-
పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
సోలార్ పంప్ ఇన్స్టాలేషన్ సౌలబ్యాన్ని రైతులకు అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 2019లో 'ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్' (పీఎం కుసుమ్) స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకం ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉంది. రైతులకు దీని మీద పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల సోలార్ పంప్ ఇన్స్టాలేషన్ ఎక్కువగా అమలు కాలేదు. ఇప్పుడు రైతులకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ఏడాది ప్రారంభమైన 'పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన' మాదిరిగానే.. ఇప్పుడు రైతులు ఈ సోలార్ పంప్ ఇన్స్టాలేషన్ కోసం నేషనల్ పోర్టల్ ద్వారా విక్రేతలతో కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది రైతులు ఇష్టపడే సోలార్ పంపుల రకాన్ని ఎంచుకోవడంలో మాత్రమే కాకుండా ఇన్స్టాలేషన్ సమయాన్ని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది.కుసుమ్ యోజన స్కీమ్ అనేది మూడు భాగాలుగా ఉంటుంది. అవి 10000 మెగావాట్ల సోలార్ పవర్ యూనిట్లను ఏర్పాటు చేయడం, 2 మిలియన్ స్టాండ్-అలోన్ సోలార్ అగ్రికల్చర్ పంపులను ఏర్పాటు చేయడం, 1.5 మిలియన్ వ్యవసాయ పంపులను సోలారైజ్ చేయడం. వ్యవసాయ పంపుల ఇన్స్టాలేషన్, సోలారైజేషన్ కోసం హేతుబద్ధీకరణ కోసం చర్చలు జరుగుతున్నాయి. కానీ సబ్సిడీలో ఎటువంటి మార్పులు లేదు. కేంద్రం దీనికోసం రూ.34,422 కోట్లు కేటాయించింది.సోలార్ పంప్ ఇన్స్టాలేషన్లు, సోలారైజేషన్ కోసం కేంద్రం 30% సబ్సిడీని అందిస్తుంది. రాష్ట్రాలు కూడా 30 శాతం సబ్సిడీ అందిస్తాయి. ఈ పథకం కోసం బ్యానుకులు కూడా తక్కువ వడ్డీకి లోన్స్ అందిస్తాయి. అయితే కేంద్రంతో పాటు రాష్ట్ర సబ్సిడీ కాంపోనెంట్ కూడా పోర్టల్లో పేర్కొనటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.రైతు తాను ఏర్పాటు చేసుకున్న సోలార్ పంపుసెట్ నుంచీ తాను వాడుకోగా మిగిలిన సోలార్ పవర్ను డిస్కంలకు విక్రయించుకోవచ్చు. దీని ద్వారా రైతు డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. అయితే దీనికోసం రైతులు ఆయా డిస్కంలతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. డిస్కంలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని బట్టి 25 సంవత్సరాల వరకు రైతుల నుంచి కరెంటు కొంటారు.ఇదిలా ఉండగా.. ఫిబ్రవరిలో 10 మిలియన్ల గృహాలకు రూఫ్టాప్ సోలార్ యూనిట్లను ఇన్స్టాల్ చేయాలనే లక్ష్యంతో ప్రారంభమైన పీఎం సూర్యఘర్ ముఫ్ట్ బిజిలీ యోజన పథకానికి ఇప్పటి వరకు 8,00,000 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
సౌరశక్తి ఉత్పాదనలో జపాన్ను తలదన్నిన భారత్
భారత్ 2023లో సౌరశక్తి ఉత్పాదనలో జపాన్ను వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సౌరశక్తి ఉత్పాదక దేశంగా అవతరించింది. గ్లోబల్ ఎనర్జీ సెక్టార్లో పనిచేస్తున్న పరిశోధనా సంస్థ అంబర్ తన నివేదికలో ఈ విషయాన్ని తెలిపింది.2015లో సౌరశక్తి వినియోగంలో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. భారత్ గత కొన్ని ఏళ్లుగా సౌరశక్తి వినియోగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. దాని ఫలితమే ఈ విజయం. ‘గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ’ పేరుతో అంబర్ ఈ నివేదికలో 2023లో ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో 5.5 శాతం సౌరశక్తి రూపంలో లభించిందని పేర్కొంది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వృద్ధి 2023లో ఆశా జనకంగా ఉందని, అయితే చైనాలో కరువు కారణంగా జలవిద్యుత్ ఉత్పత్తి ఐదేళ్ల కనిష్టానికి పడిపోయిందని ఆ నివేదిక పేర్కొంది.ప్రపంచంలో అత్యంత చౌకైన సౌరశక్తిని ఉత్పత్తి చేసే దేశం భారతదేశం అయితే అత్యంత ఖరీదైన సౌరశక్తిని ఉత్పత్తి చేసే దేశం కెనడా. 2023 నాటికి భారతదేశం సౌరశక్తి ఉత్పత్తి విషయంలో ప్రపంచంలోనే నాల్గవ దేశంగా నిలిచింది. ఈ విషయంలో చైనా, అమెరికా, బ్రెజిల్లు అగ్రస్థానంలో ఉన్నాయి. సౌరశక్తి వృద్ధిలో ఈ నాలుగు దేశాల వాటా 2023లో 75 శాతంగా ఉంది. జపాన్.. భారత్ తరువాతి స్థానంలో నిలిచింది.భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తిలో సౌరశక్తి సహకారం 2015లో 0.5 శాతంగా ఉండగా, ఇది 2023లో 5.8 శాతానికి పెరిగింది. సౌర శక్తి 2030 నాటికి ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో 22 శాతానికి పెరగనున్నదనే అంచానాలున్నాయి. 2030 నాటికి పునరుత్పాదక సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచాలని యోచిస్తున్న కొన్ని దేశాలలో భారతదేశం ఒకటి. -
భారత్లో సోలార్ సొల్యూషన్స్ అందిస్తున్న నం.1 కంపెనీ
ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్ భారత్లో సోలార్ సొల్యూషన్స్ అందించేందుకు పునరుత్పాదక ఇంధన సంస్థ క్లీన్మాక్స్తో జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేసింది. ఈ సంయుక్త సంస్థ భారతదేశంలోని ఆరు పారిశ్రామిక ప్రదేశాల్లో 14.4 మెగావాట్ల సోలార్ రూఫ్టాప్లను అమర్చింది. తాజాగా రెండు కంపెనీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్టాప్లతో 2.07 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఇదీ చదవండి: భారీ ఆర్డర్లకు కొత్త విద్యుత్తు వాహనాలు ఇండియాలో యాపిల్ తన కార్పొరేట్ కార్యకలాపాలను పెంపొందించుకునేందుకు ఈ భాగస్వామ్యం ఎంతో ఉపయోగపడుతుందని తెలిసింది. దేశవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీపై అవగాహన కలిగిస్తూ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను పెంచడమే ఈ భాగస్వామ్యం లక్ష్యమని క్లీన్మాక్స్ తెలిపింది. -
Ramoji, RK: సైకోల నుంచి సైతాన్లుగా ప్రమోషన్!
రోజు-రోజుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలు దిగజారిపోయి పాఠకులను హింసిస్తున్నాయి. రాజకీయ పరిభాషలో చెప్పాలంటే ఈ రెండు సంస్థల యజమానులు రామోజీరావు, రాధాకృష్ణలు సైకోల నుంచి సైతాన్ల స్థాయికి ప్రమోషన్ పొందినట్లు అనిపిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రడ్డిపై విద్వేషంతో ఏపీపై పగబట్టి రాస్తున్న వార్తలు దారుణంగా ఉంటున్నాయి. ఈ శాసనసభ ఎన్నికల వరకు ఈ బాధ తప్పదని తెలిసినా, మరీ నీచంగా మారడం అత్యంత శోచనీయం అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఈనాడు పచ్చి మోసపూరిత వార్తలు రాసింది. రామోజీరావు ఈ విధానం కరెక్టు అని భావిస్తే దానినే ధైర్యంగా రాసి బీజేపీని తీవ్రంగా విమర్శించాలి. కాని అంత ధైర్యం లేదు. పైగా వారు ఈయనకు పద్మ విభూషణ్ బిరుదు కూడా ఇచ్చారు కదా! దానికి సదా కృతజ్ఞతగా లొంగి ఉండాలి కదా! బీజేపీ తనకు ఎన్నికల నిధులు ఇవ్వడం లేదనుకున్నవారిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయపన్ను శాఖ వంటివాటిని ప్రయోగిస్తోందన్న ఆరోపణ వస్తోంది. అది నిజమా? కాదా? కొన్ని ఆంగ్ల పత్రికలలో ఏ ఏ కంపెనీలపై దాడులు జరిగాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏ కంపెనీలు బాండ్లు కొనుగోలు చేశాయి. వాటిలో అత్యధిక భాగం బీజేపీకే దక్కాయా? లేదా? అన్నది ఆ వార్తల సారాంశం. బీజేపీకి మొత్తం విరాళాలలో ఏభై శాతం నిధులు దక్కితే ఆ తర్వాత టీఎంసీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎమ్కే వంటి పార్టీలు ఉన్నాయి. తదుపరి వైసీపీ, టీడీపీ ఉన్నాయి. ఈ విరాళాలపై విశ్లేషిస్తే బీజేపీకి నిదులు ఇచ్చిన కంపెనీలు ఏవి? స్వచ్చందంగా ఇచ్చాయా? లేక భయపడి ఇచ్చాయా? అన్న అంశాలపై పరిశోధన చేయవచ్చు. కొన్ని ఆంగ్ల పత్రికలు ఈ విషయంలో వివరణాత్మక స్టోరీలు ఇచ్చాయి. ఈనాడు మీడియాకు, దాని అదినేత రామోజీరావుకు దేశం అంతా ఎటు పోయినా ఫర్వాలేదు. ఎవరికి ఎన్నివేల కోట్ల రూపాయల నిధులు వచ్చినా ఇబ్బంది లేదు.. కాని ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్కు నిదులు వస్తే మాత్రం ఏదో ఒక చెత్తరాసి బురదచల్లుతారు. ఈ కధనంలో అవేవో కంపెనీలకు భూములు ఇచ్చి ఫేవర్ చేసినందుకే అవి విరాళాలు ఇచ్చాయని రాశారు. వైసీపీకి అందుకే ఇచ్చారని అనుకుందాం. మరి తెలుగుదేశంకు ఎందుకు విరాళాలు ఇచ్చారు. అధికారంలో ఉన్న వైసీపీకి 499 కోట్లు విలువైన బాండ్లు వస్తే, తెలుగుదేశంకు 320 కోట్ల మేర బాండ్లు వచ్చాయి. అంటే ఆయాకంపెనీలను తెలుగుదేశం బ్లాక్ మెయిల్ చేసి ఆ డబ్బును సంపాదించిందా? తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా తెలుగు రాష్ట్రాలలోని కంపెనీలే ఎందుకు వచ్చాయి? చంద్రబాబు అంటే భయపడి ఇచ్చాయా? లేక ఆయన బెదిరించి సంపాదించారా? ఉదాహరణకు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిది అని పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశారు కదా? వారు ఎక్కడ ఏ పరిశ్రమ పెడుతున్నా అటు తెలుగుదేశం కాని, ఇటు ఈనాడు రామోజీరావు కాని దానిని అడ్డుకోవడానికి నానా ప్రయత్నాలు చేసేవారు కదా! ఎంతో విషం చిమ్మేవారు కదా! అదే కంపెనీ నుంచి తెలుగుదేశం పార్టీకి నలభై కోట్ల విరాళం ఎలా అందింది. నిజంగానే అది వైఎస్సార్సీపీ సంబందించిన వారిది అనుకుంటే టీడీపీ తిరస్కరించి ఉండవచ్చుకదా! అంటే బ్లాక్ మెయిల్ చేసి ఆ కంపెనీ నుంచి విరాళం రాగానే టీడీపీ నోరు మూసేసుకుందా? బీజేపీకి రూ.8,250 కోట్ల బాండ్లు, కాంగ్రెస్కు రూ.1,951 కోట్లు, టీఎమ్సీకి రూ.1,716 కోట్లు, బీజేడీకి రూ.1,019 కోట్లు, డీఎంకేకి రూ.656 కోట్ల విలువైన బాండ్లు వచ్చాయి. బీఆర్ఎస్కు రూ.1,408 కోట్ల బాండ్లు లబించాయి. చివరికి ఒక్క అసెబ్లీ సీటు మాత్రమే గెలుచుకున్న జనసేనకు కూడా 21 కోట్లు వచ్చాయని లెక్కలు చెబుతున్నాయి కదా! వీరందరికి ఏ రకంగా వచ్చాయో ఎందుకు విశ్లేషించలేదో రామోజీ చెప్పగలరా! టైమ్స్ ఆఫ్ ఇండియా చేసిన ఒక విశ్లేషణ ప్రకారం డీఎమ్కే , వైఎస్ ఆర్ కాంగ్రెస్లకు వాటికి రావాల్సిన వాటా రాలేదని వెల్లడించింది. వైఎస్సార్సీపీ, డీఎంకేల కన్నా చిన్న పార్టీ అయిన బీఆర్ఎస్కు రెండు, మూడు రెట్ల నిదులు ఎందుకు వక్కువ వచ్చాయి? వైసీపీకి 23 మంది లోక్ సభ, తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రావల్సినంత రాలేదన్నది దీని అర్ధం. అదే టైమ్లో కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, 3 లోక్ సభ , ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్న టీడీపీకి 320 కోట్ల బాండ్లు ఎలా దక్కాయో చెప్పాలి కదా! కొన్ని కంపెనీలపై ఐటీ, ఈడీ దాడులు జరిగిన తర్వాతే అవి బీజేపీకి బాండ్ల రూపంలో నిదులు సమకూర్చిన విషయాన్ని కొన్ని ఆంగ్ల పత్రికలు సమగ్రంగా ఇచ్చాయి. ఇవన్ని పక్కనబెట్టి రామోజీరావు వైసీపీపైనే పడి ఎందుకు ఏడుస్తున్నారు? విశేషం ఏమిటంటే ఒకపక్క వైఎస్ జగన్మోహన్రడ్డి అధికారంలోకి వచ్చాక పరిశ్రమలను తరిమేశారని పదే, పదే రాస్తుంటారు కదా? అదంతా అబద్దమని శనివారం నాడు రాసిన పత్రికలో రాసిన ఈ బాండ్ల కధనంతో తేలిపోయింది. వైసీపీకి 96 కంపెనీల నుంచి విరాళాలు అందితే అందులో 26 విద్యుత్ కంపెనీలు అని ఈ పత్రిక రాసింది. అంటే కొత్తగా కేవలం విద్యుత్ రంగంలోనే 26 కంపెనీలు వస్తున్నట్లు ఒప్పుకున్నట్లే కదా? వారు విరాళం ఇచ్చారంటే రాష్ట్రంలో పరిశ్రమలు పెడుతున్నట్లే కదా! 30826 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి, ముఖ్యంగా సౌర, పవన, పంప్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారని తెలిపింది. వీటి స్థాపనకు లక్ష ఎకరాలు అవసరమని అంచనా. ఈ ప్రాజెక్టుల వల్ల ఏపీకి ఉపయోగం లేదని మరో దిక్కుమాలిన రాత రాసింది. అదే వార్తలో మెగావాట్కు లక్ష రూపాయల చొప్పున గ్రీన్ టాక్స్ వస్తుందని తెలిపింది. విషయం ఏమిటంటే ఈ ప్రాజెక్టులు దేనికి కూడా భూమిని ప్రభుత్వం కేటాయించలేదు. రైతుల నుంచి ఈ పరిశ్రమలవారు లీజుకు తీసుకుని ఏటా ఏకరాకు ముప్పైవేల రూపాయల చొప్పున రైతులకు చెల్లించాలని ఆదేశించింది. దీనివల్ల రాష్ట్రంలో, ప్రత్యేకించి రాయలసీమలో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇలా రైతులకు మేలు చేస్తే, అదేదో తప్పు అయినట్లు ఈ పత్రిక దరిద్రపు గొట్టు వార్త రాసింది. ఈ భూములు ఇచ్చారు కనుక విరాళాలు పొందిందని నీచమైన విశ్లేషణ చేసింది. గ్రీన్కో కంపెనీకి 1500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఇస్తే, ఆ కంపెనీ వైసీపీకి పది కోట్లు ఇచ్చిందట. ఏమన్నా మతి ఉండి ఈనాడు రామోజీ ఇలా రాస్తారా? కొన్ని వేల కోట్ల కంపెనీ కేవలం పది కోట్లు ఇస్తే అది కూడా ఫేవర్ చేసినట్లా? ఇక మెఘా కంపెనీ ఇచ్చిన 37 కోట్ల మీద కూడా ఇలాంటి చెత్తనే రాశారు. ఆ కంపెనీ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లకు కలిపి సుమారు 900 కోట్లు ఇచ్చింది. అదే వైసీపీకి 37 కోట్లే. కాని టీడీపీకి 25 కోట్లు ఇచ్చింది. దీనిపై ఈనాడు రాసిన వార్త చదివితే ఎంత బుద్ది, జ్ఞానం లేకుండా ఈ పత్రిక విషం చిమ్ముతోందా అనిపిస్తుంది. సీలేరు, పోలవరం హైడల్ ప్రాజెక్టులతో పాటు తాజాగా 12 వేల కోట్ల రూపాయల విలువైన ఎగువ సీలేరు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును ఇచ్చినందుకే ఈ విరాళం ఇచ్చిందని రాశారు. మరి తెలుగుదేశం కూడా మరి పాతిక కోట్లు ఎందుకు ఇచ్చింది రాయలేదు. ఏమీ లేని జనసేనకు 21 కోట్లు ఎలా వచ్చాయని ఈ పత్రిక ప్రశ్నించలేదు. తెలుగుదేశంకు భారత్ బయోటెక్ పది కోట్లు, పశ్చిమ యుపి పవర్ ఇరవై కోట్లు, నాట్కో పద్నాలుగు కోట్లు, రెడ్డి లాబ్స్ పదమూడు కోట్లు ఎందుకు ఇచ్చాయో విశ్లేషించాలి కదా! అధికారం లేదు కనుక ప్రతిపక్షంగా ఉండి టీడీపీ వారిని బ్లాక్ మెయిల్ చేసిందని రామోజీ ఎందుకు చెప్పడం లేదు? ఇక టీడీపీ నుంచి బీజేపీకి వెళ్లిన రాజ్యసభ సబ్యుడు సీఎమ్.రమేష్ కాంగ్రెస్, జేడీఎన్లకు కలిపి 40 కోట్లు ఎలా ఇచ్చారు? టీడీపీకి ఐదు కోట్లు ఎలా ఇచ్చారు. అంటే ఈ పార్టీలతో కూడా సంబంధ బాంధవ్యాలు మెయిటెన్ చేస్తున్నట్లే కదా! రామోజీ వికృత రాతలకు, పక్షపాత కధనాలకు ఇదో పెద్ద ఉదాహరణగా తీసుకోవాలి. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
‘పీఎం సూర్య ఘర్’కు కోటి రిజిస్ట్రేషన్లు
న్యూఢిల్లీ: సుమారు నెల క్రితం ప్రారంభించిన రూఫ్ టాప్ సోలార్ స్కీం ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’కు అనూహ్య స్పందన వచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ పథకం కోసం ఇప్పటికే కోటి మందికిపైగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం అద్భుతమంటూ శనివారం ‘ఎక్స్’లో హర్షం వ్యక్తం చేశారు. అస్సాం, బిహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఎక్కువ రిజిస్ట్రేషన్లు అయ్యాయన్నారు. ఇప్పటికీ రిజస్ట్రేషన్ చేయించుకోని వారు సాధ్యమైనంత త్వరగా ఆ పని చేయాలని సూచించారు. -
బీడు భూముల్లో ఇం‘ధనం’..!
రాయదుర్గం: రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలోనే రైతుల చెంతకు వ్యవసాయ సేవలను తీసుకొచ్చింది. విత్తనం మొదలు పంట దిగుబడుల మార్కెటింగ్ వరకు సాయమందిస్తోంది. మరో వైపు వ్యవసాయం చేసే పరిస్థితులు లేక భూములు బీడు పెట్టుకున్న రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో బీడు భూములు కలిగిన రైతులకు ఇంధన రంగం ద్వారా శాశ్వత ఉపాధి మార్గం చూపేందుకు ముందుకొచ్చింది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో రూ.12,065 కోట్ల వ్యయంతో 3,350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి మండలి కూడా ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు ఏర్పాటైతే ప్రత్యక్షంగా 3,300 మంది, పరోక్షంగా మరో పది వేల మందికి ఉపాధి లభించనుంది. నెడ్క్యాప్ ఆధ్వర్యంలో భూసేకరణ.. సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమయ్యే భూములను నెడ్క్యాప్ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. నెడ్క్యాప్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా గ్రామసభలు నిర్వహించి, రైతులకు అవగాహన కల్పించారు. రాయదుర్గం నియోజకవర్గంలోని డీ హీరేహాళ్, బొమ్మనహాళ్, కణేకల్లు, రాయదుర్గం మండలాల్లో ఇప్పటికే 15 వేల ఎకరాలు గుర్తించారు. అందులో 6,750 ఎకరాలకు రైతుల నుంచి అంగీకారం తీసుకున్నారు. ప్రస్తుతం డీ హీరేహాళ్, బొమ్మనహాళ్ మండలాల్లో 850 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. అదనంగా మరో 2,250 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఇన్వెస్టర్లను ఒప్పించేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా రాప్తాడులో 1,050 మెగావాట్లు, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బలో 1,050 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కావాల్సిన భూసేకరణ ప్రక్రియను నెడ్క్యాప్ ప్రతినిధులు ముమ్మరం చేశారు. 30 ఏళ్ల లీజుతో సుస్థిర ఆదాయం.. సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటైతే బీడు భూములకు మహర్దశ కలగనుంది. రైతుల అంగీకారం మేరకు 30 ఏళ్ల పాటు లీజు అగ్రిమెంట్తో నెడ్క్యాప్ ఒప్పందం చేసుకోనుంది. సాధారణంగా రైతు గుత్త (కౌలు)కు ఇస్తే ఎకరా రూ.5వేల నుంచి రూ.8 వేలకు మించదు. అలాంటిది ఎకరాకు రూ.25 వేల చొప్పున లీజు ధర నిర్ణయిస్తే, రైతు సంక్షేమం దృష్ట్యా మరో రూ.5 వేలు పెంచి ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సంస్థ ప్రతినిధులను ఒప్పించింది. సోలార్ ప్లాంట్ ప్రతీకాత్మక చిత్రం ఈ నేపథ్యంలో ఎకరాకు రూ.30 వేల చొప్పున రైతు ఖాతాకు నేరుగా జమ కానుంది. పంట పండినా ఇంత మొత్తం చూడటం సాధ్యం కాదని అన్నదాతలు అంటున్నారు. పైసా పెట్టుబడి లేకుండా రెండింతల సుస్థిర ఆదాయం లభిస్తుండడంతో చాలామంది రైతులు భూములు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. మౌలిక వసతులు మెరుగు.. సోలర్ పరిశ్రమల ద్వారా వచ్చే ఆదాయంలో రెండు శాతం సీనరేజ్ నిధులను సమీప గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. తద్వారా రైతు, కూలీల జీవనోపాధికి తోడు గ్రామాల రూపురేఖలు మారనున్నాయి. వలస మాటే లేకుండా సొంతూళ్లలోనే వేలాది మంది నిరుద్యోగులు, కూలీలకు ఉపాధి లభించనుంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రాయదుర్గం రూపురేఖలు మారుస్తాం రాయదుర్గం ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్ది రూపురేఖలు మార్చుతాం. పేదరికం శాశ్వతంగా దూరం చేసేలా కృషి చేస్తాం. ఇప్పటికే జాజరకల్లు వద్ద రూ.533 కోట్ల వ్యయంతో ఇథనాల్ ఇంధన తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం లభించింది. తాజాగా సోలర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 3వేలకు పైగా మెగావాట్ల సోలర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా ఇన్వెస్టర్లను ఒప్పిస్తాం. రైతులు భూములిచ్చేందుకు ముందుకొచ్చి ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సోలార్ ప్లాంట్లలో స్థానికులకే ఎక్కువ శాతం ఉద్యోగ అవకాశాలు దక్కేలా కృషి చేస్తాం. – మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ రైతులు ముందుకు రావాలి బీడు భూములు, వర్షాధారంగా అరకొరగా పంట పండే రైతులు ఈ మార్గాన్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఐదు ఎకరాలున్న రైతు కూడా పైసా పెట్టుబడి లేకుండా ఏడాదికి రూ.1.50 లక్షలు పొందవచ్చు. భూములు ఇవ్వడానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. దీనివల్ల ప్రయోజనం తెలిశాకే అంగీకారం పొందవచ్చు. – రాణీ సుస్మిత, ఆర్డీఓ, కళ్యాణదుర్గం -
పిక్నిక్ కోసం సోలార్ ప్యానల్ టెంట్..ధర ఎంతంటే?
శీతాకాలంలో చాలామంది పిక్నిక్లకు, వనవిహారాలకు వెళుతుంటారు. ఆరుబయట టెంట్లు వేసుకుని కాలక్షేపం చేస్తుంటారు. పగటివేళ ఫర్వాలేకున్నా, రాత్రివేళల్లో చలి వణికించేటప్పుడు టెంట్లలో గడపడం కష్టంగానే ఉంటుంది. దుప్పట్లు, రగ్గులు ఎన్ని తీసుకువెళ్లినా చలితీవ్రత అధికంగా ఉండే ప్రదేశాల్లో టెంట్లు పూర్తి సౌకర్యాన్ని ఇవ్వలేవు. టెంట్లలో వెలుతురు కోసం లాంతర్లు లేదా ఎమర్జెన్సీ లైట్లను, పూర్తిస్థాయి విద్యుత్తు సరఫరా కావాలనుకుంటే భారీ బ్యాటరీలను మోసుకుపోవాల్సి ఉంటుంది. ఇంత తతంగం లేకుండా, తేలికగా ఏర్పాటు చేసుకునే సోలార్ టెంట్ను అమెరికన్ కంపెనీ జాకరీ ‘లైట్ టెంట్–ఎయిర్’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. చాలా తేలికగా ఉన్న టెంట్ను ఆరుబయట ఎక్కడైనా సులువుగా వేసుకోవచ్చు. దీంతోపాటే సోలార్ ప్యానల్స్ను, బ్యాటరీని అమర్చుకోవాల్సి ఉంటుంది. సోలార్ ప్యానల్స్ ద్వారా ఈ బ్యాటరీ 1200 వాట్ల విద్యుత్తును నిక్షిప్తం చేసుకుంటుంది. రాత్రివేళ ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉపయోగ పడుతుంది. రాత్రంతా టెంట్ను వెచ్చగా ఉంచుతుంది. దీని ధర సుమారు 3 వేల డాలర్లు (రూ.2.49 లక్షలు) మాత్రమే! -
37,490 మెగావాట్ల సోలార్పార్క్లు.. ఏయే రాష్ట్రాల్లో ఎంతంటే..
దేశవ్యాప్తంగా పరిశ్రమలు, గృహావసరాలకు విద్యుత్తు వినియోగం పెరుగుతోంది. కానీ అందుకు సరిపడా కరెంట్ తయారవడం లేదు. సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తికి బదులుగా పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్ను తయారుచేయాలని చాలాకాలంగా అవగాహన కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఈ ఏడాది నవంబర్ 30 వరకు 37,490 మెగావాట్ల సామర్థ్యం గల మొత్తం 50 సోలార్ పార్కులకు ఆమోదం తెలిపినట్లు మంగళవారం పార్లమెంటులో వెల్లడింకచారు. ప్రభుత్వం 40 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ పార్కులు, అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ల అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తోందని పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కె సింగ్ పార్లమెంట్లో తెలిపారు. న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఈ పథకం కింద నవంబర్ 30 నాటికి దేశంలోని 12 రాష్ట్రాల్లో 37,490 మెగావాట్ల సామర్థ్యంతో 50 సోలార్ పార్కులను మంజూరు చేసినట్లు సింగ్ చెప్పారు. ఇప్పటికే 10,401 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 19 సోలార్ పార్కులను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఇదీ చదవండి: మళ్లీ ఉద్యోగుల సమరం.. మార్పు ఖాయం? రాష్ట్రాల వారీగా గుజరాత్లో సుమారు 12,150 మెగావాట్ల సోలార్ పార్క్ ప్రాజెక్టులు మంజూరు అయ్యాయి. ఆ తర్వాత రాజస్థాన్ (8,276 మెగావాట్లు), ఆంధ్రప్రదేశ్ (4,200 మెగావాట్లు), మధ్యప్రదేశ్ (4,180 మెగావాట్లు), ఉత్తర్ప్రదేశ్ (3,730 మెగావాట్లు), కర్ణాటకలో 2,500 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్పార్క్లు మంజూరయ్యాయని మంత్రి చెప్పారు. జార్ఖండ్లో 1,089 మెగావాట్లు, మహారాష్ట్రలో 750 మెగావాట్లు, కేరళలో 155 మెగావాట్లు, ఛత్తీస్గఢ్లో 100 మెగావాట్లు, మిజోరాంలో 20 మెగావాట్ల సోలార్ పార్క్ ప్రాజెక్టులు కూడా మంజూరైనట్లు వివరించారు. -
సౌర విలయం!
వాషింగ్టన్: వజ్రపు మొనపై కాంతి ఒక క్రమంలో చెదిరిపోయి చిత్రించిన అందమైన వెలుగు రేఖల్లా కని్పస్తున్నాయి కదూ! కానీ ఇవేమిటో తెలుసా? సూర్యునిపై చెలరేగుతున్న ప్రచండమైన మంటలు! వీటిని ఎక్స్ కేటగిరీకి చెందిన సోలార్ ఫ్లేర్స్గా నాసా పేర్కొంది. గత 20 ఏళ్లలో నమోదైన అత్యంత శక్తిమంతమైన మంటలు ఇవేనట! సాధారణంగా సూర్యుని ఉపరితలంపై అయస్కాంత క్షేత్రాలు పునఃసంధానమయ్యే క్రమంలో ఈ మంటలు చెలరేగుతుంటాయి. తీవ్రతను బట్టి వాటిని బీ, సీ, ఎం, చివరగా అతి తీవ్రమైన మంటలను ఎక్స్గా వర్గీకరిస్తారు. ఇవి వరుసగా ఒక దానికంటే మరొకటి పదిరెట్లు శక్తిమంతమైనవన్నమాట. తాజా మంటలు ఎక్స్ కేటగిరీలోనూ అతి తీవ్రతతో కూడినవని నాసా వివరించింది. వీటి దెబ్బకు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల కొద్దిసేపు రేడియో ధారి్మకత బాగా పెరిగిపోయింది. వీటి దెబ్బకు ఆయా చోట్ల రెండు గంటలకు పైగా సిగ్నల్స్కు అంతరాయం కూడా కలిగిందట. 2003లో వీటికంటే 15 రెట్లు శక్తిమంతమైన సోలార్ ఫ్లేమ్స్ నమోదయ్యాయి! -
పార్కింగ్ ప్లేస్ పైకప్పులుగా సోలార్ ప్యానెల్స్.. వేల ఎకరాల్లో ఏర్పాటు!
ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరుగుతోంది. పునరుత్పాదక వనరులు వినియోగించుకుని విద్యుత్ తయారుచేయడంలో చాలాదేశాలు ఎంతో పురోభివృద్ధి సాధిస్తున్నాయి. ప్రధానంగా సౌరశక్తి, పవనశక్తిని ఉపయోగించి కరెంట్ తయారుచేయడంలో ఎన్నో కంపెనీలు విభిన్నంగా ఆలోచిస్తున్నాయి. అందులో భాగంగా కొన్నిదేశాల్లో స్థలం వృధా కాకుండా కాలువలపై సోలార్ ఎనర్జీ ప్లేట్లను ఏర్పాటుచేస్తుంటే.. కొన్నిచోట్ల జలాశయాలపై వాటిని వినియోగించి కరెంట్ను తయారుచేస్తున్నారు. తాజాగా న్యూయార్క్ సిటీలో ఏకంగా 8,500 ఎకరాల్లో సోలార్ప్లేట్లతో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటుచేశారు. న్యూయార్క్ సిటీలో పునరుత్పాదకత వనరులను వినియోగించుకునేలా అక్కడి జోనింగ్ చట్టాలను సడలించించడంతో ఇలాంటి చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల న్యూయార్క్ సిటీ కౌన్సిల్ ‘సిటీ ఆఫ్ యెస్ ఫర్ కార్బన్ న్యూట్రాలిటీ’ని ఆమోదించింది. అక్కడి జోనింగ్ కోడ్ను అప్డేట్ చేయడంతో క్లీన్ ఎనర్జీ, ఈవీ ఛార్జర్లను ఇంప్లిమెంట్ చేయడానికి స్థిరమైన కార్యక్రమాలు చేపట్టే అవకాశం కల్పిస్తున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. న్యూయార్క్సిటీలో జోనింగ్ కోడ్ను ఆధునీకరించడం ద్వారా పరిశుభ్రమైన గాలి, వ్యర్థాల నిర్వహణ, ఈవీ వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలిపారు. గతంలో తక్కువ ఆదాయాలు కలిగిన ప్రజలు నివసిస్తున్న ప్రదేశాల్లో సోలార్ప్లేట్లకు సంబంధించిన మైక్రోగ్రిడ్లను ఇన్స్టాల్ చేసేందుకు అనుమతులుండేవి కాదు. కానీ ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాలతో అక్కడి ప్రదేశాలతోపాటు పార్కింగ్ స్థలాల్లో సౌరఫలకలను ఏర్పాటు చేసుకునేలా అనుమతిస్తున్నట్లు ఆడమ్స్ తెలిపారు. ఇది సిటీలో పూర్తిగా కార్యరూపం దాలిస్తే దాదాపు 1,30,000 గృహాలకు తక్కువ ఖర్చుతో కరెంట్ లభిస్తుందని అన్నారు. ఇదీ చదవండి: బ్యాంకులో పెట్టిన బంగారం పోతే ఎంతిస్తారంటే... తాజాగా జోనింగ్ చట్టాల్లో తీసుకొచ్చిన మార్పుల వల్ల 8,500 ఎకరాల పార్కింగ్ స్థలాల్లో సోలార్ ఎనర్జీని తయారుచేస్తున్నారు. దాంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. -
10 గిగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యం
న్యూఢిల్లీ: 2027 నాటికల్లా 10 గిగావాట్ల స్థాయిలో సమీకృత సౌర విద్యుత్ పరికరాల ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవాలని అదానీ గ్రూప్ నిర్దేశించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇది 4 గిగావాట్లుగా ఉంది. గ్రూప్లో భాగమైన అదానీ సోలార్కు 3,000 మెగావాట్ల విలువ చేసే ఎగుమతి ఆర్డర్లు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కంపెనీ ఇటీవలే 394 మిలియన్ డాలర్లు కూడా సమీకరించినట్లు వివరించాయి. దేశీయంగా 2014లో 2.63 గిగావాట్లుగా ఉన్న సౌర విద్యుదుత్పత్తి 2023 నాటికి 71.10 గిగావాట్లకు పెరిగినప్పటికీ తయారీ వ్యవస్థ వేగంగా విస్తరించలేదు. ఈ నేపథ్యంలో దేశీ యంగా తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం పీఎల్ఐ వంటి స్కీములను ప్రవేశపెట్టింది. అదానీ గ్రూప్ వంటి ప్రైవేట్ సంస్థలు సోలార్ తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. -
ఎస్బీఐలో హోమ్లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా?
ముంబై: నివాసిత ప్రాజెక్టులకు రుణాలివ్వాలంటే, పైకప్పులపై సోలార్ విద్యుదుత్పత్తి పరికరాల (సోలార్ ఇన్స్టాలేషన్స్) ఏర్పాటు నిబంధన అమలు చేయాలని ఎస్బీఐ భావిస్తోంది. జూన్ చివరికి ఎస్బీఐ గృహ రుణాల పుస్తకం రూ.6.3 లక్షల కోట్లుగా ఉంది. మా గ్రీన్ ఫండ్స్ (పర్యావరణ అనుకూల నిధి) నుంచి రుణ సాయం పొందే బిల్డర్లు రూఫ్టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లను తప్పనిసరి చేయనున్నట్టు ఎస్బీఐ ఎండీ అశ్విని కుమార్ తివారీ తెలిపారు. గృహ రుణ దరఖాస్తులకు దీన్ని అనుబంధంగా (బండిల్) జోడించనున్నట్టు చెప్పారు. ఈ రుణాలు 10–20 ఏళ్ల కాల వ్యవధితో ఉంటాయి. ఈ రుణాలపై బ్యాంక్లు ఫారెక్స్ రిస్క్ను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. -
ఈ పడవ నడవాలంటే ఎండ ఉంటే చాలు!
నాటు పడవలు నడపాలంటే, తెడ్లు వేయాలి. మరపడవలు నడపాలంటే, ఇంధనం కావాలి. ఎలక్ట్రిక్ పడవలను నడపాలంటే, రీచార్జబుల్ బ్యాటరీలు కావాలి. ఈ పడవను నడపాలంటే, ఎండ చాలు. ఇది పూర్తిగా సౌరశక్తితో నడిచే పడవ. దీని పైకప్పు మీద అమర్చిన సౌరఫలకాలు ఇందులోని 200 వాట్ల విద్యుత్తును నిరంతరం బ్యాటరీకి చార్జ్ చేస్తుంటాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 1.3 కిలోవాట్లు. కాబట్టి పొద్దుగూకినా, ప్రయాణానికి ఇబ్బందేమీ ఉండదు. పదిహేనుడు అడుగుల పొడవు, ఎనిమిది అడుగుల వెడల్పు ఉండే ఈ పడవలో ఆరుగురు వరకు ఏకకాలంలో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. నదులు, సరస్సుల్లో విహారయాత్రలకు పూర్తిగా అనువుగా ఉండే ఈ పడవ గంటకు ఆరు నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. అమెరికన్ కంపెనీ ‘గోసన్’ ఇటీవల ఈ సోలార్ పడవను మార్కెట్లోకి తెచ్చింది. ఇందులోని హంగులు సౌకర్యాలను బట్టి దీని ధర 7,950 నుంచి 12,750 డాలర్ల వరకు (రూ.6.60 లక్షల నుంచి 10.59 లక్షల వరకు) ఉంటుంది. (చదవండి: అమ్మాయి శవాన్ని తీస్తానంటూ..వికృత బొమ్మల్ని తీశాడు అంతే...) -
సోలార్ విద్యుత్ ఇన్స్టలేషన్లలో క్షీణత
న్యూఢిల్లీ: సోలార్ అదనపు విద్యుత్ సామర్థ్యం ఏర్పాటు ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 1.7 గిగావాట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఏర్పాటైన 4 గిగావాట్లతో పోలిస్తే 58 శాతం తగ్గినట్టు మెర్కామ్ ఇండియా సంస్థ తెలిపింది. జూన్ త్రైమాసికంలో సోలార్ మార్కెట్కు సంబంధించి నివేదికను విడుదల చేసింది. ఇక ఈ ఏడాది మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో ఏర్పాటైన 1.9 గిగావాట్ల ఇన్స్టాలేషన్స్తో పోలి్చనా 10 శాతం తగ్గింది. జూన్ త్రైమాసికంలో కొత్తగా ఏర్పాటైన సోలార్ విద్యుత్ సామర్థ్యంలో 77 శాతం భారీ ప్రాజెక్టుల రూపంలో ఉంది. అంటే 1.3 గిగావాట్లు ఈ రూపంలోనే సమకూరింది. రూఫ్టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లు 23 శాతం వాటా ఆక్రమించాయి. ఇక ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల్లో, 3.6 గిగావాట్ల సోలార్ ఇన్స్టాలేషన్లు నమోదయ్యాయి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో ఏర్పాటైన 7.6 గిగావాట్లతో పోల్చి చూసినప్పుడు 53 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. ఇక దేశం మొత్తం మీద సోలార్ విద్యుత్ ఇన్స్టాలేషన్ సామర్థ్యం జూన్ చివరికి 66 గిగావాట్లుగా ఉంది. జూన్ త్రైమాసికంలో భారీ సోలార్ ఇన్స్టాలేషన్లలో గుజరాత్ 41 శాతం వాటా ఆక్రమించింది. ఆ తర్వాత రాజస్థాన్లో 20 శాతం, కర్ణాటకలో 14 శాతం చొప్పున ఏర్పాటయ్యాయి. ముఖ్యంగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మద్య దేశంలో 8.4 గిగావాట్ల నూతన విద్యుత్ సామర్థ్యం సమకూరగా, అందులో 43 శాతం సోలార్ రూపంలోనే ఉండడం గమనించొచ్చు. ప్రాజెక్టుల్లో జాప్యం.. ప్రాజెక్టుల్లో జాప్యం, విస్తరణ ఇతర కారణాల వల్ల పెద్ద ఎత్తున ప్రాజెక్టులు వచ్చే ఏడాదికి వాయిదా పడినట్టు మెర్కామ్ క్యాపిటల్ గ్రూప్ సీఈవో రాజ్ ప్రభు తెలిపారు. 2024 సంవత్సరం ఎంతో ఆశావహంగా ఉందన్నారు. సోలార్ విడిభాగాలు, ప్రాజెక్టుల వ్యయాలు వేగంగా తగ్గుతుండడం ఈ పరిశ్రమ వృద్దికి ప్రేరణగా నిలుస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో సోలార్ ఇన్స్టాలేషన్లు బలహీనంగా ఉన్నాయి. దీంతో రెండో త్రైమాసికంలో ఇన్స్టాలేషన్లు మరింత నిదానించాయి. కొన్ని భారీ సోలార్ ప్రాజెక్టుల విస్తరణకు అనుమతులు వచ్చాయి. అయినా కానీ భూమి, బదిలీ అంశాలు జనవరి–జూన్ త్రైమాసికంలో ఇన్స్టాలేషన్లపై ప్రభావం చూపించాయి’’అని రాజ్ప్రభు వివరించారు. -
దటీజ్ "మహాలక్ష్మీ ఐస్ క్రీం"! అద్గది.. టెక్నాలజీని వాడటం అంటే..!
మన చుట్టూ సాధరణంగా ఉండే సామాన్యులు సైతం టెక్నాలజీని వాడుకునే సామర్థ్య కలిగి ఉంటారు. అవసరం వచ్చినప్పుడూ గానీ వారి నైపుణ్యం ఏంటో మనకు తెలియదు. వారు తమ నిత్యావసరాలకు టెక్నాలజీని వాడి చూపిస్తే..అందరూ అశ్చర్యపోతారు. నాలెడ్జ్ అనేది ఎవరీ సొత్తు కాదు. బుర్ర పెట్టి ఆలోచిస్తే ఎవ్వడైనా తమకు అందుబాటులో ఉన్నవాటితోనే అద్భుతాలు చేసి చూపగలరు. అచ్చం అలాంటి అద్భుత ఘటనే ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఢిల్లీలోని మహాలక్మీ ఐస్ క్రీం బండి చూస్తే..కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ ఐస్ క్రీం ట్రక్ టెక్నాలజీని వాడేంత స్థాయిని చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అంత టెక్నాలజీ వాడగలిగే స్థోమత ఆ ఐస్క్రీం విక్రయించే అతనికి ఉండటమే..ఇక్కడ హాట్టాపిక్గా మారింది. నిజానికి వీధుల్లో అమ్మే ఐస్క్రీం బండి వాళ్లు శీతలీకరణం కోసం ఇంటెన్సివ్ గ్లైకాల్ ఫీజర్లపైనే ఆధారపడతారు. అవి భారీగా ఉండటమే కాకుండా గణనీయమైన విద్యుత్ని డిమాండ్ చేస్తుంది. వేసవిలో వీటి వినియోగం మరింత ఎక్కువగా ఉంటుంది. ఐసీక్రీంని కూల్గా ఉంచటం కోసం అని సోలార్ విద్యుత్ని వాడాలన్న ఆలోచనే గ్రేట్గానూ, కొత్తగానూ ఉంది. ఇక అంత సాంకేతికతకు పెట్టుబడి పెట్టగలిగే సామర్థ్యం ఆ ఐస్క్రీం విక్రయించే వ్యక్తికి ఉండటం..అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయమే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అతను ఆ వ్యాపారంలో లాభాలు గడించి ఆ స్థాయికి వచ్చాడని కొందరూ, విక్రయించే వ్యక్తికి వ్యక్తిగత సోలార్ టెక్నాలజీకి సంబంధించి కనెక్షన్ ఉంటే తప్ప ఇలా ఐస్క్రీం ట్రక్కి పెట్టలేరని కొందరూ కామెంట్లు చేస్తూ..పోస్ట్లు పెట్టారు. (చదవండి: -
రాష్ట్రంలో 5 వేల సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లు
సాక్షి, అమరావతి: ఉల్లి, టమాటా రైతులకు ఏడాది పొడవునా గిట్టుబాటు ధర, పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నట్టు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఏపీఎస్ఎఫ్పీఎస్) సీఈవో ఎల్.శ్రీధర్రెడ్డి వెల్లడించారు. కర్నూలు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన 100 యూనిట్లు విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. దీంతో రూ. 84 కోట్ల అంచనాతో 5 వేల యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం సోమవారం విజయవాడలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. సొసైటీ సీఈవో శ్రీధర్రెడ్డి, బీవోబీ డీజీఎం చందన్ సాహూ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ ఒక్కో యూనిట్ అంచనా వ్యయం రూ.1.68 లక్షలని చెప్పారు. ప్రాజెక్టు వ్యయంలో ప్రభుత్వం 35 శాతం (రూ.29.40కోట్లు) సబ్సిడీగా భరిస్తుందని, లబ్ధిదారులు 10 శాతం (రూ.8.40 కోట్లు) చెల్లించాల్సి ఉంటుందన్నారు.మిగిలిన 55 శాతం (రూ.46.20 కోట్లు) బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ఆహార వ్యర్థాలను తగ్గించడం, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడం, గ్రామీణ మహిళా సాధికారత ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలన్నారు. కర్నూలులో పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన యూనిట్ల ద్వారా ఒక్కో మహిళ సగటున రూ.12 వేల అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని చెప్పారు. బి, సి గ్రేడ్ ఉల్లి, టమాటాలకు సైతం రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాయలసీమ జిల్లాల్లో 3,500 యూనిట్లు, మిగిలిన జిల్లాల్లో మరో 1,500 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బ్యాంక్ డీజీఎం చందన్ సాహూ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. ఈ తరహా ప్రాజెక్టులకు ఆర్థి క చేయూతనిచ్చేందుకు, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు బ్యాంక్ సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎఫ్పీఎస్ స్టేట్ లీడ్ సుభాష్ కిరణ్ కే, మేనేజర్ సీహెచ్ సాయి శ్రీనివాస్, బ్యాంక్ రీజనల్ మేనేజర్లు కె.విజయరాజు, పి.అమర్నాథ్రెడ్డి, ఎంవీ శేషగిరి, ఎంపీ సుధాకర్, రీజనల్ ఇన్చార్జి డి. రాజాప్రదీప్, డీఆర్ఎం ఏవీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంకా ఎన్ని కనిపెడతావ్ బాబు ?
-
ఇకపై మీ పంట వృథా కాదు, ఇంజనీర్ సృష్టించిన సోలార్ డ్రైయర్
ప్రకృతి చాలా చిత్రమైంది. ధాన్యాన్ని ఎండించి ఇస్తుంది. కాయగూరలను పండించి ఇస్తుంది. ధాన్యం ఏడాదంతా నిల్వ ఉంటుంది. కాయలు పండ్లకు రోజులే జీవిత కాలం. ఆ కాయలు పండ్లను కూడా ఎండబెడితే... అవి కూడా ఏడాదంతా నిల్వ ఉంటాయి. ముందు చూపు ఉంటే ఏదీ వృథా కాదు, దేని ధరా కొండెక్కదు... అని నిరూపించాడు ఇందోర్కు చెందిన మెకానికల్ ఇంజనీర్ వరుణ్ రహేజా. రైతుల ఆత్మహత్యలు, టొమాటోలు కోసిన ధరలు కూడా రావని పంటను వదిలేయడం వంటి వార్తలు తనను కలచి వేశాయి. పంటను నిల్వ చేసుకోగలిగితే రైతుల నష్టాలు, మరణాలను నివారించవచ్చనుకున్నాడు. కరెంట్ లేని ప్రదేశాల్లో కూడా ఉపయోగకరంగా ఉండడానికి సూర్యరశ్మితో పనిచేసే సోలార్ డ్రైయర్ను రూపొందించాడు. గత వేసవిలో కిలో రెండున్నర రూపాయల చొప్పున సేకరించిన టొమాటోలను డ్రైయర్లో ఎండబెట్టి తన ప్రయోగ ఫలితాన్ని నిరూపించాడు వరుణ్. యువతలో సామాజిక స్పృహ మెండుగా ఉన్నప్పుడు, చదువుతో వచ్చిన జ్ఞానం తన ఉన్నతితో పాటు సామాజికాభివృద్ధికి కూడా దోహదం చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు సాధ్యమవుతాయి. వరుణ్ చేసిన ప్రయోగం వ్యవసాయరంగానికి మేలు చేస్తోంది. ఆలోచన... ఆసక్తి! ‘‘నేలలో నాటిన విత్తనం నుంచి ఒక చెట్టు మొలవడం, అది పెద్దయి... పూత పూసి కాయ కాచి అది పండే వరకు ప్రతిదీ ప్రకృతి చేసే అద్భుతమే. పంటను, పొలాన్ని సంరక్షించడంలో రైతు పడే కష్టాన్ని కొలవడానికి ఏ పరికరమూ ఉండదు. అలాంటిది పండించిన పంటను చేతులారా నేలపాలు చేసేటప్పుడు రైతు అనుభవించే ఆవేదన ఎలాంటిదో నాకు తెలియదు, కానీ ఆ పంట నేలపాలవుతుంటే నా మనసు మౌనంగా రోదించేది. పంటను నిల్వ చేసుకునే అవకాశం ఉంటే ఆ రైతు తన చేతులారా పండించిన పంటను అలా నేలపాలు చేయడు కదా అనిపించేది. ఈ ఆలోచనలు నేను మెకానికల్ ఇంజనీర్గా ఇంటర్న్న్షిప్ చేస్తున్న సమయంలో ఒక కొలిక్కి వచ్చాయి. పోషకాలు వృథా కాని విధంగా పండ్లు, కాయల్లోని తేమను సహజంగా తొలగించగలిగితే పంటను నిల్వ చేయవచ్చు. అది సౌరశక్తితో సాధ్యమని తెలిసిన తర్వాత నా ప్రయత్నాలను ముమ్మరం చేశాను. సోలార్ డ్రైయర్ను రూపొందించడంతోపాటు అన్ని రకాల రైతులకు అది అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఒక ప్రదేశంలో స్థిరంగా ఉండే పాలీ హౌస్తోపాటు ఇరవై కిలోల నుంచి వంద కిలోల కెపాసిటీ గలిగిన పోర్టబుల్ డ్రైయర్లను కూడా రూపొందించాను. వీటిని ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. మేధ సమాజానికి ఉపయోగపడాలి! నేను చేసే పని నాకు నచ్చినదై ఉండాలి. ఒకరు చెప్పిన పని చేయడానికి నా మేధను పరిమితం చేయడం నాకిష్టం లేదు. నేను చేసే పని సమాజానికి ఉపయోగపడేదై ఉంటే అందులో లభించే సంతృప్తి అనంతం. టొమాటోల ధరలు వార్తల్లో ఉండడాన్ని చూస్తూనే పెరిగాను. రైతన్నల శ్రమకు ఫలితం కొనుగోలు చేసే వ్యాపారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటోంది. పండించిన రైతులు ఎప్పుడూ అనిశ్చితిలోనే ఉంటున్నారు. సప్లయ్ చైన్ దళారులతో నిండిపోయి, రైతుకు ఉపయుక్తంగా లేకపోవడమే ఇందుకు కారణం. పొలంలో పండిన పంట వంటగదికి చేరేలోపు వివిధ దశల్లో 30 నుంచి 40 శాతం వృథా అవుతోంది. ఆ వృథాని అరికట్టడం, పండించిన రైతుకు తన పంటకు తగిన ధర నిర్ణయించగలిగే స్థితి కల్పించడం నా లక్ష్యం. అందుకే పంటను ఎండబెట్టి నిల్వ చేసే ఇండస్ట్రీని స్థాపించాను’’ అన్నాడు తన ప్రయోగాల కోసం రహేజా సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించిన వరుణ్ రహేజా. వరుణ్ కొత్త పరికరాల రూపకల్పనలో నిమగ్నమై ఉంటే, అతడు నెలకొల్పిన పరిశ్రమను తల్లి బబిత నిర్వహిస్తున్నారు. -
ప్రపంచంలో తొలిసారి.. ఈ సోలార్ ప్యానళ్ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
కాగితాలతో చిత్రవిచిత్రమైన ఆకృతులను రూపొందించే జపనీస్ కళ ఒరిగామి. ఒరిగామి కళ స్ఫూర్తితో తేలికగా మడిచిపెట్టి ఎక్కడికైనా తీసుకుపోయేందుకు అనువైన సోలార్ ప్యానల్స్ను రూపొందించింది ఇంగ్లండ్కు చెందిన బహుళజాతి సంస్థ ‘సెగో ఇన్నోవేషన్స్’. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ఒరిగామి సోలార్ ప్యానల్’. ఆరుబయట పిక్నిక్లకు వెళ్లేటప్పుడు, విద్యుత్ సరఫరా లేని అడవుల్లో రాత్రివేళ బస చేయాల్సి వచ్చేటప్పుడు ఈ సోలార్ ప్యానల్స్ చక్కగా ఉపయోగపడతాయి. వీటిని 20 వాట్, 50 వాట్, 100 వాట్, 400 వాట్ మోడల్స్లో ‘సెగో ఇన్నోవేషన్స్’ అందుబాటులోకి తెచ్చింది. వీటిని ప్రీ–ఆర్డర్లపై సరఫరా చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. గత జూన్ 6 నుంచి ప్రీ–ఆర్డర్లను స్వీకరించడం ప్రారంభించింది. -
పెరిగిపోతున్న సామర్ధ్యం.. 9.3 గిగా వాట్లకు రూఫ్టాప్ సోలార్
న్యూఢిల్లీ: దేశంలో రూఫ్టాప్ సోలార్ (పై కప్పులపై సోలార్ విద్యుదుత్పాదన) సామర్థ్యం ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 6.35 శాతం పెరిగింది. మొదటి మూడు నెలల్లో 485 మెగావాట్ల సామర్థ్యం మేర సోలార్ రూఫ్టాఫ్ పరికరాలను ఏర్పాటు చేసుకున్నట్టు మెర్కామ్ ఇండియా తెలిపింది. 2022 మొదటి మూడు నెలల్లో ఇలా ఏర్పాటైన సామర్థ్యం 456 మెగావాట్లుగా ఉన్నట్టు పేర్కొంది. 2023 మార్చి నాటికి భారత్లో మొత్తం రూఫ్టాప్ సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యం 9.3 గిగావాట్లకు చేరుకున్నట్టు ప్రకటించింది. 2022 చివరి మూడు నెలల్లో ఏర్పాటైన 483 మెగావాట్ల రూఫ్టాప్ సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యంతో పోలిస్తే 0.4 శాతం మేర ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో పెరిగినట్టు వివరించింది. ఈ మేరకు ‘క్యూ1, 2023 మెర్కామ్ ఇండియా రూఫ్టాప్ సోలార్ మార్కెట్ రిపోర్ట్’ను విడుదల చేసింది. 2023 జనవరి – మార్చి త్రైమాసికంలో ఏర్పాటైన మొత్తం 485 మెగావాట్లలో 58 శాతం గృహ వినియోగదారులు ఏర్పాటు చేసుకున్నదే కావడం గమనార్హం. పరిశ్రమలపై 28 శాతం, వాణిజ్య వినియోగదారులు ఏర్పాటు చేసుకున్న సామర్థ్యం 14 శాతం చొప్పున ఉంది. దేశంలో మొత్తం సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యంలో రూఫ్టాప్ సోలార్ వాటా 26 శాతానికి చేరుకుంది. 2022లో హెచ్చు తగ్గులను చూసిన తర్వాత రూఫ్టాప్ సోలార్ ఏర్పాటు విషయంలో స్థిరమైన పురోగతి కనిపిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ‘‘విద్యుత్ రేట్లు పెరుగుతుండడంతో రూఫ్టాప్ సోలార్ ఆకర్షణీయంగా మారుతోంది. రానున్న త్రైమాసికాల్లో ఈ వృద్ధి మరింత వేగాన్ని అందుకుంటుంది’’ మెర్కామ్ క్యాపిటల్ గ్రూప్ సీఈవో రాజ్ప్రభు తెలిపారు. గుజరాత్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఏర్పాటైన రూఫ్టాప్ సోలార్ సామర్థ్యంలో 70 శాతం వాటా ఆక్రమించాయి. ఇందులో గుజరాత్ వాటా అత్యధికంగా 24 శాతం మేర ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్ అత్యధిక సామర్థ్యం కలిగి ఉన్నాయి. -
కోతల్లేని కరెంట్..
నాడు చీకటి రోజులు గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ‘పట్టణాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 వరకు.. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 వరకు.. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పగలంతా విద్యుత్ సరఫరా ఉండదు’ అని అధికారికంగా ప్రకటనలు జారీ అయ్యేవి. ‘ఎండా కాలం కదా.. పవర్ కట్ మామూలే’ అని అప్పటి పాలకులు దబాయించే వారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలిసేది కాదు. వంటింట్లో మిక్సీలు తిరక్క గృహిణులు, హాల్లో ఫ్యాన్ తిరక్క పిల్లలు, ఆఫీసుల్లో ఏసీలు పని చేయక ఉద్యోగులు, జిరాక్స్ సెంటర్ల వద్ద విద్యార్థుల పాట్లు అన్నీ ఇన్నీ కాదు. విద్యుత్ ఎప్పుడొస్తుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వచ్చేది. ఆ రోజులను గుర్తు చేస్తే చాలు ప్రజలు కథలు కథలుగా చెబుతారు. నేడు వెలుగు జిలుగులు ఎక్కడా ‘విద్యుత్ కోత’ అన్న పదానికి తావు లేకుండా సీఎం వైఎస్ జగన్ ముందు చూపుతో వ్యవహరించారు. గృహాలకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి ఏ రీతినా సమస్య లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం బొగ్గు నిల్వలు సరిపడా ఉండేలా చూసుకోవడంతో పాటు బయటి మార్కెట్లోనూ విద్యుత్ కొనుగోలు చేశారు. సరఫరాలో నాణ్యత పెరిగేలా వ్యవస్థాగత మార్పులు చేశారు. ఈ ఏడాది ఇదివరకెన్నడూ లేనంతగా అనూహ్యంగా డిమాండ్ పెరగడంతో అక్కడక్కడ ఓవర్లోడ్తో ట్రిప్ కావడం తప్పించి ఏ సమస్యా లేకుండా శ్రద్ధ పెట్టారు. అలాంటి చోట్ల నిమిషాల వ్యవధిలోనే మరమ్మతులు చేసేలా యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు. తద్వారా ఇళ్లలో, కార్యాలయాల్లో ఎక్కడా ‘విద్యుత్ కోత’ అన్నమాటే వినిపించడం లేదు. ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిజ్లు నిరంతరాయంగా పని చేస్తున్నాయి. వ్యవసాయానికి 18.49 లక్షల వ్యవసాయ సర్వీసులకు పగటి పూటే 9 గంటలు నిరంతర విద్యుత్ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో 7 వేల మెగావాట్ల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. దీంతోపాటు రూ.1700 కోట్లతో ఫీడర్లను అప్గ్రేడ్ చేసింది. తద్వారా 30 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్కు ఎలాంటి ఢోకా లేకుండా ఏర్పాటు చేసింది. పరిశ్రమలకూ ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తోంది. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇదివరకెన్నడూ లేని విధంగా విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ, ఎక్కడా కోతలన్నదే లేకుండా సరఫరా సవ్యంగా సాగుతోంది. ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా పెరగడం, ఎండలు మండిపోతుండటం వల్ల విద్యుత్ వినియోగం అమాంతం పెరిగింది. అయినా కాసేపు కూడా విద్యుత్ కోత లేకుండా నిరంతరాయంగా సరఫరా జరిగేలా సీఎం వైఎస్ జగన్ ముందు చూపుతో వ్యవహరించారు. గత సంవత్సరం గరిష్ట డిమాండ్తో పోలిస్తే ఇప్పుడు 27.51 శాతం అధికంగా ఉంది. ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటుతోంది. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఫలితంగా ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్లు వంటి గృహోపకరణాలు నిరంతరం పని చేస్తున్నాయి. ఎక్కువ సమయం ఇంట్లోనే గడపడం వల్ల మిక్సీలు, గ్రైండర్లు, టీవీలు, కంప్యూటర్ల వినియోగం కూడా అధికంగానే ఉంటోంది. మరోవైపు పారిశ్రామిక వినియోగం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం రాకార్డు స్థాయిలో పెరిగిపోయింది. రోజువారీ డిమాండ్ 248.985 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. గత ఏడాది ఇదే సమయానికి 195.266 మిలియన్ యూనిట్లుగా ఉండింది. రోజులో పీక్ డిమాండ్ 12,482 మెగావాట్లుగా ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 9308 మోగావాట్లు మాత్రమే. అంటే 34.10 శాతం పెరిగింది. పగటి పూట సగటు పీక్ డిమాండ్ 10,374 మెగావాట్లు, సాయంత్రం వేళల్లో 9,582 మెగావాట్లకు చేరుకుంది. అయినప్పటికీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్కు ఇబ్బంది లేకుండా, డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ సంస్థలు వినియోగదారులకు నిరంతరం కరెంట్ సరఫరా చేస్తున్నాయి. ఇలా దేశంలోనే ఎక్కడా జరగడం లేదని, రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనిస్తోందని చెప్పడానికి ఇదొక పెరామీటర్గా చెప్పవచ్చని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. ముందు చూపుతో విద్యుత్ కొనుగోలు ప్రస్తుతం ఏపీజెన్కో థర్మల్ నుంచి 89.981 మి.యూ, ఏపీ జెన్కో హైడల్ నుంచి 5.414 మి.యూ, సెంట్రల్ జెనరేటింగ్ స్టేషన్ల నుంచి 43.012 మి.యూ, సెయిల్, హెచ్పీసీఎల్, గ్యాస్ వంటి ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల నుంచి 28.510 మి.యూ, సోలార్ నుంచి 25.605 మి.యూ, విండ్ నుంచి 11.591 మి.యూ, ఇతర మార్గాల్లో 1.496 మిలియన్ యూనిట్లు చొప్పున విద్యుత్ సమకూరుతోంది. అయితే ఇది మాత్రమే సరిపోవడం లేదు. దీంతో బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్ సగటు రేటు రూ.7.537 చొప్పున రూ.33.936 కోట్లతో 45.023 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ప్రతి రోజూ కొనుగోలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ విధంగా డిమాండ్ను అందుకోలేక భారీగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. జార్ఖండ్లో 4.62 మి.యూ, హర్యానాలో 2.64 మి.యూ, ఉత్తరప్రదేశ్లో 2.03 మి.యూ, కర్ణాటకలో 1.97 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఏర్పడింది. సరిపడా బొగ్గు నిల్వలు దేశంలోని మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 70 శాతం థర్మల్ నుంచే వస్తోంది. ఇందులో ఇప్పుడు వినియోగిస్తున్న బొగ్గుకు దాదాపు 40 శాతం నుంచి 50 శాతం అదనంగా బొగ్గును సమకూర్చుకోవాలని, విదేశీ బొగ్గును 6 శాతం దిగుమతి చేసుకుని స్వదేశీ బొగ్గుతో కలిపి వాడుకోవాలని కేంద్రం చెప్పింది. అందుకు అనుగుణంగా రైల్వే ర్యాక్స్ను పెంచాలని ఏపీజెన్కో, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని, రైల్వేను కోరాయి. 14 రైల్వే ర్యాకులు సరిపోవడం లేదని, వీటితో పాటు మరో ఆరు ర్యాకులు పెంచాలని అడిగాయి. దీంతో మరో మూడు ర్యాకులు అదనంగా వచ్చాయి. వీటి ద్వారా మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి, సింగరేణి కాలరీస్ నుంచి బొగ్గును తీసుకువస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం వీటీపీఎస్లో 83,479 మెట్రిక్ టన్నులు, ఆర్టీపీపీలో 30,001 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నంలో 29,000 మెట్రిక్ టన్నులు, హిందూజా వద్ద 19200 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. యుద్ధ ప్రాతిపదికన వీటీపీఎస్ పునరుద్ధరణ సోలార్ ఉత్పత్తి చాలా తక్కువగా ఉన్నప్పుడు, థర్మల్ జనరేటర్లు పీక్ లోడ్లో పని చేస్తున్నప్పుడు వీటీపీఎస్ వద్ద జనరేటర్లు ఈ నెల 17వ తేదీ రాత్రి 7 గంటలకు ట్రిప్ అయ్యాయి. పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి ఆ రోజు వాతావరణం, సమయం మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రిజర్వాయర్ మట్టం తక్కువగా ఉన్నందున శ్రీశైలంలో హైడల్ ఉత్పత్తి అందుబాటులో లేదు. గ్యాస్ పరిమితి కారణంగా గ్యాస్ స్టేషన్ల నుంచి ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేదు. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో విద్యుత్ను కొనుగోలు చేసి మరీ ప్రజలకు అందించారు. అదే సమయంలో వీటీపీఎస్లో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, అన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించారు. వాస్తవాలు మరచి దుష్ప్రచారం ఎక్కడా విద్యుత్ కోతలు లేకపోయినప్పటికీ చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేలా ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోంది. గత చంద్రబాబు ప్రభుత్వం హయాంలో విద్యుత్ సరఫరా దుస్థితిని వ్యూహాత్మకంగా విస్మరిస్తోంది. గంటల తరబడి కోతలు విధించారనే విషయాన్ని దాస్తోంది. అప్పట్లో వేసవిలో కరెంటు పరిస్థితి చెప్పనలవి కాదు. వేసవిలో కాకుండా కూడా కోతలు విధించిన రోజులున్నాయి. పరిశ్రమలకైతే ఏకంగా పవర్ హాలిడేలు ఇచ్చారు. వారంలో మూడు రోజులు పరిశ్రమలన్నింటికీ తాళం వేయాల్సి వచ్చేది. జిరాక్స్ మిషన్లు, పిండి మరలు, కూల్ డ్రింక్స్ దుకాణాలు, కూలింగ్ వాటర్ ప్లాంట్లు గంటల తరబడి పని చేయక చిరు వ్యాపారులు నష్టాలు చవిచూశారు. విద్యుత్ కోతల గురించి మాట్లాడితే అప్పటి ప్రభుత్వ పెద్దలు, మంత్రులు దబాయించే వారు. ‘ఎండా కాలం.. ఆ మాత్రం విద్యుత్ కోత ఉండదా.. ఇప్పుడే కొత్తగా కోతలు విధిస్తున్నా.. ఇది వరకు కోతల్లేవా’ అని ఎదురు దాడికి దిగేవారు. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ సీఎం జగన్ ప్రభుత్వం కోత అన్నదే లేకుండా విద్యుత్ సరఫరా చేస్తుంటే ఎల్లో మీడియాకు కడుపు మండుతోంది. వంకర బుద్ధి చూపిస్తూ.. చిన్న చిన్న సాంకేతిక కారణాలతో విద్యుత్ పోయిన ప్రాంతాలను చూపుతూ దుష్ప్రచారం చేస్తోంది. -
సెవెన్ సీటర్ బైక్ : ఇది కదా.. మేకిన్ ఇండియా అంటే..
మనసు ఉంటే మార్గం ఉంటుందని నిరూపిస్తున్నారు ఔత్సాహిక వేత్తలు.పెద్దగా చదువుకోకున్నా, టెక్నాలజీ గురించి తెలియకపోయినా.. పరిశోధనలు చేస్తున్నారు. పెరుగుతున్న అవసరాలు తీర్చుకునేందుకు సరికొత్త దారులు వెతుకుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఓ వీడియో చూస్తే.. ఆశ్చర్యపోతాం. తమ అవసరాలు తీర్చుకునేందుకు ఓ యువకుడు అత్యంత చౌకగా సోలార్ బైక్ను రూపొందించుకున్నాడు. మార్కెట్లో దొరికే వివిధ వస్తువులను ఉపయోగించి ఏకంగా సెవెన్ సీటర్ బైక్ తయారు చేశాడు. ఈ ఆవిష్కరణపై ప్రశ్నించినప్పుడు ఆత్మవిశ్వాసంతో బదులిచ్చాడు. "ఈ బైక్పై ఏడుగురు ప్రయాణం చేయవచ్చు. పైగా ఇది సోలార్ తో నడుస్తుంది. దీనిపై 200 కిలోమీటర్ల దాకా ప్రయాణం చేయవచ్చు. దీన్ని తయారు చేయడానికి 8 నుంచి 10వేల దాకా ఖర్చు వచ్చింది. చూశారుగా నా సోలార్ బైక్" నిజమే.. భారత్ లాంటి ఎదుగుతున్న దేశాలకు ఇప్పుడు మరెన్నో ఆవిష్కరణలు కావాలి. దానికి బ్రాండ్ పేర్లు పెట్టి భారీగా ధర నిర్ణయించేకంటే.. చౌకగా ప్రజల అవసరాలు తీర్చే.. వినూత్న ఆవిష్కరణలు కావాలి. అప్పుడే మేకిన్ ఇండియాకు నిజమైన అర్థం దొరుకుతుంది. So much sustainable innovation in one product - produced from scrap, seven seater vehicle, solar energy and shade from the sun! Frugal innovations like this make me proud of our India! pic.twitter.com/rwx1GQBNVW — Harsh Goenka (@hvgoenka) April 29, 2023 చదవండి👉 చాట్జీపీటీ వినియోగంపై పోటీపడుతున్న సీఈవోలు.. ఏం జరుగుతుందో.. ఏమో! -
ఛార్జింగ్ అవసరం లేని స్మార్ట్వాచ్.. ఇంకెలా పనిచేస్తుందంటే?
ఈ ఫొటోలో చేతికి తొడుక్కున్న వాచీ చూస్తున్నారు కదా! ఇది స్మార్ట్ వాచీ. మిగిలిన స్మార్ట్ వాచీల మాదిరిగా దీని బ్యాటరీకి చార్జింగ్ అవసరం లేదు. ఇది పూర్తిగా సోలార్ స్మార్ట్ వాచ్. ఎండలో కాసేపు తిరిగితే చాలు, ఇందులోని బ్యాటరీ చార్జ్ అవుతుంది. అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ ‘గ్రామిన్ ఇంటర్నేషనల్’ ఇటీవల ఈ పూర్తిస్థాయి సోలార్ స్మార్ట్ వాచ్ను ‘ఇన్స్టింక్ట్–2’ పేరుతో విడుదల చేసింది. దీనికి అమర్చిన లెన్స్ ద్వారా ఇందులోని బ్యాటరీ చార్జ్ అవుతుంది. రోజుకు మూడుగంటల సేపు ఎండసోకితే, ఈ వాచ్ ఇరవైనాలుగు గంటలు నిరంతరాయంగా పనిచేస్తుంది. ఎండసోకని పరిస్థితులు రోజుల తరబడి ఉంటే, యూఎస్బీ చార్జర్ ద్వారా కూడా చార్జ్ చేసుకోవచ్చు. ఈ వాచ్లో ఫ్లాష్లైట్ కూడా ఉండటం విశేషం. ఆరుబయట పిక్నిక్లు, ట్రెక్కింగ్లకు వెళ్లే వారికి ఈ వాచ్ పూర్తి అనుకూలంగా ఉంటుందని ‘గ్రామిన్ ఇంటర్నేషనల్’ వైస్ ప్రెసిడెంట్ డాన్ బార్టెల్ చెబుతున్నారు. దీని మోడల్స్లో వైవిధ్యాన్ని బట్టి దీని ధర 389.99 డాలర్ల (రూ.32,027) నుంచి 469.99 డాలర్ల (38,597) వరకు ఉంది. -
ఆవిష్కరణలు.. అద్భుతం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్ ఐఐటీలో గురువారం ఫ్యూచర్ ఇన్వెంటర్స్ (భవిష్యత్ ఆవిష్కర్తలు) ఫెయిర్ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 24 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిష్కరణలను ఈ ఫెయిర్లో ప్రదర్శించారు. కామారెడ్డి జిల్లా ఇసాయిపేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆవిష్కరించిన సోలార్ డిష్ వాషర్కు మొదటి బహుమతి లభించింది. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలు అనేది తమ నినాదం మాత్రమే కాదని, తమ విద్యాసంస్థ డీఎన్ఏ అని వ్యాఖ్యానించారు. విద్యార్థుల్లో ఎన్నో ఆలోచనలున్నాయని, సరైన మార్గదర్శకత్వం, సరైన వేదికలు లభిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. విద్యార్థులు భవిష్యత్లో ఉన్నత ఉద్యోగాలు చేయడం కాదు, ఉన్నత ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఈ నూతన ఆవిష్కరణలతో లభిస్తుందని చెప్పారు. కాగా ఈ ఫెయిర్లో మొత్తం ఐదు ఆవిష్కరణలకు బహుమతులు లభించాయి. సోలార్ హ్యాండ్ డిష్ వాషర్ వంట పాత్రలను శుభ్రం చేయడంలో ఎంతో ఉపయోగపడే నూతన సోలార్ హ్యాండ్ డిష్ వాషర్ను కామారెడ్డి జిల్లా ఇసాయిపేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆవిష్కరించారు. అన్ని వైపులా తిరిగేందుకు వీలుండే ఓ మోటార్కు స్క్రబ్బర్తో కూడిన ప్రత్యేక పరికరం అమర్చారు. సౌర విద్యుత్తో పాటు, బ్యాటరీతో కూడా పనిచేసేలా దీనిని తయారు చేశారు. అందుబాటులో ఉన్న సామగ్రితో తయారైన ఈ హ్యాండ్ డిష్ వాషర్కు ఫెయిర్లో మొదటి బహుమతి లభించింది. తమ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండే పాత్రలను శుభ్రం చేయడానికి పడుతున్న ఇబ్బందులను చూసి ఈ హ్యాండ్ డిష్ వాషర్ను రూపొందించామని విద్యార్థులు సాకేత్, హర్ష, ప్రణయ్, నవీన్, రక్షితలు పేర్కొన్నారు. పర్యావరణహిత శానిటరీ న్యాప్కిన్లు రసాయనాలతో కూడిన శానిటరీ న్యాప్కిన్ లను వాడటంతో మహిళలు పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పైగా ఇవి పర్యావరణానికి కూడా హాని చేస్తున్నా యి. ఈ సమస్యను అధిగమించేందుకు హైదరాబాద్ పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులు సహజ సిద్ధంగా లభించే పత్తి, అరటి ఫైబర్ (కాండంలో ఉండే నార), మొక్కజొన్న పిండి, వేప రసాన్ని వంటి వాటిని ఉపయోగించి న్యాప్కిన్లు తయారు చేశారు. వీటివల్ల మహిళలకు ఎలాంటి ఇబ్బందులు రావు. లీక్ ప్రూఫ్తో పాటు పర్యావరణానికి కూడా అనుకూలమైనవి. ఈ న్యాప్కిన్లు అందుబాటు ధరలో లభించే అవకాశాలు న్నాయని విద్యారి్థనులు అక్షయ, హన్సి క, మానసలు పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణకు రెండో బహుమతి లభించింది. అగ్ని ప్రమాదాలపై ‘డ్రయిడ్’ అలర్ట్ అగ్ని ప్రమాదాలపై అలర్ట్ చేయడంతో పాటు, ప్రమా దం జరిగినప్పుడు ప్రాణ, ఆస్తినష్టం లేకుండా నివారించే ‘కెలామెటీ కంట్రోల్ డ్రయిడ్ ’ను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (రామంతపూర్) విద్యార్థులు ఆవిష్కరించారు. ఏఐ టెక్నాలజీ సాయంతో పనిచేసే ఈ డ్రయిడ్ అగ్నిప్రమాదం జరిగితే వెంటనే గుర్తించి., మొబైల్ టెక్నాలజీతో ఫైర్ స్టేషన్కు సమాచారాన్ని పంపుతుంది. మంటలు విస్తరించకుండా నీటితో ఆర్పివేస్తుంది. సెన్సార్ల సాయంతో అగ్నిప్రమాదంలో ఎవరైనా మనుషులు చిక్కుకున్న విషయాన్ని కూడా పసిగట్టి ఫైర్ స్టేషన్కు సమాచారం పంపుతుంది. ఈ ఆవిష్కరణకు తృతీయ బహుమతి వచ్చింది. విద్యార్థులు సూరజ్ గుప్తా, రిషిక్, కార్తికేయలు ఈ డ్రయిడ్ను ఆవిష్కరించారు. ఆటోలైట్ మెకానిజం ఎట్ కల్వర్ట్.. కల్వర్టుల వద్ద తరచు రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొనడం గానీ, పక్కనే ఉన్న కల్వర్టును ఢీ కొనడం వంటి ఘటనలు మనం చూస్తుంటాం. ఇలాంటి కల్వర్టుల వద్ద ప్రమాదాల నివారణకు కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన ఎక్స్లెంట్ స్టార్ హైసూ్కల్ విద్యార్థి రయాన్ ‘ఆటోలైట్ మెకానిజం ఎట్ కల్వర్ట్’అనే నూతన పరిజ్ఞానాన్ని ఆవిష్కరించారు. కల్వర్టుల వద్ద ఆర్.ఎఫ్ ట్రాన్స్మీటర్, వాహనంలో ఆర్.ఎఫ్.రిసీవర్లను అమర్చ డం ద్వారా వాహనం లైట్ ఆటోమెటిక్గా లోయర్ డిప్పర్లోకి మారుతుంది. దీంతో ఎదు రుగా వస్తున్న వాహనం స్పష్టంగా కనిపించి రోడ్డు ప్రమాదం తప్పుతుంది. దీనికి కన్సొలేషన్ బహుమతి వచ్చింది. ఉమెన్స్ ఫ్రెండ్లీ యుటెన్సిల్ సపోర్టర్.. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి వడ్డించే బాధ్యతను మహిళా సంఘాలే చూస్తున్నాయి. ఎక్కువ బరువున్న వంట పాత్రలను పొయ్యి పైనుంచి దించడం, అన్నం వార్చడం వంటి పనులు చేయలేక మహిళలు ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో భారీ వంట పాత్రలోని అన్నాన్ని సులభంగా వార్చడానికి ఉపయోగపడే ఉమెన్స్ ఫ్రెండ్లీ యుటెన్సిల్ సపోర్టు పరికరానికి రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపకల్పన చేశారు. దీన్ని ఎక్కడికైనా తరలించేందుకు వీలుంది. వినీల, నందు, శ్రీచైత్ర, సుప్రియ రూపొందించిన ఈ పరికరానికి కూడా కన్సొలేషన్ బహుమతి లభించింది. -
నానో సోలార్ కార్! రూ.30కే 100 కిలోమీటర్లు..
పశ్చిమ బెంగాల్లోని బంకురా నగరంలో నివాసం ఉండే మనోజిత్ మోండల్ అనే వ్యాపారవేత్త టాటా నానో కారుతో స్థానికంగా సెలబ్రిటీగా మారిపోయారు. తన టాటా నానో కారును సోలార్ కారుగా మార్చి వీధుల్లో రయ్మంటూ దూసుకెళ్తున్నారు. ఇదీ చదవండి: కొత్త పన్ను విధానం ఏప్రిల్ 1 నుంచి... వీరికి ఒక్క రూపాయి కూడా పన్ను లేదు! మోండల్ కారు నడపడానికి పెట్రోల్, డీజిల్, సీఎన్జీ అవసరం లేదు. ఇది పూర్తిగా సౌర శక్తితో నడుస్తుంది. అయితే ఈ కారుకు అయ్యే ఇందన ఖర్చు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం రూ. 30 నుంచి రూ. 35 లతో 100 కిలోమీటర్లు నడుస్తుంది. అంటే కిలోమీటరుకు 80 పైసలు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా తక్కువ ఖర్చుతో నడిచేలా మోండల్ రూపొందించిన నానో సోలార్ కార్ ఇప్పుడు అక్కడ సూపర్ పాపులర్ అయింది. ఇంజిన్ లేదు.. సౌండ్ లేదు.. ఈ సోలార్ కారులో గేర్ సిస్టమ్ ఉంది. కానీ ఇంజిన్ లేదు. ఇది నడుపుతున్నప్పుడు అసలు శబ్దం రాదు. నాల్గవ గేర్లో ఇది గంటకు 80 కిలోమీటర్లు వెళ్తుంది. మోండల్ చేసిన తయారు ఈ సోలార్ కార్ సౌరశక్తిలో ఆవిష్కరణల దిశగా దిశానిర్దేశం చేయడమే కాకుండా పెరుగుతున్న ఇంధన ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆశాకిరణంగా నిలుస్తోంది. ఈ కారును రూపొందించేటప్పుడు మోండల్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. కానీ పట్టు వదల్లేదు. కొత్తగా ఏదైనా చేయాలనే అతని చిన్ననాటి కలను ఈ కారు ద్వారా నిజం చేసుకున్నారు. ఇదీ చదవండి: ఈ పథకంతో సీనియర్ సిటిజన్స్కు రూ.20 వేల వరకు రాబడి!
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్లో కావ్య మారన్! వీడియో వైరల్
పుష్ప-2 మరో అప్డేట్ వచ్చేసింది.. అదేంటంటే?
రామేశ్వరం కేఫ్ పేలుడు.. పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు
ఓ వైపు టెన్షన్.. మరోవైపు ఉత్సాహం: స్టేడియంలో తళుక్కుమన్న షారుఖ్ (ఫొటోలు)
అప్పుడు 'నీ తండ్రి స్థాయి తెలుసా అన్నారు': దీపిందర్ గోయల్
HYD: ఏసీపీ నివాసంలో సోదాలు.. బయటపడుతున్న నోట్ల కట్టలు
శ్యామలపై తప్పుడు కథనాలు.. చట్టపరంగానే ముందుకెళ్తానన్న యాంకర్!
స్టార్క్ సూపర్ డెలివరీ.. హెడ్కు ఫ్యూజ్లు ఔట్
భారీగా పెరిగిన ఫ్లిప్కార్ట్ గ్రోసరీ బిజినెస్
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement