-
ఆసీస్ను ఒత్తిడిలోకి నెట్టాం.. మాకూ విజయావకాశాలు వచ్చాయి: సౌతాఫ్రికా కెప్టెన్
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా నిన్న జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేస్తూ తక్కువ స్కోర్ (212) చేసినప్పటికీ.. ఆసీస్కు అంత సులువుగా విజయాన్ని దక్కనీయలేదు. ప్రొటిస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టడమే కాకుండా 48వ ఓవర్ వరకు మ్యాచ్ను తీసుకెళ్లారు. ఆఖర్లో కమిన్స్ (14 నాటౌట్), స్టార్క్ (16 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి ఆసీస్ను విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా ఆసీస్ ఎనిమిదో సారి ప్రపంచకప్ ఫైనల్కు చేరింది. ఆసీస్ చేతిలో పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా ఐదోసారి సెమీస్ గండాన్ని దాటలేక ఇంటిబాట పట్టింది. మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ ఇలా అన్నాడు. మరోసారి సెమీస్లో ఓడినందుకు బాధగా ఉంది. మాటల్లో చెప్పలేను. ముందుగా ఆస్ట్రేలియాకు అభినందనలు. ఫైనల్ కోసం వారికి శుభాకాంక్షలు. వారు ఈ రోజు అద్భుతంగా ఆడారు. మేము బ్యాట్తో, బంతితో ప్రారంభించిన విధానం బాగా లేదు. అక్కడే మ్యాచ్ను కోల్పోయాం. పరిస్థితులకు వారి నాణ్యమైన బౌలింగ్ అటాక్ తోడైంది. దీంతో వారు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేశారు. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోతే భారీ స్కోర్ సాధించడం చాలా కష్టం. అయినా మిల్లర్ (101), క్లాసెన్ (47) అద్భుతంగా ఆడి ఫైటింగ్ టోటల్ను ఇచ్చారు. వరల్డ్కప్ సెమీఫైనల్లో మిల్లర్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడి తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఛేదనలో ఆసీస్కు మంచి ఆరంభం లభించింది. అదే మా కొంపముంచింది. మార్క్రమ్, మహారాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి వారిని ఒత్తిడిలోకి నెట్టారు. మాకూ అవకాశాలు వచ్చాయి. అయితే మేము వాటిని ఒడిసిపట్టుకోలేకపోయాం. కొయెట్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడో యోధుడు. ఇతర సీమర్లతో కాని పనిని కొయెట్జీ ఈ రోజు చేసి చూపించాడు. అతడు తీసిన స్మిత్ వికెట్ నమ్మశక్యంగా లేదు. క్వింటన్ టైటిల్ గెలచి కెరీర్ ముగించాలని కోరుకున్నాడు. దురదృష్టవశాత్తు అలా జరగలేదు. ఫలితం ఎలా ఉన్నా డికాక్ దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజాల్లో ఒకరిగా నిలిచిపోతాడు. -
హార్ధిక్కు ధన్యవాదాలు.. అతడు గాయపడకపోయుంటే షమీ వచ్చేవాడా..?
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా న్యూజిలాండ్తో నిన్న జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్బుత శతకాలతో పాటు మొహమ్మద్ షమీ (9.5-0-57-7) సూపర్ బౌలింగ్తో మెరవడంతో భారత్ తిరుగలేని విజయం సాధించి, నాలుగోసారి ఫైనల్స్కు చేరింది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్ల ఘనత పక్కన పెడితే.. బౌలర్గా షమీ సాధించిన దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. షమీ షంషేర్లా విజృంభించి ఒంటిచేత్తో కివీస్ బ్యాటర్ల భరతం పట్టాడు. ఈ మెరుపులు ఈ ఒక్క మ్యాచ్కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ టోర్నీలో అవకాశం వచ్చిన ప్రతిసారి చెలరేగిపోయాడు. జట్టు సమీకరణల కారణంగా టోర్నీ ఆరంభ మ్యాచ్ల్లో ఆడని షమీ.. బంగ్లాదేశ్తో మ్యాచ్లో హార్ధిక్ పాండ్యా గాయపడటంతో తుది జట్టులోకి వచ్చాడు. వచ్చీ రావడంతోనే న్యూజిలాండ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో 5 వికెట్లతో విజృంభించిన షమీ.. ఆతర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. కేవలం 6 మ్యాచ్ల్లోనే 23 వికెట్లతో లీడింగ్ వికెట్టేకర్గా కొనసాగుతున్నాడు. నిన్నటి మ్యాచ్లో షమీ సాధించిన ఘనత నేపథ్యంలో కొందరు నెటిజన్లు ఆసక్తికర పోస్ట్లు పెడుతున్నారు. హార్ధిక్కు థ్యాంక్స్ చెప్పాలి.. అతను గాయపడటం వల్లే షమీ తుది జట్టులోకి వచ్చాడు.. హార్ధిక్ గాయపడకుండా ఉండివుంటే షమీకి అవకాశం వచ్చేదేనా అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి వీరు చేస్తున్న కామెంట్లలోనూ నిజం లేకపోలేదు. హార్ధిక్ ఫిట్గా ఉండివుంటే షమీకి తుది జట్టులో అవకాశం వచ్చేది కాదు. జట్టు సమీకరణల పేరుతో గతంలో ఏం జరిగిందో అందరికి విధితమే. పేస్ బౌలర్ల కోటాలో బుమ్రా, సిరాజ్ తమతమ స్థానాలపై కర్ఛీఫ్లు వేసుకుని కూర్చున్నారు. హార్దిక్ జట్టులో ఉంటే మూడో పేసర్గా అతడే కొనసాగుతాడు. షమీ అవకాశం దాదాపుగా రాదు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా హార్దిక్ ఉంటే, జట్టు మేనేజ్మెంట్ అదనపు స్పిన్నర్ లేదా బ్యాటర్ వైపే చూస్తుంది. వరల్డ్కప్ ముందు వరకు చాలా మ్యాచ్ల్లో ఇదే జరిగింది. -
CWC 2023 IND VS NZ Semi Final: టాస్ 'ఫిక్స్'..?
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా ముంబై వేదికగా న్యూజిలాండ్తో నిన్న (నవంబర్ 15) జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగో సారి ఫైనల్స్కు చేరింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), శుభ్మన్ (66 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రాహుల్ (20 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో అద్బుతమైన పోరాటపటిమ కనబర్చిన న్యూజిలాండ్ చివరి వరకు గెలుపు కోసం ప్రయత్నించి విఫలమైంది. డారిల్ మిచెల్ (134), విలియమ్సన్ (69), గ్లెన్ ఫిలిప్స్ (41) న్యూజిలాండ్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. వీరు మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటై మెగా టోర్నీ నుంచి మరోసారి రిక్తహస్తాలతో నిష్క్రమించింది. pakistani 😂pic.twitter.com/gfhnpMhBOn — Keh Ke Peheno (@coolfunnytshirt) November 15, 2023 కాగా, కివీస్పై విజయం సాధించి టీమిండియా ఫైనల్స్కు చేరడాన్ని పాకిస్తాన్ అభిమానులు ఎప్పటిలాగే ఓర్వలేకపోతున్నారు. సోషల్మీడియా వేదికగా వారు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. భారత్ ఏం సాధించినా ఇలా బద్నాం చేయడం వారికి పరిపాటిగా మారింది. నిన్నటి మ్యాచ్లో భారత్ అత్యంత కీలకమైన టాస్ గెలవడాన్ని పాకీలు ఇప్పుడు అస్త్రంగా మార్చుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. భారత్, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్ టాస్ ఫిక్సింగ్ అయ్యిందంటూ ఊదరగొడుతున్నారు. భారత్ టాస్ గెలవాలని ముందుగానే డిసైడ్ అయ్యిందంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఓ పాక్ అభిమాని టాస్కు సంబంధించిన వీడియోకు కామెంట్రీ ఇస్తూ.. రోహిత్ శర్మ టాస్ ఎగరేస్తాడని, హిట్మ్యాన్ టాస్ కాయిన్ను దూరంగా విసురుతాడని, రిఫరీ వచ్చి రోహిత్ టాస్ గెలిచినట్లు చెప్పాడని, ఈ విషయం ముందుగానే తెలిసి కేన్ విలియమ్సన్ నవ్వుతున్నాడని కట్టుకథ అల్లాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. దీన్ని ఆధారం చేసుకుని పాకీలు రెచ్చిపోతున్నారు. టీమిండియాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందుకు భారత అభిమానులు కూడా ధీటుగా స్పందిస్తున్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నందుకు పాకీలను ఆడుకుంటున్నారు. -
ఒత్తిడిలోనూ మా వాళ్లు అద్భుతం.. వాళ్లు కూడా బాగా ఆడారు: రోహిత్ శర్మ
ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో గెలుపొంది, నాలుగోసారి వరల్డ్కప్ ఫైనల్కు చేరింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), శుభ్మన్ (66 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రాహుల్ (20 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్ను డారిల్ మిచెల్ (134), విలియమ్సన్ (69), గ్లెన్ ఫిలిప్స్ (41) గెలిపించేందుకు ప్రయత్నించారు. ఓ దశలో వీరు ముగ్గురు టీమిండియాను భయపెట్టారు. అయితే లక్ష్యం పెద్దది కావడంతో చేయాల్సిన ప్రయత్నం చేసి చేతులెత్తేశారు. మిచెల్, విలియమ్సన్, ఫిలిప్స్ మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటై మెగా టోర్నీ నుంచి మరోసారి రిక్తహస్తాలతో నిష్క్రమించింది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇలా అన్నాడు. భారీ ఛేదనలో న్యూజిలాండ్ ఆటగాళ్లు శక్తివంచన లేకుండా ప్రతిఘటించారు. డారిల్ మిచెల్, విలియమ్సన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఓ దశలో వారు మాకు చాలా అవకాశాలు ఇచ్చారు. మేము వాటిని ఒడిసిపట్టుకోవడంలో విఫలమయ్యాం. మాపై ఒత్తిడి ఉండింది. అయినా ప్రశాంతంగా ఉండగలిగాం. బౌలింగ్ విషయానికొస్తే.. మా బౌలర్లందరూ చేయాల్సి ప్రతి ప్రయత్నం చేశారు. షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి సక్సెస్ సాధించాడు. మా టాపార్డర్ బ్యాటింగ్ అద్భుతం. అయ్యర్ సూపర్ టచ్లో ఉన్నాడు. అతని ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది. గిల్, రాహుల్ పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేస్తున్నారు. కోహ్లీ ఎప్పటిలాగే అద్భుతంగా ఆడాడు. తన ట్రేడ్మార్క్ ఇన్నింగ్స్తో చిరస్మరణీయ మైలురాయిని అందుకున్నాడు. మొత్తంగా మా బ్యాటింగ్ సంతృప్తినిచ్చింది. మొదటి తొమ్మిది మ్యాచ్ల్లో (లీగ్ దశ) ఏం చేశామో ఈ మ్యాచ్లోనూ అదే చేయాలనుకున్నాం. అలాగే చేశాం. ఫలితం సాధించాం. చదవండి: -
CWC 2023: టీమిండియాను ఫైనల్కు చేర్చిన రాహుల్, జడేజా.. అదేంటీ..!
క్రికెట్లో క్యాచస్ విన్ మ్యాచస్ అనే నానుడు ఉంది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ 2023 తొలి సెమీఫైనల్లో ఇదే జరిగింది. భారత ఫీల్డర్లు మైదానంలో పాదరసంలా కదిలి అద్భుతమైన క్యాచ్లు పట్టుకుని తమ జట్టు విజయంలో కీలకప్రాత పోషించారు. ముఖ్యంగా వికెట్కీపర్ కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మైదానంలో మెరుపు వేగంగా కదిలి ఏకంగా 7 అద్బుతమైన క్యాచ్లు పట్టుకున్నారు. ఆఖర్లో జడేజా అయితే బంతి గాల్లోకి లేవడమే ఆలస్యం అన్నట్లు మైదానం నలుమూలలా తిరిగి క్యాచ్లు అందున్నాడు. రాహుల్ నేనేమీ తక్కువ కాదన్నట్లు వికెట్ల వెనక పక్షిలా గాల్లో ఎగురుతూ అద్భుతమైన డైవింగ్ క్యాచ్లు పట్టుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్లో వీరికి దక్కాల్సిన గుర్తింపు దక్కలేదని కొందరు అభిమానులు భావిస్తున్నారు. భారత గెలుపులో కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), రోహిత్ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), షమీ (9.5-0-57-7) పాత్ర ఎంత కీలకమో రాహుల్ ,జడ్డూ పాత్ర కూడా అంతే కీలకమని అభిప్రాయపడుతున్నారు. ఫీల్డర్లకు ఎంత గుర్తింపునిస్తే అన్ని అద్భుతాలు చేస్తారని అంటున్నారు. నిన్నటి మ్యాచ్లో ఫీల్డర్ల పాత్ర వెలకట్టలేనిదని కామెంట్లు చేస్తున్నారు. షమీ డ్రాప్ క్యాచ్ (విలియమ్సన్) మినహాయించి, మ్యాచ్ మొత్తం టీమిండియా ఫీల్డర్లు మైదానంలో చిరుతల్లా కదిలారని కితాబునిస్తున్నారు. కాగా, ఉత్కంఠభరితంగా సాగిన నిన్నటి మ్యాచ్లో టీమిండియా కివీస్ను 70 పరుగుల తేడాతో ఓడించి, నాలుగో సారి ప్రపంచకప్ ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్, శుభ్మన్ (66 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), కోహ్లి, శ్రేయస్, రాహుల్ (20 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఏమాత్రం తగ్గకుండా టీమిండియాకు ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది. అయితే లక్ష్యం భారీది కావడంతో కివీస్ బ్యాటర్లు చేయాల్సిన ప్రయత్నం చేసి చేతులెత్తేశారు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడినా 40 ఓవర్ల వరకు టీమిండియాను భయపెట్టింది. డారిల్ మిచెల్ (134) పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజ్లో పాతుకుపోయి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. విలియమ్సన్ (69), గ్లెన్ ఫిలిప్స్ (41) సహకారంతో టీమిండియాకు దడ పుట్టించాడు. లక్ష్యం గనక కాస్త చిన్నది అయ్యుంటే పరిస్థితి వేరేలా ఉండేది. మిచెల్, విలియమ్సన్, ఫిలిప్స్ మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటై మెగా టోర్నీ నుంచి మరోసారి రిక్తహస్తాలతో నిష్క్రమించింది. -
న్యూజిలాండ్తో మ్యాచ్.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా, గెలుపు మనదే?
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా ముంబై వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వాంఖడే పిచ్ తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలించనుండటంతో టాస్ గెలిచిన రోహిత్ రెండో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. India in the World Cup Semi Finals: 2011 - India batted first, won the game. 2015 - India batted second, lost the game. 2019 - India batted second, lost the game. 2023 - India batting first. pic.twitter.com/hbqPkkRgSc — Mufaddal Vohra (@mufaddal_vohra) November 15, 2023 కాగా, వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్స్లో టీమిండియా గత రికార్డును పరిశీలిస్తే ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. గత మూడు ఎడిషన్లలో తొలుత బ్యాటింగ్ చేసిన మ్యాచ్లో టీమిండియా గెలుపొందింది. 2011 ఎడిషన్ సెమీస్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ సెమీస్ గండాన్ని అధిగమించడంతో పాటు ఫైనల్కు చేరి ఏకంగా టైటిల్నే ఎగరేసుకుపోయింది. ఆతర్వాత వరుసగా రెండు ఎడిషన్ల (2015, 2019 సెమీస్లో రెండో బ్యాటింగ్ చేసిన భారత్ ఓటమిపాలై, టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుత వరల్డ్కప్ సెమీస్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తుండటాన్ని భారత అభిమానులు శుభపరిణామంగా పరిగణిస్తున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా తప్పక గెలుస్తుందంటూ చరిత్రను సాక్షిగా చూపిస్తున్నారు. -
CWC 2023: వర్ష సూచన.. సెమీఫైనల్ రద్దైతే ఏమవుతుంది..?
వర్షం కారణంగా వరల్డ్కప్ 2023 సెమీఫైనల్ మ్యాచ్లు రద్దైతే ఏం జరుగుందనే ప్రస్తావన ప్రస్తుతం సోషల్మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య కోల్కతా వేదికగా నవంబర్ 16న జరిగే రెండో సెమీఫైనల్కు వర్షం ముప్పు పొంచి ఉందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ అంశం తెరపైకి వచ్చింది. ఒకవేళ నెట్టింట జరుగుతున్న ప్రచారం నిజమై సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్ రద్దైతే, ఆ మరుసటి రోజు (నవంబర్ 17, రిజర్వ్ డే) మ్యాచ్ను జరిపిస్తారు. ఇక ఆ రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యపడకపోతే మాత్రం లీగ్ దశలో మెరుగైన రన్రేట్ కలిగిన జట్టు ఫైనల్కు చేరుకుంటుంది. ఈ లెక్కన లీగ్ దశలో సౌతాఫ్రికాకు ఆస్ట్రేలియా కంటే మెరుగైన రన్రేట్ ఉంది కాబట్టి సఫారీలు సెమీస్ గండాన్ని గట్టెక్కి ఫైనల్లోకి ప్రవేశిస్తారు. మరోవైపు ఇవాళ (నవంబర్ 15) జరగాల్సిన భారత్-న్యూజిలాండ్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రెండు రోజులు (రిజర్వ్ డే) సాధ్యపడకపోతే అప్పుడు లీగ్ దశలో మెరుగైన రన్రేట్ కలిగిన భారత్ ఫైనల్లోకి అడుగుపెడుతుంది. వర్షం కారణంగా రెండు సెమీస్ మ్యాచ్లు రద్దైతే భారత్-సౌతాఫ్రికా ఫైనల్స్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ అంశం చర్చించుకోవడానికి బాగానే ఉంది కానీ, జరిగే పని మాత్రం కాదు. ఒకవేళ వర్షం కారణంగా షెడ్యూల్ అయిన రోజు మ్యాచ్ జరగకపోయినా, రిజర్వ్ డే రోజైనా తప్పక జరిగే అవకాశం ఉంటుంది. భారత్లో ఇది వర్షాకాలం కాదు కాబట్టి, ఎన్ని అల్పపీడనాలు ఏర్పడినా వాటి ప్రభావం నామమాత్రంగా ఉంటుంది. -
ఫుట్బాల్ను తాకిన క్రికెట్ ఫీవర్.. భారత్-కివీస్ సెమీస్ మ్యాచ్కు విశిష్ట అతిథులు
క్రికెట్ ఫీవర్ యూనివర్సల్ గేమ్ ఫుట్బాల్ను కూడా తాకింది. ఇవాళ జరుగనున్న భారత్,న్యూజిలాండ్ వరల్డ్కప్ సెమీఫైనల్ మ్యాచ్ చూసేందుకు దిగ్గజ ఫుట్బాలర్ డేవిడ్ బెక్హమ్ హాజరుకానున్నాడని తెలుస్తుంది. బెక్హమ్తో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ మ్యాచ్ చూసేందుకు క్యూ కట్టనున్నారని సమాచారం. బాలీవుడ్ స్టార్, చాక్లెట్ బాయ్ రణ్బీర్ కపూర్, తలైవా రజినీకాంత్, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్, ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ భారత్-కివీస్ సెమీస్ మ్యాచ్ చూసేందుకు ముంబైలోని వాంఖడే స్టేడియంకు తరలిరానున్నారని ప్రచారం జరుగుతుంది. బెక్హమ్ విషయానికొస్తే.. ఈ ఇంగ్లండ్ స్టైలిష్ ఫుట్బాలర్, క్రికెట్ పట్ల తనకున్న మక్కువను గతంలో చాలా సందర్భాల్లో చాటుకున్నాడు. అలాగే బెక్హమ్కు ఇండియా అన్న ఈ దేశ క్రికెటర్లన్నా ప్రత్యేకమైన అభిమానం. ఓ సందర్భంలో అతను విరాట్ కోహ్లి పేరు ప్రస్తావించి పొగడ్తలతో ముంచెత్తాడు. ఆటగాడిగా ఫుట్బాల్కు వీడ్కోలు పలికాక పలు క్లబ్లకు కోచ్గా సేవలందించిన బెక్హమ్.. ప్రస్తుతం ఇంటర్ మయామీ ఫుట్బాల్ క్లబ్ కో ఓనర్గా ఉన్నాడు. ఆల్టైమ్ గ్రేట్, అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ లియోనల్ మెస్సీ ప్రస్తుతం ఈ క్లబ్కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. #WATCH | Tamil Nadu: Actor Rajinikanth leaves from Chennai airport to witness the World Cup semi-finals scheduled to be played at Wankhede Stadium in Mumbai. "I am going to see the match..," says Actor Rajinikanth pic.twitter.com/yWg1WpRHXX— ANI (@ANI) November 14, 2023 -
కలవరపెడుతున్న కోహ్లి ట్రాక్ రికార్డు.. పొంచి ఉన్న ప్రమాదం
వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 15) తొలి సెమీఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు పోరాడనున్నాయి. ఈ టోర్నీలో భారత్ తొమ్మిది వరుస విజయాలు సాధించి భీకర ఫామ్లో ఉన్నప్పటికీ.. అండర్ డాగ్స్గా పేరున్న న్యూజిలాండ్ను ఎంతమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మనవాళ్లు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్నప్పటికీ.. కివీస్ను వారిదైన రోజున ఓడించడం అంత తేలక కాదు. మెజార్టీ శాతం సానుకూలతల నడుమ టీమిండియాను ఓ విషయం తెగ కలవరపెడుతుంది. అదేంటంటే.. వరల్డ్కప్ సెమీఫైనల్స్లో కోహ్లికి ఉన్న ట్రాక్ రికార్డు. ప్రస్తుత టోర్నీలో అత్యుత్తమ ఫామ్లో ఉండి లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతూ దాదాపు ప్రతి మ్యాచ్లో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన కోహ్లి వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్ అనగానే చతికిలబడతాడు. ఇప్పటివరకు కోహ్లి ఆడిన మూడు ప్రపంచకప్ సెమీఫైనల్స్లో ఇదే జరిగింది. మూడు సెమీఫైనల్స్లో కలిపి కోహ్లి చేసింది కేవలం 11 పరుగులు మాత్రమే. 2011 ఎడిషన్లో పాక్తో జరిగిన సెమీస్లో 9 పరుగులు చేసిన కోహ్లి.. 2015లో ఆ్రస్టేలియాతో జరిగిన సెమీస్లో ఒక్క పరుగు.. అనంతరం 2019 ఎడిషన్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీస్లో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఈ మూడు సెమీఫైనల్స్లో కోహ్లి ఎడంచేతి వాటం పేస్ బౌలర్ల (వహాబ్ రియాజ్, మిచెల్ జాన్సన్, ట్రెంట్ బౌల్ట్) చేతిలోనే ఔట్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఇవాల్టి మ్యాచ్లో కోహ్లికి ట్రెంట్ బౌల్ట్ నుంచి మరోసారి ప్రమాదం పొంచి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలే కోహ్లికి బౌల్ట్ బౌలింగ్లో ట్రాక్ రికార్డు అంతంతమాత్రంగా ఉంది. దీనికి తోడు సెమీఫైనల్ ఒత్తిడి ఉండనే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కోహ్లి ఏమేరకు రాణించగలడో అని భారత అభిమానులు కలవరపడుతున్నారు. ఈ అంశం యావత్ భారత దేశాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. -
CWC 2023 IND VS NZ Semi Final: ఏకైక మొనగాడు విరాట్ కోహ్లి..!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి అరుదైన గుర్తింపు దక్కనుంది. వన్డే వరల్డ్కప్లో అత్యధికసార్లు సెమీస్ ఆడిన భారత ఆటగాడిగా విరాట్ రికార్డుల్లోకెక్కనున్నాడు. 2023 వరల్డ్కప్లో భాగంగా న్యూజిలాండ్తో ఇవాళ (నవంబర్ 15) జరుగనున్న సెమీఫైనల్లో ఆడటం ద్వారా విరాట్ ఈ రేర్ ఫీట్ను సాధించనున్నాడు. 35 ఏళ్ల విరాట్ తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో నాలుగోసారి (2011, 2015, 2019, 2023) వన్డే సెమీఫైనల్ మ్యాచ్ ఆడనున్నాడు. ఏ భారత ఆటగాడు నాలుగుసార్లు వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్స్ ఆడలేదు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (1996, 2003, 2011), ధోని (2011, 2015, 2019) మూడుసార్లు చొప్పున వరల్డ్కప్ సెమీఫైనల్స్ ఆడారు. మొత్తంగా భారత్ 8 వన్డే సెమీఫైనల్స్ ఆడగా విరాట్ నాలుగింట భాగం కావడం విశేషం. ఇక భారత్ ఆడిన సెమీఫైనల్స్ విషయానికొస్తే.. ఇప్పటిదాకా మొత్తం 13 వన్డే ప్రపంచకప్లు (ప్రస్తుత వరల్డ్కప్తో కలుపుకుని) జరగ్గా భారత్ ఎనిమిదింట సెమీస్కు చేరింది. ఇందులో మూడుసార్లు (1983లో ఇంగ్లండ్పై, 2003లో కెన్యాపై, 2011లో పాకిస్తాన్పై) నెగ్గి ఫైనల్స్కు చేరగా.. నాలుగుసార్లు (1987లో ఇంగ్లండ్ చేతిలో, 1996లో శ్రీలంక చేతిలో, 2015లో ఆ్రస్టేలియా చేతిలో, 2019లో న్యూజిలాండ్ చేతిలో) ఓటమి పాలైంది. భారత్ ఫైనల్స్కు చేరిన మూడు సందర్భాల్లో రెండుసార్లు (1983, 2011) విజేతగా, ఓసారి (2003) రన్నరప్గా నిలిచింది. -
ధైర్యవంతులకే అదృష్టం కూడా అండగా నిలుస్తుంది: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
వన్డే వరల్డ్కప్ 2023లో ఇవాళ (నవంబర్ 15) అత్యంత కీలక సమరం జరుగనుంది. ముంబై వేదికగా జరుగనున్న తొలి సెమీఫైనల్లో భారత్,న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు సంబంధించి ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. ఇరు జట్లు వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇక బరిలోకి దిగడమే తరువాయి. మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. మరి ఏ జట్టు గెలుస్తుందో, ఏ జట్టు ఓడి ఇంటిబాట పడుతుందో తేలాలంటే మరి కొద్ది గంటలు వేచి చూడాలి. మ్యాచ్కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మ్యాచ్కు సంబంధించిన పలు విషయాలు మాట్లాడారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ధైర్యవంతులకే అదృష్టం కూడా అండగా నిలుస్తుంది. మేం ఇప్పుడు పూర్తి నమ్మకంతో, ధైర్యంతో బరిలోకి దిగుతున్నాం. ఇలాంటప్పుడే కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. టోర్నీలో తొలి ఐదు మ్యాచ్లలో మేం లక్ష్యాన్ని ఛేదించగా, తర్వాతి నాలుగు మ్యాచ్లలో ముందుగా బ్యాటింగ్ చేశాం. కాబట్టి అన్ని రకాలుగా మమ్మల్ని మేం పరీక్షించుకున్నట్లే. వాటితో పోలిస్తే ఈ మ్యాచ్ ప్రాధాన్యత ఏమిటో మాకు తెలుసు. అయినా సరే మేం ఏమీ కొత్తగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎలా ఆడామో అలా ఆడితే చాలు. ఒత్తిడి కొత్త కాదు. ప్రపంచకప్లో సెమీస్ అయినా లీగ్ మ్యాచ్ అయినా ఒత్తిడి ఎలాగూ ఉంటుంది. భారత క్రికెటర్లపై ఇది మరీ ఎక్కువ. ఆటగాళ్లంతా ఆ స్థితిని దాటుకునే వచ్చారు కాబట్టి బాగా ఆడటమే అన్నింటికంటే ముఖ్యం. న్యూజిలాండ్ ఎంతో తెలివైన, క్రమశిక్షణ కలిగిన జట్టు. ప్రత్యర్ధిని బాగా అర్థం చేసుకొని తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటారు. 1983లో భారత్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు ప్రస్తుత జట్టులో ఎవ్వరూ పుట్టనే లేదు. 2011లో సగం మంది క్రికెట్ మొదలు పెట్టలేదు. కాబట్టి ఈ జట్టు సభ్యులంతా గతం గురించి కాకుండా వర్తమానంపై, తమ ఆటపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. గతంలో నాకౌట్ మ్యాచ్లలో, నాలుగేళ్ల క్రితం ఏం జరిగిందనేది కూడా మాకు అనవసరమని అన్నాడు. చదవండి: భారత్తో మ్యాచ్ మాకు పెద్ద సవాల్.. మేం వాటికి అలవాటుపడిపోయాం: విలియమ్సన్ -
భారత్తో మ్యాచ్ మాకు పెద్ద సవాల్.. మేం వాటికి అలవాటుపడిపోయాం: విలియమ్సన్
వన్డే వరల్డ్కప్ 2023 చివరి దశకు చేరుకుంది. సెమీఫైనల్స్, ఫైనల్ మాత్రమే మిగిలి ఉన్నాయి. నవంబర్ 19న జరిగే ఫైనల్తో విజేత ఎవరో తేలిపోతుంది. ముంబై వేదికగా ఇవాళ (బుధవారం) జరిగే తొలి సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. లీగ్ దశలో అజేయ జట్టుగా నిలిచిన భారత్.. అండర్ డాగ్స్గా పేరున్న న్యూజిలాండ్పై ఏమేరకు రాణించగలదో వేచి చూడాలి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే వ్యూహరచనలన్నిటినీ పూర్తి చేసుకున్నాయి. ఇక బరిలోకి దిగడమే తరువాయి. ఈ కీలక సమరానికి ముందు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన వాయిస్ను వినిపించాడు. విలియమ్సన్ ఏమన్నాడంటే.. భారత్తో మ్యాచ్ మాకు పెద్ద సవాల్ అనేది వాస్తవం. ఆ టీమ్ చాలా బాగా ఆడుతోంది. అయితే టోర్నీలో ప్రతీ మ్యాచ్ భిన్నమైందే. తమదైన రోజున ఏ జట్టయినా ఎలాంటి జట్టునైనా ఓడించగలదు. జట్టు బలంతో పాటు అప్పటి పరిస్థితులు, వాటి ప్రభావం కూడా అందుకు కారణమవుతాయి. లీగ్లో ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చామన్నది ముఖ్యం కాదు. నాకౌట్ దశను మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సిందే. వరుసగా గత రెండు వరల్డ్ కప్లలో మేం ఫైనల్ చేరినా మమ్మల్ని ఇంకా అండర్డాగ్స్గానే చూస్తుంటారు. మేం వీటికి అలవాటుపడిపోయాం కాబట్టి ఇబ్బందేమీ లేదు. మా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే ఇక్కడా గెలవగలం కాబట్టి ఏదైనా జరగొచ్చు. 2019లాగే ఈసారి కూడా మైదానంలో అంతా భారత అభిమానులే ఉంటారు. మాకు మద్దతు పలకకపోయినా ఆ వాతావరణం మాత్రం చాలా బాగుంటుంది. మా జట్టులో చాలా మందికి ఇది అలవాటే. అయినా భారత గడ్డపై భారత్తో సెమీస్లో తలపడటమే ఎంతో ప్రత్యేకం. -
CWC 2023 Semi Final: టీమిండియా జోరుకు కివీస్ అడ్డుకట్ట వేయగలదా..?
వన్డే వరల్డ్కప్ 2023లో తొమ్మిది వరుస విజయాలు సాధించి లీగ్ దశలో అజేయ జట్టుగా నిలిచిన భారత్.. బుధవారం జరుగబోయే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత వరల్డ్కప్లో ఇదివరకే (లీగ్ దశలో) న్యూజిలాండ్ను ఓసారి ఖంగుతినిపించిన భారత్ మరో విజయంపై ధీమాగా ఉంది. కివీస్ సైతం ప్రస్తుత వరల్డ్కప్లో భారత్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. బ్యాటింగ్కు స్వర్గధామం.. భారత్, న్యూజిలాండ్ మ్యాచ్కు వేదిక అయిన వాంఖడే మైదానం అనాదిగా బ్యాటింగ్కు అనుకూలిస్తూ వస్తుంది. రేపు జరుగబోయే సెమీస్ మ్యాచ్లోనూ పరుగుల వరద పారడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్టేడియం చిన్నది కావడంతో బ్యాటర్లు అవలీలగా ఫోర్లు, సిక్సర్లు బాదగలరు. ఈ పిచ్పై మరోసారి భారీ స్కోర్ నమోదు కావడం ఖాయం. ఇదే పిచ్పై శ్రీలంకతో జరిగిన లీగ్ దశ మ్యాచ్లో భారత్ బ్యాటర్లు పేట్రేగిపోయారు. ఆ మ్యాచ్లో భారత్ 357 పరుగులు చేసి, శ్రీలంకను 55 పరుగులకే ఆలౌట్ చేసింది. ఫలితంగా 302 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ అత్యంత కీలకం.. ఈ మ్యాచ్లో టాస్ కీలకపాత్ర పోషించనుంది. వాంఖడే పిచ్ తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు పూర్తి స్థాయిలో అనుకూలించనుండటంతో టాస్ గెలిచిన జట్టు తప్పక బ్యాటింగ్ ఎంచుకుంటుంది. భారత్దే పైచేయి.. గతంలో ఇరు జట్ల మధ్యలో జరిగిన మ్యాచ్ల్లో జయాపజయాలను పరిశీలిస్తే.. న్యూజిలాండ్పై భారత్ స్వల్ప ఆధిక్యత కలిగి ఉంది. ఇరు జట్లు గతంలో 117 సందర్భాల్లో ఎదురెదురుపడగా భారత్ 59, న్యూజిలాండ్ 50 మ్యాచ్ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్ టై కాగా.. ఏడు మ్యాచ్లు ఫలితం తేలకుండా ముగిసాయి. వరల్డ్కప్లో కివీస్దే ఆధిక్యత.. వరల్డ్కప్ విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు తొమ్మిది సార్లు ఎదురెదురుపడగా.. న్యూజిలాండ్ 4, భారత్ 5 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. సెమీస్లో వరుసగా రెండోసారి.. భారత్, న్యూజిలాండ్ జట్లు వరల్డ్కప్ సెమీఫైనల్లో వరుసగా రెండోసారి తలపడుతున్నాయి. 2019 ఎడిషన్లో ఈ ఇరు జట్లు తొలిసారి సెమీఫైనల్లో ఎదురెదురుపడ్డాయి. ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ భారత్ను 21 పరుగుల తేడాతో ఓడించింది. ఇరు జట్ల బలాలు, బలహీనతలు.. ప్రస్తుత వరల్డ్కప్లో ఫామ్ను బట్టి చూస్తే, న్యూజిలాండ్ కంటే టీమిండియా చాలా పటిష్టంగా కనిపిస్తుంది. భారత్ అన్ని విభాగాల్లో న్యూజిలాండ్ కంటే మెరుగ్గా ఉంది. భారత బ్యాటింగ్ విభాగంలో ప్రతి ఒక్కరూ సూపర్ టచ్లో ఉన్నారు. బౌలింగ్, ఫీల్డింగ్లోనూ టీమిండియాకు తిరుగులేదు. ఓవరాల్గా చూస్తే, ప్రస్తుతం భారత్ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుంది. జట్టులోని ఆటగాళ్లంతా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. ఈ ఊపులో భారత్ టైటిల్ గెలవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. న్యూజిలాండ్ విషయానికొస్తే.. టోర్నీ ఆరంభంలో వరుస విజయాలు సాధించి, ఆతర్వాత ఒక్కసారిగా పరాజయాల బాటపట్టిన న్యూజిలాండ్, ఆఖరి లీగ్ మ్యాచ్లో శ్రీలంకపై గెలిచి సెమీస్కు చేరింది. అంతంతమాత్రం ప్రదర్శనతో సెమీస్కు చేరిన కివీస్ను గాయాల సమస్య ప్రధానంగా వేధిస్తుంది. మొన్నటి దాకా కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టుకు దూరంగా ఉన్నాడు. అతని గైర్హాజరీలోనే న్యూజిలాండ్ వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓడింది. సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీ గాయంపాలై, ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించాడు. మరోవైపు ఆల్రౌండర్ జేమ్స్ నీషమ్ ఇప్పటికీ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. గాయాల బెదడతో పాటు న్యూజిలాండ్ను నిలకడలేమి కూడా వేధిస్తుంది. రచిన్ రవీంద్ర, అడపాదడపా డారిల్ మిచెల్ మినహా జట్టులోని ఆటగాళ్లంతా తరుచూ విఫలమవుతున్నారు. వీరిలో విలియమ్సన్ కాస్త పర్వాలేదనిపిస్తున్నాడు. బౌలింగ్ విభాగం వరకు న్యూజిలాండ్ పటిష్టంగా కనిపిస్తుంది. బౌల్ట్, ఫెర్గూసన్, సాంట్నర్ మంచి ఫామ్లో ఉన్నారు. ఓపెనర్ కాన్వే వైఫల్యాలు కివీస్ను కలవరపెడుతున్నాయి. -
CWC 2023: లీగ్ దశ ముగిసాక పరిస్థితి ఇది.. విరాట్, జంపా టాప్లో..!
భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్తో వన్డే వరల్డ్కప్ 2023 రౌండ్ రాబిన్ (లీగ్) దశ మ్యాచ్లు ముగిసాయి. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్కు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. బుధవారం (నవంబర్ 15) జరిగే తొలి సెమీఫైనల్లో (ముంబై) నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ను ఎదుర్కొంటుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన సౌతాఫ్రికా.. నవంబర్ 16న జరిగే రెండో సెమీఫైనల్లో (కోల్కతా) మూడో స్థానంలో ఉన్న జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. అనంతరం ఈ రెండు సెమీస్లో గెలిచే జట్లు అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. లీడింగ్ రన్ స్కోరర్గా విరాట్.. రౌండ్ రాబిన్ దశ మ్యాచ్లు ముగిసాక టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ దశలో విరాట్ 9 మ్యాచ్లు ఆడి 2 శతకాలు, 5 అర్ధశతకాల సాయంతో 99 సగటున 594 పరుగులు చేశాడు. ఈ జాబితాలో డికాక్ (9 మ్యాచ్ల్లో 591 పరుగులు), రచిన్ రవీంద్ర (9 మ్యాచ్ల్లో 565 పరుగులు), రోహిత్ శర్మ (9 మ్యాచ్ల్లో 503 పరుగులు), డేవిడ్ వార్నర్ (9 మ్యాచ్ల్లో 499 పరుగులు) టాప్-5లో ఉన్నారు. లీగ్ దశలో డికాక్ 4 సెంచరీలతో టాప్లో ఉండగా.. రచిన్ 3, విరాట్, వార్నర్, డస్సెన్, మిచెల్ మార్ష్, మ్యాక్స్వెల్ తలో 2 సెంచరీలు చేశారు. టాప్లో జంపా.. రౌండ్ రాబిన్ దశ మ్యాచ్లు ముగిసాక ఆసీస్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. జంపా 9 మ్యాచ్ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో మధుషంక (9 మ్యాచ్ల్లో 21 వికెట్లు), షాహీన్ అఫ్రిది (9 మ్యాచ్ల్లో 18 వికెట్లు), గెరాల్డ్ కొయెట్జీ (7 మ్యాచ్ల్లో 18 వికెట్లు), జస్ప్రీత్ బుమ్రా (9 మ్యాచ్ల్లో 17 వికెట్లు) టాప్-5లో నిలిచారు. భారత బౌలర్లు జడేజా (9 మ్యాచ్ల్లో 16 వికెట్లు), షమీ (5 మ్యాచ్ల్లో 16 వికెట్లు) ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నారు. -
CWC 2023: పాక్ సెమీస్కు చేరి భారత్తో తలపడాలంటే ఇలా జరగాలి..
ప్రస్తుత వన్డే ప్రపంచకప్లో భారత్, పాక్లు మరోసారి (సెమీస్లో) తలపడే అవకాశాలు మినుకుమినుకుమంటున్నాయి. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో వరుణుడి కటాక్షంతో గట్టెక్కి,సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్న పాక్, తమ తదుపరి మ్యాచ్లో ఇంగ్లండ్పై భారీ తేడాతో నెగ్గితే సెమీస్కు చేరే ఛాన్స్ ఉంటుంది. పాక్ సెమీస్కు చేరి, భారత్తో తలపడాలంటే ఈ ఈక్వేషన్తో పాటు మరో రెండు ఈక్వేషన్స్ వర్కౌట్ అవ్వాల్సి ఉంటుంది. అవేంటంటే.. న్యూజిలాండ్ శ్రీలంక చేతిలో ఓడాలి. అలాగే ఆఫ్ఘనిస్తాన్ తమ తదుపరి మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో ఓడాలి. ఇలా జరిగితే పాక్ 10 పాయింట్లతో నాలుగో జట్టుగా సెమీస్కు అర్హత సాధిస్తుంది. అప్పుడు పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న భారత్.. నాలుగో ప్లేస్లో ఉన్న పాక్ సెమీస్లో తలపడతాయి. అయితే ఇలా జరగడం అంత ఈజీ కూడా కాకపోవచ్చు. ఒకవేళ పాక్.. ఇంగ్లండ్పై గెలచి, మరోపక్క న్యూజిలాండ్.. శ్రీలంకను మట్టికరిపిస్తే అప్పుడు ఈ ఇరు జట్లలో మెరుగైన రన్రేట్ కలిగిన జట్టు సెమీస్కు చేరుకుని భారత్తో తలపడుతుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాల్లో ఏదో ఒక జట్టుపై భారీ తేడాతో గెలిచినా ఆ జట్టు కూడా సెమీస్ రేసులో నిలుస్తుంది. ఏ ఇబ్బంది లేకుండా పాక్ సెమీస్కు చేరాలంటే ఆ జట్టు ఇంగ్లండ్పై విజయం సాధించి, న్యూజిలాండ్ శ్రీలంక చేతిలో ఓడి, ఆఫ్ఘనిస్తాన్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో ఓడితే సరిపోతుంది. కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు ఇదివరకే ఎలిమినేషన్కు గురి కాగా.. భారత్, సౌతాఫ్రికా జట్లు సెమీస్కు అర్హత సాధించాయి. సెమీస్ రేసులో మూడు, నాలుగు స్థానాల కోసం ఆసీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పోటీ నడుస్తుంది. -
WC 2023: ప్రపంచకప్ చరిత్రలో ఇదే తొలిసారి.. అయినా పాక్ సెమీస్ చేరే ఛాన్స్! ఎలా?
ICC WC 2023- Pakistan Semis Chances Still Alive?: వన్డే వరల్డ్కప్-2023 ఆరంభానికి ముందు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా భావించిన పాకిస్తాన్.. ఇప్పుడు కనీసం సెమీస్ చేరుతుందా లేదా అన్న స్థాయికి పడిపోయింది. ప్రపంచకప్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోయి.. విమర్శలు మూటగట్టుకుంటోంది. ఉప్పల్లో వరుస విజయాలు వన్డే ప్రపంచకప్ 13వ ఎడిషన్లో తొలుత పసికూన నెదర్లాండ్స్తో తలపడింది బాబర్ ఆజం బృందం. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 81 పరుగుల తేడాతో గెలుపొంది.. ఐసీసీ టోర్నీలో శుభారంభం చేసింది. ఆ తర్వాత అదే వేదికపై శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించి సత్తా చాటింది. ఎప్పుడైతే దాయాది టీమిండియా చేతిలో పాక్ చిత్తైందో అప్పటి నుంచి జట్టు రాత మారిపోయింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చరిత్రను పునరావృతం చేస్తూ భారత జట్టు పాకిస్తాన్ను 8వసారి మట్టికరిపించింది. టీమిండియా దెబ్బ తర్వాత అన్నీ ఓటములే సొంతగడ్డపై చిరకాల ప్రత్యర్థిని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి మరోసారి ఆధిపత్యం చాటుకుంది. ఇది మొదలు.. టీమిండియాతో మ్యాచ్ తర్వాత పాకిస్తాన్కు వరుసగా ఓటములే ఎదురయ్యాయి. చెపాక్లో ఘోర పరాభవాలు.. ఎన్నడూ లేని విధంగా బెంగళూరులో ఆస్ట్రేలియా చేతిలో 62 పరుగుల తేడాతో ఓడిన బాబర్ బృందం.. వన్డే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి అఫ్గనిస్తాన్ ముందు కూడా తలవంచింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మరీ దారుణంగా 8 వికెట్ల తేడాతో అఫ్గన్ భంగపాటుకు గురైంది. ఈ క్రమంలో సెమీస్ రేసులో నిలవాలంటే సౌతాఫ్రికాతో తప్పక గెలవాల్సిన మ్యాచ్లోనూ సీన్ రిపీట్ అయింది. చెపాక్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న మ్యాచ్లో అదృష్టం సౌతాఫ్రికాను వరించడంతో పాకిస్తాన్కు మరో ఓటమి తప్పలేదు. ఈ శతాబ్దంలో వరల్డ్కప్లో పాక్ తొలిసారి సఫారీల చేతిలో పరాజయం పాలైంది. దీంతో సెమీస్ ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగానే! అయితే, సాంకేతికంగా పాకిస్తాన్ ఇంకా రేసులో ఉన్నట్లే! ఎలా అంటే.. ఈ టోర్నీలో పాకిస్తాన్కు ఇంకా మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ మేరకు బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్తో జరుగనున్న మ్యాచ్లలో పాక్ భారీ విజయాలు సాధించి రన్రేటును మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. తద్వారా పాకిస్తాన్ ఖాతాలో 10 పాయింట్లు చేరతాయి. అయినప్పటికీ నేరుగా సెమీస్ చేరే ఛాన్స్ ఉండదు. ఇందుకోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పటికే సౌతాఫ్రికా(భారీ రన్రేటు), టీమిండియా 10 పాయింట్లో పట్టికలో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆ మ్యాచ్ ఫలితాలపై ఆధారపడిన పాక్ భవితవ్యం న్యూజిలాండ్ 8, ఆస్ట్రేలియా 6 పాయింట్లతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మిగిలిన మ్యాచ్లన్నింటి(ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాక్, శ్రీలంక)లో ఓడిపోతే.. కేవలం ఎనిమిది పాయింట్లతో ఉంటుంది. అప్పుడు పాక్కు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అదే విధంగా.. ఆస్ట్రేలియా కూడా తమకు మిగిలిన నాలుగు మ్యాచ్లలో మూడు ఓడిపోతే పాక్కు ఛాన్స్ ఉంటుంది. తమ తదుపరి మ్యాచ్లలో ఆసీస్ న్యూజిలాండ్, ఇంగ్లండ్ చేతిలో ఓడి.. బంగ్లాదేశ, అఫ్గనిస్తాన్లలో ఏదో ఒకదానిపై గెలిచినా 8 పాయింట్లకే పరిమితం అవుతుంది కాబట్టి ఈ అవకాశం పాక్కు దక్కుతుంది. ఇంతదాకా తెచ్చుకోవడం ఎందుకు? చూద్దాం అలా కాక కేవలం న్యూజిలాండ్, ఇంగ్లండ్ చేతిలో కంగారూలు ఓడి అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్లపై గెలుపొందితే.. పాకిస్తాన్తో పాటు రన్రేటుతో పోటీపడాల్సి ఉంటుంది. ఇదేమీ కాకుండా ఆసీస్ మూడూ గెలిచినా.. న్యూజిలాండ్ రెండు, సౌతాఫ్రికా, టీమిండియా తమకు మిగిలిన మ్యాచ్లలో కనీసం రెండు గెలుపొందినా పాక్ ఇంటిబాటపట్టాల్సిందే! అదీ సంగతి.. గత నాలుగు మ్యాచ్లలో ఒక్కటి గెలిచినా పాకిస్తాన్కు ఈ పరిస్థితి దాపురించేది కాదు! కెప్టెన్ బాబర్ ఆజం అన్నట్లు ఏం జరుగుతుందోనంటూ పాక్ అభిమానులు వేచి చూడాల్సిందే. చదవండి: అంతా తెలిసే చేశావంటే నిన్నేమనుకోవాలి? అతడి రాతే అంత.. ఎప్పుడూ ఇలాగే! View this post on Instagram A post shared by ICC (@icc) -
పీవీ సింధు ఓటమి.. సెమీస్కు చేరిన లక్ష్యసేన్
భారత స్టార్ షెట్లర్ లక్ష్యసేన్ తన జోరును కొనసాగిస్తున్నాడు. ఇటీవలే కెనడా ఓపెన్ను గెలిచి దూకుడు మీదున్న లక్ష్యసేన్ మరో టైటిల్ గెలిచేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచాడు. యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భాగంగా లక్ష్యసేన్ సెమీస్లో అడుగుపెట్టాడు. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో మన దేశానికే చెందిన శంకర్ ముత్తుస్వామిపై 21-10, 21-17తో వరుస గేముల్లో గెలిచిన లక్ష్యసేన్ సెమీస్కు చేరుకున్నాడు. మరోవైపు తెలుగు తేజం పీవీ సింధు మాత్రం క్వార్టర్స్లోనే తన పోరాటాన్ని ముగించింది. క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన గావో ఫాంగ్ జీ చేతిలో 22-20, 21-13తో సింధు ఓటమి పాలయ్యింది. ప్రపంచ 36వ ర్యాంకర్ అయిన గావో ఫాంగ్ జీ తొలి గేమ్ను గెలవడానికి కష్టపడినప్పటికి.. రెండో గేమ్ను మాత్రం సులువుగానే నెగ్గింది. చదవండి: #BAN Vs AFG: ఈజీగా గెలవాల్సిన మ్యాచ్.. చచ్చీ చెడీ చివరకు #ViratKohli: ఆనందంతో చిందులు.. లోకం సంగతి మైమరిచిన కోహ్లి -
5 వికెట్లతో చెలరేగిన వైశాక్..! పుజారా జట్టుకు ఓటమి తప్పదా?!
Duleep Trophy 2023- South Zone vs North Zone, 2nd Semi-Final- బెంగళూరు: సౌత్జోన్ సీమర్ వైశాక్ విజయ్కుమార్ (5/76) నిప్పులు చెరిగే బౌలింగ్తో నార్త్జోన్ను కూల్చేశాడు. దీంతో దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో నార్త్జోన్ రెండో ఇన్నింగ్స్లో 56.4 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 51/2తో శుక్రవారం మూడో రోజు ఆట కొనసాగించిన నార్త్ జట్టు 160 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ప్రభ్సిమ్రాన్ సింగ్ (63; 11 ఫోర్లు), హర్షిత్ రాణా (38; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. మూడు పరుగుల స్వల్ప ఆధిక్యంతో కలిపి నార్త్ జట్టు సౌత్ జట్టుకు 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా... ఆట ముగిసే సమయానికి సౌత్జోన్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. ఆఖరి రోజు విజయానికి 194 పరుగుల దూరంలో ఉంది. పుజారా శతకం సెంట్రల్ జోన్తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో చతేశ్వర్ పుజారా (133; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదంతొక్కగా, సూర్యకుమార్ యాదవ్ (52; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. దీంతో వెస్ట్ భారీ లక్ష్యంవైపు దూసుకెళుతోంది. ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్లకు 292 పరుగులు చేసింది. సౌరభ్ 4, సారాంశ్ 3 వికెట్లు తీశారు. ప్రస్తుతం వెస్ట్ 384 పరుగుల ఆధిక్యంలో ఉంది. వర్షం కారణంగా చివరి రోజు ఆట సాధ్యంకాకుండా మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో వెస్ట్ జోన్ జట్టుకు ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. చదవండి: బజ్బాల్ ఆట చూపించాడు.. అరుదైన రికార్డు కొల్లగొట్టాడు -
సెమీస్కు దూసుకెళ్లిన వరల్డ్ నెంబర్వన్ స్వియాటెక్
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో మహిళల టెన్నిస్ నెంబర్వన్ ఇగా స్వియాటెక్ సెమీస్కు దూసుకెళ్లింది. హ్యాట్రిక్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్పై కన్నేసిన స్వియాటెక్ దానిని సొంతం చేసుకోవడానికి మరో రెండడుగుల దూరంలో ఉంది. బుధవారం క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ అమెరికాకు చెందిన కోకో గాఫ్పై 6-4, 6-2 వరుస సెట్లలో ఓడించింది. మ్యాచ్లో ఒక ఏస్ సందించిన స్వియాటెక్ నాలుగు బ్రేక్ పాయింట్స్ సాధించగా.. రెండు ఏస్లు సందించడంతో పాటు రెండు డబుల్ ఫాల్ట్స్ చేసిన కోకో గాఫ్ ఒకే ఒక్క బ్రేక్ పాయింట్ సాధించింది. మరో క్వార్టర్స్లో బ్రెజిల్కు చెందిన హదాద్ మయియా .. ట్యునిషియాకు చెందిన జెబర్పై 3-6, 7-6,6-1తో గెలుపొంది సెమీస్లో అడుగుపెట్టింది. గురువారం జరగనున్న సెమీస్లో బ్రెజిల్కు చెందిన హదాద్ మయియాతో స్వియాటెక్ తలపడనుంది. Back to the semis 👋#RolandGarros | @iga_swiatek pic.twitter.com/PsCZygZWim — Roland-Garros (@rolandgarros) June 7, 2023 Feeling the love ❤️#RolandGarros | @iga_swiatek pic.twitter.com/spBvtHqExx — Roland-Garros (@rolandgarros) June 7, 2023 చదవండి: 'పదేళ్లుగా మేజర్ టైటిల్ లేదు.. ఇంత బద్దకం అవసరమా?' -
మహిళల టీ20 వరల్డ్కప్.. సెమీఫైనల్స్లో ఎవరెవరు తలపడబోతున్నారంటే..?
8వ మహిళల టీ20 వరల్డ్కప్ చివరి దశకు చేరింది. గ్రూప్-1 నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా.. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, భారత్ జట్లు సెమీఫైనల్కు చేరుకున్నాయి. ఫిబ్రవరి 23న జరిగే తొలి సెమీఫైనల్లో గ్రూప్-1 టాపర్ ఆస్ట్రేలియా.. గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిచిన టీమిండియాతో తలపడనుండగా.. ఫిబ్రవరి 24న జరుగనున్న రెండో సెమీస్లో గ్రూప్-2 టాపర్ ఇంగ్లండ్.. గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిచిన సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఈ రెండు మ్యాచ్ల్లో విజేతలు ఫిబ్రవరి 26న కేప్టౌన్లో జరుగనున్న టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకుంటారు. ఇదిలా ఉంటే, ప్రస్తుత వరల్డ్కప్లో హాట్ ఫేవరెట్లలో ఒకటైన టీమిండియా.. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో ఒకే ఒక్క ఓటమిని మూటగట్టుకుంది. ఫిబ్రవరి 18న ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 11 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్లో పాక్ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించిన భారత అమ్మాయిలు.. ఆ తర్వాత విండీస్, ఐర్లాండ్ జట్లను ఓడించారు. మిగతా జట్ల విషయానికొస్తే.. సెమీస్లో భారత్ ప్రత్యర్ధి ఆసీస్.. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో (న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, సౌతాఫ్రికా) విజయం సాధించగా.. గ్రూప్-2 టాపర్ ఇంగ్లండ్ కూడా 4కు నాలుగు మ్యాచ్ల్లో గెలిచి అజేయ జట్టుగా జైత్రయాత్ర కొనసాగిస్తుంది. సౌతాఫ్రికా విషయానికొస్తే.. సఫారీ టీమ్.. టోర్నీలో ఆడిన 4 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించి, 2 అపజయాలు మూటగట్టుకుంది. మహిళల టీ20 వరల్డ్కప్ చరిత్రను ఓసారి పరిశీలిస్తే.. ఈ మెగా టోర్నీలో ప్రస్తుతం 8వ ఎడిషన్ కొనసాగుతుంది. 2009లో జరిగిన తొలి ఎడిషన్లో ఇంగ్లండ్ విజేతగా నిలువగా.. 2010, 2012, 2014 ఎడిషన్లలో ఆసీస్ విజేతగా నిలిచి హ్యాట్రిక్ వరల్డ్కప్లు సాధించింది. మధ్యలో 2016లో వెస్టిండీస్ జగజ్జేతగా నిలువగా.. ఆ తర్వాత 2018, 2020 ఎడిషన్లలో ఆసీస్ వరుసగా రెండుసార్లు ఛాంపియన్గా నిలిచింది. ఈ వరల్డ్కప్లో విజయం సాధిస్తే ఆసీస్ డబుల్ హ్యాట్రిక్ నమోదు చేస్తుంది. 2020 ఎడిషన్లో భారత్.. ఫైనల్కు చేరి ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. -
పాపం మయాంక్ అగర్వాల్.. డబుల్ సెంచరీ చేసినా గెలిపించలేకపోయాడు
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ మధ్యప్రదేశ్కు షాకిచ్చి బెంగాల్ తుది పోరుకు అర్హత సాధించగా.. రెండో సెమీస్లో కర్ణాటకను ఖంగుతినిపించి సౌరాష్ట్ర ఫైనల్కు చేరింది. మధ్యప్రదేశ్తో జరిగిన తొలి సెమీఫైనల్లో బెంగాల్ 306 పరుగుల తేడాతో భారీ విజయం సాధించగా.. కర్ణాటకతో జరిగిన ఉత్కంఠ పోరులో సౌరాష్ట్ర 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారీ ద్విశతకం (249), రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ (55) సాధించినప్పటికీ మయాంక్ అగర్వాల్ కర్ణాటకను గెలిపించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ (202), రెండో ఇన్నింగ్స్లో అత్యంత కీలక పరుగులు (47 నాటౌట్) చేసిన అర్పిత్ వసవద సౌరాష్ట్రను గెలిపించాడు. 117 పరుగుల లక్ష్య ఛేదనలో 42 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సౌరాష్ట్రను వసవద.. చేతన్ సకారియా (24) సహకారంతో విజయతీరాలకు చేర్చాడు. సౌరాష్ట్ర 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కర్ణాటక-సౌరాష్ట్ర మ్యాచ్ స్కోర్ వివరాలు.. కర్ణాటక తొలి ఇన్నింగ్స్: 407 ఆలౌట్ (మయాంక్ 249, శ్రీనివాస్ శరత్ 66, చేతన్ సకారియా 3/73) సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్: 527 ఆలౌట్ (అర్పిత్ వసవద 202, షెల్డన్ జాక్సన్ 160, విధ్వత్ కావేరప్పా 5/83) కర్ణాటక సెకెండ్ ఇన్నింగ్స్: 234 ఆలౌట్ (నికిన్ జోస్ 109, మయాంక్ 55, చేతన్ సకారియా 4/45) సౌరాష్ట్ర సెకెండ్ ఇన్నింగ్స్: 117/6 (వసవద 47 నాటౌట్, కృష్ణప్ప గౌతమ్ 3/38, వాసుకి కౌశిక్ 3/32) -
జాక్సన్, అర్పిత్ సెంచరీలు.. కర్ణాటకకు ధీటుగా బదులిస్తున్న సౌరాష్ట్ర
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా కర్ణాటక-సౌరాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక.. మయాంక్ అగర్వాల్ (249) డబుల్ సెంచరీతో విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. కర్ణాటక తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ధీటుగా బదులిస్తుంది. షెల్డన్ జాక్సన్ (160) భారీ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ అర్పిత్ వసవద (112 నాటౌట్) అజేయ శతకంతో రాణించాడు. వీరిద్దరూ శతకాలతో విరుచుకుపడటంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర 4 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. అర్పిత్ వసవదకు జతగా చిరగ్ జానీ (19) క్రీజ్లో ఉన్నాడు. ప్రస్తుతానికి సౌరాష్ట్ర.. కర్ణాటక తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 43 పరుగులు వెనుకపడి ఉంది. సౌరాష్ట్ర ఇన్నింగ్స్లో హార్విక్ దేశాయ్ (33), విశ్వరాజ్ జడేజా (22) పర్వాలేదనిపించగా.. స్నెల్ పటేల్ (0) నిరాశపరిచాడు. కర్ణాటక బౌలర్లలో విద్వత్ కావేరప్ప 2 వికెట్లు పడగొట్టగా.. వాసుకి కౌశిక్, కృష్ణప్ప గౌతమ్ తలో వికెట్ దక్కించుకున్నారు. కర్ణాటక ఇన్నింగ్స్లో మయాంక్ డబుల్ సెంచరీతో రెచ్చిపోగా.. శ్రీనివాస్ శరత్ (66) అర్ధసెంచరీతో అలరించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్ సకారియా, కే పటేల్ చెరి 3 వికెట్లు పడగొట్టగా.. చిరాగ్ జానీ, ప్రేరక్ మన్కడ్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక, బెంగాల్-మధ్యప్రదేశ్ మధ్య జరుగుతున్న తొలి సెమీఫైనల్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో బెంగాల్ పూర్తి ఆధిక్యం సంపాదించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్ 327 పరుగుల లీడ్లో కొనసాగుతుంది. తొలి ఇన్నింగ్స్లో 438 పరుగులకు ఆలౌటైన బెంగాల్.. సెకెండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 59 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే కుప్పకూలిన మధ్యప్రదేశ్.. ఈ మ్యాచ్లో ఓటమి దిశగా పయనిస్తుంది. -
స్పోర్ట్స్ మినిస్టర్ సారధ్యంలో శతకాలతో విరుచుకుపడిన ప్లేయర్లు
Ranji Trophy 2022-23 Semi Finals MP VS Bengal: రంజీ ట్రోఫీ-2022-23 సీజన్ చివరి అంకానికి చేరింది. ఈ దేశవాలీ టోర్నీలో ఇవాల్టి (ఫిబ్రవరి 8) నుంచే సెమీఫైనల్ మ్యాచ్లు మొదలయ్యాయి. తొలి సెమీస్లో బెంగాల్.. మధ్యప్రదేశ్ను ఢీకొంటుంటే, రెండో సెమీస్లో కర్ణాటక, సౌరాష్ట్ర జట్లు పోటీ పడుతున్నాయి. తొలి సెమీస్ విషయానికొస్తే.. స్పోర్ట్స్ మినిస్టర్ మనోజ్ తివారి సారధ్యంలో బెంగాల్ జట్టు తొలి రోజు ఆటలో పైచేయి సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బెంగాల్.. సుదీప్ కుమార్ ఘరామీ (112), అనుస్తుప్ మజుందార్ (120) శతకాలతో విరుచుకుపడటంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (27), కరణ్ లాల్ (23)లకు మంచి శుభారంభాలు లభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కెప్టెన్ మనోజ్ తివారి (5), షాబజ్ అహ్మద్ (6) క్రీజ్లో ఉన్నారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్, గౌరవ్ యాదవ్కు చెరో వికెట్ దక్కింది. -
2024 సెమీఫైనల్స్: 2023లో ఎన్నికలు జరిగే కీలక రాష్ట్రాలివే..
2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కానీ, అంతకు ఏడాది ముందే దేశంలో కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు 2024 లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2023లో మొత్తం 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఈ ఎన్నికలు అధికారంలోని బీజేపీతో పాటు విపక్ష కాంగ్రెస్కు కీలకం కానున్నాయి. ► ఈశాన్య రాష్ట్రాలు: 2023 ఫిబ్రవరి-మార్చి నెలల మధ్య మూడు ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత నవంబర్లో మిజోరాంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్రిపురలో ఐపీఎఫ్టీతో కలిసి అధికారంలో ఉంది బీజేపీ. అలాగే నాగాలాండ్, మేఘాలయాల్లో అధికార కూటమిలో భాగస్వామిగా ఉంది. మిజోరాంలో ప్రధానంగా కాంగ్రెస్, అధికార మిజో నేషనల్ ఫ్రంట్ మధ్యే పోటీ ఉంటుంది. ప్రధానంగా త్రిపుర ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తొలిసారి 2018లో అధికారంలోకి వచ్చిన బీజేపీకి ప్రస్తుతం వ్యతిరేకత మింగుడుపడటం లేదు. ► కర్ణాటక: దక్షిణభారతంలో బీజేపీకి గట్టి పట్టున్న రాష్ట్రం కర్ణాటక. 2023లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్, జనతా దళ్(సెక్యులర్)ల మధ్యే పోటీ ఉంటుంది. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తోంది. మరోవైపు.. పార్టీలో తిరుగుబాటు నేతలను బుజ్జగించి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. ► తెలంగాణ: దేశంలో కొత్త ఏర్పాడిన రాష్ట్రం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు 2023లో జరగనున్నాయి. దేశ రాజకీయాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ఇటీవలే భారత రాష్ట్ర సమితిగా అవతరించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్కు ఎంతో కీలకంగా మారాయి. మరోవైపు.. బీజేపీ, కాంగ్రెస్లు అధికార మార్పిడి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. దక్షిణాదిలో పట్టు సాధించేందుకు తెలంగాణలో తమ బలం చూపించుకోవలాని బీజేపీ భావిస్తోంది. ► మధ్యప్రదేశ్: 2023 నవంబర్-డిసెంబర్ మధ్య మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉండనున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యే ఇక్కడ ప్రధాన పోటీ ఉండనుంది. కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటుతో సీఎంగా కమల్నాథ్ దిగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత బీజేపీ అధికారం చేపట్టింది. దేశంలో రెండే అతిపెద్ద రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో విజయం సాధించటం ద్వారా 2024 లోక్సభ ఎన్నికలపై పట్టు సాధించాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. ► ఛత్తీస్గఢ్-రాజస్థాన్: 2024 ఎన్నికలకు ముందు ఈ రెండు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు.. రాజస్థాన్లో సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య వర్గ పోరు ప్రధనా ఆకర్శనగా నిలుస్తోంది. అలాగే, రాష్ట్రాల్లో అధికార మార్పిడి సంప్రదాయం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి: నీకే కాదు.. నీ తండ్రికి కూడా ఎవరూ భయపడటం లేదు: ఫడ్నవీస్ -
సూర్యకుమార్ యాదవ్పై సంచలన వ్యాఖ్యలు చేసిన వసీం జాఫర్
టీ20 వరల్డ్కప్-2022 సెమీఫైనల్లో టీమిండియా.. ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని ఎదుర్కొన్న అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత అభిమానులు తీవ్రంగా మనసు నొచ్చుకున్నారు. కొందరు బహిరంగంగా తమ బాధను వెల్లగక్కితే.. మరికొందరు పర్వాలేదులే అంటూ టీమిండియాను వెనకేసుకొచ్చారు. ఓటమి బాధను దిగమింగుకోలేక బాహాటంగా బాధను వ్యక్త పరిచిన వారిలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా ఉన్నాడు. దాదాపుగా ప్రతి సందర్భంలో టీమిండియాను వెనకేసుకొచ్చే జాఫర్.. వరల్డ్కప్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి అనంతరం మాత్రం జట్టులో లోపాలను గట్టిగానే లేవనెత్తాడు. తొలుత కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యాలను ఘాటుగా విమర్శించిన జాఫర్.. ఆతర్వాత సెమీస్లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేనందుకు భారత బౌలర్లను ఎండగట్టాడు. తాజాగా అతను టీమిండియా విధ్వంసకర బ్యాటర్, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ను కూడా టార్గెట్ చేశాడు. Wasim Jaffer states Suryakumar Yadav couldn't live up to the expectations in big games via @BatBricks7 presents 'Run Ki Runneeti show.'#CricTracker #BatBricks7 #SuryakumarYadav #2020WorldCup pic.twitter.com/Q2C4GzCgaw — CricTracker (@Cricketracker) November 13, 2022 ప్రపంచకప్లో సూర్యకుమార్ 3 అర్ధసెంచరీలతో పర్వాలేదనిపించినప్పటికీ, కీలక మ్యాచ్ల్లో ఆశించిన మేరకు రాణించలేకపోయాడంటూ స్కైను వేలెత్తి చూపాడు. సెమీస్ మ్యాచ్కు ముందు వరకు టీమిండియాపై పేలిన పాక్ మాజీలకు, ఇంగ్లండ్ మాజీలకు స్ట్రాంగ్ కౌంటర్లిచ్చిన జాఫర్ ఒక్కసారిగా ఇలా భారత ఆటగాళ్లను టార్గెట్ చేయడంతో అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. జాఫర్కు ఏమైనా చిప్ దొబ్బందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. రోహిత్ను టార్గెట్ చేసినప్పుడైతే.. అతని ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంకొందరైతే.. జాఫర్ టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాడని అతన్ని వెనకేసుకొస్తున్నారు. జాఫర్ వ్యాఖ్యల్లో తప్పేముంది.. రోహిత్ ఇటీవలికాలంలో దారుణంగా విఫలమవుతున్నాడు కాబట్టి, వచ్చే టీ20 వరల్డ్కప్లో అతను ఆడతాడనుకోవడం లేదని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని బహిర్గతం చేశాడంటున్నారు. టీమిండియా బౌలింగ్ కంటే పాక్ బౌలింగ్ బలంగా ఉందని జాఫర్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పుడు అర్ధాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజంగానే భారత్ బౌలింగ్ బలహీనంగా ఉంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయాన్ని జాఫరే కాదు ఎవరిని అడిగినా చెబుతారు. ఇక, సూర్యకుమార్ విషయానికొస్తే.. మెగా టోర్నీలో 185కు పైగా స్ట్రయిక్ రేట్ కలిగిన స్కై.. పాక్తో జరిగిన తొలి మ్యాచ్లో, డూ ఆర్ డై సెమీస్ మ్యాచ్లో, బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ల్లో అంచనాలకు తగ్గట్టు రాణించలేదన్నది బహిరంగ రహస్యమేనని జాఫర్ కామెంట్స్తో ఏకీభవిస్తున్నారు. చదవండి: 'త్వరలో టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించవచ్చు'
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
సమన్వయంతో పనిచేద్దాం: ఎస్పీ
‘12, 13 తేదీల్లో పత్రికా ప్రకటనలపై ముందస్తు అనుమతి తప్పనిసరి’
రూ.707.61కోట్లు ప్రభుత్వ సాయం
12, 13 తేదీల్లో మద్యం బంద్
No Headline
ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశాం: కలెక్టర్
‘ఎన్నికల భారతం’ కవితా సంకలనం ఆవిష్కరణ
ఓటుహక్కు వినియోగించుకుందాం
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం తగదు
ఎస్బీఐ రివార్డు పాయింట్ల పేరిట మోసం
తప్పక చదవండి
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement