-
అది ఫేక్ న్యూస్.. రూమర్స్పై మహేశ్-రాజమౌళి మూవీ నిర్మాత క్లారిటీ
'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' దర్శకుడు రాజమౌళి.. నెక్స్ట్ మూవీ మహేశ్ బాబుతో తీయనున్నాడు. ఇప్పటికే దీని గురించి అందరికీ తెలుసు. కాకపోతే ఎప్పుడు మొదలవుతుందనేది ఇంకా సస్పెన్స్. మరోవైపు ఈ మూవీ మొదలవడానికి ముందే బోలెడన్ని రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాటిలో ఒక దానిపై నిర్మాతలే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏంటది?(ఇదీ చదవండి: వారంలోపే ఓటీటీలోకి వచ్చేసిన 'కృష్ణమ్మ' సినిమా)మహేశ్తో మూవీ ఉంటుందని చాన్నాళ్ల క్రితమే రాజమౌళి బయటపెట్టాడు. ప్రస్తుతం ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే నడుస్తోంది. కానీ హీరోయిన్లు, ఇతర నటీనటుల గురించి బోలెడన్ని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇండోనేసియా నటిని హీరోయిన్ గా తీసుకున్నారని, ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కూడా నటించబోతుందని అన్నారు. అలానే నాగార్జున కీలక పాత్ర చేయబోతున్నాడని కూడా టాక్ వినిపించింది.అయితే పైన వచ్చిన రూమర్స్ వేటికి స్పందించని నిర్మాణ సంస్థ.. వీరేన్ స్వామి అనే క్యాస్టింగ్ డైరెక్టర్ తమతో కలిసి పనిచేయట్లేదని క్లారిటీ ఇచ్చింది. అసలు ఈ రూమర్స్ ఎప్పుడొచ్చాయా అని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మిగతా విషయాల కంటే పర్టిక్యూలర్గా ఈ విషయం కోసం ఎందుకు నోట్ రిలీజ్ చేసిందనేది మాత్రం అర్థం కాలేదు. చేస్తే చేశారు గానీ అలానే మూవీ ఎప్పుడు మొదలవుతుందో అనే అప్డేట్ ఇస్తే కాస్త ఫ్యాన్స్ అయిన ఖుషీ అయ్యేవారు!(ఇదీ చదవండి: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్) -
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
దర్శకధీరుడు రాజమౌళి మరోసారి బాహుబలిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈసారి బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ అంటూ యానిమేషన్ సిరీస్ను పరిచయం చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ యానిమేషన్ సిరీస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు రాజమౌళి. ఈఈసందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. 'బాహుబలిని ముందుకుతీసుకెళ్లే బాధ్యతను మరొకరికి అప్పగించడం కఠినమైన నిర్ణయం. ఆ సినిమా తీసేటప్పుడే అనేక మార్గాల్లో బాహుబలిని ఆవిష్కరించాలనుకున్నాం. సరైన సమయంలో సరైన వ్యక్తులు, టీమ్ మాకు లభించింది. యానిమేషన్ సిరీస్పై వాళ్లు పంచుకున్న ఆలోచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది కేవలం పిల్లలనే కాదు.. అందరినీ అలరించేలా తీయొచ్చని తెలిపారు. ఈ ఫార్మాట్లో సిరీస్ చేయాలనుకున్నప్పుడు మరోసారి ‘బాహుబలి సినిమాను సమీక్షించాం. పాత్రలు, వాటి మధ్య సంఘర్షణ ఇలా అనేక అంశాలు పరిశీలించాం. ఆ పాత్రలపై నాకున్న ప్రేమను వాళ్లు అర్థం చేసుకున్నారు. కథతో పాటు పాత్రలు చాలా చక్కగా క్రియేట్ చేశారు. అది చూసి నాకు సంతోషంగా కలిగింది.' అని అన్నారు.థియేటర్లో బాహుబలి చిత్రాన్ని చూసింది కేవలం 10 కోట్ల మంది మాత్రమేనని రాజమౌళి అన్నారు. అంటే మిగిలిన కోట్ల జనాభా ఏదో ఒక మాధ్యమం ద్వారా చూసి ఉంటారని తెలిపారు. కథలు చూసే విధానం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది.. అందరూ రెగ్యులర్ సినిమాలు మాత్రమే చూడరు. కేవలం యానిమేషన్ చిత్రాలు మాత్రమే చూసేవాళ్లు కూడా ఉంటారు. ఆ ఆలోచనతోనే బాహుబలి ఈ మాధ్యమం ద్వారా తీసుకొస్తున్నాం. సినిమా తీయాలంటే చాలా విషయాలు ఆలోచించాలి. డైలాగ్స్, ఫైట్స్, పాటలు ఇలా ఆలోచలన్నీ దాని చుట్టూనే ఉంటాయి. కానీ, యానిమేషన్లో అది వర్కవుట్ కాదు. సీజన్లు చూసే కొద్దీ మీరు యానిమేషన్ సిరీస్కు కనెక్ట్ అవుతారన అన్నారు.యానిమేషన్ సినిమా చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? అని ఈ సమావేశంలో రాజమౌళిని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. యానిమేషన్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో తనకు ఆలోచన ఉందని.. ఎప్పుడో ఒకసారి జరుగుతుందన్నారు. నేను సినిమాలు చేస్తూ నేర్చుకుంటూనే ఉంటానని.. దీని వల్ల రానున్న సినిమాల్లో కొత్త విషయాలు చేసేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. ఈగ సినిమాలో కొంత భాగం యానిమేషన్ ఉందని వెల్లడించారు. భవిష్యత్లో చేసే అవకాశం వచ్చినప్పుడు ఈ సిరీస్ ద్వారా నేర్చుకున్న అంశాలు నాకు కచ్చితంగా ఉపయోగపడతాయన్నారు. కాగా.. రాజమౌళి తన తదుపరి చిత్రం ప్రిన్స్ మహేశ్బాబుతో తెరకెక్కించనున్నారు. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేషన్ సిరీస్ డిస్నీప్లస్ మే 17న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది -
RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
పాన్ ఇండియా స్టార్స్ ఎన్టీఆర్, రామ్చరణ్ పోటీపడి నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ కల్పిత కథతో రూపుదిద్దుకున్న 'ఆర్ఆర్ఆర్' 2022 మార్చి 25న విడుదలైంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్గా తారక్ నటించి మెప్పించారు. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. రూ. 550 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్.. ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.తెలుగు, హిందీలో రీ-రిలీజ్ తారక్- చరణ్ ఫ్యాన్స్కు పండుగలాంటి సినిమా ఆర్ఆర్ఆర్. సినిమా విడుదల సమయంలో థియేటర్లు అన్నీ నిండిపోయాయి. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ విజయకేతనం ఎగరేసి, రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. సినిమా వచ్చి రెండేళ్లు దాటింది. అయినా కూడా ఈ సినిమాపై క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు. మే 10న మరోసారి ఆర్ఆర్ఆర్ విడుదల కానుందని అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే, 2డీ, 3డీ ఫార్మాట్లతో పాటు 4K వర్షన్తో స్పెషల్గా వస్తుండటంతో అభిమానులు కాస్త ఆసక్తిగా ఉన్నారు. దీంతో ప్రేక్షకులు మరోసారి థియేటర్కు వచ్చి ఆ అనుభవాన్ని పంచుకోనున్నారు.ఆర్ఆర్ఆర్ ఖాతాలో లెక్కలేనన్ని ఆవార్డులు వచ్చి చేరాయి. అన్నింటికంటే ముఖ్యమైనది ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును కూడా ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకుంది. ఇందులోని 'నాటునాటు' పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కింది. ఈ అవార్డు దక్కించుకున్న తొలి భారతీయ ఫీచర్ సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డ్ క్రియేట్ చేసింది. RRR RE RELEASE on 10th May 🔥💥 @AlwaysRamCharan #RRRMoviepic.twitter.com/8eaIfLjw14— Navya (@HoneYNavya_) May 6, 2024 -
ఇచ్చిన మాట కోసం హాలీవుడ్ ఆఫర్ వదులుకున్న రాజమౌళి!
బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఆయనతో సినిమా అంటే హాలీవుడ్ హీరోలు కూడా రెడీ అంటారు. కానీ జక్కన్న మాత్రం తెలుగు హీరోలతో పాన్ ఇండియా సినిమా చేసి హిట్ కొడుతున్నాడు. అంతేకాదు తన సినిమాలను నిర్మించే అవకాశం టాలీవుడ్ ప్రొడ్యుసర్లకే ఇస్తున్నాడు. కెరీర్ తొలినాళ్లలో తనతో సినిమా చేయాలని ఒప్పందం కుదుర్చుకున్న నిర్మాతలకే అవకాశం ఇస్తున్నాడు. తాజాగా మహేశ్ బాబుతో చేయబోయే సినిమా విషయంలో కూడా రాజమౌళి ఇచ్చిన మాటకే కట్టుబడి ఉన్నాడు. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నిర్మాణ బాధ్యలతను ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణకు అప్పగించాడు. 15 ఏళ్ల క్రితం తనకు ఇచ్చిన మాటను రాజమౌళి- మహేశ్ బాబు నిలబెట్టుకున్నారని నారాయణ అన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్లో సినిమా చేయాలని 15 ఏళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నాం. అప్పుడే నా బ్యానర్(దుర్గా ఆర్ట్స్)లో సినిమా చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఇప్పుడు మహేశ్, రాజమౌళి ఇద్దరి స్థాయి పెరిగిపోయింది. వీళ్లతో సినిమా చేయడానికి చాలా మంది నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి నాతో సినిమా చేస్తున్నారు. నేను చెప్పకపోయినా.. ‘దుర్గా ఆర్ట్స్ బ్యానర్’లో సినిమా చేస్తున్నామని వాళ్లే ప్రకటించారు. అందుకు వాళ్లకి కృతజ్ఞుడిని. రాజమౌళికి హాలీవుడ్ ఆఫర్లు కూడా వచ్చాయి. వాటిని రిజెక్ట్ చేసి మరీ నాతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. రెండు నెలల నుంచి ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో షూటింగ్ప్రారంభం అవుతుంది. బడ్జెట్ఎంత అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. కానీ సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను’ అన్నారు. -
నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో అరుణాచల క్రియేషన్స్పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం మే 10న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించింది. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతుండగా.. పరిశ్రమలో మీకున్న ముఖ్య స్నేహితులు ఎవరనీ యాంకర్ ప్రశ్నించగా.. ఆ సమయంలో తారక్ పేరు చెబుతాడని ప్రేక్షకులు భావించి అందరూ ఎన్టీఆర్ అంటూ కేకలు వేశారు. కానీ, రాజమౌళి మాత్రం అందుకు విభిన్నంగా ఇలా సమాధానం చెప్పాడు. 'టాలీవుడ్లో నాకు ఇద్దరు అత్యంత ముఖ్యమైన స్నేహితులు ఉన్నారు. ప్రముఖ నిర్మాతలు శోభు యార్లగడ్డ, సాయి కొర్రపాటి. వారితో బాహుబలి, ఈగ వంటి చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం. స్నేహితుడు కాదు. తారక్తో నా మొదటి సినిమా 'స్టూడెంట్ నెం.1' ఛాన్స్ రావడానికి కారణం రచయిత పృథ్వీతేజ. అని ఆయన గుర్తుచేసుకున్నారు. స్టూడెంట్ నెం.1 తర్వాత తారక్- జక్కన్న కాంబినేషన్లో సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ చిత్రాలు వచ్చాయి. అన్నీ కూడా సూపర్ హిట్ సాధించాయి.‘కృష్ణమ్మ’ సినిమా గురించి రాజమౌళి మాట్లాడుతూ.. సినిమా టైటిల్ నాతో పాటు అందర్నీ ఆకర్షించిందంటే కారణం కొరటాల శివగారు సమర్పించడమే. ఆయన సమర్పిస్తున్న తొలి సినిమాతోనే పెద్ద విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూస్తే సినిమాని కచ్చితంగా థియేటర్లోనే చూడాలనిపించేలా తీశాడు గోపాలకృష్ణ. కాలభైరవని చూస్తుంటే గర్వంగా ఉంది. ‘కృష్ణమ్మ’ టీమ్కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ఈ చిత్రం మే 10న విడుదల కానుంది. -
ఆయన్ను ముసుగేసి కొడితే రూ.10 వేలిస్తా: రాజమౌళి
టాలీవుడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కృష్ణమ్మ. అతీరా రాజ్ హీరోయిన్గా నటించిన ఈ మూవీకి వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. మే 10న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్కు కొరటాల శివ, అనిల్ రావిపూడి, రాజమౌళి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా విచ్చేశారు.ముసుగేసి గుద్దితే..ఈ కార్యక్రమంలో జక్కన్న మాట్లాడుతూ చిత్ర యూనిట్ను మెచ్చుకున్నాడు. టైటిల్, టీజర్, ట్రైలర్ అన్నీ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించాడు. సత్యదేవ్కు స్టార్డమ్ తెచ్చే సినిమా కృష్ణమ్మ అవ్వాలని కోరాడు. చివర్లో అనిల్ రావిపూడి వెనకాల కెమెరా పట్టుకుని తిరుగుతూ అతడి మీద ముసుగేసి గుద్దితే వారికి రూ.10 వేలు ఇస్తానని బంపరాఫర్ ఇచ్చాడు.రాజమౌళిని ఇరికించేసిన డైరెక్టర్అనిల్ రావిపూడి మీద ఈ రేంజులో ఫైరవడానికి కారణం లేకపోలేదు. అతడు స్టేజీపైకి వచ్చీరావడంతోనే దేవర అప్డేట్ చెప్పాలని కొరటాల శివను, మహేశ్బాబుతో చేస్తున్న మూవీ జానర్ ఏంటి? కథేంటి? అని రాజమౌళిని ఇరికించేశాడు. అందుకే జక్కన్న ఇలా తనదైన స్టైల్లో నాలుగు కొట్టమని కౌంటర్ వేశాడు. ఇది విని షాకైన అనిల్ రావిపూడి.. పది వేలంటే నిజంగానే కొట్టేస్తారు.. దయచేసి ప్రైజ్మనీ తగ్గించండి అని కోరాడు. వీరిద్దరి స్పీచ్లు ప్రస్తుతం వైరల్గా మారాయి.చదవండి: రోజుకు 12 గంటలు పని చేయించుకున్నారు.. డబ్బులివ్వకుండా వేధిస్తున్నారు! -
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కృష్ణమ్మతో సత్యదేవ్ స్టార్ అవుతాడు: రాజమౌళి
‘‘చిన్న చిన్న హావభావాలతో అన్ని రకాల నటనని చూపించగల నటుల్లో సత్యదేవ్ కూడా ఒకడు. తను మంచి నటుడు అని ఇటు ఇండస్ట్రీకి అటు ప్రేక్షకులకు తెలుసు. కానీ, ఒక్క సినిమా సడెన్గా స్టార్ని చేస్తుంది.. నాకు తెలిసి ‘కృష్ణమ్మ’ మూవీ తనని స్టార్ చేస్తుందనుకుంటున్నాను’’ అని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకుడు. డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టై¯Œ మెంట్స్ విడుదల చేస్తున్నాయి. హైదరాబాద్లో నిర్వహించిన ‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి మాట్లాడుతూ– ‘‘కృష్ణమ్మ’ టైటిల్ నాతో పాటు అందర్నీ ఆకర్షించిందంటే కారణం కొరటాల శివగారు సమర్పించడమే. ఆయన సమర్పిస్తున్న తొలి సినిమాతోనే పెద్ద విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూస్తే సినిమాని కచ్చితంగా థియేటర్లోనే చూడాలనిపించేలా తీశాడు గోపాలకృష్ణ. కాలభైరవని చూస్తుంటే గర్వంగా ఉంది. ‘కృష్ణమ్మ’ టీమ్కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ– ‘‘గోపాల్ చెప్పిన ‘కృష్ణమ్మ’ కథ నచ్చడంతో నేను కూడా భాగస్వామ్యం అవుతానని అడిగాను.. అంతే కానీ, ఈ కథలో నేను కల్పించుకోలేదు. నేను చూసిన మంచి నటుల్లో సత్యదేవ్ ఒకడు.. మంచి ప్రతిభ ఉంది. ఈ మూవీతో తన కెరీర్ మరో మెట్టు పైకి ఎక్కుతుందని నమ్ముతున్నాను. అలాగే నిర్మాత కృష్ణగారికి పెద్ద విజయం రావాలి’’ అన్నారు. ‘‘కొరటాల శివగారు తీసే సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. ఆయన సమర్పిస్తున్న ‘కృష్ణమ్మ’ కూడా అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు గోపీచంద్ మలినేని.‘‘సత్యదేవ్ హీరోగా బిజీగా ఉన్నా ‘సరిలేరు నీకెవ్వరు’లో ఓ చిన్న పాత్ర చేశాడు.. ఎందుకంటే సినిమా అంటే అంత గౌరవం. ఈ వేసవిలో ‘కృష్ణమ్మ’ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అనిల్ రావిపూడి. సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘రాజమౌళి, కొరటాల శివ, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడిగార్లు ఉన్న ఈ వేదికపై నేను మాట్లాడటం ప్రపంచంలోనే ఖరీదైన వేదికగా భావిస్తున్నాను. ‘కృష్ణమ్మ’ విడుదల తర్వాత నేను బయట ఎక్కడ కనిపించినా ప్రేక్షకులు ఈ మూవీ గురించే నాతో మాట్లాడతారు.. అందుకు నాదీ గ్యారంటీ. క్రికెట్కి సచిన్ టెండూల్కర్గారు ఎలాగో.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రాజమౌళి సార్ అలాగే. తెలుగు సినిమాని (ఆర్ఆర్ఆర్) అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి.. ఆస్కార్ తీసుకొచ్చారు’’ అన్నారు. వీవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘కృష్ణమ్మ’ కథ నచ్చడంతో మమ్మల్ని ్ర΄ోత్సహించిన కొరటాలశివగారికి థ్యాంక్స్. మా ట్రైలర్ నచ్చిన వారు మూవీని థియేటర్లో చూడండి’’అన్నారు. -
త్వరలోనే బాహుబలి ట్రైలర్.. రాజమౌళి పోస్ట్ వైరల్!
తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డును సాధించారు. అంతకుముందే బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించారు. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన బాహుబలి తెలుగు సినిమా కీర్తిని మరింత పెంచింది. రెండు భాగాలుగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.అయితే తాజాగా రాజమౌళి చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతోంది. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో యానిమేటేడ్ సిరీస్ వస్తోందంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో బాహుబలిని చిత్రాన్ని యానిమేటేడ్ వర్షన్లో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.కాగా.. బాహుబలి చిత్రాన్ని వివిధ రూపాల్లో తీసుకువచ్చే అవకాశం లేకపోలేదని రాజమౌళి గతంలో చాలాసార్లు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబు హీరోగా యాక్షన్ అడ్వెంచర్ సినిమాని తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.When the people of Mahishmati chant his name, no force in the universe can stop him from returning.Baahubali: Crown of Blood, an animated series trailer, arrives soon! pic.twitter.com/fDJ5FZy6ld— rajamouli ss (@ssrajamouli) April 30, 2024 -
రాజమౌళి దర్శకత్వంలో వార్నర్...నవ్వులు పూయిస్తున్న వీడియో
-
రాజమౌళి దర్శకత్వంలో వార్నర్.. నవ్వులు పూయిస్తున్న వీడియో
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కి యాక్టింగ్ అంటే పిచ్చి. లాక్డౌన్ సమయంలో ఎన్నో టిక్టాక్ వీడియోలు చేసి అలరించాడు. అల్లు అర్జున్, ప్రభాస్, మహేశ్బాబుతో పాటు పలువురు టాలీవుడ్ హీరోల పాటలకు స్టైప్పులేస్తూ దక్షిణాది సీనీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బాహుబలిలో ప్రభాస్, మహర్షిలో మహేశ్బాబు, దర్బార్లో రజినీకాంత్కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను రీఫేస్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. అవి వైరల్ అయ్యేవి. తాజాగా ఈ స్టార్ క్రికెటర్ ఓ యాడ్లో నటించాడు. ఆ ప్రకటనలో దర్శకధీరుడు రాజమౌళి నటించడం మరో విశేషం. నవ్వులు పూయిస్తున్న యాడ్ ప్రముఖ పేమెంట్స్ యాప్ క్రెడ్ (CRED) ఓ ఫన్నీ యాడ్ రూపొందించింది. ఇందులో రాజమౌళి దర్శకుడిగా, వార్నర్ హీరోగా నటించారు. ‘మ్యాచ్ టికెట్లపై డిస్కౌంట్ కావాలంటే ఏం చేయాలి’ అంటూ రాజమౌళి వార్నర్కి ఫోన్చేసి అడుగుతాడు. దానికి వార్నర్ బదులిస్తూ.. ‘రాజా సర్.. మీ దగ్గర క్రెడ్ యూపీఐ ఉంటే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది' అంటాడు. మరి నార్మల్ యూపీఐ అయితే అని రాజమౌళి అడుగుతాడు. అలా అయితే డిస్కౌంట్ కోసం నాకు మీరో ఫేవర్ చేయాలని వార్నర్ కోరతాడు. తనతో ఓ సినిమా చేయమని అడుగుతాడు. ఒకవేళ తన సినిమాల్లో నిజంగానే వార్నర్ నటిస్తే ఎలా ఉండేదో రాజమౌళి ఊహించుకుంటాడు. సెట్స్లో వార్నర్ చేసే అల్లరి, వేసే స్టెప్పలు, డైగాల్స్ ..ఇవన్నీ ఊహించుకొని భయపడిపోయినట్లు యాడ్లో చూపించారు. మధ్యలో ‘ఆస్కార్ వేదికగా కలుద్దాం’ అని వార్నర్ అన్నప్పుడు రాజమౌళి చూసే చూపు నవ్వులు పూయిస్తుంది. కొన్ని సార్లు ఫేవర్ కూడా మార్కెట్ రిస్క్కి లోబడి ఉంటాయంటూ క్రెడ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ వీడియోని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో అటు సినీ ప్రియులతో పాటు ఇటు క్రికెట్ అభిమానులను అలరిస్తోంది. Favours are subject to market risk. pic.twitter.com/QSPToEGYzg — CRED (@CRED_club) April 12, 2024 -
స్టెప్పులతో అదరగొట్టిన రాజమౌళి.. వీడియో వైరల్!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఇటీవలే జపాన్లో సందడి చేసి తిరిగొచ్చారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ను ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రస్తుతం మహేశ్బాబుతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ రాజమౌళి తనలోని మరో టాలెంట్ను బయటకు తీస్తుంటారు. ఫ్యామిలీతో కలిసి ఎక్కడికెళ్లినా ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే ఇటీవలే ఓ పెళ్లిలో సతీమణి రమతో కలిసి డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన రిహార్సల్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. 'అందమైన ప్రేమరాణి చేయి తలిగితే' అనే పాటకు అంటూ స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు దర్శకధీరుడు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. SS Rajamouli Dance 👌 pic.twitter.com/hkdfxPWq1Q — Christopher Kanagaraj (@Chrissuccess) April 11, 2024 -
జక్కన్నలో ఈ యాంగిల్ కూడా ఉందా? వీడియో వైరల్
