-
AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. నెలన్నర రోజులుగా వడగాడ్పులు, వడగాడ్పులు వీస్తున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరుకుంటున్నాయి.ఈ తరుణంలో ఒకపక్క వడగాడ్పులు కొనసాగుతూనే మరోపక్క ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పతున్నాయి. ఆది, సోమవారాల్లో కోస్తాంధ్ర, రాయల సీమల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం నివేదికలో వెల్లడించింది.ఈ నెల 7న (మంగళవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు, ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.మరోవైపు శనివారం ప్రకాశం జిల్లా దరిమడుగులో 47.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. 28 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 187 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. ఆదివారం 30 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 247 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. సోమవారం 15 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 69 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. -
ఏపీకి వడగాడ్పుల వార్నింగ్ బెల్
సాక్షి, విశాఖపట్నం: మునుపెన్నడూ లేనివిధంగా నెలరోజుల ముందుగానే రాష్ట్రంలో వడగాడ్పులు వార్నింగ్ బెల్ మోగిస్తున్నాయి. తొలుత ఇవి రాయలసీమతోనే మొదలుకానున్నాయి. దీని ఫలితంగా ఏప్రిల్ ఆఖరి నాటి ఉష్ణోగ్రతలు ఆరంభంలోనే నమోదు కానున్నాయి. సాధారణంగా మార్చి ఆఖరు, ఏప్రిల్ మొదటి వారం వరకు రాష్ట్రంలో సాధారణంగా పగటి ఉష్ణోగ్రతలు 34–39 డిగ్రీలకు మించవు. కానీ, రాష్ట్రంలో పలుచోట్ల అప్పుడే 38–42 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. అంటే.. ఇవి సాధారణంకంటే 3–4 డిగ్రీలు అధికం. ఈ నేపథ్యంలో.. సోమవారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింతగా తీవ్రం కానున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో వీటి తీవ్రత అధికంగా ఉండనుంది. రానున్న నాలుగు రోజులు వైఎస్సార్, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40–43 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం నాటి బులెటిన్లో వెల్లడించింది. అలాగే, ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోనూ 40–44 డిగ్రీలకు చేరుకోవచ్చని తెలిపింది. వీటి ఫలితంగా ఆయా జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని, ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇంకా పల్నాడు జిల్లాలో 40–42, ప్రకాశం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో 40–41 డిగ్రీల చొప్పున రికార్డయ్యే అవకాశం ఉంది. ఇక దక్షిణ, ఉత్తర కోస్తాంధ్రల్లో ఉష్ణతాపం, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఉత్తర, కోస్తాంధ్రలో.. మరోవైపు.. వడగాడ్పుల ప్రభావం ఆదివారం నుంచే మొదలైంది. రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా కర్నూలు, కడప, తూర్పు గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో 41, నందిగామ, జంగమహేశ్వరపురం, విజయనగరం, ఏలూరు, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రానున్న రోజుల్లో ఇవి మరింతగా పెరుగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం తెలిపింది. -
చంద్రబాబు వ్యాఖ్యలకు జర్నలిస్ట్ విజయబాబు కౌంటర్
-
సీమ ప్రజల కాంక్షలు ఫలించేలా...
2024 లోక్ సభ, శాసన సభ ఎన్నికల నేపథ్యంలో రాయల సీమ ప్రాంత సమస్యలను జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు నిర్దిష్టంగా తమ మ్యానిఫెస్టోలలో చేర్చాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రాయలసీమ ప్రయోజనాలతో ముడిపడిన అనేక అంశాలు ఉన్నాయి. సాక్షాత్తు భారత పార్లమెంటుచే ఆమోదం పొంది చట్టబద్ధంగా అవకాశం ఉన్న ఆ హక్కుల అమలు జరగాలి. వీటితో పాటు ఇతర అనేక అంశాలను కూడా రాయలసీమ పౌరసమాజం, ప్రజా సంఘాలూ కోరుతున్నాయి. రాజకీయ పార్టీలు ఈ అంశాలకు చోటు కల్పించాలని మనవి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడింట ఒక భాగం జనాభా ఉన్న అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవ స్థల విషయంలో సీమ వాసుల ఆకాంక్షల మేరకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలి. ఇతర రంగాల అభివృద్ధిలోనూ ప్రాధాన్యత ఇవ్వాలి. కోటి ఎకరాల భూభాగం ఉన్న రాయలసీమకు తుంగభద్ర–కృష్ణా నదీ జలాలలో 133 టీఎంసీల నికరజలాలపై హక్కు ఉంది. ఆ నీటిని అందేలా చూడాలి. పెండింగ్ ప్రాజె క్టులను నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చేసి ఆయకట్టు స్థిరీకరించాలి. విభజన చట్టం సెక్షన్ 46లో వెనకబడిన ప్రాంతాల కోసం ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి తగిన ఆర్థిక వెసులుబాటులు చేయా లని ఉంది. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రల అభివృద్ధి కోసం ప్యాకేజీ రూపొందించాలని ఉంది. ఈ ప్యాకేజీని కనీసం లక్షకోట్లతో సమగ్రంగా చేపట్టాలి. సెక్షన్ 94 ప్రకారం ఇరు రాష్ట్రాలలో పారిశ్రామిక అభివృద్ధి కోసం పన్ను మినహాయింపుతో సహా తగిన ఆర్థిక చర్యలు తీసుకొంటామని పేర్కొన్నారు. కాబట్టి రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేక పన్ను మినహాయింపుతో సీమ ఖనిజ వనరులు వెలికితీతతో పాటు, స్థానికంగా ఉత్పాదక పరిశ్రమలకు తోడ్పాటు ఇవ్వాలి. సీమ యువతకు ఆయా రంగాలలో ప్రత్యేక నైపుణ్యాలు అభివృద్ధి చేసేలా కేంద్రాలు నెలకొల్పాలి. యువతకు నిరుద్యోగ భృతి కల్పించి ఆత్మవిశ్వాసం నింపాలి. విభజన చట్టం సెక్షన్ 93 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11 జాతీయ ప్రాధాన్యత ఉన్న విద్యాసంస్థలను కేటాయించింది. ఇందులో రాయలసీమకు సంబంధించినవి కేంద్రీయ విశ్వవిద్యాలయం (అనంతపురము), రెండు ఐఐటీలు (తిరుపతి, కర్నూలు), ఐఐఎస్ఇఆర్ (తిరుపతి) ఉన్నాయి. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో సమగ్ర ఉక్కు కర్మాగారాన్ని విశాఖపట్నం ఉక్కు కర్మాగారం స్థాయిలో ఈ ప్రాంతానికి లబ్ధి చేకూరేలా నిర్మాణం చేయాలి. ముద్దనూరు – పుట్టపర్తి, కడప –రాయచోటి– కదిరి – పుట్టపర్తి– చిక్ బళ్ళాపురం, రాయచోటి – మదనపల్లె– బెంగుళూరు, కళ్యాణదుర్గం– పావగడ్డ – తుమకూరు, నంద్యాల – కర్నూలు తదితర రైల్వేలైన్లలను నిర్మించాలి. కర్నూలు, నంద్యాల జిల్లాలను సీడ్ హబ్లుగా అభివృద్ధి చేయాలి. రైతులకు ఉపయోగపడేలా సీమలో శీతల గిడ్డంగులు నిర్మాణం చేయాలి. సీజనల్ వలస కూలీలకు ఉపాధి కల్పించాలి. రాయలసీమ పురావస్తు, చరిత్ర అవశేషా లనూ, సంస్కృతి, సాహిత్యం, మాండలికం, జానపదకళల సంరక్షణకు ప్రత్యేక సంస్థను నెలకొల్పాలి. 1800 నాడు బ్రిటిష్ వారిపై పాలేగాళ్ల తిరుగుబాట్లను ప్రథమ స్వాతంత్య్ర పోరాటంగా గుర్తించాలి. రాయలసీమలోని పర్యా టక, చారిత్రక స్థలాలు సంరక్షించి, కనీస వసతులు కల్పించాలి. ప్రసిద్ధ ప్రాంతాలతో టూరిజం సర్క్యూ ట్లు నెలకొల్పాలి. సీమ వాతావరణం, కరువు నివారణ, నీటి సంరక్షణ, కృత్రిమ వర్షాలు, మైనింగ్, తదితర అంశాల నేపథ్యంగా పరిశోధన సంస్థలు నెలకొల్పాలి. స్వయంప్రతిపత్తితో కూడిన రాయల సీమ బోర్డును నెలకొల్పాలి. డా‘‘ అప్పిరెడ్డి హరినాథరెడ్డి వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత ‘ 99639 17187 -
ముందే హీటెక్కిన సీమ
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది రాయలసీమలో వేసవి సెగలు ముందే మొదలయ్యాయి. ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి మొదటి వారం నుంచి మరింతగా విజృంభిస్తున్నాయి. ఏప్రిల్ నెలారంభంలో నమోదు కావాల్సిన పగటి (గరిష్ట) ఉష్ణోగ్రతలు ఇప్పటినుంచే రికార్డవుతున్నాయి. ప్రస్తుత ఉష్ణతాపాన్ని చూసి మున్ముందు ఇంకెంత తీవ్రతను చవి చూడాల్సి వస్తుందోనన్న ఆందోళన ఆ ప్రాంత వాసుల్లో నెలకొంటోంది. సాధారణంగా ఏప్రిల్ ప్రారంభం నుంచి 40 డిగ్రీలు, అంతకుమించి పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ.. ఈ ఏడాది అందుకు భిన్నంగా మార్చి ఆరంభంలోనే 41 డిగ్రీలకు పైగా చేరుకుంటున్నాయి. ఈ నెల 2న శనివారం అనంతపురంలో 41, కర్నూలు 39, నంద్యాల, కడపలో 38 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 3న అనంతపురంలో 39, కర్నూలులో 39, నంద్యాల, కడపలో 38, 4న అనంతపురంలో 40, కర్నూలులో 39, నంద్యాల, కడపల్లో 38 డిగ్రీలు, 5న 4న అనంతపురంలో 40, కర్నూలులో 39, నంద్యాల, కడపల్లో 38 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్నాళ్లుగా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకంటే రాయలసీమలోనే ఉష్ణతాపం అధికంగా కనిపిస్తోంది. అక్కడ సాధారణం కంటే 3–4 డిగ్రీలు అధికంగా ఉంటోంది. రాష్ట్రంలో విశాఖపట్నం, కళింగపట్నం మినహా అన్ని ప్రాంతాల్లో 33 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణ, ఉత్తర కోస్తాల్లో రాయలసీమ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డవుతుండటం ఆ ప్రాంత వాసులకు ఒకింత ఊరటనిస్తోంది. సెగలకు ఇదీ కారణం కోస్తాంధ్ర కంటే రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవడానికి గాలిలో తేమ తక్కువగా ఉండటమే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గాలిలో తేమ తక్కువగా ఉంటే ఉష్ణతాపం పెరగడానికి దోహదపడుతుంది. ఈ తేమ 50 శాతం కన్నా తగ్గే కొద్దీ వేడి అధికమవుతుంది. కొద్ది రోజులుగా రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, నంద్యాలలో తేమ 19 నుంచి 26 శాతం మాత్రమే ఉంటోంది. అందువల్ల అక్కడ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. వారంలో మరింత భగభగ రానున్న వారం రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కొన్నిచోట్ల సాధారణంకంటే 2–3 డిగ్రీలు అధికంగా నమోదవుతుండగా.. వారం పది రోజుల్లో అవి 4–5 డిగ్రీలకు ఎగబాకే అవకాశం ఉందని చెబుతున్నారు. -
టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి జరిగేది ఇదే
-
గ్రేటర్ రాయలసీమ వాసుల కోసం విస్తృతంగా సేవలు అందిస్తున్న గ్రాడా
అమెరికా దేశంలోని డల్లాస్ నగరానికి వచ్చి జీవనం సాగిస్తున్న గ్రేటర్ రాయలసీమ ప్రజల కోసం గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (గ్రాడా) సంస్థ విస్తృతంగా సేవలు అందిస్తున్నదని ఆసంస్థ ప్రతినిధులు డాక్టర్ నాగిరెడ్డి, చెన్నాకొర్వి, డాక్టర్ రాజేంద్ర ప్రోలు, డాక్టర్ శ్రీనాథ్ పలవల ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం,చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి వివిధకారణాల రీత్యా అమెరికా దేశంలోని డల్లాస్ నగరానికి విచ్చేసిన విద్యార్థులు,ఉద్యోగులు, దంపతులు,పిల్లల కోసం గ్రాడా (GRADA) సంస్థ వారికి కావాల్సిన సహాయసహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. గ్రేటర్ రాయలసీమ విద్యార్థుల కోసం ఉద్యోగమేలాలు, మహిళా సాధికారత కోసం ఉమెన్ ఫోరం, వివాహ కోరుకునే యువతియువకుల కోసం మాట్రిమోనీ మొదలయిన సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. గ్రేటర్ రాయలసీ సంస్కృతిని కాపాడటం కోసం సంస్కృతిక కార్యక్రమాలు డల్లాస్ నగరంలో నిర్వహిస్తూ గ్రేటర్ రాయలసీమ ప్రజల సర్వతోముఖాభి వృద్ధికి తోడ్పాటునందిస్తున్నదని పేర్కొన్నారు. ఇవేకాకుండా క్రీడలు, పారిశ్రామికవేత్తలుగా తయారుకావడానికి కావాల్సిన అవగాహన కార్యక్రమాలు వైద్య నేత్ర శిబిరాలు, ఆధ్యాత్మిక రియల్ ఎస్టేట్కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ అందించడం, విద్యార్థుల సమస్యల పరిష్కార కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. డల్లాస్ నగరంలో రాలయసీమ ప్రజల కోసం 150 మంది విరాళాలతో ప్రారంభమైన గ్రాడా (GRADA) సంస్థ రోజురోజుకి సభ్యుల సంఖ్యను పెంచుకుంటూ గ్రేటర్ రాయలసీమ తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని డల్లాస్ వాసలు, డల్లాస్కి వచ్చేవారు గ్రాడా(GRADA) సంస్థ సేవలను వినియోగించుకోవడానికి www.gradaus.org ద్వారా సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. ఫిబ్రవరి 17న నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్(North Texas Food Bank) వారి ద్వారా దాదాపు 500 మందికి సరిపోయే ఆహారాన్ని గ్రాడా సభ్యులు పంచి పెట్టారు. మునుముందు ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు మన డల్లాస్ వాసుల కోసం GRADA నిర్వర్తించనుంది. ఈ కార్యక్రమంలో నందకొర్వి, రమ్య నవీన్, హారిక కల్లే, జ్యోత్స్న అమృతం, మల్లికార్జున వేమన, శంకర్ ఓబిలి, ఉమామహేశ్వర్ గర్రెపాటి, శివ వల్లూరు, శివ పోతన్నగారి, జగదీష్ నందిమండలం, శ్రీని గాలి, ప్రభాకర్ మెట్ట, రతన్ అమృతం, కోటి గుడ్డేటి, మణి కుమార్ సోమిశెట్టి, శివరాజు అద్దేపల్లి, హేమంత్ కాకుట్ల,భానుమితి రేవుల, సునీల జంపాల, హర్షదళవాయి, మనోజ్ గుంటూరు, నాగరాజ్ గోపిరెడ్డి, సురేష్ మోపూరు, సుధాకర్ మేనకూరు, వరదరాజులు కంచం, అనిల్ కుమార్కుంట, హరినాత్ పొగాకు, ప్రసాద్ నాగారపు, నవీన్ కుమార్ రాజు అడ్లూరి, పవని మెట్ట, ప్రవీణ్ కుమార్ ఎద్దుల, పురుషోత్తం బోరెడ్డి, శ్రీనివాస ముక్క, శ్రీనివాసుల కొత్త, ఎల్లారెడ్డి చలమల, గౌతమ్ కాతెరగండ్ల, అనిత నాగిరెడ్డి, భాస్కర్ మస్నా, శ్రీకాంత్ కల్లే, ప్రశాంత్ మద్దిపట్ల, రమేష్ చలమూరు… ఇంకా ఎందరో ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. (చదవండి: అమెరికాలో ‘గ్రాడా’ ఆవిర్భావం..) -
పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీకి సిద్ధం: మంత్రి రోజా
సాక్షి, తిరుపతి: ఫిబ్రవరి 3న అనంతపురం జిల్లాలో రాయలసీమ ప్రాంతం ఎన్నికల శంఖారావం సభ సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తెలిపారు. రాయలసీమలో 50 స్థానాలు గెలుపే లక్ష్యమని పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన సోమవారం రాయలసీమ వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ భేటీకి మంత్రి రోజాతోపాటు ఏడు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. రాబోయే వారంరోజుల్లో జరిగే క్యాడర్ మీటింగ్కు జన సమీకరణకు ఎలా సన్నద్ధం కావాలి అనే దానిపై చర్చించారు. నాన్లోకల్ పొలిటీషియన్లను ప్రజలే హైదరాబాద్ ప్యాక్ చేస్తారని అన్నారు. చంద్రబాబు మతితప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఫ్రస్ట్రేషన్కు పరాకాష్ట అని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. షర్మిల వేసుకున్న డ్రెస్ కాంగ్రెస్.. స్రిప్ట్ చంద్రబాబుదని మండిపడ్డారు. తెలంగాణలో పార్టీ పెట్టి.. కాంగ్రెస్లో కలిపిన షర్మిలకు క్రెడిబులిటీ లేదని విమర్శించారు. పచ్చమీడియా వైఎస్సార్సీపీలో గొడవలు పెట్టడమే పనిగాపెట్టుకుందన్నారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడిన ఉంచి అయినా పోటీ చేస్తానని చెప్పారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ చంద్రబాబు.. తమ పార్టీ గురించి మాట్లాడటం సిగ్గు చేటని అన్నారు. చదవండి: నారాయణ విద్యా సంస్థలపై ఎన్నికల కమిషన్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు -
రాయలసీమ హెల్త్ హబ్
-
చినబాబా? సీమ టీడీపీ నేతల నెత్తిన పిడుగు!
