-
సెలూన్ బిజినెస్ లోకి రిలయన్స్ ఎంట్రీ ..!
-
‘అదిరేటి డ్రెస్ మేమేస్తే.. బెదిరేటి లుక్కు మీరిస్తే దడ..’
సాక్షి, అమలాపురం(కోనసీమ జిల్లా): ‘అదిరేటి డ్రెస్ మేమేస్తే.. బెదిరేటి లుక్కు మీరిస్తే దడ..’ అంటూ అమ్మాయిలు పాడటం ఇప్పుడు కొత్త కాదు. అందం, ఆకట్టుకునే లుక్కు, డ్రెస్సింగ్ వంటి విషయాల్లో మగువలతో మగమహారాజులూ పోటీ పడుతున్నారు. ఒకప్పుడు దసరా బుల్లోడు డ్రెస్సు వేస్తే గొప్ప. తరువాత ఎన్టీ రామారావు బెల్బాటమ్ ఫ్యాంట్.. దానికి అడుగున జిప్పులో ఒక భాగం కుట్టడం ప్యాషన్. కొంతమంది శోభన్బాబు స్టైల్లో తలలో ఓ పాయ తీసి నుదుటి మీదకు రింగులా పెట్టుకొని మురిసిపోయేవారు. ఆ తరువాత చిరంజీవి స్టెప్పు కటింగ్, బ్యాగీ ఫ్యాంట్లు, జర్కిన్లు.. పంక్ హెయిర్ స్టైల్.. ఇలా ఎన్నో.. 1996లో వచ్చిన ప్రేమదేశం సినిమా యువతను ఉర్రూతలూగించింది. చదవండి: సిద్ధవ్వ దోసెలు సూపర్.. రోడ్డు పక్కన హోటల్లో టిఫిన్ తిన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి కొత్త ఫ్యాషన్ వైపు పరుగు తీయించింది. ఆ సినిమాలో హీరో అబ్బాస్ తన హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్తో యువతను మెప్పించాడు. యువకుల దృష్టిని సౌందర్యం వైపు మళ్లించాడు. యువత ఆహార్యంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా ఐదేళ్లుగా వస్తున్న మార్పులు అన్నీ ఇన్నీ కావు. రకరకాల హెయిర్ స్టైల్స్.. జుట్టుకు రంగులు.. ఫేస్ ప్యాక్లు అన్నీ ఇన్నీ కావు. పనిలో పనిగా నాజూకైన శరీరాకృతి కోసం కొందరు.. సల్మాన్ఖాన్లా కండలు పెంచేందుకు మరికొందరు.. ఇలా యువత మంచి లుక్కు కోసం సమయం, ధనం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. ఒకప్పుడు బ్యూటీ పార్లర్లంటే కేవలం మహిళల కోసమే. కానీ ఇప్పుడు పురుషుల బ్యూటీ పార్లర్లకు సైతం ఆదరణ పెరిగింది. నగరాలు, పట్టణాలే కాదు.. చివరకు ఒక మోస్తరు పల్లెల్లో సైతం మెన్స్ బ్యూటీ పార్లర్లు ఏర్పడుతున్నాయి. జిల్లాలోని అమలాపురం, మండపేట, రామచంద్రపురం వంటి పట్టణాలతో పాటు రావులపాలెం, కొత్తపేట, మలికిపురం, రాజోలు, తాటిపాక, అంబాజీపేట, పి.గన్నవరం వంటి గ్రామాల్లో కూడా ఇటువంటి బ్యూటీ పార్లర్లకు డిమాండ్ ఏర్పడింది. హెయిర్ స్టైల్కే తొలి ప్రాధాన్యం యువకులు హెయిర్ స్టైల్కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకప్పుడు సెలూన్కు వెళ్తే రెండు రకాల స్టైల్స్లో హెయిర్ కటింగ్ చేయించుకోవడం, గెడ్డం గీయించుకోవడం లేదా ట్రిమ్మింగ్తో సరి. ఇప్పుడలా కాదు. పార్లర్లలో మూడు నాలుగు గంటలు పైగా గడుపుతున్నారు. రకరకాల హెయిర్ స్టైల్స్.. అందుకు తగినట్టుగా రంగులు వేయిస్తున్నారు. వారం వారం ఫ్యాషన్ మారిపోతోంది. పాశ్చాత్య దేశాలను అనుకరిస్తున్నారు. చేతిలో సెల్ఫోన్.. గూగుల్లో వెతికితే ఎన్నో ఫొటోలు, ఇంకెన్నో వీడియోలు. ఇంకేముంది! పుర్రెకో బుద్ధి అన్నట్టు యువత చెలరేగిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా 210 పాపులర్ హెయిర్ స్టైల్స్ ఉండగా, వీటిలో సుమారు 35కు పైగా మన వద్ద ఆదరణ ఉందని బ్యూటీ పార్లర్ల యజమానులు చెబుతున్నారు. రంగుల విషయానికి వస్తే పల్పీ, ఫ్రంక్ కలర్స్కు ఆదరణ ఎక్కువగా ఉంది. పనిలో పనిగా ఫేస్ప్యాక్, ఫేషియల్ను కూడా వదలడం లేదు. ఒక్కో ఫేషియల్కు రకాన్ని బట్టి రూ.2 వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఇక మొత్తం బాడీ న్యూలుక్ కోసం రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ ఖర్చవుతోందంటే వీటికి ఉన్న డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. జిమ్లకు పెరుగుతున్న ఆదరణ మరోవైపు జిమ్లకు సైతం యువకులు క్యూ కడుతున్నారు. ఒకప్పుడు కేవలం బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనేవారు మాత్రమే ఎక్కువగా జిమ్లకు వచ్చేవారు. కరోనా తరువాత ఆరోగ్య స్పృహ పెరగడంతో పాటు అందమైన ఆకృతి కోసం జిమ్లకు వస్తున్నారు. పెద్దపెద్ద బరువులు ఎత్తి, సిక్స్ప్యాక్, ఎయిట్ ప్యాక్ల కోసం ప్రయాసపడే వారి కన్నా అందమైన బాడీ షేప్లకు వచ్చేవారే ఎక్కువగా ఉంటున్నారు. 60లో 20ల్లా ఉండాలని.. నడియవస్సు వారు సైతం యువకుల్లా కనిపించేందుకు తాపత్రయపడుతున్నారు. జట్టుకు, మీసాలకు రంగులు వేయించడం ఒక్కటే కాదు.. రకరకాల హెయిర్ స్టైల్స్ చేయించుకుంటున్నారు. ఫేస్ప్యాక్ల విషయంలో కూడా రాజీ పడటం లేదు. శుభకార్యానికి వెళ్లాల్సి ఉంటే ముందుగా బ్యూటీ పార్లర్లు, సెలూన్ల వైపు పరుగు తీస్తున్నారు. నడివయస్సులో జిమ్లకు వెళ్లే వారు తక్కువే అయినా ఉదయం నడక, చిన్నచిన్న కసరత్తులతో నాజూకుగా మారిపోతున్నారు. విభిన్నంగా ఉంటేనే గుర్తింపు విభిన్నంగా ఉంటేనే మమ్మల్ని నలుగురూ గుర్తిస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకే హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఐటీ సెక్టార్లో అవకాశాలు పెరిగాక, చాలామంది యువత అందానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. డ్రెస్సింగ్ స్టైల్ వల్ల కూడా మాకు ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్నాయి. – గాదిరాజు హరీష్వర్మ, అంబాజీపేట కొత్త ఫ్యాషన్ నేర్చుకుంటున్నాం మా పెద్దలు సెలూన్లు నిర్వహించేటప్పుడు కటింగ్, గెడ్డం గీయడంతో సరిపోయేది. మహా అయితే ట్రిమ్మింగ్ చేసి, రంగు వేసేవారు. ఇప్పుడు సెలూన్ల నిర్వహణ మొ త్తం మారిపోయింది. కొత్త ఫ్యాషన్లకు అనుగుణంగా హెయిర్ కటింగ్ స్టైల్స్ నేర్చుకుంటున్నాం. ఫేషియల్లో కూడా మార్పులు వస్తున్నాయి. ఒక్కోసారి హైదరాబాద్ వెళ్లి శిక్షణ పొందుతున్నాం. షాపుల్లో కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నాం. – అనిల్కుమార్, సెలూన్ యజమాని, అమలాపురం నాజూకుతనానికి.. ఒకప్పుడు జిమ్లకు ఎక్కువగా బాడీ బిల్డర్లు వచ్చేవారు. కానీ ఇప్పుడు నాజూకుతనం కోసం ఎక్కువ మంది వస్తున్నారు. మజిల్స్, బాడీ కటింగ్ కోసం చిన్నచిన్న కసరత్తులు ఎక్కువగా చేస్తున్నారు. కరోనా తరువాత, యువతలో వస్తున్న ఫ్యాషన్ మార్పుల కారణంగా జిమ్కు వచ్చేవారి సంఖ్య పెరిగింది. – కంకిపాటి వెంకటేశ్వరరావు, హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ కోచ్, అమలాపురం -
కోట్ల ఆస్తిని కేవలం ఒక్కడాలర్కే అమ్మాడు, ఎందుకో తెలుసా?
కోట్ల విలువైన ఆస్తిని ఎవరైనా రూపాయిలకే అమ్ముతారు. ఇదిగో ఈ పెద్ద మనిషి అలాగే అమ్మాడు. కోట్ల విలువైన సెలూన్ షాప్ను తన షాపులో పనిచేసే ఉద్యోగికి కేవలం డాలర్ (ఇండియన్ కరెన్సీలో రూ.74.91)కే అమ్మాడు. ఇటలీకి చెందిన పియస్ 1965లో రోడ్ సైడ్ చిన్న బార్బర్ షాప్ నుంచి ప్రముఖ హెయిర్ సెలూన్ ఓనర్ దాకా ఎదిగారు. ఓవైపు కుటుంబ పోషణ కోసం ఎయిర్ సెలూన్ బిజినెస్ రన్ చేస్తూ.. పార్ట్ టైమ్లో తనకెంతో ఇష్టమైన సివిల్ కాంట్రాక్టర్ గా పనిచేస్తుండేవారు. సరిగ్గా అదే సమయంలో అంటే 15ఏళ్ల క్రితం ఓ రోజు పియస్కు కాథీ మౌరా అనే స్కూల్ విద్యార్ధిని 'అంకుల్ నాకు జాబ్' కావాలని ఫోన్ చేసింది. కాథీ మౌరా స్కూల్ డేస్లో పార్ట్ టైమ్ జాబ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ ఆమె స్కూల్ విద్యార్ధి కావడం, పైగా అనుభవం లేదని చాలా మంది జాబ్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఎక్కడ జాబ్ దొరక్కపోవడంతో కాథీకి ఏం చేయాలో పాలుపోలేదు. చివరికి తాను చదివే స్కూల్కు చెందిన ఓ టీచర్ను తనకు జాబ్ చూడాలని కోరింది. దీంతో సదరు టీచర్ పియస్ ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఆ తరువాత పియుస్ కు కాథీ ఫోన్ చేయడం, పియుస్కు చెందిన హెయిర్ సెలూన్లో జాయిన్ అవ్వడం ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే పియుస్ ఎయిర్ సెలూన్కు కాథీ ఓనర్ అయ్యింది. ఎలా అంటారా? ఈ 15 ఏళ్ల నుంచి కాథీ మౌరా హెయిర్ సెలూన్లో మంచి ఎంప్లాయిగా, హెయిర్ స్టైలిష్గా మంచి పేరు సంపాదించింది. అయితే వయస్సు రిత్యా పియుస్ తన హెయిర్ సెలూన్ను అమ్మాలని అనుకున్నాడు. అది కూడా తన హెయిర్ సెలూన్లో పనిచేసే కాథీకి. కేవలం ఒక్కడాలర్కే. పియుస్ ఇన్నేళ్లు అపురూపంగా చూసుకున్న తన సెలూన్ను కాథీ చేతిలో పెట్టాడు. ఈ సందర్భంగా పియుస్ మాట్లాడుతూ.. 'కాథీ చాలా మంచి అమ్మాయి. పైగా మంచి హెయిర్ స్టైలిష్ట్. 15ఏళ్లు నాతోనే పనిచేసింది. ఆమెకు కృతజ్ఞతగా హెయిర్ సెలూన్ ను అమ్మేశాను'. కానీ ఒక్కడాలర్కే సెలూన్ అమ్మడంపై కాథీ ఒప్పుకోలేదని ప్రశంసించారు. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఉద్యోగిని పట్ల చూపిన ప్రేమపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చదవండి : దేశంలో బంగారం ధరలపై డిస్కౌంట్, తొలిసారి ఇలా -
కరెంట్ బిల్లులు, అద్దె మాఫీ చేయండి..
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న క్షురకులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా నెలన్నర రోజులుగా క్షౌరశాలలను మూసివేయడంతో వృత్తిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ మద్దికుంట లింగం నాయీ ఒక ప్రకటనలో తెలిపారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందన్నారు. క్షౌర వృత్తిదారులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు రూ. 5 వేలు చొప్పున సహాయం అందిస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న రెడ్జోన్లలో 35 వేలకు పైగా క్షౌరశాలలు ఇప్పటికీ మూతపడివున్నాయని వెల్లడించారు. వీటిపై ఆధారపడి జీవిస్తున్న వృత్తిదారుల జీవనం దుర్భరంగా మారిందని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి క్షౌర వృత్తిదారులకు 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వివిధ దేవస్థానాల్లోని కల్యాణ్ కట్టలో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కూడా ఇదే విధంగా తోడ్పాటు అందించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సెలూన్లకు మూడు నెలల పాటు కరెంట్ బిల్లులు, అద్దె మాఫీ చేయాలని లింగం నాయీ డిమాండ్ చేశారు. -
సెలూన్లపై కార్పొరేట్ల కన్ను!
న్యూఢిల్లీ: ఏదో వీధి చివర సెలూనే కదా అని తీసి పారేయకండి. అందానికి మెరుగులు దిద్దే ఈ రంగంలో అందనంత లాభాలున్నాయట!! అందుకే కార్పొరేట్ కంపెనీలిపుడు సెలూన్లపై కన్నేశాయి. బహుళజాతి సంస్థలు పెట్టుబడులతో ముందుకొస్తున్నాయి. తాజాగా ముంబైకి చెందిన చర్మ సంరక్షణ , ఉత్పత్తుల కంపెనీ కాస్మోస్యూటికల్స్ను ఫ్రెంచ్ కాస్మటిక్స్ దిగ్గజం లోరియుల్ కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 30-40 కోట్లు వెచ్చించింది. ఇక ముంబై కేంద్రంగా గల ‘బి:బ్లంట్’ కంపెనీలో గోద్రెజ్ కన్స్యూమర్ 30 శాతం పెట్టుబడి పెట్టింది. బాలీవుడ్ నటుడు, నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ భార్య ఆధునా అఖ్తర్... ఈ బి:బ్లంట్కు సహ యుజవూని. సెలూన్ కంపెనీలకు లాభాలు బాగానే వస్తున్నాయి. దీంతో సేవల్ని విస్తరిస్తే మరిన్ని లాభాలొస్తాయని ఈ కంపెనీలు భావిస్తున్నాయి. అందుకు అవసరమైన పెట్టుబడుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. పీఈ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించేందుకు ప్రవుుఖ హెరుుర్ సెలూన్ చెరుున్ జావేద్ హబీబ్స్ యుత్నిస్తోంది. షహనాజ్ హుస్సేన్ (ఢిల్లీ), ఎన్రిచ్ బ్యూటీ సెలూన్స్ (వుుంబై), వైఎల్జీ (బెంగళూరు) వంటి కంపెనీలకు ఇప్పటికే ప్రైవేట్ ఈక్విటీ నిధులు అందటంతో అవి విస్తరణలో పడ్డాయి. టోనీ అండ్ గయ్, జీన్-క్లాడ్ బిగ్వైన్ వంటి అంతర్జాతీయు సెలూన్ చెరుున్లు కూడా భారతదేశంలో ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. లాక్మే బ్యూటీ సెలూన్స్ (హిందుస్థాన్ యుూనిలీవర్), గ్రీన్ ట్రెండ్స్ (కెవిన్కేర్), కాయు (వూరికో) వంటి హేమాహేమీ ఎఫ్ఎంసీజీ కంపెనీల ఆధ్వర్యంలో నడిచే సెలూన్లు సైతం విస్తరణ బాటలోనే ఉన్నారుు. పరిశ్రవు వర్గాల అంచనా ప్రకారం... సంఘటిత, అసంఘటిత రంగాల్లో సెలూన్ల వార్షిక వ్యాపారం దాదాపు రూ. 12 వేల కోట్లు. ఇది ఏటా 25 శాతానికిపైగా పెరుగుదలను నమోదు చేస్తోంది. ‘గతంలో సగటున 45 రోజులకోసారి సెలూన్కు వచ్చిన ఖాతాదారులు ఇప్పుడు 30 రోజులకే వస్తున్నారు. అలాగే సింగిల్ సర్వీస్ కోసం గంటసేపు సెలూన్లో ఉండే ఖాతాదారులు ఇప్పుడు వుూడు సర్వీసుల కోసం రెండు గంటలుంటున్నారు. అంటే వ్యాపారం బాగా పెరుగుతున్నట్లే...’ అని జీన్-క్లాడ్ బిగ్వైన్ సీఈఓ ధర్మేంద్ర మన్వానీ చెప్పారు. నిత్యం వృద్ధివుుఖమే... సెలూన్కు వెళ్లిరావడవుంటే గతంలో మొక్కుబడి కార్యక్రవుంలా ఉండేది. ప్రస్తుత పరిస్థితి భిన్నం. స్త్రీలతో పాటు పురుషులు కూడా సౌందర్య పోషణకు పెద్ద మొత్తాన్నే ఖర్చు చేస్తున్నారు. ఈ వ్యయుం ఏటేటా పెరుగుతోంది. తద్వారా ఎఫ్ఎంసీజీ కంపెనీలు తవు సౌందర్య ఉత్పత్తులను వూర్కెటింగ్ చేసుకోవడానికి చక్కని అవకాశం ఏర్పడుతోంది. విస్తృతమైన సెలూన్ వూర్కెట్... ఇంకా విస్తరిస్తోంది. వుహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ సెలూన్ బిజినెస్ వృద్ధిచెందుతోంది. - హర్మీందర్ సాహ్ని, వజీర్ అడ్వరుుజర్స్ ఎండీ వూంద్యంలోనూ వుుందుకే... సెలూన్లలో మెనిక్యూర్, పెడిక్యూర్, వాక్సింగ్, థ్రెడింగ్, ఫేషియుల్స్కు 3 వేల నుంచి 6 వేల వరకు ఖర్చవుతుంది. కేశ సంరక్షణ సేవల వ్యయుం వురింత ఎక్కువగా 10 వేల వరకు ఉంటుంది. సౌందర్య పోషణపై ప్రజల్లో ఆసక్తి పెరగడంతో ఎక్కువ ఖర్చుకు వారు వెనుకాడడం లేదు. ఆర్థిక వూంద్యంలోనూ సెలూన్ల వ్యాపారం ఇబ్బడివుుబ్బడిగా వృద్ధిచెందు తూనే వస్తోంది. - అరవింద్, మార్కెటింగ్ హెడ్- మారికో
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
కలల సాకారం కోసం పోరాడితేనే 'స్టార్'
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)
మీ భూములకు జగన్ గ్యారెంటీ.. హిందూపురం సిద్ధం ప్రచారంలో జనసందోహం (ఫొటోలు)
తెలుగులో స్ట్రీమింగ్కు వచ్చేసిన హాలీవుడ్ హిట్ సినిమా
అసభ్య వీడియోల కేసు.. ప్రజ్వల్పై మరో లుక్అవుట్ నోటీసు
RCB vs GT: ఆర్సీబీ జోరు కొనసాగేనా?
ముంబైని ముంచేసిన కేకేఆర్
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
Advertisement