ఫ్లాపులే తెలియని వీరుడు.. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసే ధీరుడు.. తెలుగు సినిమాను ప్రపంచస్థాయిలో నిలబెట్టిన పరాక్రమవంతుడు.. ఎస్ఎస్ రాజమౌళి. ఈయన సినిమా లేటుగా తీస్తాడుమో కానీ అందరూ ఆశ్చర్యపోయే రీతిలో తెరకెక్కిస్తాడు. అందుకే జక్కన్న ప్రపంచవ్యాప్తంగా పాపులర్. ప్రస్తుతం ఇతడు మహేశ్బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు.అందమైన ప్రేమరాణి..ఇదిలా ఉంటే తాజాగా ఓ ఫంక్షన్లో జక్కన్న తన భార్య రమా రాజమౌళితో కలిసి స్టెప్పులేశాడు. అందమైన ప్రేమరాణి చేయి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే అన్న పాటకు చిందేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు.. జక్కన్నలో ఈ టాలెంట్ కూడా ఉందా? అని కామెంట్లు చేస్తున్నారు.సినిమా విషయానికి వస్తేమహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా(#SSMB29) తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఈ సినిమా కథను రచయిత విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేశారు. ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ కూడా పూర్తి కావొచ్చాయట. వేసవి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. Director @SSRajamouli and his wife groove to the beats of Beautiful melody, setting the party on fire at a family function💥💥💥👌👌👌#SsRajamouli #SSMB29 #Party #RRR #TeluguFilmNagar #Tollywood #Bollywood #Hollywood #TFI pic.twitter.com/UynuQCDCOx— YDR (@dharmaraju225g1) April 1, 2024 చదవండి: వచ్చి ఇక్కడ పడుండు అని అరిచారు.. అన్నం కూడా తినబుద్ధి కాలే! -
జక్కన్నలో ఈ యాంగిల్ కూడా ఉందా? వీడియో వైరల్
ఫ్లాపులే తెలియని వీరుడు.. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసే ధీరుడు.. తెలుగు సినిమాను ప్రపంచస్థాయిలో నిలబెట్టిన పరాక్రమవంతుడు.. ఎస్ఎస్ రాజమౌళి. ఈయన సినిమా లేటుగా తీస్తాడుమో కానీ అందరూ ఆశ్చర్యపోయే రీతిలో తెరకెక్కిస్తాడు. అందుకే జక్కన్న ప్రపంచవ్యాప్తంగా పాపులర్. ప్రస్తుతం ఇతడు మహేశ్బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. అందమైన ప్రేమరాణి.. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఫంక్షన్లో జక్కన్న తన భార్య రమా రాజమౌళితో కలిసి స్టెప్పులేశాడు. అందమైన ప్రేమరాణి చేయి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే అన్న పాటకు చిందేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు.. జక్కన్నలో ఈ టాలెంట్ కూడా ఉందా? అని కామెంట్లు చేస్తున్నారు. సినిమా విషయానికి వస్తే మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా(#SSMB29) తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఈ సినిమా కథను రచయిత విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేశారు. ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ కూడా పూర్తి కావొచ్చాయట. వేసవి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. Director @SSRajamouli and his wife groove to the beats of Beautiful melody, setting the party on fire at a family function💥💥💥👌👌👌#SsRajamouli #SSMB29 #Party #RRR #TeluguFilmNagar #Tollywood #Bollywood #Hollywood #TFI pic.twitter.com/UynuQCDCOx — YDR (@dharmaraju225g1) April 1, 2024 చదవండి: వచ్చి ఇక్కడ పడుండు అని అరిచారు.. అన్నం కూడా తినబుద్ధి కాలే! -
మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది: రాజమౌళి
దర్శకధీరుడు ప్రస్తుతం జపాన్లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్లోనూ రిలీజ్ చేశారు. గతేడాది ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న ఈ చిత్రాన్ని జపాన్లో 100 ఏళ్లనాటి పురాతన మ్యూజికల్ థియేటర్లో ప్రదర్శించారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విటర్ ద్వారా పంచుకున్నారు. రాజమౌళి ట్విటర్లో రాస్తూ.. 'ఆర్ఆర్ఆర్ సినిమాను 110 ఏళ్ల నాటి తకరాజుకా సంస్థ నిర్వహించే మ్యూజికల్ థియేటర్లో ప్రదర్శించడం విశేషం. ఆర్ఆర్ఆర్ చిత్రంలాగే ఈ మ్యూజికల్ షోపై కూడా ప్రేమ చూపిన జపనీస్ ఆడియన్స్కు ధన్యవాదాలు. మీ రెస్పాన్స్ చూస్తే మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ షోలో మీ శక్తి, ప్రతిభ నన్ను ఆశ్చర్యపరిచాయి. ఈ ఈవెంట్లో భాగమైన అమ్మాయిలను అభినందించకుండా ఉండలేకపోతున్నా' అని రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ దర్శకధీరుడి అభినందిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం రాజమౌళి.. మహేశ్బాబుతో సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కథను అందించారు. యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాకు మహారాజ్ అనే టైటిల్ పెట్టాలనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ హీరోయిన్గా.. హాలీవుడ్ ప్రముఖ నటుడు క్రిస్ హెమ్స్వర్త్ కీలకపాత్ర పోషించనున్నారని కూడా టాక్ నడుస్తోంది. Its an honour that our RRR has been adapted as a musical by the 110 year old Takarazuka company. Thank you Japanese audience for embracing the Broadway play of RRR just like the film itself. Overwhelmed by your response... Can't appreciate all the girls enough for your energy,… pic.twitter.com/QbfLPmsJxC — rajamouli ss (@ssrajamouli) March 22, 2024 -
మహేష్కు సరైన విలన్ను సెలెక్ట్ చేసిన రాజమౌళి
-
రాజమౌళి తనయుడి ట్వీట్.. నెటిజన్స్ ఆగ్రహం!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కుటుంబం ప్రస్తుతం జపాన్లో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన సూపర్ హిట్ సినిమా 'ఆర్ఆర్ఆర్' స్క్రీనింగ్ కోసం వారు అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. కానీ అక్కడ స్వల్ప భూకంపం వచ్చిందని ఆయన కుమారుడు కార్తికేయ తన ఎక్స్ ఖాతాలో ఫోస్ట్ చేశాడు. జపాన్లో ఒక భారీ బిల్డింగ్ 28వ ఫ్లోర్లో ఉన్నామని ఎందుకో బిల్డింగ్ కదులుతున్నటుగా అనిపించిందని కార్తికేయ రాసుకొచ్చాడు. కానీ కొంత సమయం తర్వాత అది భూకంపం వల్ల అలా జరిగినట్లు తెలిసి చాలా భయపడ్డానని ఆయన తెలిపాడు. మొదటిసారిగా భూకంపం ద్వారా కలిగే అనుభూతిని పొందానని రాసుకొచ్చారు. మండిపడ్డ నెటిజన్స్.. అయితే ఇది చూసిన నెటిజన్స్ ఎస్ఎస్ కార్తికేయ తీరుపై మండిపడుతున్నారు. భూకంపం అంటే అదేమైనా జోక్ అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. మరో నెటిజన్ రాస్తూ భూకంపం అనేది నీ బకెట్ లిస్ట్లో ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సెన్సిటివ్ విషయాన్ని ఫన్నీగా ట్వీట్ చేయడంపై కార్తికేయపై మండిపడుతున్నారు. అలాగే ఇండియా బోర్డర్కు వెళ్లి బాంబుల మోత కూడా ఆస్వాదించు అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. ఏదేమైనా కార్తికేయ భూకంపంపై చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలోను ఊపేస్తోంది. Felt a freaking earthquake in Japan just now!!! Was on the 28th floor and slowly the ground started to move and took us a while to realise it was an earthquake. I was just about to panic but all the Japanese around did not budge as if it just started to rain!! 😅😅😅😅😅… pic.twitter.com/7rXhrWSx3D — S S Karthikeya (@ssk1122) March 21, 2024 Experiencing an Earthquake is in your bucket list ? Weird — RAVI SANKAR GARIMELLA (@ravis_g239) March 21, 2024 Experience an earthquake box ticked. ✅ --> WTF 😒 😒 — KK (@krishjlk) March 21, 2024 Pls go to Indian border and EXPERIENCE A BOMB BLAST also ... Tick it bro — KK (@krishjlk) March 21, 2024 -
జపాన్లో భూకంపం.. రాజమౌళి కుటుంబానికి తప్పిన ప్రమాదం
ఇండియన్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి కుటుంబం మొత్తం జపాన్లో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన సూపర్ హిట్ సినిమా 'ఆర్ఆర్ఆర్' స్క్రీనింగ్ కోసం వారు అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. కానీ అక్కడ స్వల్ప భూకంపం వచ్చిందని ఆయన కుమారుడు కార్తికేయ తన ఎక్స్ పేజీలో తెలిపాడు. ఈ మేరకు రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ పెట్టిన లేటెస్ట్ పోస్ట్ ఒకటి అభిమానులను షాక్కు గురి చేసింది. జపాన్లో ఒక భారీ బిల్డింగ్ 28వ ఫ్లోర్లో ఉన్నామని ఎందుకో బిల్డింగ్ కదులుతున్నటుగా అనిపించిందని ఆయన చెప్పాడు. కానీ కొంత సమయం తర్వాత అది భూకంపం వల్ల అలా జరిగినట్లు తెలిసి చాలా భయపడ్డానని ఆయన తెలిపాడు. మొదటిసారిగా భూకంపం ద్వారా కలిగే అనుభూతిని చెందానని ఆయన పేర్కొన్నాడు. భూకంపం సమయంలో తన స్మార్ట్ వాచ్లో వచ్చిన వార్నింగ్ని ఫోటో తీసి ఆయన షేర్ చేశాడు. దీనితో నెటిజన్స్ రాజమౌళి అండ్ ఫ్యామిలీ సేఫ్ గా ఉండాలని కోరుకుంటూ ఇండియాకి తిరిగి రావాలని కార్తికేయ పోస్ట్లో తెలియజేస్తున్నారు. దీని తీవ్రత 5.3గా నమోదయిందని అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. తూర్పు జపాన్లోని దక్షిణ ఇబారకి ప్రిఫెక్చర్లో 46 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. కానీ ప్రాణనష్టం గురించి ఎలాంటి వివరాలను జపాన్ ప్రకటించ లేదు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా నూతన సంవత్సరాది వేళ అందరూ సంబరాల్లో మునిగి ఉన్న సమయంలో జపాన్ను భారీ భూకంపం కుదిపివేసింది. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంతో జపాన్ పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలు వణికిపోయాయి. సుమారు 60 మంది మృతి చెందారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ఆ సమయంలో రాజమౌళి కూడా రియాక్ట్ అయ్యారు. తమ హృదయాల్లో జపాన్కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పిన ఆయన భూకంపం బారిన పడిన ప్రతి ఒక్కరికీ సానుభూతి ప్రకటించారు. Felt a freaking earthquake in Japan just now!!! Was on the 28th floor and slowly the ground started to move and took us a while to realise it was an earthquake. I was just about to panic but all the Japanese around did not budge as if it just started to rain!! 😅😅😅😅😅… pic.twitter.com/7rXhrWSx3D — S S Karthikeya (@ssk1122) March 21, 2024 -
రైటింగ్ పూర్తి చేశాం
మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా (‘ఎస్ఎస్ఎమ్బీ 29’ వర్కింగ్ టైటిల్) తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ ఈ సినిమా నిర్మాత. కాగా ‘రౌద్రం.. రణం.. రుధిరం’(ఆర్ఆర్ఆర్) స్క్రీనింగ్లో భాగంగా రాజమౌళి జపాన్ వెళ్లారు. అక్కడ మహేశ్బాబుతో తాను చేయనున్న మూవీ గురించి మాట్లాడారు రాజమౌళి. ‘‘ఎస్ఎస్ఎమ్బీ 29’ మూవీకి సంబంధించిన రైటింగ్ పూర్తి చేశాం. ప్రీ విజువలైజేషన్ చేస్తూ, ప్రీ ప్రోడక్షన్ ప్రాసెస్లో ఉన్నాం. నటీనటుల పరంగా ఇప్పట వరకు మహేశ్బాబు ఒక్కరే ఖరారయ్యారు. మీలో (జపాన్ ప్రేక్షకులను ఉద్దేశిస్తూ..) చాలా మందికి మహేశ్ తెలుసు.. హ్యాండ్సమ్గా ఉంటాడు. త్వరగా ఈ సినిమాను పూర్తి చేస్తామనే అనుకుంటున్నాం. ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ విడుదల సమయంలో మహేశ్బాబును నేను ఇక్కడికి (జపాన్) తీసుకుని వస్తాను. మరింత మందికి పరిచయం చేస్తాను’’ అన్నారు రాజమౌళి. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వేసవి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం 2022 మార్చి 25న విడుదలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 21 అక్టోబరు 2022న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను జపాన్లో విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. -
'రాజమౌళి ఆర్ఆర్ఆర్.. ఆమె చనిపోవాల్సింది.. కానీ'!
రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన పీరియాడిక్ చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2022లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అంతే కాకుండా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. తాజాగా జపాన్లో ఈ మూవీని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్కు జోడీగా బ్రిటిష్ యువతి జెన్నీ పాత్రలో ఓలివియా మోరిస్ నటించింది. ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్లో మరిన్నీ సీన్స్ ఉన్నాయని రాజమౌళి తెలిపారు. కానీ సినిమా నిడివి పెరగడంతో ఎడిటింగ్లో తీసేయాల్సి వచ్చిందని వెల్లడించారు. రాజమౌళి మాట్లాడుతూ..'ఎన్టీఆర్(భీమ్)ను జైలులో పెట్టిన తర్వాత జెన్నీ (ఓలివియా మోరిస్) అతడిని కలుస్తుంది. జైలు నుంచి తప్పించడానికి భీమ్కు సాయం చేయాలనుకుంటుంది. ఆమె అంకుల్ గవర్నర్ స్కాట్ గదిలోకి రహస్యంగా వెళ్లి.. అక్కడ ఉన్న ప్లాన్స్ను దొంగిలించి భీమ్కు అందజేస్తుంది. అక్కడి నుంచి వస్తుండగానే.. స్కాట్ భార్య ఆమెను చూస్తుంది. జెన్నీ బూట్లకు మట్టి ఉండటంతో అనుమానం వచ్చి.. విషయాన్ని స్కాట్కు చెబుతుంది. ఆ తర్వాత భీమ్ తప్పించుకుంటాడు.' అని తెలిపారు. ఆ తర్వాత రామ్ను జైల్లో పెడతాడు స్కాట్. ఈ విషయం తెలుసుకున్న భీమ్ తిరిగి వచ్చి రామ్ను కాపాడి జైలు నుంచి బయటకు తెస్తాడు. వాళ్లిద్దరూ బ్రిటిష్ సైన్యాన్ని చంపుకుంటూ పోయే క్రమంలో జెన్నీని పావుగా వాడుకుని వాళ్లను పట్టుకోవాలని స్కాట్ ప్లాన్. లొంగిపోకపోతే.. జెన్నీని చంపేస్తానని వాళ్లను స్కాట్ బెదిరిస్తాడు. దీంతో వారు లొంగిపోయే క్రమంలోనే జెన్నీ మోసం చేసిందన్న కోపంతో ఆమెను స్కాట్ చంపేస్తాడు. ఆర్ఆర్ఆర్ ఒరిజినల్ వర్షన్లో జెన్నీ చనిపోతుంది. కానీ ఈ విషాదంతో కూడిన కథను తీయాలని నాకు అనిపించలేదు. దీంతో మొత్తం మార్చేశాం. జెన్నీ బతికిపోయింది. మీరు హ్యాపీగా సినిమా చూశారంటూ' పేర్కొన్నారు. ప్రస్తుతం రాజమౌళి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీని ప్రకారం భీమ్, జెన్నీలకు అదనంగా ట్రాక్స్ రాసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా నిడివి మూడు గంటలు దాటిపోవడంతో ఆ సీన్స్ తొలగించారు. కాగా. రాజమౌళి తన నెక్ట్స్ మూవీ ప్రిన్స్ మహేశ్ బాబుతో తెరకెక్కించనున్నారు. -
మహేశ్ బాబును ఇక్కడికి తీసుకొస్తాను: రాజమౌళి
మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో రానున్న బిగ్ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కనుంది. తాజాగా ఇదే విషయాన్ని జక్కన్న తెలిపారు. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జపాన్లో ఉన్న రాజమౌళి SSMB29 సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా ఆస్కార్ అవార్డుతో RRR గుర్తింపు తెచ్చుకుంది. తెలుగువారికి ఎంతో గర్వకారణంగా ఈ చిత్రం నిలిచింది. తాజాగా జపాన్లో ఈ మూవీ స్క్రీనింగ్కు రాజమౌళి హజరయ్యారు. అక్కడ మన జక్కన్న క్రేజ్ మామూలగా లేదు. ఆయనపై ఎనలేని అభిమానాన్ని అక్కడి ప్రజలు చూపించారు. ఈ క్రమంలో తన తర్వాతి ప్రాజెక్ట్ అయిన SSMB29 గురించి ఆయన మాట్లాడారు. 'మహేశ్ బాబుతో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. SSMB29 ప్రాజెక్ట్కు సంబంధించి కేవలం హీరోను మాత్రమే లాక్ చేశాం. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో హీరో మహేశ్ బాబు.. ఆయన తెలుగు వారు.. చాలా అందంగా ఉంటారు. బహుషా మీలో చాలామందికి ఆయన గురించి తెలిసే ఉంటుంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి జపాన్లో కూడా రిలీజ్ చేస్తాం.. ఆ సమయంలో మహేశ్ బాబుని కూడా ఇక్కడికి తీసుకొని వస్తాను.' అని జపాన్లో జక్కన్న వ్యాఖ్యానించారు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఆయన మాటలను సోషల్ మీడియా ద్వారా తెగ షేర్ చేస్తున్నారు. SSR about #SSMB29 We've finished writing and are now in pre-production. Only the, protagonist SuperStar @urstrulyMahesh , is confirmed and he's incredibly handsome. Hoping to expedite the filming process and have him join us for promotion during the release #MBSSR pic.twitter.com/JZAx3oP6cu — Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) March 19, 2024 -
ఆ దేశంలో రాజమౌళి క్రేజే వేరు.. ఏకంగా 83 ఏళ్ల వృద్ధురాలు!
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంది. నాటునాటు అనే సాంగ్కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. అంతే కాకుండా ఈ సినిమాను విదేశాల్లోనూ రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఇండియన్ సినిమాలకు ఆదరణ ఉన్న దేశాల్లో జపాన్ ఒకటి. జపాన్ అభిమానుల కోసం ఆర్ఆర్ఆర్ సినిమాను ఏకంగా జపనీస్లోనూ రిలీజ్ చేశారు. అక్కడ రాజమౌళి సినిమాకు పెద్దఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇటీవల జపాన్ వెళ్లిన రాజమౌళికి ఓ మహిళ అభిమాని అరుదైన కానుక అందజేశారు. దాదాపు 83 ఏళ్ల వద్ధురాలు దర్శకధీరుడు రాజమౌళికి బహుమతులను అందజేసింది. ఈ విషయాన్ని రాజమౌళి తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. రాజమౌళి ట్విటర్లో రాస్తూ..'జపాన్లో ఓరిగామి క్రేన్లను తయారు చేస్తారు. వారికిష్టమైన వారి ఆరోగ్యం కోసం బహుమతిగా ఇస్తారు. ఈ 83 ఏళ్ల వృద్ధురాలు మమ్మల్ని ఆశీర్వదించడానికి అలాంటివీ 1000 తయారు చేసింది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమా ఆమెను సంతోషపెట్టింది. ఆమె ఇప్పుడే బహుమతి పంపింది. చలిలో బయట వేచి ఉంది. కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ తిరిగి ఇవ్వలేం. అది గ్రేట్ అంతే.' అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. రాజమౌళి తన తదుపరి చిత్రం మహేశ్ బాబుతో చేయనున్నారు. In Japan, they make origami cranes &gift them to their loved ones for good luck& health. This 83yr old woman made 1000 of them to bless us because RRR made her happy. She just sent the gift and was waiting outside in the cold.🥹 Some gestures can never be repaid. Just grateful🙏🏽 pic.twitter.com/UTGks2djDw — rajamouli ss (@ssrajamouli) March 18, 2024 -
రాజమౌళి-మహేశ్ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్
మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మిస్తారు. ఈ సినిమా కథను ఆల్రెడీ రచయిత విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేశారు. ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కావొచ్చాయట. కాగా ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ ఉగాదికి జరుగుతుందనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెట్ వర్క్ హైదరాబాద్ శివార్లలోని ప్రాంతాల్లో మొదలైందని, మే కల్లా ఈ భారీ సెట్ వర్క్ పూర్తయ్యేలా టీమ్ టార్గెట్గా పెట్టుకున్నారని ఫిల్మ్నగర్ భోగట్టా. జూన్ చివర్లో లేదా జూలై మొదటివారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యేలా రాజమౌళి అండ్ కో సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించనున్నారు. -
మహేశ్ బాబు సినిమా కోసం రాజమౌళి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో రానున్న బిగ్ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కనుంది. ఈ సినిమా గురించి ఇప్పటికే పలు వార్తలు సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉన్నాయి. SSMB29 పేరుతో ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలా ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. SSMB29 ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ నటీనటులు కూడా భాగస్వామ్యం కానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు కావాల్సినంత హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాలో నటిస్తున్న వారికి రెమ్యునరేషన్ ఎంత ఇస్తున్నారు. వంటి అంశాల గురించి సోషల్మీడియాలో తెగ చర్చలు చేస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం డైరెక్టర్ రాజమౌళి తీసుకునే రెమ్యునరేషన్ గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం రాజమౌళి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. ఈ ప్రాజెక్ట్కు బదులుగా సినిమాలో వాటా తీసుకోబోతున్నారని ప్రచారం నడుస్తోంది. రాజమౌళి సినిమా కలెక్షన్స్ అంటే వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టడం ఖాయం. ఈ లెక్కన సినిమాలో నటించే వారికంటే కూడా ఆయనకే ఎక్కువ రెమ్యునరేషన్ అందే ఛాన్స్ ఉంది. మహేశ్ బాబు కూడా సినిమా కోసం భారీ మొత్తంలో అందుకుంటున్నట్లు టాక్.. రెమ్యునరేషన్తో పాటు సినిమాకు వచ్చే లాభాల్లో ఆయన కొంత వాటా తీసుకునే ఛాన్స్ ఉంది అని తెలుస్తోంది. -
రాజమౌళి సలహా.. పద్ధతి మార్చుకున్నా: స్టార్ హీరోయిన్
హీరోయిన్ అలియా భట్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పలు హిందీ మూవీస్ చేసిన ఈమె.. 'ఆర్ఆర్ఆర్'లోనూ ఓ పాత్ర చేసి ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ చేస్తున్న టైంలోనే అలియా-రాజమౌళికి గొడవైందని ఏవేవో అన్నారు. అయితే వాటిలో నిజానిజాలు పక్కనబెడితే.. తనకు రాజమౌళి ఇచ్చిన సలహాని ఇప్పటికీ పాటిస్తున్నానని అలియా చెప్పుకొచ్చింది. అలా తన పద్ధతి పూర్తిగా మారిపోయిందని పేర్కొంది. (ఇదీ చదవండి: బాధతో ఆ విషయం ఒప్పుకొంటున్నా: డైరెక్టర్ రాజమౌళి) 'సినిమాలని ఎంచుకునే విషయంలో మొదటి నుంచి ఒత్తిడికి గురవుతూ ఉండేదాన్ని. అదే విషయం రాజమౌళికి చెప్పాను. 'ఏది చేసినా సరే ప్రేమతో చేయండి. అప్పుడు సినిమా ఫలితం ఎలా ఉన్నా సరే ప్రేక్షకులు మీ యాక్టింగ్ని మెచ్చుకుంటారు. మీకు కనెక్ట్ అవుతారు. ఈ ప్రపంచంలోనే ప్రేమతో చేసే పనికి మించిన గొప్పది ఏదీ లేదు' అని ఆయన చెప్పారు. అప్పటి నుంచి నేను అదే పాటిస్తున్నాను' 'ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నా దగ్గరకు వచ్చిన ప్రతి కథకు ఓకే చెప్పేసేదాన్ని. నిజం చెప్పాలంటే నాకు సహనం తక్కువ. ఇప్పుడు ఆ పద్ధతి మారింది. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ఎంత కష్టమైనా పాత్రనైనా సరే ఓకే చెప్పాలని డిసైడ్ అయ్యాను' అని అలియా భట్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె హిందీలో 'జిగ్రా' అనే సినిమా చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు 27న ఇది థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: మహేశ్ -రాజమౌళి సినిమా కథేంటో చెప్పేసిన విజయేంద్ర ప్రసాద్)
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్
మనం అరెస్టు చేయడమే కానీ మనల్ని అరెస్టు చేయడం ఉంటుందనుకోలే!!
చిన్నమ్మ స్వార్ధానికి మునిగిపోతున్న బీజేపీ..
ఏఐతో మరింత అందంగా: రిలయన్స్
Raisin Water : ఎండు ద్రాక్ష నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
బుద్ధ పూర్ణిమ వేళ.. భక్తుల గంగా స్నానాలు
‘నాగి..నిన్ను కొట్టాలి.. ‘బుజ్జి’ గ్లింప్స్పై ప్రభాస్ రియాక్షన్
ఏడు చోట్ల EVM ధ్వంసలు జరిగాయి..కృష్ణం రాజు రియాక్షన్
ఆ ఒక్క వీడియోనే లీకైందా?.. ఈసీకి సూటి ప్రశ్నలు సంధించిన సజ్జల
మాలీవుడ్లో 1000 కోట్ల క్లబ్ సినిమాలు
తప్పక చదవండి
- పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్
- ‘నాగి..నిన్ను కొట్టాలి.. ‘బుజ్జి’ గ్లింప్స్పై ప్రభాస్ రియాక్షన్
- న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ మూసివేత? రైళ్ల మళ్లింపునకు సన్నాహాలు?
- YS Raja Reddy: ప్రజల గుండెలలో పెద్దాయన
- ‘ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టు రద్దు చేయండి’
- నిందితుని కోసం ఆసుపత్రిలోకి దూసుకొచ్చిన పోలీస్ వ్యాన్
- జీహెచ్ఎంసీలో కామ పిశాచి!
- ఈ భారత సంతతి సీఈవో వేతనం రూ.1,260 కోట్లు!
- కాంగ్రెస్ హత్యారాజకీయాలకు భయపడేది లేదు: హరీష్ రావు ఫైర్
- అంబానీల అతిథులకు కరీంనగర్ కానుకలు
Advertisement