-
బాబాయి గారూ! ఆ చర్యలకు మీరు సిగ్గుపడడం లేదా?
సాక్షి, విజయనగరం : టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్గజపతిరాజుపై మాన్సాస్ ట్రస్ట్ మాజీ చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయనపై మండిపడ్డారు. ‘‘అశోక్ బాబాయి గారూ.. మీ అన్నగారి పుట్టినరోజున ప్రభుత్వ ఉద్యోగి అయిన మాన్సాస్ ఈవోపైకి సిబ్బందిని రెచ్చగొట్టి పంపారు. రక్షణ కోసం మాన్సాస్ ఈవో పరుగులు తీయాల్సిన పరిస్థితి. ఇలాంటి చర్యలకు మీరు సిగ్గుపడడం లేదా?. సిబ్బందిని తప్పుదోవ పట్టించి, రెచ్చగొట్టి ఈవో మీదకు పంపారు. మీ రాజకీయ చదరంగానికి మాన్సాస్ విద్యాసంస్థలను వేదికగా చేసుకోకండి. తాతగారు పీవీజీ రాజుగారు, నాన్నగారు ఆనందగజపతిగారు.. మాన్సాస్ సంస్థలను గొప్పగా తీర్చిదిద్దారు. ఆ వారసత్వాన్ని మీరు ధ్వంసం చేస్తున్నారు’’అని అన్నారు. -
మాన్సాస్ ట్రస్ట్ తీర్పుపై అప్పీళ్లు
సాక్షి, అమరావతి: మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మాన్సాస్) ట్రస్ట్ చైర్పర్సన్గా సంచయిత గజపతిరాజు నియామకం చెల్లదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సంచయిత తరఫున హైకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలయ్యాయి. సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని అభ్యర్థించారు. మొత్తం ఆరు అప్పీళ్లలో రెండు మాత్రమే మంగళవారం విచారణకు రావటాన్ని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సు«ధాకర్రెడ్డి హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో మిగిలిన అప్పీళ్లు కూడా విచారణకు వచ్చేందుకు వీలుగా విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. లింగ వివక్ష తగదని సుప్రీంకోర్టు తీర్పు... దేవదాయ చట్ట నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ జడ్జి తీర్పు ఉందని రాష్ట్ర ప్రభుత్వం తన అప్పీల్లో పేర్కొంది. అంతేకాకుండా లింగ వివక్షను ప్రోత్సహించేలా ఉందని నివేదించింది. లింగం ఆధారంగా ఓ వ్యక్తి నియామకాన్ని ఖరారు చేయడం వివక్ష చూపడమే అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ప్రభుత్వం అప్పీల్లో తెలిపింది. కుటుంబంలో పెద్దవారైన పురుషులు మాత్రమే మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్గా ఉండాలనడం లింగ వివక్ష కిందకే వస్తుందని, ఈ విషయాన్ని సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమయ్యారని పేర్కొంది. వ్యవస్థాపక కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వివాదాలను తేల్చాల్సింది దేవదాయశాఖ ట్రిబ్యునల్ మాత్రమేనని స్పష్టం చేసింది. అశోక్ గజపతిరాజు ట్రిబ్యునల్కు వెళ్లకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయించారని, అందువల్ల సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని అభ్యర్థించింది. టీడీపీ పిటిషన్లు.. మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్గా సంచయితను, మాన్సాస్ వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా సంచయిత, ఊర్మిళ, ఆర్వీ సునీత ప్రసాద్లను నియమిస్తూ గతేడాది ప్రభుత్వం జీవోలను జారీ చేసింది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వంశపారంపర్య చైర్పర్సన్గా సంచయితను నియమిస్తూ మరో జీవో జారీ చేసింది. ఈ మూడు జీవోలను సవాలు చేస్తూ టీడీపీ నేత అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. వీటిపై ఇటీవల విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ వెంకటరమణ ట్రస్ట్ చైర్పర్సన్గా సంచయిత నియామకం, సభ్యులుగా సంచయిత, ఊర్మిళ, సునీతా ప్రసాద్లను నియమిస్తూ జారీ చేసిన జీవోలను రద్దు చేశారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా అశోక్ గజపతిరాజు నియామకం తిరిగి అమల్లోకి వస్తుందని తీర్పు ఇచ్చారు. -
మహిళ కమిషన్ చైర్పర్శన్ను కలిసిన సంచయిత గజపతిరాజు
-
మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన సంచయిత
సాక్షి విశాఖపట్నం: సంచయితపై అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలపట్ల మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా మండిపడ్డారు. మహిళల పట్ల అశోక్ గజపతిరాజు వివక్ష అనాగరికమని అన్నారు. మాన్సాస్ బైలా అంటే సతీ సహగమనం చేయాలా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. మాన్సాస్ ట్రస్ట్ మాజీ చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు బుధవారం మహిళా కమిషన్ను ఆశ్రయించారు. విశాఖలో కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను కలిసి తనకు జరిగిన అన్యాయంపై ఆమె ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా తన నియామకంతో పాటు వారసత్వం అంశాన్ని కించపరిచే రీతిలో అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు చేశారని సంచయిత ఆరోపించారు. సంచయిత ఫిర్యాదుపై వాసిరెడ్డి పద్మ స్పందించారు. అశోక్ గజపతిరాజు రాచరికపు వ్యవస్థలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మాన్సాస్ ట్రస్ట్ బైలా పునః సమీక్షించాలని అన్నారు. సంచయిత విషయంలో అశోక్ చర్చకు సిద్దమా? అని వాసిరెడ్డి పద్మ సవాల్ విసిరారు. చదవండి: ‘విశాఖకు పరిపాలన రాజధాని రావడాన్ని ఎవరూ ఆపలేరు’ అనంతపురం జిల్లాలో ఉద్యాన విప్లవం -
‘విశాఖకు పరిపాలన రాజధాని రావడాన్ని ఎవరూ ఆపలేరు’
సాక్షి, విశాఖపట్నం: దిశ యాప్ మహిళల రక్షణకు వజ్రాయుధం వంటిదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. దిశ యాప్పై సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. విశాఖకు పరిపాలన రాజధాని రావడాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడం ఖాయమని పేర్కొన్నారు. ఎన్నికల హామీ మేరకు అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 98 వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పన దిశలో కార్పొరేషన్ పనిచేస్తోందని ఎంపీ పేర్కొన్నారు. అదే విధంగా సంచయితపై అశోక్గజపతిరాజు చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. విలువైన భూములను అశోక్గజపతిరాజు స్వాహా చేశారని విమర్శించారు. రికార్డులు తారుమారు చేశారని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. విచారణ నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదవండి: AP: సిరులు కురిపిస్తున్న ‘అనంత’ పంటలు ‘చంద్రబాబు మూడు గంటల బ్రేక్ ఫాస్ట్ దీక్ష చేశారు’
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
నాకు ఓటు వేస్తే మోదీకి వేసినట్టే..
జమలాపురం ఆలయంలో ప్రత్యేక పూజలు
దేశంలోనే అత్యధిక మెజారిటీ..
● హైలైట్స్..
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
చింతపండు బస్తాల మధ్య గంజాయి రవాణా..
చికిత్స పొందుతున్న సీపీఎం నాయకుడు మృతి
బీజేపీ మళ్లీ గెలిస్తే ప్రమాదంలో రాజ్యాంగం
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement