-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు!
భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ హత్యపై ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అతను బతికే ఉన్నాడని అమెరికా పోలీసులు వెల్లడించారు. అమెరికాలోని హోల్ట్అవెన్యూలో మంగళవారం సాయంత్రం కొందరు దుండగులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కెనడా కేంద్రంగా పనిచేసే గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్గా స్థానిక మీడియా పేర్కొంది. వాస్తవానికి ఆ ఘటనలో చనిపోయిన వ్యక్తి వివరాలను గుర్తించిన తర్వాత ఈ పోలీసులు ఈ ప్రకటన చేశారు.కాల్పుల ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. మృతుడు గోల్డీబ్రార్ కాదని లెఫ్టినెంట్ విలియం జే డూలే అని పోలీసులు వెల్లడించారు. మీరు మృతుడు గోల్డీబ్రార్ అనుకుంటే కచ్చితంగా తప్పే. అది పూర్తి అవాస్తవం. మా డిపార్ట్మెంట్కు ప్రపంచం నలుమూలల నుంచి ఎంక్వైరీలు వస్తున్నాయి. అసలు ఇలాంటి వదంతులు ఎలా వచ్చాయో తెలియదు. ఈ కాల్పుల ఘటనలో మరణించింది 37 ఏళ్ల జేవియర్ గాల్డ్ అని తెలిపారు.కాగా.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపైకి కాల్పులు జరిపిన ఘటనలో కూడా గోల్డీబ్రార్ పేరు తెరపైకొచ్చింది. ఈ కేసులో అరెస్టైన నిందితుల్లో పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. గోల్డీ బ్రార్గా ప్రచారంలో ఉన్న సతీందర్ సింగ్ భారత్లో మోస్ట్వాంటెడ్ క్రిమినల్. అతడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్లో అత్యంత కీలకమైన సభ్యుడు. 2022లో జరిగిన పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవా హత్య కేసుతో అతని పేరు వెలుగులోకి వచ్చింది. -
కన్నప్పలో అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘కన్నప్ప’ చిత్రం షూటింగ్లో జాయిన్ అయ్యారు. విష్ణు మంచు టైటిల్ రోల్లో రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ షూటింగ్లో జాయిన్ అయ్యారు అక్షయ్ కుమార్. ఈ సందర్భంగా మోహన్బాబు, విష్ణు మంచు కలిసి అక్షయ్కి స్వాగతం పలికారు. ‘‘శివ భక్తుడైన కన్నప్ప కథను ‘కన్నప్ప’గా తెరపైకి తీసుకొస్తున్నాం. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ మూవీ రూపొందుతోంది. హైదరాబాద్లో మూడో షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. అక్షయ్తో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు మేకర్స్. -
Bengaluru: బెదిరింపులకు భయపడం: డీకే శివకుమార్
బెంగళూరు: తన తమ్ముడు డీకే సురేష్ను కాల్చి చంపాలని బీఏపీ నేత ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. డీకే సురేష్ ఇలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తి కాదని, ఇలాంటివి తాము గతంలో చాలా చూశామన్నారు. వాటన్నింటని సెటిల్ చేశామని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో దక్షిణాదికి నిధులు సరిగా దక్కకపోవడంపై డీకే సురేష్ మాట్లాడుతూ దేశాన్ని ఉత్తర, దక్షిణ భారత దేశాలుగా విభజించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు దుమారాన్ని రేపాలయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఈశ్వరప్ప.. డీకే సురేష్, ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి లాంటి వాళ్లను కాల్చి చంపేందుకు చట్టం చేయాల్సిందిగా ప్రధాని మోదీకి చెబుతానన్నారు. అయితే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే డీకే సురేష్ వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలను సమర్థించదని తేల్చి చెప్పారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ ఈశ్వరప్పకు కొట్టడం, తిట్టడం, కాల్చడం తప్ప ఏమీ తెలియదన్నారు. ఈశ్వరప్పపై చట్టపరమైన చర్యలుంటాయని చెప్పారు. కాగా, డీకే సురేష్ను కాల్చి చంపాలన్నందుకు ఈశ్వరప్పపై బెంగళూరులో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై ఈశ్వరప్ప స్పందిస్తూ జాతీయవాదం, హిందుత్వ అంశాల్లో తనపై వందల ఎఫ్ఐఆర్లు నమోదైనా భయపడనని స్పష్టం చేశారు. ఇదీ చదవండి.. ముగిసిన 17వ లోక్సభ.. పార్లమెంట్ నిరవధిక వాయిదా -
నెతన్యాహును ఆ మోడల్లో చంపాలి : కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
కొచ్చి: ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుపై కేరళకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహూపై న్యూరెంబర్గ్ మోడల్ వాడాలని కాసర్గడ్ ఎంపీ రాజమోహన్ ఉన్నితన్ వ్యాఖ్యానించారు. పాలస్తీనాలోని గాజాపై యుద్ద నేరానికి పాల్పడినందుకుగాను నెతన్యాహును ఎలాంటి విచారణ లేకుండా కాల్చి చంపాలని రాజ్మోహన్ అన్నారు. కేరళలోని కాసర్గఢ్లో పాలస్తీనాకు మద్దతుగా జరిగిన ఓ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారానికి తెరలేపింది. జెనీవా కన్వెన్షన్ కింద అన్ని ఒప్పందాలను ఉల్లంఘించిన వారిని ఇంతకంటే ఏం చేయాలని ఎంపీ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ప్రస్తుతం ప్రపంచం ముందు యుద్ధ నేరస్తుడిగా నెతన్యాహు నిల్చున్నారని తెలిపారు. పాలస్తీనీయన్లపై పాల్పడ్డ అకృత్యాలకు అతడిని వెంటనే న్యూరెంబర్గ్ మోడల్లో అంతమొందించాల్సిందేనన్నారు. కాగా, న్యూరెంబర్గ్ మోడల్లో శిక్షలను హిట్లర్ ఆధ్వర్యంలోని నాజీలు ఎక్కువగా అమలు చేసేవారు. ఈ పద్ధతిలో యుద్ధ ఖైదీలను ఎలాంటి విచారణ లేకుండా కాల్చి చంపేశేవారు. ఇదీచదవండి..కాంగ్రెస్ నేతలపై దాడి.. జ్యోతి పటేల్ సంచలన ఆరోపణలు -
హాంబర్గ్ విమానాశ్రయంలో కాల్పుల కలకలం..
జర్మనీలోని హాంబర్గ్ విమానాశ్రయంలోకి చొరబడిన ఓ ఆగంతకుడు కాల్పుల కలకలం సృష్టించాడు. శనివారం రాత్రి విమానాశ్రయంలోకి కారుతో సహా దూసుకువచ్చిన ఆగంతకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో విమానాశ్రయంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటన దరిమిలా హాంబర్గ్ విమానాశ్రయంలో ట్రాఫిక్ను నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. ‘కస్టడీ వివాదం’ ఈ ఘటనకు కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. శనివారం రాత్రి సుమారు 8 గంటలకు ఒక అగంతకుడు కారులో భద్రతా ప్రాంతం గుండా ఎయిర్స్ట్రిప్కి ఆనుకొని ఉన్న రహదారి పైకి కారుతో సహా దూసుకువచ్చాడు. అనంతరం తుపాకీతో రెండుసార్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. కాగా ప్రస్తుతానికి విమానాల టేకాఫ్లు, ల్యాండింగ్లను నిలిపివేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 27 విమానాలు దెబ్బతిన్నాయని సమాచారం. కాల్పులు జరిపిన ఆ వ్యక్తి కారులో నుండి రెండు మండుతున్న బాటిళ్లను బయటకు విసిరినట్లు పోలీసులు తెలిపారు.దీంతో మంటలు చెలరేగాయన్నారు. ఇది కూడా చదవండి: నేపాల్లో మళ్లీ భూప్రకంపనలు.. తీవ్రత ఎంతంటే.. -
భార్యపై కోపంతో బార్లో కాల్పులు.. ఆరుగురి మృతి
కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. దక్షిణ కాలిఫోర్నియా ఆరెంజ్ కౌంటీలోని ప్రముఖ బైకర్స్ బార్లో బుధవారం రాత్రి రిటైర్డ్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే మరణించగా. మరో ఆరుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు హతమయ్యాడు. గాయపడిన ఆరుగురిని పోలీసులు చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా కుటుంబ వివాదాల కారణంతో నిందితుడి భార్య కొంతకాలంగా అతన్ని దూరం పెట్టినట్లు ఆరెంజ్ కౌంటీ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్యను లక్ష్యంగా చేసుకుని ట్రబుకో కాన్యన్లోని కార్నర్ బార్లో కాల్పులకు తెగబడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో మొత్తం 11 మందిపై కాల్పులు జరగగా.. నిందితుడు సహా ఐదుగురు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: రష్యా: యెవ్గెనీ ప్రిగోజిన్ మృతిపై బైడెన్ షాకింగ్ కామెంట్స్ Mass shooting at a bikers bar in Orange County. A retired sheriff deputy was involved shoot his wife and nine other victims . He was killed in the shoot out, pic.twitter.com/Bh7PjYsWFW — Don Salmon (@dijoni) August 24, 2023 -
వర్షం మధ్య దాహార్తి తీర్చుకుంటున్న పులి.. అలరిస్తున్న అరుదైన వీడియో!
జూపార్కులో సఫారీ చేసే సమయంలో పులి కనిపించడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. అయితే ఊహించని రీతిలో సఫారీలో ఉన్న పర్యాటకులకు పులి ఎదురైతే ఇక వారి ఆనందానికి హద్దులుండవు. ఇలాంటి సందర్భాల్లో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఐఎఫ్ఎస్ అధికారి రమేష్ పాండే తన ట్విట్టర్ అకౌంట్లో ఇటువంటి క్లిప్నే షేర్ చేశారు. కర్నాటకలోని నేషనల్ పార్కులో కనిపించిన పులికి సంబంధించిన క్లిప్ అది. ఈ వీడియో బందీపూర్ నేషనల్పార్కులో షూట్ చేశారు. వీడియోలో ఒక పులి భారీగా వర్షం కురుస్తున్న సమయంలో నీరు తాగుతూ కనిపిస్తుంది. అది ఎంత సావధానంగా నీరు తాగుతున్నదో ఈ వీడియోను చూస్తే తెలుస్తుంది. ఈ వీడియోకు ఇప్పటివరకూ 2 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ అరుదైన వీడియో వీక్షకులను ఇట్టే ఆకట్టుకుంటోంది. వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: తల్లీకొడుకులను కలిపిన భారీ వరదలు.. 35 ఏళ్ల క్రితం వేరయి.. Tiger sighting in Monsoons. This comes from Bandipur. VC: FD Bandipur pic.twitter.com/OIgak01xV9 — Ramesh Pandey (@rameshpandeyifs) July 26, 2023 -
గన్తో ఆటలాడుతూ గర్భంతో ఉన్న అమ్మ కడుపులోకి బుల్లెట్ దించేసి..!
అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. గన్తో ఆటలాడుతూ ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మ(31) కడుపులోకి బుల్లెట్ దించేశాడు ఓ రెండేళ్ల చిన్నారి. దీంతో ఎనిమిది నెలల గర్బంతో ఉన్న తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఇంట్లో ఆటలాడుతూ తండ్రి బెడ్ రూమ్లోకి వెళ్లాడు రెండేళ్ల చిన్నారి. లాకర్లో ఉన్న గన్ను ఆటబొమ్మ అనుకుని తీసుకున్నాడు. సినిమాల్లో చూసిన మాదిరే ఆటలాడసాగాడు. ఇతర గదిలో పనిలో ఉన్న అమ్మ(లారా ఐగా) వద్దకు వచ్చి పిస్టల్ను పేల్చేశాడు. తల్లి అరుపులతో తల్లిడిల్లిపోగా పిల్లాడు కూడా ఏడవడం ప్రారంభించాడు. కొనప్రాణాలతో ఉన్న బాధితురాలు భర్తకు ఫోన్ చేసింది. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ బాధితురాలు మృతి చెందింది. తన పిల్లాడే ఆటబొమ్మ అనుకుని గన్తో కాల్చాడని ఆస్పత్రికి వెళ్లే క్రమంలో పోలీసులకు బాధితురాలు వెల్లడించింది. గన్లో 12 రౌండ్స్ బుల్లెట్లు లోడ్ చేసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గన్ను పిల్లలకు అందకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: అందం కోసం కొత్త దంతాలు.. ‘షార్క్’లా మారిన యువకుడు! -
యోగక్షేమాలు అడుగుతూనే.. టీచర్పై విద్యార్థుల ఘాతుకం..
భోపాల్: చదువులు నేర్పించిన టీచర్పైనే విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. యోగక్షేమాలను కనుక్కుంటూనే దాడి చేశారు. కేవలం ట్యూషన్ ఫీజు అడిగారనే పిస్టల్తో హత్యాయత్నం చేశారు. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లా జౌరా రోడ్ ప్రాంతంలో జరిగింది. ఇదీ జరిగింది.. గిర్వార్ సింగ్ను విద్యార్థులు ఇంటి బయట నుంచి పిలిచారు. ఉపాధ్యాయుడు బయటికి రాగానే ఎలా ఉన్నారంటూ చర్చను ప్రారంభించారు. ఇంతలోనే ఓ కుర్రాడు జేబులోంచి పిస్టల్ తీసి సార్ను కాల్చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితున్ని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. విద్యార్థులు గత మూడేళ్ల క్రితం వరకు గిర్వార్ సింగ్ కోచింగ్ సెంటర్లో విద్యను నేర్చుకున్నారు. అందుకు సంబంధించిన ఫీజులు మాత్రం చెల్లించలేదు. పలు సందర్భాలలో ఆ డబ్బులపై విద్యార్థులను ప్రశ్నించారు గిర్వార్ సింగ్. దీంతో కక్ష పెంచుకున్న నిందితులు సార్పై దాడికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇదీ చదవండి: రైల్లో మహిళతో అసభ్యకర ప్రవర్తన.. అడ్డుకుందని బయటకు తోసేశారు -
వెనుక నుంచి ఫాలో అవుతూ.. బ్యూటీ పార్లర్లో వధువుపై కాల్పులు జరిపిన పోలీస్!
పాట్నా: మేకప్ కోసం బ్యూటీ పార్లర్కు వెళ్లిన ఓ వధువుపై కానిస్టేబుల్ తుపాకీతో కాల్పులు జరిపాడు. పార్లర్ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ దారుణ ఘటన బీహార్లోని ముంగేర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తారాపూర్ డయారాలోని మహేశ్పూర్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల అపూర్వ కుమారికి ఇటీవల ఓ వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి రోజు దగ్గర పడడంతో ఆమె మేకప్ కోసం బ్యూటీ పార్లర్కు వెళ్లింది. అయితే ఓ వ్యక్తి రహస్యంగా ఆమెను ఫాలో అవుతూ బ్యూటీ పార్లర్కు చేరుకున్నాడు. యువతి మేకప్ వేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా వెనుక నుంచి ఓ వ్యక్తి పిస్టల్తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక బుల్లెట్ కుమారి భుజం నుంచి దూసుకెళ్లి ఛాతీ నుంచి బయటకు వచ్చింది. కుమారిపై కాల్పులు అనంతరం.. కానిస్టేబుల్ ఆ తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, భయంతో పిస్టల్ అతని చేతిలో నుంచి జారిపోవడంతో అతను అలా చేయలేకపోయాడు.పార్లర్ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇదంతా బ్యూటీపార్లర్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. గాయపడిన యువతిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమెదు చేసుకుని ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. ‘నిందితుడు పాట్నాలో పోలీస్ కానిస్టేబుల్గా పని చేస్తున్నట్లు గుర్తించాం. అతను మహేశ్పూర్ గ్రామానికి చెందినవాడు, అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించాం. త్వరలో అరెస్టు చేస్తామని’ డీఎస్పీ తెలిపారు. వధువుకి, అతనికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు కాల్పులు జరిపాడు? అన్న ప్రశ్నలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని చెప్పారు. చదవండి: ప్రేమ పెళ్లి.. భర్తకు షాకిచ్చిన స్కూల్ టీచర్ భార్య, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్తో కలిసి... -
Anasuya Bharadwaj : కొత్త లుక్ ఫోటోలు షేర్ చేసిన యాంకర్ అనసూయ..ఫోటోలు వైరల్
-
మెట్రోస్టేషన్లో కాల్పుల కలకలం.. వీడియో వైరల్
టెహ్రాన్: ఇరాన్లో మహ్సా అమినీ లాకప్ డెత్ కారణంగా హిజాబ్ వ్యతిరేక అందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అదీగాక మరోవైపు ఇదే నవంబర్లో 2019లో పెట్రోల్ ధరల పెంపు విషయమై బ్లడీ అబాన్ (బ్లడీ నవంబర్) పేరిట పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఆ నిరసనల అణచి వేత వార్షికోత్సవం సందర్భంగా అప్పటి నిరసనలో చనిపోయిన సుమారు వంద మందిని స్మరించుకుంటూ నిరసనకారులు ఇరాన్ వీధుల్లో మూడు రోజుల పాటు నిరసనలకు పిలుపునిచ్చారు. ఇప్పుడూ ఈ నిరసనలు హిజాబ్ వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలకు తోడవ్వడంతో వాటిని అణిచివేసే భాగంలో ఇరాన్ భద్రతా బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. అందులో భాగంగానే టెహ్రాన్లోని ఓ మెట్రోస్టేషన్లోని ప్రయాణికులపై భద్రతా బలగాలు కాల్పలు జరిపాయి. కాల్పులతో బెదిరిపోయిన ప్రయాణికులు.. అక్కడి నుంచి పారిపోయేయత్నం చేయడం, కింద పడిపోవడం చూడొచ్చు. ఇక మరో వీడియోలో అండర్ గ్రౌండ్ రైలులో.. హిజాబ్ ధరించని మహిళలను సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు చెదరగొట్టే దృశ్యాలు కనిపిస్తున్నాయి. మా పోరాటం కొనసాగుతుంది. ఇరాన్కు మళ్లీ మంచిరోజులు వస్తాయి అంటూ నినాదాలు చేయడం వీడియోలో గమనించొచ్చు. Security officials cause a stampede in a Tehran metro station when they open fire on protestors. pic.twitter.com/e55HAfKcpS — Mike (@Doranimated) November 15, 2022 హిజాబ్ ధరించనందుకే మహ్సాను అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసుల కస్టడీలోనే సెప్టెంబర్ 16వ తేదీన మృతి చెందింది. దీంతో ఇరాన్ అంతటా పెద్ద ఎత్తున హిజాబ్ వ్యతిరేక నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అదీగాక అమిన్ మరణ తదనంతరం గత మూడు నెలలుగా జరుగుతున్న నిరసనల్లో ఒక పోలీసు, సెక్యూరిటీ అధికారి, ట్రాఫిక్ పోలీసుని నిరసకారులు హతమార్చడంతో కోర్టు వారికి మరణశిక్షలు విధించమని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సాయుధ బలగాలు బహిరంగంగా కాల్పులకు తెగబడ్డాయి. అతేగాక పశ్చిమ నగరంలోని సనందాజ్లోని కుర్దిస్తాన్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులపై కూడా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ మేరకు ఇరాన్ మానవ హక్కుల సంఘం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు అమినో మరణంతో చెలరేగిన హింసాకాండలో భద్రతా దళాలు 43 మంది పిల్లలు, 26 మంది మహిళలతో సహా సుమారు 342 మందిని చంపినట్లు పేర్కొంది. అంతేగాక కనీసం 1500 మంది నిరసకారులను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. ఐతే ఇరాన్ అధికారులు ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్ మానవ హక్కుల డైరెక్టర్ మహమూద్ అమిరీ మొగద్దమ్ ఇరాన్ ఈ మరణశిక్షలను ఖండించడమే గాక వారిని నేరాలను అంగీకరించేలా చేసేందుకు ఈ హింసకు పాల్పడిందని అన్నారు. ఇరాన్ చెరలో ఉన్నవారందరికీ సాముహిక మరణ శిక్షలు విధించే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం టెహ్రాన్ మెట్రోస్టేషన్లో ప్రయాణికులపై బలగాలు జరిపిన కాల్పులకు సంబంధించిన వీడియో నెట్లింట వైరల్ అవుతోంది. Security officials cause a stampede in a Tehran metro station when they open fire on protestors. pic.twitter.com/e55HAfKcpS — Mike (@Doranimated) November 15, 2022 (చదవండి: చెట్లకు సెలైన్లో విషం పెట్టి.. లక్షకు కిలో లెక్కన అమ్మి.. ) -
ఏం జరిగిందని ప్రశ్నించారని..పోలీసులపైకి గన్ గురిపెట్టి...
సాక్షి, పంజాగుట్ట: పోలీసులపైకి గన్ చూపించిన వ్యక్తిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి లైసెన్స్డ్ గన్, ఆరు రౌండ్ల బుల్లెట్లు స్వా«దీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...చిత్తూరు జిల్లాకు చెందిన వెంకట నాగేంద్ర రెడ్డి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. ప్రస్తుతం జీడిమెట్లలో ఉంటూ ఓ ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ ఇన్చార్జిగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం తెల్లవారు జామున 3:30 ప్రాంతంలో అమీర్పేట బిగ్బజార్ వీధిలో ట్రాన్స్జెండర్స్తో గొడవ పడుతున్నాడు. గమనించిన పెట్రోలింగ్లో ఉన్న కానిస్టేబుల్ సాయికుమార్, హోంగార్డు రవీంద్రబాబులు వెళ్లి సమస్య ఏమిటని ప్రశ్నించారు. దీంతో వెంకట నాగేంద్ర రెడ్డి తనవద్ద ఉన్న గన్ను పోలీసులకు గురిపెట్టాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా అతడ్ని పట్టుకుని స్టేషన్కు తరలించారు. అతని వద్ద ఉన్న గన్, ఆరు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గన్ లైసెన్స్ ఉన్నప్పటికీ దాని గడువు అయిపోయినట్లు తెలుస్తుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గన్ గురిచూపినా బెదరకుండా చాకచక్యంగా పట్టుకున్న కానిస్టేబుల్ సాయికుమార్, హోం గార్డు రవీంద్రబాబులను నగర పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ అభినందించారు. వారికి ఒక్కొక్కరికీ 2500 క్యాష్ రివార్డు, జ్ఞాపికను అందించారు. (చదవండి: ‘డర్టీ పిక్చర్’లో కొత్త కోణం! మహిళ ప్రమేయం లేకుండానే ఫొటో వైరల్ ) -
సినిమా రేంజ్లో దోపిడి...డబ్బు, బంగారంతో పరార్
లక్నో: సినిమాలో విలన్ మాదిరి దోపిడికి చేసి డబ్బు నగలతో పరార్ అయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో బులందష్హర్లో చోటు చేసుకుంది. ఇద్దరు దుండగులు ఒక దుకాణంలోకి చొరబడి యజమానిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. అక్కడ ఉన్న వారందర్నీ తుపాకితో బెదిరిస్తూ దర్జాగా కౌంటర్ దగ్గరికి వెళ్లి బ్యాగ్ నిండా డబ్బు, నగలు పెట్టుకుని పరారయ్యారు. వెళ్తు వెళ్తూ అక్కడే ఉన్న ఒక మహిళా కస్టమర్ బ్యాగ్ని కూడా లాక్కుని పారిపోయారు. ఈ ఘటన మొత్తం సీసీఫఫుటేజ్లో రికార్డు అవ్వడంతో వెలుగు చూసింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అంతేగాదు పోలీసులు ఏడు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు సీనియర్ అధికారి తెలిపారు. (చదవండి: మహిళలపై లాఠీ ఝళిపించిన పోలీసులు..ఉద్రిక్తంగా యూపీ) -
దోపిడి చేసేందుకు వచ్చి కాల్పుల వీరంగం
న్యూఢిల్లీ: ఒక దుండగుడు దుకాణం వద్దకు వచ్చి కాల్పుల కలకలం సృష్టించాడు. ఈ ఘటన ఢిల్లీలోని దరీపూర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఢిల్లీలోని ఒక గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటార్ బైక్ పై దుకాణం వద్దకు వచ్చి గాల్లో కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఆ ఇద్దరు దుండగులు షాపులోకి వెళ్లి యజమానిని భయబ్రాంతులకు గురిచేసి దాదాపు రూ. 50 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్ల తెలిపారు. షాపు యజమానిని భయపట్టేందుకు ఆ దుండగులు ఇలా గాల్లో కాల్పులు జరిపి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఐతే ఈ ఘటన మొత్తం దుకాణం వద్ద ఉన్న సీసీఫుటేజ్లో రికార్డు అయ్యింది. దీంతో పోలీసులు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: నకిలీ వెబ్సైట్లతో చీటింగ్... 12 మంది అరెస్టు) -
పుతిన్ ప్రకటన సృష్టిస్తున్న ప్రకంపనం... గాయపడ్డ కమాండర్: వీడియో వైరల్
Man Decide Jail Is Better Than Deat In Ukraine War: రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్ యుద్ధం కోసం పెద్ద ఎత్తున మిలటరీ మొబైలైజేషన్(సైనిక సమీకరణ) కోసం పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. అంటే యుద్ధంలో పాల్గొనే వయస్కులందరికి నిర్బంధ సైనిక శిక్షణతో యుద్ధానికి సన్నద్ధం అయ్యేలా చేసి కదన రంగంలోకి దింపుతారు. దీంతో రష్యన్ యువతలో తీవ్ర అలజడి మొదలైంది. ఎలా తప్పించుకోవాలంటూ ఆందోళన చెందుతున్నారు. కొంతమంది వేరే దేశాలకు పారిపోయే యత్నాలు కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక రష్యాన్ యువకుడు డ్రాఫ్ట్ కార్యాలయం(సైనిక శిక్షణ కార్యాలయం)పై దాడులు జరిపాడు. అంతేకాదు ఆ కార్యాలయంలో నిర్బంధ సైనిక శిక్షణకు వచ్చిన వారిని పారిపోమంటూ పిలుపునిస్తూ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో డ్రాఫ్టింగ్ కార్యాలయ కమాండర్ తీవ్రంగా గాయపడ్డాడు. దుండగుడు అధికారిని పాయింట్ బ్లాక్ రేంజ్కి సమీపంలో కాల్పులు జరిపాడు. ఈ ఘటన రష్యాలోని సైబీరియన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో పోలీసులు వెంటనే అప్రమత్తమై దుండగడుని రుస్లాన్ జినిన్గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో ఉక్రెయిన్ యుద్ధం కోసం మొబైలైజేషన్ చేయడంతో ఈ కాల్పులకు తెగబడ్డానని చెప్పాడు. అంతేగాదు ఉక్రెయిన్ యుద్ధంలో చనిపోయే కంటే జైల్లో ఉండటమే మంచిదని ఇలా చేసినట్లు చెప్పాడు. అధికారులు సదరు కమాండర్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐతే అతడి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. Mobilized man killed a drafting office commander in Ust-Ilimsk, Irkutsk region, Russia. Alexandr Yeliseev, the commander, was shot four times almost point blank. The murderer is Ruslan Zinin, born in 1997, "partially mobilized". He decided jail is better than death in Ukraine. pic.twitter.com/s0IvHJZJBO — Anton Gerashchenko (@Gerashchenko_en) September 26, 2022 (చదవండి: పుతిన్ ప్రకటనతో రష్యాలో అల్లకల్లోలం..భయాందోళనతో దేశం బయటకు!) -
దారుణం.. ఉపాధ్యాయుడిపై పదో తరగతి విద్యార్థి కాల్పులు
లక్నో: ఉత్తర్ప్రదేశ్ సీతాపుర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. 10వ తరగతి విద్యార్థి తనకు పాఠాలు బోధించే ఉపాధ్యాయుడిపైనే కాల్పులకు తెగబడ్డాడు. నాటు తుపాకీతో స్కూల్కి వెళ్లి టీచర్పై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే అదృష్టవశాత్తు బుల్లెట్ కీలకమైన అవయవాలకు తగలకపోవడం వల్ల ఉపాధ్యాయుడు ప్రాణాలతో బయటపడ్డాడు. తనపై కాల్పులు జరిపిన విదార్థిని టీచర్ ధైర్యంగా ప్రతిఘటించిన దృశ్యాల సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ ఘటన చూసి పాఠశాలలోని కొందరు విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. మరికొంత మంది విద్యార్థులు మాత్రం ఉపాధ్యాయుడి వద్దకు చేరుకున్నారు. కాల్పులు జరిపిన విద్యార్థిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. తన తోటి విద్యార్థితో గొడవపడినందుకు ఈ విద్యార్థిని టీచర్ మందలించినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహం చెందిన అతడు పగ పెంచుకుని ఉపాధ్యాయుడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు అదనపు ఎస్పీ రాజీవ్ దీక్షిత్ చెప్పారు. వైద్యుల సూచన మేరకు ఉపాధ్యాయుడ్ని లక్నో ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. చదవండి: 21 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు ఇంకా టచ్లోనే ఉన్నారు -
మూడేళ్ల చిన్నారి చేతిలో తల్లి మృతి
అమెరికాలో మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు తన తల్లిని కాల్చి చంపింది. ఈ ఘటన సౌత కరోలినాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మూడేళ్ల పసిపాపకి అనుకోకుండా తుపాకీ లభించింది. అంతే ఆ చిన్నారి ఆ తుపాకీని పట్టుకుని ఆడుకోవడం ప్రారంభించింది. దీన్నీ చూసిన చిన్నారి తల్లి వెంటనే అప్రమత్తమై ఆమె వద్ద నుంచి లాక్కునేందుకు యత్నించింది. ఐతే చిన్నారి నుంచి లాక్కునే క్రమంలో తల్లిపై ప్రమాదవశాత్తు కాల్పులు జరిపింది ఆ చిన్నారి. ఆ ప్రమాదంలో చిన్నారి తల్లి తీవ్రంగా గాయపడింది. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని ఆ చిన్నారి అమ్మమ్మ వెల్లడించారు. బాధితురాలు స్పార్టన్బర్గ్లో నివశించే కోరా లిన్ బుష్ అనే మహిళగా గుర్తించారు అధికారులు. ఇలా యూఎస్లోని చిన్నారుల్లో దాదాపు 194 మంది ప్రమాదవశాత్తు కాల్పులు జరిపారని, అందువల్ల సుమారు 82 మంది మరణించగా, 123 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. (చదవండి: అణుయుద్ధం జరిగినప్పుడూ... జుట్టుకి కండీషనర్ వద్దు..హెచ్చరించిన పుతిన్) -
వీడియో తీయొద్దు అన్నందుకు.... డ్యూటీలో ఉన్న పోలీస్ని గట్టిగా కరిచి పరార్..
ముంబై: మహారాష్ట్రలో ఒక వ్యక్తి డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ని గట్టిగా కరిచి గాయపరిచాడు. తమను వీడియో తీస్తున్నాడని ఒక పోలీసు జోక్యం చేసుకుని అడ్డుకున్నందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలో నాగ్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మకర్ధోక్డా గ్రామానికి చెందిన రాకేష్ పురుషోత్తం గజ్భియే అనే 30 ఏళ్ల వ్యక్తి తనతో వివాదం పెట్టుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేయమంటూ పోలిస్టేషన్కి వెళ్లాడు. ఐతే పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో ఆగ్రహం చెందిన వ్యక్తి ఆ పోలిస్టేష్న్ ఆవరణలో ఉన్న పోలీసులందర్నీ ఫోన్లో వీడియో తీయడం ప్రారంభించాడు. దీన్ని గమనించిన ఒక పోలీసు జోక్యం చేసుకుని అడ్డుకున్నందుకు అతన్ని గట్టిగా కరిచి ద్విచక్ర వాహనం పై పారిపోయాడని పోలీసులు తెలిపారు. డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని తన విధులు నిర్వర్తించకుండా అడ్డుకుని గాయపరిచినందుకు సదరు వ్యక్తి గజ్భియేపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: మద్యం బాటిళ్లతో గాజుల తయారీ... జీవనోపాధి ఇస్తూ...వ్యర్థాలకు చెక్) -
వాషింగ్టన్లో కాల్పుల కలకలం... ఇద్దరికి గాయాలు
న్యూయార్క్: వాషింగ్టన్ లీస్ట్రీట్ వీధిలోని ఐడియా పబ్లిక్ చార్టర్ స్కూల్ బ్లాక్ వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతలో ఘటన జరిగినట్టు వాషింగ్టన్ పోలీస్ రాబర్ట్ కాంటె తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. 15 ఏళ్ల యువకుడు ఆ స్కూల్లోని ఇద్దరు విద్యార్థులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సదరు నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. అంతేకాదు ఆ స్కూల్లో ఉన్న దాదాపు 350 మంది విద్యార్థులను, స్కూల్ సిబ్బందిని ఈ విషయమై విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వాషింగ్టన్ డీసీ మెట్రోపాలిటన్ పోలీస్ చీఫ్ అధికారులు మాట్లాడుతూ...ఈ ఏడాది సుమారు రెండు వేల అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతేడాదితో పోల్చితే అదనంగా 800 అక్రమ ఆయుధాలు ఎక్కు ఉన్నాయన్నారు. అదే బుధవారం వేరొక ఘటనలో ఒక భవనం వద్ద మరో బాలుడు తుపాకీ కాల్పుల్లో మృతి చెందినట్లు తెలిపారు. (చదవండి: 20 ఏళ్ల యుద్ధానికి తెరపడిన రోజు... అఫ్గాన్లో మిన్నంటుతున్న సంబరాలు) -
ఆ పుకార్లు నిజమే.. తేల్చి చెప్పేసిన రష్మిక మందన్నా..
Rashmika Mandanna Shoot With Tiger Shroff: అతికొద్ది సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది రష్మిక మందన్నా. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ నేషనల్ క్రష్. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసిన నటించిన‘మిషన్ మజ్ను’ విడుదలకు సిద్దంగా ఉంది. త్వరలోనే మరో చిత్రం ‘గుడ్బై’ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇటీవల రష్మిక మందన్నాపై అనేక రూమర్లు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అందులో ఒక రూమర్ నిజమే అని తేల్చి చెప్పింది ఈ బ్యూటీ. రష్మిక మందన్నా, బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కలిసి ఒక యాడ్లో కలిసి నటించారు. దీనికి సంబంధించిన బూమరాంగ్ వీడియోను ఇన్స్టా వేదికగా పంచుకుంది రష్మిక. ఈ వీడియో పోస్ట్ చేస్తూ 'ఆ రూమర్లు నిజమే.. చాలా నవ్వోస్తోంది. నేను, టైగర్ ష్రాఫ్ ఒక యాడ్ కోసం కలిసి నటించాం. టైగర్ ష్రాఫ్తో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉంది. ఈ యాడ్ కోసం ఎదురుచూస్తున్నాను' అని రాసుకొచ్చింది. ఈ స్టోరీని టైగర్ ష్రాఫ్ షేర్ చేస్తూ 'షూట్ చేయడం సరదాగా ఉంది. నువ్ ఎప్పటిలాగే అదరగొట్టావ్' అని క్యాప్షన్ ఇచ్చాడు. సో.. రష్మిక నిజమని చెప్పిన రూమర్ ఇదన్నమాట. చదవండి: అలా మరిచిపోతే విలువ ఉండదు: నాగ చైతన్య ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్ 'ఆర్ఆర్ఆర్'పై పోర్న్ స్టార్ ట్వీట్.. నెట్టింట జోరుగా చర్చ View this post on Instagram A post shared by 🆃🅸🅶🅴🆁🆂🅷🆁🅾🅵🅵 (@tigershroff_fp__) -
కసాయి కొడుకు... మద్యం మత్తులో కన్నతల్లిపైనే..
మద్యపానం ఎన్నో కుటుంబాలను కార్చిచ్చులా కాల్చేస్తోంది. ఎన్నో జీవితాలు ఈ మద్యపానం కారణంగా నాశనమైయ్యాయి. ఆఖరికి ఎడిక్షన్ సెంటర్లు సైతం ఇలా మద్యపానానికి బానిసైన వాళ్లను మార్చేందుకు ముందుకు వచ్చినప్పటికీ... ఇంకా చాలాచోట్ల యువత పెడదోవపట్టి ఈ తాగుడు మహమ్మారికి బానిసై భావి జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి మద్యానికి బానిసై దారుణమైన అఘాయిత్యానికి ఒడిగట్టాడు. వివరాల్లోకెళ్తే...ఉత్తరప్రదేశ్లోని ఒక వ్యక్తి మద్యం మత్తులో కన్నతల్లినే హతమార్చాడు. ఈ ఘటన చౌవియా ప్రాంతంలోని నాగ్లా మర్దాన్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మద్యం మత్తులో ఉన్న శివ ప్రతాప్ అనే వ్యక్తి దేశీయ తుపాకీతో గాల్లో కాల్పులు జరిపాడు. ఐతే ప్రమాదవశాత్తు ఒక బుల్లెట్టు అతని కన్నతల్లి శరీరంలోకి దూసుకపోయింది. దీంతో అక్కడికక్కడే అతని తల్లి ఊర్మిళా దేవి కుప్పకూలి చనిపోయింది. ఈ ఘటన అనంతరం నిందుతుడు శివప్రతాప్ పరారయ్యినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. నిందితుడి ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. -
అమెరికాలో ఉన్మాది కాల్పులు..:19 చిన్నారులు బలి
అమెరికా మళ్లీ నెత్తురోడింది. తరాలుగా వెర్రితలలు వేస్తున్న తుపాకుల సంస్కృతి మరోసారి వికటాట్టహాసం చేసింది. ముక్కుపచ్చలారని 19 మంది పసి పిల్లలను బలి తీసుకుంది. హూస్టన్: అమెరికాలో ఓ 18 ఏళ్ల యువకుడు మారణహోమానికి తెగబడ్డాడు. ఓ ఎలిమెంటరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులకు దిగాడు. 19 మంది స్టూడెంట్లతో పాటు ఇద్దరు టీచర్లను పొట్టన పెట్టుకున్నాడు. టెక్సాస్ రాష్ట్రంలో శాన్ ఆంటోనియోకు 134 కిలోమీటర్ల దూరంలోని ఉవాల్డే టౌన్లో మంగళవారం ఈ ఘోరం జరిగింది. హంతకున్ని సాల్వడార్ రామోస్ అనే స్థానికునిగా గుర్తించారు. అతను బులెట్ప్రూఫ్ జాకెట్ ధరించి ఏఆర్–15 సెమీ ఆటోమాటిక్ రైఫిల్, మరో హాండ్ గన్, భారీ సంఖ్యలో బులెట్ మ్యాగజైన్లతో ఉదయం 11.30కు స్థానిక రాబ్ ఎలిమెంటరీ స్కూల్లోకి చొరబడ్డాడు. ఓ క్లాస్రూమ్లో దూరి విచక్షణారహితంగా కాల్పుల వర్షం కురిపించాడు. దాంతో 14 మంది పిల్లలు, ఇద్దరు టీచర్లు అక్కడికక్కడే నేలకొరిగారు. మరో ఐదుగురు పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసులు రంగప్రవేశం చేసి హంతకున్ని కాల్చేశారు. చనిపోయిన బాలలంతా 5 నుంచి 10 ఏళ్ల లోపు వాళ్లేనని వెల్లడిస్తూ నగర పోలీస్ చీఫ్ కన్నీటిపర్యంతమయ్యారు. క్లాస్రూమ్లో 30 మంది దాకా పిల్లలున్నట్టు సమాచారం. వారిలో చాలామంది గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అంటున్నారు. ఆస్పత్రుల విజ్ఞప్తికి స్పందించి వారికి రక్తం అందించడానికి చాలామంది ముం దుకొచ్చారు. ఇంతటి ఘోరానికి కారణాలు ఇంకా తెలియకపోయినా, హంతకుడు చిన్నప్పుడు స్కూల్లో తోటి పిల్లల చేతిలో నిత్యం హేళనలకు గురై స్కూలు మానేశాడని అతని స్నేహితుడు చెబుతున్నాడు. ఆ గాయాలే ఈ దారుణానికి పురిగొల్పి ఉంటాయని భావిస్తున్నారు. స్కూల్లో నరమేధానికి ముందు ఇంట్లో నాయనమ్మను కూడా అతడు కాల్చి తీవ్రంగా గాయపరిచాడని తెలుస్తోంది. కాల్పులపై దేశమంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో తుపాకీ సంస్కృతిపై మరోసారి సర్వత్రా చర్చ మొదలైంది. దానికి ఇకనైనా చరమగీతం పాడాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. 10 రోజుల క్రితమే న్యూయార్క్లో ఓ జాత్యహంకారి కాల్పుల్లో 10 మంది నల్లజాతీయులు మరణించడం తెలిసిందే. తీవ్రంగా కలచివేసింది: కమల కాల్పుల ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. ‘‘ఇలాం టివి జరిగినప్పుడు ‘మా గుండెలు బద్దలయ్యా’ యని అనడం సహజం. కానీ నిత్యం జరుగుతున్న కాల్పులతో అమెరికన్ల గుండెలు పదేపదే బద్దలవుతూనే ఉన్నాయి. ఇకనైనా మనం ధైర్యం కూడదీసుకోవాలి. వీటికి శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగాలి’’ అన్నారు. ఈ ఏడాది 212 మాస్ షూటౌట్లు అమెరికాలో ఈ ఏడాది ఇప్పటికే ఏకంగా 212 సామూహిక కాల్పుల ఘటనలు జరిగినట్టు గన్ వయోలెన్స్ ఆర్కైవ్ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. నలుగురు, అంతకంటే ఎక్కువ మంది చనిపోతే సామూహిక కాల్పుల ఘటనగా చెబుతారు. ఇలాంటివి సగటున రోజుకు ఒకటి కంటే ఎక్కవగా జరుగుతుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలని సీఎన్ఎన్ వార్తా సంస్థ వాపోయింది. అమెరికాలో స్కూళ్లలో కాల్పులు జరగడం ఈ ఏడాది ఇది 27వ సారి! తాజా హత్యాకాండ అమెరికాలో జరిగిన అతి పెద్ద స్కూలు దారుణాల్లో రెండోది. 2012లో కనెక్టికట్లో శాండీ హాక్ ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన కాల్పుల్లో 26 మంది మరణించారు. ఆయుధ లాబీలకు ముకుతాడు: బైడెన్ తుపాకుల వాడకాన్ని నియంత్రిద్దాం ఆ దిశగా చట్టాన్ని కఠినతరం చేద్దాం చట్టసభల సభ్యులకు అధ్యక్షుని పిలుపు కాల్పులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. జపాన్లో క్వాడ్ సదస్సులో పాల్గొని అధ్యక్ష విమానం ఎయిర్ఫోర్స్వన్లో తిరిగొస్తుండగా ఆయనకు విషయం తెలిసింది. దాంతో, ఇది మాటలకందని దారుణమంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సంతాప సూచకంగా దేశవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని శనివారం సాయంత్రం దాకా సగం మేర అవనతం చేయాలని ఆదేశించారు. విమానంలో నుంచే జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘‘అభంశుభం తెలియని చిన్నారులు తమ కళ్లముందు జరిగిన ఈ బీభత్సానికి ఎంతగా హడలిపోయి ఉంటారో! స్నేహితులు కళ్ల ముందే కాల్పులకు బలవుతుంటే ఎంతగా తల్లడిల్లి ఉంటారో!! పిల్లలను కోల్పోవడమంటే ఆత్మలో ఓ భాగాన్ని పోగొట్టుకోవడమే. ఆ ఆలోచనే హృదయంలో అంతులేని శూన్యం నింపుతుంది’’ అంటూ ఆక్రోశించారు. వాషింగ్టన్ చేరుతూనే భార్య జిల్తో కలిసి మరోసారి జాతినుద్దేశించి మాట్లాడారు. తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్లను ప్రస్తావించారు. ఆ దిశగా కార్యాచరణకు దిగేందుకు తాజా ఘటనే నాంది కావాలని చట్టసభ సభ్యులకు పిలుపునిచ్చారు. ‘‘నేను జపాన్ బయల్దేరే కొద్ది రోజుల ముందే న్యూయార్క్లోని బఫెలోలో జాతి విద్వేష కాల్పలకు 10 మంది నల్లజాతీయులు బలయ్యారు. వారి కుటుంబాలను ఓదార్చిన క్షణాలు నా మనసులో ఇంకా తాజాగానే ఉన్నాయి. ఈలోపే దాన్ని తలదన్నే మరో ఘోరం!’’ అంటూ ఆక్రోశించారు. ‘‘ఇతర దేశాల్లో అత్యంత అరుదుగా జరిగే ఇలాంటి దారుణాలు అమెరికాలో మాత్రం పదేపదే జరిగేందుకు మనమెందుకు అవకాశమిస్తున్నాం? మన చేతుల్లో ఏమీ లేదని చెప్పొద్దు. ఇలాంటివి వినీ వినీ విసిగిపోయాను. ఆయుధ లాబీలను అడ్డుకునేందుకు, వాటికి ముకుతాడు వేసేందుకు సత్తా మనలో కరువైందా?’’ అంటూ ప్రశ్నించారు. ‘‘ఇంకా ఉపేక్షించేది లేదు. చేతలకు దిగాల్సిన సమయం ఆసన్నమైంది’’ అన్నారు. ‘‘తుపాకుల సంస్కృతికి అడ్డుకట్టే వేసేలా చట్టాన్ని కఠినతరం చేయాల్సిందే. ఇందుకు చట్టసభ సభ్యులను ఒప్పించేందుకు ఏం చేయాలో ఆలోచిస్తాం’’ అని ప్రకటించారు. -
ట్రంప్ నిర్వాకాలను బయటపెట్టే పుస్తకం
'Can't you just shoot them?': అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఎన్నో వివాదాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కూడా విచిత్రమైన నిర్ణయాలతో వివాదస్పదమైన నాయకుడిగా ముద్ర వేయించుకున్నాడు. ఇప్పుడు తాజాగా ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దూకుడుగా వ్యవహరించిన మరో అంశం వెలుగులోకి వచ్చింది. ఈ నేపధ్యంలో మే 2020లో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడుని మిన్నియా పాలిస్ పోలీసు సిబ్బంది చేతుల్లో హత్యకు గురైన నాటి సంగతి తెరపైకి వచ్చింది. నాటి నల్లజాతీయుడి హత్యనంతరం నిరసనలు వెల్లువెత్తడంతో ట్రంప్ నిరసనకారులను అణిచివేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపాడు. పైగా వారిపై కాల్పులు జరపమని మిలటరికీ ఆదేశాలు జారీ చేశాడని అమెరికా మాజీ రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్సర్ తాను రాసిన పుస్తకంలో తెలిపాడు. నాటి ఘటనలో సైన్యానికి అన్ని పవర్లు ఇచ్చేలా అత్యంత అరుదుగా ఉపయోగించే 200 ఏళ్ల నాటి తిరుగుబాటు చట్టాన్ని అమలు చేయడానికి యత్నించాడని కూడా రాశారు. అంతేగాక తాను వ్యతిరేకించినందుకుగానూ ట్రంప్ తనని పదవి నుంచి తొలగించినట్లు కూడా వెల్లడించారు. ఈ మేరకు నాటి రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్సర్ తాను రాసిన ‘ఎ సేక్రేడ్ ఓత్’ అనే పుస్తకంలో ట్రంప్తో నాటి జ్ఞాపకాలను వివరించాడు. జనరల్ క్యాబినెట్ సభ్యులచే సమీక్షించబడిన ఈ పుస్తకం మే 10న విడుదల కానుంది. (చదవండి: దాదాపు 2 లక్షల మంది ఉక్రెయిన్ పిల్లలను రష్యాకి తరలింపు) -
వెంకటేష్-సల్మాన్ ఖాన్ సినిమా షురూ.. విలన్గా ?
Salman Khan Venkatesh Starrer Kabhi Eid Kabhi Diwali Shoot Started: కొత్త సినిమా షూటింగ్ షురూ అంటున్నారు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, వెంకటేష్, పూజా హెగ్డే ప్రధాన తారాగణంగా ‘కబీ ఈద్ కబీ దీవాలి’ (‘బాయిజాన్’ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది) అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు వచ్చే నెలలో ప్రారంభం కానుంది. మే 11న ఈ సినిమా షూటింగ్ను ముంబైలో ఆరంభించనున్నారు. ఇందు కోసం ఓ భారీ సెట్ వేశారు. ఈ షెడ్యూల్లో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొంటారు. ఇక ఇటీవల ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ కోసం ముంబైలో ఉంటున్న వెంకటేశ్ కూడా ఈ షెడ్యూల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. విలన్గా.. దక్షిణాదిన తిరుగు లేని విలన్గా దూసుకెళుతోన్న జగపతిబాబు ‘కబీ ఈద్ కబీ దీవాలి’లో విలన్గా నటిస్తారనేది బీ టౌన్ టాక్. ఒకవేళ ఈ వార్త నిజమైతే హిందీలో జగపతిబాబుకి ఇదే తొలి చిత్రం అవుతుంది. ఈ సినిమాను తొలుత వచ్చే ఏడాది రంజాన్కు రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ ఏడాది డిసెంబరు 30నే సినిమాను రిలీజ్ చేస్తామని ఇటీవల చిత్రయూనిట్ తెలిపింది. చదవండి: ఇంతవరకు నేను సౌత్ సినిమాలే చూడలేదు: బాలీవుడ్ నటుడు అడల్ట్ సైట్లో ఫోటో లీక్, 15ఏళ్లకు చేదు అనుభవం: నటి
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
దేశంలో బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే?
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ కీలక ఆదేశాలు
పాక్తో సిరీస్ కంటే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడి ఉంటే బాగుండేది..!
సంచలన నివేదికలు.. మరోసారి తెరపైకి షానన్ - మస్క్ సాన్నిహిత్యం
ఒంటెల్లాంటి చెట్లు! ఇవి కేవలం అక్కడ మాత్రమే..
మౌంట్ ఎవరెస్ట్పై పర్యాటకుల తాకిడి
బీఆర్ఎస్పై రఘునందన్ రావు సంచలన ఆరోపణలు.. ఈసీకి లేఖ
'లవ్ మీ' సినిమాకు తొలిరోజు షాకింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?
ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..
Sakshi News Cartoon: అనవసరంగా తనని పాలిటిక్స్లోకి లాగొద్దంటున్నాడ్సార్!
తప్పక చదవండి
- టీ20 ప్రపంచకప్ కోసం న్యూయార్క్కు బయల్దేరిన టీమిండియా
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
- Viral Video: నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. కార్లు, కత్తులతో ఫైటింగ్
- ఓటీటీ లవర్స్కు జియో సినిమా బంపరాఫర్
- చరిత్ర సృష్టించిన షకీబ్.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడిగా..!
- Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'!
- బ్యాన్ చేసిన వారే ఆమె టాలెంట్కు నివ్వెరపోయారు
- సెలక్ట్ చేసి చివరి నిమిషంలో హ్యాండిచ్చేవారు: హీరోయిన్
- ఇన్సూరెన్స్ లైసెన్స్ అప్లికేషన్ను విత్ డ్రా.. పేటీఎం మరో కీలక నిర్ణయం
- క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావా
Advertisement