-
మంచి సినిమా అంటున్నారు
‘‘అలా నిన్ను చేరి’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మరీ ముఖ్యంగా గ్రామీణప్రాంతాల ప్రేక్షకుల నుంచి ఎక్కువగా స్పందన వస్తోంది. వారంతా ఫస్ట్ హాఫ్కి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు’’ అని కొమ్మాలపాటి సాయి సుధాకర్ అన్నారు. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ దర్శకత్వం వహించారు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా కొమ్మాలపాటి సాయి సుధాకర్ మాట్లాడుతూ–‘‘మా సినిమా చూసిన చాలామంది తమ జీవితాన్ని చూసుకున్నట్టుగా ఉందనడం సంతోషం. ‘అలా నిన్ను చేరి’ నిర్మాతగా మొదటి సినిమా అయినా కథకి అవసరం మేరకు ఖర్చు పెట్టా. సినిమా చూసిన మా నాన్నగారు బాగా తీశారని మెచ్చుకున్నారు. నా తర్వాతి సినిమా కోసం ప్రస్తుతం థ్రిల్లర్ జానర్లో ఓ కథ విన్నాను’’ అన్నారు. -
సెమీస్లో యశ్ ధుల్ హాఫ్ సెంచరీ.. భారత్ 211 ఆలౌట్! పాక్ మాత్రం ఏకంగా..
ACC Mens Emerging Teams Asia Cup 2023- India A vs Bangladesh A: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన భారత- ఏ జట్టు సెమీస్లో నామమాత్రపు స్కోరు చేసింది. బంగ్లాదేశ్- ఏ జట్టుతో మ్యాచ్లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో శుక్రవారం ఇరు జట్ల మధ్య సెమీ ఫైనల్-2 మొదలైంది. యశ్ ధుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ టాస్ గెలిచిన బంగ్లాదేశ్ యువ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్, గత మ్యాచ్లో అజేయ సెంచరీతో మెరిసిన సాయి సుదర్శన్ 21 పరుగులకే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 34 పరుగులు సాధించాడు. వన్డౌన్ బ్యాటర్ నికిన్ జోస్ 17, ఆ తర్వాతి స్థానాల్లో ఆడిన యశ్ ధుల్ 66, నిశాంత్ సింధు 5, రియాన్ పరాగ్ 12, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ 1, హర్షిత్ రాణా 9, మానవ్ సుతార్ 21(రనౌట్), రాజవర్ధన్ హంగేర్గకర్ 15, యువరాజ్సిన్హ్ దోడియా 0(నాటౌట్) పరుగులు సాధించారు. కెప్టెన్ యశ్ ధుల్ అర్ధ శతకం కారణంగా భారత జట్టు 211 పరుగులు చేయగలిగింది. 49.1 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్, తంజీ హసన్ షకీబ్, రకీబుల్ హసన్ రెండేసి వికెట్లు తీయగా.. రిపన్ మొండాల్, కెప్టెన్ సైఫ్ హసన్, సౌమ్యా సర్కార్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఫైనల్లో పాకిస్తాన్ ఇక పాకిస్తాన్- ఏ జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్లో యశ్ ధుల్ సేన 8 వికెట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు యూఏఈ, నేపాల్లపై కూడా భారీ తేడాతో గెలుపొందింది. అయితే, సెమీ ఫైనల్లో బంగ్లాను చిత్తు చేస్తేనే ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఆడిన మూడు మ్యాచ్లలో చెలరేగిన భారత బౌలర్లు కీలక మ్యాచ్లో ఎలా రాణిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. కాగా సెమీ ఫైనల్-1లో శ్రీలంకపై గెలుపొందిన పాక్ ఫైనల్కు దూసుకెళ్లింది. చదవండి: మొన్న రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పుడు టీమిండియాకు మరో కొత్త కెప్టెన్! Leading from the front 💪 50* for skipper Yash Dhull 👏#EmergingAsiaCupOnFanCode #INDvBAN pic.twitter.com/tqPay3zS1Z — FanCode (@FanCode) July 21, 2023 -
టీవీ ఛానెల్ ఎండీని విచారిస్తున్న సీఐడీ
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు గర్జన సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై రాజమండ్రి సీఐడీ కార్యాలయంలో విచారిస్తున్నారు. ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ ఎండీ సాయిసుధాకర్ను సీఐడీ అధికారులు విచారణకు పిలిపించారు. సోమవారం ఆయన సీఐడీ కార్యాలయానికి వచ్చారు. తునిలో ఆందోళనకారులు రైలును దహనం చేయడం, పోలీస్ స్టేషన్లో విధ్వంసం సృష్టించిన ఘటనపై సీఐడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. కాపులను బీసీల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సారథ్యంలో తునిలో కాపుగర్జన సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
‘పీవోకే’ భారత్లో భాగమే.. మేం దానిని చేజిక్కించుకుంటాం
YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..
T20 WC: సంజూ వద్దు.. పంత్ బెటర్!.. తుదిజట్టులో ఆడించినా..
డీజిల్తో పరాటా చేయడమా? చివరికి యజమాని..
మెహరీన్పై తప్పుడు వార్తలు.. క్షమాపణ చెప్పాలంటూ ఫైర్
ప్లాటినమ్ కలర్ శారీలో ‘రాములమ్మ’ హొయలు.. జింగ్ జింగ్ అమేజింగ్ శ్రీ!
8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..
రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్
సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
టీడీపీ అరాచకం.. డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
తప్పక చదవండి
- సైకో థ్రిల్లర్గా 'దక్షిణ'.. ట్రైలర్తోనే భయపెట్టారు!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement