మధ్యలోనే గాయం కారణంగా హార్దిక్ జట్టు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. చదవండి: #Shivam Dube: పేసర్లనూ చితక్కొడుతున్నాడు.. ఈ హిట్టర్కు చోటిచ్చేస్తారా? Kavya Maran: వారెవ్వా.. సూపర్ హిట్టింగ్! సంభ్రమాశ్చర్యంలో కావ్యా మారన్ -
అంతా అతడే చేశాడు.. వాళ్ల కోసం రోహిత్, ద్రవిడ్లను ఒప్పించి..
విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు జట్టుతో లేకున్నా.. యువ జట్టుతోనే ఇంగ్లండ్పై టెస్టు సిరీస్ గెలిచాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. వీరిద్దరి గైర్హాజరీ.. మధ్యలో ఓ మ్యాచ్కు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి, బ్యాటర్గా కేఎస్ భరత్ వైఫల్యం.. ఫలితంగా ఏకంగా ఐదుగురు క్రికెటర్ల అరంగేట్రం. రెండో టెస్టుతో రజత్ పాటిదార్, మూడో టెస్టుతో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, నాలుగో టెస్టుతో ఆకాశ్ దీప్, ఐదో టెస్టుతో దేవ్దత్ పడిక్కల్ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. వీరిలో రజత్ తప్ప అందరూ తమను తామను నిరూపించుకున్నారు. అయితే, ధ్రువ్ జురెల్, పడిక్కల్ల అరంగేట్రం గురించి తాజాగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరిని తుదిజట్టులో ఆడించేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్లను ఒప్పించేందుకు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ స్వయంగా రంగంలోకి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం 15 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడిన జురెల్ను కేఎస్ భరత్ స్థానంలో వికెట్ కీపర్గా ఎంపిక చేయడం, ఛతేశ్వర్ పుజారాను పూర్తిగా పక్కనపెట్టి పడిక్కల్ను ఆడించడంలో అగార్కర్దే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు హిందుస్తాన్ టైమ్స్ వెల్లడించింది. ‘‘జట్టు యాజమాన్యం జురెల్పై పూర్తి విశ్వాసంతో లేనపుడు అగార్కర్ ఒక్కడే అతడి పేరును బలపరిచాడు. నిజానికి రెడ్ బాల్ క్రికెట్లో తగినంత అనుభవం లేని కుర్రాణ్ణి.. అదీ ఇంగ్లండ్ వంటి జట్టుతో కీలక సిరీస్లో అరంగేట్రం చేయించడం అంటే సాహసంతో కూడుకున్న నిర్ణయం. అయితే, అగార్కర్ మాత్రం అతడిపై పూర్తి నమ్మకం ఉంచాడు. ఇక జట్టులో సీనియర్ల గైర్హాజరీలో ఛతేశ్వర్ పుజారాను తిరిగి తీసుకువద్దామా అనే చర్చ కూడా నడిచింది. రంజీ ట్రోఫీలో పరుగులు చేస్తున్న పుజారాకు పిలుపునివ్వాలని భావించినపుడు.. అగార్కర్ మాత్రం పడిక్కల్ వైపే మొగ్గు చూపాడు. రంజీ ట్రోఫీ టోర్నీలో అద్బుత శతకం(150)తో సత్తా చాటిన పడిక్కల్ వంటి మంచి హైట్ ఉన్న ఆటగాడు.. అంతగా అనుభవం లేని ఇంగ్లండ్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలడని విశ్వసించాడు’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కాగా నాలుగో టెస్టులో టీమిండియా విజయానికి ధ్రువ్ జురెల్ ఇన్నింగ్సే ప్రధాన కారణమన్న విషయం తెలిసిందే. అదే విధంగా.. నామమాత్రపు ఐదో టెస్టులో పడిక్కల్ అద్భుత అర్ధ శతకం(65)తో చెలరేగాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్.. స్పందించిన రోహిత్ -
Ranji- శార్దూల్ ఏమన్నాడో విన్నాను: ద్రవిడ్
దేశవాళీ క్రికెట్లో మ్యాచ్ల మధ్య ఎక్కువ విరామం ఉండాలన్న టీమిండియా పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ వ్యాఖ్యలపై హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. శార్దూల్ మాదిరే మెజారిటీ ఆటగాళ్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే తప్పక పరిగణనలోకి తీసుకోవాలని బీసీసీఐకి సూచించాడు. కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనప్పుడు రంజీల్లో కచ్చితంగా ఆడాలంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆటగాళ్లను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముంబై తరుఫు బరిలోకి దిగిన శార్దూల్ ఠాకూర్ సెమీ ఫైనల్లో అదరగొట్టాడు. అలా అయితే కష్టమే కదా తమిళనాడుతో జరిగిన ఈ మ్యాచ్లో సంచలన సెంచరీ(109)తో జట్టును ఫైనల్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘కేవలం మూడు రోజుల గ్యాప్లో వరుసగా 10 మ్యాచ్లు ఆడటం అంటే దేశవాళీ క్రికెటర్లకు చాలా కష్టం. ముఖ్యంగా ఫాస్ట్బౌలర్లు ఎక్కువగా గాయాలబారిన పడే అవకాశం ఉంటుంది. గతంలో రెగ్యులర్ మ్యాచ్లకు మూడు రోజులు, నాకౌట్ మ్యాచ్లకు ఐదు రోజుల విరామం ఉండేది. కానీ.. ఇప్పుడు అన్నింటికి కేవలం మూడు రోజుల వ్యవధే ఉంటోంది’’ అని పేర్కొన్నాడు. శరీరాలను పణంగా పెడుతోంది వాళ్లే ఈ నేపథ్యంలో... ఇంగ్లండ్పై టీమిండియా 4-1 సిరీస్ విజయం తర్వాత హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్కు ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ కామెంట్లు చేసింది శార్దూల్ అనుకుంటా.. అతడే కాదు చాలా మంది క్రికెటర్లు ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఇండియాలో లాంటి పెద్ద దేశంలో ప్రయణాలు, విరామం లేని షెడ్యూళ్లు అంటే కష్టమే. ఆటగాళ్ల ఇబ్బందుల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే.. విరామం లేని ఆట కోసం వారి శరీరాల(ఆరోగ్యాన్ని)ను పణంగా పెడుతోంది వాళ్లే. కాబట్టి.. ఇలాంటి అంశాల్ని లేవనెత్తుతూ వారు గళం వినిపించినపుడు తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా పలు మార్పులు చేర్పులు ఉండేలా షెడ్యూళ్లను ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆలోచించుకోవాలి’’ అని రాహుల్ ద్రవిడ్ శార్దూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లకు అండగా నిలిచాడు. ఆధునిక యుగంలో అవసరం లేదనుకున్న కొన్ని టోర్నీల నిర్వహణ గురించి.. ఆటగాళ్లు, కోచ్ల నుంచి అభిప్రాయాలు సేకరించి పునరాలోచన చేస్తే బాగుంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. చదవండి: షూ కొనుక్కోవడానికీ డబ్బు లేదు.. అతడే ఆదుకున్నాడు -
ధోని, యువీ కాదు..! భారత్లో గ్రేటెస్ట్ సిక్స్ హిట్టర్ అతడే: ద్రవిడ్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు. సిక్సర్లు బాదడంలో హిట్మ్యాన్ తనకు తానే సాటి అని కొనియాడాడు. భారత్లో ఇంత వరకు అలాంటి హిట్టర్ మరొకరు లేరని పేర్కొన్నాడు. కాగా 2007లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాడు. వన్డేల్లో మూడు ద్విశతకాలు బాదిన ఏకైక క్రికెటర్గా రికార్డులకెక్కిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. టెస్టుల్లో ఇప్పటి వరకు 12 సెంచరీలు నమోదు చేశాడు. ఇక సిక్సర్లు కొట్టడంలో రోహిత్ శర్మ ఎప్పుడూ ‘హిట్టే’! ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్లో మూడు ఫార్మాట్లలో కలిపి అతడి ఖాతాలో 597 సిక్స్లు ఉన్నాయి. ఇక ఇంగ్లండ్తో శనివారం ముగిసిన ఐదో టెస్టులోనూ రోహిత్ శర్మ విశ్వరూపం ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో 162 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు. ఇక ఈ టెస్టులో కూడా టీమిండియా గెలుపొంది సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. ఫలితంగా బ్యాటర్గా, కెప్టెన్గా అద్భుత ప్రదర్శన కనబరిచిన రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. రోహిత్ హిట్టింగ్ పవర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మా వాళ్లకు నా వీడియోలు చూపించాను. అందుకే అలా సిక్సర్ల మీద సిక్సర్లు బాదుతున్నారు(నవ్వుతూ).. జోక్స్ పక్కన పెడితే.. ఈ ఫార్మాట్లో ఎవరైనా సిక్స్లు కొడుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. మనకు రోహిత్ శర్మ లాంటి గొప్ప సిక్స్ హిట్టర్ ఉన్నాడు. షాట్ బాదడంలో తన పవర్, నైపుణ్యం అద్భుతం’’ అని కితాబులిచ్చాడు. టీమిండియాలో ఇంతవరకు అతడిలా సిక్సర్లు బాదిన ఆటగాడు మరొకరు లేరని ద్రవిడ్ జియో సినిమా షోలో ఈమేరకు వ్యాఖ్యానించాడు. కాగా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కూడా టీమిండియాలో గొప్ప సిక్స్ హిట్టర్లుగా పేరొందిన విషయం తెలిసిందే. చదవండి: IPL 2024: వారెవ్వా సంజూ.. బంతిని చూడకుండానే భారీ సిక్సర్! వీడియో వైరల్ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
ద్రవిడ్, సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన జైస్వాల్..!
-
మీ నాన్న ఇక్కడ లేరు.. అయితేనేం!.. ద్రవిడ్ వ్యాఖ్యలు వైరల్
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున నలుగురు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. రెండో టెస్టులో మధ్యప్రదేశ్ రజత్ పాటిదార్, మూడో టెస్టులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ అంతర్జాతీయ క్రికెట్లో అడగుపెట్టారు. తాజాగా శుక్రవారం మొదలైన నాలుగో టెస్టులో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ ఎంట్రీ ఇచ్చాడు. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా టీమిండియా క్యాప్ అందుకున్నాడు. 27 ఏళ్ల వయసులో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. నిజానికి ఆకాశ్ దీప్ ఈ స్థాయికి చేరడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. తండ్రి, సోదరుడిని కోల్పోయిన విషాదం నుంచి కోలుకుని.. ఆటపై దృష్టి సారించాడు. స్వస్థలమైన బిహార్లో అవకాశాలు లేకపోవడంతో పశ్చిమ బెంగాల్కు మకాం మార్చి అక్కడే తన నైపుణ్యాలకు పదును పెట్టి దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఈ విషయం గురించి హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘‘రాంచికి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాడి నుంచి నీ ప్రయాణం మొదలుపెట్టావు. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని.. ఎత్తుపళ్లాలు చూసి ఇక్కడి దాకా వచ్చావు. నీ కాళ్లపై నీవు నిలబడి.. బాడి నుంచి ఢిల్లీ దాకా చేరుకున్నావు. 2007 టీ20 ప్రపంచకప్ విజయం చూసి ఆటపట్ల ఆకర్షితుడవై.. ఢిల్లీలోనే నీ ప్రయాణం మొదలుపెట్టాలని భావించావు. ఆ తర్వాత కోల్కతాకు వెళ్లి.. అక్కడ డొమెస్టిక్ క్రికెట్లో అడుగుపెట్టి అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నావు. ఆ జర్నీ నిన్ను ఇప్పుడు ఇక్కడ రాంచి దాకా తీసుకువచ్చింది. నీ గ్రామానికి 200 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణంలో నువ్వు ఇండియా క్యాప్ అందుకున్నావు. అది కూడా నీ కుటుంబ సభ్యుల సమక్షంలో! ముఖ్యంగా మీ అమ్మగారి ముందు.. ఈ అనుభూతి ఎంత గొప్పగా ఉంటుందో నేను ఊహించగలను. కానీ దురదృష్టవశాత్తూ మీ నాన్నగారు, మీ అన్నయ్య ఇక్కడ లేరు. అయితే, వాళ్ల ఆశీర్వాదాలు మాత్రం నీతోనే ఉంటాయి. జట్టు మొత్తం నీకు అండగా ఉంది. శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఈ క్షణాన్ని నువ్వు పూర్తిగా ఆస్వాదించు. నీ కల నిజమైంది. ఇదిగో అందుకో టీమిండియా టెస్టు క్యాప్ నంబర్ 313’’ అంటూ ఆకాశ్ దీప్ను ఉద్దేశించి ఉద్వేగపూరిత, స్ఫూర్తిదాయక ప్రసంగం చేశాడు. ఇక క్యాప్ అందుకున్న అనంతరం ఆకాశ్ దీప్ తన తల్లి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇక టీమిండియా జెర్సీతో బరిలోకి దిగి ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఒకే ఓవర్లో.. బెన్ డకెట్, ఒలీ పోప్ రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత జాక్ క్రాలేను కూడా పెవిలియన్కు పంపి ఇంగ్లండ్ టాపార్డర్ను కుప్పకూల్చి తొలి రోజు మొత్తంగా మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా ఆకాశ్ దీప్ను ఉద్దేశించి ద్రవిడ్ ప్రసంగం, అతడు తన తల్లి పాదాలకు నమస్కరించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Words that inspire 🗣️ ft. Rahul Dravid Dreams that come true 🥹 A debut vision like never seen before 🎥 Akash Deep - What a story 📝#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vSOSmgECfC — BCCI (@BCCI) February 23, 2024 A wonderful moment after Akash Deep was handed his test cap. You are never too old or big to seek your mother's blessings. pic.twitter.com/cauAM3JX7b — Zucker Doctor (@DoctorLFC) February 23, 2024 Drama on debut for Akash Deep! 🤯😓 A wicket denied by the dreaded No-ball hooter🚨#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/uQ3jVnTQgW — JioCinema (@JioCinema) February 23, 2024 -
టీమిండియా కోచ్ పదవిపై కీలక ప్రకటన చేసిన జై షా
బీసీసీఐ కార్యదర్శి జై షా టీమిండియా కోచ్ పదవిపై కీలక ప్రకటన చేశాడు. ఈ ఏడాది జూన్లో జరిగే టీ20 వరల్డ్కప్ వరకు భారత జట్టు ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడే కొనసాగుతాడని స్పష్టం చేశాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య రాజ్కోట్ వేదికగా ఇవాళ మొదలైన మూడో టెస్ట్కు ముందు షా మాట్లాడుతూ ఇలా అన్నాడు. వరల్డ్కప్ ముగిశాక ద్రవిడ్తో మాట్లాడే అవకాశం దొరకలేదు. ఆతర్వాత కూడా టీమిండియా వరుస సిరీస్లతో బిజీ కావడంతో ద్రవిడ్తో ఎలాంటి మాటామంతి జరపలేదు. రాజ్కోట్ టెస్ట్కు ముందు ద్రవిడ్తో మాట్లడే అవకాశం దొరికింది. టీ20 వరల్డ్కప్ వరకు అతన్నే కోచ్గా కొనసాగాలని కోరాం. అందుకు ద్రవిడ్ కూడా సానుకూలంగానే స్పందించాడు. అనుభవజ్ఞుడైన ద్రవిడ్ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. అతను టీమిండియాను సమర్దవంతంగా ముందుండి నడిపించగలడు. అతని మార్గనిర్దేశకం భారత జట్టు టీ20 వరల్డ్కప్లో రాణిస్తుందన్న నమ్మకం ఉంది. ద్రవిడ్తో పాటు సహాయక కోచింగ్ సిబ్బంది మొత్తం వరల్డ్కప్ వరకు యధాతథంగా కొనసాగుతారని షా స్పష్టం చేశాడు. దీనికి ముందే షా మరో కీలక ప్రకటన కూడా చేశాడు. టీ20 వరల్డ్కప్లో రోహిత్ శర్మనే టీమిండియా కెప్టెన్గా ఉంటాడని స్పష్టం చేశాడు. కాగా, భారత క్రికెట్ జట్టుతో రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ గతేడాది చివర్లో జరిగిన వన్డే వరల్డ్కప్తో ముగిసిందన్న విషయం తెలిసిందే. అయితే రాహుల్ సేవల పట్ల సంతృప్తి చెందిన బీసీసీఐ అతన్ని మరో దఫా కోచ్గా కొనసాగాలని విజ్ఞప్తి చేసింది. అనేక సంప్రదింపుల అనంతరం రాహుల్ బీసీసీఐ ప్రతిపాదనకు ఒప్పుకుని హుటాహుటిన సౌతాఫ్రికా పర్యటనకు బయల్దేరాడు. అప్పట్లో కాంట్రాక్ట్ పొడిగింపుపై ఎలాంటి ప్రకటన చేయని బీసీసీఐ.. తాజాగా ద్రవిడ్ కొనసాగింపుపై స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇదిలా ఉంటే, రాజ్కోట్ టెస్ట్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా తొలి రోజు టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (10), శుభ్మన్ గిల్ (0), రజత్ పాటిదార్ (5) నిరాశపరచగా.. రోహిత్ శర్మ (97 నాటౌట్), రవీంద్ర జడేజా (68 నాటౌట్) టీమిండియాను ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 152 పరుగులు జోడించి, టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించే దిశగా తీసుకెళ్తున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 2, టామ్ హార్ట్లీ ఓ వికెట్ పడగొట్టారు. -
విరాట్ గొప్ప బ్యాటర్.. ఎంట్రీ ఇస్తే ఏం చేయాలో తెలుసు!
'Respect His Prowess & Competitiveness': టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ ఆటంటే తనకెంతో గౌరవమని.. అతడు భాగంగా ఉన్న జట్టుతో పోటీపడటాన్ని తాను ఆస్వాదించేవాడినని గుర్తు చేసుకున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాలు కోహ్లి సొంతమన్న మెకల్లమ్.. ప్రత్యర్థి జట్టుతో అతడు పోటీపడే తీరు మజా అందిస్తుందని పేర్కొన్నాడు. ఏదేమైనా మూడో టెస్టుతో కోహ్లి రీ ఎంట్రీ ఇస్తే అతడిని ఎదుర్కొనేందుకు తమ బౌలర్లు సిద్ధంగా ఉన్నారని మెకల్లమ్ చెప్పుకొచ్చాడు. కాగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కెప్టెన్ బెన్ స్టోక్స్తో కలిసి.. ‘బజ్బాల్’ పేరిట సంప్రదాయ క్రికెట్ను కొత్త పుంతలు తొక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. అతడి మార్గదర్శనంలో టెస్టుల్లోనూ దూకుడు ప్రదర్శిస్తూ ఇంగ్లండ్ విజయవంతంగా ముందుకు సాగుతుండటం విశేషం. ఈ క్రమంలో భారత్ వేదికగా టీమిండియాతో తొలి టెస్టులో గెలుపొందిన ఇంగ్లండ్.. రెండో మ్యాచ్లో మాత్రం భారీ తేడాతో ఓటమిపాలైంది. ఇక ఈ రెండు టెస్టులకు భారత మాజీ సారథి విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల దృష్ట్యా దూరమయ్యాడు. అందుకే కోహ్లి దూరం గర్భవతిగా ఉన్న భార్య అనుష్క శర్మ కోసం అతడు సమయం కేటాయించాడని కోహ్లి స్నేహితుడు ఏబీ డివిలియర్స్ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 15 నుంచి మొదలుకానున్న మూడో టెస్టుకు కోహ్లి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోహ్లి పోటీతత్వం అంటే నాకెంతో గౌరవం ఈ నేపథ్యంలో బ్రెండన్ మెకల్లమ్ టాక్స్పోర్ట్తో మాట్లాడుతూ.. ‘‘గొప్ప క్రికెటర్లలో విరాట్ కోహ్లి ఒకడు. అతడి ఆట, పోటీతత్వం అంటే నాకెంతో గౌరవం. తనతో మ్యాచ్లు ఆడటాన్ని నేను ఆస్వాదించేవాడిని. విజయవంతమైన ఆటగాడితో పోటీ పడటం అంటే.. మనం కూడా ఎంతో కొంత నేర్చుకునే వీలు ఉంటుంది కదా!’’ అంటూ కోహ్లిని కొనియాడాడు. మూడో టెస్టు నేపథ్యంలో కోహ్లి తిరిగి వస్తే.. అతడిని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై దృష్టి సారించామని మెకల్లమ్ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. కాగా కోహ్లి రీఎంట్రీపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయం గురించి రాహుల్ ద్రవిడ్కు ప్రశ్న ఎదురుకాగా.. సెలక్టర్లకే కోహ్లి అందుబాటులో ఉండే విషయం గురించి అవగాహన ఉంటుందని తెలిపాడు. అతడితో వాళ్లు టచ్లో ఉన్నారని.. జట్టు ప్రకటన నాటికి క్లారిటీ వస్తుందంటూ మాట దాటేశాడు. చదవండి: శివం దూబేకు విశ్రాంతి.. శార్దూల్ ఠాకూర్ ఎంట్రీ! -
అలాంటి పిచ్లు అవసరమా అన్న గంగూలీ.. ద్రవిడ్ కౌంటర్!
Ind vs Eng- Dravid Comments On Pitch: ఇటీవల కాలంలో టెస్టు మ్యాచ్లు ఐదురోజుల పాటు పూర్తిగా జరిగిన సందర్భాలు అరుదు. ఒక్కోసారి ఒకటిన్నర రోజుల్లోనే మ్యాచ్లు ముగిసిపోవడం వల్ల పిచ్ల తయారీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా- ఇంగ్లండ్ తాజా సిరీస్పై క్రికెట్ దిగ్గజాల దృష్టి పడింది. భారత్ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన గత సిరీస్లో పిచ్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సహా ఇతర మాజీ క్రికెటర్లు వ్యంగ్యస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుకు మాత్రమే ఉపయోగపడేలా వికెట్ రూపొందించారంటూ విమర్శించారు. ఈ క్రమంలో తాజా సిరీస్లో ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్లు నాలుగు రోజుల పాటు సాగాయి. బుమ్రా అద్భుత ప్రదర్శన హైదరాబాద్ టెస్టులో విజయంతో ఇంగ్లండ్ సిరీస్ ఆరంభిస్తే... విశాఖపట్నంలో టీమిండియా గెలుపొంది సిరీస్ను 1-1తో సమం చేసింది. రెండు మ్యాచ్లు కూడా రసవత్తరంగానే సాగడం విశేషం. ముఖ్యంగా టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా వికెట్లు తీసిన తీరు ముచ్చటగొలిపింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. భారత్లో స్పిన్తో పాటు పేస్కూ అనుకూలించే పిచ్లు రూపొందించాలని విజ్ఞప్తి చేశాడు. కేవలం టర్న్ అయ్యే పిచ్లు మనకు అవసరమా అని ఈ సందర్భంగా కామెంట్ చేశాడు. ఈ క్రమంలో.. తాజాగా ఈ విషయంపై టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం స్పందించాడు. When I see Bumrah Sami Siraj Mukesh bowl . I wonder why do we need to prepare turning tracks in india ..my conviction of playing on good wickets keeps getting stronger every game .. They will get 20 wickets on any surface with ashwin jadeja Kuldeep and axar .. batting quality… — Sourav Ganguly (@SGanguly99) February 3, 2024 విశాఖ మ్యాచ్లో భారత్ గెలుపు నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. తామెప్పుడూ పూర్తి స్పిన్ పిచ్ తయారు చేయాలని కోరలేదని స్పష్టం చేశాడు. పిచ్ల రూపకల్పన క్యూరేటర్ల పని అని.. అందులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశాడు. టర్న్ అయ్యే పిచ్లే కావాలని మేము కోరలేదు ‘‘పిచ్లను క్యూరేటర్ తయారు చేస్తారు. పూర్తిగా టర్నింగ్ పిచ్లు మాత్రమే కావాలని మేము అడగము. ఇండియాలో సహజంగానే వికెట్లు స్పిన్కు అనుకూలిస్తాయి. అయితే, అవి ఎంత వరకు టర్న్ అవుతాయి? ఎంత తక్కువ టర్న్ అవుతాయి? అన్న విషయాలు మనకు తెలియవు. నేనేమీ పిచ్ నిపుణుడిని కాదు. ఇండియాలో పిచ్లు నాలుగు- ఐదు రోజుల ఆట కోసమే రూపొందిస్తారు. మళ్లీ చెప్తున్నా ఇక్కడి పిచ్లు టర్న్ అవుతాయి. అంతేగానీ.. టర్న్ అవుతూనే ఉండవు. ఒక్కోసారి మూడో రోజు.. ఒక్కోసారి నాలుగో రోజు.. ఒక్కో సారి రెండోరోజే టర్న్ అవుతాయి. పిచ్ స్వభావం ఎలా ఉండబోతుందన్న అంశంపై ఎవరికీ పూర్తి అవగాహన ఉండదు. ఏ పిచ్పై అయినా మా ఆట తీరు ఎలా ఉంటుందనేదే ముఖ్యం. తదుపరి మేము రాజ్కోట్కు వెళ్తున్నాం. అక్కడి పిచ్ ఎలా ఉంటుందో మాకు ఐడియా లేదు. ఎలాంటి వికెట్పై అయినా మా అత్యుత్తమ ప్రదర్శన కనబరచడమే మాకు ప్రథమ ప్రాధాన్యం’’ అని రాహుల్ ద్రవిడ్ కుండబద్దలు కొట్టాడు. గంగూలీకి కౌంటర్గానేనా? ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న నెటిజన్లు.. గంగూలీ లాంటి వాళ్లకు ద్రవిడ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా గంగూలీ బీసీసీఐ బాస్గా ఉన్న సమయంలోనే తన సహచర ఆటగాడు ద్రవిడ్ను హెడ్కోచ్గా నియమించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్లో మూడో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: IPL 2024: అందుకే రోహిత్ను ముంబై కెప్టెన్గా తప్పించాం.. కోచ్పై రితిక ఫైర్ -
ఇషాన్ తిరిగి రావాలంటే తనను తాను నిరూపించుకోవాలి: రాహుల్ ద్రవిడ్
టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ గతకొద్ది రోజులుగా ఎక్కడా కనిపించడం లేదు. వ్యక్తిగత కారణాల చేత గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశానికి వచ్చేసిన ఇషాన్.. అప్పటి నుంచి క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. గ్యాప్ కావడంతో జాతీయ సెలెక్టర్లు సైతం ఇషాన్ను ఏ ఫార్మాట్కు పరిగణలోకి తీసుకోవడం లేదు. దీంతో అలకబూనాడో ఏమో తెలీదు కానీ.. అతను కనీసం దేశవాలీ టోర్నీల్లో కూడా ఆడకుండా బీష్మించుకు కూర్చున్నాడు. తాజాగా విశాఖ టెస్ట్ అనంతరం విలేకరులు ఇషాన్ గురించి టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వద్ద ఆరా తీశారు. అసలు ఇషాన్కు ఏమైంది.. అతను ఇంతకాలంగా జట్టుకు ఎందుకు దూరంగా ఉంటున్నాడంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు ద్రవిడ్ స్పందిస్తూ.. ఇషాన్ను జాతీయ సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోవాలంటే, అతను తొలుత క్రికెట్ ఆడటం మొదలుపెట్టాలి. ఏ తరహా గేమ్లోనైనా సరే తనను తాను నిరూపించుకోవాలి. ఇషాన్ అభ్యర్ధన మేరకే బ్రేక్ లభించింది. తిరిగి జట్టులోకి రావాలంటే తప్పనిసరిగా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇషాన్తో టచ్లోనే ఉన్నామని ద్రవిడ్ వివరణ ఇచ్చాడు. బీసీసీఐలోని ఓ వర్గం ఇషాన్ రీఎంట్రీని అడ్డుకుంటుందన్న ప్రచారం జరుగుతున్న వేల ద్రవిడ్ ఇచ్చిన వివరణ ఆసక్తికరంగా మారింది. ఇషాన్ కూడా కోహ్లిలా బీసీసీఐ పెద్దలతో ఏదైనా గొడవ పడ్డాడా అని జనాలు ఆరా తీయడం మొదలుపెట్టారు. అప్పటివరకు మూడు ఫార్మాట్లలో సభ్యుడిగా ఉన్న ఇషాన్ ఒక్కసారిగా కనుమరుగైపోవడం ఏంటని చర్చించుకుంటున్నారు. ద్రవిడ్ ఇచ్చిన వివరణ చూస్తుంటే, ఇషాన్ రీఎంట్రీని అడ్డుకునే ప్రణాళికగా ఉందంటూ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుత టెస్ట్ వికెట్కీపర్ కేఎస్ భరత్ వరుసగా విఫలమవుతున్నా.. అతనితోనే నెట్టుకొస్తున్నారు కానీ, ఇషాన్ను అస్సలు పరిగణలోకి తీసుకోవడం లేదంటూ అనుమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్ట్లో బుమ్రా (9/91), యశస్వి జైస్వాల్ (209), శుభ్మన్ గిల్ (104) అద్భుత ప్రదర్శనలతో చెలరేగడంతో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమానంగా నిలిచింది. -
కుర్రాళ్లకు అనుభవం లేదు.. మరో 70-80 చేయాల్సింది: ద్రవిడ్
హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో అదరగొట్టిన భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్లో మాత్రం చెతేలేత్తేశారు. ఇంగ్లండ్ నిర్దేశించిన 231 పరుగుల లక్ష్య ఛేదనలో 202 పరుగులకే భారత్ ఆలౌటైంది. ఈ విజయంతో ఇంగ్లండ్ ఐదు టెస్ట్ల సిరీస్లో 1-0తో శుభారంభం చేసింది. ఇక తొలి టెస్టులో ఓటమిపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. "ఈ మ్యాచ్లో మా బ్యాటర్లు ఎవరూ సెంచరీ సాధించలేకపోయారు. ఎవరో ఒకరైనా మూడెంకెల స్కోర్ సాధించి వుంటే బాగుండేది. తొలి ఇన్నింగ్స్లో 70 నుంచి 80 పరుగులు చేసి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడూ బ్యాటర్లకు ఛాలెంజింగ్గానే ఉంటుంది. లక్ష్యం 230 పరుగులే అయినప్పటికి ఛేజ్ చేయడం అంత సులభం కాదు. ప్రస్తుత మా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. వారికి వైట్బాల్ క్రికెట్ ఆడిన అనుభవం ఎక్కువగా ఉంది. కానీ రెడ్ బాల్ క్రికెట్లో పెద్దగా అనువభం లేదు. టెస్టు క్రికెట్లో ఎదగడానికి వారికి ఇంకాస్త సమయం అవసరం. ప్రతీ ఒక్క ఆటగాడికి అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి. వారు దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించి సీనియర్ జట్టులోకి వచ్చారు. వారు తప్పకుండా భవిష్యత్తులో మెరుగైన ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నానని" విలేకరుల సమావేశంలో ద్రవిడ్ పేర్కొన్నాడు. -
పోప్పై ప్రశంసల వర్షం కురిపించిన టీమిండియా కెప్టెన్, కోచ్
హైదరాబాద్ టెస్ట్లో భారీ ద్విశతం (196) సాధించి, తమ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచిన ఇంగ్లండ్ ఆటగాడు ఓలీ పోప్పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసల వర్షం కురిపించారు. మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వీరిద్దరూ పోప్ ఆడిన మ్యాచ్ విన్నింగ్స్ను కొనియాడారు. ద్రవిడ్ మాట్లాడుతూ.. గతంలో పలువురు విదేశీ బ్యాటర్లు భారత స్పిన్నర్లను ఇబ్బంది పెట్టిన సందర్భాలు చూశాను. కానీ పోప్లా భారత స్పిన్నర్లను నిలదొక్కుకోనీయకుండా ఇబ్బంది పెట్టిన బ్యాటర్లను చూడలేదు. పోప్ వైవిధ్యభరితమైన షాట్లను (రివర్స్ స్వీప్) ఎంతో సమర్థవంతంగా ఆడి భారత స్పిన్నర్లు లయ తప్పేలా చేశాడు. పోప్ ఎదురుదాడికి దిగి భారత స్పిన్నర్లను కుదురుకోనీయకుండా చేశాడు. కష్టమైన పిచ్పై పోప్ ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలోనే మేటి స్పిన్నర్లను పోప్ తన బ్యాటింగ్ నైపుణ్యంతో ముప్పుతిప్పలు పెట్టాడు. ఫైనల్గా హ్యాట్స్ ఆఫ్ టు పోప్ అంటూ ద్రవిడ్ కొనియాడాడు. మరోవైపు పోప్ గురించి భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇలా అన్నాడు. భారత గడ్డపై ఓ విదేశీ ప్లేయర్ ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఇది (పోప్) ఒకటని రోహిత్ కితాబునిచ్చాడు. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా జరిగిన తొలి టెస్ట్లో పర్యాటక ఇంగ్లండ్.. టీమిండియాపై 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 190 పరుగుల భారీ లీడ్ సాధించినప్పటికీ ఓటమిపాలైంది. ఓలీ పోప్ మూడో ఇన్నింగ్స్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్ ముందు ఫైటింగ్ టోటల్ను ఉంచడంలో కీలకపాత్ర పోషించాడు. 230 పరుగుల లక్ష్య ఛేదనలో తడబడిన భారత్ 202 పరుగులకు ఆలౌటై, స్వదేశంలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సిరీస్లోని రెండో టెస్ట్ మ్యాచ్ విశాఖ వేదికగా ఫిబ్రవరి 2 నుంచి మొదలవుతుంది. -
కేఎల్ రాహుల్ వికెట్కీపింగ్ చేయడు: రాహుల్ ద్రవిడ్
త్వరలో ఇంగ్లండ్తో జరుగబోయే టెస్ట్ సిరీస్లో కేఎల్ రాహుల్ వికెట్కీపింగ్ చేస్తాడా లేదా అన్న విషయమై భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సిరీస్లో రాహుల్ వికెట్కీపింగ్ చేసేది లేదని ఖరాఖండిగా చెప్పాడు. రాహుల్ కేవలం బ్యాటర్గా మాత్రమే కొనసాగుతాడని తెలిపాడు. ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్కప్ను దృష్టిలో ఉంచుకుని, ఇంగ్లండ్ సిరీస్ ప్రారంభానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అందులో భాగంగానే జట్టులో అదనంగా ఇద్దరు వికెట్కీపర్లను ఎంపిక చేసినట్లు పేర్కొన్నాడు. ఇటీవలికాలంలో రాహుల్ ఫార్మాట్లకతీతంగా వికెట్కీపర్ బ్యాటర్గా రాణిస్తున్నప్పటికీ ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లో మాత్రం ప్రయోగాలు చేయలేమని అన్నాడు. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉన్నందున బ్యాటింగ్ పరంగానే రాహుల్పై అధిక భారం పడే అవకాశం ఉందని, అందుకే అతనిపై వికెట్కీపింగ్ భారాన్ని మోపే సాహసం చేయలేమని వివరణ ఇచ్చాడు. వికెట్కీపింగ్ బ్యాటర్ స్థానం కోసం కేఎస్ భరత్, దృవ్ జురెల్ మధ్య పోటీ నెలకొందని, ఇద్దరిలో ఒకరికి అవకాశం ఇస్తామని తెలిపాడు. ఇద్దరూ అద్భుతమైన ఫామ్లో ఉండటంతో తుది జట్టులోకి ఎవరిని ఎంపిక చేయాలో అర్ధం కావట్లేదని అన్నాడు. కాగా, ఇంగ్లండ్తో తొలి రెండు టెస్ట్ల కోసం భారత సెలక్టర్లు రాహుల్తో కలిపి ముగ్గురు వికెట్కీపర్లను ఎంపిక చేశారు. రాహుల్పై అధిక భారం పడకూడదనే ఉద్దేశంతోనే సెలెక్టర్లు కేఎస్ భరత్, దృవ్ జురెల్ స్టాండ్ బై కీపర్లుగా ఎంపిక చేశారు. కాగా, ఈ నెల 25 నుంచి హైదరాబాద్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇదివరకే హైదరాబాద్కు చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్లో బిజీగా ఉన్నారు. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల చేత తొలి రెండు టెస్ట్లకు దూరం కాగా.. ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాల చేత సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. -
అందుకే ఇషాన్పై వేటు?.. వస్తే నేరుగా తుదిజట్టులోకే!
Ind vs Eng 5 Match Test Series 2024: ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్ నేపథ్యంలో తొలి రెండు మ్యాచ్లలో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ శుక్రవారం రాత్రి ప్రకటించింది. సొంతగడ్డపై దాదాపు నెలన్నర పాటు జరుగనున్న ఈ సిరీస్ సందర్భంగా ఓ కొత్త ఆటగాడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్కు చెందిన యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్కు తొలిసారి జాతీయ జట్టులో చోటు కల్పించారు. కేఎల్ రాహుల్, కోన శ్రీకర్ భరత్లతో పాటు మూడో వికెట్ కీపర్ ఆప్షన్గా అతడికి అవకాశం ఇచ్చారు. నిజానికి స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సెలక్షన్కు అందుబాటులో ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. మధ్యలోనే తిరిగి వచ్చాడు గత కొన్నాళ్లుగా ఈ జార్ఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జట్టుతో ప్రయాణిస్తున్నా తుదిజట్టులో ఆడే అవకాశం రావడం లేదు. దీంతో సౌతాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. మానసికంగా అలసిపోయానంటూ బీసీసీఐ దగ్గర సెలవు తీసుకుని ఆటకు విరామం ప్రకటించాడు. అయితే, ఇషాన్ కిషన్ వ్యవహారశైలి నచ్చని బీసీసీఐ పెద్దలు క్రమశిక్షణ చర్యల కింద అతడిని కొన్నాళ్లపాటు దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అందుకే ఈ లెఫ్టాండ్ బ్యాటర్ను అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్కు కూడా ఎంపిక చేయలేదనే విమర్శలు వచ్చాయి. అలాంటిదేమీ లేదన్న ద్రవిడ్ ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ స్వయంగా స్పందించాడు. ఇషాన్పై అలాంటి చర్యలేమీ తీసుకోలేదని.. అతడు సెలక్షన్కు అందుబాటులో లేడు కాబట్టే ఎంపిక చేయలేదని తెలిపాడు. అయితే, మళ్లీ టీమిండియాలో ఎంట్రీ ఇవ్వాలంటే దేశవాళీ క్రికెట్లో నిరూపించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. రంజీలో నేరుగా తుదిజట్టులో ఆడిస్తామన్న జార్ఖండ్ మేనేజ్మెంట్ ఈ క్రమంలో జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి దేబాశిష్ చక్రవర్తి ఇషాన్ కిషన్కు తాము స్వాగతం పలుకుతున్నట్లు ప్రకటించాడు. అయితే, ఇంత వరకు ఇషాన్ తమను సంప్రదించలేదని.. ఒకవేళ అతడు రంజీ ట్రోఫీ-2024 సీజన్లో జార్ఖండ్ జట్టుకు ఆడాలనుకుంటే.. నేరుగా తుదిజట్టులో ఆడిస్తామని స్పష్టం చేశాడు. అయినప్పటికీ ఇంత వరకు ఇషాన్ కిషన్ జార్ఖండ్ జట్టుతో చేరలేదని తెలుస్తోంది. ఒకవేళ రంజీలకు దూరంగా ఉండాలని ఇషాన్ నిర్ణయించుకుంటే ఇక ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో అతడికి చోటు దక్కకపోవచ్చు. తొలి టెస్టు హైదరాబాద్లో ఇప్పటికే తొలి రెండు టెస్టులకు దూరమైన ఇషాన్.. మిగతా మూడు మ్యాచ్లు కూడా మర్చిపోవాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ చెప్పిన మాటలు పెడచెవిన పెడితే రీఎంట్రీ అసాధ్యమవుతుంది. చూడాలి మరి ఈ యంగ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఏం చేస్తాడో!! ఇదిలా ఉంటే.. ఇషాన్ స్థానంలో జట్టులోకి వచ్చిన 22 ఏళ్ల ధ్రువ్ భారత అండర్–19 జట్టుకు ఆడాడు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఈనెల 25 నుంచి 29 వరకు హైదరాబాద్లో... రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు విశాఖపట్నంలో జరుగుతాయి. ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్. చదవండి: Ind vs Eng ఎవరీ ధ్రువ్ జురెల్? తండ్రి కార్గిల్ యుద్ధంలో.. తల్లి త్యాగం! -
వెళ్లడం వరకే నీ ఇష్టం!.. ద్రవిడ్ ‘వార్నింగ్’ తర్వాత ఇషాన్ ఫస్ట్ రియాక్షన్
Rahul Dravid- Ishan Kishan: టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ భవితవ్యంపై గత కొన్ని రోజులుగా క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ ఇంకా సెలవులోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో.. అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్కు అతడు అందుబాటులోకి వస్తాడని భావించినా.. అలా జరుగలేదని టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ స్వయంగా వెల్లడించాడు. అంతేకాదు.. ఇషాన్ మళ్లీ భారత జట్టుతో చేరాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో.. మానసికంగా అలసిపోయానని తనకు తాను తప్పుకొన్న ఇషాన్ కిషన్.. పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుండటం బీసీసీఐ పెద్దలకు ఆగ్రహం తెప్పించిందనే వార్తలు వినిపించాయి. వెళ్లడం వరకే మీ ఇష్టం.. తిరిగి రావాలంటే ఈ నేపథ్యంలోనే .. ‘‘జట్టును వీడి వెళ్లాలా వద్దా అనేది మాత్రమే ఆటగాళ్ల ఇష్టం.. వాళ్లను తిరిగి తీసుకోవాలా వద్దా అనేది మాత్రం మా ఇష్టమే’’ అన్న అర్థం ద్రవిడ్ మాటల్లో ధ్వనించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీలైనప్పుడల్లా అవకాశాలు ఇస్తున్నా.. తనను కావాలనే పక్కనపెడుతున్నారని ఇషాన్ ఇగోకు పోయి తన కెరీర్ను తానే నాశనం చేసుకుంటున్నాడనే మాటలూ వినిపిస్తున్నాయి. రంజీల్లో ఆడతాడో లేదో చెప్పలేదు.. వస్తే మాత్రం మరోవైపు.. ద్రవిడ్ చెప్పిన తర్వాత ఇషాన్ కిషన్ రంజీ ట్రోఫీ-2024 సీజన్లో కచ్చితంగా ఆడతాడని అంతా భావించారు. ఇంగ్లండ్తో స్వదేశంలో టెస్టు సిరీస్కు ముందు ఇషాన్.. దేశవాళీ క్రికెట్లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జార్ఖండ్ తరఫున బరిలోకి దిగుతాడని ఊహించారు. కానీ.. ఇందుకు సంబంధించి తమకు ఇషాన్ నుంచి ఎలాంటి సమాచారం లేదని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి దేబాశిష్ చక్రవర్తి వార్తా సంస్థ పీటీఐకి తెలిపాడు. ఒకవేళ ఇషాన్ రంజీల్లో ఆడాలనుకుంటే నేరుగా తుదిజట్టులో చేర్చుకుంటామని స్పష్టం చేశాడు. అయినప్పటికీ ఈ పరిణామాలపై ఇషాన్ కిషన్ ఇంత వరకు నేరుగా స్పందించకపోవడం గమనార్హం. అయితే, తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ వీడియోతో ప్రత్యక్షమయ్యాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. యోగా చేస్తూ, మైదానంలో పరుగులు తీస్తూ ఇందులో... యోగా చేస్తూ, మైదానంలో పరుగులు తీస్తూ కనిపించాడు. దీనిని బట్టి త్వరలోనే రీఎంట్రీ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఇషాన్ చెప్పకనే చెప్పినట్లయింది. అయితే, ఇప్పటికే శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్లతో పాటు రుతురాజ్ గైక్వాడ్ నుంచి ఓపెనింగ్ స్థానానికి ఇషాన్ గట్టి పోటీని ఎదుర్కొంటున్నాడు. మరోవైపు... కేఎల్ రాహుల్- శ్రీకర్ భరత్(టెస్టు), సంజూ శాంసన్- జితేశ్ శర్మ(వన్డే, టీ20లలో) రూపంలో వికెట్ కీపర్ స్థానానికి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ విషయంలో మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: NZ vs Pak: చరిత్ర సృష్టించిన కివీస్ పేసర్: ప్రపంచంలోనే ఏకైక బౌలర్గా రికార్డు 🏃♂️ pic.twitter.com/XjUfL18Ydc — Ishan Kishan (@ishankishan51) January 12, 2024 -
Dravid: అప్పటి వరకు ఇషాన్కు టీమిండియాలో స్థానం లేదు
Ishan Kishan Return?: టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్పై బీసీసీఐ గుర్రుగా ఉందన్న వార్తల నేపథ్యంలో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ క్రికెట్లో నిరూపించుకున్న తర్వాతే ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మళ్లీ సెలక్షన్కు అందుబాటులోకి వస్తాడని తెలిపాడు. అంతవరకు ఇషాన్ కిషన్కు టీమిండియాలో స్థానం దక్కదని ద్రవిడ్ సంకేతాలు ఇచ్చాడు. కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టులకు ఎంపికైన ఇషాన్ సిరీస్ ఆరంభానికి ముందే స్వదేశానికి తిరిగి వచ్చాడు. మానసికంగా అలసిపోయానని.. కుటుంబంతో గడిపేందుకు తనకు సెలవు మంజూరు చేయాలని అతడు విజ్ఞప్తి చేయగా.. మేనేజ్మెంట్ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. నమ్మకాన్ని వమ్ము చేశాడంటూ వదంతులు అయితే, బీసీసీఐ పెద్దల నమ్మకాన్ని వమ్ము చేసేలా ఇషాన్ వ్యవహరించాడన్న కారణంతోనే అతడిని అఫ్గనిస్తాన్తో సిరీస్కు పక్కనపెట్టినట్లు వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో.. తొలి టీ20 ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన రాహుల్ ద్రవిడ్కు ఇషాన్ గురించి ప్రశ్న ఎదురైంది. అప్పుడే మళ్లీ టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ.. తేల్చేసిన ద్రవిడ్ ఇందుకు బదులిస్తూ.. ‘‘అలాంటిదేమీ లేదు. సెలక్షన్కు అతడు అందుబాటులో లేడు. నిజానికి సౌతాఫ్రికా టూర్లో ఉన్నపుడే తనకు బ్రేక్ కావాలని ఇషాన్ అడిగాడు. మేము కూడా అందుకు అంగీకరించాం. అన్ని విధాలా మద్దతుగా నిలబడ్డాం. సమస్యకు తగిన పరిష్కారం వెదకాలని సూచించాం. ఆ తర్వాత అతడు ఇంత వరకు సెలక్షన్కు అందుబాటులోకి రాలేదు. ఒకవేళ తను మళ్లీ మైదానంలో దిగాలనుకుంటే.. దేశవాళీ క్రికెట్ ఆడి.. అప్పుడు సెలక్షన్కు అవైలబుల్గా ఉంటాడు’’ అని ద్రవిడ్ స్పష్టం చేశాడు. సంజూ, జితేశ్లకు లక్కీ ఛాన్స్ కాగా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్కు ఇషాన్ కిషన్ స్థానంలో సంజూ శాంసన్, జితేశ్ శర్మ వికెట్ కీపర్లుగా చోటు దక్కించుకున్నారు. ఇక టీ20 ప్రపంచకప్-2024కు ముందు టీమిండియా ఆడే ఆఖరి సిరీస్ ఇదే కావడం గమనార్హం. మళ్లీ ఐపీఎల్-2024లో ప్రదర్శనను బట్టే ఇషాన్ వరల్డ్కప్ నాటికి తిరిగి వస్తాడా లేదా అన్నది తేలనుంది. అయితే, అంతకంటే ముందు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ఆడే జట్టులో చోటు దక్కించుకోవాలంటే జార్ఖండ్ తరఫున ఇషాన్ రంజీల్లో ఆడటం తప్ప మరోమార్గం లేదు. అక్కడ తనను తాను నిరూపించుకున్నా.. కేఎల్ రాహుల్ రూపంలో వికెట్ కీపర్ స్థానానికి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. చదవండి: Ind vs Afg: అఫ్గన్ బ్యాటింగ్ సంచలనం.. 22 ఏళ్ల కెప్టెన్! రోహిత్ సేనతో ఢీ అంటే ఢీ! ఎవరితడు? -
అందుకే అయ్యర్పై వేటు?.. క్లారిటీ ఇచ్చిన ద్రవిడ్
Ind vs Afg T20Is- Rahul Dravid Comments On Shreyas Iyer: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గురించి వస్తున్న వార్తలను హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ఖండించాడు. క్రమశిక్షణా రాహిత్యం వల్లనే అతడిని జట్టు నుంచి తప్పించారన్న వదంతులను కొట్టిపారేశాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023 తర్వాత టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. ఆసీస్ సిరీస్కు వైస్ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో జరిగిన ఈ సిరీస్ తాలుకు ఆఖరి రెండు మ్యాచ్లకు శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీ20 జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. కానీ.. పొట్టి ఫార్మాట్లో సఫారీలతో జరిగిన సిరీస్లో అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అఫ్గన్తో సిరీస్కు పక్కనపెట్టేశారు ఈ క్రమంలో సొంతగడ్డపై జనవరి 11 నుంచి మొదలుకానున్న అఫ్గనిస్తాన్తో సిరీస్కు అతడిని పక్కనపెట్టడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగానే అయ్యర్పై వేటు వేశారంటూ వదంతులు వ్యాపించాయి. ఈ విషయంపై తాజాగా స్పందించిన హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్.. ‘‘అఫ్గన్తో సిరీస్కు శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయకపోవడానికి డిసిప్లినరీ యాక్షన్ కారణమన్నది పూర్తిగా అవాస్తవం. అతడు ఈ సిరీస్ మిస్సయ్యాడంతే! చాలా మంది ఉన్నారు జట్టులో ఇప్పటికే చాలా మంది బ్యాటర్లు ఉన్నారు. అందుకే సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లోనూ అతడికి ఆడే అవకాశం రాలేదు. ఈ విషయాన్ని మీరు గమనించే ఉంటారు. జట్టులో ఎక్కువ మంది బ్యాటర్లు ఉన్నందువల్ల గట్టి పోటీ ఉంది. ప్రతి ఒక్కరిని తుదిజట్టులో ఆడించడం కుదరదు కదా. అందుకే అయ్యర్ను పక్కనపెట్టాల్సి వచ్చింది. అంతేగానీ క్రమశిక్షణారాహిత్యం వల్ల అతడిని తప్పించామనడం సరికాదు. అసలు ఈ విషయం గురించి సెలక్టర్లతో నేను ఎలాంటి చర్చలు జరుపలేదు’’ అని స్పష్టతనిచ్చాడు. రంజీల్లో అయ్యర్ ఆట కాగా అఫ్గన్తో సిరీస్కు ఎంపిక కాని శ్రేయస్ అయ్యర్ ఇంగ్లండ్తో టెస్టులకు సన్నద్ధమయ్యే పనిలో పడ్డాడు. ముంబై తరఫున రంజీ ట్రోఫీ-2024 సీజన్లో ఆడేందుకు అతడు నిర్ణయించుకున్నాడు. ఆంధ్రా జట్టుతో జనవరి 12 నుంచి మొదలుకానున్న మ్యాచ్లో పాల్గొనే ముంబై జట్టులో సెలక్టర్లు అయ్యర్ పేరును చేర్చారు. చదవండి: IND Vs AFG T20I Series: రీఎంట్రీలో అభిమానులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కోహ్లి
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పటిష్ట బందోబస్తు
72 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు
● రామగుండం కమిషనరేట్లో పర్యవేక్షణ కేంద్రం ● మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తం ● నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు
నేడే లోక్సభ పోలింగ్
రంగంపల్లిలో ఓటు వేయనున్న కలెక్టర్
ఉరుములు.. మెరుపులు
బైక్ నడిపి.. చాయ్ తాగి
ఓటరూ.. ఒక్క నిమిషం..!
పకడ్బందీగా సిద్ధం
నేడే లోక్సభ పోలింగ్
తప్పక చదవండి
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement