-
Ram Gopal Varma: అర్థం కానీ డిక్షనరీ.. తెలివైన స్వేచ్ఛా జీవి
అతనో అర్థం కానీ డిక్షనరీ. ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. నచ్చని పని చెయడు. నచ్చిన పని ఎవరు వద్దన్నా ఆపడు. అంతా ‘నా ఇష్టం’ అంటూ ఎవరి మాటలను లెక్కచేయడు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేస్తాడు. వోడ్కా తాగుతూ సరదాగా ట్వీట్ చేసి..సంచలనంగా క్రియేట్ చేస్తాడు. కాంట్రవర్సీ కాన్సెప్ట్తోనే సినిమా తీసి.. ‘నచ్చితే చూడండి లేకపోతే లేదు’అంటూ కుండ బద్దలు కొట్టేసినట్లు చెప్పేస్తాడు. ఆయనను తిట్టేవాళ్లు ఉన్నారు.. పొగిడేవాళ్లు ఉన్నారు. ఆయన మాత్రం ఇవేవి పట్టించుకోకుండా స్వాతంత్య్రాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ స్వేచ్ఛగా బతికేస్తున్నాడు. అతనే రామ్గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ. నేడు(ఏప్రిల్ 7) అతితెలివైన ఈ ఇన్నోసెంట్ ఫెల్లో బర్త్డే. ఈ సందర్భంగా ఆర్జీవీ గురించి ఆసక్తికరమైన విషయాలు.. ► వర్మ స్వస్థలం విజయవాడ. 1962 ఏప్రిల్ 7న హైదరాబాద్లో జన్మించాడు. సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ హైస్కూల్ లో పాఠశాల విద్యను, విజయవాడనగరంలోని సిధ్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. ► చదువు కంటే ఎక్కువగా సినిమాలపైనే ఆసక్తి ఉండేది. ఇంజనీరింగ్ చదివే సమయంలో తరచూ సినిమాలకు వెళ్లేవాడట. ఏ భాషలోనైనా, వదలకుండా చూసేవాడినని ఆయన చెబుతూ ఉంటారు. తన స్నేహితులతో ప్రతి చిత్రాన్ని విశ్లేషిస్తూ, అందులోని తప్పొప్పుల గురించి వాదనలు జరిపేవాడు. క్లాసులను ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసి వాళ్ళ అమ్మతో దెబ్బలు తినేవారు. షోలే సినిమాలో "ఫిల్మ్ బై రమేష్ సిప్పీ" పేరు చూసి ఎప్పటికైన తన పేరు కూడా అలానే తెరపై పడాలని నిర్ణయించుకున్నాడట. ► ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత బతుకుదెరువు కోసం డీవీడీలు, వీసీఆర్లు రెంట్కి ఇచ్చే దుకాణం పెట్టుకొని.. సినిమా చాన్స్ల కోసం ఎదురు చూశాడు. కొన్ని రోజుల తర్వాత అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కిన ‘రావుగారిల్లు’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. ఆ తరువాత నాగార్జున తో పరిచయం అతని జీవితాన్ని మార్చివేసింది. ► శివతో సంచలనం: ఆర్జీవీ చెప్పిన కథ నచ్చి సినిమా చేయడానికి ఓకే చెప్పాడు నాగార్జున. 1989 అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. నాగార్జునతో సైకిల్ చైన్ లాంగించి ఇండస్ట్రీ మొత్తాన్ని డిస్టబ్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.మ్యాటనీ ఆట ఉంది… బోటనీ క్లాసు ఉంది దేనికో ఓటు చెప్పరా అంటూ కుర్రాళ్లను తెగ కన్ఫూజ్ చేశాడు.సినిమా అంటే ఇలానే తీయాలనే కట్టుబాట్ల బంధీలను బద్దలు కొట్టాడు, తెలుగు సినిమా స్థాయిని తొలిసారి జాతీయ స్థాయికి పరిచయం చేశాడు.ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తే..అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. ► ఆ తర్వాత వెంకటేశ్, శ్రీదేవి జంటగా తీసిన క్షణక్షణం మూవీ ఆద్యంతం కొత్త స్ర్కీన్ ప్లే తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీశాడు. బ్యాంక్ దొంగతనం నేపథ్యంతో తీసిన ఈ చిత్రం సైతం సూపర్ హిట్ గా నిలిచింది. ► 1993లో రాము, మణిరత్నం తో కలిసి తీసిన ‘గాయం’ జగపతిబాబు కెరీర్ ని గొప్ప మలుపు తిప్పింది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ గ్రౌండ్ లో తీసిన ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ చిత్రానికి జగపతి బాబు ఉత్తమ నటుడిగా తొలిసారి నంది అవార్డు అందుకున్నాడు. ► నాగార్జున, శ్రీదేవి జంటగా తీసిన గోవిందా…గోవిందా మూవీ పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో విలన్లు వేంకటేశ్వర స్వామి కిరీటాన్ని దొంగతనం చేసే సీన్ పెను దుమారమే రేపింది. సెన్సార్ కత్తెర పడటంతో వర్మ టాలీవుడ్ పై అలిగాడు. ఆ తర్వాత తెలుగు సినిమాలు తీయనని ఒట్టేసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఒట్టు తీసి గట్టున పెట్టి మళ్లీ తెలుగులో వరుసగా సినిమాలు తీయడం మొదలు పెట్టాడు. ► బాలీవుడ్పై దండయాత్ర: రంగీలా చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఆర్జీవీ. అమీర్ ఖాన్, జాకీ ష్రాఫ్, ఊర్మిలా హీరో హీరోయన్లుగా వర్మ తీసిన ఈ చిత్రం 1994లో రిలీజై.. బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసింది. ఈ చిత్రంతోనే ఎ.ఆర్.రెహమాన్ బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చాడు. ► ఆర్జీవీ దర్శకత్వం వహించిన సూపర్ చిత్రాల్లో సత్య ఒకటి. తక్కువ బడ్జెట్ తో స్టార్స్ ఎవరు లేకుండా తీసిన ఈ మూవీ ఎంతో మంది నటులకు, సాంకేతికి నిపుణులకు బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రంతోనే మనోజ్ బాజ్ పాయి, చక్రవర్తి వంటి నటులు వెండితెరకు పరిచయం అయ్యారు. ► ఆ తర్వాత వర్మ ముంబై మాఫియా నేపథ్యంలో కంపెనీ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అజయ్ దేవగన్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ► అమితాబ్ తో తీసిన ‘సర్కార్’ చిత్రం రాము తీసిన మంచి చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. అమితాబ్, అభిషేక్ లు తెరపై కూడా తండ్రీ కొడుకులుగా నటించిన ఈ మూవీ తరువాత బాలీవుడ్ ను వర్మవుడ్ గా మార్చాడనే కాంప్లిమెంట్ అందుకున్నాడు. ఈ సినిమా థీం పాయింట్ లో వర్మ చెప్పిన గెలుపోటముల సూత్రం అద్భుతం అనిపిస్తుంది. ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ‘సర్కార్ రాజ్’ కూడా మంచి సక్సెస్ సాధించింది. కానీ ‘సర్కార్ 3’ సినిమా మాత్రం డిజాస్టర్గా నిలిచింది. ► ‘రక్త చరిత్ర’ తర్వాత ఆర్జీవీ తెలుగులో వరుస చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కువగా కాంట్రవర్సీ స్టోరీలతోనే సినిమాలను తెరెక్కిస్తున్నాడు. అయితే వాటిల్లో ఏవి చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. కానీ వెండితెరపై ఏదైన కొత్త ప్రయోగం చేయాలంటే ఇప్పటికీ ఎవరైనా ఆర్జీవీ తర్వాతనే. ఈ విషయాన్ని దర్శకధీరుడు రాజమౌళితో పాటు ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. -
Vemulawada : వేములవాడ ఆలయంలో రాజన్న కల్యాణ మహోత్సవం (ఫొటోలు)
-
‘కంగువ’ నాకెంతో స్పెషల్ : హీరో సూర్య
'కంగువ' లాంటి గొప్ప సినిమాలో నటించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు స్టార్ హీరో సూర్య. ఆయన నటించిన ఈ ప్రెస్టీజియస్ మూవీ త్వరలో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. 'కంగువ' చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. తాజాగా ముంబైలో 'కంగువ' గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సూర్యతో పాటు మూవీ టీమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ - గొప్ప సినిమాల్లో నటించే అవకాశం అదృష్టవశాత్తూ దక్కుతుంటుంది. మన కోరికను ఈ యూనివర్స్ విని అది జరిగేలా చేస్తుందని నమ్ముతాను. అది కంగువ విషయంలోనూ జరిగింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి రోజు రోజుకూ మూవీ మరింత బిగ్ ప్రాజెక్ట్ గా మారుతూ వచ్చింది. అందుకు మా డైరెక్టర్ శివకు థ్యాంక్స్ చెప్పాలి. కంగువ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేయాలన్న కలగన్న మా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజాకు కృతజ్ఞతలు. అలాగే సినిమాటోగ్రాఫర్ వెట్రి, మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ లేకుండా ఈ మూవీ ఇంత బాగా వచ్చేది కాదు . ప్రతి సినిమాకు స్క్రిప్ట్ కు మేకింగ్ కు మధ్య కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. కానీ కంగువ సినిమాకు ప్రతి రోజూ బెటర్ గా వర్క్ చేస్తూ వచ్చాం. ఒక కొత్త పాత్రలోకి మారిపోవడం ఎగ్జైటింగ్ గా ఉంటుంది. నటుడిగా పాతికేళ్ల అనుభవం తర్వాత ఒక సినిమాకు ఎగ్జైట్ అయి వర్క్ చేయడం అంత సులువు కాదు. కంగువకు 150 రోజులకు పైగా చేసిన షూట్ లో ప్రతి రోజూ ఆ ఎగ్జైట్ మెంట్ ఎక్సీపిరియన్స్ చేశాం. ఈ సినిమాకు మాకెంతో స్పెషల్. మీ అందరికీ కంగువ నచ్చుతుందని ఆశిస్తున్నాం. అన్నారు. -
తవ్వేకొద్దీ బయటపడుతున్న శివబాలకృష్ణ లీలలు
-
జన్మకో శివరాత్రి అని ఎందుకంటారో తెలుసా!
శివతత్వమే మంగళం. జన్మకో శివరాత్రి అన్నది ఆర్యోక్తి. దీని అర్ధం సంవత్సరంలో వివిధ కారణాల వల్ల నిర్లక్ష్యం చేయబడ్డ దైవారాధన కనీసం శివరాత్రి రోజు చేసినా సమస్త మంగళాలు ప్రోదిచేసి అందించే దైవం బోళాశంకరుడు అన్నది అందరూ అనుభవైకపూర్వకంగా అనుభవించే సత్యం. మహా శివరాత్రి అనడానికి.. ప్రతీమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశిని శివరాత్రి అంటారు.ప్రతి మాసంలో వచ్చే ఈ శివరాత్రిని మాసశివరాత్రిగా వ్యవహరిస్తారు. మాఘ కృష్ణ పక్ష చతుర్దశిలో వచ్చే శివరాత్రికి మహాశివరాత్రి అని పేరు.ఈ తిథి నాడు లింగాకారంలో పరమేశ్వరుడు ఆవిర్భవించిన సందర్బంగా పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక దినంగా మహాశివరాత్రిగా జరుపుకుంటాం. శివ అంటే.. శివ అనే నామమే అత్యంత పవిత్రమైనది.శివ అంటే మంగళం,శుభం,క్షేమం,భద్రం,శాంతం అనే అర్ధాలు చెప్పబడ్డాయి.అన్నిటికీ ఆధారమైనవాడు శివయ్య.అలసిన జీవుడు ధ్యానంలో చేరేది శివ చైతన్యవలయంలోనికే. పరమ శివుని ఆవిర్భావం అందరికీ తెలిసిందే.భక్త సులభుడు మరియు భక్త వరదుడు శంకరుడు అన్నది పురాణాలు ద్వారా అందరికీ సుపరిచితం. శివతత్వం అంటే.. సాక్షాత్ చదువుల తల్లి సరస్వతీ మాత శివతత్వం గ్రంథస్తం చేసే క్రమంలో ఎంత రాసినా తరగని ఘని అయిన పరమేశ్వరుడి తత్వరచన కోసం కాటుక కొండను కరిగించి "సిరా" (ఇంక్) గానూ, కల్పవృక్షం కొమ్మను "కలం"(పెన్) గాను, భూమాతను "కాగితం"(పేపర్)గా చేసుకుని రచన ప్రారంభించి ఎంత రాసినా పూర్తి కానీ సశేషం శివతత్వం అని గ్రహించి "పరమేశ్వరా నీ తత్వం అందనిది కానీ నీ అనుగ్రహం సులభసాధ్యంగా అందరికీ అందేదీ"అని నిర్వచించారట అమ్మవారు. అంతటి విశిష్టతే శివతత్వం. శివపూజ.. గీతాచార్యుడయిన శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా తెలిపిన అమృతవాక్కు పురాణాల ద్వారా గ్రహించిన మహనీయులు ప్రపంచానికి అందించినది "కోటి జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప శివపూజ చేయలేము".సాక్షాత్ దైవమే చెప్పిన ఈ మాట శివపూజలో ఉన్న ధార్మిక ప్రాధాన్యతను తెలియజేస్తోంది. ఈ రోజు ఉపవాసమే నైవేద్యం:- పార్వతీనాధునికి ఉపవాసమే భక్తుడు సమర్పించే నిజమైన నైవేద్యం.తృప్తి కోసం భక్తుడు తాను స్వీకరించే ఆహారం సాత్వికమైనది శివార్పణమ్ చేసి తీసుకోవచ్చు.శక్తి కొద్దీ ఎవరు ఇష్టపూర్వకంగా సమర్పించే ఆహారం అయినా పరమాత్మునికి ప్రీతికరమైనది. అభిషేకప్రియుడు.. లింగరూపుడు అయిన శివయ్యకు శుద్ధజలం(మంచి నీరు)అత్యంత ప్రీతి కరమయిన అభిషేకద్రవ్యం.గంగాధరుడు కాబట్టి గంగకు అత్యంత ప్రాధాన్యత.మరో రకంగా ఆలోచిస్తే సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండే జలం కోరుకున్నాడు భగవానుడు.శక్తి కొద్దీ పంచామృతాలు,పళ్లరసాలు భక్తులు సమర్పిస్తారు.ఒక్కో ద్రవానికి ఒక్కో విశిష్టత చెప్పబడింది.స్థూలంగా శివునికి అభిషేకం అత్యంత ప్రియం. బిల్వదళం.. మారేడుదళాలు సంవత్సరం మొత్తంలో శిశిరఋతువులో సైతం ఆకురాల్చని విధానం కలిగి ఉండటమే కాక శరీరం లోని వేడిని సైతం తగ్గించే శక్తి కలిగి ఉండడంతో గరళకంటుడికి మారేడుదళం సమర్పిస్తారు భక్తులు.ఈ బిల్వదళం సమర్పణలో ఒక్కో రకమయిన పురాణ వివరణలు కూడా ఉన్నాయి. ఈ శివరాత్రి రోజును ఉపవాసంతో శివుడిని అర్చించి జాగరణ చేయడం అనేది అత్యంత కష్టమైన విధి విధానం. వీటన్నింటిని కనీసం ఒక్కసారైన ఆచరించే పూజ చేయగలిగితే చాలని జన్మకో శివరాత్రి అన్నారు. అందులోనూ మాఘమాసం ఈ చలికాలంలో ఇవన్నీ ఒక్కసారైన నియమంగా చేస్తే చాలనే ఉద్దేశ్యంతో వచ్చిన ఆర్కోక్తి జన్మకో శివరాత్రి. అందువల్లే దీన్ని మహా శివరాత్రి అని కూడా పిలవడం జరిగింది. ఐక్యతకు శివకుటుంబం ఆదర్శం.. పరస్పర వైరభావం కలిగిన వాహనాలు ఎద్దు,సింహం,నెమలి,ఎలుక ఏంతో అన్యోన్యతతో ఒదిగి ఉండటం ప్రస్తుత సమాజానికి ఒక విలువైన పాఠం.ఎన్నో వైరుధ్యాలు,భావాలు,వ్యక్తిత్వాలు ఉన్నా సమాజం అనే గొడుగు క్రింద అందరం అన్యోన్యంగా ఉన్నప్పుడే భావితరాలకి శాంతి మరియు సౌబ్రాతృత్వాలు అందించగలం.ఐక్యతే విజయ సూత్రం అని చెబుతోంది శివకుటుంబం. దయగల దైవం చంద్రశేఖరుడు. భక్తితో శివునికి చేరవ్వవుదాం. సత్కర్మలు ఆచరించి నిశ్చలమైన భక్తి, విశ్వాసాలను ఇవ్మమని అడుదాం. శివతత్వాన్ని శాశ్వతం చేసుకుందాం మన నిత్య జీవనవిధానంలో.. (చదవండి: శివయ్య అనుగ్రహం కావాలంటే..) -
పరమ శివుని భక్తిని చాటి చెప్పే చిత్రాలు.. ఎంచక్కా ఓటీటీల్లో చూసేయండి!
రెండు తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి సందడి మొదలైంది. శివనామస్మరణతో శ్రీశైల గిరులు మార్మోగిపోతున్నాయి. మార్చి 8న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు రాత్రంతా జాగరణ, ఉపవాసం చేయడం ఆనవాయితీ. అలా ఆ పరమశివుడిని, పార్వతిదేవిని స్మరించుకుంటూ భక్తితో పొంగిపోతుంటారు. ఇప్పటికే ఆ పరమ శివుని మహిమలపై వచ్చిన చాలా చిత్రాలు వచ్చాయి. శివరాత్రి సందర్భంగా శివున్ని తరించుకుంటూ సినిమాలు చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు మీ కోసమే. శివుని భక్తిని చాటి చెప్పే సినిమాల జాబితాను మీకోసం తీసుకొస్తున్నాం. ముఖ్యంగా ఓటీటీల యుగంలో ఏయే సినిమా ఏక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మీరే చూసేయండి. అలాగే శివరాత్రికి కచ్చితంగా చూడాల్సిన సినిమాల జాబితా ఇదుగో మీ కోసమే. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మహాభక్త సిరియాళ భక్త శంకర అమెజాన్ ప్రైమ్ భక్త కన్నప్ప ఎరోస్ నౌ శ్రీ మంజునాథ శివకన్య జీ5 మహాశివరాత్రి జియో సినిమా శివరాత్రి మహత్యం యూట్యూబ్ భక్త సిరియాళ భక్త మార్కండేయ శ్రీ మంజునాథ ఉమాచండీ గౌరీశంకరుల కథ కాళహస్తి మహత్యం శివలీలలు మహాశివరాత్రి దక్షయజ్ఞం జగద్గురు ఆదిశంకర మావూళ్లో మహాశివుడు శివకన్య శివరాత్రి మహత్యం వీటిలో భక్త కన్నప్ప, శ్రీ మంజునాథ భక్త మార్కండేయ, మహాభక్త సిరియాళ మరింత విశేషం కానుంది. మహాభక్త సిరియాళ చిత్రంలో తారకరత్న, అర్చన జంటగా నటించారు. వీటితోపాటు చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు, శ్రీహారి నటించిన జగద్గురు ఆదిశంకర చూడాల్సిన సినిమా. ఇవే కాకుండా శివరాత్రి మహత్యం, భూకైలాస్, అంజి, కార్తికేయ వంటి మరెన్నో చిత్రాలు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చినవాటిని సెలక్ట్ చేసుకుని వాటిని చూస్తూ జాగారం చేసేయండి.. -
కోయంబత్తూరులోని ఆదియోగి శివ: వితికాశేరు భక్తి పారవశ్యం (ఫోటోలు)
-
విదేశాల్లోని ప్రముఖ శివాలయాలివే..
ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం, శుక్ల పక్షంలోని త్రయోదశి తిథి నాడు మహాశివరాత్రిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈసారి మహాశివరాత్రి 2024, మార్చి 8న వచ్చింది. ఆ రోజున శివాలయాలు భక్తుల శివనామస్మరణలతో మారుమోగుతుంటాయి. మహాశివుడు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా పూజలందుకుంటున్నాడు. విదేశాల్లోని శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పశుపతినాథ్ ఆలయం(నేపాల్) మన పొరుగు దేశం నేపాల్లో ఉన్న అత్యంత ప్రసిద్ధ శివాలయం పశుపతినాథ్ మందిరం. శివరాత్రినాడు లక్షలాది శివభక్తులు ఇక్కడికి మహాశివుని దర్శనం కోసం తరలివస్తారు. పశుపతినాథ్ ఆలయం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉంది. పశుపతినాథుని ప్రత్యక్ష దర్శనం చేసుకున్న వారికి మరో జన్మలో జంతు రూపం రాదని నమ్ముతారు. మున్నేశ్వరం (శ్రీలంక) నేపాల్లో మాదిరిగానే శ్రీలంకలోనూ అత్యంత పురాతన శివాలయం ఉంది. దాని పేరు మున్నేశ్వరం. ఈ ఆలయం రామాయణ కాలం నాటిదని చెబుతారు. రావణుని వధించిన తరువాత రాముడు తన ఆరాధ్యదైవమైన శివుణ్ణి ఈ ఆలయంలో పూజించాడని అంటారు. శివరాత్రి రోజున ఈ ఆలయం భక్తులతో రద్దీగా మారుతుంది. శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం(మలేషియా) అరుల్మిగు శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం.. ఈ ప్రసిద్ధ శివాలయం మలేషియాలో ఉంది. ఈ ఆలయాన్ని 1922 సంవత్సరంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని గాజుతో నిర్మించారు. ఆలయంలోని గోడలపై సుమారు మూడు లక్షల రుద్రాక్షలను పొదిగారు. ప్రంబనన్ ఆలయం (ఇండోనేషియా) ఈ ప్రసిద్ధ శివాలయం ఇండోనేషియాలోని జావా ప్రావిన్స్లో ఉంది. ప్రంబనన్ ఆలయం ఎనిమిది దేవాలయాల సమూహం. ఈ ఆలయం 850 బీసీలో నిర్మితమయ్యింది. ఈ శివాలయం గోడలపై విష్ణువు, హనుమంతుడు, రామాయణ కాలం నాటి చిత్రాలు, ఇతర దేవుళ్ళు, దేవతల గురించిన వివరాలు చెక్కారు. మహాశివరాత్రి రోజున ఈ ఆలయం దీప కాంతులతో వెలిగిపోతుంది. ముక్తి గుప్తేశ్వరాలయం (ఆస్ట్రేలియా) ఆస్ట్రేలియాలోని ముక్తి గుప్తేశ్వరాలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయ శోభ రెండింతలవుతుంది. ఈ శివాలయం ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో ఉంది. ఈ ఆలయం చూడటానికి ఆకట్టుకునేలా ఉంటుంది. మహాశివరాత్రి రోజున భక్తులు ఈ ఆలయానికి తండోపతండాలుగా తరలివస్తుంటారు. -
శివ బాలకృష్ణ కేసులో మరో కీలక ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్లాట్ కొనుగోలుకు శివ బాలకృష్ణ భారీగా చెల్లించిన నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. శ్రీకృష్ణ నిర్మాణ సంస్థలో ఫ్లాట్ కొనుగోలుకు బాలకృష్ణ చెల్లించిన రెండు కోట్ల 70 లక్షల రూపాయలను నగదును సీజ్ చేశారు. బాలకృష్ణ ఇంకా ఏ ఏ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడనే దానిపై ఏసీబీ విచారణ చేస్తోంది. బినామీల పేర్లతో భారీగా ఆస్తుల కొనుగోలుపై ఆరా తీస్తోంది. పలు నిర్మాణ సంస్థల్లో పెట్టుబడులపై ఏసీబీ దృష్టి పెట్టింది. కాగా, శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో రోజుకో విస్తుపోయే విషయం వెలుగు చూస్తోంది. తన పేరిటే కాకుండా.. ఇంట్లోవాళ్లు, దగ్గరి.. దూరపు బంధువుల పేరిట కూడా ఆయన భారీగా ఆస్తుల్ని జమ చేశాడు. ఆఖరికి తన దగ్గర పని చేసేవాళ్లనూ వదల్లేదాయన. తాజాగా.. ఆయన దగ్గర అటెండర్, డ్రైవర్గా పని చేసిన వ్యక్తుల్ని అవినీతి నిరోధక శాఖ(ACB) అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరి పేరిటా భారీగానే బినామీ ఆస్తుల్ని శివ బాలకృష్ణ కూడబెట్టి ఉంటాడన్న అనుమానాల నేపథ్యంలో అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించింది. శివబాలకృష్ణ దగ్గర అటెండర్గా పని చేసిన హబీబ్, డ్రైవర్ గోపీలను ఏసీబీ తాజాగా అరెస్ట్ చేసింది. శివ బాలకృష్ణకు లంచాలు చేరవేయడంలో ఈ ఇద్దరూ కీలకంగా వ్యహహరించారని .. ప్రతిఫలంగా ఇద్దరి పేర్లపైనా బాలకృష్ణ ఆస్తులు కూడబెట్టాడని సమాచారం. ఈ క్రమంలోనే.. డ్రైవర్ గోపీకి కాస్ట్లీ హోండా సిటీకారును శివ బాలకృష్ణ గిఫ్ట్గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీళ్లిద్దరి పేరిట ఉన్న బినామీ ఆస్తుల వివరాలను గుర్తించే పనిలో ఉంది ఏసీబీ. ఇదీ చదవండి: తిరుపతి జూ ఘటన.. తేలని ప్రశ్నలు! -
శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరున 52 ఎకరాల భూములు
సాక్షి, యాదాద్రి: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులు యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ బయటపడ్డాయి. ఆయనపై జరుగుతున్న విచారణ సందర్భంగా.. భువనగిరి జిల్లాలో భూములు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. విలువైన వ్యవసాయ భూములను తన కుటుంబ సభ్యుల పేరున రిజిస్టర్ చేసుకున్నట్లు తేలింది. వలిగొండ, బీబీనగర్, మోత్కూరు మండలాల్లో శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరున గల 52.31 ఎకరాల వ్యవసాయ భూముల వివరాలను ఏసీబీ అధికారులు సేకరించారు. ఇందుకు సంబంధించిన కొన్ని వివరాలను జిల్లా కలెక్టర్కు సమర్పించి వాటిని ఫ్రీజ్ చేయాలని కోరినట్లు సమాచారం. రిజిస్టర్ డాక్యుమెంట్ల కావాలి శివబాలకృష్ణ కుటుంబ సభ్యులైన శివనవీన్, శివఅరుణ, ఎస్.ప్రసాద్, ఎస్.పద్మావతి, ఎస్.రఘుదేవి పేరున వ్యవసాయ భూముల డాక్యుమెంట్ల ఫ్రీజ్ చేయాలని కలెక్టర్ను ఏసీబీ అఽధికారులు కోరారు. ఇందుకు సంబంధించిన రిజిస్టర్ డాక్యుమెంట్లు, స్టాంప్డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, రిజిస్ట్రేషన్ కోసం సమర్పించిన గుర్తింపు కార్డులు, మ్యుటేషన్ ఫైల్స్ ఇవ్వాలని కోరారు. అలాగే, శివబాలకృష్ణ కుటుంబ సభ్యులకు సంబందించిన డాక్యుమెంట్ల రిజిష్ట్రేషన్లను నిలిపివేయాలని, తాము ఇచ్చిన వివరాల ప్రకారం ధరణీ పోర్టల్లోఉన్న రికార్డులను, కార్యాలయంలో ఉన్న రికార్డుల హార్డ్ కాపీలను పరిశీలించాలని కోరారు. శివబాలకృష్ణ పేరు మీద జిల్లాలో ఇంకేమైన ఆస్తుల డాక్యుమెంట్లు ఉంటే వాటికి సంబంధించి చెల్లించిన ఫీజు వివరాలను తమకు ఇవ్వడంతోపాటు వాటిని కూడా ఫ్రీజ్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. 22 మంది ఆధార్కార్డులు శివబాలకృష్ణకు కుటుంబ సభ్యులు, ఆయన భార్య, కుమార్తె, కుమారుడు, తల్లిదండ్రులు, స్నేహితులు, బావమరిది, సొదరుని కుమారులు, కోడలు, వారి స్నేహితులకు సంబంధించి మొత్తం 22మంది ఆధార్ కార్డులు కలెక్టర్కు ఏసీబీ అధికారులు పంపించారు. జిల్లాలో ఎక్కడైనా వీరికి సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఆస్తిపాస్తుల వివరాలు తమకు ఇవ్వడంతో పాటు వాటికి సంబంఽధించిన రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని కోరారు. ఏసీబీ అధికారులు గుర్తించిన ఆస్తుల వివరాలు ఇవీ.. శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరుతో భువనగిరి జిల్లాలో ఏసీబీ అధికారులు గుర్తించిన భూముల వివరాలు ఇలావున్నాయి.. వలిగొండ మండలం నర్సాపూర్లో ఎస్.హరిప్రసాద్ పేరున 8 ఎకరాలు, ఎస్.రఘుదేవి పేరున 11.03 ఎకరాలు, వలిగొండ మండల చిత్తాపురంలో ఎస్.పద్మావతి పేరున ఎకరం 30 గుంటలు, బీబీనగర్ మండలం చిన్నరావులపల్లిలో శివఅరుణ పేరున 20 గుంటలు, మోత్కూరు మండలం పాలడుగులో శివనవీన్ పేరున 6.32 ఎకరాలు, 12.5 ఎకరాలు, వలిగొండ మండలం రెడ్లరేపాకలో శివనవీన్ పేరున 4.22 ఎకరాలు, 5.32 ఎకరాల వ్యవసాయ భూమిని వారి కుటుంబ సభ్యులపేరున ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. -
HMDA: శివ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలకు సంబంధిచిన కేసులో అవినితి నిరోధక శాఖ(ఏసీబీ) విచారణ ఎదుర్కొంటున్న శివబాల కృష్ణపై హైదరాబాద్ మెట్రో పాలిటన్ అథారిటీ(HMDA) వేటు వేసింది. శివ బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ మంగళవారం హెచ్ఎండీఏ కమిషనర్ దాన కిషోర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఆదాయనికి మించి ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఇక.. ఆయన తన పదవిని అడ్డుపెట్టుకొని రూ. వందల కోట్లు సంపాధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏసీబీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో శివ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఏసీబీ కస్టడీకి హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ -
Bommak Siva: సినిమా అంతా ఒకటే పాత్ర ఉంటుంది
‘‘105 మినిట్స్’ మంచి ప్రయోగాత్మక చిత్రం. సినిమా మొత్తం ఒకటే పాత్ర ఉంటుంది. కానీ, ఇంకో వాయిస్ వినిపిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఓ బాలీవుడ్ నటుడి మాటలు వినిపిస్తుంటాయి’’ అని నిర్మాత బొమ్మక్ శివ అన్నారు. హీరోయిన్ హన్సిక లీడ్ రోల్లో రాజు దుస్సా దర్శకత్వం వహించిన చిత్రం ‘105 మినిట్స్’. బొమ్మక్ శివ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. బొమ్మక్ శివ మాట్లాడుతూ– ‘‘నాకు రియల్ ఎస్టేట్, కన్వెన్షన్ సెంటర్స్ బిజినెస్లు ఉన్నాయి. సినిమాపై ఫ్యాషన్తో మొదటి ్రపాజెక్టుగా ‘105’ మూవీ తీశాను. రాజు దుస్సా చక్కగా తీశాడు. హన్సికను ఈ మూవీలో కొత్తగా చూస్తారు. మైత్రీ మూవీస్ సంస్థ మా సినిమాని రిలీజ్ చేస్తుండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
జన్మదినం రోజే యువకుడి విషాదం..
మహబూబాబాద్ / వరంగల్: జన్మదినం రోజునే ఓ యువకుడు అనంతలోకాలకు చేరాడు. తన బర్త్డే వేడుకల్లో పాల్గొని ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటన కమలాపూర్ మండలం కేంద్రంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వంగపల్లికి చెందిన నకీర్త శివ (20) కమలాపూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం శివ ఇంట్లో మల్లన్న పట్నాలు వేశారు. అదేరోజు శివ పుట్టిన రోజు కూడా కావడంతో స్నేహితులు సాయంత్రం ఫోన్ చేసి పిలిచారు. దీంతో స్నేహితుల వద్దకు వెళ్లి బర్త్డే వేడుకల్లో పాల్గొన్నాడు. తిరిగి అదేరోజు రాత్రి ద్విచక్రవాహనంపై వంగపల్లిలోని తన ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఈక్రమంలో కమలాపూర్లోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద నడికూడ నుంచి కొత్తకొండకు వెళ్తున్న ట్రాక్టర్.. బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో శివ అక్కడికక్కడే మృతి చెందగా అతడితో పాటు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న కమలాపూర్కు చెందిన మరో యువకుడు అరుణ్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఇవి చదవండి: ప్రేయసి కోసం పరీక్ష.. చిక్కుల్లో ప్రియుడు! -
నవరసాల రాఘవ రెడ్డి
శివ కంఠమనేని హీరోగా, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాఘవ రెడ్డి’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్పై కేఎస్ శంకర్ రావ్, జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా జనవరి 4న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ను నటుడు, నిర్మాత మురళీ మోహన్ విడుదల చేశారు. సంజీవ్ మేగోటి మాట్లాడుతూ– ‘‘యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ అంశాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘మధురపూడి గ్రామం అనే నేను’ చిత్రంలో నా పాత్ర రగ్డ్గా ఉంటుంది. ‘రాఘవ రెడ్డి’లో సిన్సియర్, స్ట్రిక్ట్ ప్రోఫెసర్గా నటించాను. చక్కటి విందు భోజనంలా నవరసాలున్న సినిమా ఇది’’ అన్నారు శివ కంఠమనేని. ‘‘మా బ్యానర్ నుంచి వస్తోన్న మూడో సినిమా ఇది. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు వెంకటేశ్వరరావు. ఈ ట్రైలర్ విడుదల వేడుకలో నటి అన్నపూర్ణ, దర్శకుడు నీలకంఠ, సంగీతదర్శకుడు సుధాకర్ మారియో, ఎడిటర్ ఆవుల వెంకటేశ్, వరా ముళ్లపూడి, నటుడు అజయ్ ఘోష్ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: సంజీవ్ మేగోటి– సుధాకర్ మారియో, ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్: ఘంటా శ్రీనివాసరావు. -
ఆరేళ్ల కిందట పెద్దలను ఎదిరించి వివాహం!
సాక్షి, మహబూబ్నగర్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు బలవంతంగా మాత్రలు మింగించి కడతేర్చాడో భర్త. ఈ విషాదకర ఘటన ఆత్మకూర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ నరేందర్ వివరాల మేరకు.. పట్టణానికి చెందిన శివకావ్య (26) బీటెక్ చదువుతున్న సమయంలో స్థానిక బీసీకాలనీకి చెందిన వడ్ల భరత్తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆరేళ్ల కిందట పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు అన్విధ్ ఉన్నాడు. కట్నం కోసం శివకావ్యను వేధించడంతో రెండు పర్యాయాలు తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు తీసుకొచ్చి భర్తకు ఇచ్చింది, అయినప్పటికీ ఇంకా డబ్బులు కావాలని వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో శివకావ్య గర్భం దాల్చింది. డబ్బులు ఇచ్చేంత వరకు పిల్లలను కనేదిలేదని చెబుతూ 45 రోజుల కిందట భార్యతో బలవంతంగా మాత్రలను మింగించాడు. అవి వికటించడంతో శివకావ్య తీవ్ర అనారోగ్యానికి గురైంది. పలు ప్రవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా కోలుకోకపోవడంతో తల్లిదండ్రులు హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి ఆరెకటిక కిషన్జీ ఫిర్యాదు మేరకు వడ్ల భరత్, వేణుగోపాలాచారి, శారద ఇతర కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: ప్రాణాలు తీసిన నిద్రమత్తు.. డ్రైవర్తో సహాకూలీల కుటుంబాల్లో తీవ్ర విషాదం! -
రెగ్యులర్ కథలు చేయను : శివ కంఠమనేని
శివ కంఠమనేని, క్యాథలిన్ గౌడ జంటగా మల్లికార్జున్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఫిల్మ్ ‘మధురపూడి గ్రామం అనే నేను’. ముప్పా వెంకయ్య చౌదరి సారథ్యంలో జి.రాంబాబు యాదవ్ సమర్పణలో కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శివ కంఠమనేని మాట్లాడుతూ– ‘‘ఒంగోలు బ్యాక్డ్రాప్లో సాగే యాక్షన్ డ్రామా ఈ చిత్రం. మొరటుగా ఉండే సూరి పాత్రలో కనిపిస్తాను. తన మిత్రుడు బాబ్జీ ఎమ్మెల్యే కావడం కోసం సూరి ఏం చేస్తాడు? ఈ క్రమంలో అతని ప్రేమకథ ఏ విధంగా ప్రభావితమైంది? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. కమర్షియల్ పంథాలోనే ఈ సినిమా కథనం సాగుతుంది. ప్రేమ అనేది శరీరానికి కాదు.. మనసులకు సంబంధించినదనే సందేశం అంతర్లీనంగా ఉంటుంది. నేను రెగ్యులర్ కథలు చేయను. నేను చేసిన ‘అక్కడొకడుంటాడు’లో నా పోస్టర్స్ చూసి ‘మధురపూడి..’ సినిమా కథకు నన్ను ఎంపిక చేసుకున్నారు మల్లికార్జున్గారు. దాదాపు 150కిపైగా థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాం. నా తర్వాతి చిత్రాలు ‘మణిశంకర్, రాఘవరెడ్డి’ త్వరలో రిలీజ్ కానున్నాయి. మంచు లక్ష్మిగారి ‘ఆదిపర్వం’ చిత్రంలో పవర్ఫుల్ రోల్ చేస్తున్నాను’’ అన్నారు. -
హారర్ కామెడీ
శివ, గోవా జ్యోతి, స్వర్ణలత, పూజిత, సుమన్ శెట్టి, అప్పారావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘యజ్ఞ’. చిత్తజల్లు ప్రసాద్ దర్శకత్వంలో ఆర్ఆర్ మూవీ క్రియేషన్స్పై చిలుకోటి రఘురామ్, చలపల్లి విఠల్ గౌడ్, చిత్తజల్లు ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్, పాటల విడుదల వేడుకలో తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, నిర్మాత సాయివెంకట్, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞ శర్మ పాల్గొన్నారు.‘‘వినోదం, ప్రేమ, యాక్షన్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది’’అన్నారు చిత్తజల్లు ప్రసాద్. ‘‘మా చిత్రంలోని నటీనటులకు మంచి పేరు వస్తుంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సమర్పణ: దేశ్పాండే, సుభాష్, రావ్(దొర) ముళ్లవరం, కెమెరా: జి.కృష్ణనాయుడు, సంగీతం: లక్ష్మణ సాయి. -
క్లైమాక్స్ బాగుంటే హిట్టే – శివ నిర్వాణ
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొం దిన చిత్రం ‘ఖుషి’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం యూనిట్ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో శివ నిర్వాణ మాట్లాడుతూ– ‘‘శాస్త్రాలు, సిద్ధాంతాలు వేరు కావొచ్చు. కానీ ఎవరు ఏది నమ్మినా నమ్మకున్నా మనం మనల్ని ప్రేమించే మనుషులతో కలిసి ఉండాలని ‘ఖుషి’లో చెప్పం. క్లైమాక్స్ బాగుందని ప్రశంసలు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. క్లైమాక్స్ బాగుంటే సినిమా హిట్టే.. ఫెయిల్ అయిన చరిత్ర లేదు’’ అన్నారు. ‘‘షో బై షో కలెక్షన్స్ పెరుగుతున్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. ‘ఖుషి’ మంచి మూవీ కాబట్టి అవార్డులూ రావొచ్చు’’ అన్నారు నవీన్. ‘‘కథని నమ్మి ‘ఖుషి’ని నిర్మించాం. మా నమ్మకానికి తగ్గట్టు ఫలితాలు సానుకూలంగా వస్తున్నాయి’’ అన్నారు వై. రవిశంకర్. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్, సినిమాటోగ్రాఫర్ మురళి, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి పాల్గొన్నారు. -
ఆ పాయింట్తో ఖుషి తీశామనేది అవాస్తవం
‘‘నిన్ను కోరి, మజిలీ’ వంటి నా గత చిత్రాల్లో విఫలమైన ప్రేమకథలను చూపించాను. కానీ, ఈసారి పూర్తి స్థాయి వినోదం, ఉత్సాహంగా ఉండే ప్రేమకథ తీయాలని ‘ఖుషి’ చేశాను’’ అన్నారు శివ నిర్వాణ. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు శివ నిర్వాణ చెప్పిన విశేషాలు. డైరెక్టర్ మణిరత్నంగారి ఫ్యాన్గా ఆయన దగ్గర చేరాలనుకుని చెన్నై వెళ్లాను. కానీ ఆయన్ను కలవడానికి కుదరలేదు. మణిరత్నంగారి సినిమాలను ఇష్టపడతాను కానీ ఆయనలా తీయాలనుకోను. ఆయన తీసిన ‘సఖి’ లాంటిపాయింట్తో ‘ఖుషి’ తీశామనే వార్తలు అవాస్తవం. ప్రస్తుత సమాజంలోని ఒక సమకాలీన అంశాన్ని విజయ్, సమంతలాంటి స్టార్స్ ద్వారా చూపిస్తే బాగుంటుందని నమ్మాను. ప్రేమకథను ఎంత కొత్తగా చెప్పాలనే ఆలోచన నుంచి పుట్టిందే కాశ్మీర్ నేపథ్యం. ఈ చిత్రంలో విజయ్పాత్ర అమ్మాయిలకు, కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. సమంత వాస్తవ జీవితానికి, ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. నిర్మాతలు నవీన్, రవిశంకర్గార్లు డైరెక్టర్స్కు స్వేచ్ఛ ఇస్తారు కాబట్టి సంతోషంగా సినిమా చేసుకోవచ్చు. హేషమ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నేను డైరెక్ట్ చేసిన ‘నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్’ సినిమాల్లో కొన్నిపాటలు రాశాను. కానీ, ‘ఖుషి’కి అన్నిపాటలు రాయాల్సి వచ్చింది.. రాశాను. మనంపాన్ ఇండియా సినిమా చేయాలని ముందే అనుకుని, కథ రాసుకోనవసరం లేదనేది నా అభిప్రాయం.‘బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కార్తికేయ 2’ వంటి సినిమాలన్నీ మన నేటివిటీకి నచ్చేలా చేసుకున్నవి. ఇతర భాషల వాళ్లు కూడా వాటిని ఇష్టపడ్డారు కాబట్టిపాన్ ఇండియా సినిమాలు అయ్యాయి. మనకు నచ్చే మన నేటివిటీ సినిమా బాగా చేసుకుంటే అది ఇతరులకు నచ్చిపాన్ ఇండియా మూవీ అవుతుందన్నది నా అభిప్రాయం. -
మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి.. మనస్తాపంతో నిద్రమాత్రలు మింగి
అన్నమయ్య :భర్త తనను ఇంటి నుంచి గెంటివేసి, రెండోపెళ్లి చేసుకున్నాడని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో ఓ వివాహిత ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన సోమవారం మదనపల్లెలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కురవంకకు చెందిన డేరంగుల రమేష్, బాబూకాలనీకి చెందిన శివజ్యోతికి 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పిల్లలు లేరు. దీంతో శివజ్యోతిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ రమేష్ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశాడు. శివజ్యోతి తండ్రితో కలిసి బాబూకాలనీలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో మొదటిభార్యకు తెలియకుండా చరితను రెండో వివాహం చేసుకుని ఒక బిడ్డకు తండ్రి అయ్యాడు. విషయం తెలుసుకున్న శివజ్యోతి శనివారం భర్త ఇంటి ముందు తనకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేసింది. భర్తపై తాలూకా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రెండు రోజులుగా పోలీసులు ఫిర్యాదుపై స్పందించకపోవడం, భర్తపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో శివజ్యోతి మనస్తాపం చెంది ఆదివారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం ఆమె తేరుకోకపోవడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. -
ఇషా–శివ జోడీకి స్వర్ణం
బకూ (అజర్బైజాన్): ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. శుక్రవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఇషా సింగ్ –శివా నర్వాల్ జోడీ పసిడి పతకం సొంతం చేసుకుంది. తెలంగాణకు చెందిన ఇషా సింగ్... హరి యాణాకు చెందిన శివా నర్వాల్ ఫైనల్లో 16–10తో తర్హాన్ ఇలేదా–యూసుఫ్ డికెచ్ (తుర్కియే) ద్వయంపై విజయం సాధించారు. ఫైనల్ను మొత్తం 13 రౌండ్లపాటు నిర్వహించారు. ఒక్కో రౌండ్లో ఇరు జట్ల షూటర్లు రెండేసి షాట్లు లక్ష్యం దిశగా సంధిస్తారు. అత్యధిక పాయింట్లు సాధించిన జోడీకి రెండు పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. భారత జోడీ ఎనిమిది రౌండ్లలో నెగ్గగా, తుర్కియే జంట ఐదు రౌండ్లలో గెలిచింది. అంతకుముందు 65 జోడీలు పాల్గొన్న క్వాలిఫయింగ్లో ఇషా సింగ్–శివా నర్వాల్ ద్వయం 583 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్లో... తర్హాన్–యూసుఫ్ జోడీ 581 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించాయి. 580 పాయింట్లతో జియాంగ్ రాన్జిన్–జాంగ్ బౌవెన్ (చైనా), హనియె–సాజద్ (ఇరాన్) జంటలు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతక పోరుకు అర్హత పొందాయి. కాంస్య పతక మ్యాచ్లో రాన్జిన్–జాంగ్ బౌవెన్ ద్వయం 17–7తో హనియె–సాజద్ జంటను ఓడించింది. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత జోడీలకు నిరాశ ఎదురైంది. మెహులీ–ఐశ్వరీ ప్రతాప్ సింగ్ జోడీ 630.2 పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానంలో... రమిత –దివ్యాంశ్ జంట 628.3 పాయింట్లు సాధించి 17వ స్థానంలో నిలిచాయి. టాప్–4లో నిలిచిన జోడీలు మాత్రమే స్వర్ణ, రజత, కాంస్య పతకాల మ్యాచ్లకు అర్హత సాధిస్తాయి. మహిళల స్కీట్ టీమ్ ఈవెంట్లో పరీనాజ్ ధలివాల్, గనీమత్ సెఖోన్, దర్శన రాథోడ్ బృందం 351 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచింది. 8 ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్ చరిత్రలో భారత్ గెలిచిన స్వర్ణ పతకాలు. గతంలో అభినవ్ బింద్రా (2006; 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), మానవ్జిత్ సింగ్ (2006; ట్రాప్), తేజస్విని సావంత్ (2010; మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్), ఓంప్రకాశ్ (2018; 50 మీటర్ల పిస్టల్), అంకుర్ మిట్టల్ (2018; డబుల్ ట్రాప్), రుద్రాం„Š (2022; 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), రుద్రాం„Š , అర్జున్ బబూటా, అంకుశ్ జాదవ్ బృందం (2022; 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్) ఈ ఘనత సాధించారు. -
స్నేహితుల దినోత్సవం నాడే.. ఈ స్నేహితులకు చివరి రోజు..
భద్రాద్రి: స్నేహితులతో కలిసి సంబురాలు జరుపుకున్న కొద్దిసేపటికే అందులోని ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. బైక్పై వెళ్తూ డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో తోటి స్నేహితుల్లో విషాదం అలుముకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని కేఎల్ఆర్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న పాల్వంచ నవభారత్కు చెందిన ఏనిగ ఉపేందర్రెడ్డి కుమారుడు మధూకర్రెడ్డి (20), వరంగల్ జిల్లా నర్సంపేట మాదన్నపేట గ్రామానికి చెందిన దూడల శ్రీను కుమారుడు శివ (20)లు ఆదివారం సాయంత్రం బైక్పై నవభారత్ వైపు వెళ్తూ ఎన్ఎండీసీ కర్మాగారం సమీపంలో డివైడర్కు ఢీకొట్టారు. దీంతో ఇద్దరు ఎగిరి ముందుకు పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ నరేశ్, పట్టణ ఎస్ఐ బి.రాములు ఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటిన పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. సంబురాలు.. అంతలోనే విషాదం.. ఆదివారం సెలవు కావడంతో పాటు స్నేహితుల దినోత్సవం కాగా నవభారత్లో ఉంటున్న మధూకర్రెడ్డి మోటార్ సైకిల్పై పాల్వంచకు వచ్చాడు. కొద్దిసేపు స్నేహితులంతా కలుసుకుని సంబురాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో కొందరు మద్యం కూడా సేవించినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం మధూకర్రెడ్డి.. శివను మోటార్ సైకిల్పై ఎక్కించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో డివైడర్కు ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యారు. మధూకర్రెడ్డి మృతి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు తీవ్ర విషాదంలోకి వెళ్లారు. శివ ప్రమాదంపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి.రాము తెలిపారు. -
‘రాజుగారి కోడిపులావ్’ మూవీ రివ్యూ
టైటిల్: రాజుగారి కోడిపులావ్ నటీనటులు: శివ కోన, ప్రభాకర్, కునాల్ కౌశిక్, నేహా దేష్ పాండే, ప్రాచీ థాకేర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు నిర్మాణ సంస్థలు : ఏఎమ్ఎఫ్, కోన సినిమా నిర్మాతలు : అనిల్ మోదుగ, శివ కోన దర్శకత్వం : శివ కోన సంగీతం : ప్రవీణ్ మని సినిమాటోగ్రఫి : పవన్ గుంటుకు ఎడిటర్ : బసవా- శివ కోన విడుదల తేది: ఆగస్ట్ 4, 2023 ‘రాజుగారి కోడిపులావ్’కథేంటంటే.. రాజుగారు(ప్రభాకర్) ఓ హోటల్ రన్ చేస్తూ కోడిపులావ్ తో ఎంతో ఫేమస్ అవుతారు. ఆ చుట్టు పక్కల ఏరియా ప్రజలు రాజుగారి కోడిపులావ్ కోసం ఎగబడేవారు. ఇలా వ్యాపార పరంగా రాజుగారు సంతోషంగా ఉన్నప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా బాధగా ఉండేవాడు. దానికి కారణం తనకు కొడుకు పుడుతాడు అనుకుంటే కూతురు పుట్టడం, అలాగే తన భార్య తన మాట వినడం లేదని అసంతృప్తి. ఈ రెండు కారణాల వల్ల రాజుగారు తరచూ మద్యం సేవిస్తూ ఉండేవాడు. ఓ ప్రమాదంలో అతని రెండు కాళ్లు విరిగిపోవడంతో ఇంటికే పరిమితం అవుతాడు. కట్ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత మూడు జంటలు డ్యాని(శివ కోన)- క్యాండీ (ప్రాచి కెథర్), బద్రి(కునాల్ కౌశిక్)-ఆకాంక్ష(నేహాదేష్ పాండే), షారుఖ్(అభిలాష్ బండారి)-ఈషా(రమ్య దినేష్) రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. వీరిలో క్యాండీ, ఆకాంక్ష, బద్రి, ఫారుఖ్ కాలేజీ స్నేహితులు. ఈషా ఐటీ ఎంప్లాయ్. వీరంతా కలిసి కారులో ట్రిప్కి బయలుదేరగా మార్తమధ్యలో కారు పాడవుతుంది. దీంతో అడవిలో వీరంతా నడవాల్సి వస్తుంది. అలా ప్రయాణం సాగిస్తున్న ఈ మూడు జంటల్లో అనూహ్యంగా క్యాండీ మరణిస్తుంది. తన మరణానికి కారణం తెలియదు. ఆ మరుసటి రోజే ఈషా కపిపించకుండా పోతుంది. మిగిలిన నలుగురు భయంతో తిరిగి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కానీ అడవిలో వీరికి దారి దొరక్క తిరుగుతూనే ఉంటారు. చివరకు వీరికి ఆ దట్టమైన అడవిలో ఓ ఇల్లు కనిపిస్తుంది. అందులోకి వెళ్లిన తర్వాత అసలు ట్విస్ట్ మొదలవుతుంది. అసలు క్యాండి ఎలా మరణించింది? డ్యానీ ఎవరు? ఫారుఖ్, ఆకాంక్షల మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది? అసలు రాజుగారికి ఈ మూడు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్లో ‘రాజుగారి కోడిపులావ్’సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. రాజుగారి కోడిపులావ్ హోటల్ సీన్తో కథ ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది. అయితే కాసేపటికే కథ వేరే మలుపు తీసుకుంటుంది. మూడు జంటల పరిచయం.. వారి ఫారెస్ట్ ట్రిప్ ప్లాన్తో ఆసక్తికరంగా సాగుతుంది. కథ మొదలైన పది నిమిషాలకే ఆకాంక్ష, ఫారుఖ్ ల మధ్య ఉన్న రిలేషన్ రివీల్ అవుతుంది. అయితే వారు ఎందు ఒకరికోకరు అట్రాక్ట్ అయ్యారో కన్విన్సింగ్ గా ఉంటుంది. గైనకాలజిస్ట్ గా పరిచయం అయిన క్యాండీ లవర్ డ్యాని చాలా హుషారుగా కనిపించే పాత్ర ప్రథమార్థం అంతా చాలా కూల్ గు వెళ్తుంది. ఇక అడవిలోకి వీరు ఎంటర్ అయిన తరువాత కారు ఆగిపోవడంతో అప్పటి వరకు ఉన్న జోష్ మూడ్ ఒక్కసారిగి టెన్షన్ వాతావరణంలోకి వస్తుంది. ఏదో జరగబోతుందనే ఉత్కంఠత ప్రేక్షకుడిలో ఏర్పడుతుంది. ఒక చెట్టుపైన పెద్ద పెద్ద కోడికాళ్ల అచ్చులు చూపించడంతో దాని వెనక ఏదో నేపథ్యం ఉంటుందని అర్థమవుతుంది. క్యాండీ చనిపోయిన తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. అలాగే కొన్ని సంభాషణలు, సన్నివేశాలు ప్యామిలీ ఆడియన్స్ని ఇబ్బందికి గురి చేస్తుంది. డ్యానీ కనిపించకుండా పోవడంతో కథపై మరింత ఆసక్తి పెరుగుతంది. కానీ సెకండాఫ్లో ఆ ఆసక్తిని కంటిన్యూ చేయడంలో దర్శకుడు కాస్త విఫలం అయ్యాడు.అసలు కథకు రాజుగారికి ఉన్న ట్విస్ట్ సినిమాకు హైలెట్. అలాగే డ్యానీ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయి. ఇక క్లైమాక్స్ థ్రిలింగ్కు గురిచేస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో డ్యాని బాగా హైలెట్ అయింది. డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న ఈ పాత్రలో శివ కోన ఒదిగిపోయాడు. దర్శకుడిగా, నిర్మాతగా ఇంత పెద్ద బాధ్యత తీసుకున్నప్పటికీ నటన పరంగా ఎక్కడా తగ్గలేదు. శివ తర్వాత బాగా పండిన పాత్ర ప్రాచి కెథర్. క్యాండి పాత్రలో ప్రాచీ థాకర్ జీవించేసింది.యాక్టింగ్ పరంగా మెచ్యుడ్ గా ఫర్ఫార్మెన్స్ చేసింది. ఆకాంక్ష పాత్రని నేహా న్యాయం చేసింది.కునాల్ కౌశిక్ బద్రి పాత్రలో చాలా బాగా చేశారు. కాస్త కన్నింగ్ ఉన్న పాత్ర. చాల సహజంగా నటించారు. రెండు మూడు వేరియేషన్లు చూపించే పాత్రలో ప్రేక్షకులని మెప్పిస్తుంది. అలాగే రమ్య దినేష్ తన పాత్ర మేరకు బాగా చేసింది. ఇక రాజుగారి పాత్రలో ప్రభాకర్ తెరపై కనిపించేది కాసేపే అయినా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే..దర్శకుడికి ఇది తొలి సినిమానే అయినా చక్కగా హ్యాండిల్ చేశాడు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ను ఎలా చూపించాలో అంతే గ్రిప్పింగ్ గా చూపించాడు. ప్రవీన్ మణీ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్. సినిమాటో గ్రఫర్ పవన్ గుంటుకు మంచి విజువల్స్ అందించారు. అడవి లోకేషన్లు అందంగా చూపించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
నాగార్జున బ్లాక్ బస్టర్ మూవీ.. సైడ్ ఆర్టిస్ట్గా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్!
సినిమా ఇండస్ట్రీలో సొంతంగా ఎదగడం అనుకున్నంత సులభం కాదు. ఓవర్నైట్ స్టార్ గుర్తింపు వచ్చినా గ్లామర్ ఫీల్డ్లో నిలదొక్కుకోవటం అంతా ఆషామాషీ కాదు. కానీ ఏకంగా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ డైరెక్టర్గా ఎదగడమంటే మాటలు కాదు. అంతకుమించిన సక్సెస్ ఉండదు కూడా. అలాంటి అసాధ్యం కానీ విషయాన్ని చేసి చూపించాడు మన టాలీవుడ్ ఆర్టిస్ట్. అతనెవరో కాదు.. పోకిరీ మూవీతో చరిత్ర సృష్టించిన పూరి జగన్నాథ్. (ఇది చదవండి: మీరు అలా మాట్లాడుతుంటే సిగ్గేస్తోంది సార్: సీఎం తీరుపై సింగర్ ఫైర్) అప్పట్లో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ శివ. ఈ చిత్రంలో నాగార్జున హీరోగా నటించిగా.. ఆయన పక్కనే పూరి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా నటించారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆర్జీవీ ట్విటర్లో షేర్ చేయగా.. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆర్జీవీ ట్వీట్లో రాస్తూ..' ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా శివ సెట్స్లో సూపర్ స్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ . అతని విజయం నిజంగా స్ఫూర్తిదాయకం.' అంటూ శివ సినిమాలోని ఫోటోను షేర్ చేశారు. టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు. బద్రి నుంచి లైగర్ దాకా ఆయన ప్రభంజనం కొనసాగింది. తెలుగులో ఇప్పటివరకు ఆయన 33 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, దేశముదురు, పోకిరి, చిరుత, గోలీమార్, నేను నా రాక్షసి, బిజినెస్ మేన్, కెమెరామెన్ గంగతో రాంబాబు, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించారు. కాగా.. గతేడాది విజయ్ దేవరకొండతో తీసిన లైగర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ సినిమాతో నష్టాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్లు సైతం ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ముంబయిలో ఉంటున్నారు. (ఇది చదవండి: నాది చాలా చిన్న వయసు.. వారి ఉద్దేశమేంటో గుర్తించలేకపోయా: బుల్లితెర నటి) A would be Super Smart director #PuriJagan on the sets of SHIVA as a background artiste ..His is a truly inspirational RISE ! pic.twitter.com/BPJ6rOfgf1 — Ram Gopal Varma (@RGVzoomin) July 13, 2023 -
నైనా గంగోలి కి రిటర్న్ ఏం ఇచ్చారు ?
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
మహారాష్ట్రలో ఓటింగ్ సరళి ఉందిలా..
చక్కదిద్దుకునే అవకాశం మీ చేతుల్లోనే ఓటు హక్కును వినియోగించుకోండి
రోటీ చేసి, భోజనం వడ్డించిన ప్రధాని మోదీ - వీడియో
ఓటేసి మా బాధ్యత పూర్తి చేశాం(ఫొటోలు)
తెలంగాణలో ఓటేసిన రాజకీయ ప్రముఖులు (ఫొటోలు)
ఏపీ ఎన్నికల ఓటింగ్ పై కొమ్మినేని విశ్లేషణ
ఓటు హక్కు వినియోగించుకున్న YSRCP నేతలు
Obstructing field: జడ్డూ కావాలనే చేశాడా?.. సీఎస్కే కోచ్ స్పందన ఇదే!
సూపర్ మామ్: తన క్యూటీస్తో నయన తార స్పెషల్ వీడియో వైరల్
స్టేజీపై నటిస్తూ కన్నుమూసిన ప్రముఖ నటుడు
తప్పక చదవండి
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- శ్రీనగర్లో రికార్డులను అధిగమించనున్న ఓటింగ్ శాతం?
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్!
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
- నయవంచనకు చెక్ పెడదాం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement