-
బీజేపీలో చేరిన రాధికా ఖేరా.. ఎవరీమె?
రాజస్థాన్ కాంగ్రెస్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఐసీసీ అధికార ప్రతినిధి రాధికా ఖేరా కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు.కొద్ది రోజుల క్రితం రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు తనని వేధిస్తున్నారంటూ రాధికా ఖేరా సంచలన ఆరోపణలు చేశారు. పార్టీకి సైతం రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన రాజీనామా లేఖలో అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించడం తాను విమర్శలకు గురైనట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తనను వేధించారని, గదిలో బంధించి దుర్భాషలాడారని ఆరోపించారు. ఇదే విషయంపై పార్టీ నేతలకు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. దీంతో పాటు అయోధ్యలోని రామమందిరాన్ని దర్శించుకున్నందుకు అనేక విమర్శలు ఎదురైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ యూనిట్ కమ్యూనికేషన్ వింగ్ ఛైర్పర్సన్ సుశీల్ ఆనంద్తో పాటు మరికొంత మంది తనను అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని లేఖలో పేర్కొన్నారు -
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
జైపూర్: లోక్సభ ఎన్నికల వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్కు చెందిన మంత్రి బాబులాల్ ఖరాడీను చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. దీంతో, పోలీసులు అప్రమత్తమయ్యారు.వివరాల ప్రకారం.. రాజస్థాన్లోని బీజేపీ ప్రభుత్వంలో బాబులాల్ ఖరాడీ గిరిజన శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా(ఇన్స్స్టాగ్రామ్) వేదికగా మంత్రి బాబులాల్కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఈ మేసేజ్లో బాబులాల్ను చంపేస్తానని దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. Babulal Kharadi Receives Death Threat: बाबूलाल खराड़ी को सोशल मीडिया पर मिली धमकी | Udaipur | BJP#RajasthanWithFirstIndia #BabulalKharadi #BJP #Udaipur #RajasthanNews #RajasthanPolitics #DeathThreats pic.twitter.com/s7iL3WY7Gc— First India News (@1stIndiaNews) May 4, 2024 ఈ నేపథ్యంలో మంత్రి బాబులాల్ కుమారుడు.. ఈ మెసేజ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. మూడు రోజుల క్రితం ఈ బెదిరింపులు వచ్చినట్లు తెలిపారు. అయితే, గిరిజనులను హిందూ మతంలోకి మారుస్తున్నారని ఆరోపిస్తూ మంత్రిని చంపేస్తానని గుర్తు తెలియని వ్యక్తి బెదిరించినట్లు చెప్పారు. ఈ మేరకు సదరు వ్యక్తిపై ఉదయ్పూర్లోని కొద్దా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. -
రాజస్థాన్ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. గెహ్లాట్కు ఎదురుదెబ్బ!
జైపూర్: లోక్సభ ఎన్నికల వేళ రాజస్థాన్ రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో మాజీ సీఎం అశోక్ గెహ్లాట్పై అతని మాజీ ఓఎస్డీ లోకేష్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో, పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్, రీట్ (రాజస్థాన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్ష పేపర్ లీక్ వ్యవహారాల్లో గెహ్లాట్పై మాజీ లోకేశ్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క రోజు తనకు సీఎం పీఎస్ఓ రాం నివాస్ నుంచి ఫోన్ వచ్చిందన్నారు. సీఎం గెహ్లాట్ నివాసానికి రావాలని చెప్పారు. దీంతో, అక్కడికి వెళ్లాను. ఈ సందర్భంగా కొన్ని ఆడియో క్లిప్లతో కూడిన పెన్ డ్రైవ్ను గెహ్లాట్ తనకు అందజేశారని, ఆ తర్వాత అవి మీడియాకు లీక్ అయ్యాయని అన్నారు. అవి ఫోన్ సంభాషణలు అని తనకు చెప్పారని, అయితే అవి చట్టబద్ధమైనవో కాదో తనకు తెలియదని పేర్కొన్నారు. తనను ఒక హోటల్కు పిలిపించి వీటి గురించి మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు. రీట్ పేపర్ లీక్ వ్యవహారంలో తన సన్నిహితులకు అశోక్ గెహ్లాట్ రక్షణ కల్పించారని శర్మ ఆరోపించారు. అనంతరం, ఆడియో సంభాషణను లోకేష్ శర్మ లీక్ చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. ఇదివరకే లోకేశ్ శర్మను విచారణకు పిలిచి ప్రశ్నించారు. లోకేశ్ శర్మ ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. అయితే, ఈ విషయంపై గెహ్లాట్పై లోకేశ్ శర్మ పరువు నష్టం దావా వేశారు. ఇక, ఈ ఆరోపణలపై అశోక్ గెహ్లాట్ ఇప్పటివరకు స్పందించలేదు. Gehlot, in order to save his Govt, tapped Sachin Pilot and other’s phone, and made it appear as if Gajendra Singh Sekhawat and the BJP tried to topple his Govt.- Lokesh Sharma, Ashok Gehlot’s former OSD pic.twitter.com/PuxYilQkZn— Rishi Bagree (@rishibagree) April 25, 2024 అయితే, 2020 జూలైలో కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ మొత్తం 19 మంది ఎమ్మెల్యేలతో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యేలుగా ఉన్న విశ్వేంద్ర సింగ్, భన్వర్ లాల్ శర్మ వంటి తిరుగుబాటు ఎమ్మెల్యేల ఫోన్ సంభాషణ లీక్ అయ్యింది. తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్ లాల్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మధ్య జరిగిన సంభాషణ ఆడియో క్లిప్ కూడా వీటిలో ఉంది. ఈ క్రమంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ రాజకీయంగా పెను దుమారం రేగింది. ఇదిలా ఉండగా.. లోకేష్ శర్మ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. తాజాగా శర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్వర్ణిమ్ చతుర్వేదీ స్పందిస్తూ.. లోకేష్ శర్మ ప్రభుత్వ అధికారి కాదు. పైగా అతను బీజేపీ నాయకులతో టచ్లో ఉన్నాడు. వారి సూచనలు మేరకు మాత్రమే అతను ఇలాంటి కామెంట్స్ చేశాడని చెప్పుకొచ్చారు. అయితే, రాజస్థాన్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శర్మ వ్యాఖ్యలు కాంగ్రెస్కు నష్టం కలిగిస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
బీజేపీపై తిరుగుబావుటా.. ఉస్మాన్ ఘనీపై ఆరేళ్ల బహిష్కరణ వేటు
ఇటీవల రాజస్థాన్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ప్రచారంలో మోదీ చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు స్థానాల్లో పార్టీ ఓడిపోతుందంటూ బికనీర్ బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఉస్మాన్ ఘనీ వ్యాఖ్యానించారు. దీంతో క్రమశిక్షణారాహిత్యం కింద ఉస్మాన్ ఘనీని పార్టీ నుంచి బహిస్కరిస్తూ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఓ ఛానెల్లో ఇంటర్వ్యూలో ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యల్ని ఉస్మాన్ ఘని ఖండించారు.అంతేకాదు 25 స్థానాల్లో పలు స్థానాల్లో బీజేపీ ఓడిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉస్మాన్ ఘనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ ప్రతిష్టను దిగజార్చేందుకు ఉస్మాన్ ఘనీ ప్రయత్నించారని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ఓంకార్ సింగ్ లఖావత్ అన్నారు. పార్టీ ప్రతిష్టను దిగజార్చడానికి ఉస్మాన్ ఘనీ చేసిన చర్యను పార్టీ గుర్తించింది. క్రమశిక్షణ ఉల్లంఘనగా భావించి పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి ఆరేళ్లపాటు అతన్ని బహిష్కరించింది అని లఖావత్ చెప్పారు. -
ఎన్నికల వేళ కాంగ్రెస్కు ఊహించని షాక్
జైపూర్: లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. రాజస్థాన్లో ఒకేసారి 400 మంది కార్యకర్తలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో, ఈ ఘటన రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. రాజస్థాన్ హస్తం పార్టీ నాయకత్వం ఖంగుతింది. వివరాల ప్రకారం.. రాజస్థాన్లో కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ(ఆర్ఎల్పీ) మధ్య పొత్తు ఖరారైంది. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా నాగౌర్ లోక్సభ స్థానం నుంచి ఆర్ఎల్పీ చీఫ్ హనుమాన్ బేనివాల్ను అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ బేనివాల్ పేరును ఖరారు చేసింది. దీంతో, కాంగ్రెస్ నేతలకు బేనివాల్ ఎంపిక నచ్చలేదు. ఈ క్రమంలో కొందరు కాంగ్రెస్ నేతలు.. బీజేపీ అభ్యర్థి జ్యోతి మిర్ధాకు అనుకూలంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ విషయం తెలిసి బేనివాల్.. కాంగ్రెస్ నేతలు వ్యవహారాన్ని హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. అసలు విషయం తెలుసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ దిద్దుబాటులో చర్యలో భాగంగా ముగ్గురు కాంగ్రెస్ నేతలను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో మాజీ ఎమ్మెల్యే భరరామ్, కుచేరా మున్సిపాలిటీ చైర్పర్సన్ తేజ్పాల్ మీర్జా, సుఖరామ్ దొడ్వాడియాలు ఉన్నారు. దీంతో, హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముగ్గురు కాంగ్రెస్ నేతలు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే వీరికి మద్దతు తెలుపుతూ సుమారు 400 మంది హస్తం కార్యకర్తలు తాజాగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు సమాచారం. Rajasthan News 🚨 - 400 Congress workers resigned from party and joined BJP to support Jyoti Mirdha against RLP Chief Hanuman Beniwal. Mirdha is getting stronger in Nagaur since last couple of weeks. — The Insert News (@InsertNews) April 13, 2024 ఈ సందర్భంగా తేజ్ పాల్ మీర్జా మీడియతో మాట్లాడుతూ..‘నాగౌర్లో కాంగ్రెస్ను నాశనం చేయడానికి బేనివాల్ ప్రయత్నిస్తున్నాడు. అలాంటి వ్యక్తితో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇష్టం లేదు. అందుకే వారంతా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అభ్యర్థిని ఖరారు చేసే ముందు హైకమాండ్ మా అభిప్రాయం తెలుసుకోవాల్సింది. కాంగ్రెస్ను ఓడిచేందుకు మాత్రమే ఆర్ఎల్పీ పనిచేస్తుంది’ అని ఆరోపణలు చేశారు. మరోవైపు.. కాంగ్రెస్ నేతలు మాత్రం తమ పార్టీ కార్యకర్తలు రాజీనామా చేయలేదన్నారు. ఇదంతా బీజేపీ నేతలు ఆడుతున్న డ్రామా అని కొట్టిపారేశారు. -
‘కాంగ్రెస్ డీఎన్ఏలోనే కర్ఫ్యూ’.. యోగి తీవ్ర విమర్శలు
జైపూర్: కాంగ్రెస్ పార్టీపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రమైన విమర్శలు చేశారు. రాజస్థాన్లో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ‘దేశానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద సమస్య. కర్ఫ్యూలు విధించటం కాంగ్రెస్ డీఎన్ఏలో ఉంది. దేశంలో పేదలు ఆకలితో అలమతిస్తే.. కాంగ్రెస్ ఉగ్రవాదులకు జైలులో బిర్యానీ పెట్టింది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లలో ఒకరైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీజేపీ అభ్యర్థులను ప్రటించిన తర్వాత మొదటిసారి రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ‘రామమందిరం నిర్మాణం పక్కనపెడితే.. ముందు శ్రీరాముడు, కృష్ణుడిని కాంగ్రెస్ ఊహాజనిత వ్యక్తులుగా భావించింది. కాంగ్రెస్ పాలనలో పేదల హక్కులు హరించారు. ప్రస్తుతం దేశం మొత్తం మరోసారి మోదీ ప్రభుత్వం రావాలని నినాదం చేస్తుంది. గత పదేళ్లలో ప్రధాని మోదీ పరిపాలనలో దేశ సరిహద్దులు భద్రంగా ఉన్నాయి. గతంలో ఉగ్రవాదుల కార్యకలాపాలు జరిగేవి. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ భారత్కు వ్యతిరేకంగా మాట్లాడటానికి సహసం చేయటం లేదు. ఎందుకుంటే వారికి వైమానిక దాడి భయం ఉంది. ప్రస్తుతం ఏ దేశం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటం లేదు. దేవం నక్సలిజం, ఉగ్రవాదం, కశ్మీర్లో రాళ్లు విసిరే ఘటనలు తగ్గించాం’ అని యోగి అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రజలు ఆకలితో ఉంటే ఉగ్రవాదులకు బిర్యానీ పెట్టారు. అదే ప్రధాని మోదీ గత నాలుగేళ్లుగా దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సిద్దాతం, బలమైన నేత లేరు. కాంగ్రెస్లోనే చాలా సమస్యలు ఉన్నాయి. మీరు వేసే ఓటు రామ మందిర నిర్మాణానికి మద్దతు మాత్రమే కాదు. మన దేశ సరిహద్దులకు కచ్చితమైన రక్షణ’అని యోగి తెలిపారు. -
చిన్న పార్టీనే.. కానీ చుక్కలు చూపించింది!
జైపూర్: రాజస్థాన్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాబోయే లోక్సభ ఎన్నికలకు వేరువేరుగా తమ సొంత అభ్యర్థులను ప్రకటించుకున్న తర్వాత కాంగ్రెస్, భారతీయ ఆదివాసీ పార్టీ (BAP) చివరకు సీట్ల భాగస్వామ్య ఒప్పందాన్ని చేసుకుని పొత్తు కుదుర్చుకున్నాయి. సోషల్ మీడియాలో ప్రకటన చేస్తూ, కాంగ్రెస్ నాయకుడు సుఖ్జీందర్ సింగ్ రంధావా "రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కాంగ్రెస్ ప్రాథమిక లక్ష్యం" అని అన్నారు. బన్స్వారా లోక్సభ స్థానంలో మద్దతు కోసం బీఏపీ అభ్యర్థి రాజ్కుమార్ రావత్ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేసిన గంటలోపే ఏప్రిల్ 4న నామినేషన్ను దాఖలు చేసిన కాంగ్రెస్కు చెందిన అరవింద్ దామోర్ ఇప్పుడు తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్తో సీట్ల పంపకంలో భాగంగా భారతీయ ఆదివాసీ పార్టీ బన్స్వారా, బగిదోర లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఎన్నికల ఫలితాల్లో గిరిజనులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న చిత్తోర్గఢ్, జలోర్ నుండి తమ అభ్యర్థులను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. గిరిజనుల్లో గట్టి పట్టు గుజరాత్లో 2017లో ఛోటుభాయ్ వాసవా భారతీయ గిరిజన పార్టీని స్థాపించారు. ఆ మరుసటి సంవత్సరమే రావత్, రాంప్రసాద్ దిండోర్ రాజస్థాన్లోని చోరాసి, సగ్వాడ నుండి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. గెలిచిన తర్వాత వారు పార్టీని వీడారు. ఆ తర్వాత వీరిద్దరూ 2023 సెప్టెంబరులో మళ్లీ బీఏపీలోకి వచ్చారు. ఆ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్టీ మూడు స్థానాలను గెలుచుకుంది. దాని అభ్యర్థులు మరో నాలుగు స్థానాల్లో రెండో స్థానంలో నిలిచి కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, గిరిజనులు రాజస్థాన్ రాష్ట్ర జనాభాలో దాదాపు 14 శాతం ఉన్నారు. ఈ రాష్ట్రంలోని ప్రతాప్గఢ్, బన్స్వారా దుంగార్పూర్, ఉదయపూర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో కూడిన వాగడ్ ప్రాంతంలో కనీసం 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో భారతీయ గిరిజన పార్టీకి గణనీయమైన ఓటర్లు ఉన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల కోసం రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర , జార్ఖండ్, దాద్రా నగర్ హవేలీలలో భారతీయ గిరిజన పార్టీ మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులను నిలబెట్టింది. -
రాజసమంద్ బరిలో మేవార్ రాజ కుటుంబీకురాలు
రానున్న లోక్సభ ఎన్నికల కోసం రాజస్థాన్లో బీజేపీ తన అభ్యర్థుల ఐదో జాబితాను ప్రకటించింది. ఇందులో రాజసమంద్ సీటు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి మహిమా విశేష్వర్ సింగ్ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. గతంలో ఈ స్థానం నుంచి దియా కుమారి ఎంపీగా ఉన్నారు. 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఈ స్థానానికి సుదర్శన్ రావత్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. ఎవరీ మహిమా విశేష్వర్ సింగ్? మేవార్ రాజు మహారాణా ప్రతాప్ వారసుడు విశ్వరాజ్ సింగ్ మేవార్ సతీమణే ఈ మహిమా విశేష్వర్ సింగ్. మహిమా సింగ్ భర్త విశ్వరాజ్ సింగ్ మేవార్ నాథ్ద్వారా బీజేపీ ఎమ్మెల్యే. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో మహిమ తన భర్త విజయానికి విశేష కృషి చేశారు. రాజ్సమంద్ పార్లమెంటరీ సీటులో 2019లో జైపూర్ రాజకుటుంబానికి చెందిన దియా కుమారిని పోటీకి దింపిన బీజేపీ ఇప్పుడు మేవార్ రాజకుటుంబానికి మహిమా సింగ్ బరిలోకి దించింది. జగదీశ్వరి ప్రసాద్ సింగ్ ఇంట్లో 1972 జూలై 22న జన్మించిన మహిమా సింగ్ మేవార్ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పాఠశాల విద్యను అభ్యసించారు. తరువాత మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరంలో ఉన్న సింధియా కన్యా విద్యాలయంలో చదివారు. కాలేజీ విద్యను ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో పూర్తి చేశారు. ఆమె మనస్తత్వశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. -
Lok Sabha Polls: కాంగ్రెస్ ఆరో జాబితా విడుదల
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు మరో 5 మంది అభ్యర్థులతో ఆరో జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్ధుల జాబితాను ఏఐసిసి ఎక్స్ వేదికగా విడుదల చేసింది. రాజస్థాన్ నుంచి నలుగురు, తమిళనాడు నుంచ ఒకరి ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ. గత ఐదు జాబితాల్లో 186 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తాజా జాబితాతో మొత్తం ఇప్పటివరకు 190 లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించినట్లైంది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎటువంటి కేటాయింపులు లేవు. రాజస్థాన్ అజ్మీర్- రామచంద్ర చౌదరీ రాజ్సమంద్- సుదర్శన్ రావత్ బిల్వారా- డా. దమోదర్ గుర్జార్ కోటా- ప్రహ్లాద్ గుంజాల్ తమిళనాడు తిరునెల్వేలి- సీ. రాబెర్ట్ బ్రూస్ कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए कांग्रेस उम्मीदवारों के नाम की छठवीं लिस्ट। pic.twitter.com/KoXyKzYH87 — Congress (@INCIndia) March 25, 2024 -
‘జైపూర్ డైలాగ్స్’తో సంబంధం లేదు..సునీల్ శర్మ వివరణ
జైపూర్: లోక్సభ ఎన్నికలు సమీస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే గురువారం విడుదల చేసిన మూడో జాబితాలో రాజస్థాన్లోని జైపూర్ నియోజకవర్గంలో సునీల్ శర్మకు అవకాశం కల్పించింది కాంగ్రెస్. అయితే బీజేపీకి సంబంధించిన ఓ యూట్యూబ్ ఛానెల్తో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు ఉన్న సునీల్ శర్మకు కీలకమైన జైపూర్ స్థానాన్నికేటాయించటం చర్చనీయాంశం అయింది. తరచూ కాంగ్రెస్పై విమర్శలు చేసే.. బీజేపీ అనుకూలమైన వార్తలు ప్రసారం చేసే ‘జైపూర్ డైలాగ్స్ యూట్యూబ్ ఛానెల్ను ఆయన 2016లో మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంజయ్ దిక్షిత్తో కలిసి ప్రారంభించారని ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సునీల్ శర్మ జైపూర్ అభ్యర్థిత్వంపై పునరాలోచించాలని కోరుతున్నారు. I am in no way related to the Jaipur dialogues YouTube channel or Twitter handle. This is completely fake news and false propaganda being floated to diminish the prospects of the Congress Party. — Sunil Sharma (@I_SunilSharma) March 23, 2024 ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలపై సునీల్ శర్మ స్వయంగా స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ‘నాకు జైపూర్ డైలాగ్స్ యూట్యూబ్ ఛానెల్ లేదా ట్విటర్ హాండిల్తో ఎటువంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీని అపహాస్యం చేయడానికి వ్యాప్తి చేస్తున్న తప్పుడు వార్తలు, అసత్య ప్రచారం’ అని సునీల్ శర్మ ‘ఎక్స్’ వేదికగా వివరణ ఇచ్చారు. ‘నాకు జైపూర్ డైలాగ్స్ యూట్యూబ్ ఛానెల్తో ఎటువంటి సంబంధాలు లేవు. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు, భావాలు తెలియజేయటం కోసం నేను టీవీ, యూట్యూట్ ఛానెల్స్ ఆహ్వానిస్తే వెళ్తుంటాను. అదే విధంగా జైపూర్ డైలాగ్స్ కూడా సామాజిక సమస్యలపై కాంగ్రెస్ పార్టీ విజన్ గురించి మాట్లాడటానికి నన్ను ఆహ్వానించింది. నేను మతం పేరుతో జరిగే ఉన్మాదాన్ని బలంగా వ్యతిరేకిస్తాను’ అని సునీల్ శర్మ అన్నారు. జైపూర్ డైలాగ్స్కు సునీల్ శర్మ డైరెక్టర్ అంటూ.. సోషల్ మీడియా ప్రచారం జరుగుతోందని అది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వదంతులు సృష్టిస్తున్నారని తెలిపారు. -
23 ఏళ్లలో తొలిసారి.. కుప్పకూలిన తేజస్ ఎయిర్క్రాఫ్ట్
జైపూర్: రాజస్థాన్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన తేజస్ ఎయిర్క్రాఫ్ట్ కుప్పకూలింది. శిక్షణ సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. జైసల్మేర్లోని ఓ స్టూడెంట్ హాస్టల్ భవనం వద్ద తేజస్ ఎయిర్క్రాఫ్ట్ శకలాలు పడ్డాయి. దీంతో ఆ ప్రదేశంలో భారీ స్థాయిలో మంటలు వ్యాపించాయి. జెట్ కూలకముందే పారాచూట్తో దూకడంతో పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ‘ఎక్స్’ (ట్విటర్)లో పేర్కొంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అయితే తేజస్ సింగిల్ సీటర్ ఫైటర్ జట్ 23 ఏళ్ల చరిత్రలో కూలిపోవడం ఇదే తొలిసారి. 2001లో తేజస్ ఎయిర్క్రాఫ్ట్ సేవలు ప్రారంభమైన తర్వాత ఇలాంటి ప్రమాదం చోటుచేసుకోవటం ఇప్పటి వరకు జరగలేదని అని అధికారులు తెలిపారు. One Tejas aircraft of the Indian Air Force met with an accident at Jaisalmer, today during an operational training sortie. The pilot ejected safely. A Court of Inquiry has been constituted to find out the cause of the accident. — Indian Air Force (@IAF_MCC) March 12, 2024 -
బీజేపీకి షాక్.. కాంగ్రెస్లో చేరిన ఎంపీ రాహుల్ కుశ్వాన్
జైపూర్: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు నేతలు పార్టీల మారుతూ సార్వత్రిక సమరాన్ని మరింత ఆసక్తి రేపుతున్నారు. కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి.. బీజేపీ నేతలు కాంగ్రెస్లోకి వరుస కడుతున్నారు. తాజాగా రాజస్తాన్లోని చురూ సెగ్మెంట్కు చెందిన ఎంపీ బీజేపీకి షాక్ ఇచ్చారు. రాహుల్ కుశ్వాన్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవకి రాజీనామా చేసి.. సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ‘నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సహకరించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గే, సీనియర్ నేత సొనియా గాంధీ, రాహుల్ గాంధీ, గోవింద్ సింగ్ దోస్తారా, ఇతర నేతలకు ధన్యవాదాలు’ అని కాంగ్రెస్ చేరిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అంతకంటే ముందు.. ప్రజాజీవితంగా గురించి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నానని రాహుల్ కుశ్వాన్ ‘ఎక్స్’(ట్వీటర్) వేదికగా వెల్లడించారు. ‘కొన్ని రాజకీయ కారణాల రీత్యా ఈ రోజు కీలక పరిణామం జరగబోతుంది. నేను బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నా’అని పేర్కొన్నారు. అదేవిధంగా చురూ నియోజకవర్గ ప్రజలకు పదేళ్లపాటు సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. వచ్చే లోక్సభలో ఎన్నికల్లో చురూ సెగ్మెంట్ నుంచి బీజేపీ టికెట్ తిరస్కరించిన నేపథ్యంలో రాహుల్ కుశ్వాన్ పార్టీ మారటం గమనార్హం. బీజేపీ మొదటి జాబితాలో చురూ లోక్సభ స్థానంలో రాహుల్ కుశ్వాన్ బదులు పారా ఒలింపియన్ దేవేంద్ర ఝఝరియాను బరిలోకి దించిన విషయం తెలిసిందే. చదవండి: డీప్ఫేక్ బారినపడ్డ యోగి ఆదిత్యనాథ్ -
కాంగ్రెస్కు షాక్.. బీజేపీలో చేరిన కీలక నేతలు
లోక్సభ ఎన్నికలకు ముందు రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రులు రాజేంద్ర యాదవ్, లాల్ చంద్ కటారియా సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఈ రోజు (ఆదివారం) బీజేపీలో చేరారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు రిచ్పాల్ మిర్ధా, విజయపాల్ మిర్ధా, ఖిలాడీ బైర్వా, స్వతంత్ర మాజీ ఎమ్మెల్యే అలోక్ బెనివాల్, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్ సేవాదళ్ సురేష్ చౌదరి, రాంపాల్ శర్మ, రిజుజున్వాలా తదితర నేతలు కూడా రాష్ట్రంలో అధికార పార్టీలో చేరారు. వీరందరికి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్లు రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజేంద్ర యాదవ్, లాల్ చంద్ కటారియా మంత్రులుగా ఉన్నారు. రిచ్పాల్ మిర్ధా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన మాజీ కాంగ్రెస్ ఎంపీ జ్యోతి మిర్ధా మామ. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు ఆకర్షితులై బీజేపీ పార్టీలో చేరినట్లు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అభ్యర్థులు వెల్లడించారు. దేశం కోసం మోదీ కస్టపడి పని చేస్తున్న తీరు వారికి బాగా నచ్చిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై కూడా భారత్ ప్రధాని నాయకత్వంలో మంచి పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు. -
ఏమిటి నేను చేసిన నేరం? బీజేపీ ఎంపీ తీవ్ర ఆవేదన!
భారతీయ జనతా పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించింది. రాజస్థాన్లోని చురు లోక్సభ స్థానం నుంచి కొత్త వ్యక్తి దేవేంద్ర ఝజారియాకు టిక్కెట్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం చురు ఎంపీగా ఉన్న రాహుల్ కశ్వాన్.. తనను తప్పించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న లోక్సభ ఎన్నికలకు తన చురు స్థానం నుంచి మరో అభ్యర్థిని బీజేపీ బరిలోకి దించగా రాహుల్ కశ్వాన్ సోషల్ మీడియాలో తన స్పందనను తెలియజేశారు. కస్వాన్ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. "నా నేరం ఏమిటి? నేను నిజాయితీగా లేనా? కష్టపడి పనిచేయలేదా? విధేయుడిని కాదా? నేను ఏమి కళంకం తెచ్చాను? చురు లోక్సభలో పనిచేయలేదా? ఏదైనా పొరపాటు జరిగిందా?" అంటూ ప్రశ్నలు సంధించారు. "ప్రధానమంత్రి అన్ని పథకాల అమలులో నేను ముందంజలో ఉన్నాను. ఇంకా ఏమి కావాలి? ఈ ప్రశ్న ఎవరిని అడిగినా మౌనమే వినిపిస్తోంది. ఎవరూ సమాధానం చెప్పలేక పోతున్నారు" అంటూ వాపోయారు. అయితే రాజకీయాల్లో ఇలాంటివి సర్వసాధారణమని, టిక్కెట్ దక్కలేదన్న నైరాశ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు. కాగా రాహుల్ కస్వాన్ తండ్రి రామ్ సింగ్ కూడా చురు నుంచి బీజేపీ ఎంపీగా, ఎమ్మెల్యేగా పని చేశారు. అలాగే రాహుల్ తల్లి కమలా కశ్వాన్ కూడా సాదుల్పూర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా చేశారు. రానున్న లోక్సభ ఎన్నికలకు రాజస్థాన్లోని 25 స్థానాలకు గాను 15 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అందులో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు నలుగురు కేంద్ర మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. -
Devendra Jhajaria: పార్లమెంట్ బరిలో పతకాల వీరుడు
Paralympian Devendra Jhajaria: రానున్న లోక్సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. క్రీడా ప్రపంచంలో పేరుగాంచిన అథ్లెట్ దేవేంద్ర ఝజారియా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. పారాలింపిక్స్లో రెండు బంగారు, ఒక రజత పతకం సాధించిన రాజస్థాన్కు చెందిన దేవేంద్ర ఝజారియా 2024 లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. రాజస్థాన్లోని చురు లోక్సభ స్థానం నుంచి ఆయనకు బీజేపీ అవకాశం కల్పించింది. భారత పారాలింపియన్ దేవేంద్ర ఝజారియా జావెలిన్ త్రోయర్. 2004 ఏథెన్స్లో జరిగిన సమ్మర్ పారాలింపిక్స్లో జావెలిన్ త్రోలో తన మొదటి బంగారు పతకాన్ని సాధించారు. అంతేకాదు దేశానికి రెండో పారాలింపిక్ బంగారు పతకాన్ని అందించిన క్రీడాకారుడు దేవేంద్ర ఝజారియా. ఒలింపిక్స్ లేదా పారాలింపిక్స్లో రెండు వ్యక్తిగత స్వర్ణ పతకాలు సాధించిన ఏకైక భారతీయుడు కూడా ఈయనే. రాజస్థాన్లో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉండగా వచ్చే లోక్ సభ ఎన్నికలకు వీటిలో 15 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ తన తొలి జాబితాలో విడుదల చేసింది. వీరిలో పారాలింపియన్ దేవేంద్ర ఝజారియాతోపాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, నలుగురు కేంద్ర మంత్రులు ఉన్నారు. దేవేంద్ర ఝజారియాకు టికెట్ ఇవ్వడం కోసం చురు నుండి రెండుసార్లు ఎంపీగా గెలిచిన రాహుల్ కశ్వాన్ను బీజేపీ పక్కన పెట్టింది. ఈసారి ఆయనకు ఇక్కడి నుంచి టిక్కెట్ దక్కలేదు. క్రీడా క్షేత్రంలో పతకాలు గెలిచిన దేవేంద్ర ఝజారియా ప్రజా క్షేత్రంలో గెలుస్తాడో లేదో చూడాలి. -
కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్కి మరోసారి జాక్పాట్!
రాజస్థాన్లోని బికనీర్ లోక్సభ స్థానానికి కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ను భారతీయ జనతా పార్టీ వరుసగా మరోసారి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ స్థానానికి ఆయన పోటీ చేయడం ఇది వరుసగా నాలుగోసారి. అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత బికనీర్ చేరుకున్న మేఘ్వాల్కు పార్టీ మద్దతుదారులు ఘనంగా స్వాగతం పలికారు. మేఘ్వాల్ 2009లో తొలిసారిగా బికనీర్ నియోజకవర్గం నుండి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు . 2019 లోక్సభ ఎన్నికల్లో అర్జున్ రామ్ మేఘ్వాల్ తన బంధువు, కాంగ్రెస్ నాయకుడు మదన్ గోపాల్ మేఘ్వాల్ను ఓడించి బికనీర్ స్థానాన్ని గెలుచుకున్నారు . తనపై నమ్మకం ఉంచి నాలుగోసారి సీట్ ఇచ్చినందుకు అర్జున్ రామ్ మేఘ్వాల్ బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాజస్థాన్లో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికలకు వీటిలో 15 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ తన తొలి జాబితాలో విడుదల చేసింది. వీరిలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, నలుగురు కేంద్ర మంత్రులు, ఒక పారాలింపియన్ ఉన్నారు. కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన మహేంద్రజిత్ మాల్వియా, జ్యోతి మిర్ధాలకు బీజేపీ టికెట్లు ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కుమారుడు, సిట్టింగ్ ఎంపీ దుష్యంత్ సింగ్కు కూడా పార్టీ ఝలావర్ బరన్ నుంచి మరోసారి టిక్కెట్లు ఇచ్చింది. -
కోటాలో విద్యార్థి అదృశ్యం కలకలం.. వారంలో రెండో ఘటన
జేఈఈ (JEE) విద్యార్థి రచిత్ అదృశ్యం మరవక ముందే రాజస్థాన్లోని కోటాలో 18 ఏళ్ల నీట్(NEET) కోచింగ్ విద్యార్థి అదృశ్యం కలకలం రేపతోంది. రెండు రోజుల క్రితం సికార్ జిల్లాకు చెందిన యవరాజ్ అనే విద్యార్థి అదృశ్యం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను నీట్ మెడికల్ ప్రవేక్ష పరీక్ష కోసం కోటాలో కోచింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. యువరాజు కోటాలోని ట్రాన్స్పోర్టు నగరలోని హాస్టల్లో ఉంటున్నాడు. శనివారం ఉదయం 7 గంటలకు క్లాస్కు హాజరయ్యేందుకు బయటకు వెళ్లి యూవరాజ్ అదృశ్యం అయ్యాడు. అతను తన మొబైల్ ఫోన్ను హాస్టల్లోనే వదిలి వెళ్లాడు. వారం రోజుల క్రితమే రచిత్ సోంధ్య అనే విద్యార్థి అదృశ్యం అయిన విషయం తెలిసిందే. 16 ఏళ్ల జేఈఈ(JEE) విద్యార్థి రచిత్.. హాస్టల్ నుంచి క్లాస్కు బయలుదేరి అదృశ్యం అయ్యారు. సీసీటీవీ ఫుటేజుల వివరాల ప్రకారంలో కోటాలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్కు చెందిన రచిత్ .. హాస్టల్ నుంచి బయటకు వచ్చి.. ఒక క్యాబ్లో అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. గత సోమవారం రచిత్ బ్యాగ్, మొబైల్ ఫోన్, హాస్టల్ రూం తాళం చెవిని అటవీ ప్రాంతానికి సమీపంలోని గరడియా మహాదేవ్ ఆలయం వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరు విద్యార్థుల అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని.. వెతుకుతున్నారు. వారికోసం పోలీసులు ప్రత్యేకంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. -
యువరాణికి పట్టం.. డిప్యూటీ సీఎంగా దియాకుమారి
జైపూర్: అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ.. చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో అనుహ్యంగా కొత్తవారిని ముఖ్యమంత్రులుగా ప్రకటించి సరికొత్త వ్యూహాన్ని అమలు పరిచింది. అయితే తాజాగా కూడా అదే ఫార్ములా ప్రయోగించింది. రాజస్థాన్లో కేవలం మొదటిసారి గెలిచిన భజన్లాల్ శర్మను సీఎంగా బీజేపీ ప్రకటించింది. అయితే ఇక్కడ ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చింది బీజేపీ హైకమాండ్. ప్రేమ్ చంద్ భైరవ, దియా కుమారిలను డిప్యూటీ సీఎం పదవులు వరించాయి. సామాజిక సమీకరణాల దృష్ట్యా రాజస్థాన్లో రాజ కుంటుబానికి చెందిన దియా కుమారికి.. డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఈసారీ బీజేపీ హైకమాండ్ రాజస్థాన్ సీఎంగా దియా కుమారికి అవకాశం కల్పిస్తారని పార్టీలో జోరుగా ప్రచారం జరిగింది. సీఎం పదవి కోసం వసుంధర రాజే, అర్జున్రామ్, గజేంద్ర షెకావత్, అశ్విని వైష్ణవ్ వంటి సీనియర్ నేతలతో పోటీపడ్డ దియా కుమారి.. డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకుంది. ప్రస్తుతంగా ఆమె వ్యక్తిగత, రాజకీయ జీవితం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జైపూర్ మహారాజ కుటుంబంలో ఆమె 1971లో జన్మించారు. తాత మాన్ సింగ్-2 బ్రిటీష్ ఇండియా కాలంలో చివరి జైపూర్ మహారాజు. తండ్రి బ్రిగేడియర్ సవాయ్ భవానీ సింగ్ మహావీర చక్ర అవార్డు గ్రహిత. ఆయన 1971లో ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. మహారాణి గాయత్రీ దేవి పాఠశాల విద్య, జైపూర్లోని మహారాణి కళాశాలలో కాలేజీ చదువును పూర్తి చేసుకున్నారు. నరేంద్ర సింగ్ను వివాహం చేసుకున్న దియాకుమారికి.. ముగ్గురు పిల్లలు. ఆమె 2018లో నరేంద్ర సింగ్తో విడాకులు తీసుకుంది. రాజకీయం జీవితం.. రాజకీయలపై ఆసక్తితో దియాకుమారి 2013లో అసెంబ్లీ ఎన్నికల్లో మాధోపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. మొదటిసారి గెలుపొందగానే పలు ప్రాంతాలను అభివృద్ధి చేసింది. 2019 లోక్సభ ఎన్నికల్లో రాజసమంద్ నియోజకవర్గం నుంచి పోటీ ఎంపీగా గెలుపోందారు. రాజకీయాలతో పాటు దియా కుమారి అనేక బిజినెస్ వెంచర్లు, రెండు స్కూల్స్, మ్యూజియం, ట్రస్టు, హోటల్, ఎన్జీఓలను నిర్వహిస్తున్నారు. పలు కార్యక్రమాల ద్వారా ఆమె స్త్రీల అభ్యున్నతికి కృషి చేస్తారు. పలు ఎన్జీఓ ద్వారా సేవ చేసినందుకు.. ఆమె ఇటీవల జైపూర్లోని అమిటీ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా పొందారు. 2023 రాజస్థాన్ అసెంబ్లీలో విధ్యాదర్నగర్లో నియోజకవర్గలో పోటీ చేసి 71,368 భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎప్పుడూ ప్రజాక్షేత్రంలో ఉంటూ సేవ ఈ యువరాణి(దియా కుమారి) మహిళలకు భద్రతకు కృషి చేస్తానని, యూవతకు ఉద్యోగ అవకాశాలు, రైతుల కష్టాలను తీర్చుతానని ప్రచారంలో హామీలు ఇచ్చారు. చదవండి: రాజస్థాన్ సీఎంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే భజన్లాల్ శర్మ -
Bhajanlal: ఓడిపోతారనుకున్నారు.. కానీ సీఎంగా ఎంపిక!
జైపూర్: మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోనే కాదు.. ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల ఎంపికలోనూ బీజేపీ కొత్త స్ట్రాటజీని ప్రదర్శించింది. ఛత్తీస్గఢ్లో గిరిజనుడ్ని, మధ్యప్రదేశ్లో బీసీ(యాదవ్)ని, అలాగే.. తాజాగా రాజస్థాన్లో ఓసీ సామాజిక వర్గానికి చెందిన భజన్లాల్ శర్మను సీఎంగా ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చింది. తద్వారా సీనియర్లకు షాక్ ఇవ్వడంతో పాటు కొత్త తరహా రాజకీయానికి తెర లేపింది బీజేపీ. అయితే.. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. భజన్లాల్ మొదటిసారి ఎమ్మెల్యేగా నెగ్గారు. పైగా ఆయన గెలుస్తారని బీజేపీ శ్రేణులు కూడా అనుకోలేదట!. భజన్లాల్ శర్మ.. మొదటిసారి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గారు. చివరి నిమిషంలో సీఎం అభ్యర్థుల జాబితాలో ఆయన పేరును చేర్చి.. అదే పేరును ప్రకటించింది బీజేపీ. అయితే ఆయన గెలవరని పార్టీ భావించిందట. అందుకు కారణం లేకపోలేదు. ► భజన్లాల్ స్వస్థలం భరత్పూర్. కానీ, ఆయనకు ఆ టికెట్ను బీజేపీ ఇవ్వలేదు. అక్కడి నుంచి పోటీ చేస్తే కచ్చితంగా ఆయన ఓడిపోతారని బీజేపీ భావించింది. అందుకే సంగనేర్ టికెట్ ఇచ్చింది. అక్కడా ఆయన నెగ్గుతారని ఊహించలేదట. అయితే.. సంగనేర్ టికెట్ మీద పోటీ చేసి భజన్లాల్ 48వేలపైగా మెజారిటీతో నెగ్గారు. ► భజన్లాల్ మొదటి నుంచి బీజేపీ పార్టీ కార్యకలాపాల్లో కీలకంగా పాల్గొనేవారు. అత్యంత ఎక్కువ కాలం బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీగా పనిచేశారు. ► రాజకీయాల్లోకి రాకముందు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నారు. బీజేపీ అనుబంధ సంస్థ అయిన ఏబీవీపీలో విద్యార్థి నాయకుడి పనిచేశారు. ► ఓసీ సామాజికవర్గానికి చెందిన భజన్ లాల్ రాజస్థాన్ వ్యాప్తంగా నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవారు. పార్టీలో ఉన్న అన్ని వర్గాల కార్యకర్తలతో సన్నిహితంగా మెలిగేవారు. ► 56 ఏళ్ల భజన్లాల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో రూ. 1.5కోట్ల ఆస్తులను చూపించారు. ఇదీ చదవండి: రాజస్థాన్ సీఎంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే -
రాజస్థాన్ సీఎంగా భజన్లాల్ శర్మ
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి విషయంలోనూ బీజేపీ అనూహ్య నిర్ణయం వైపే మొగ్గు చూపించింది. ఓసీ సామాజిక వర్గానికి చెందిన భజన్లాల్ శర్మను సీఎంగా ప్రకటించింది. బీజేపీ శాసనసభాపక్షనేతగా భజన్లాల్ శర్మను మంగళవారం జరిగిన సీఎల్పీ భేటీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. భజన్లాల్ తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గడం గమనార్హం. డిప్యూటీ సీఎంలుగా దియాకుమారి, ప్రేమచంద్ భైరవను బీజేపీ ప్రకటించింది. అదే విధంగా స్పీకర్ వాసుదేవ్ దేవ్నాని ఎంపిక చేసిదంది. కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్, బీజేపీ పరిశీలకులు రాజస్థాన్ సీఎం ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. బీజేపీ ఎల్పీ ముగిసిన అనంతరం భజన్లాల్ శర్మ పేరును రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అధికారికంగా ప్రకటించారు. ఇక రాజస్థాన్ ముఖ్యమంత్రి రేసులో వసుంధర రాజే, దియాకుమారి, అర్జున్రామ్, గజేంద్ర షెకావత్, అశ్విని వైష్ణవ్ లాంటి సీనియరల పేర్లు వినిపించాయి. తీవ్ర సస్పెన్స్ కొనసాగించిన అనంతరం బీజేపీ అధిష్టానం.. చివరి నిమిషంలో భజన్లాల్ పేరును తెరపైకి తెచ్చింది. చివరకు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తరహాలోనే రాజస్థాన్ విషయంలోనూ కొత్త ముఖాన్ని ఎంచుకుంది. 56 ఏళ్ల భజన్ లాల్ శర్మ.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు. భజన్ లాల్ రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల్లో సంగనేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్పై 48,081 ఓట్లతో విజయం సాధించారు. చదవండి: నెహ్రూపై అమిత్ షా వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ కౌంటర్ -
బీజేపీ సీఎంల ఎంపికపై గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు
జైపూర్:రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారం తర్వాత కూడా ముఖ్యమంత్రిని నిర్ణయించుకోలేకపోతున్నారని రాజస్థాన్ కేర్టేకర్ సీఎం అశోక్ గెహ్లాట్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై సమీక్ష సందర్భంగా గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ గెలిచి సీఎంను డిసైడ్ చేయడంలో ఇంత ఆలస్యం చేసి ఉంటే బీజేపీ నేతలు తమపై అరుపులు, కేకలు పెట్టేవాళ్లని గెహ్లాట్ ఎద్దేవా చేశారు. కర్ణిసేన చీఫ్ సుఖ్దేవ్ సింగ్ గొగామెడి కేసులో విచారణ జరిపేందుకుగాను ఎన్ఐకు ఎన్ఓసీ ఇచ్చే ఫైల్పై తాను సంతకం చేయలేదని చెప్పారు. ‘ఎన్నికల్లో గెలిచి వారం దాటినా ఇప్పటికీ కొత్త ముఖ్యమంత్రి రాలేదు. కొత్త సీఎం ఎన్ఐఏ ఫైల్పై సంతకం చేయాల్సి ఉంటుంది. త్వరగా సీఎం ఎంపికపై నిర్ణయం తీసుకోండి’అని గెహ్లాట్ కోరారు. ‘బీజేపీలో క్రమశిక్షణ లేదు. వారం రోజులు గడుస్తున్నా మూడు రాష్ట్రాల్లో ఇంత వరకు సీఎంను ఎంపిక చేయలేదు. ఇదే పని మేం చేసి ఉంటే ఎన్ని మాపై వారు ఎన్ని విమర్శలు చేసి ఉండే వాళ్లో తెలియదు. ఎన్నికల్లో వారు ఓట్లు పోలరైజ్ చేసి గెలిచారు. అయినా కొత్త ప్రభుత్వానికి మా సహకారం ఉంటుంది’ అని గెహ్లాట్ తెలిపారు. #WATCH | Congress leader and Rajasthan caretaker CM Ashok Gehlot arrives in Delhi to take part in a meeting to review the party's performance in recently held assembly polls in the state "...For around seven days now, they (BJP) have not been able to announce CM faces in the… pic.twitter.com/BIv6B8kd0J — ANI (@ANI) December 9, 2023 ఇదీచదవండి..అమెరికన్ కన్సల్టెన్సీ సర్వే: ప్రధాని మోదీపై కీలక విషయం వెల్లడి..! -
రాజస్థాన్ బంద్.. నాలుగు జిల్లాల్లో హైఅలర్ట్
జైపూర్: రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగామేడీ దారుణ హత్య నేపథ్యంలో రాజస్థాన్ అట్టుడుకుతోంది. హత్యకు నిరసనగా సుఖ్దేవ్ సింగ్ మద్దతుదారులు బుధవారం రాజస్థాన్ బంద్కు పిలుపునిచ్చారు. ఘటన విషయం గురించి తెలియగానే పెద్ద ఎత్తున రాజ్పుత్ సామాజిక వర్గం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చురు, ఉదయ్పూర్, అల్వార్, జోధ్పూర్ జిల్లాల్లోనూ నిరసనలకు దిగారు. దీంతో, పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. అయితే, సుఖ్దేవ్ సింగ్ గోగామేడీ పట్టపగలే దారుణ హత్యకు గురికావడం సంచలనంగా మారింది. రాజధాని జైపుర్లోని శ్యామ్నగర్లో ఆయన నివాసంలోనే గోగామేడీ హత్యకు గురయ్యారు. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం మధ్యాహ్నం సుఖ్దేవ్ నివాసానికి వెళ్లి దారుణానికి పాల్పడ్డారు. గోగామేడీతో మాట్లాడాల్సి ఉందని భద్రతా సిబ్బందికి చెప్పి లోపలికి వెళ్లారు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. #SukhdevSinghGogamedi Murder | Rajasthan DGP Umesh Mishra appeals for peace; stating that raids are underway on potential hideouts of criminals. Gogamedi's supporters have called for a #RajasthanBandh today after the leader's fatal shooting in Jaipur. pic.twitter.com/Ph6k37iNoI — NDTV (@ndtv) December 6, 2023 మరోవైపు.. రాజస్థాన్లో ఉద్రికత్తలపై డీజీపీ ఉమేశ్ మిశ్రా స్పందించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు. నేరస్థుల రహస్య స్థావరాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. నేరుస్తులను వదిలిపెట్టమని హామీ ఇచ్చారు. ఇక, దుండగుల్లో ఒకడైన నవీన్ షెకావత్ను సుఖ్దేవ్ సింగ్ సహచరులు కాల్చి చంపారు. గోగామేడీ భద్రతా సిబ్బంది కాల్పుల్లో నవీన్ చనిపోయినట్టు జైపుర్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ జోసెఫ్ వెల్లడించారు. అయితే, రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే హత్య జరగడం కలకలం సృష్టించింది. Rajasthan | Members of the Rajput community sit in protest against the murder of Sukhdev Singh Gogamedi, national president of Rashtriya Rajput Karni Sena, in Jaipur The Rajput community outfits supporting Sukhdev Singh Gogamedi have called for a state-wide bandh today pic.twitter.com/T0FTFVJMSm — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 6, 2023 -
కర్ణిసేన చీఫ్ హత్య..గెహ్లాట్పై బీజేపీ సంచలన ఆరోపణలు!
జైపూర్: రాజస్థాన్లో కర్ణిసేన చీఫ్ సుఖ్దేవ్ సింగ్ గొగామెడి హత్యపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే జరిగిన ఈ హత్య రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. ఓటమికి ప్రతీకారంగానే కాంగ్రెస్ పార్టీ ఈ హత్యకు పాల్పడినట్లుగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న అశోక్ గెహ్లాట్ కావాలనే సుఖ్దేవ్ భద్రత తగ్గించారని, ఇదే ఈ హత్య జరిగేందుకు కారణమైందని బీజేపీ నేతలు చెబుతున్నారు. సుఖ్దేవ్కు ప్రాణాపాయం ఉందని పోలీసులకు సమాచారం ఉండి కూడా భద్రత తగ్గించారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాల ట్వీట్ చేశారు. ఎన్నికల్లో కర్ణిసేన బీజేపీకి మద్దతిచ్చిందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. బైక్ మీద వచ్చిన ముగ్గురు దుండగులు మంగళవారం ఉదయం సుఖ్దేవ్ను ఆయన ఇంట్లోనే కాల్చి చంపారు. ఈ హత్య ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. కాల్పులు జరిపిన వారిలో ఒక దుండగుడు అతని సహచరుల కాల్పుల్లో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సుఖ్దేవ్ సెక్యూరిటీ గార్డు కాల్పుల్లో దుండగుడు చనిపోలేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. Congress has a caretaker government in place right now. BJP govt is not in office Also security of the said victim was reduced by Gehlot Hear the victim blame anti Hindu Congress govt & stop peddling your lies https://t.co/C7uldNmGUH pic.twitter.com/BSaMkhfExZ — Shehzad Jai Hind (@Shehzad_Ind) December 5, 2023 ఇదీచదవండి..‘ఎక్స్’లో హాట్టాపిక్గా దోశ ధర..! -
బీజేపీ విజయానికి.. కాంగ్రెస్ ఓటమికి.. ఐదు కారణాలివే!
రాజస్థాన్ ఎన్నికల ఫలితాల్లో ఏడు డివిజన్లలో భిన్నమైన తీరుతెన్నులు కనిపించాయి. జైపూర్ డివిజన్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. డివిజన్లోని 50 స్థానాలకు గాను గతసారి బీజేపీ 10 స్థానాల్లో విజయం సాధించగా, ఈసారి 26 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ను వెనక్కు నెట్టివేసింది. ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ విజయానికి కారణాలేమిటి? కాంగ్రెస్ ఓటమికి కారణాలేమిటనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రాజకీయ నిపుణులు దీనిపై విశ్లేషణ అందించారు. బీజేపీ విజయానికి ఐదు కారణాలు పార్టీలో ఐక్యత నెలకొంది. నేతలంతా అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా చూసుకున్నారు. ప్రధాని మోదీ పాలనే అజెండాగా రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీకి దిగడం లాభదాయకంగా మారింది. టికెట్ల కేటాయింపులో రాష్ట్రానికి చెందిన నేతలందరి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం ప్రయోజనకరంగా మారింది. ఎన్నికల ప్రచారంలో జాతీయ నేతలతో పాటు రాష్ట్ర నేతలు కూడా అన్ని ప్రాంతాలలో పర్యటించారు. ‘సనాతనం’ అంశంతో ఓట్లర్లను ఆకర్షించేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం కలిసివచ్చింది. కాంగ్రెస్ ఓటమికి ఐదు కారణాలు రాష్ట్రంలోని సీనియర్ నేతల మధ్య తలెత్తిన వర్గపోరు కారణంగా కార్యకర్తల ఐక్యతలో చీలిక ఏర్పడింది. టిక్కెట్ల కేటాయింపులో సీనియర్ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ప్రత్యక్షంగా నష్టపోయారనే వాదన వినిపిస్తోంది. బ్యాడ్ ఇమేజ్ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా టిక్కెట్లు కేటాయించారు. పార్టీ నేతలు మితిమీరిన ప్రకటనలు చేయడంతో ప్రజలు వాటిని నమ్మలేదు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరగడం కాంగ్రెస్ పాలనపై ప్రతికూల ప్రభావం చూపింది. ఇది కూడా చదవండి: రాజస్థాన్కు యూపీ సీఎం.. కారణమిదే! -
కాంగ్రెస్ ఓటమికి వారే కారణం.. అక్కడ స్వేచ్ఛ ఇవ్వలేదు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కైవసం చేసుకుంది. కాంగ్రెస్ విజయంలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కీలకంగా వ్యవహరించారు. గతంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఎన్నికల వ్యూహకర్తగా పని చేసి.. కాంగ్రెస్ను గెలిపించిన విషయం తెలిసిందే. ఆదివారం విడుదలైన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ... కేవలం తెలంగాణలోనే విజయం సాధించి మిగిలిన మూడు రాష్ట్రాల్లో పరాజయం పాలైంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కూడా ఎన్నికల వ్యూహకర్తగా సేవలందించిన సునీల్ అక్కడ కాంగ్రెస్ను విజయతీరాలకు తీసుకెళ్లడంలో విఫలమాయ్యారు. అయితే దానికి రాజస్తాన్, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలే కారణంగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన రాజస్తాన్, మధ్యప్రదేశ్లో వ్యూహకర్త పనిచేసినా.. ఆయా రాష్ట్రాల అగ్రనేతలైన అశోక్ గహ్లోత్, కమల్నాథన్లు సహకరించనట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాజస్థాన్లో పలు చోట్ల సర్వేలు చేసి కొంత మంది అభ్యుర్థుల మార్పును సూచించినా అశోక్ గహ్లోత్ అంగీకరించలేదంట. అదీకాక నరేష్ అరోరా ఎన్నికల వ్యూహాలను అమలు చేసినట్లు తెలుస్తోంది. అయితే కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు సహరించినట్లుగా.. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో వ్యూహాల అమలు, అంతర్గత సర్వేల వంటి విషయాల్లో పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏఐసీసీ ఎన్నికల వ్యూహ కమిటీ ఛైర్మన్గా కూడా నియమితులైన ఆయన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో కీలకంగా వ్యవహరించారు. తెలంగాణలో కూడా తన మార్క్ వ్యూహాలతో కాంగ్రెస్ గెలుపును సునాయాసం చేశారు. గతంలో బీజేపీకి కూడా సునీల్ పలు ఎన్నికల్లో వ్యూహకర్తగా వ్యవహరించారు. 2014లో నరేంద్రమోదీకి ఎన్నికల ప్రచారంలో సేవలందించారు. ఉత్తరప్రదేశ్, గుజరాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహకర్తగా పని చేశారు. అదే విధంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు ఆయాన వ్యూహకర్తగా సేవలందించారు. కర్ణాటకకు చెందిన సునీల్ కనుగోలు దేశంలోని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తల్లో ఒకరిగా పేరుపొందారు. అయితే.. ఆయన గతంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందంలో కీలకసభ్యుడిగా పనిచేశారు. కర్ణాటక ఎన్నికల అనంతరం సునీల్కు.. సీఎం సిద్ధరామయ్య కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించిన విషయం తెలిసిందే.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ప్రారంభమైన ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు
టీడీపీ జనసేన మధ్య డబ్బు గొడవ
ఇస్మార్ట్ రాహుల్ గాంధీ
ఎల్లో టెర్రరిజం..బాబు, పురందేశ్వరి కుట్ర దీనికోసమేనా ?
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
నీ శకం ముగిసింది బాబు..
సాత్విక్–చిరాగ్ జోడీ శుభారంభం!
చంద్రబాబు ఏమైనా హీరోనా ?..అంబటి మురళి మాస్ ర్యాగింగ్
శృతి శర్మ : ‘హీరామండి’లో మెరిసిన ‘ఏజెంట్’ హీరోయిన్
స్లోవేక్ ప్రధానిపై హత్యాయత్నం ఎందుకు జరిగిందంటే..
తప్పక చదవండి
- Federation Cup 2024: నీరజ్ చోప్రాకు స్వర్ణం
- పెంపుడు కుక్క పెట్టిన గొడవ.. నడిరోడ్డుపైనే చితకబాదారు
- ఏపీలో ఓటేసుకునే స్వేచ్ఛ కూడా లేదా?
- సీఎం జగన్కు వేద పండితుల ఆశీర్వచనం
- Yadadri: ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు.. సాయం చేయండి
- తెలంగాణలో దంచికొట్టనున్న వానలు.. హైదరాబాద్కు కుంభవృష్టి హెచ్చరిక!
- టీడీపీ గూండాగిరికి పోలీసుల వత్తాసు
- భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రేసులో టాలీవుడ్ హీరో
- Today Horoscope: ఈ రాశి వారికి ఇంటిలో వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
- విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
Advertisement