-
‘బాబు రియాక్షన్ చూస్తుంటే.. అసలు దొంగ ఆయనే అనిపిస్తోంది’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నాయుడు ప్రవర్తన చూస్తుంటే ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డిపై దాడిచేయించిన అసలు దొంగ ఆయనే అనిపిస్తుందన్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి. ముందు జాగ్రత్త కోసం దొంగే..దొంగా..దొంగా అని అరుస్తున్నాడేమోనని అన్నారు. నీ వరకూ వస్తుందని భుజాలు తడుముకుంటున్నావా బాబు అంటూ ప్రశ్నించారు. ఇప్పటికే టీడీపీ అంటే టోటల్గా దివాళా తీసే పార్టీ అయిందని, జూన్ 4 నాటికి టీడీపీ అంటే తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీగా మిగలనుందని విమర్శించారు. కనుమూరి రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బొండా ఉమని సీఎం జగన్పై జరిగిన దాడి కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చంద్రబాబు ఆందోళన చేందుతున్నారు. పోలీసు అధికారులు వైఎస్సార్సీపీ ప్రమేయంతో పనిచేస్తున్నారని దుర్మార్గమైన స్టేట్ మెంట్ ఒకటి ఇచ్చాడు. చంద్రబాబూ...ఇంత వరకూ పోలీసులు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. వారి దర్యాప్తు గురించి కానీ, ఎవరిని విచారిస్తున్నారన్న విషయం కానీ, ఎవరి పేర్లు అందులో ఉన్నాయన్నది ఏదీ పోలీసులు ఇంకా చెప్పలేదు. అలాంటప్పుడు మీకు ఏం సమాచారం ఉండి ఇలాంటి ప్రెస్ రిలీజ్ ఇచ్చారో సమాధానం చెప్పాలి. అధికారికంగా చంద్రబాబు ఇలాంటి ప్రెస్నోట్ ఇస్తున్నారంటే మీరు భుజాలు తడుముకుంటున్నట్లు అర్థం కావడంలేదా? కచ్చితంగా మీరు దొరికిపోయారని, మీరే ఈ దాడి చేయించారని చెప్పకనే చెప్తున్నారు. మీరు గుంటూరు దాటిన తర్వాత జగన్ బస్సు యాత్రకు క్రేజ్ తగ్గుతుందని భావించారు. కానీ గుంటూరు నుంచి విజయవాడ వచ్చే సరికి కృష్ణా వారధి పోటెత్తడంతో పాటు విజయవాడ జనసంద్రంగా మారింది. ఆ జన ప్రవాహాన్ని చూసి ఓర్చుకోలేక మీరే ముఖ్యమంత్రి జగన్పై దాడి చేశారని ఖచ్చితంగా అర్థం అవడం లేదా? మీరే చెప్తున్నట్లు, ఈ దాడి వెనక బోండా ఉమ ఉన్నట్టు మీరు చెప్తున్నారంటే... చివరకు ఈ కేసు మీ వరకూ వస్తుందని భయపడుతున్నారా చంద్రబాబు? వాళ్ల స్పందన చూస్తే అసలు దొంగ చంద్రబాబేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తన పేరు ఎక్కడ బయటకు వస్తుందోనని బాబు భయపడుతున్నాడా అనే సందేహం కలుగుతోంది. అసలు చంద్రబాబుకు ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? ముందు జాగ్రత్త కోసం దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా అరుస్తున్నాడు. ఖచ్చితంగా ఈ దాడి చేయించింది చంద్రబాబే అనేది వారి స్పందన చూస్తే తెలుస్తోంది. ఇప్పటికే వస్తున్న సమాచారం మేరకు బోండా ఉమా ఫోన్ స్విచ్ఆఫ్ చేశారని తెలుస్తోంది. బోండా ఉన్నాడో.. బజ్జీ ఉన్నాడో మీకెలా తెలుసు బాబూ?: పోలీసులు ఎవరు అధికారికంగా విచారణపై నోరెత్తకపోతే ఏ బోండా ఉన్నాడో..ఏ బజ్జీ ఉన్నాడో మీకెలా తెలుసు చంద్రబాబు? జగన్ యాత్ర గుంటూరు, విజయవాడలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలలో జన గోదారి అయ్యాయి. దీంతో బెంబెలెత్తిపోయి, ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారు. మీరు చేస్తున్న యాత్రలు అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. మీరు, పవన్, పురందేశ్వరితో కలిసి చేస్తున్న యాత్రలు ఏ విధంగా ప్లాప్ అవుతున్నాయో మీకు తెలుసు. అందుకే మీ ఓర్వలేని తనం అడుగడుగునా కన్పిస్తోంది. బాలకృష్ణ యాత్ర కర్నూలు జిల్లాలో జనం లేక వెలవెల పోయింది. మీ ఉత్త పుత్రుడు నారా లోకేశ్ ఏ సభకూ పనికిరాడని మీరే పక్కన పెట్టారు. మీ దత్తపుత్రుడు ఫ్రస్టేషన్ ఎక్కువై తెనాలిలో పూనకం వచ్చినట్లు ఊగిపోవడం చూస్తే అనేక అనుమానాలు వస్తున్నాయి. అతనేమన్నా మత్తు మందుకు బానిస అయ్యాడా, లేక మందు సేవించి అలా ప్రవర్తిస్తున్నాడా అనే అనుమానాలున్నాయి. మీ కూటమి పూర్తిగా విఫలమైందనేది వీటన్నిటిని బట్టి తెలుస్తోంది. మీలో అణువణువునా ఫ్రస్టేషన్ కనిపిస్తోంది: మీకు అణువణువునా టెన్షన్, ఓడిపోతామనే భయం పట్టుకుంది. అందుకే ఫ్రస్టేషన్కి గురవుతున్నారు. మీ మాయాకూటమిలో ఉన్నది దుష్టచతుష్టయం. కుట్రలే ఎజెండాగా ఏర్పడిన ఈ కూటమి భవిష్యత్తు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెల్లారిపోతుంది. రామోజీ మార్గదర్శి అక్రమాల కేసులలో పీకల్లోతులో మునిగి ఉన్నాడు. ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఉనికి గల్లంతు అవుతుందని భయం. రాధాకృష్ణ, బీఆర్నాయుడులకు తమ భవిష్యత్తు ఏమవుతుందోనని భయంతో ఉన్నారు. అందుకే, నిత్యం నెగిటివ్ న్యూస్ ద్వారా అధికారం సాధించాలనే ఎత్తుగడ మీది. కానీ జగన్ ముఖ్యమంత్రిగా 99 శాతం హామీలు అమలు చేసి, 2.70 లక్షల కోట్లు దళారీలు లేకుండా డిబిటీ ద్వారా ప్రజలకు అందించారు. జన్మభూమి కమిటీల అరాచకాలు లేకుండా చేసి, నేను చేసిన మేలు మీకు చేరిఉంటేనే నాకు ఓటేయమని అడుగుతున్న రియల్ హీరో జగన్గారు. ప్రతి గడపకూ సేవలందించిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం. మీరు చెప్పుకునేందుకు ఏమీ లేక చేతులెత్తేసిన మీరు ఈ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తూ ఓట్లడగడానికి సిగ్గుగా లేదా? జూన్4కి టీడీపీ అంటే తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీ: ఇప్పటికే టీడీపీ అంటే టోటల్గా దివాళా తీసే పార్టీ అయింది. జూన్4 మధ్యాహ్నానికి టీడీపీ అంటే తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీగా మిగలనుంది. -
ఎల్లో మీడియా క్షణక్షణం ప్రజల్ని భయపెడుతోంది
సాక్షి, విజయవాడ: కరోనా సమయంలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారంటూ చంద్రబాబు తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి మండిపడ్డారు. సోమవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో కరోనాతో సెకనుకు ఒకరు చనిపోతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కరోనా సమయంలో చంద్రబాబు హైదరాబాద్లో ఉంటూ ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారు. రాష్ట్రంలో టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేస్తున్నారు కాబట్టే కేసులు పెరుగుతున్నాయి. తక్కువ టెస్టులు చేస్తే కరోనా వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదం ఉంది. ధైర్యం నింపాల్సిన సమయంలో ఎల్లో మీడియా క్షణక్షణం ప్రజల్ని భయపెడుతోంది' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. (వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అనంత ఫైర్) -
వైఎస్సార్సీపీలో చేరిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి
-
కాంగ్రెస్పై ఉన్న అపోహలు తొలగిస్తాం
హిందూపురం అర్బన్ : రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న కోపాన్ని.. అపోహలను తుడిచి వేసి వారిని చైతన్యపరిచే దిశగా కృషి చేస్తున్నామని రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు, అనంతపురం ఇన్చార్జి రవిచంద్రారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ప్రెస్క్లబ్లో ఆయన స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పార్టీని పటిష్టపరిచే దిశగా నియోజకవర్గ, మండల స్థాయి కమిటీలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదా విషయంలో రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారని విమర్శించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమాలో చెíప్పిన మాటలకు వాస్తవ పరిస్థితులకు పూర్తిగా భిన్నంగా ఉంటోందన్నారు. ప్రజాసేవ చేసే ఓపిక లేకపోతే సినిమా షూటింగులకే పరిమితమై ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోటా సత్యం, పీసీసీ అధికార ప్రతినిధి బాలాజీ మనోహర్, పీసీసీ కార్యదర్శి ఇందాద్, జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, ఉపాధ్యక్షుడు రవూఫ్, ఏ బ్లాక్ కన్వీనర్ శైవలి రాజశేఖర్, సీనియర్ నాయకులు ఆదిమూర్తి, పట్టణ అధ్యక్షులు నాగరాజు, జిల్లా నాయకులు చిన్నవెంకటరాముడు, యూత్ కాంగ్రెస్ నాయకులు రహెమత్, జబీ తదితరులు పాల్గొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
Sangeetha Sringeri: పునీత్ రాజ్కుమార్ సమాధి వద్ద నటి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
కేజ్రీవాల్ నివాసానికి స్వాతి మలీవాల్.. సీన్ రీ కన్స్ట్రక్షన్?
కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
సీరియల్లో హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన నటి.. ఫైన్ కట్టాల్సిందే!
మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం.. ఈడీ చరిత్రలో తొలిసారిగా
సంతోషంలో కావ్యా మారన్.. కేన్ విలియమ్సన్ను పలకరించి మరీ! (ఫొటోలు)
‘విద్య వాసుల అహం’ మూవీ రివ్యూ
'నా కొడుకు రాహుల్ని మీకు అప్పగిస్తున్నాను': సోనియా గాంధీ
తప్పక చదవండి
- ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ హిట్ మూవీ.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- లాలూ యాదవ్ కూతుళ్ళ పేర్ల వెనుక ఇంత హిస్టరీ ఉందా?
- ఏలియన్స్ ఉన్నట్లా? లేనట్లా?.. ఇంతకీ మస్క్ ఏమన్నారంటే?
- జెరోధా ట్రేడర్లకు అలెర్ట్.. అదిరిపోయే ఫీచర్తో
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
- ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్
Advertisement