చంద్రబాబు మదిలో మెదిలిన కొత్త ఆలోచన.. గ్రేటర్ రాయలసీమ నాయకుల్లో కలవరం రేపుతున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే.. నారా లోకేష్ బాబుకి అక్కడి ఎన్నికల పగ్గాలు అప్పజెప్పడం. ‘‘చాలు.. అయన ఘనకార్యాలు.. అయన వీరత్వం మేము కళ్లారా చూశాం.. ఇక చాలు. ఆయన్ను మా నెత్తిన రుద్దకండి’’ అని నాయకులు చంద్రబాబు వద్ద మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. బ్రేకులతో సాగిన యువగళం పాదయాత్ర అనంతరం.. లోకేష్ ఒక గొప్ప నాయకుడిగా ఎదిగాడు అని భావిస్తున్నారు చంద్రబాబు. అందుకే లోకేష్ నెత్తిన బృహత్తరమైన బాధ్యత పెట్టాలని చూస్టున్నట్లు తెలిసింది. అయితే ఆ ప్రతిపాదన విన్న టీడీపీ నాయకులు బెంబేలెత్తిపోతున్నట్లు తెలిసింది. ఇంతకీ చంద్రబాబు లోపల ఏముందంటే... ‘‘కడప, కర్నూలు.. అనంతపురం.. చిత్తూరుతోబాటు.. నెల్లూరు.. ప్రకాశం జిల్లాలు కలిపి గ్రేటర్ రాయలసీమగా పరిగణించే ప్రాంతానికి చినబాబును ఇంచార్జ్ గా పెట్టి ఎన్నికలకు వెళ్లాలి. అంటే ఆ ఆరు జిల్లాల్లోని 74సీట్ల అభ్యర్ధుల ఎంపిక,ప్రచారం,గెలుపు బాధ్యతలు అన్నీ లోకేష్ కు అప్పగిస్తే అయన గెలిపించుకు వస్తారు. రాష్ట్రం మొత్తాన్ని నేనొక్కడ్ని చూసుకోవడం అంటే కష్టం. ఆ 74 సీట్లను లోకేష్ కు అప్పగించి, మిగతా స్థానాలను.. అంటే కోస్తానుంచి ఉత్తరాంధ్ర వరకు తానూ, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కలిపి మ్యానేజ్ చేసుకోవచ్చు’’అని అంతర్గతంగా ఆయన నేతల వద్ద ప్రస్తావిస్తున్నట్లు సమాచారం. మాకొద్దు బాబోయ్.. అంటున్న నాయకులు ఇదింకా వాస్తవ రూపం దాల్చలేదు.. ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. వామ్మో.. లోకేష్ పెత్తనం అంటే ఇక గెలిచినట్లే! ఆయనే గెలుస్తాడో గెలవడో తెలియని పరిస్థితి!!. అలాంటి లోకేష్ కు ఈ ప్రాంతం గురించి రాజకీయ, కుల, ఆర్థిక , సామాజిక సమీకరణాల గురించి ఏమి తెలుసనీ ఆయన్ను బాధ్యునిగా చేస్తున్నారు. అయన నిజంగా లాగుతారా ? ఏ నియోజకవర్గం ఎక్కడ ఉందో ఆయనకు అవగాహనలేదు. ఈ ప్రాంతంగుండా వెళ్లిన పాదయాత్రలో అయన విశ్వరూపం చూశాం.. ఇక ఇప్పుడు ఆయన్ను మా నెత్తినబెట్టి పార్టీ పుట్టిముంచొద్దు అని నాయకులు లోలోన ఫీలవుతున్నారు. నిజంగా అలా చేస్తారా? లేదా? అనేది పక్కనబెడితే.. ఆ ఊహను కూడా భరించలేకపోతున్నారు. వైసీపీ బలం ముందు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రాయలసీమతో బాటు 2019 ఎన్నికల్లో అన్ని సీట్లనూ గెలుచుకున్న నెల్లూరు వంటి ప్రాంతాలు లోకేష్ కు ఇవ్వడం ఆత్మహత్య సదృశం అని అంటున్నారు. దీంతోబాటు రాయలసీమతో గత ఎన్నికల్లో తెలుగుదేశం కేవలం మూడంటే మూడే గెలిచింది అంటే అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ ఎంత బలంగా ఉందో అర్థం అవుతోంది. అయితే చంద్రబాబు మదిలో ఉన్న ఆలోచన ఇంకా వాస్తవరూపం దాల్చలేదు కానీ.. నిజంగా చంద్రబాబు అలా చేస్తారా ? ఆ ఆరు జిల్లాల బాధ్యత లోకేష్ కు అప్పగించే సాహసం చేస్తారా ? నిజంగా కొడుకు మీద ఆయనకు అంత నమ్మకం ఉందా? అనే సందేహాలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి.. ✒️✒️ సిమ్మాదిరప్పన్న -
ఎదురుతన్నిన చంద్రబాబు దుష్ప్రచారం
తోచీతోచనమ్మ తోడికోడలుపుట్టింటికి వెళ్లిందట.. అలా అయింది చంద్రబాబు పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడానికి ఏమీ విషయం లేక దిగాలుగా ఉన్న చంద్రబాబుకు.. ఆయన మాటల్లో ఉర్లగడ్డ అనే పదం ఉల్లిగడ్డగా ఉచ్చరించారు అంటూ టీడీపీ, చంద్రబాబు, ఐటీడీపీ లో రెండ్రోజులుగా తెగ ప్రచారం చేస్తున్నారు. దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారంలో పెట్టి లబ్ధిపొందాలన్నది టీడీపీ ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఇదేం పెద్ద మైలేజి తీసుకురాకపోగా తిరిగి ఎదురుతన్నింది. కొన్ని పదాలను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పలుకుతారు. అదేం నేరం కాదు.. ఘోరం కాదు.. ఒకే వస్తువును ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉచ్ఛరిస్తారు. ఆ అంశాన్ని పట్టుకుని చంద్రబాబు యాగీ చేసేందుకు ప్రయత్నించడం ద్వారా ఒక ప్రాంతం ప్రజానీకాన్ని అవమానించినట్లు అయింది. తనదీ రాయలసీమే అని చెప్పుకునే చంద్రబాబు ఆ ప్రాంత యాసభాషలను వెక్కిరించడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన చంద్రబాబుకు అలుగడ్డను ఉర్లగడ్డ అంటారన్నది తెలీదా.. లేకపోతే అది తప్పా.. ఎందుకని అలా విమర్శిస్తున్నారు అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని విమర్శించాలి అంటే ప్రభుత్వ పరంగా ఏమైనా లోపాలు ఉంటే చూడాలి కానీ రాయలసీమ భాషను అడ్డం పెట్టుకుని మొత్తం ప్రాంతాన్ని చిన్నబుచ్చడం ఏమిటని అంటున్నారు. క్షమాపణ చెప్పాలి చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ చెప్పుకోవడానికే రాయలసీవాసులు కానీ ఎన్నడూ ఇక్కడ నివసించింది లేదు. పండగపూట చుట్టపు చూపుగా సొంత ఊరికి వచ్చి వెళ్లేవారికి రాయలసీమ యాస, భాష ఎలా తెలుస్తాయి అని అంటున్నారు. జగనన్న నిఖార్సైన రాయలసీమ బిడ్డ. ఈ ప్రాంతం వ్యక్తిగా ఎవరైనా పెద్ద వారు కనిపిస్తే ఏన్నా బాగుండావా అని.. చిన్నోళ్లయితే ఏమబ్బా బాగుండావా అంటూ ఆప్యాయంగా మా సీమ యాసలో మాట్లాడతారు. మరి రాయలసీమ వాసులని చెప్పుకునే చంద్రబాబుకు, లోకేష్కు రాయలసీమ యాస, భాష గురించి తెలుసా? అంటూ రాయలసీమ భాషాపరిరక్షణ సమితి ప్రశ్నిస్తోంది. తమ భాషను విమర్శించినందుకు చంద్రబాబు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో గతం ఎన్నికల్లో వచ్చిన మూడు సీట్లు కూడా రానివ్వమని, మొత్తానికి సున్నా చుట్టి ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధిచెబుతామని హెచ్చరిస్తూ సమితి పేరిట వచ్చిన కరపత్రాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆ ప్రాంత భాషాభిమానులు ఇప్పుడు చంద్రబాబుమీద ధ్వజమెత్తుతున్నారు. రెండెకరాలతో ఇప్పుడు వేలకోట్లకు అధిపతిగామారి సీమ యాసను వెక్కిరించే స్థాయికి చేరిన చంద్రబాబును నేలకు దించుతామని వారు అల్టిమేటం ఇచ్చారు. -
AP: దూసుకొస్తున్న ‘మిచాంగ్’ తుపాను.. ఐఎండీ రెడ్ అలర్ట్
సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. రేపటికి తుపానుగా మారే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆ తర్వాత దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుందని, మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశముంది. నెల్లూరు జిల్లా వైపు మిచాంగ్ తుపాను దూసుకొస్తుంది. ఐఎండీ రెడ్ ఎలర్ట్ ప్రకటించింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో 4వ తేదీ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ సెలవు ప్రకటించారు. Strong breeze now in Vizag . Similar 30-40kmph wind speed along the AP coast now !! #CycloneMichaung pic.twitter.com/BpcYuJrB1w — Vizag Weatherman@AP (@VizagWeather247) December 2, 2023 తుపాను ప్రభావంతో ఆదివారం నుండి మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. మంగళవారం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్లరాదని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేద్కర్ హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను కోస్తాంధ్రతో పాటు, రాయలసీమలోనూ పెను ప్రభావం చూపనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోంది. తుపాను ప్రభావిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. తాడేపల్లిలో రాష్ట్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ఫోన్ నంబర్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది. చదవండి: ఏపీ రాజకీయాలపై తెలంగాణ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ ఎంత? -
జలసిరుల సీమ
సాక్షి, అమరావతి: దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని పారించి సుభిక్షం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకేశారు. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగం (టన్నెల్) ఫాల్ట్ జోన్లో పనులు అసాధ్యమని నాడు చంద్రబాబు చేతులెత్తేయగా నేడు ముఖ్యమంత్రి జగన్ దాన్ని సుసాధ్యం చేస్తూ అత్యాధునిక పరిజ్ఞానం తో పూర్తి చేశారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ను ముఖ్యమంత్రి జగన్ గురువారం జాతికి అంకితం చేయనున్నారు. తద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం చేశారు. అవుకు సొరంగాల పనులకు వైఎస్సార్ హయాంలో రూ.340.53 కోట్లు వెచ్చించి సింహభాగం పూర్తి చేయగా 2014–19 మధ్య చంద్రబాబు సర్కారు రూ.81.55 కోట్లు మాత్రమే వ్యయం చేసి ఫాల్ట్ జోన్లో పనులు చేయకుండా చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి జగన్ రూ.145.86 కోట్లు ఖర్చు చేసి టన్నెల్ 2 పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. మరోవైపు టన్నెల్ 3 పనుల కోసం ఇప్పటివరకు మరో రూ.934 కోట్లు వెచ్చించి దాదాపు తుదిదశకు తెచ్చారు. అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. మొత్తం 5.801 కి.మీ. పొడవైన మూడో టన్నెల్లో ఇప్పటికే 4.526 కి.మీ. పొడవైన పనులను పూర్తి చేయడం గమనార్హం. ఇక కేవలం 1.275 కి.మీ పనులు మాత్రమే మిగిలాయి. మొత్తం మూడు టన్నెళ్ల కోసం ఇప్పటిదాకా రూ.1,501.94 కోట్లు వ్యయం చేయగా వీటి ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని తరలించే వెసులుబాటు కలగనుంది. పెన్నా డెల్టాకు జీవనాడులైన నెల్లూరు, సంగం బ్యారేజ్లను ఇప్పటికే పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేయగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాలకు తాగు, సాగునీటిని అందించే లక్ష్యంతో హంద్రీ–నీవా నుంచి 77 చెరువులను నింపే ఎత్తిపోతలను పూర్తి చేసి సెప్టెంబరు 19న సీఎం జగన్ జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. 2.60 లక్షలకు సాగునీరు.. 20 లక్షల మందికి తాగునీరు శ్రీశైలానికి వరద వచ్చే సమయంలో రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను తరలించి ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 20 లక్షల మందికి తాగునీటిని అందించే దివంగత వైఎస్సార్ 2005లో గాలేరు–నగరి సుజల స్రవంతిని చేపట్టారు. గోరకల్లు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 57.7 కి.మీ. పొడవున వరద కాలువ, దీనికి కొనసాగింపుగా అవుకు రిజర్వాయర్ వద్ద కొండలో 5.7 కి.మీ. పొడవున 16 మీటర్ల వ్యాసంతో ఒక సొరంగం తవ్వకం పనులు చేపట్టారు. మట్టి పొరలు బలహీనంగా ఉన్నందున పెద్ద సొరంగం తవ్వితే కుప్పకూలే ప్రమాదం ఉందని కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తలు నాడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ఒక సొరంగం స్థానంలో 11 మీటర్ల వ్యాసంతో 5.7 కి.మీ. పొడవున, పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు చిన్న సొరంగాల తవ్వకం పనులు చేపట్టారు. వైఎస్సార్ హయాంలోనే వరద కాలువ తవ్వకంతోపాటు రెండు సొరంగాలలో చాలా వరకు పనులు పూర్తయ్యాయి. చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు.. అవుకులో 2010 నాటికి ఎడమ వైపు సొరంగంలో 350 మీటర్లు, కుడి వైపు సొరంగంలో 180 మీటర్ల పొడవున ఫాల్ట్ జోన్లో పనులు మాత్రమే మిగిలాయి. ఫాల్ట్ జోన్లో పనులు చేయలేక టీడీపీ సర్కార్ చేతులెత్తేసింది. కుడి వైపు సొరంగంలో ఫాల్ట్ జోన్ ప్రాంతంలో తవ్వకుండా దానికి ఒక వైపు 7 మీటర్ల వ్యాసం, 5 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 394 మీటర్ల మేర ఒక లూప్ను 2017లో, 507 మీటర్ల పొడవున మరో లూప్ను 2018లో తవ్వి కుడి సొరంగంతో అనుసంధానం చేశారు. వాటి ద్వారా ఐదారు వేల క్యూసెక్కులు తరలించి చేతులు దులుపుకొన్నారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఫాల్ట్ జోన్లో పనులు అత్యా«దునిక పద్ధతుల ద్వారా చేపట్టి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని జలవనరుల శాఖను ఆదేశించారు. సీమకు చంద్రబాబు ద్రోహం గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం రాయలసీమ, నెల్లూరు ప్రజల చిరకాల స్వప్నం. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 1996లోలోక్సభ ఎన్నికల గండం గట్టెక్కేందుకు గండికోట వద్ద గాలేరు–నగరికి శంకుస్థాపన చేశారు. తరువాత తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. 1999 సార్వత్రిక ఎన్నికలకు ముందు వామికొండ వద్ద గాలేరు–నగరికి రెండో సారి శంకుస్థాపన చేశారు. అధికారంలోకి వచ్చాక ఎలాంటి పనులు చేపట్టలేదు. 1995 నుంచి 2004 వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు సీమ ప్రజలకు తీరని ద్రోహం చేసినట్లు స్పష్టమవుతోంది. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గాలేరు–నగరిలో మిగిలిన పనులను పూర్తి చేయకుండా పాత కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేశారు. జీవో 22, జీవో 63లను వర్తింపజేసి మిగతా పనుల అంచనా వ్యయాన్ని పెంచి సీఎం రమేష్ నేతృత్వంలోని కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. వైఎస్సార్ హయాంలో పూర్తయిన గండికోట రిజర్వాయర్ పూర్తి నిల్వ సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా చంద్రబాబు నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా 2019 ఎన్నికలకు ముందు నాలుగైదు టీఎంసీలు నిల్వ చేసి తానే గాలేరు–నగరిని పూర్తి చేసినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన ప్రజలు 2019 ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్పారు. సుభిక్షం చేసిన వైఎస్సార్ దివంగత వైఎస్సార్ కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించి సుభిక్షం చేసేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 9 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచడంతోపాటు గాలేరు–నగరిని చేపట్టారు. తెలుగుగంగ పనులను వేగవంతం చేశారు. హంద్రీ–నీవాను చేపట్టారు. గాలేరు–నగరి పనులకు రూ.4,982.69 కోట్లు ఖర్చు చేసి వరద కాలువతోపాటు గండికోట, వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం రిజర్వాయర్ల పనులను చాలావరకు పూర్తి చేశారు. పక్షం రోజుల్లోనే గండికోట దాహార్తి తీర్చేలా హిమాలయాలలో రహదారులు, సైనికుల అవసరాల కోసం సొరంగాల తవ్వకాలకు అనుసరిస్తున్న పాలీ యురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ విధానాన్ని అధ్యయనం చేసిన జలవనరుల శాఖ అధికారులు ఆ నిపుణులను రాష్ట్రానికి రప్పించారు. అవుకు రెండో సొరంగంలో 165 మీటర్ల ఫాల్ట్ జోన్లో తవ్వకం పనులు చేపట్టి పాలీయురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ విధానంలో విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటికే పూర్తైన మొదటి సొరంగం ద్వారా పది వేల క్యూసెక్కులు, తాజాగా పూర్తయిన రెండో సొరంగం ద్వారా మరో పది వేల క్యూసెక్కులు కలిపి ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను గాలేరు–నగరి వరద కాలువ ద్వారా తరలించేలా మార్గం సుగమం చేశారు. దీంతో శ్రీశైలానికి వరద వచ్చే 15 రోజుల్లోనే గండికోట జలాశయాన్ని నింపవచ్చునని అధికారులు చెబుతున్నారు. చిత్తశుద్ధితో సీఎం జగన్ అడుగులు శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లోనే గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచే పనులను సీఎం జగన్ చేపట్టారు. ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గాలేరు–నగరిలో మిగిలిన పనులను కూడా పూర్తి చేసి సీమను సస్యశ్యామలం చేసే దిశగా చిత్తశుద్ధితో వేగంగా అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో పునరావాసం కల్పించడం ద్వారా గండికోటలో 2019లోనే 26.85 టీఎంసీలను నిల్వ చేయడం గమనార్హం. వరుసగా 2020, 2021, 2022లోనూ 26.85 టీఎంసీల చొప్పున గండికోటలో నిల్వ చేశారు. వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం రిజర్వాయర్లలోనూ పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. నాడు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల పది టీఎంసీలకుగానూ నాలుగు టీఎంసీలను మాత్రమే టీడీపీ సర్కారు నిల్వ చేసింది. సీఎం జగన్ రూ.250 కోట్లు వెచ్చించి నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 2019 నుంచి నాలుగేళ్లుగా పదికి పది టీఎంసీలను నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తూ వస్తున్నారు. ♦ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ ఉన్న లింక్ కెనాల్, వెలిగోడు నుంచి బ్రహ్మంసాగర్ వరకు తెలుగుగంగ కెనాల్కు లైనింగ్ చేయకపోవడం వల్ల సామర్థ్యం మేరకు నీరు ప్రవహించడం లేదు. దాంతో వెలిగోడు, బ్రహ్మంసాగర్కు సకాలంలో నీళ్లు చేరక ఆయకట్టు రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గుర్తించిన సీఎం జగన్ రూ.500 కోట్లతో ఆ కాలువలకు లైనింగ్ చేయించారు. ఫలితంగా 2019 నుంచి ఏటా వెలిగోడు రిజర్వాయర్ను సకాలంలో నింపుతున్నారు. ♦ బ్రహ్మంసాగర్ మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల 17.74 టీఎంసీలకుగానూ 2018 వరకూ నాలుగు టీఎంసీలను మాత్రమే నిల్వ చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రూ.వంద కోట్లతో డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేశారు. దీంతో 2020 నుంచి 17.74 టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తున్నారు. సీమ చరిత్రలో మేలిమలుపు ముఖ్యమంత్రి జగన్ మార్గ నిర్దేశాల మేరకు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అత్యాధునిక పరిజ్ఞానంతో అవుకు రెండో సొరంగాన్ని పూర్తి చేశాం. ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులు తరలించేందుకు మార్గం సుగమమైంది. దీంతో గాలేరు–నగరి తొలి దశ పూర్తైంది. శ్రీశైలానికి వరద రాగానే గండికోట, వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం, చిత్రావతి రిజర్వాయర్లను సత్వరమే నింపి సకాలంలో ఆయకట్టుకు నీటిని అందించి రైతులకు లబ్ధి చేకూర్చేలా అన్ని అడ్డంకులను సీఎం జగన్ తొలగించారు. సీమ చరిత్రలో ఇదో మేలిమలుపు. – శశిభూషణ్కుమార్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రణాళికాబద్ధంగా పూర్తి సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యం చేస్తూ సీఎం జగన్ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నిలిపారు. ముఖ్యమంత్రి రూపొందించిన ప్రణాళిక మేరకు సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నాం. ఇప్పటికే సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్లను పూర్తి చేసి సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో హంద్రీ–నీవా నుంచి 77 చెరువులను నింపే ఎత్తిపోతలను పూర్తి చేసి ప్రారంభించారు. ఇప్పుడు గాలేరు–నగరిలో అత్యంత కీలకమైన అవుకు సొరంగాన్ని జాతికి అంకితం చేస్తున్నారు. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్, జలవనరుల శాఖ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు దివంగత వైఎస్సార్ అవుకు చెరువును రిజర్వాయర్గా మార్చారు. 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు రెండు టన్నెళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మట్టి వదులుగా ఉండటంతో పనులకు ఆటంకం కలిగింది. ఆ తరువాత టీడీపీ పాలకులు విఫలం కావటంతో పనులు నిలిచిపోయాయి. సీఎం జగన్ పనులను వేగంగా పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందిస్తున్నారు. అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి చూపించారు. – అరవ రూమభూపాల్ రైతు శింగనపల్లె ఏటా రెండు పంటలు.. గతంలో నీరు సరిగా అందక ఏడాదికి ఒక్క పంట మాత్రమే పండించాం. సీఎం జగన్ పుణ్యమా అని రెండో టన్నెల్ పనులు పూర్తి కావడంతో అవుకు రిజర్వాయర్ నీటితో కళకళలాడనుంది. భూగర్భ జలాలు కూడా సమృద్ధిగా పెరుగుతాయి. ఇక ఏటా రెండు పంటలు పండించుకుంటాం. ఒక ఏడాది వర్షాలు పడకపోయినా అవుకు రిజర్వాయర్ ద్వారా పంటలు పండించుకునే అవకాశం ఉంది. సీఎం జగన్కు రైతులంతా రుణపడి ఉంటారు. – దొర్నిపాటి నాగరాజు, రైతు, అవుకు కల నెరవేరింది రెండో టన్నెల్ నుంచి అవుకు రిజర్వాయర్లోకి నీళ్లు రావడం కలగానే మిగిలిపోతుందనుకున్నాం. సీఎం జగన్ అవుకు టన్నెళ్లు పూర్తి చేసి 20 వేల క్యూసెక్కుల నీటిని వదలనుండటం ఎంతో సంతోషంగా ఉంది. రైతుల కల నెరవేరుతోంది. – వెలుగు సీతారామయ్య రైతు, అవుకు -
సీమ థర్మల్ విద్యుత్ కేంద్రానికి ‘ఎంవీఆర్’ పేరు
సాక్షి, అమరావతి/ఎర్రగుంట్ల( వైఎస్సార్ జిల్లా): రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్(ఆర్టీపీపీ) పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుగా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచ్చింది. కార్మిక నేతగా, ఎమ్మెల్యేగా, రచయితగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన దివంగత నేత డాక్టర్ ఎంవీ రమణారెడ్డి(ఎంవీఆర్) సేవలకు గుర్తింపుగా, రాయలసీమ ప్రాంత నేతల విజ్ఞప్తి మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. వారి ఆమోదంతో వైఎస్సార్ జిల్లా కలమళ్లలోని 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ఆర్టీపీపీ పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుగా మార్చుతూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పేరు మార్పు తక్షణమే అమల్లోకొస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడు థర్మల్ ప్లాంట్లకు ముగ్గురు ప్రముఖుల పేర్లు రాష్ట్రంలో మూడు థర్మల్ పవర్ ప్లాంట్లుండగా, వేర్వేరు రంగాలకు చెందిన వారి పేర్లు వాటికి సార్థక నామధేయాలుగా మారాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్లాంట్కు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రమని పేరు పెట్టారు. ఇబ్రహీంపట్నంలోని పవర్ ప్లాంటుకు విద్యుత్ రంగ పితామహుడుగా పేరు పొందిన డాక్టర్ నార్ల తాతారావు పేరు పెట్టారు. తాజాగా ఆర్టీపీపీని కార్మిక నేత ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుగా ప్రభుత్వం మార్చింది. ఎంవీఆర్ కృషితో సీమలో థర్మల్ ప్లాంట్ వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతంలో విద్యుత్ సమస్య పరిష్కారం కోసం థర్మల్ విద్యుత్ కర్మాగారం ఏర్పాటు చేయాలని మొట్టమొదట డిమాండ్ చేసిన నేత డాక్టర్ ఎంవీ రమణారెడ్డి. 1985లో ‘రాయలసీమ కన్నీటి గాథ’ అనే పుస్తకం ద్వారా ఆయన రాయలసీమ సమస్యలను, గణాంకాలు, సహేతుకమైన ఆధారాలతో రాష్ట్ర ప్రజల దృష్టికి తెచ్చారు. కరువుతో అల్లాడుతున్న సీమకు అన్ని విధాలా అన్యాయం జరుగుతోందని గళమెత్తారు. ఎంవీఆర్ చేసిన డిమాండ్.. ఆర్టీపీపీ స్థాపనకు బాట వేసిందని, ఆ నేతకు నివాళిగా ఆర్టీపీపీ పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుగా మార్చాలని రాయలసీమ నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాయలసీమ విమోచన సమితి పేరుతో రమణారెడ్డి, రాయలసీమ సంయుక్త కార్యాచరణ సమితి పేరుతో వైఎస్సార్, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి, టీటీడీ చైర్మన్ కరుణాకరెడ్డి తదితర నేతలంతా అప్పట్లో ఉద్యమం చేపట్టారని సాహితీవేత్త భూమన్ తెలిపారు. ఆర్టీపీపీ పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుగా మార్చడం దివంగత నేతకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అరుదైన గౌరవంగా భావిస్తున్నామని భూమన కరుణాకర్రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యలు ప్రశంసించారు. ఆర్టీపీపీకి డాక్టర్ ఎంవీఆర్ పేరు పెట్టినందుకు ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురు నేతలు ముఖ్యమంత్రికి, ఇంధన శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీపీపీకి ఎంవీఆర్ పేరు చేర్చడాన్ని రాయలసీమ వాసులు స్వాగతిస్తున్నారు. -
ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి వైఎస్సార్సీపీ ‘సామాజిక సాధికారత బస్సు యాత్ర’.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఎల్లుండి నుంచి వైఎస్సార్సీపీ బస్సు యాత్ర
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతున్న బస్సుయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లోనూ ఒకేసారి బస్సుయాత్ర ప్రారంభం కాబోతోంది. డిసెంబరు నెలాఖరు వరకు జరిగే ఈ యాత్రకు సామాజిక సాధికార యాత్ర అనే పేరు పెట్టారు. 175 నియోజకవర్గాల్లోనూ గెలుపు లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకు పోతోంది. ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తూనే మరోవైపు పార్టీ పరమైన కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్యాచరణ సిద్ధం చేశారు. గతేడాది మే నెలలో ప్రారంభమైన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన లభించిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీ పరమైన కార్యక్రమాలను కూడా మరింత వేగంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 26 అంటే బుధవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లోనూ ఒకేసారి బస్సుయాత్రలు ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా మూడు బస్సులను రెడీ చేశారు. బస్సుల ముందు భాగంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాను ప్రముఖంగా కనిపించేలా స్టిక్కరింగ్ చేశారు. పైభాగాన సామాజిక సాధికార యాత్ర పేరు కనపడేలా చేశారు. ఇక మిగతా మూడు వైపులా మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో స్టిక్కర్లు, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటోలను ఏర్పాటు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రమఖుల చిత్రాలను కూడా బస్సు మీద ఏర్పాటు చేశారు. ఇక బస్సు యాత్రలు తొలిరోజు అంటే ఈ నెల 26న ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం, కోస్తాంధ్రలో తెనాలి, రాయలసీమలో సింగనమల నియోజకవర్గాలలో ప్రారంభం కాబోతున్నాయి. తొలి విడతలో నవంబర్ తొమ్మిదో తేదీ వరకు యాత్రలకు సంబంధించిన వివరాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. దాని ప్రకారం ఉత్తరాంధ్రలో తొలుత ఇచ్చాపురంలో 26వ తేదీన బస్ యాత్ర ప్రారంభం కానుండగా, 27న గజపతినగరం, 28న భీమిలి, 30న పాడేరు, 31న ఆముదాలవలస, నవంబర్ 1న పార్వతీపురం, 2న మాడుగుల, 3న నరసన్నపేట, 4న శృంగవరపుకోట, 6న గాజువాక, 7న రాజాం, 8న సాలూరు, 9న అనకాపల్లె నియోజకవర్గాల్లో బస్సుయాత్ర జరుగుతుంది. ఇక కోస్తాంధ్రలో ఈనెల 26న తెనాలిలో ప్రారంభమయ్యే బస్సుయాత్ర 27న నరసాపురం, 28న చీరాల, 30న దెందులూరు, 31న నందిగామ, నవరంబరు 1న కొత్తపేట, 2న అవనిగడ్డ, 3న కాకినాడ రూరల్, 4న గుంటూరు తూర్పు నియోజకవర్గం, 6న రాజమండ్రి రూరల్, 7న వినుకొండ, 8న పాలకొల్లు, 9న పామర్రు నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. ఇక రాయలసీమ విషయానికొస్తే.. తొలుత ఈనెల 26న సింగనమల నియోజకవర్గంలో బస్సుయాత్ర ప్రారంభై 27న తిరుపతి, 28న ప్రొద్దుటూరు, 30న ఉదయగిరి, 31న ఆదోని, నవంబర్ 1న కనిగిరి, 2న చిత్తూరు, 3న శ్రీకాళహస్తి, 4న ధర్మవరం, 6న మార్కాపురం, 7న ఆళ్లగడ్డ, 8న నెల్లూరు రూరల్, 9న తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోయాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ సందర్భంగా గడిచిన నాలుగున్నరేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా జగన్ చేసిన అభివ్రుద్ది, సంక్షేమ పథకాల గురించి వివరిస్తారని ఈనెల 9న విజయవాడలో జరిగిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ చెప్పారు. ప్రతి బస్సు యాత్రను ఒకటీమ్ గా భావిస్తే అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన లీడర్లు స్పీకర్లుగా ఉంటారన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. వైనాట్ 175 అనేది ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నినాదం. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే పలు వేదికల మీద ప్రకటించారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ మ్యానిఫెస్టోలో ఇప్పటికే 98.5 శాతానికి పైగా అమలు చేసిన ఘనత కూడా వైఎస్ జగన్దే. గత ప్రభుత్వాలన్నీ ఇచ్చిన హామాలను తుంగలో తొక్కేస్తే జగన్ మాత్రం మ్యానిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాగా పవిత్రంగా భావిస్తూ అందులోని హామీలను అమలు చేసేందుకు ఎక్కడా వెనక్కు తగ్గలేదు. అంతేకాదు.. మంత్రివర్గంలో కూడా బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికే 77 శాతం పదవులను కట్టబెట్టారు. స్థానిక పదవుల్లోనైతే మహిళలకు యాభై శాతాకిపైగా కేటాయించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ, అభివ్రుద్ది కార్యక్రమాలను వారికి పూర్తిస్థాయిలో కల్పించారు. అందుకే జగన్ను ఆ వర్గాలన్నీ తమ గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నాయి. రాబోయే ఎన్నికలను మరో కురుక్షేత్ర యుద్దంగా భావిస్తున్న నేపథ్యంలో పేదలు, పెత్తందార్ల మధ్యనే పోటీ జరగబోతున్నదని ఇప్పటికే పేద వర్గాలన్నీ భావిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా నిలిచింది. అందుకే వారంతా తమ జెండా, ఎజెండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని బాహాటంగానే చెప్తున్నారు. మొత్తమ్మీద బస్సు యాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ క్యాడర్ మొత్తం ఈ యాత్రలో పాల్గొనబోతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావారణం కనిపిస్తోంది. చదవండి: అదీ సంగతి.. లోకేష్ ముందుగానే ఫిక్స్ అయిపోయారన్నమాట.. -
నిజాలకు పాతర.. అబద్ధాల జాతర
సాక్షి, అమరావతి: ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చిత్రీకరిస్తూ తప్పుడు కథనాలు అచ్చేయడంలో తనకు తానే సాటి అని ‘ఈనాడు’ రామోజీరావు మరోసారి నిరూపించుకున్నారు. సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలో మూడు ప్రాంతాల సమతుల అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే వెనుకబడిన రాయలసీమను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. ఫలితంగా మునుపెన్నడూ లేని రీతిలో ఈ ప్రాంతం అభివృద్ధిలో పురోగమిస్తోంది. దీన్ని ఇప్పుడు రామోజీ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే.. వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయాలను నిత్యం వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుని విషం కక్కుతున్నారు. వాటిని అపహాస్యం చేస్తూ.. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడానికి కొన్ని రాజకీయ శక్తులతో కలిసి ఆయన చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ‘కరవు నేలపై కనికట్టు మాటలు’ శీర్షికన మంగళవారం ఈనాడులో అచ్చోసిన అబద్ధాల సమాహారం. సీమ పచ్చబడుతుంటే ఎందుకంత కడుపుమంట?.. ♦ దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ తదితర ప్రాజెక్టులను చేపట్టారు. ఈ ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను టీడీపీ సర్కార్ పూర్తిచేయలేదు. పైగా.. ఆ పనుల అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేసి.. నామినేషన్పై అస్మదీయ కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది. ప్రభుత్వ ఖజానాను చంద్రబాబు ఇలా దోచుకోవడంపై రామోజీరావు పెన్ను ఎప్పుడూ కదల్లేదు.. నోరు పెగల్లేదు. ఎందుకంటే.. అలా దోచుకుని, పంచుకుని, తిన్న దాంట్లో ఆయనకూ వాటా వచ్చిం ది కాబట్టి. కానీ, జగన్ ఈ ప్రాజెక్టులన్నింటిని పెద్దపీట వేశారు. ♦ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక తెలుగుగంగలో మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. ఇక తెలుగుగంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ మట్టికట్టకూ సీఎం జగన్ డయాఫ్రమ్ వాల్ నిర్మించి లీకేజీలకు అడ్డకట్ట వేయడం ద్వారా ఆ ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం మేరకు 17 టీఎంసీలు నిల్వచేస్తున్నారు. అలాగే, గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్నూ పూర్తిచేశారు. అంతేకాక.. రూ.950 కోట్లు వెచ్చిం చి గండికోట, రూ.280 కోట్లు వెచ్చిం చి సీబీఆర్ నిర్వాసితులకు పునరావాసం కలి్పంచి.. ఆ రెండు ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయిలో అంటే గండికోటలో 26.85 టీఎంసీలు, సీబీఆర్లో పది టీఎంసీలు నిల్వచేస్తూ ఆయకట్టుకు నీళ్లందిస్తున్నారు. ఇలా సీమ పచ్చబడుతుంటే ఎందుకంత కడపుమంట రామోజీ? ♦ఇక రాయలసీమ సాగు, తాగునీటి కష్టాలు కడతేర్చాలనే లక్ష్యంతో రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. దీనిపై ఎన్జీటీలో కేసులు వేయించి సైంధవునిలా చంద్రబాబు అడ్డుపడుతుంటే ఏనాడైనా నిలదీశారా రామోజీ? శరవేగంగా పారిశ్రామిక ప్రగతి.. నిజానికి.. నాలుగేళ్లలో రాయలసీమ పారిశ్రామికంగా గణనీయమైన ప్రగతి సాధించింది. రవాణా, విద్యుత్ ఎల్రక్టానిక్స్, ఉక్కు రంగాల్లో శరవేగంగా ముందుకు సాగుతోంది. రాయలసీమ ప్రగతికి ప్రకాశం జిల్లాలో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టు చుక్కానిలా నిలవనుంది. సీమలో ఉత్పత్తయ్యే వస్తువుల రవాణాకు.. ఎగుమతి, దిగుమతులు ఊపందుకోవడానికి ఈ పోర్టు ఉపయోగపడుతుంది. దీనిని రూ.2,365 కోట్లతో ప్రభుత్వం నిరి్మస్తోంది. ఈ పోర్టుకు సమీపంలోనే నాలుగైదు వేల ఎకరాల్లో పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి కానుంది. ఏడాదికి 34 మిలియన్ టన్నుల సరుకులు ఈ పోర్టు నుంచి ఎగుమతి, దిగుమతులు జరగనున్నాయి. ♦ కడప స్టీల్ ప్లాంట్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ♦ 2019–23 మధ్యకాలంలో రాయలసీమ ప్రాంతంలో 71 అతిపెద్ద–భారీ పరిశ్రమలు వచ్చాయి. రూ.36,610 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 55 వేల మందికి ఉద్యోగాలు లభించాయి. ♦ రాయలసీమ ప్రాంతం దేశంలోనే సంప్రదాయేతర ఇంధన వనరుల రంగానికి తలమానికం కానుంది. ప్రభుత్వ కృషివల్ల ఈ ఒక్క రంగంలోనే.. అదీ ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే 16 ప్రాజెక్టులు రాబోతున్నాయి. ♦ శ్రీకాళహస్తి సమీపంలోని ఇంగలూరులో అడిడాస్ షూ తయారీ కంపెనీ అపాచీకి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ ఒక్క కార్యక్రమంతోనే ప్రారంభించిన, భూమి పూజ చేసుకున్న పరిశ్రమల పెట్టుబడుల విలువ దాదాపు రూ.4వేల కోట్లు కాగా.. సుమారు 20వేల మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు.. రాయలసీమలో వైద్యారోగ్య పరంగా కూడా ఈ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిం ది. కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను నిర్మిస్తుండగా అందులో ఐదు కాలేజీల నిర్మాణాన్ని రాయలసీమలో చేపట్టింది. ఒక్కో మెడికల్ కాలేజీ కోసం సుమారుగా రూ.500 కోట్లను ప్రభుత్వం ఖర్చుచేస్తూ ప్రజారోగ్య రంగంలో పెట్టుబడి పెడుతోంది. రాయలసీమ చరిత్రలోనే ఇంత పెట్టుబడి ఏ ప్రభుత్వం కూడా పెట్టలేదు. ఇక తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర, కడప, అనంతపురం, కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల రూపురేఖలను సైతం మారుస్తోంది. ప్రజారోగ్యంపై టీడీపీ సర్కార్ ఎప్పుడైనా ఇంత శ్రద్ధ పెట్టిందా రామోజీ? -
రాయలసీమ ఎత్తిపోతల తొలిదశకు గ్రీన్ సిగ్నల్
-
రాయలసీమ ఎత్తిపోతల తొలిదశకు గ్రీన్సిగ్నల్
సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకం తొలిదశలో రాయలసీమలోని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీరు, చెన్నైకి నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన పనులను ప్రాధాన్యతగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఆరు పంపులను (ఒక్కొక్కటి 2,913 క్యూసెక్కుల సామర్థ్యం) ఏర్పాటుచేసి.. నీటి సమస్య తీవ్రంగా ఉండే జూన్ నుంచి జూలై మధ్య 59 టీఎంసీలు తరలించి నీటి ఎద్దడిని నివారించవచ్చని కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ పంపిన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ఠ నీటి మట్టం సముద్ర మట్టానికి 885 అడుగుల ఎత్తున ఉంటుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 841 అడుగుల ఎత్తులో అమర్చారు. శ్రీశైలంలో 880 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరునిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. ఈ హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, తెలుగుగంగకు 29, గాలేరు–నగరికి 38 వెరసి 101 టీఎంసీలు సరఫరా చేయాలి. వర్షాభావ పరిస్థితులవల్ల శ్రీశైలానికి వరద వచ్చే రోజులు ఏయేటికాయేడు తగ్గుతున్నాయి. మరోవైపు.. తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా 800 అడుగుల నుంచే నీటిని తోడేస్తుండటం ఫలితంగా శ్రీశైలం రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గిపోతోంది. దీంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు నీళ్లందడంలేదు. అనుమతి వచ్చేలోగా తాగునీటి కోసం.. ఇక రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అది వచ్చేలోగా చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే పనులు చేపట్టాలని నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగుగంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు 8.4 టీఎంసీలు వెరసి 35.23 టీఎంసీలు కనీసం నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశముంటుంది. రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6)అంటే దాదాపు 59 టీఎంసీలను శ్రీశైలం నుంచి తరలించాలని ప్రభుత్వానికి జలవనరుల అధికారులు ప్రతిపాదించారు. పర్యావరణ అనుమతి వచ్చేలోగా రాయలసీమ ఎత్తిపోతలలో తాగునీటి కోసం తరలించడానికి అవసరమైన పనులను చేపట్టడానికి అనుమతివ్వాలన్న అధికారుల ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. పర్యావరణ అనుమతితోనే పనులు రాయలసీమ హక్కులను పరిరక్షించడం, చెన్నైకి నీటి సరఫరా చేయడమే లక్ష్యంగా.. శ్రీశైలం రిజర్వాయర్ జలవిస్తరణ ప్రాంతంలో సంగమేశ్వరం వద్ద 800 అడుగుల నుంచే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020, మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. దీని ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు సరఫరా, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యం. పర్యావరణ అనుమతి తీసుకోకుండా ఎత్తిపోతలను చేపట్టడంవల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఎన్జీటీ (చెన్నై) బెంచ్లో టీడీపీ నేతలు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పాత ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించడానికే ఈ ఎత్తిపోతల చేపట్టామని.. అదనంగా నీటిని నిల్వచేసేలా రిజర్వాయర్లు నిర్మించడంలేదని.. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుమతి తీసుకోవాల్సిన అవసరంలేదని ఎన్జీటీలో ప్రభుత్వం వాదించింది. కానీ.. ఎత్తిపోతల పనులను ఆపేయాలంటూ 2020, మే 20న ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్జీటీ నియమించిన జాయింట్ కమిటీ కూడా ఏపీ ప్రభుత్వ వాదననే బలపరుస్తూ నివేదిక ఇచ్చింది. కానీ, పర్యావరణ అనుమతితోనే పనులు చేపట్టాలని 2020, అక్టోబర్ 29న ఎన్జీటీ నిర్దేశించింది. దాంతో పర్యావరణ అనుమతి కోసం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖతో జలవనరుల అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్–ఒడిశా తీరాలకు ఆనుకుని మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కి.మీల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం గురువారంకి పశ్చిమ, వాయవ్య దిశలో ఉత్తర ఒడిశా, దక్షిణ జార్ఖండ్ మీదుగా పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రుతుపవన ద్రోణి రాజస్థాన్ నుంచి ప్రస్తుత అల్పపీడన ప్రాంతం వరకు తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా వెళ్తోంది. వీటి ప్రభావంతో రానున్న 3 రోజులు ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాలో బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. వచ్చే మూడు రోజులు పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గంటకు 45–55, గరిష్టంగా 65 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. -
రాయలసీమకు హైకోర్టు అక్కర్లేదట.. సీమకు చంద్రబాబు ద్రోహం
“అమరావతిలో లక్షల కోట్లు ఖర్చుపెట్టేసి టీడీపీ నేతల రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచేయాలి. కానీ వెనుక బడిన రాయలసీమకు కనీసం హైకోర్టు కూడా అవసరం లేదట. ఉత్తరాంధ్రకు ముందే గుండు సున్నా కొట్టేసిన చంద్రబాబు నాయుడు రాయలసీమపైనా విషం చిమ్మేశారు. మొత్తానికి తనకు అమరావతి తప్ప రాష్ట్రంలో ఇంకే ప్రాంతమూ నగరమూ ముఖ్యమే కాదని చంద్రబాబు నాయుడు చాటి చెప్పారు. రాయలసీమ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న న్యాయరాజధాని వద్దే వద్దని చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయారు.” రాయలసీమలో పర్యటిస్తోన్న చంద్రబాబు నాయుడు ఒక పక్క తన అవినీతిని ఐటీ నోటీసులు బట్టబయలు చేయడంతో ఎప్పుడు అరెస్ట్ చేస్తారోనన్న భయంతో ఉన్నారు. మరో పక్క రాయలసీమ వాసులు న్యాయ రాజధాని ప్రస్తావన తీసుకురాగానే చంద్రబాబుకు అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం గుర్తుకొచ్చింది. అంతే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాయలసీమకు హైకోర్టు ఎందుకు? అని ఎదురు ప్రశ్రించారు. కావాలంటే హై కోర్టు బెంచ్ ఇస్తే అదే ఎక్కువ అని కూడా తీర్పు చెప్పారు. రాయలసీమ ప్రజల ఓట్లతో రాజకీయ బిక్ష పెడితే రాజకీయాల్లో ఎదిగి కుదరకపోతే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు. తనను అంతటి వాణ్ని చేసిన రాయలసీమ ప్రజల రుణాన్ని ఎలా తీర్చుకోవాలా? అని ఆయన ఆలోచించాలి. అలాంటిది రాయలసీమకు ఎలా ద్రోహం తలపెడదామా అన్న ఆలోచనే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. 2019లో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార.. అభివృద్ది వికేంద్రీకరణల్లో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయించిస సంగతి తెలిసిందే. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే ఉత్తరాంధ్రలోని విశాఖను కార్యనిర్వాహక రాజధానిగానూ కర్నూలును న్యాయ రాజధానిగానూ చేయాలని ఆయన నిర్ణయించారు. అయితే కర్నూలులో హై కోర్టు పెడితే ఏం వస్తుంది? నాలుగు జిరాక్స్ సెంటర్లు వస్తాయంతే అని చంద్రబాబు విషం చిమ్మారు. తాజాగా చంద్రబాబు రాయలసీమ పర్యటనలో సీమ న్యాయవాదులు కర్నూలులో హైకోర్టు ప్రస్తావన తీసుకురాగనే చంద్రబాబుకు మండుకొచ్చేసింది. రాయలసీమకు హైకోర్టు అవసరమే లేదని తెగేసి చెప్పారు. కావాలంటే ఓ బెంచ్ ఇస్తే సరిపోతుందన్నారు. హైకోర్టు పెడితేనే నాలుగు జిరాక్స్ షాపులు తప్ప ఏవీ రావన్న చంద్రబాబు నాయుడు హైకోర్టు బెంచ్ పెడితే కర్నూలుకు ఏం వస్తుందో చెప్పాలంటున్నారు రాయలసీమ హక్కుల వేదిక నేతలు. బాగా అభివృద్ది చెంది.. రాజధానికి అన్ని విధాలా అనువైన నగరంగా అందరూ ఒప్పుకునే విశాఖపై విషం చిమ్ముతూనే ఉన్నారు చంద్రబాబు. అక్కడ కార్యనిర్వాహక రాజధాని అవసరం లేదని ఉత్తరాంధ్ర ప్రజలే అంటున్నారంటూ బుకాయిస్తున్నారు చంద్రబాబు. ఇటు రాయలసీమకు హైకోర్టు అవసరం లేదంటూ ఈ ప్రాంతంపైనా విషం చిమ్ముతున్నారు. తాను తన బంధువులు.. తన ఎల్లో మీడియా అధినేతలు.. టీడీపీ సీనియర్లు వారి బంధువులు భూములు కొని అట్టేపెట్టుకున్న అమరావతిలో మాత్రం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అయినా సరే లక్షన్నర కోట్లకు పైగా ఖర్చే చేసేయాలని చంద్రబాబు పట్టుబడుతున్నారు. చదవండి: ‘చంద్రబాబు నిజంగానే భయపడ్డారు’ ఏ అమరావతి జపం చేస్తున్నారో అదే అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణం ముసుగులోనే వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు అడ్డంగా భోంచేసిన వైనాన్ని ఐటీ శాఖ అధికారులు సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే తాను జైలుకు వెళ్లక తప్పదని చంద్రబాబు నాయుడికి అర్ధమైపోయింది. తాను చేసిన తప్పేంటో తనకి తెలుసు. ఆ తప్పుకు శిక్ష ఏం పడుతుందో కూడా బాబుకు తెలుసు. అందుకే తనను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారని ఆయన కంగారు పడుతున్నారు. ఈ ఉక్రోషంలోనే రాయలసీమకు హైకోర్టు బెంచ్ చాలునని విషం కక్కుతున్నారని రాయలసీమకు చెందిన న్యాయవాదులు అంటున్నారు. -సీఎన్ఎస్ యాజులు, సీనియర్ జర్నలిస్టు, సాక్షి -
రాయలసీమపై మరోసారి విషం చిమ్మిన చంద్రబాబు
-
బాబుపై రాయలసీమ యువజన విద్యార్థి JAC నేతల ఆగ్రహం
-
రాయలసీమలో భారీ వర్షాలు
(సాక్షి నెట్వర్క్) : రాయలసీమ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఉమ్మడి వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ప్రకాశం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపిలేని వర్షం కురిసింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాజోలి ఆనకట్టకు భారీగా నీరు.. కర్నూలు, నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం నీరు వైఎస్సార్ జిల్లా మండల పరిధిలోని రాజోలి ఆనకట్టకు భారీగా వచ్చి చేరుతోంది. కుందూ పరీవాహక గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ ఇందిరారాణి సూచించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. జిల్లాలో రికార్డు స్థాయిలో 73.2 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లాలో సగటున 53.4, కర్నూలు జిల్లాలో సగటున 19.8 మి.మీ. వర్షం కురిసింది. రెండు రోజులుగా తిరుపతి జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం జిల్లాలో గరిష్టంగా బాలయపల్లి మండలంలో 118.2 మి.మీ వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా తిరుపతి అర్బన్లో 1.4 మి.మీ వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లాలో శనివారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా తవణంపల్లె మండలంలో 83.6 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వివిధ మండలాల్లో ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ వర్షాలు కురిశాయి. అటు సత్యసాయి జిల్లా, ఇటు అనంతపురం జిల్లావ్యాప్తంగా మోస్తరు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో మొదటిసారిగా పుట్లూరు మండలంలో 111.6 మి.మీ. భారీ వర్షం కురిసింది. ప్రకాశం జిల్లాలో శనివారం అర్ధరాత్రి, ఆదివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆదివారం ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. కృష్ణా జిల్లాలో సగటున 17.2 మి.మీ., ఎన్టీఆర్ జిల్లాలో 25.52 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. ♦ వైఎస్సార్ జిల్లా చెన్నూరు వద్ద పెన్నా నదిలో ఆదివారం రాత్రి అకస్మాత్తుగా నీటి ఉధృతి ఎక్కువైంది. నదిలో షికారుకు వెళ్లిన చెన్నూరు కొత్త గాంధీనగర్కు చెందిన వెంకట సుబ్బయ్య, రాజు, రమణ(పెద్దోడు), వెంకట సుబ్బయ్య, సుబ్బరాయుడు, శ్రీను, రమణ, రాజేష్ పెన్నా నదిలో షికారుకెళ్లి పెన్నా నదిలో చిక్కుకున్నారు. మైదుకూరు రూరల్ సీఐ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోటు సాయంతో అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ♦శనివారం రాత్రి కురిసిన వర్షానికి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్.ఉప్పలపాడు సమీపంలోని ఇసుక వంకలో వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. కర్నూలు నుంచి ప్రొద్దుటూరు వస్తున్న ఆర్టీసీ బస్సు ఇసుక వంకలో చిక్కుకుంది. సమాచారం అందుకున్న అర్బన్ సీఐ సదాశివయ్య పోలీసులు, రెస్క్యూ టీమ్ వెళ్లి వరద నీటిలో చిక్కుకున్న 13 మంది ప్రయాణికులను, డ్రైవర్, కండక్టర్ను తాడు సాయంతో ఉప్పలపాడు వైపు గట్టుకు తీసుకొచ్చారు. రేపు అల్పపీడనం! సాక్షి, విశాఖపట్నం: ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తువరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మంగళవారం వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడనుంది. మరోవైపు ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి, ఆంధ్రప్రదేశ్ను ఆనుకుని ఉన్న తెలంగాణపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్ర, రాయలసీమలపై బలంగా ఉన్నాయి. వీటన్నిటి ఫలితంగా సోమవారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడా భారీ వర్షాలు కురవనున్నాయి. సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు.. పార్వతీపురం మన్యం, కాకినాడ, విజయనగరం, అనకాపల్లి, తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. మంగళవారం ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, విజయనగరం, అనకాపల్లి, తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోను, బుధవారం ఏలూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కోనసీమ, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వివరించింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు కూడా సంభవిస్తాయని తెలిపింది. -
ఎట్టకేలకు వానలు!
సాక్షి, విశాఖపట్నం: చాలా రోజుల తర్వాత రాష్ట్రంలో మళ్లీ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. నెల రోజులుగా హిమాలయాల్లోనే తిష్ట వేసిన రుతుపవన ద్రోణి అక్కడి నుంచి దక్షిణాదికి మారడం, విదర్భ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఒక ద్రోణి, దక్షిణ చత్తీస్గఢ్ నుంచి కర్ణాటక వరకు ఒక ఉపరితల ఆవర్తనం, ఉత్తర అంతర్గత తమిళనాడులో సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. వీటి ఫలితంగా శనివారం నుంచి రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం వెల్లడించింది. అదే సమయంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని తెలిపింది. సాధారణంగా ఆగస్టు నెలలో రుతుపవనాలు చురుగ్గా ఉండి, వర్షాలు విస్తారంగా కురుస్తాయి. అయితే, ఈ ఆగస్టు నెల ఆరంభం నుంచి వర్షాలు ముఖం చాటేశాయి. ఒకట్రెండు చోట్ల అదీ స్వల్పంగానే వర్షాలు కురిశాయి. వర్షాలు కురవాలంటే అల్పపీడన ద్రోణులు గానీ, ఉపరితల ఆవర్తనాలు గానీ, బంగాళాఖాతంలో అల్పపీడనాలు గానీ ఏర్పడాలి. వాటివల్ల నైరుతి రుతుపవనాలు చురుకుదనం సంతరించుకుంటాయి. కానీ దాదాపు నెల రోజులుగా ద్రోణులు, ఆవర్తనాల జాడ లేదు. వర్షాలకు దోహదపడే నైరుతి రుతుపవనాల ద్రోణి కూడా మూడు వారాలకు పైగా దక్షిణాది వైపునకు రాకుండా హిమాలయాల ప్రాంతంలోనే ఉండిపోయింది. వీటన్నిటి కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురవలేదు. ఆగస్టు నెల వర్షపాతం సాధారణంకంటే 54 శాతం, నైరుతి రుతుపవనాల సీజను ప్రారంభం నుంచి ఆగస్టు ఆఖరు వరకు చూస్తే 25 శాతం తక్కువగా నమోదైంది. ఈ తరుణంలో రుతుపవన ద్రోణిలో కదలిక రావడం, ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు కురిసేందుకు తగిన వాతావరణం ఏర్పడింది. దాదాపు నెలరోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు, ప్రజలకు ఈ వానలు ఎంతగానో ఊరట కలిగించనున్నాయి.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement